-
సమస్యాత్మక ప్రదేశాల్లో 800 సీసీ కెమెరాలు
నరసరావుపేట: పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సమస్యాత్మక ప్రదేశాలలో 800 సీసీ కెమెరాలు ఏర్పాటుచేసినట్లు జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ మే 13వ తేదీన ఎన్నికల సందర్భంగా పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని రకాల సెక్యూరిటీ ఏర్పాట్లు చేసిందన్నారు. కొన్ని జిల్లాలను సమస్యాత్మకంగా గుర్తించి ఆ జిల్లాల్లో ఉన్న కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ స్టేషన్లను 100 శాతం వెబ్ కాస్టింగ్తో కవర్ చేయాలని ఆదేశాలు ఇచ్చిందన్నారు. దానిలో భాగంగా పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు, గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాలలో ఉన్న పోలింగ్స్టేషన్ల అన్నింటిలోనూ లోపల, బయట వెబ్ కాస్టింగ్ సౌకర్యం కల్పించామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా రికార్డు అవుతాయని, అలాగే మరో కెమెరా బయట నుంచి వెబ్ కాస్టింగ్ వైపు ఫేస్ చేసి ఉంటుందన్నారు. దీనికి అదనంగా ఇంకొక లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఉండేలాగా పోలీసుల తరఫు నుంచి ఈ సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలలో 800 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఈ సీసీ కెమెరాలకు సంబంధించి లైవ్ మానిటరింగ్ తమ కంట్రోల్ రూమ్లో ఉంటుందన్నారు. ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా అక్కడ దగ్గరలో ఉన్న క్విక్ రెస్పాన్న్స్ టీం, రాపిడ్ రెస్పాన్న్స్ టీంలను సత్వరం అక్కడికి తరలించి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ప్లాన్ చేశామన్నారు. ఈ సీసీ కెమెరాలు ఎలక్షన్ కమిషనర్ వారు సమకూర్చిన వెబ్ కాస్టింగ్కి అదనంగా ఉండి ఏరకమైన సంఘటనలు జరగకుండా ఉండేందుకు తోడ్పడతాయని ఆశిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. నాలుగు నియోజకవర్గాలు గుర్తింపు వెబ్కాస్టింగ్కు తోడుగా సీసీ కెమెరాలు అనుసంధానం జిల్లా ఎస్పీ బిందుమాధవ్ -
మాచర్లలో మహిళల కన్నెర్ర
మాచర్ల: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాదేవిపై దాడిని నిరసిస్తూ శిరిగిరిపాడు నుంచి మాచర్ల వరకు మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. దాడిని ఖండిస్తూ నినాదాలు చేశారు. పీఆర్కే విజయాన్ని కాంక్షిస్తూ ఆయన భార్య రమాదేవి బుధవారం శిరిగిరిపాడులో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఆమెకు మద్దతుగా మహిళలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. ఇది చూసి ఓర్వలేక టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుర్రి పున్నారెడ్డి, ఆయన కుమారుడు కుర్రి శివారెడ్డి వారి అనుచరులు వారిపై రాళ్లతో దాడి చేశారు. వాహనాలను ధ్వంసం చేశారు. దాడి సమాచారం తెలిసిన వెంటనే నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ఐదు వేల మంది మహిళలు బుధవారం రాత్రి ఏడు గంటలకు మాచర్ల శ్రీశైలం రోడ్డులోని వీరాంజనేయస్వామి దేవాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. కొజ్జా బ్రహ్మారెడ్డి డౌన్ డౌన్, మీ అంతు చూడకపోతే మేము మహిళలమే కాదంటూ నినాదాలు చేశారు. పీఆర్కే కుటుంబానికి మేము అండగా ఉన్నాం, నువ్విక్కడ పీకేదేం లేదు, రౌడీయిజంతో గెలవలేవంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. దాదాపు రెండు కిలోమీటర్లు ర్యాలీ కొనసాగింది. జై పీఆర్కే, జై రమాదేవి, జై జగన్, జై పీవీఆర్ అంటూ నినాదాలు చేశారు. అక్కడ నుంచి రాజశేఖర్రెడ్డి విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. మాచర్లలో పీఆర్కే సతీమణి రమాదేవి విలేకరులతో మాట్లాడుతూ నా జీవితంలో ఎప్పుడూ ఆడవాళ్లపై దాడి చేసిన చరిత్ర చూడలేదన్నారు. ఓట్ల కోసం ఇంత దిగజారుతారా? మీకు మా మహిళల శక్తేంటో తెలియదు, చూడండి మహిళలు ఏం చేస్తారో.. నువ్వేదో నా మీద దాడి చేయిస్తే గొప్పతనంగా భావిస్తున్నట్లుందని అన్నారు. అందరి కుటుంబాలకు ఆడవాళ్లు ఉంటారనేది గుర్తుంచుకోవాలని అన్నారు. ఎవ్వరికీ జరగని అవమానం నీకు జరుగుతుంది... ఇది మా ఆడవాళ్లు రాసే చరిత్ర.. మళ్లీ నువ్వు నియోజకవర్గంలో మహిళా శక్తి బలానికి కనబడవు. ఇది జరగబోయే సత్యం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తరలివచ్చిన ప్రతి మహిళ ఆమెను పలకరించి సానుభూతి వ్యక్తం చేసి పరామర్శించారు. పీఆర్కే సతీమణి రమాదేవిపై దాడికి నిరసనగా ర్యాలీ తరలివచ్చిన వేలాది మంది మహిళలు టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు మహిళల శక్తి చూపుతామంటూ హెచ్చరిక -
ఓటమి భయంతోనే టీడీపీ దాడులు
సత్తెనపల్లి: ఓటమి భయంతోనే టీడీపీ బరితెగింపునకు దిగుతోందని, వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని దాడులతో భయానకం చేసి మార్చాలని చూస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో బుధవారం టీడీపీ నేతలు బరితెగించి దాడులకు తెగపడటంతో గాయపడి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సీపీ నేత కానాల పుల్లారెడ్డి, మరో ఇరువురిని ఆయన పరామర్శించారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాడులను ప్రోత్సహిస్తుందన్నారు. ఏవిధంగానైనా అధికారంలోకి రావాలనే కుట్రతోనే టీడీపీ నేతలు దౌర్జన్యాలకు, దుర్మార్గాలకు తెగబడుతున్నారన్నారు. దాడులకు భయపడేది లేదన్నారు. ఐదేళ్లలో నియోజవర్గంలో తాను ఏనాడూ ఇలాంటి రాజకీయ ఘర్షణలను ప్రోత్సహించలేదన్నారు. ఏ వర్గంపైన కక్ష సాధించలేదన్నారు. విజ్ఞత గల ప్రజలు ఆలోచించాలన్నారు. రానున్నది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని, మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారన్నారు. దాడులను ప్రోత్సహించిన వారిని ఉపేక్షించేది లేదన్నారు. వైఎస్సార్ సీపీలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. ధైర్యంగా ప్రతిపక్ష పార్టీల కుట్రలను తిప్పి కొట్టాలని సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్ని కలు జరగాలని, ఆ మేరకు యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. సత్తెనపల్లి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న కానాల పుల్లారెడ్డి, షేక్ దమ్మాలపాటి బాజీ, సుభానిలను ఆయన పరామర్శించారు. ఆయనతోపాటు నియోజకవర్గ పరిశీలకులు పడాల శివారెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ చిట్టా విజయభాస్కరరెడ్డి, ముప్పాళ్ల మండల పార్టీ అధ్యక్షుడు నక్కా శ్రీనివాసరావు, మండల నాయకులు ఎంజేఆర్.లింగారెడ్డి, మాదల సైదా, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు. మాదలలో వైఎస్సార్ సీపీ నేతలపై దాడి దారుణం టీడీపీ దౌర్జన్యాలు, దుర్మార్గాలను సహించం దాడులకు భయపడేది లేదు ధైర్యంగా పోరాడండి.. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి ఏరియా వైద్యశాలలో క్షతగాత్రుల పరామర్శ -
ఓటమి బాటలో యరపతినేని
సాక్షి, నరసరావుపేట: గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతలతోపాటు కూటమి పక్షాలు రగలిపోతున్నాయి. సొంత పార్టీ వారినే నమ్మకపోతే ఎవరి కోసం పనిచేయాలని నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. దీంతో యరపతినేనికి ఓటమి తప్పదనే భావన సొంత కేడర్లో నెలకొంది. కేడర్లో పెరుగుతున్న అసంతృప్తి యరపతినేని వ్యవహరశైలిపై సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి పెరిగింది. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని పనిచేసిన వారిని పక్కన పెట్టి, భజనపరులకు పెత్తనం అప్పగించడంపై తమ్ముళ్లు రగిలిపోతున్నారు. ఇటీవల పిడుగురాళ్లలో జరిగిన పార్టీ సమావేశంలో యరపతినేని తీరును వారు ప్రశ్నించినట్లు సమాచారం. ఎన్నిసార్లు ఓడినా యరపతినేని ప్రవర్తనలో మార్పు రాలేదనే ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. గత ఎన్నికల్లో యరపతినేని గెలుపు కోసం పనిచేసిన నాయకులను దాదాపుగా దూరం పెట్టారు. జంగాను దూరంపెడుతున్న యరపతినేని వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తి, ఆయన అనుచరులకు తగిన ప్రాధాన్యం ఇవ్వటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. జంగా చేరికతో వైఎస్సార్ సీపీ నుంచి భారీగా చేరికలు ఉంటాయని యరపతినేని భావించారు. కానీ జంగాతోపాటుగా వేళ్ల మీద లెక్కించే నేతలు మాత్రమే టీడీపీలోకి వెళ్లగా కేడర్ అంతా వైఎస్సార్ సీపీలోనే ఉంది. దీనికి తోడు జంగాకి నరసరావుపేట టికెట్ ఇప్పించేందుకు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులు ప్రయత్నిస్తే యరపతినేని అడ్డుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. జంగా ఎమ్మెల్యే అయితే నియోజకవర్గంలో తనకే పోటీ తప్పదని యరపతినేని భావించి టికెట్ రాకుండా అధిష్టానం వద్ద పావులు కదిపారని వారు భావిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయులు, జంగా వర్గాలు యరపతినేనితో అంటీముట్టనట్లు ఉంటున్నాయి. ఒకప్పుడు బద్ధ శత్రువులైన యరపతినేని, జంగా ఒక వేదికపై ఉన్నా ముభావంగానే ఉంటున్నారు. ఇటీవల గామాలపాడులో జరిగిన పలు కార్యక్రమాలకు జంగాని ఆహ్వానించకుండా యరపతినేని వర్గం నిర్వహించినట్లు సమాచారం. దీంతో తమను తీవ్రంగా అవమానిస్తున్నారనే భావనలో జంగా వర్గం ఉంది. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలంగా ఉండటంతో యరపతినేని ఓటమి దాదాపుగా ఖాయమైందని ప్రజలు భావిస్తున్నారు. సొంత పార్టీ వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపాటు మూడుసార్లు ఓడినా యరపతినేనిలో మార్పు రాలేదంటున్న కేడర్ యరపతినేనిపై జనసేన, బీజేపీ నేతల అసంతృప్తి మా వర్గానికి ప్రాధాన్యతేది అంటున్న జంగా వర్గీయులుసహకరించని కూటమి నేతలు యరపతినేనికి సొంత పార్టీ కేడర్తోపాటు జనసేన, బీజేపీ నేతల తీరు తలనొప్పిగా మారింది. టీడీపీ నాయకులకు అగ్రతాంబూలం ఇస్తూ...జనసేన, బీజేపీ కేడర్ను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గత ఐదేళ్లలో ఎటువంటి వివక్ష లేకుండా అన్ని పథకాలు ఇంటి వద్దకే అందించిన జగనన్న ప్రభుత్వం పట్ల వారిలో కొంత సానుభూతి కనిపిస్తోంది. టీడీపీ ప్రభుత్వం వస్తే యరపతినేని, ఆయన వర్గంలో ఒకరిద్దరికే మంచి జరుగుతుందని, అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మళ్లీ వస్తే మనందరికి మంచి జరుగుతుందని వారు భావిస్తున్నారు. -
సజావుగా పోస్టల్ బ్యాలెట్ రీ పోలింగ్
నాదెండ్ల: గణపవరం శ్రీ కెల్లంపల్లి భద్రాచలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రీ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. ఈ నెల 5వ తేదీన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో 1219 మంది పీవో, ఏపీవో, ఓపీవోలు ఓటు వేశారు. అధికారుల తప్పిదం కారణంగా బుధవారం రీ పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. 1219కి గాను 947 ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గ పరిధిలో 2816 ఓట్లు కాగా, ఇందులో 450 ఓట్లు ఇతర జిల్లాలకు చెందినవి ఉన్నాయి. 2366 ఓటర్లలో 159 ఓట్లు హోం ఓటింగ్ చేయాల్సి ఉంది. మిగిలిన 2207 ఓట్లకు గాను 5,6,7 తేదిల్లో 2151 ఓట్లు వినియోగించుకున్నారు. మిగిలిన 57, రీ పోలైన 1219 ఓట్లు మొత్తం 1276 ఓట్లకుగాను బుధవారం 947 పోలయ్యాయి. మిగిలిన 329 ఓట్లు గురువారం వేయనున్నారు. హోం ఓటింగ్ వినియోగించుకున్న 59 మంది ఓటర్లు నియోజకవర్గపరిధిలో 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు 159 మంది బీఎల్వోల ద్వారా హోం ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్నారు. యడ్లపాడు మండలంలో 36 మంది దరఖాస్తు చేసుకోగా, తొలిరోజు 14 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాదెండ్ల మండలంలో 27 మందికి గాను 10 మంది, చిలకలూరిపేట రూరల్ మండలంలో 56 మందికిగాను 18 మంది, పట్టణ పరిధిలో 40 మందికి గాను 13 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగిలిన 54 మంది గురువారం వినియోగించుకోవాల్సి ఉంది. ఫారం12 ద్వారా 103 మంది ఓటింగ్లో.... 103 మంది ఫారం–12 అందించి సత్వరమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటి వరకూ ఎన్నికల సంఘానికి ఫారం దరఖాస్తు చేసుకుంటేనే ఓటు వచ్చేది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్నా ఓటు హక్కు కల్పించాలని ఆదేశాలు జారీ చేయటంతో 63 మంది ఓటు హక్కు పొంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇదికాక మరో 23 మంది ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం మొత్తంగా 1073 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియను చిలకలూరిపేట రిటర్నింగ్ అధికారి నారదముని, ఏఈఆర్వోలు సీహెచ్ గోవిందరావు, జ్వాలా నరసింహం, అష్రిఫున్నిసా పర్యవేక్షించారు. -
వడ్డెర సంక్షేమం జగనన్నతోనే సాధ్యం
చిలకలూరిపేట: వడ్డెర్ల సంక్షేమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కావటి శివనాగ మనోహర్ నాయుడు చెప్పారు. బుధవారం పట్టణంలోని బ్యాంకు కాలనీలో వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు దేవెళ్ల వెంకట్ ఆధ్వర్యంలో వడ్డెర ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో బీసీలకు సామాజిక, రాజకీయ, ఆర్ధిక, సంక్షేమ రంగాల్లో వారి జనాభా ప్రాతిపదికన 50శాతం ప్రాధాన్యత కల్పించిన ఏకై క ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అని చెప్పారు. దేశచరిత్రలోనే కాకుండా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు ప్రోత్సహించి గొప్ప సామాజిక విప్లవాన్ని తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదే అన్నారు. బీసీలంటే బ్యాక్బోన్ క్లాసెస్ అని ఆయా వర్గాల వారిని గౌరవిస్తూ బీసీలకు మంచి చేయడంలో వైఎస్సార్సీపీ అధినేతకు యావత్ భారతదేశంలో మంచి గుర్తింపు తెచ్చారన్నారు. మూడు పార్టీల కూటమి అపవిత్రమైనదని విమర్శించారు. జయహో బీసీ నినాదం చేస్తూ కల్లబొల్లి మాటలతో బీసీలను మోసం చేయడం తప్ప, బీసీలకు చేసిందేమిటో కూటమి నేతలు చెప్పాలన్నారు. పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ బీసీ అభ్యర్థికి ఎంపీగా పి అనిల్కుమార్ యాదవ్కు టిక్కెట్ ఇస్తే, బీసీ ఎంపీ అభ్యర్థిగా బీసీ పక్షపాతినని చెప్పుకునే చంద్రబాబు తమ పార్టీ అభ్యర్ధిగా ధనిక వర్గానికి కేటాయించిన విషయం సంబంధిత వర్గీయులు గుర్తించాలన్నారు. వైఎస్ ఆశయాలను, ఆలోచనలను వారసత్వంగా తీసుకున్న నాయకుడు సీఎం జగన్ అన్నారు. బీసీల్లోని 136 కులాలకు ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, రాజ్యసభ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే నుంచి వార్డు వరకు అన్ని రాజ కీయ విభాగాల్లోనూ 50శాతం భాగస్వామ్యం కల్పించారన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు దేవెళ్ల వెంకట్ మాట్లాడుతూ బీసీలకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీని వడ్డెర వర్గీయులు ఆదరించాలని కోరారు. ఎంపీ అభ్యర్ధిగా డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ను, ఎమ్మెల్యే అభ్యర్ధిగా కావటి మనోహర్ నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సంఘ నాయకులు తన్నీరు సాంబయ్య, గుంజి శ్రీనివాసరావు, తన్నీరు కోటేశ్వరరావు, తన్నీరు శివయ్య, జట్టిపాటి సురేష్, బాలసుబ్రమణ్యం, కోటేశ్వరమ్మ, వెంకటేశ్వరరావు, పల్లపు మరియరాజు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కావటి మనోహర్ నాయుడు వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం -
మరోసారి వైఎస్సార్సీపీ విజయం తథ్యం
వినుకొండ(నూజెండ్ల): నూజెండ్ల మండలం ము క్కెళ్లపాడు, అల్లీబాయిపాలెం, భూమాయపాలెం, కొత్తజడ్డవారిపాలెం గ్రా మాల్లో గ్రామాల్లో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎ న్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా హారతులు ఇచ్చి వందల సంఖ్యలో మహి ళలు, అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎమ్మెల్యే బొల్లాకు జేజేలు పలుకుతూ డ్యాన్స్లు వేస్తూ ఉత్సాహంగా గ్రామవీధుల్లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఎమ్మెల్యే బొల్లా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీకి విశేష జనాదరణ లభిస్తుందన్నారు. 2014 నుంచి 19 వరకు వినుకొండ శాసనసభ్యుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భూకబ్జాలు, రేషన్ మాఫియా, మద్యం మాఫియా, నాసిరకం రోడ్లు వేసి వందల కోట్లు ప్రజాధనం కొల్లగొట్టారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహాయ సహకారాలతో వినుకొండ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేశామో ప్రజలు గమనించాలన్నారు. నాడు–నేడు నిధుల కింద పాఠశాలల అభివృద్ధి, గ్రామసచివాలయాల నిర్మాణంతో పాటు వందల కోట్ల సంక్షేమం పథకాల రూపంలో ప్రజలకు మేలు చేకూర్చినట్లు చెప్పారు. వినుకొండలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం, హార్టీ కల్చర్, అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటు, కూరగాయల మార్కెట్ నిర్మాణం, కొండపైన ఘాట్రోడ్డు నిర్మాణం, స్టేడియం వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మండలాన్ని తనదైన శైలిలో అభివృద్ధి చేస్తామన్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న జీవీ ఆంజనేయులు అభివృద్ధి పనులను అడ్డుకోవడం తప్ప ప్రజలకు చేసింది శూన్యమన్నారు. వినుకొండలో మరోసారి వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నరసరావుపేట ఎంపీగా అనిల్కుమార్యాదవ్ను, ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలని కోరారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నూజెండ్ల మండలంలో ఎన్నికల ప్రచారానికి బ్రహ్మరథం -
ఈ యుద్ధంలో పేద వర్గాలు గెలవాలి
నరసరావుపేట: రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలు పేదలకు, సంపన్న వర్గానికి మధ్య జరిగే యుద్ధమని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా వైఎస్సార్సీపీవైపు ఉండాల్సిన అవసరం ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. బుధవారం ప్రకాష్నగర్లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ఈ యుద్దంలో పేదవర్గాలు గెలవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయా వర్గాలకు సంక్షేమంతో పాటు అభివృద్ది ఫలాలను అందించారన్నారు. పేదవర్గాలకు అధికారం, సంపద, బడ్జెట్లో జనాభాకు మించి కేటాయించారన్నారు. బీసీలకు ప్రత్యేకంగా రాజ్యాంగబద్దమైన హక్కులు లేకున్నా జనాభాకు మించి ప్రాతినిధ్యం కల్పించారన్నారు. చంద్రబాబు తన ఐదేళ్లకాలంలో ఒక్క రాజ్యసభ పదవి ఇవ్వలేదన్నారు. సంపన్న వర్గాలు, మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధుల వద్ద డబ్బులు తీసుకుని ఇచ్చారన్నారు. సీఎం జగన్ తొమ్మిదింటిలో నాలుగు బీసీలు, ఒక ఎస్సీకి ఇచ్చి దేశానికి సవాల్ విసిరారన్నారు. బడ్జెట్లో ఏ రాష్ట్రం కూడా బీసీలకు ఐదారువేలకోట్లు ఇవ్వలేదన్నారు. అదే ఆంధ్రప్రదేశ్లో రూ.38వేలకోట్లు బీసీలకు కేటాయించి రికార్డు సృష్టించాడన్నారు. ఒకప్పుడు సంపన్నవర్గాలు చదివే ఆంగ్ల మీడియాని ప్రభుత్వ బడుల్లో ఏర్పాటుచేసి పేదవర్గాల పిల్లలు చదువుకునే వెసులుబాటు కల్పించారన్నారు. బీసీల ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పధకాలు అమలుచేయలేదన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీచేస్తున్న డాక్టర్ గోపిరెడ్డి చిత్తశుద్దిగల నాయకుడని, పేదవర్గాల అభివృద్దికోసం పనిచేస్తున్నాడన్నారు. మరోసారి ఆయనను గెలిపించి హ్యాట్రిక్ సాధించేందుకు బీసీ వర్గాలు తప్పకుండా సహకరించాలని ఆయన కోరారు. ఇది బీసీల ప్రభుత్వమని, మరింతగా అభివృద్ది చేసుకొని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం జగన్ చెప్పిందల్లా చేస్తాడని, చంద్రబాబు చెప్పిందేమీ చేయడని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ బీసీలకు పెద్దపీట వేశారన్నారు. 27మంది మంత్రుల్లో 17మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అన్నారు. 17 ఎమ్మెల్సీల్లో 11మంది బీసీలన్నారు. 57కార్పొరేషన్లు ఏర్పాటుచేసి చైర్మన్లు, డైరక్టర్లు చేశారన్నారు. సమావేశంలో ముదిరాజు కార్పోరేషన్ డైరక్టర్ ఇయం.స్వామి, బీసీ నాయకులు బోయిన సుబ్బారావు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య -
ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాలు
రెంటచింతల: ౖవెఎస్సార్సీపీ ప్రచారానికి అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన రావడంతో రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి శ్యామల రవి కిశోర్రెడ్డి ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల నేపద్యంలో వెల్ధుర్తి మండలం శిరిగిరిపాడు గ్రామంలో ప్రశాంతంగా ప్రచారం చేస్తున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమ, మరికొందరు మహిళలపై టీడీపీ మూకలు దాడులు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. బుధవారం మండల కేంద్రమైన రెంటచింతలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దౌర్జన్యంతో ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్న టీడీపీకి ఓటుతో తగిన బుద్ధి చెప్పడానికి నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. మాచర్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సభ్యసమాజం తలదించుకునేలా టీడీపీ గుండాలు మహిళలపై రాళ్లు, కర్రలతో దాడి చేయడాన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. టీడీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మాచర్లలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి గెలుపును ఎవరూ అపలేరన్నారు. ఈ దాడుల్లో గాయపడిన రెంటచింతల మాజీ ఎంపీపీ దాసరి చౌడేశ్వరి, మాచర్ల మాజీ కౌన్సిలర్ అనంతరావమ్మ మనోధైర్యంతో ఉండాలన్నారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ మద్దిరాల కృష్ణారెడ్డి, పార్టీ నేతలు పేర్ల ముత్తయ్య, పేరం రంగారెడ్డి, కంది సంధీప్రెడ్డి, సైదారెడ్డి, వేణు తదితరులున్నారు.వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి శ్యామల రవి కిశోర్రెడ్డి -
వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ కుటుంబాలు
కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే శంకరరావు అచ్చంపేట: మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన 10 కుటుంబాలు టీడీపీకి బైబై చెప్పి బుధవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. కోగంటివారిపాలెం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తుమ్మా విజయప్రతాప్రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ సీహెచ్ ఎస్సార్కే సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మీకు సేవ చేసే అదృష్టం కల్పించండి
దాచేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించామని, మరోసారి మీకు సేవ చేసే అదృష్టం కల్పించాలని గురజాల అసెంబ్లీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి అన్నారు. మండలంలోని ముత్యాలంపాడు, తంగెడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే కాసు నిర్వహించారు. ఇంటింటి ్జఠీ వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మాట్లాడుతూ మీలో ఒకడిగా..మీ బిడ్డగా ఐదేళ్ల పాటు నిస్వార్ధంగా సేవ చేశానని, మరోసారి అవకాశం కల్పిస్తే ఇంకా మెరుగ్గా చేసి మీ రుణం తీర్చుకుంటానన్నారు. ముత్యాలంపాడు, తంగెడ గ్రామాల్లో చేసిన అభివృద్ధి చరిత్రలో నిలుస్తుందని, ప్రజలకు చెప్పిన హామీలతో పాటు సంక్షేమం కోసం పనులు చేశామని ఆయన చెప్పారు. కృష్ణానదిపై ఎత్తిపోతల పథకం నిర్మిస్తాం: తంగెడ మేజర్ కాలువ పరిధిలోని చివర భూములకు సాగునీరు అందించేందుకు కృష్ణానదిపై ఎత్తిపోతల పథకం నిర్మిస్తామని ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి చెప్పారు. ఈ పథకం నిర్మాణం కోసం ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పలు అనుమతులు వచ్చాయని, రూ.100 కోట్ల నిధులు మంజూరు కోసం ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. ఏడాది కాలంలో ఎత్తిపోతల పథకం నిర్మించి మేజర్ కాలువ పరిధిలోని చివరి భూములకు సాగునీరు అందించి తీరుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మూలగొండ్ల కృష్ణకుమారి, ఎంపీపీ కందుల జాను, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్రెడ్డి, తిరుపతిరెడ్డి, మార్కెట్యార్డు మాజీ చైర్మన్ గొట్టిముక్కల పెదహనిమిరెడ్డి, సర్పంచ్లు నెమలికొండ వెంకటచారి, కొత్తపల్లి కాశ య్య, దైద నాగరాజు, ఎంపీటీసీలు పొస వెంకటనాగయ్య, పోతుల ప్రసన్నకుమార్, నాయకులు ఆరికట్ల మల్లారెడ్డి, దేవళ్ల వీరాస్వామి, బీరవల్లి శౌర్రెడ్డి, గొగిరెడ్డి వెంకటరెడ్డి, కాసర్ల నరసింహరెడ్డి, ఉప్పుతల నరసింహరావు, షేక్ సైదా, మేడా తిరుపతిరెడ్డి, గొట్టి ముక్కల వెంకటరెడ్డి, వట్టె రామచంద్రారెడ్డి, ఉప్పుతల యల్లయ్య, బీరవల్లి బ్రహ్మరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి -
జగనన్నకు అండగా ఉందాం
మాచర్ల రూరల్: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ఇచ్చిన హామీలను 99శాతం అమలు పరచి చెప్పినవే చేస్తూ, చేయగలిగినవే చేస్తానని ప్రజల ముందుకు వచ్చిన జగనన్నకు మనందరం అండగా ఉండి మరోసారి సీఎంగా చేసుకుందామని పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకష్ణారెడి, వైఎస్సార్సీపీ నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్ధి పోలుబోయిన అనిల్కుమార్ యాదవ్ కోరారు. బుధవారం మండలంలోని కొత్తపల్లి, కొప్పునూరు, అచ్చమ్మకుంట, నాగులవరం, తాళ్ళపల్లి, భైరవునిపాడు, సుబ్బారెడ్డిపాలెం, ద్వారకాపురం గ్రామాలలో ప్రచార రథం పై వారు మాట్లాడారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు 99 శాతంగా అమలుపరచి చేయగలిగిన పనులు మాత్రమే మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చిన హామీలను అమలు పరిచే ఏకై క నాయకుడు సీఎం జగన్ మోహన్రెడ్డేనన్నారు. ఓట్లు, సీట్లు కోసం చంద్రబాబు అలివి కాని హామీలిచ్చి ప్రజలను మరోసారి కూటమి నాటకాలతో వస్తున్నారన్నారు. బ్రిటీషు కాలం నాటి భూ సమస్యలకు పరిష్కారం చూపుతూ భూ వివాదాల పరిష్కారం కోసం ల్యాండ్ టైటలింగ్ యాక్టును కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తే దానిని జగనన్న ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం అమలుపరుస్తుంటే కూటమిలో ఉన్న టీడీపీ దీని పై దుష్ప్రచారం చేయడం ఓటర్లను తప్పుదారి పట్టించటమేనన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే 12లక్షల కోట్ల బడ్జెట్ కావాలని, మేధావులు అంకెల రూపంతో సహా చూపిస్తున్నారని, పొరపాటున ఉద్యోగులు చంద్రబాబుకు ఓటు వేస్తే వారికి 3 లేక 4 నెలలకు ఒకసారి జీతాలు వస్తాయని హెచ్చరించారు. 14 ఏళ్ళుగా సీఎంగా ఉండి ఏనాడూ సంపద సృష్టించని ఆయన నేడు ఓట్లు, సీట్లు కోసం గారడీ మాటలు చెబితే ప్రజలెవరూ నమ్మే పరిస్ధితిలో లేరన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బూడిద మంగమ్మ, జెడ్పిటీసీ మండ్లి మల్లుస్వామి, వైస్ ఎంపీపీ పోతురెడ్డి సుజాత కోటిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు బూడిద శ్రీనివాసరావు, బూడిద సైదులు, మాజీ ఎంపీపీలు ఓరుగంటి జయపాల్రెడ్డి, బట్టు భూషయ్య, సర్పంచ్లు ఓరుగంటి జయప్రకాష్రెడ్డి, నోముల కృష్ణ, మాద్యానాయక్, గోగిరెడ్డి వెంకట్రావమ్మ, తీర్థాల ఈశ్వరయ్య, శ్రీనివాసరెడ్డి, రంగానాయక్, పోతురెడ్డి కోటిరెడ్డి, రవినాయక్, పున్నానాయక్, దశబంధపు కొండలు, జూకూరి వెంకట్రామయ్య, బ్రహ్మయ్య, శ్రీనునాయక్, వెంకట్రామయ్య, హనిమిరెడ్డి, బాలిరెడ్డి తదితరులున్నారు. సంక్షేమ ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకుందాం నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్, ప్రభుత్వ విప్ పీఆర్కే -
ముస్లింల అభివృద్ధి జగన్తోనే సాధ్యం
ఆత్మీయ సమావేశంలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ అచ్చంపేట: ముస్లింల జీవనాభివృద్ధి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వల్లే సాధ్యపడుతుందని, వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఏకై క నాయకుడు జగన్ అని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆద్వర్యంలో బుధవారం జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కొనసాగించగల సత్తా జగన్మోహనరెడ్డికే ఉందన్నారు. 500లకు పైగా ముప్లిం జనాభా ఉన్న గ్రామాల్లో షాదీఖానాలు, కమ్యూనిటిహాళ్లు నిర్మించడం సంతోషించదగ్గ విషయమన్నారు. గత పాలకులు ముస్లింలకోసం ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ముస్లింల కోసం ఏం చేశారన్న విషయాన్ని ప్రతి ముస్లిం, మైనారిటీ సోదరుడు ఆలోచించాలన్నారు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టిన చంద్రబాబుకు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జగన్ వల్లనే రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో కూడా పాఠశాలలు బాగుపడ్డాయని, కార్పోరేట్ స్థాయిలో మన పిల్లలను ఇంగ్లీషు మీడియంలో చదివించుకోగలుగుతున్నామన్నారు. మరొక్కసారి ఆశీర్వదించండి మోడల్ నియోజకవర్గంలా తీర్చి దిద్దుతా : ఎమ్మెల్యే నంబూరు శంకరరావు 2019 ఎన్నికల్లో మీరంతా ఆశీర్వదించారని, గతంలో ఎవ్వరూ చేయని విధంగా రూ.2000కోట్లతో సంక్షేమాభివృద్ది పనులు చేశానని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. అర్హతే ప్రామాణికంగా అన్ని సంక్షేమ పథకాలు అర్హులకు అందచేశామన్నారు. గ్రామా గ్రామాన సచివాలయాలు, హెల్త్ క్లినిక్లు, రైతుభరోసా కేంద్రాలు నిర్మించానని చెప్పారు. అన్ని అంతర్గత రహదారులకు సీసీ రోడ్లు వేయించడమే కాకుండా సైడుకాలువలు త్రవ్వించడం జరిగిందని చెప్పారు. ఇంటింటికి మంచినీటి కుళాయిలు ఇచ్చే పనిలో ఉన్నానని చెప్పారు. పులిచింతల బ్యాక్ వాటర్ను అచ్చంపేట, క్రోసూరు, బెల్లంకొండ మండలాలకు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పులివర్తి రత్నబాబు, మండల పార్టీ కన్వినర్ చిల్కా చంద్రయ్య, సర్పంచ్ షేక్ జాని, ఎంపీటీసీ షేక్ మొహిద్దీన్, మైనారిటి సెల్ అధ్యక్షులు షేక్ జాని, మైనారిటి నాయకుడు కమల్సైదా, కో ఆప్షన్ సభ్యుడు షేక్ సుభాని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
మా ఊళ్లో అభివృద్ధికి ఫిదా
తెనాలి : ఆంధ్రప్రదేశ్కు చెందిన జెడ్పీ హైస్కూలు విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన విషయం సోషల్ మీడియాలో చూసి ఆశ్చర్యపోయాను. నమ్మశక్యం కాలేదు. అదొక్కటే కాదు, చాలా రంగాల్లో రాష్ట్రంలో పెనుమార్పులు జరిగాయని తెలిసి సంతోషమేసిందని ఆ్రస్టేలియాలోని నోట్రెడేమ్ యూనివర్సిటీకి సిడ్నీలోని స్కూల్ ఆఫ్ లా అండ్ బిజినెస్ ప్రొఫెసర్, డిపార్టుమెంట్ హెడ్గా చేస్తున్న తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు డాక్టర్ అత్తోట విద్యాసాగర్ అన్నారు. కొద్ది నెలల క్రితం తెనాలిని సందర్శించిన ఆయన సొంత ఊరిలో జరిగిన మార్పు గురించి ఆ్రస్టేలియా నుంచి ‘సాక్షి’తో పంచుకున్న సంతోషం ఆయన మాటల్లోనే... నేను ఆ్రస్టేలియాలో ప్రొఫెసర్గా చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లోని పాఠశాల విద్యపై నాకు దీర్ఘకాలంగా అసంతృప్తి ఉండేది. గతంలో శిథిలమైన భవనాలు, అత్తెసరు చదువులు అన్నట్టుగా ఉండేది. 👉సొంతూరుకు ఏదైనా చేయాలని, 2015 నుంచి తెనాలిలో ఇంగ్లిష్ మీడియం స్కూల్ నిర్వహిస్తున్నా. 👉జనవరిలో తెనాలిని సందర్శించా. పట్టణం, సమీప గ్రామాల్లో పర్యటించాను. 👉వలంటీర్లు, సచివాలయ వ్యవస్థతో పరిపాలన ప్రజల ఇంటి ముంగిటకే వచ్చింది. 👉పట్టణ ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు ప్రగతికి చిహ్నాలుగా కనిపించాయి. 👉ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధికి నేను ఫిదా అయ్యాను. -
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు రౌడీయిజం ప్రదర్శించారు. వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. వృద్ధుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై టీడీపీ ఏజెంట్లు దాడికి దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై రాళ్లతో దాడి చేశారు. అదే గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై కూడా దాడి చేసి.. వాహనాలను ధ్వంసం చేశారు. అడ్డకున్న వెల్దుర్తి ఎస్ఐ శ్రీహరిపై కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. -
No Headline
నరసరావుపేట ఈస్ట్: ఐదేళ్ల కిందట వరకు ప్రభుత్వ పాఠశాలలు కనీస వసతులు లేక కూనారిల్లుతుండేవి. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు కన్పించేవి కావు. విద్యార్థులు కూర్చునేందుకు బల్లలు, పాఠం రాసేందుకు బ్లాక్ బోర్డులు సరేసరి. అటువంటి ప్రభుత్వ పాఠశాలలు జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటి రూపురేఖలు మారిపోయాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించారు. అధునాతన ఫర్నిచర్తో పాఠశాలలు నూతన శోభను సంతరించుకున్నాయి. ఇంగ్లిష్ మీడియంను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. పేదలకు ఎంతో అవసరమైన విద్య, వైద్యం రెండు కన్నులుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి కొనసాగుతున్నది. గతంలో ఏ ప్రభుత్వం కేటాయించని స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించారు. జగనన్న ప్రభుత్వం చేపట్టిన మనబడి నాడు–నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి నూతన పంథాలో కొనసాగింది. గత పాలకులు ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార్ బడులకు పంపాలంటే సంశయించేవారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. అటువంటి సర్కార్ బడులకు జగనన్న పాలనలో మహర్దశ పట్టింది. అధ్యానంగా ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలను అందంగా తీర్చిదిద్దటంతోపాటు అన్ని రకాల వసతులు కల్పించారు. ప్రతి తరగతి గదిలో కార్పొరేట్ స్థాయి బల్లలు, బ్లాక్ బోర్డు, లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. డిజిటల్ క్లాస్రూమ్లను నూతనంగా నిర్మించి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. పరిశుభ్రంగా మరుగుదొడ్లు, శుద్ధి చేసిన తాగునీటి వసతి కల్పించారు. వెలిసిపోయి బీటలు వారిన పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విజ్ఞానం, వినోదం కలసి వచ్చేలా రంగురంగులతో బొమ్మలు వేయించారు. విశాలమైన అదనపు గదులు నిర్మించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో రూ.472.6 కోట్లతో మనబడి నాడు–నేడు పనులు జరిగాయి. 1,420 తరగతి గదులకు ఇంటరాక్ట్ల్ ప్లాట్ ప్యానల్స్, మరో 474 తరగతి గదులలో స్మార్ట్ టి.వీలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ బోధన అందిస్తున్నారు. బడి తెరిచిన రోజే విద్యాకానుక... ప్రతి ఏడాది పాఠశాలలు తెరిచే రోజునే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పేరుతో ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం, షూస్, బ్యాగ్ వంటి 10 రకాల విద్యా సంబంధ వస్తువులు అందిస్తున్నారు. జిల్లాలో ఈఏడాది 1,80,089 మంది విద్యార్థులు విద్యాకానుక అందుకున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడంతో సరిపెట్టకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా ప్రణాళికలతో ముందడుగు వేస్తున్నారు. ప్రాథమిక విద్య 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, 6వ తరగతి నుంచి డిజిటల్ క్లాస్రూమ్, 8వ తరగతి నుంచి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు అందిస్తున్నారు. జిల్లాలో దాదాపు 40 వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు రూ.120 కోట్లతో ట్యాబ్లు అందజేశారు. సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు పాఠ్య ప్రణాళికలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. జగనన్న అమ్మఒడి జగనన్న అమ్మఒడి పథకం ద్వారా తమ పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంక్ ఖాతాలో ప్రతి ఏడాది రూ.15వేలు జమ చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో నాలుగేళ్లలో ఇప్పటి వరకు రూ.977.45 కోట్లు తల్లుల ఖాతాలోకి నేరుగా జమ చేశారు. విద్యార్థులకు మధ్యాహ్నం జగనన్న గోరుముద్ద పథకం కింద నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు. వారంలో ఐదు రోజులపాటు భోజనంతోపాటు కోడిగుడ్డు, మూడురోజులు చిక్కీలు, మూడు రోజులు రాగిజావ అందిస్తున్నారు. విద్యతోనే పేదరిక నిర్మూలన ఆలోచనలో వైఎస్ జగన్ విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం నాడు–నేడుతో దశ తిరిగిన ప్రభుత్వ పాఠశాలలు నాడు–నేడు నిధులు రూ.472.6 కోట్లతో జిల్లాలో పాఠశాలల అభివృద్ధి అమ్మ ఒడి పథకం ద్వారా తల్లులకు రూ.977.45 కోట్లు పంపిణీ 1,80,089 మంది విద్యార్థులకు ఏటా విద్యాకానుక రూ.120 కోట్లతో 40,134 బైజూస్ కంటెంట్ ట్యాబ్ల పంపిణీ -
డబ్బు పంపిణీ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు
నరసరావుపేట: పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్కు ఓటువేయాలని ప్రచారం చేయడంతోపాటు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు వచ్చిన ఉద్యోగులకు ఇద్దరు ఉపాధ్యాయులు డబ్బులు పంపిణీ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పెదకూరపాడులోని పోలింగ్ కేంద్రం వద్ద అమరావతి మండలం మల్లాది గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేసే కంఠమనేని శ్రీనివాసరావు, తాటికొండ మండలం రావెళ్ల ఎంపీపీ పాఠశాలలో ఎస్జీటిగా పనిచేస్తున్న అదే మండలానికి చెందిన రావెళ్ల శ్రీనివాసరావు డబ్బు పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. ఒకరు ఓటరు జాబితాలో పేరు చూస్తుండగా మరొకరు ఓటరుకు రూ.5వేలు చేతిలో పెడుతూ కనిపించారు. ఎన్నికల కమిషన్ విచారణ జరిపి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
మూడోరోజు పోస్టల్ ఓటింగ్ ప్రశాంతం
నరసరావుపేట: ఎన్నికల విధుల్లో పాల్గొనేవారికి కేటాయించిన పోస్టల్ బ్యాలెట్ను మూడో రోజు పలువురు ఉద్యోగులు ప్రశాంతంగా ఉపయోగించుకున్నారు. మంగళవారం పోలీసు విభాగానికి చెందిన వ్యక్తులకు అవకాశం కల్పించారు. పల్నాడు రోడ్డులోని ఎస్ఎస్ఎన్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేట్ సెంటర్లో జాయింట్ కలెక్టర్ ఏ.శ్యాంప్రసాదుతోపాటు సాయంత్రం నాలుగు గంటల సమయానికి 645మంది ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ వేశారు. ఇక్కడ నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన ఏడు ఫెసిలిటేట్ సెంటర్ల ద్వారా 2516 మంది ఉద్యోగులు ఓటు వేశారు. ఉదయం 11గంటల సమయానికి 906మంది, ఒంటిగంటకు 1733మంది, మూడుగంటలకు1987మంది ఓటు వేశారు. నియోజకవర్గాల వారీగా సాయంత్రం 4గంటల సమయానికి మాచర్లలో 373మంది, గురజాలలో 360మంది, వినుకొండలో 318, సత్తెనపల్లిలో 350, చిలకలూరిపేటలో 226, పెదకూరపాడులో 244మంది ఓటు వేశారు. నరసరావుపేటలో ఓటింగ్ ప్రక్రియను ఆర్వో పి.సరోజని, అసిస్టెంట్ ఆర్వో సి.రవిచంద్రారెడ్డి పర్యవేక్షించారు. బందోబస్తును ఏఆర్ అదనపు ఎస్పీ రామచంద్రరాజు పర్యవేక్షించారు. ఓటు వేసిన జిల్లా ఎస్పీ బిందుమాధవ్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును మంగళవారం జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ వినియోగించుకున్నారు. స్థానిక పల్నాడురోడ్డులోని ఎస్ఎస్ఎన్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేట్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు. ఓటు వేసిన జేసీ శ్యాంప్రసాద్ సాయంత్రం 4గంటల సమయానికి 2516 మంది ఓటు హక్కు వినియోగం -
ఈ ముగ్గురు ప్రత్యేకం!
సత్తెనపల్లి: సత్తెనపల్లి నియోజకవర్గం రాజకీయంగా చైతన్యవంతమైనది. ప్రజలు ఎప్పుడూ ఒక పార్టీకి పట్టం కట్ట లేదు. వామపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. అప్పటి నుంచి ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఒకరికి నాలుగు సార్లు, మరొకరికి రెండేసి పర్యాయాలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యే ఛాన్స్ దక్కింది. మిగిలిన వారికి ఒక్కోసారి అవకాశం ఇచ్చింది. ఇలా ఈ నియోజకవర్గంలో నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వారిలో స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య, రెండు పర్యాయాలు వరుసగా గెలుపొందిన వారిలో యర్రం వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. వావిలాల గోపాలకృష్ణయ్య తొలిసారి 1952, 1955, 1962, 1967లోనూ గెలిచారు. ఇక మిగిలిన అన్ని ఎన్నికల్లో ఎవరైనా ఒక్కసారే గెలుపునకు పరిమితం కాగా వైఎస్ రాజశేఖర్రెడ్డి మార్క్ అభివృద్ధితో 2004లో గెలుపొందిన యర్రం వెంకటేశ్వరరెడ్డి అత్యధికంగా 24,410 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ నియోజకవర్గంలో ఈ మెజార్టీ ఇప్పటివరకు జరిగిన 15 ఎన్నికల్లో అత్యధికం. తిరిగి ఆయనే 2009లో మళ్లీ గెలుపొందారు. వరుసగా రెండు పర్యాయాలు ఒకే పార్టీ కాంగ్రెస్ నుంచి యర్రం వెంకటేశ్వరరెడ్డి గెలుపొందడం విశేషం. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికై న వారిని పరిశీలిస్తే ... తొలిసారి 1952లో జరిగిన ఎన్నికల్లో వావిలాల గోపాలకృష్ణయ్య (ఇండిపెండెంట్), 1955లో వావిలాల గోపాలకృష్ణయ్య (సీపీఐ), 1962,1967లలో వావిలాల గోపాలకృష్ణయ్య (ఇండిపెండెంట్), 1972లో గాదె వీరాంజనేయశర్మ (కాంగ్రెస్), 1978లో డాక్టర్ రావెల వెంకట్రావు (కాంగ్రెస్), 1983లో నన్నపనేని రాజకుమారి (టీడీపీ), 1985లో పుతుంబాక వెంకటపతి (సీపీఎం), 1989లో దొడ్డా బాలకోటిరెడ్డి (కాంగ్రెస్), 1994లో పుతుంబాక భారతి (సీపీఎం), 1999లో వైవీ ఆంజనేయులు(టీడీపీ), 2004, 2009లో యర్రం వెంకటేశ్వరరెడ్డి (కాంగ్రెస్), 2014లో డాక్టర్ కోడెల శివప్రసాదరావు (టీడీపీ), 2019లో అంబటి రాంబాబు (వైఎస్సార్ సీపీ) ఉన్నారు. ఈ లెక్కన చూస్తే పలుమార్లు అంటే ఐదు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, మూడు పర్యాయాలు ఇండిపెండెంట్లు, టీడీపీ, రెండు పర్యాయాలు సీపీఎం గెలుపొందగా సీపీఐ, వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఒక్కోసారి చొప్పున గెలుపొందారు. ఒక్కరికే రాష్ట్ర మంత్రి ఛాన్స్ సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పలువురు ఎమ్మెల్యేలుగా ఎన్నికై నప్పటికీ రాష్ట్ర మంత్రి పదవి మాత్రం ఒక్క అంబటి రాంబాబుకు మాత్రమే దక్కింది. 2019లో వైఎఎస్సార్ సీపీ నుంచి 20,876 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికై న ఆయనకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి (2022 ఏప్రిల్ 11న) పదవి లభించింది. ఇప్పటి వరకు సత్తెనపల్లి అసెంబ్లీకి 15 దఫాలు ఎన్నికలు వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన వావిలాల గోపాలకృష్ణయ్య రెండుసార్లు యర్రం వెంకటేశ్వరరెడ్డి రాష్ట్ర మంత్రి పదవి దక్కించుకున్నది అంబటి రాంబాబు ఒక్కరే -
No Headline
విభాగాలు పాఠశాలలు పనులు మొత్తం రూ.కోట్లలో)ఫేజ్–1 623 149.85 ఫేజ్–2 907 306.95 ఫేజ్–2ఏ ఫేజ్–1లో బడుల్లో పెండింగ్ పనులకు 11 ఫేజ్–2బి 513 అంగన్వాడీ కేంద్రాలు 4.8 సంవత్సరం లబ్ధిదారులు జమ అయిన మొత్తం రూ.కోట్లలో) 2019–20 1,61,031 241.55 2020–21 1,72,772 241.88 2021–22 1,92598 250.38 2022–23 1,87,417 243.64 మొత్తం 977.45 -
బీసీలందరికీ అండగా ఉంటా
నరసరావుపేట: నియోజకవర్గ పరిధిలోని వడియరాజులతో పాటు బీసీ వర్గీయులందరికీ తాను అండగా ఉంటానని వైఎస్సార్సీపీ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్ధి డాక్టర్ పి.అనిల్ కుమార్యాదవ్ హామీ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ దేవళ్ల రేవతి, జిల్లాలోని పలువురు వడియరాజు సంఘ నాయకులు పార్టీ కార్యాలయంలో డాక్టర్ అనిల్తో సమావేశమయ్యారు. ఇటీవల కోటప్పకొండ వడియరాజుల సత్రానికి రూ.50లక్షలు ప్రకటించినందుకు వారందరూ డాక్టర్ అనిల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా వారితో మాట్లాడుతూ తొలిసారిగా నరసరావుపేట పార్లమెంటు సీటును బీసీ అభ్యర్దినైన తనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చారని, బీసీలందరూ తనకు సహకరించి ఆ ప్రాధాన్యతను నిలబెట్టుకోవాలని కోరారు. ఒక బీసీ ఎంపీగా నియోజక వర్గంలోని బీసీలందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తానని హామీ ఇచ్చారు. కలిసిన వారిలో వడియరాజుల మున్సిపల్, మార్కెట్యార్డు చైర్మన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు ఉన్నారు. వడియరాజులకు హామీ ఇచ్చిన ఎంపీ అభ్యర్ధి డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్ -
శిక్షణలో నేర్పించే అంశాలు
● త్రెడ్డింగ్ ● వ్యాక్స్ ● పెడిక్యూర్ ● మెనిక్యూర్ ● బ్లీచింగ్ ● స్కిన్కేర్ ● హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ ● హెయిర్ కేర్ ● వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్ ● డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్ ● హెయిర్ కట్స్ ● హెయిర్ స్టైల్ ● హెన్నా ప్రిపరేషన్ ● డై అప్లికేషన్ ● ఒబెసిటీ అండ్ న్యూట్రిషియన్ డైట్ ● బ్రైడల్ మేకప్స్ ● హెయిర్ మసాజ్ ● కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్ ● ఫేషియల్స్ ● యాంటీ యేజింగ్ థర్మో హెర్బ్ ఫేషియల్స్. -
ప్రభుత్వబడిలో చదివి జిల్లా ఫస్ట్ వచ్చింది
మా రెండో అమ్మాయి రిషితారెడ్డి ఈ ఏడాది తిలక్ మున్సిపల్ స్కూల్లో చదువుతూ పదో తరగతి ఫలితాలలో జిల్లా టాపర్గా నిలిచింది. 600లకుగాను 593 మార్కులు సాధించింది. కార్పొరేట్ స్కూళ్లలో రూ.లక్షలు ఖర్చుపెట్టినా రానన్ని మార్కులు ప్రభుత్వ బడిలో చదివి రావడం చాలా సంతోషంగా ఉంది. జగనన్న ప్రభుత్వంలో సర్కార్ బడుల రూపురేఖలు మారడంతోపాటు నాణ్యమైన విద్య అందుతోంది అనడానికి మా అమ్మాయి మార్కులే నిదర్శనం. జగనన్న అందించే అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద వంటి అన్ని పథకాలు అందాయి. – గాండ్లపర్తి రంగారెడ్డి, ప్రకాశ్నగర్, నరసరావుపేట● -
ఐదేళ్ల సంక్షేమం చూసి ఓటెయ్యండి
నాదెండ్ల : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలల్లో జరిగిన సంక్షేమం, గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలనివ వైఎస్సార్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు కోరారు. నాదెండ్ల మండలం కనపర్రు పంచాయతీ శివారు గ్రామాలైన మైనంపాడు, మల్లాయపాలెంలో మంగళవారం రాత్రి పర్యటించారు. ఆయా గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు కావటికి ఘన స్వాగతం పలికారు. ముందుగా కనపర్రులోని బాలయేసు పుణ్యక్షేత్రంలో ప్రార్థనలు, ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి గుడిలో పూజలు చేశారు. అనంతరం ఇటింంటి ప్రచారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కావటి మనోహర్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో పంచాయతీ పరిధిలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రూ.25 కోట్ల మేర ప్రజలకు ప్రత్యక్ష, పరోక్షంగా లబ్ధి చేకూరిందని వివరించారు. కులం, మతం, వర్గం, పార్టీ ప్రమేయం లేకుండా అర్హతే ప్రామాణికంగా చేసుకుని సంక్షేమ పథకాలను అందించే వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మరోమారు ఆశీర్వదించి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని అభ్యర్థించారు సర్పంచ్ పెరుమాళ్లపల్లి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ పచ్చల సీతారామయ్య, జడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్రావు, ఎంపీపీ తలతోటి రాణీ, మండల పార్టీ అధ్యక్షుడు మద్దూరి కోటిరెడ్డి, నాదెండ్ల, తూబాడు సొసైటీ అధ్యక్షులు కురుగుంట్ల వెంకటరెడ్డి, మంగు ఏడుకొండలు, పార్టీ నాయకులు గుంజి శ్రీనివాసరావు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జానీబాష, పచ్చవ కోటేశ్వరరావు, మాలే వెంకటస్వామి, నాగేశ్వరరావు, అన్నలదాసు ప్రసాద్, నంబూరి మరియదాసు, పోపూరి జోజియ్య, సాగర్, న్యాయవాది గాలి జయప్రకాష్ తదితరులున్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్నాయుడు నాదెండ్ల మండలంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం కనపర్రు, మైనంపాడు, మల్లాయపాలెం గ్రామాల్లో పర్యటన -
టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరిన 80 కుటుంబాలు
అచ్చంపేట: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన టీడిపీ కార్యకర్తలు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. వారందరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. తాళ్లచెరువు గ్రామం నుంచి టీడిపీకి చెందిన 20 కుటుంబాల వారు వైఎస్సార్ సీపీలో చేరారు. అచ్చంపేట ఎస్సీ కాలనీకి చెందిన 25 కుటుంబాల వారు వైఎస్సార్ సీపీలో చేరారు. చింతపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు వైఎస్సార్ సీపీలో చేరారు. తాడువాయి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరిన 20 కుటుంబాల వారు ప్రలోభాలకు లొంగి పొరపాటు చేశామంటూ తిరిగి ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి మరీ తిరిగి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చేత వైఎస్సార్ సీపీ కండువాలు కప్పించుకున్నారు. వైఎస్సార్సీపీలోకి 50 యాదవరాజుల కుటుంబాలు నరసరావుపేట రూరల్: కేసానుపల్లి గ్రామానికి చెందిన టీడీపీ మాజీసర్పంచ్ లింగాల లక్ష్మీనారాయణతోపాటు 50 యాదవరాజుల కుటుంబాలు మంగళవారం వైఎస్సార్సీపీలో చేరాయి. గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్ధి పి.అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సిఎం జగనన్న అందిస్తున్న సంక్షేమ పాలన చూసి వైఎస్సార్సీపీలో చేరుతున్నట్టు మాజీ సర్పంచ్ లింగాల లక్ష్మీనారాయణ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు మారూరీ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో పలువురు చేరిక ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి పిడుగురాళ్ల: పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్సీపీలో పలువురు చేరారు. మాచవరం మండలంలోని కొత్తపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీకి చెందిన 10 కుటుంబాలు తెలుగు దేశం పార్టీ నాయకులు పనితీరు నచ్చక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి గురజాల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మె ల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా కాసు మహేష్రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అందించే సంక్షేమ పథకాలు, నియోజక వర్గంలో మహేష్రెడ్డి అందించిన అభివృద్ది చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు. టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక పిడుగురాళ్ల: పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో తెలుగు దేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పలువురు చేరారు. గురజాల మండలం పల్లెగుంతల గ్రామానికి చెందిన 10 కుటుంబాల వారు తెలుగు దేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు జాస్తి శంకరయ్య, వంకాయల పాటి నాగేశ్వరరావు, దూళ్లిపాళ్ల వెంకటేశ్వర్లు, ముప్పాళ్ల ఆంజనేయులు, గోళ్ల రామయ్యలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
'మాత్రు' సినిమా పోస్టర్ లాంచ్ చేసిన విజయేంద్ర ప్రసాద్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (09-05-2024)
హీరోయిన్తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
జమైకా నుంచి దుబాయ్ విమానం వెనక్కి.. కారణం ఇదే
ఐదో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
రాయన్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
దుష్యంత్ చౌతాలాకు షాక్.. ఖట్టర్ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
ఫ్రాంక్ఫర్ట్లో ఉగాది వేడుకలు
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement