-
ప్రకాశంలో ఫ్యాన్ గాలి ఉధృతం
సాక్షి, ఒంగోలు ప్రతినిధి : ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ సీపీ క్లీన్స్వీప్ దిశగా దూసుకుపోతోంది. సామాజిక సమీకరణలను బేరీజు వేసుకొని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యర్థులను రంగంలోకి దింపారు. ఐదేళ్లలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విజయానికి పునాదులుగా మారాయి. సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబి్ధదారుల ఖాతాల్లో వందల కోట్లు జమయ్యాయి. అదే సమయంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో ప్రజలు మరోసారి వైఎస్సార్ సీపీకి పట్టం కట్టనున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పూర్తయ్యాయి. విజయ ‘భాస్కరు’డే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎంపీఅభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి విస్తృతంగా పర్యటిస్తున్నారు. అందరినీ కలుపుకుంటూ మండలాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో పక్క టీడీపీ తరఫున బరిలో ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీ తరఫున పోటీ చేయడం మాగుంటకు రివాజుగా మారింది. తరచూ పార్టీలు మారడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీనికి తోడు దేశాన్ని కుదిపేస్తున్న మద్యం కుంభకోణంలో ఈయన కుమారుడు అప్రూవర్గా ఉన్నారు. ప్రజల మనిíÙగా పేరొందిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎంపీగా భారీ విజయం దిశగా దూసుకుపోతున్నారు. బాలినేనికి సిక్సర్ ఖాయం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి విడదీయరాని బంధం. ఇప్పటికే ఒంగోలు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు విడతలు మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.230 కోట్లతో 25 వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చరిత్రలో నిలిచిపోనుంది. బాలినేనికి టీడీపీ అభ్యర్థి దామచర్ల ఏమాత్రం పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్కసారి ఎమ్మెల్యేగా çగెలిచిన దామచర్ల ఆ ఐదేళ్లలో చేసిన అరాచకాలు, అవినీతి, అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరు పిలిచినా పలికే నేతగా పేరు తెచ్చుకున్న బాలినేని మళ్లీ విజయం సాధించి సిక్సర్ కొట్టనున్నారు. దర్శి బూచేపల్లి అడ్డాదర్శి టీడీపీ తరఫున నరసరావుపేటకు చెందిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి బరిలోకి దించింది. కానీ రెండు దశాబ్దాలుగా దర్శిని అడ్డాగా మార్చుకున్న బూచేపల్లి శివప్రసాద్రెడ్డికి గొట్టిపాటి లక్ష్మి ఏ మాత్రం పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఏడాదిగా దర్శిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న బూచేపల్లి ఏ ఇంటికి వెళ్లినా తమ కుటుంబ సభ్యునిగా భావిస్తారు. నిజాయితీకి మారుపేరుగా ఉన్న బూచేపల్లి కుటుంబం ఈ విడత భారీ మెజారీ్టతో విజయం సాధిస్తుందంటున్నారు. గొట్టిపాటి లక్ష్మి కొత్త అభ్యర్థి కావడం, జనసేన, టీడీపీల నుంచి పలువురు టికెట్లు ఆశించి భంగపడిన వారు వెన్నుపోటుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సంతనూతలపాడులో నాగా‘అర్జునుడే’ సంతనూతలపాడు నుంచి మంత్రి మేరుగు నాగార్జున బరిలో దిగుతున్నారు. ఇక్కడ మేరుగు కొత్త అయినా మంత్రిగా ఆయన అనుభవం మరోసారి విజయాన్ని అందించనుంది. 24 సంవత్సరాలుగా టీడీపీ జెండా ఎగురలేదని ఇటీవల చీమకుర్తిలో జరిగిన యువగళంలో కూడా లోకేశ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్న బీఎన్ విజయకుమార్ ఇప్పటికే రెండు సార్లు ఓటమి పాలయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మంత్రి మేరుగు అనుభవం మరోసారి విజయాన్ని అందించనున్నాయి. ఆదిమూలపుసురేష్ దూకుడు కొండపి నుంచి ఈ సారి మంత్రి ఆదిమూలపు సురేష్ బరిలో దిగుతున్నారు. ఓటమి ఎరుగని నేతగా ఆయనకు పేరుంది. విద్యావంతుడిగా పేరుగాంచిన సురేష్కు కొండపిలో విజయం నల్లేరుపై నడకేనంటున్నారు. మరో వైపు టీడీపీ నుంచి ఎమ్మెల్యే స్వామి బరిలోకి దిగుతున్నారు. మరుగుదొడ్లు, నీరు–చెట్టు, ఇంకుడుగుంతల పథకాల్లో వందల కోట్ల అవినీతికి పాల్పడిన డోలా బాల వీరాంజనేయస్వామికి ఈ విడత ఘోరంగా ఓటమి ఖాయమంటున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా అనంతవరం, కొణిజేడు గ్రామాల్లో ఎదురైన చేదు అనుభవాలే స్వామి ఓటమిని ఖరారు చేశాయి. గిద్దలూరు గెలుపు తథ్యం వైఎస్సార్సీపీకి గిద్దలూరు కంచుకోట. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 80 వేల మెజారీ్టతో రాష్ట్రంలో గిద్దలూరు నియోజకవర్గం సంచలనం సృష్టించింది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున గెలిచిన ముత్తుల అశోక్రెడ్డి పార్టీ ఫిరాయించి పారీ్టకి నమ్మకద్రోహం చేశాడని నియోజకవర్గంలో అతనిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ విడత ముత్తుముల బరిలో ఉన్నా అతన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వైఎస్సార్సీపీ నుంచి బరిలో ఉన్న కేపీ నాగార్జునరెడ్డి ఉన్నత విద్యావంతుడు, మృదుస్వభావి. వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు ఇంటింటికి చేరాయి. దీంతో కేపీ నాగార్జునరెడ్డి గెలుపు నల్లేరుపై నడకే.మార్కాపురంలో ప్రభంజనమే గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యరి్థగా అన్నా రాంబాబు మార్కాపురం నుంచి బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో 80 వేల మెజారిటీ సాధించిన చరిత్ర ఆయనది. విద్యాదాతగా అన్నా రాంబాబు పేరుగడించారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు చారిటబుల్ ట్రస్టు ద్వారా పేదలకు సేవ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. 13 క్రిమినల్ కేసులతో పాటు భూకబ్జాలు, అనేక ఆరోపణలు ఉండటంతో ఆయన 2014, 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు. దీంతో అన్నా రాంబాబుకు మరోసారి భారీ మెజార్టీ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనిగిరిలో కొత్త చరిత్ర దద్దాల నారాయణ యాదవ్ వైఎస్సార్సీపీ కనిగిరి నుంచి చరిత్ర సృష్టించనున్నారు. సామాన్యుడికి టికెట్ కేటాయించి జగనన్న టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డిపై పోటీకి దించారు. దద్దాలపై కనిగిరి ప్రజలకు ఎనలేని అభిమానం ఉంది. టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి అధికారంలో ఉన్న సమయంలో పాల్పడిన కక్ష సాధింపు చర్యలను ప్రజలు మరిచిపోలేకపోతున్నారు. దీనికి తోడు టీడీపీ బీజేపీ కూటమిలో ఉండటంతో ముస్లింలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. నియోజకవర్గంలో సుమారు 22,500 ఓట్లు ఉన్న ముస్లింలు దద్దాల వైపే ఉన్నారు. దీంతో ఇక్కడ ఆయన విజయం తథ్యమంటున్నారు. యర్రగొండపాలెం ఏకపక్షం యర్రగొండపాలెం ఎప్పుడూ ఏకపక్షమే. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న టీడీపీ ఎరిక్షన్బాబు వైఎస్సార్సీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్కు ఏమాత్రం పోటీ ఇచ్చే అవకాశం లేదు. లిడ్క్యాప్ చైర్మన్గా పనిచేసిన కాలంలో ఎరిక్షన్బాబుపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తాటిపర్తి చంద్రశేఖర్ కొత్త వ్యక్తే అయినప్పటికీ గత మూడు నెలలుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు చాలా దగ్గరయ్యారు. ఈ పరిస్థితుల్లో తాటిపర్తి భారీ మెజారిటీతో విజయం సాధించనున్నారు. -
డ్రెయినేజీలపై ‘కంపు’ రాతలేల?
● నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ.47.21 కోట్లతో 304 పనులు చేపట్టారు. ప్రధానంగా ఒంగోలు నగరంలోని రామ్ నగర్ 7వ లైను నుంచి దక్షిణ బైపాస్లోని సంఘమిత్ర ఆస్పత్రి వరకు మురుగు, వర్షం నీరు నల్ల కాలువలో కలపడానికి రూ.1.20 కోట్లు వెచ్చించి డిస్పోజల్ డ్రెయిన్ నిర్మాణం పూర్తి చేశారు. ● ట్రంక్ రోడ్డు, భాగ్యనగర్, హౌసింగ్ బోర్డు, టుబాకో బోర్డు ఆర్ఎం కార్యాలయం ఏరియా, రామ్నగర్, వెంగముక్కల పాలెం, గాంధీ రోడ్డు, కోట వీధి, బాపూజీ కాంప్లెక్స్ ఏరియాల నుంచి ము రుగు, వర్షపు నీరు నల్ల కాలువ, పోతురాజు కాలువల్లోకి వెళ్లేలా డిస్పోజల్ డ్రెయిన్లు పూర్తి చేశారు. ● ముంగమూరు రోడ్డు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పరిసరాల నుంచి వచ్చే మురుగు, వర్షం నీరు నల్లకాలువలోకి వెళ్లేలా డ్రెయినేజీ నిర్మించారు. కేశవరాజుకుంట పరిసరాల్లోని మురుగు, వర్షం నీరు కొప్పోలు మెయిన్ డ్రెయిన్లోకి వెళ్లేలా, ముస్లిం బరియల్ గ్రౌండ్ నుంచి గుత్తికొండవారిపాలెం వరకు డిస్పోజల్ డ్రెయిన్ నిర్మాణం చేపట్టారు. పోతురాజు కాలువ రిటెయినింగ్ వాల్, పూడికతీత పనులు రూ.58 కోట్లతో జరుగుతున్నాయి. -
టీడీపీ మేనిఫెస్టో అంతా బూటకం
ఒంగోలు సిటీ: ప్రతిపక్షాలు ప్రకటించిన మేనిఫెస్టో అంతా బూటకమని, చంద్రబాబు మాటలు ఎవరైనా నమ్మితే నట్టేట మునిగినట్లేనని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని 10, 11, 12, 18 డివిజన్లలో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మన ఒంగోలు–మన వాసన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్షో నిర్వహించారు. అంతకు ముందు ప్రజలు బాలినేనికి బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా మహిళలు సాదరంగా ఆహ్వానం పలికి పూలమాలలతో, శాలువాలతో సన్మానించి, హారతులతో ఘనస్వాగతం పలికారు. ముందుగా 11 వ డివిజన్లోని చర్చిలలో బాలినేని శ్రీనివాసరెడ్డికి పాస్టర్లు జాన్ సుబ్బారెడ్డి, జాన్ అగస్టీన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 10 వ డివిజన్లో అగ్రహారం, కొప్పోలులో బాలినేని రోడ్షో నిర్వహించారు. 18 వ డివిజన్లో వెంగముక్కలపాలెం, చెరువుకొమ్ముపాలెంలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు. ఈ ఐదేళ్లలో సీఎం జగన్మోహన్రెడ్డి అందించిన సంక్షేమ పాలనలో ప్రతి ఇంట్లో సంతోషంగా ఉన్నారన్నారు. ప్రతిపక్షాలు కేవలం మాటల గారడీతో బురిడీ కొట్టించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎవరెన్నీ కుట్రలు చేసినా మళ్లీ సీఎం గా జగన్మోహన్రెడ్డి అవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, లిడ్క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, డివిజన్ కార్పొరేటర్ గంగవరపు ప్రవీణ్కుమార్, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కోఆప్షన్ మెంబరు శ్యాంసాగర్, వైఎస్సార్సీపీ నాయకులు పట్రా ఐజాక్, కృపాకిరీటి, సంజయ్, రంజిత్, కాళె శివాజీ, ప్రకాష్ రాయల్, మాన్ సింగ్, ఆల్ఫ్రెడ్, క్రాంతి, శ్రావణ్, శేఖర్, కళ్యాణ్, వెంకటేశ్వర్లు, ప్రభు, దిలీప్, విజయ్, చింతగుంట్ల సువర్ణ, తదితరులు పాల్గొన్నారు. 12 వ డివిజన్కు సంబంధించి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, వైఎస్సార్ సీపీ నాయకులు మహ్మద్ నజీర్, కోఆప్షన్ మెంబర్స్ మహ్మద్ సర్తాజ్, మహ్మద్ షౌకత్, వైఎస్సార్సీపీ నాయకులు కఠారి లక్ష్మణ్, ఎస్కే.నజీర్, అరిగ మల్లి, మహ్మద్ వాజీద్, మోటే భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 10 వ డివిజన్ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ నాయకులు కొప్పొలు సీతారామయ్య, షేక్ మస్తానయ్య, జమ్ము రత్తయ్య యాదవ్, కమ్మ సురేష్, ఎస్కే.శ్రీనుబాషా, ఆవలమంద వెంకటరావు, అంబటి అర్జున్, గద్దల రాజేంద్ర, కాటూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 18 వ డివిజన్లో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, మాజీ సర్పంచ్ అడపాల రాము, ఆర్టీఏ సంజీవరెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి 10, 11, 12, 18 డివిజన్లలో బాలినేని ఎన్నికల ప్రచారం అడుగడుగునా పూలతో, హారతులతో బాలినేనికి ఘనస్వాగతం -
పేదలు బాగుంటే చంద్రబాబుకు కడుపుమంట
సింగరాయకొండ: పేదలు సంతోషంగా ఉండటం చంద్రబాబు నాయుడుకు ఇష్టం ఉండదని, పేదల సంక్షేమం అంటే చంద్రబాబుకు కడుపుమంట అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి, కొండపి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. పేదలకు అందే ఫలాలను టీడీపీ నాయకులు అడ్డుకున్న తీరుపై ఆయన బుధవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వలంటీర్లను అవహేళన చేసి మాట్లాడటం, ఆ తర్వాత అదే వలంటీర్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అందాల్సిన పింఛన్లను అందకుండా చేసి వాళ్లను ఇబ్బందిపెట్టారన్నారు. గతంలో మాదిరి ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్ అందుకోవాల్సిన వాళ్లు చంద్రబాబు అండ్ కో చేసిన నిర్వాకంతో రెండు నెలలు పడిన ఇబ్బందిని రాష్ట్ర ప్రజలు గమనించారన్నారు. మళ్లీ ఇప్పుడు సంక్షేమ పథకాల నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు చేరకూడదని పేదలపై కక్షకట్టిన చంద్రబాబు మళ్లీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి పథకాల డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ కాకుండా నిలిపేసిన సంగతిని రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరారు. పేదల ఉసురు తప్పకుండా చంద్రబాబుకు తగులుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు సంక్షేమ పథకాలు అందకూడదని, సరైన ఇళ్లు ఉండకూడదని, ఇళ్లస్థలాలు ఇవ్వకూడదని అన్ని రకాలుగా టీడీపీ ఇబ్బంది పెట్టిందని గుర్తు చేశారు. అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పేద ప్రజలు టీడీపీకి బుద్ధి చెబుతారని, వైఎస్సార్సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకు రావటానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందుకే పేదల పథకాలను అడ్డుకున్నాడు రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి, కొండపి అసెంబ్లీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ -
ప్రజల మేలు కోరేవాడే నిజమైన నాయకుడు
● సంతనూతలపాడు నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి మేరుగు నాగార్జున మద్దిపాడు: ప్రజల మేలు కోరుతూ ప్రభుత్వాన్ని నడిపే వాడే నిజమైన నాయకుడు అనిపించుకుంటాడని సంతనూతలపాడు నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. బుధవారం ఆయన మండలంలోని దొడ్డవరప్పాడు, వెంకట్రాజుపాలెం పల్లె, కొలచనకోట గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా, కుల మత వర్గ విభేదాలు లేకుండా ప్రజలందరికీ ఆమోద యోగ్యంగా పథకాలు అమలు చేస్తూ అందరికీ మేలు చేస్తున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్ను మళ్లీ గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించాలని, ఎవరు మేలు చేశారో గుర్తు చేసుకోవాలని కోరారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలకు తప్ప ప్రజలకు చేసిన మేలు ఒక్కటైనా ఉందా అంటూ ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన బాబు ఫలానా మంచి పథకం తాను తీసుకొచ్చానని చెప్పగలడా అంటూ ప్రశ్నించారు. ఏమీ చేయకపోయినా హైదరాబాద్ను కట్టించింది నేనే, కంప్యూటర్లు తయారు చేయించింది నేనే అంటూ ఆయన చెప్పే ఊకదంపుడు ఉపన్యాసాలు వింటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో ముసుగులు వేసుకుని పక్క రాష్ట్రాల్లో దాక్కున్న చంబా, ఆయన ఉత్త పుత్రుడు, దత్త పుత్రుడు ఈరోజు జగన్ను మట్టి కరిపిస్తామంటూ ప్రగల్భాలు పలకడం చూస్తే ఆకాశం పై ఉమ్మివేసినట్లు ఉందని అన్నారు. ప్రజలు గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లకే టీడీపీని పరిమితం చేశారని, ఇటువంటి మాటలు మాట్లాడితే రాబోయే ఎన్నికల్లో పూర్తిగా చాప చుట్టి బంగాళాఖాతంలో వేయడం ఖాయమని అన్నారు. సంతనూతలపాడు అభ్యర్థిగా తనను, బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా నందిగం సురేష్ను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముందుగా ఆయన వెంకట్రాజుపాలెంలో అంబేడ్కర్ విగ్రహానికి, కొలచనకోటలో బాబూ జగ్జీవన్రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమం ఆయన వెంట రాష్ట్ర పార్టీ కార్యదర్శి చుండూరి రవిబాబు, పార్టీ మండల అధ్యక్షుడు మండవ అప్పారావు, ప్రధాన కార్యదర్శి ఎంపీటీసీ వాకా కోటిరెడ్డి, వైస్ ఎంపీపీ పైడిపాటి వెంకట్రావు, అనపర్తి చిరంజీవి, సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ నారా విజయలక్ష్మి గుడ్డపాతల రవి, తేళ్ల పుల్లారావు, పిట్టల ఆంజనేయులు విల్సన్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బెజవాడ రాము బొమ్మల రామాంజనేయులు, పైనం శ్రీనివాసరావు, శ్రీకాంత్, కొలచనకోట సర్పంచ్ డొక్కా మరియమ్మ, ఎంపీటీసీ బొమ్మల దేవదాసు పైనం ప్రభాకర్, సిద్ధయ్య, హరిబాబు, సింగయ్య, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
కబోదీ.. ఇది కాదా అభివృద్ధి
పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది.. ముమ్మరంగా అభివృద్ధి పనులు సాగుతున్నా అవేవీ పచ్చ నేతలకు కనిపించవు. ఎల్లో మీడియాలో రోత రాతలు రాయిస్తూ ప్రభుత్వంపై బురదజల్లడమే పచ్చ దండు పనిగా పెట్టుకుంది. ఒంగోలు నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించినా అవేవీ లేదన్నట్టు పచ్చ మీడియా విషం చిమ్మడం.. అవే అబద్ధాలను టీడీపీ నేతలు ప్రచారం చేయడం పరిపాటిగా మారింది. పైప్ లైన్ పనులు చేస్తున్న ప్రదేశాలు లేదంటే ఎక్కడో కాస్త పెచ్చు లేచిన రోడ్లను క్లోజప్లో ఫొటోలు తీసి ఎల్లో మీడియాలో అచ్చేసి శునకానందం పొందుతున్నారు. ఒంగోలు సబర్బన్: భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగరంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలు వేగంగా చేపట్టారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించడంతో గత ఐదేళ్లలో నగర రూపురేఖలు మారాయి. గతంలో అడుగు కూడా వేయలేని ప్రాంతాల్లో నేడు సీసీ రోడ్లు దర్శనమిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే ముగినిపోయే ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడింది. ఇవన్నీ చూడలేని పచ్చ దండు నిత్యం అసత్యాలు ప్రచారం చేస్తోంది. ‘‘పథకాలు ఇస్తే సరిపోద్దా.. రోడ్లేయలేదు.. కాలువలు కట్టలేదు’’ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించడం నగర వాసులకు వెగటు పుట్టిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీసీ రోడ్లు ఉన్నచోటే మళ్లీ రోడ్లు వేసి ప్రజా ధనం బొక్కేశారన్న విషయం నగర వాసులు ఇంకా మర్చిపోలేదు. అసత్యాలపై ‘‘ఛీఛీ’’ అంటున్న జనం: నగరంలో 3 లక్షలకు పైగా జనాభా దాటిపోయింది. అందుకుగాను ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాల కోసం నిధులు కుమ్మరించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కేవలం 58 నెలల కాలంలో రోడ్ల అభివృద్ధి, డ్రెయిన్ల నిర్మాణాల కోసం దాదాపు రూ.115 కోట్లకు పైగా వెచ్చించారు. నగర పాలకల సంస్థ సాధారణ నిధులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన వివిధ పథకాలను సద్వినియోగం చేసుకొని నగరంలో విస్తృతంగా రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలు చేపట్టారు. ఒంగోలు నగరంలో రోడ్ల నిర్మాణాలకు సంబంధించి 514 పనులు మంజూరు చేశారు. అందుకోసం రూ.62.79 కోట్లు కేటాయించారు. వాటిలో 415 రోడ్ల నిర్మాణాల పనులు పూర్తికాగా 99 పనులు చివరి దశలో ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వం రోడ్డు మీద రోడ్డు వేయటంతో ఒంగోలు నగరంలో వర్షం పడితే నీళ్లు బయటకు పోయే పరిస్థితి లేకుండా పోయింది. ఆ సమస్యను చక్కదిద్దడానికి నగరంలోని ప్రధాన రోడ్లతో పాటు శివారు ప్రాంతాల్లోని దాదాపు 58 రోడ్లకు రూ.3.26 కోట్లతో మరమ్మతులు చేశారు. అయినా పచ్చ పత్రికల్లో రోత రాతలు రాయడాన్ని జనం అసహ్యించుకుంటున్నారు. ఒంగోలు అభివృద్ధిపై పచ్చ నేతలు, ఎల్లో మీడియా అసత్య ప్రచారం నగరంలో రూ.115 కోట్లకు పైగా వెచ్చించి రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం రూ.62.79 కోట్లతో సీసీ రోడ్లు, రూ.3.26 కోట్లతో 58 రోడ్లకు మరమ్మతులు 304 సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి రూ.47.21 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం అయినా పచ్చ దండు రోత జనాల ఈసడింపు -
వర్షంతో ఉపశమనం
● జిల్లాలో 37 మండలాల్లో వర్షం ● ఉద్యాన వన పంటలకు నష్టం ఒంగోలు సెంట్రల్: జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షం రైతులకు, ప్రజలకు ఊరట నిచ్చింది. డిసెంబర్ తర్వాత 2024లో కురిసిన మొదటి వర్షం కావటంతో భగ భగ ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు చల్లదనంతో ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని 37 మండలాల్లో వర్షపాతం నమోదైనట్లు వ్యవసాయశాఖ జేడీఏ శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యాన వన పంటలు అరటి 152 ఎకరాలు, బొప్పాయి 40 ఎకరాల మేర, కొంత మొక్కజొన్న వర్షంతో పాటు వీచిన భారీ గాలులకు నెరకొరిగి దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేశామని జిల్లా ఉద్యానశాఖ అధికారి వై గోపిచంద్ తెలిపారు. జిల్లాలో మంగళవారం రాత్రి 1260 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆయా మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. మద్దిపాడు 130.6 మి.మీ, మార్కాపురం 98.4 మి.మీ, నాగులుప్పలపాడు 88.0, పుల్లల చెరువు 65.2, తర్లుపాడు 59.4, మర్రిపూడి 58.4, పొదిలి 52.4, పెద్దారవీడు 48.6, త్రిపురాంతకం 42.6, కొనకల మిట్ల 40.6, దోర్నాల 38.4, కనిగిరి 37.0, సంతనూతల పాడు 35.8, ముండ్లమూరు 35.6, రాచర్ల 32.2, చీమకుర్తి 32.0, కొండపి 31.6, యర్రగొండ పాలెం 30.4, కురిచేడు 29.0, సీఎస్పురం 22.4, తాళ్లూరు 20.8, గిద్దలూరు 19.2, కొమరోలు 18.4, కంభం 16, వెలిగండ్ల 15.6, దర్శి 15.2, పెద చెర్లోపల్లి 14.8, దొనకొండ 13.0, బేస్తవారి పేట 12.6, పొన్నలూరు 12.4, ఒంగోలు 10.6, జరుగుమల్లి 9.8, పామూరు 9.4, టంగుటూరు 5.6, ఎస్ కొండ 3.6, కొత్తపట్నం 2 మి.మీగా ఉంది. జిల్లాకు 8 మంది ట్రైనీ ఐపీఎస్లు ఒంగోలు సబర్బన్: కేంద్ర హోం శాఖ జిల్లాకు ఎనిమిది మంది ట్రైనీ ఐపీఎస్లను కేటాయించింది. ఈ మేరకు బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో వారు రిపోర్టు చేశారు. ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ విజయవాడలో బందోబస్తు విధుల్లో ఉండటంతో ఒంగోలు పార్లమెంట్ పోలీస్ అబ్జర్వర్, జమ్మూ కాశ్మీర్ డీఐజీ హసీబ్ ఉర్ రెహమాన్ వారికి ఎన్నికల విధులపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్లకు ఎన్నికల ప్రక్రియలో అనుసరించాల్సిన విధి విధానాలను, చేపట్టాల్సిన భద్రతా చర్యల గురించి తీసుకోవాల్సిన అంశాలను వివరించారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారులు అనన్య అవస్థి, మీరా పీఆర్, ఎస్ అరుణ్ కుమార్, నిఖిల బసవరాజ్ పాటిల్, నివ్రాన్డ్ హన్స్, కునాల్ జైన్, కునాల్ ఉత్తమ్ స్రోతే, లెఫ్ట్నెంట్ యోంటెన్ ఫంటో(ఆర్బీపీ) ఉన్నారు. ఇక ఇంటి నుంచే ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ ఒంగోలు సెంట్రల్: ఇకపై నిరుద్యోగులు, యువకులు ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద నుంచి కాక ఇంటి నుంచే చేసుకునే నూతన విధానాన్ని, ప్రత్యేక పోర్టల్ను ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి టి.భరద్వాజ్ తెలిపారు. గతంలోలా ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం నేరుగా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని చెప్పారు. నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ అనుసంధానంతో పది, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు, నిరుద్యోగ యువత సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు అభ్యర్థులు www.employment.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. -
మేజర్ రోడ్ల అభివృద్ధి ఇలా..
ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని ఒంగోలు రూరల్ మండలం, కొత్తపట్నం మండలాల్లో గత 58 నెలలుగా రోడ్ల అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. గుత్తికొండవారిపాలెం నుంచి కరవది వరకు ఒక వంతెనతో పాటు తారు రోడ్డు నిర్మాణం చేపట్టారు. కరవది నుంచి చేజర్ల మీదుగా ఉలిచి వరకు నూతనంగా తారు రోడ్డు నిర్మాణం, చేజర్ల నుంచి అల్లూరు వరకు, చేజర్ల నుంచి ముదిగొండ వాగు మీద, అల్లూరు రోడ్డులో పోతురాజు కాలువపై రెండు వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. కరవది నుంచి గుండాయిపాలెం, కనపర్తి రోడ్డు నుంచి చిత్తాయిగారిపాలెం వరకు, ఒంగోలు నుంచి దశరాజుపల్లి వరకు, గుండాయిపాలెం నుంచి పాతపాడు వరకు, వెంగముక్కలపాలెం నుంచి సర్వేరెడ్డి పాలెం వరకు, పెళ్లూరు నుంచి యర్రజర్ల వరకు తారురోడ్డు కూడా పూర్తి చేశారు. ● ఒంగోలు–కొత్తపట్నం రోడ్డులో బకింగ్ హామ్ కెనాల్పై పూర్తి కాకుండా ఆగిపోయిన వంతెన నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ వంతెన నిర్మాణ పనులు కాంట్రాక్టర్ వద్ద నుంచి పర్సంటేజీలు రాకపోవటంతో అప్పటి ఎమ్మెల్యే దామచర్ల అడ్డుపడి పనులు పూర్తిగా ఆపేసిన సంగతి తెలిసిందే. ● రాజుపాలెం గ్రామం బస్టాండ్ నుంచి పెద్ద పట్టపుపాలెం వరకు రూ.30 లక్షలతో తారు రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేశారు. ఈతముక్కల నుంచి ఆలకూరపాడు వరకు రూ.1.07 కోట్లతో కల్వర్ట్లు, రోడ్డు నిర్మాణం కూడా పూర్తయింది. ● కొత్తపట్నం మార్కెట్ యార్డు నుంచి పల్లెపాలెం బీచ్ వరకు రూ.2.75 కోట్లతో తారు రోడ్డు నిర్మాణం, కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో సెంట్రల్ లైటింగ్ డివైడర్ పనులు చేపట్టారు. అందుకోసం రూ.46 లక్షల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ● ఒంగోలు, కొత్తపట్నం మండలాల్లో దాదాపు రూ.15 కోట్లతో గ్రామాల్లో అంతర్గత సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. రెండు మండలాలు కలిపి రూ.10.50 కోట్లతో సైడ్ కాలువ నిర్మించారు. రెండు మండలాలను కలుపుతూ గుండమాల, మెండుమాల బీచ్ రోడ్లు, గ్రావెల్ రోడ్లు కూడా ఏర్పాటు చేశారు. అందుకోసం రూ.20 కోట్లు ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. వాటిలో కొన్ని పనులు పూర్తికాగా, కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. -
శరవేగంగా నగర అభివృద్ధి
ఒంగోలు నగరంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 58 నెలల కాలంలో అభివృద్ధి పనుల వేగంగా చేపట్టాం. కేవలం రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలకు రూ.115 కోట్లకు పైగా ఖర్చు చేశాం. గతంలో ఎన్నడూ జరగని విధంగా రోడ్ల నిర్మాణం చేపట్టడంతోపాటు రోడ్లకు మరమ్మతులు కూడా నిర్వహించాం. అదేవిధంగా మురుగునీరు, వర్షపు నీరు సజావుగా బయటకు వెళ్లేందుకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచాం. గత టీడీపీ ప్రభుత్వంలో రోడ్లమీద రోడ్లు వేసి ప్రజాధనాన్ని లూటీ చేశారు. – బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే ఒంగోలు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఒంగోలు నగర అభివృద్ధిపై ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. నగర ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా రోడ్ల నిర్మాణంతోపాటు డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు వేగంగా చేపట్టేలా పరుగులు తీయించారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ ఏర్పాటు కాకముందు నుంచి కూడా వాసన్న నగర అభివృద్ధిపైనే ప్రత్యేక చొరవ చూపిస్తూ వచ్చారు. అందుకోసం కోట్లాది రూపాయలు వెచ్చించి సిమెంట్ రోడ్లతో పాటు మురుగునీరు, వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు వీలుగా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయించారు. – గంగాడ సుజాత, ఒంగోలు నగర మేయర్ -
మార్కాపురంలో కుండపోత వర్షం
మార్కాపురం రూరల్: మార్కాపురంలో కుండపోత వర్షం కురిసింది. మంగళవారం రాత్రి గంటన్నర వ్యవధిలో 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. మార్కాపురం పట్టణంతో పాటు సమీప గ్రామాల్లో కురిసిన వర్షానికి వీధులన్నీ జలమయమయ్యాయి. విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు గ్రామాల్లో తీగలు తెగిపడ్డాయి. వేములకోట గ్రామంలో హైఓల్టేజీ.. లోఓల్టేజీ రావడంతో పలు గృహాల్లో గృహోపకరణాలు కాలిపోయాయి. పిడుగుపాటుకు 100 గొర్రెలు మృతి మండలంలోని మాల్యవంతునిపాడు గ్రామంలో పిడుగుపడి పడి సుమారు 100 గొర్రెలు చనిపోవడంతో రూ.8 లక్షల మేర నష్టం సంభవించింది. దీంతో పశుపోషకులు లబోదిబోమంటున్నారు. ఏడు గొర్రెలు మృత్యువాత వెలిగండ్ల: మండలంలోని కొట్టాలపల్లిలో పిడుగు పడటంతో గ్రామంలోని గయపు రామాంజనేయులు చెందిన 7 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గొర్రెలను మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు రామాంజనేయులు కోరారు. -
కాపులకు చంద్రబాబు తీరని అన్యాయం
స్థానికందర్శి: ఇచ్చిన మాటకు కట్టుబడి మేనిఫెస్టోలో చెప్పిన దాని కంటే ఎక్కువ సాయం చేసిన వ్యక్తి సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. పట్టణంలో సందువారిపాలెం, ఎదురువారి బజారులలో బుధవారం మన దర్శి మన శివన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాపులంతా వైఎస్సార్ సీపీకి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. 2014లో చంద్రబాబు హామీ మేరకు కాపులకు ఏడాదికి వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.5 వేలు కోట్లు చెల్లిస్తానని హామీ ఇచ్చి..అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో కేవలం రూ.1340 కోట్లు మాత్రమే చెల్లించి మోసం చేశాడన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో కాపులకు ఏడాదికి రెండు వేల కోట్లు చొప్పున ఐదేళ్లకు రూ.10వేల కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చి..ఐదేళ్లలో రూ.34 వేల కోట్ల సాయం అందించారన్నారు. 2019 నుంచి 2023 వరకు కాపునేస్తం ద్వారా రూ. 2029.92 కోట్లు కాపు నేస్తం ద్వారా అందజేశారని చెప్పారు. డీబీటీ ద్వారానే కాపులకు నేరుగా తమ ఖాతాలకు రూ. 26,232.93 కోట్లు నగదు ఖాతాల్లో జమయ్యాయన్నారు. నాన్డీబీటీ కింద మరో రూ.7,772.19 కోట్లు కాపులకు అందించారన్నారు. జగన్ హయాంలోనే కాపులకు న్యాయం జరిగిందన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్గుర్తుపై ఓట్లేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ అమ్మవడి, చేయూత, ఆసరా వంటి పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. పేద పిల్లల కోసం ఇంగ్షష్ మీడియం స్కూల్ ప్రవేశపెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదన్నారు. బూచేపల్లి కుటుంబం అందరికీ సాయం చేసే మంచి గుణమని చెప్పారు. 20 ఏళ్లుగా నియోజకవర్గంలో సేవలందిస్తున్నామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రజలంతా వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీపీ సుధాఅచ్చయ్య, పట్టణ అధ్యక్షుడు కట్టెకోట హరీష్, జేసీఎస్ కన్వీనర్ ఎదురుకోటిరెడ్డి, నెడ్ కాప్ డైరెక్టర్ సానికొమ్ము తిరుపతిరెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కేసరి రాంభూపాల్రెడ్డి, వైస్ ఎంపీపీ సోముదుర్గారెడ్డి, రైతువిభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, వైఎస్సార్ సీపీ నాయకులు ఎదురు శ్రీనివాసరెడ్డి, ఎదురు నారాయణరెడ్డి, నారాయణ, వెన్నపూస మణి, సంజీవరెడ్డి, కర్ణా రమణారెడ్డి, కోటి, సుసీలాప్రతాప్, గర్నెపూడి సామ్యేల్, కర్ణా వెంకటరెడ్డి, గంజి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. క్లుప్తంగా జగనన్నతోనే కాపులకు న్యాయం కాపులంతా ఆలోచించి వైఎసార్ సీపీకి తమ మద్దతు తెలపండి కాపు సోదరులకు బూచేపల్లి కుటుంబం విజ్ఞప్తి -
జనం మెచ్చిన నాయకుడు జగనన్న
పుల్లలచెరువు: జనం మెచ్చిన నేత జగనన్నను మళ్లీ ఆశీర్వదించి, గెలిపిస్తే సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే మళ్లీ వస్తాయని యర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం రాత్రి పుల్లలచెరువు, మర్రివేముల గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు. అబద్ధపు హామీలిస్తూ మిమ్మల్ని మోసగించేందుకు వస్తున్న కూటమీ పార్టీలను నమ్మొద్దని కోరారు. ఇటీవల జగనన్న ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ను ప్రజలకు వివరిస్తూ రైతు భరోసా, అమ్మ ఒడి, పింఛన్కానుకతో పాటు అనేక సంక్షేమ పథకాలను పెంపు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అప్పట్లో చంద్రబాబు 600 కు పైగా హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చారని, తర్వాత వాటిలో ఏ ఒక్క కూడా అమలు చేయదేన్నారు. మళ్లీ ఆదే తరహాలో సూపర్సిక్స్ అంటూ మోసం చేసేందుకు చూస్తున్నారని తెలిపారు. రాత్రి మండలంలోని పలు గ్రామాలతో పాటు మర్రివేములలో ఉరుముల, మెరుపులులతో కూడిన భారీ వర్షం పడుతున్నా చంద్రశేఖర్ ప్రతి ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు వివరించి ఫ్యాన్ గుర్తు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ వెంకటయ్య, జెడ్పీటీసీ వాగ్యానాయక్, ఎంపీటీసీ రాములు, నాయకులు పీఏసీఎస్ డైరెక్టర్ రఘు, వై. రోసిరెడ్డి, మాజీ యూత్ అధ్యక్షుడు గడ్డం సుబ్బయ్య, వై. శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు కుందురు ఉమామహేశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్ రావూరి సుబ్బారావు, బచ్చయ్య యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రసాద్, కాశయ్య, హనుమంతరావు, వెంకటేశ్వర్లు, ఆనందరావు, గురువయ్య, దినేష్,ఆంజనేయులు వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అన్నా రాంబాబు మీ సేవకుడు
మార్కాపురం: నేను మీ సేకుడిని.. మీకు సేవ చేసేందుకే జగనన్న ఆశీస్సులతో మార్కాపురం నియోజకవర్గ నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే అన్నా రాంబాబు కోరారు. బుధవారం చింతగుంట్ల పంచాయతీలోని అయ్యగారిపల్లిలో టీడీపీకి చెందిన 15 కుటుంబాలు అన్నా రాంబాబు సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్క కుటుంబం అభివృద్ధి చెందిందని, అభివృద్ధి ఇంకా కొనసాగాలంటే మరోసారి జగనన్నను సీఎం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల ప్రకటించిన వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. చింతగుంట్ల పంచాయతీలోని అయ్యగారిపల్లికి చెందిన ఏరువ కృష్ణరెడ్డి, చల్ల వెంకటేశ్వర్లు, కందుల వెంకటరెడ్డి, కందుల శివారెడ్డి, దండ గోవర్ధన్రెడ్డి, బోగెం వెంకట సుబ్బయ్య, బొగెం గురవయ్య, వెన్న కాశిరెడ్డి, చల్ల కొండయ్య, గుండారెడ్డి నారాయణరెడ్డి, చేరుకుల చిన్న వెంకటరెడ్డి, దండా రామిరెడ్డి, చింతలపూడి బసిరెడ్డిలు వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేంత వరకూ నిరంతరం శ్రమిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో తాము వైఎస్సార్ సీపీని భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పారు. మాజీ ఎంపీపీలు పోలయ్య, చెంచిరెడ్డి, మందటి శివారెడ్డి ఉన్నారు. 15 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరిక -
మరొకరికి శాపం
చంద్రబాబు పాపం.. మద్దిపాడు: ఒకటో తేదీ ఉదయాన్నే వలంటీర్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందించే విధానాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకోవడం పలువురి పాలిట శాపంగా మారుతోంది. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించి వలంటీర్ల విధులను అడ్డుకుని చంద్రబాబు చేసిన పాపానికి మరో ప్రాణం పోయింది. మద్దిపాడు మండలంలోని బసవన్నపాలెం గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన గుంతోటి రామయ్య ఈ నెల 6వ తేదీ పెన్షన్ తీసుకోవడానికి మద్దిపాడు బ్యాంకుకు కుమారుని సాయంతో మోటార్ బైక్పై ఎండలో వెళ్లాడు. అక్కడ క్యూలో నిలబడి పెన్షన్ తీసుకుని మధ్యాహ్నం మండుటెండలో కాలినడకన ఇంటికి చేరాడు. బసవన్నపాలెం హైస్కూల్ వద్దకు వెళ్లే సమయానికి స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఒంగోలు ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. దీనిపై స్థానిక నాయకులు స్పందిస్తూ ఈ పాపం ఎవరిది చంద్రబాబూ అంటూ ప్రశ్నిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న మంత్రి మేరుగు నాగార్జున బుధవారం ఉదయం బసవన్నపాలెం చేరుకుని రామయ్య మృతికి సంతాపం తెలిపారు. వైఎస్సార్ సీపీ మండల ఇన్చార్జి భవాని ప్రసాద్ను మృతుని ఇంటికి పంపి మట్టి ఖర్చుల నిమిత్తం కొంత డబ్బును తన తరఫున మంత్రి అందించారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు మండవ అప్పారావు, జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు గుంతోటి రవీంద్రనాథ్, తదితరులు వెళ్లి సంతాపం తెలిపారు. పెన్షన్ కోసం ఎండలో బ్యాంకుకు వెళ్లి వ్యక్తి మృతి వలంటీర్లు ఇంటికెళ్లి పెన్షన్ అందించడాన్ని అడ్డుకున్న చంద్రబాబు -
No Headline
గిద్దలూరు రూరల్: జగనన్న పాలనలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాయని వైఎస్సార్ సీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ నాగార్జునరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని త్రిపురాపురం, నరవ, ఎన్.బయనపల్లె, కొమ్మునూరు గ్రామ పంచాయతీల్లోని బ్రాహ్మణపల్లె, నల్లగట్ల గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. అన్ని వర్గాల ప్రజలకు జగనన్న ప్రభుత్వం అండగా ఉందన్నారు. గడప గడపకు ప్రభుత్వ పథకాలను చేరవేసిన ఏకై క ప్రభుత్వం వైఎస్సార్ సీపీ మాత్రమేనన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను గురించి ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వ సేవలన్నీ గ్రామాల్లో ఇంటి ముంగిటకే వచ్చి చేరాయన్నారు. చంద్రబాబు మోసపు హామీలను నమ్మి ఎవ్వరూ మోసపోవద్దన్నారు. జగనన్న చెప్పింది తప్పక చేస్తాడన్నారు. మోసపు హామీలతో ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. పేదల పక్షంగా నిలబడి పరిపాలన కొనసాగిస్తున ఏకై క నాయకుడు జగన్మోహన్రెడ్డి అని గుర్తుచేశారు. అందరం కలిసి కట్టుగా జగనన్నకు అండగా నిలబడాల్సిన సమం ఇదే అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, నరర సర్పంచ్ బండి శ్రీనివాసులు, తంబళ్లపల్లె సర్పంచ్ రామాంనేయులు, వైఎస్సార్ సీపీ నాయకులు ఓబులరావుయాదవ్, నాగేశ్వరరావు, వెంకటస్వామి, చేరెడ్డి రంగస్వామిరెడ్డి పాల్గొన్నారు. -
పేదల ఉసురు తీసిన చంద్రబాబు
ఒంగోలు: వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలంగా మంచంలో ఉండిపోయిన వారికి ఇంటివద్దకే అందాల్సిన పెన్షన్ వలంటీర్ల ద్వారా అందకుండా చేసి చంద్రబాబు 70 మంది పేదల ఉసురు తీశారని లిడ్ క్యాప్ చైర్మన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ అన్నారు. బుధవారం స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. వలంటీర్ల వ్యవస్థపై ఆది నుంచి చంద్రబాబుకు కడుపుమంటే అన్నారు. అందులో భాగంగానే వారి గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసి వారి మనోభావాలను దెబ్బతీశారన్నారు. ఎన్నికల సమయంలో వలంటీర్ల వ్యవస్థ ద్వారా పెన్షన్లు అందిస్తే వైఎస్సార్ సీపీ పట్ల పెన్షనర్లు కృతజ్ఞత కనబరుస్తారనే ఉద్దేశంతో వలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయవద్దంటూ ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేయించడం, ఈసీ వెంటనే నిర్ణయం వెలువరించడంతో పెన్షన్ కోసం ఎండలో బ్యాంకులకు వెళ్లి పడిగాపులు కాసి దాదాపు 70 మంది మృత్యువాత పడ్డారన్నారు. చంద్రబాబు ఫిర్యాదు, ఈసీ నిర్ణయం వెరసి రాష్ట్రంలో ఇంతమంది ప్రాణాలను బలిగొందన్నారు. ఆన్గోయింగ్ పథకాలపై కూడా ఎన్నికల కమిషన్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుంటే కేవలం ఏపీలో మాత్రమే ఎన్నికల కమిషన్ ఆంక్షలు ప్రత్యేకంగా ఉండటంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందన్నారు. తెలంగాణలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వవచ్చు, రైతు బంధు ఇవ్వవచ్చు, కానీ.. ఏపీలో మాత్రం ఇన్పుట్ సబ్సిడీ, రాయితీతో కూడిన విత్తనాల పంపిణీని సైతం నిలిపివేయాలనే నిబంధనలు దేనికి సంకేతమో గమనించాలన్నారు. కానీ, 2019 ఎన్నికల సమయంలో కేవలం ఎన్నికలకు నాలుగు రోజుల ముందు కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం పసుపు–కుంకుమ (న్యూ స్కీమ్) పేరుతో రూ.3,900 కోట్లను డ్వాక్రా మహిళలకు పంపిణీ చేసిందని గుర్తుచేశారు. అప్పుడు లేని అభ్యంతరం నేడు ఆన్గోయింగ్ స్కీములకు ఎందుకని కాకుమాను రాజశేఖర్ ప్రశ్నించారు. పథకాల నగదు విడుదలకు అభ్యంతరం చెప్పడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇటువంటి వివక్ష పూరిత నిర్ణయాలు సరికాదని, ఇప్పటికే ఈ వ్యవహారం హైకోర్టు దృష్టికి చేరినందున హైకోర్టులో సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నామని అన్నారు. ఏపీ ప్రజలు ఆలోచనాపరులు, శక్తివంతులు అని, పేదల సంక్షేమంపై కన్నెర్ర చేసిన పార్టీలకు ఉనికి కూడా లేకుండా చేస్తారని ఆకాంక్షించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రూ.610 కోట్లు, 7 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.847 కోట్లు, ఇంకా పేదల సంక్షేమానికి సంబంధించిన పలు పథకాలకు నిధులు నిలిపివేయించిన టీడీపీ కూటమి పార్టీలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజానీకం సమాయత్తం కావాలన్నారు. ప్రస్తుతం పేదలు, పెత్తందారుల మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో పేదలే విజేతలుగా నిలవాలంటే.. ప్రతి పేదవాడు 13వ తేదీ ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు రావాలని రాజశేఖర్ పిలుపునిచ్చారు. -
ఇంటింటికీ మేలు చేశాం...ఆశీర్వదించండి
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మేలు చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే సహించలేని చంద్రబాబు అడ్డంకులు సృష్టించి నిరుపేద ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఎన్నికల్లో గెలిచిన తరువాత కనీసం ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, ఇప్పుడు సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మడం లేదని చెప్పారు. మంగళవారం ఉదయం 3, 5వ డివిజన్లో ఆయన ప్రచారం నిర్వహించారు. మిలిటరీ కాలనీ నుంచి బలరాం కాలనీ, పొనుగుపాటి కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, భరత్ కాలనీలలో రోడ్ షో నిర్వహించారు. 5వ డివిజన్లో అగ్జిలియం స్కూలు నుంచి 4వ లైను ఎక్స్టన్షన్ వరకు నిర్వహించిన రోడ్ షోలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. బాలినేని మాట్లాడుతూ నగరంలో 25 వేల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశామని, వచ్చే 9 నెలల్లో ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఇస్లాంపేటలో చిన్న వర్షం కురిసినా రోడ్ల మీదకు నీరు చేరేదని, మురికి నీరు కూడా చేరి ప్రజలు నానా ఇబ్బందులు పడేవారని, కోటి రూపాయలతో డ్రైనేజీ కాలువ నిర్మించడంతో సమస్య పరిష్కారమైందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మించి ఒంగోలు నగరం మొత్తం మురుగు నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారంలో 3వ డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి మధు, 5వ డివిజన్ కార్పొరేటర్ పద్మావతి రంగారావు, డివిజన్ అధ్యక్షుడు షేక్ జాఫర్, సత్యనారాయణ రెడ్డి, బొంతా గంగాధర్, మోహన్ రావు, వెంకటరావు, చాపలనాగరాజు, శ్రీకాంత్, తంబి, శ్రీనురెడ్డి, షేక్ సుభాని, రమిజా, జ్యోతి, సుభాని, పేదిరెడ్డి , బాలమ్మ, బాలలక్ష్మి, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జలీల్, షాజహాన్ పాల్గొన్నారు. బాపూజీ కాంప్లెక్స్లో అడుగడుగునా బ్రహ్మరథం: బాపూజీ కాంప్లెక్స్లో బాలినేని నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వ్యాపారులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. బాలినేని ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నగర మేయర్ గంగాడ, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, పార్టీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్, గొర్రెపాటి శ్రీనివాసరావు, బాపూజీ కాంప్లెక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి సత్యనారాయణ, నాయకులు ఎస్ఆర్ శ్రీనివాసరావు, కే ప్రభాకరరావు, ఇ.సత్య శ్రీనివాసులు, బీ వరదరాజమ్, షౌకత్ అలి, బాషా, ఒంగోలు బుజ్జి, తాతా బదరి పాల్గొన్నారు. -
మీలో ఒకడినై ఉంటా...ఆదరించండి
● మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ టంగుటూరు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి ఎంపీగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మీ ఒకడిగా అందరికీ అందుబాటులో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి, వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మండలంలోని అనంతవరం పంచాయతీ పరిధి తేటుపురం, తాళ్లపాలెం, పసుముద్ర, వెలగపూడి గ్రామాల్లో పల్లె పల్లెకు సిద్ధం కార్యక్రమంలో మంత్రి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలకు అందాల్సిన సంక్షేమ లబ్ధిని దోచేశారన్నారు. సీఎం జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నవరత్నాల్లో చేర్చి అర్హత గలిగిన ప్రతి ఒక్కరికీ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించారన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన అందిస్తుంటే కూటమి నేతలు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ క్యాడర్లో ఉత్సాహం: ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రచారం విజయపథం వైపు దూసుకెళ్తోంది. కొన్ని నెలల ముందు మాత్రమే నియోజకవర్గ బాధ్యతలు చేపట్టినప్పటికీ తక్కువ సమయంలోనే నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మొత్తం 112 పంచాయతీల్లో ప్రచారాన్ని దాదాపు పూర్తి చేశారు. టంగుటూరు మండలంలోని అనంతవరం పంచాయతీలోని తేటుపురంలో యువకులు ఉత్సాహంతో 250 ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ మన నేత జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవటానికి మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గెలిపించుకుంటామని నినాదాలు చేశారు. మహిళలు హారతులు పట్టారు. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి బలమైన ఓటింగ్ ఉన్నా నాయకుల మధ్య గ్రూపుల బెడదతో 2014, 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యామని, ఈ సారి ఆ తప్పిదం జరగనివ్వకుండా చూస్తామని నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు కదలాలన్నారు. మనమంతా ఒకే వర్గం.. అది జగనన్న వర్గమని అందరం ఏకతాటిపై ఉండి కొండపి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరవేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు చింతపల్లి హరిబాబు, పార్టీ మండల అధ్యక్షుడు మల్లవరపు రాఘవరెడ్డి, జెడ్పీటీసీ మన్నం అరుణకుమారి, పార్టీ నాయకుడు ఏవీఎస్ రాజు, సర్పంచ్ ఉప్పలపాటి శివరామరాజు, ఎంపీటీసీ కసుకుర్తి కోటేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్ ఉప్పలపాటి నాగరాజు, ఉప్పలపాటి సుబ్బరాజు, శారీమందిర్ వెంకటేశ్వర్లు, మర్రి భాస్కరరెడ్డి, రాజు వేణుగోపాలరెడ్డి, రాజు నాగరెడ్డి, మంత్రి శ్రీనివాసరెడ్డి, జిల్లా చంద్ర, మిడసల సుబ్బారావు, కసుకుర్తి రమేష్, కన్నా వెంకట్రావు, కన్నా శ్రీను, తమ్మినేని లక్ష్మి నరసింహస్వామి, మెండా శ్రీను, గుంతోటి శ్రీను, బొడపాటి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
ఒంగోలు అర్బన్: సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. మంగళవారం ప్రకాశం భనంలోని కంట్రోలు రూములో ఎన్నికల నిర్వహణపై విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 13వ తేదీ జరిగే పోలింగ్ ప్రక్రియకు సంబంధించి పటిష్టమైన భద్రతతో ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎం కమిషన్ ప్రక్రియ కూడా మంగళవారంతో పూర్తి చేశారన్నారు. ఇప్పటి వరకు 80 శాతం ఓటరు స్లిప్లు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో మొత్తం 18,22,470 మంది ఓటర్లు ఉండగా 14,46,495 మందికి ఓటరు స్లిప్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో నూరు శాతం పూర్తి చేస్తామన్నారు. 8 నియోజకవర్గాల్లో హోమ్ ఓటింగ్తో కలిపి మొత్తం 22,132 పోస్టల్ బ్యాలెట్లలో ఈ నెల 6వ తేదీ నాటికి 16,215 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోలు రూములో 08592–288599 నంబర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. సీ–విజిల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై సమగ్రంగా విచారణ చేసి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 12వ తేదీ జిల్లాలోని నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సంబంధిత పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ పార్టీలను పంపేందుకు అవసరమైన 486 వాహనాలను సిద్ధం చేశామన్నారు. పోలింగ్ సిబ్బంది బస చేసేందుకు అన్నీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రూ.3.83 కోట్ల విలువైన సరుకును సీజ్ చేశామన్నారు. ఎంసీసీ వైలేషన్ కింద 67 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇళ్ల పట్టాలు దొంగ పట్టాలని ప్రచారం చేస్తే చర్యలు: పేదలకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను దొంగ పట్టాలని అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందంటే ఒక అథంటికేషన్తో ఇళ్ల పట్టాలు ఇస్తుందన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే ఈసీ చూసుకోవచ్చన్నారు. ఇళ్ల పట్టాలపై వచ్చిన అసత్య ప్రచారాలపై వచ్చిన ఫిర్యాదులపై విచారించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టాల రిజిస్ట్రేషన్కు సంబంధించిన వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయన్నారు. ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కీలక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు, కేంద్ర బలగాలతో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 263 రూట్ మొబైల్, 56 క్విక్ రెస్పాన్స్ బృందాలు, 22 స్ట్రైకింగ్ ఫోర్స్లో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు, 9 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు పనిచేస్తాయన్నారు. వీటితో పాటు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, తమిళనాడు పోలీసులు, స్థానిక పోలీసులతో మరికొన్ని బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనిలో డీఆర్ఓ శ్రీలత, కమాండ్ కంట్రోలు రూము నోడల్ అధికారి వరకుమార్, ఏఓ శ్రీకాంత్ ఇతర అధికారులు పాల్గొన్నారు. పోలింగ్కు పటిష్టమైన ఏర్పాట్లు ఈవీఎం కమిషన్ పూర్తి చేశాం, 80 శాతం ఓటరు స్లిప్లు పంపిణీ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరగకుండా పక్కా నిఘా ఇళ్ల పట్టాలపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు విలేకర్ల సమావేశంలో కలెక్టర్ దినేష్కుమార్ -
పచ్చ గద్ద
అభివృద్ధి పనుల నిధుల్లో పర్సెంటేజీలు నొక్కడం.. అడ్డగోలుగా పనులు చేస్తున్నా కిమ్మనకుండా చోద్యం చూడటం.. భూములు కబ్జా చేసి అప్పనంగా సొమ్ము చేసుకోవడం.. ఇసుకను తెగనమ్మి జేబులు నింపుకోవడం.. పేదలకు న్యాయంగా దక్కాల్సిన పథకాలకు ఉద్దేశపూర్వకంగా కత్తెర వేయడం.. ఇదీ 2014–19 మధ్య టీడీపీ జమానాలో సంతనూతలపాడు నియోజకవర్గంలో పచ్చ నేతల వ్యవహార శైలి. అక్రమాలకు అడ్డు తగిలిన వారిపై కేసులు బనాయించి, సర్పంచ్ల చెక్ పవర్ సైతం రద్దు చేయించడంలో బీఎన్ విజయ్కుమార్ చూపిన అత్యుత్సాహాన్ని నియోజకవర్గ ప్రజలు ఇంకా మరువలేదు. గత ఎన్నికల్లోనూ ఇక్కడ తుకై ్కన సైకిల్కు మరమ్మతులు చేసి మళ్లీ పెత్తనం చేయాలని ఆయన తహతహలాడుతున్నారు. పేరుకే పెద్ద..సాక్షి నెట్వర్క్ : సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో గుండ్లకమ్మ పరివాహక ప్రాంతంలో టీడీపీ నేతలు రోజుకు 300 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా రవాణా చేసి రూ.కోట్లు సంపాదించారు. మల్లవరం, కొలచనకోట, వెల్లంపల్లి, గాజులపాలెం, మద్దిపాడు, రాచవారిపాలెం, నందిపాడు, ఇనమనమెళ్లూరు గ్రామాల్లో వారు ఇస్టానుసారంగా ఇసుక తవ్వి సొమ్ము చేసుకున్నారు. మల్లవరం వద్ద ఇసుక రీచ్ ఏర్పాటు చేస్తే తమ పొలాలు పోతాయని అన్నంగి గ్రామస్తులు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టారు. పొలాల అంచుల్లో ఇసుక తోడుతుండడంతో మట్టిపెళ్లలు విరిగి పడి సన్నపోగు చిన్నయ్య(49) అనే ట్రాక్టర్ డైవర్ మరణించాడు. అప్పటి తహసీల్దార్ ఇసుక రీచ్ను మూసివేసినా టీడీపీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి మళ్లీ తవ్వేందుకు అనుమతిచ్చారు. ఈ అక్రమాలు, అరాచకాల వెనుక బీఎన్ విజయ్కుమార్ ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కాసులు కురిపించిన నీరు–చెట్టు టీడీపీ జమానాలో 2015 నుంచి 2018 వరకు నియోజకవర్గంలో 529 పనులు మంజూరు కాగా రూ.41.12 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో సుమారు రూ.20 కోట్లు టీడీపీ ముఖ్య నేతలు, వారి అనుచరుల జేబుల్లోకే చేరాయి. నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయిన్లు, ఇతర యంత్రాలు వినియోగించి, అధికారుల నోరు నొక్కేసి బిల్లులు డ్రా చేసుకున్నారు. ఉపాధి హామీ పనులు చేసిన ప్రదేశాల్లోనే నీరు–చెట్టు పేరుతో పనులు చేపట్టినట్లు చూపి బిల్లులు పొందడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. మూడు మీటర్ల కంటే ఎక్కువ లోతు తవ్వకూడదన్న నిబంధనలు తుంగలో తొక్కి మట్టిని తెగనమ్ముకుని అదనంగా సంపాదించుకున్నారు. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో మాజీ సైనికోద్యోగి నార్నె శ్రీనివాసరావుకు 2006లో ప్రభుత్వం ఇచ్చిన 3.60 ఎకరాల భూమిలో నీరు–చెట్టు కింద చెరువు మట్టి తవ్వేశారు. గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఆ పనికి రూ.10 లక్షలు బిల్లు పెట్టి.. అందులో వచ్చిన మట్టి అమ్ముకుని మరో రూ.10 లక్షలు సంపాదించాడు. ఇదే తరహాలో నియోజకవర్గంలో నీరు–చెట్టు పనుల్లో దోపిడీ సాగింది. విజయ్కుమార్ అండదండలతో వారు మరింతగా రెచ్చిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమానికి కత్తెర టీడీపీ జమానాలో రాజకీయ నిరుద్యోగులైన కార్యకర్తలకు పదవులు కట్టబెట్టాలనే ఉద్దేశంతో అధికారికంగా ప్రొటోకాల్ కల్పిస్తూ తీసుకొచ్చిన జన్మభూమి కమిటీలు ప్రజలకు చుక్కలు చూపించాయి. ప్రభుత్వ ఇళ్లు, పింఛన్లు, పేదలకు ఇచ్చే రుణాలు, గృహాల మంజూరులో లబ్ధిదారులు టీడీపీకి చెందిన వారేనా.. ? కాదా..? అని ఆరా తీస్తూ, కులాల వారీగా ఎంపిక చేశారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారితోపాటు సామాన్యులకు పథకాలు దక్కకుండా జన్మభూమి కమిటీలు చూపిన వివక్ష అంతా ఇంతా కాదు. ప్రొటోకాల్కు తూట్లు గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబునాయుడు 2014–19లో రాజకీయ కుసంస్కారానికి తెరతీశాడు. ఎమ్మెల్యేలను పూచికపుల్లలా పక్కన పెట్టి ఓడిన టీడీపీ అభ్యర్థులకు పవర్స్ కట్టబెట్టేశారు. ఇలాంటి దారుణమైన ప్రోటోకాల్ సిస్టం గతంలో ఎప్పుడూ లేదు. 2014 ఎన్నికల్లో సంతనూతలపాడు ఎమ్మెల్యేగా వైఎస్సార్ సీపీ నుంచి ఆదిమూలపు సురేష్ గెలుపొందినా.. టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిన బీఎన్ విజయకుమార్కు పెత్తనం అప్పగించారు. అప్పట్లో పోలీసులు విజయకుమార్కు సెల్యూట్ చేస్తూ స్వాగతం పలికిన దృశ్యాలు చూసిన వారంతా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నియంతృత్వ దేశంలో ఉన్నామా? అనే ముక్కున వేలేసుకున్నారు. రామతీర్థం రిజర్వాయర్ వద్ద సాగర్ జలాలను వదిలే సమయంలో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్కు సమాచారం ఇవ్వకపోగా, విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యేను కట్ట నుంచి వెనక్కి నెట్టేసిన బీఎన్.విజయకుమార్, దామచర్ల జనార్దన్ తీరు రాజకీయంగా సంచలనంగా మారింది. టీడీపీ నేతల దుందుడుకు చర్యలపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసిన సురేష్, అసెంబ్లీలోనూ ఎండగట్టారు. కనపర్తి వద్ద ప్రభుత్వ భూమిలో టీడీపీ నేతలు అక్రమంగా ఏర్పాటు చేసిన రొయ్యల చెరువులు (ఫైల్)సర్పంచ్లపై వేధింపులు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లుగా గెలుపొందిన వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల చెక్పవర్ను రద్దు చేయించడం, ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఏమాత్రం సహకరించకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్న సంఘటనలు నేటికీ సజీవంగానే ఉన్నాయి. చీమకుర్తి మండలంలోని గాడిపర్తివారిపాలెం సర్పంచ్ సూడిదేల సుబ్బరామిరెడ్డి, ఎర్రగుడిపాడు సర్పంచ్ గంగిరేకుల వెంకట్రావు చెక్పవర్ను రద్దు చేయించి ఇష్టారాజ్యంగా వ్యహరించారు. పెత్తనానికి తహతహ టీడీపీ జమానాలో సంతనూతలపాడు నియోజకవర్గంలో ప్రజా ధనం లూటీ నీరు–చెట్టు నిధుల దోపిడీ, భూ కబ్జాల్లో పోటీ పడిన పచ్చ చొక్కాలు జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమ పథకాలకు కత్తెర నాడు.. వైఎస్సార్ సీపీ మద్దతుదారులైన సర్పంచ్ల చెక్పవర్ రద్దు తెలుగు తమ్ముళ్ల దోపిడీకి అండగా నిలిచిన బీఎన్ విజయ్కుమార్ -
వడ్డెరల మద్దతు వైఎస్సార్ సీపీకే
దర్శి: వడ్డెరుల మద్దతు వైఎస్సార్ సీపీకేనని సంఘం జాతీయ అధ్యక్షుడు తన్నీరు ధర్మరాజు పేర్కొన్నారు. స్థానికంగా మంగళవారం జరిగిన వడ్డెరల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2004లో వైఎస్సార్ సీఎం అయిన వడ్డెరులను ఎన్నో ఉన్నత పదవులు కేటాయించారన్నారు. వడ్డెరలకు ఫైనాన్స్ ఫెడరేషన్, ఎమ్మెల్యే సీటు, హస్తకళ చైర్మన్, నాలుగు మున్సిపల్ చైర్మన్లు, స్థానిక సంస్థల్లో అవకాశాలు కల్పించారన్నారు. వడ్డెరల సామాజిక స్థితి, జీవన విధానాలను గమనించిన వైఎస్సార్..ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కేబినేటిలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడిడ్ వడ్డెరులకు ఎమ్మెల్సీ సీటు, మిర్చి యార్డు చైర్మన్గా రెండు పర్యాయాలు చేశారన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు రాజకీయంగా వడ్డెరలకు ఎలాంటి పదవులు ఇవ్వలేదన్నారు. 2014లో మాచర్ల స్థానానికి నామినేషన్ వేసుకోమని హామీ ఇచ్చి మోసం చేశాడన్నారు. ఇప్పుడు కూడా పుటపర్తి అసెంబ్లీ, హిందూపురం ఎంపీ స్థానాలు కేటాయిస్తామని చెప్పి చివరకు మోసం చేశాడని విమర్శించారు. వడ్డెరలను ఆదరిస్తున్న వైఎస్సార్సీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ డైరెకటర్లు మల్లె విమల, రామకృష్ణ, యనమల మాధవి, చందవరం ఎంపీటీసీ రాజు, వడ్డెర సంఘం నాయకులు చల్లా నారాయణరాజు, దేవండ్ల తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు తన్నీరు ధర్మరాజు -
ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా ఉండండి
మార్కాపురం: ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దినేష్కుమార్ చెప్పారు. మంగళవారం ఆయన మార్కాపురం పట్టణంలో పర్యటించారు. ఎస్వీకేపీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమును, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ భద్రపరిచిన తీరును, భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కల్పిస్తున్న భద్రతా ఏర్పట్లపై సబ్కలెక్టర్ రాహుల్మీనా, డీఎస్పీ బాలసుందరరావుతో మాట్లాడారు. భద్రతా పరమైన లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాత్రి సమయాల్లో లైటింగ్, పోలింగ్ రోజు సాయంత్రం ఏర్పాటు చేయాల్సిన బారికేడ్ల ఏర్పాటు తదితర అంశాలపై ఆర్ఓ రాహుల్మీనాకు సూచనలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పరిశీలన: అనంతరం ఆయన స్థానిక జెడ్పీ బాలుర పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సదుపాయాలు, మౌలిక వసతులు, పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరూ వారికి కల్పించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు కోసం ఒక ఉద్యోగికి యూపీఐ విధానంలో ఒకరు డబ్బులు పంపినట్లు వచ్చిన వార్తలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఉద్యోగి తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల తనిఖీ: మార్కాపురం మండలంలోని పెద్దనాగులవరం ఎంపీపీ పాఠశాల, నికరంపల్లి, జమ్మనపల్లి, కోలభీమునిపాడు ఎంపీపీ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను రిటర్నింగ్ అధికారి రాహుల్మీనాతో కలిసి కలెక్టర్ దినేష్కుమార్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలపై పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ రవికుమార్, సెక్టార్ ఆఫీసర్ డీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
చంద్రబాబు బూటకపు హామీలు నమ్మొద్దు
పొదిలి: చంద్రబాబు బూటకపు హామీలను నమ్మొద్దని వైఎస్సార్ సీపీ మార్కాపురం అభ్యర్థి అన్నా రాంబాబు అన్నారు. మండలంలోని ఆముదాలపల్లి, తీగదుర్తిపాడు, రాములవీడు, రామాపురం, సూదనగుంట గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన పథకాలతో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. పెట్టుబడి సాయం, సున్నా వడ్డీకే రుణాలు, రైతులకు గిట్టుబాటు ధరలు, రైతు భరోసా వంటి పథకాలు రైతులకు అండగా ఉన్నాయన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో టీడీపీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. రాష్ట్రంలో ఒక్క రైతుకై నా యాక్టు వల్ల అన్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేయడం తప్ప జగనన్నకు మరో ఆలోచన ఉండదన్నారు. 2014లో కల్లబొల్లి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసం చేశాడన్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేయకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఏపీఐఐసీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ నీతి నిజాయితిలే పెట్టుబడిగా, పేదల సేవలో తరిస్తున్న అన్నా రాంబాబును, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డిలను ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శులు జి.చెన్నారెడ్డి. జి.శ్రీనివాసులు, కల్లం సుబ్బారెడ్డి, బ్రహ్మాకొండారెడ్డి, నలబోలు వెంకటరెడ్డి, గోపిరెడ్డి మాలకొండారెడ్డి, మద్దిరాల నరసింహారెడ్డి, సర్పంచ్లు ఎస్.శ్రీనివాసరావు, కసిరెడ్డి కోటిరెడ్డి, కొత్తపులి బ్రహ్మారెడ్డి, కొత్తపులి అంజిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పొన్నపాటి శ్రీనివాసరెడ్డి, యేటి ప్రసాద్, ఇనగనూరి చెన్నారెడ్డి, ఎద్దు నగేష్, కసిరెడ్డి రమణారెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ మార్కాపురం అభ్యర్థి అన్నా రాంబాబు -
No Headline
ఒంగోలు: మైనార్టీల సంక్షేమానికి, అభివృద్ధికి అండగా ఉంటున్న వైఎస్సార్ సీపీకే మైనార్టీల మద్దతు అని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మీర్జా షంషీర్ ఆలీ బేగ్ పేర్కొన్నారు. స్థానిక హజ్ కమిటీ డైరెక్టర్ బాషాతో కలిసి నగరంలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మైనార్టీలకు అగ్రతాంబూలం దక్కిందన్నారు. నామినేటెడ్ పదవుల్లో 50శాతం పదవులు అట్టడుగు వర్గాల వారివే అన్నారు. మైనార్టీలకు 13 కార్పొరేషన్ చైర్మన్లు, నాలుగు ఎమ్మెల్సీలు ఇప్పటికే కేటాయించడంతో పాటు తాజాగా జరగనున్న ఎన్నికల్లో 7 ఎంఎల్ఏ స్థానాలను మైనార్టీలకు కేటాయించారన్నారు. మైనార్టీల జీవన ప్రమాణాల పెంపుకు, రాజకీయంగా ఉన్నత స్థాయిని కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయన్నారు. దీనికంతటికి కారణం ముఖ్యమంత్రి జగనకు పేదలపై ఉన్న అభిమానం మాత్రమే అన్నారు. ఇంతటి భాగ్యాన్ని మాకు కల్పించిన వైఎస్సార్ సీపీకి కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రతి ఒక్క మైనార్టీ ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డికి, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్లే నేడు వేలాది మంది మైనార్టీ యువత ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకుని జీవన ప్రమాణాలు పెంచుకున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మీర్జా షంషీర్ ఆలీ బేగ్ గుర్తు చేశారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మీర్జా సంషీర్ ఆలీ బేగ్ -
బాలినేనికి బ్రహ్మరథం
ఒంగోలు: ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని 22, 25, 26 డివిజన్లలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గాంధీరోడ్డు బాలినేనికి బ్రహ్మరథం పట్టారు. కోర్టుసెంటర్లో భారీ గజమాలతో స్వాగతం పలికారు. వ్యాపారులు వెండి కిరీటం అలంకరించారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు మాట్లాడుతూ బాలినేని అందరివాడన్నారు. ఆర్యవైశ్యులకు ఏదైనా సమస్య ఉందంటే తప్పకుండా ఆదుకునే మనస్తత్వం బాలినేనిదన్నారు. ఇటీవల బాపూజీ కాంప్లెక్స్లో షాపు దగ్ధమైతే వ్యక్తిగతంగా ఆదుకున్న బాలినేని వంటి మనసు అందరిలో చూడలేమన్నారు. కరోనా సమయంలో ఆర్యవైశ్యులకు వాసన్న ఎంతో అండగా నిలిచారని కొనియాడారు. ఆర్యవైశ్యుల ఆరామక్షేత్రానికి స్థలం కేటాయించడంలోను, బాపూజీ గో సంరక్షణశాల సమస్యను పరిష్కరించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంలో మీరు చూపిన సహకారం మరువలేనిదన్నారు. తాను చివరిసారిగా పోటీచేస్తున్న ఎన్నికల్లో తనకు మరోమారు అవకాశం కల్పించాలన్నారు. ఇటీవల ఇళ్ల పట్టాల పంపిణీలోనూ ఈ మూడు డివిజన్లకు చెందిన ఆర్యవైశ్యులు, బీసీలు, కాపులు, ముస్లింలకు కూడా అందించామన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నగర మేయర్గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, నగర అధ్యక్షుడు కటారి శంకర్, ఒంగోలు సూపర్బజార్ చైర్మన్ తాతా బదరీనాథ్, దాసరి నారాయణరావు, దాసరి సుబ్రహ్మణ్యం, పట్నం మధుసూధనాచారి, త్రిపురం మల్లికార్జునరావు, తిరుపతిరెడ్డి, తుల్లి శివ, అయ్యప్ప, సుజాత, తిరుపతి, డివిజన్ అధ్యక్షులు గంటా అంజి, అజయ్, చలం, 26వ డివిజన్ అధ్యక్షుడు జాజుల కృష్ణ, మాతాశిశు వైద్యశాల డైరెక్టర్ సాధం విజయలక్ష్మి, డివిజన్ ఇన్చార్జి కటారి ప్రసాద్, వేమూరి శ్రీనివాసులు, కో ఆర్టినేటర్ మనోజ్కుమార్, అమరాశ్రీను, బాపూజీ కాంప్లెక్స్ చైర్మన్ కోడూరి సత్యం, గొర్రెపాటి శ్రీనివాసరావు, 22వ డివిజన్ కార్పొరేటర్ కారంశెట్టి రామపుష్పలత, మాజీ కౌన్సిలర్ కోడూరి సుధారాణి కిషోర్, గుర్రం బదరీనాథ్, బియ్యపు విజయ్, పచ్చిపులుసు శ్రీనివాసరావు, తమ్మన ఆంజనేయులు, మునగా కృష్ణారావు, నల్లమల్లి కుమార్, నల్లమల్లి అనీల్, వాయగల శ్రీను, కొణిజేటి శ్రీను, తాతా శ్రీనివాసులు, తాళ్లూరి లక్ష్మీనారాయణ, అన్నంకోట శ్రీను, ఏల్చూరి రాఘవ, ఏల్చూరి రవి, మాజీ కౌన్సిలర్ జ్వాలాపతి దామరాజు క్రాంతికుమార్, బాబు, ఈమని మధు తదితరులు పాల్గొన్నారు.
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..
చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ధనుష్ కుమారుడు.. మార్కులెన్నో తెలుసా..?
చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"
యదార్థ సంఘటనలతో ‘ప్రేమించొద్దు’
తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి
రాయ్ లక్ష్మీ బర్త్డే సెలబ్రేషన్స్.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)
రాజంపేట లో అశేష ప్రజా స్పందన
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement