-
నారహంతకుడు!
● వృద్ధులు, వికలాంగులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు ● జగన్ చేస్తున్న మంచిని ఓర్వలేకే కుట్రలు ● వెంకటగిరి ప్రచారంలో నేదురుమల్లి ధ్వజం వెంకటగిరి(సైదాపురం): ‘ఎన్నికల వేళ నారా చంద్రబాబునాయుడు తన నిజ స్వరూపాన్ని బయట పెట్టారు. 55 నెలలుగా ఇంటి వద్దకే పాలన అందిస్తున్న విధానంపై కక్షగట్టారు. తన అనుచరుల ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించారు. వలంటీర్ల వ్యవస్థను పక్కనబెట్టించారు. అంతటితో ఆగక అవ్వాతాతల చావుకు కారణమవుతూ రాక్షసానందం పొందుతున్నారు’ అని వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పేద ప్రజలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న మంచిని ఓర్వలేక ప్రజల అసువులు కోరే నర హంతకుడిగా తయారయ్యారని విరుచుకుపడ్డారు. వెంకటగిరి పట్టణంలో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈసందర్భంగా పట్టణ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అనంతరం నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో సంక్షేమ పథకాలు గడపవద్దకే అందించిన ఘనత సీఎం జగనన్నకే దక్కుతుందన్నారు. దీన్ని ఓర్వలేక చంద్రబాబునాయుడు పనిగట్టుకుని వృద్ధులు, దివ్యాంగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను కాపీ కొట్టి ప్రజలకు మోసపూరిత మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై రెండు ఓట్లు వేసి జగనన్న సైనికులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో వెంకటగిరి రాజా కుటుంబీకులు సర్వజ్ఞకుమారయాచేంద్ర, వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకులు కొడవలూరు ధనంజయ్యరెడ్డి, సూళ్లూరుపేట అదనపు పరిశీలకులు కలిమిలి రాంప్రసాద్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, పట్టణ కన్వీనర్ జీ.ఢిల్లీబాబు, జిల్లా సహాయ కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, న్యాయ వాది ఎల్.కోటేశ్వరరావు, వైస్ చైర్మన్లు ఎస్.బాలయ్య, సీహెచ్ ఉమామహేశ్వరి, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
అధికార దాహంతో పేట్రేగుతున్న కూటమి
● ప్యాకేజీ స్టార్కు రాజకీయ పరిణితి లేదు ● అవినీతి, అరాచకాలకు బ్రాండ్ అంబాసిడర్ ఆరణి ● 45వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే భూమన ధ్వజం తిరుపతి మంగళం: ‘అధికారమే ధ్యేయంగా.. అరాచక పాలనే లక్ష్యంగా.. కూటమి నేతలు పేట్రేగిపోతున్నారు’ అని టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి 45వ డివిజన్లో మంగళవారం కార్పొరేటర్ డాక్టర్ అనీష్రాయల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకూ వెళ్లి జగనన్న అందించిన సంక్షేమం, తిరుపతిలో అభినయ్ చేసిన అభివృద్థిని స్థానిక ప్రజలకు ఆయన వివరించారు. రానున్న ఎన్నికల్లో సీఎంగా జగనన్నను, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ చంద్రబాబు, పవన్కళ్యాణ్కు అధికార దాహం తప్ప ప్రజాసంక్షేమం అవసరం లేదన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరికీ మేలు చేసిన పాపానపోలేదన్నారు. అందుకే ఒంటరిగా ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం లేక జనసేన, బీజేపీతో పొత్తుపెట్టుకుని మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రజలకు మంచి చేసి ఉంటే కూటమిగా ఏర్పడాల్సిన అవసరం ఉండేదా? అని ప్రశ్నించారు. పదేళ్లుగా పవన్కళ్యాణ్ రాజకీయంలో ఉన్నా కనీస అవగాహనలేక, ప్రజామద్దతు లభించక ఏమి చేయాలో దిక్కుతోచక చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఫ్యాకేజీలతో సర్దేస్తున్నారని ఆరోపించారు. రూ.30కోట్లు లంచం తీసుకుని తిరుపతి జనసేన టికెట్ను ఆరణి శ్రీనివాసులుకు ఇచ్చారంటే ఎంత ప్యాకేజీ స్టారో అర్థమవుతోందన్నారు. చిత్తూరు రౌడీయిజం పనికిరాదు ప్రశాంతమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చిత్తూరు రౌడీయిజాన్ని తీసుకొచ్చి అరాచకాలు సృష్టిస్తున్నాడని ఎమ్మెల్యే భూమన మండిపడ్డారు. చిత్తూరులో ఆరణి జీవితం అవినీతి, అరాచకాలతో నిండిందని, అక్కడ దోచు కుని, దాచుకున్న డబ్బుల్లో రూ.30 కోట్లు పవన్కళ్యాణ్కు లంచంగా ఇచ్చి తిరుపతిలో జనసేన టికె ట్ తెచ్చుకున్నారని ఆరోపించారు. చిత్తూరులోని ప్రజలకు చిన్నపాటి మేలు కూడా చేయలేదని తమ నాయకుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆరణికి టికెట్ ఇవ్వలేదని గుర్తుచేశారు. తిరుపతి ప్రజలు భూమన కుటుంబానికి ఇస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తమపై నోటికి వచ్చిన ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు తిరుపతిలో కూటమి పేరుతో అందరూ ఒక్కటయ్యారన్నారు. తిరుపతి ప్రజలంతా అభినయ్కే మద్దతుగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పార్టీ నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్రెడ్డి, నాయకులు కదిరి రా జేంద్ర, రాజేశ్వరి, మాధవనాయుడు పాల్గొన్నారు. -
ఈత.. కడుపు కోత
● ఈతకు వెళ్లి బాలుడి మృతి ● శోకసంద్రంలో కుటుంబ సభ్యులు చంద్రగిరి: ఈతకు వెళ్లి బాలుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని యల్లంపల్లి చెరువులో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు.. భీమవరం గ్రామానికి చెందిన ప్రవీణ్(16) తన అమ్మమ్మతో ఉంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ప్రవీణ్ మరికొంత మంది స్నేహితులతో కలసి యల్లంపల్లిలోని చెరువులో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో చెరువులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు ప్రవీణ్ నీట మునిగాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో తోటి స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించారు. అనంతరం గ్రామంలోని గజ ఈతగాళ్లు ప్రవీణ్ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. సుమారు 3 గంటల పాటు శ్రమించి ప్రవీణ్ మృతదేహాన్ని బయటకు తీశారు. తమ కళ్లెదుటే బిడ్డ మృతి చెందడంతో గ్రామస్తులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టబడిన మద్యం ఆరణిదేనా..?
తిరుపతి తుడా : బంగారుపాళ్యం వద్ద పోలీసులకు పట్టుబడిన కర్ణాటక మద్యం తిరుపతిలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుకు చెందినదనే వార్తలు గుప్పుమన్నాయి. ఎన్నికల సందర్భంగా తిరుపతి ప్రజలను మత్తులో ముంచి ఓట్లు వేయించుకునేందుకే ఆయన రూ.లక్షల విలువైన మద్యం తెప్పిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనసేన అభ్యర్థిగా ఆరణి తిరుపతిలో అడుగు పెట్టినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆయన అంతటి ఘనుడే అని అర్థమవుతోందని కూటమి నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అసంతృప్తి నాయకులకు డబ్బు ఎరవేసి కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. రూ.కోట్లు వెదజల్లి, ప్రలోభాలకు గురిచేసి, రౌడీయిజం చేయించి ఈ ఎన్నికల్లో గట్టెక్కాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పుకుంటున్నారు. తిరుపతి పవిత్రత దెబ్బతీస్తున్నారంటూ ఎల్లోమీడియాలో నిత్యం నోరేసుకుని పడిపోయే కూటమి నేతలకు ఆరణి ప్రలోభాల పర్వం కనిపించడం లేదా అని స్థానికులు మండిపడుతున్నారు. ఓట్ల కోసం అసాంఘికశక్తులను తిరునగరిలోకి తీసుకువచ్చిన వారికి ఎలా మద్దుతు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. -
కళ్లుగప్పి
ఎన్నికల వేళ జిల్లాలోకి కర్ణాటక మద్యం యథేచ్ఛగా ప్రవేశిస్తోంది. ఓటర్లను మత్తులో ముంచేందుకు సరిహద్దులను దాటి చొరబడుతోంది. ఈ మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ నిఘాను కట్టుదిట్టం చేసింది. ఈ క్రమంలోనే మంగళవారం బంగారుపాళ్యం వద్ద రూ.లక్షల విలువైన కన్నడ లిక్కర్ తీసుకువస్తున్న ఓ కంటెయినర్ పోలీసులకు పట్టుబడింది. విచారణలో ఈ లోడ్ తిరుపతికి వెళుతున్నట్లు వెల్లడైంది. మద్యం తరలింపు వెనుక కూటమి అభ్యర్థుల హస్తం ఉన్నట్లు తెలిసింది.చిత్తూరు అర్బన్ : ఎన్నికల సందర్భంగా ప్రలోభాల పర్వం మొదలైంది. ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇందులో కూటమి అభ్యర్థులు విచ్చలవిడిగా ఓటర్లకు ఎరవేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మద్యం బాటిళ్లను వెదజల్లి ఓట్లు రాబట్టుకోవాలని యత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడి ప్రభుత్వ వైన్షాపుల్లో క్వార్టర్ కొనాలంటే కనీసం రూ.130–రూ.150 చెల్లించాల్సిఉంటుంది. అదే కర్ణాటకలో అయితే కేవలం రూ.35కు టెట్రా ప్యాకెట్, రూ.75కు క్వార్టర్ దొరుకుతోంది. దీంతో చీప్గా కన్నడ మద్యం కొనుగోలు చేసి జిల్లాకు అక్రమంగా తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్మగ్లింగ్ వ్యవహారానికి కూటమి అభ్యర్థులు పకడ్బందీ ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.రూ.లక్షల మద్యం పట్టివేతఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో కూటమి అభ్యర్థులు మరింత బరితెగిస్తున్నారు. ఓటర్లకు తాయిలాలతో ఎరవేస్తున్నారు. అందులో భాగంగా కర్ణాటక నుంచి చీప్ లిక్కర్ తెప్పించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం బంగారుపాళ్యం సమీంలోని టోల్గేటు వద్ద ఓ కంటైనర్ను పోలీసులు అడ్డుకున్నారు. అందులో పరిశీలిస్తే రూ.43 లక్షల విలువైన కర్ణాటక మద్యం కనిపించింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తే విస్తుబోయే వాస్తవాలు వెలుగుచూశాయి. మద్యం లోడ్ను తిరుపతికి తరలిస్తున్నట్లు నిందితులు వెల్లడించారు. ఇందులో కూటమి పార్టీలకు చెందిన నేతలు కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. కర్ణాటకలో తక్కువ ధరకే మద్యం కొనుగోలు చేసి ఇక్కడి ఓటర్లకు పంపిణీ చేయాలని ప్లాన్ వేసినట్లు వివరించారు. ఇందుకోసం కూటమి అభ్యర్థులు తమ పార్టీలకు చెందిన కొందరు నేతలతో కలిసి మొత్తం వ్యవహారం నడిపించిట్లు తెలిసింది ముందుగా బెంగళూరుకు చెందిన ప్రకాష్ అనే వ్యక్తి ద్వారా 713 బాక్సుల కర్ణాటక మద్యాన్ని ఓ కంటైనర్లోకి ఎక్కించుకుని నామాల ముని కేశవ (కిరణ్) మరో ఇద్దరు జిల్లాకు బయలుదేరారు. సోమవారం రాత్రి నంగిలి వద్ద ఈ కంటైనర్ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తే, తప్పించుకున్నారు. చివరకు బంగారుపాళ్యం వద్ద, కంటైనర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితులు పరారయ్యేందుకు యత్నించగా పోలీసులు వెంటబడి పట్టుకున్నారు. మద్యం స్మగ్లింగ్లో పూతలపట్టుకు చెందిన టీడీపీ నేత హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరికి కుప్పం నియోజకవర్గానికి పచ్చ నేత సహకరించినట్లు తెలిసింది. కంటెయినర్లోని మద్యంలో కొంత పూతలపట్టులో డంప్ చేసి మిగిలింది తిరుపతి తరలించాలని తమకు ఆదేశాలు అందినట్లు నిందితులు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. మద్యం స్మగ్లింగ్కు సహకరించిన కారణంగా కుప్పానికి చెందిన తెలుగునాడు స్టూడెంట్ ఫెరడేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్పై పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు సమాచారం. అలాగే కర్ణాటకలో మద్యం విక్రయించిన బెంగళూరుకు చెందిన డిస్టిలరీ యజమాని, వైన్షాప్ ఓనర్, క్యాషియర్పై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఒకప్పుడు ఎన్నో కష్టాలు.. పాన్ ఇండియా హీరో అయ్యాడు!
వేసవిలో నెయ్యిని తీసుకుంటే బోలెడన్ని లాభాలు!
టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు
HBD Pat Cummins: సన్రైజర్స్ కెప్టెన్ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
జేపీ నడ్డాకు పోలీసుల సమన్లు
కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు: లక్ష్మీ పార్వతి
ఉద్యోగుల తొలగింపు..టీసీఎస్లో అసలేం జరుగుతోంది?
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
పాక్ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
తప్పక చదవండి
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement