-
కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో మూడు రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం కూడా ఔటర్ రింగ్ రోడ్డులోని ఆక్టోపస్ వద్ద నుంచి క్యూలు ఉన్నాయి. వేసవి సెలవులు, వారాంతపు రద్దీకి తోడు దేశం నలుమూలల నుంచి వచి్చన భక్తులతో తిరుమల పోటెత్తింది సాధారణంగా మేలో అధిక రద్దీ ఉంటుంది. శుక్ర, శని, ఆదివారాలు కావడంతో ఇది గరిష్ట స్థాయికి చేరింది. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు జేఈవో వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఇంజినీరింగ్, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్, వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, తాగు నీరు అందించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. -
ఆరంభం.. నృసింహుని సంబరం
పెంచనకోనలో శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితులు శాస్త్రోక్తంగా అంకురార్పణతో సంబరాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ముందుగా ఉగ్రరూపుడైన నృసింహుడు నవ వరుడిగా ముస్తాబు చేసి గోనుపల్లె నుంచి ఊరేగింపుగా కోనకు వేంచేపు చేశారు. ఆదిలక్ష్మి.. చెంచులక్ష్మి సమేతంగా పల్లకిపై కొలువుదీరిన శ్రీవారు మంగళవాయిద్యాల నడుమ పెనుశిల క్షేత్రం చేరుకున్నారు. వేడుకగా నిర్వహించిన స్నపన తిరుమంజసేవలో సేదతీరారు. విశేష సంఖ్యలో భక్తులు దేవదేవేరులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ● ఊరేగింపుగా కోనకు చేరిన దేవదేవేరులు ● వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ● శాస్త్రోక్తంగా అంకురార్పణరాపూరు: పెంచలకోనలో స్వయంభువుగా వెలసిన శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమైయ్యాయి. అందులో భాగంగా గోనుపల్లెలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మీదేవితో కలసి స్వామివారు పెంచలకోనకు బయలుదేరారు. కొత్త అల్లుడు ఉభయనాంచారులతో కలసి కోనకు చేరుకోవడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమమైనట్లు ప్రధాన అర్చకులు పెంచలస్వామి,సీతారామయ్యస్వామి తెలిపారు. పెళ్లి కొడుకై న పెంచలస్వామి హిరణ్యకశిపుని వధానంతరం ఉగ్రరూపుడైన నృసింహ స్వామివారు వెలుగొండలలో సంచరిస్తుండగా చెంచురాజు (గిరిజనరాజు) కుమార్తె చెంచులక్ష్మి చెలిమితో శాంతించి ఆమెను వివాహమాడినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. అప్పటి నుంచి గోనుపల్లె గ్రామంలోని ఉత్సవ విగ్రహాలకే పెంచలకోనలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏటా గోనుపల్లెలో పెంచలనరసింహస్వామి పెళ్లి కొడుకుగా ముస్తాబై కోనకు తరలివెళతారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం గోనుపల్లె నుంచి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా గిరిజనకాలనీకి తీసుకొచ్చారు. గిరిజనులు సంప్రదాయబద్ధంగా ఇంటి అల్లుడు, కుమార్తెకు (స్వామి, అమ్మవార్లకు) ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టతేనె, ఇంజేటి గడ్డలు, సారపప్పు, పెడ మల్లెలు, బందారు ఆకులతో భాసికం, ఎల్లగడ్డలు, తండేడుతో తాళిబొట్టు, స్వామివా రికి కట్నంగా ఇచ్చే ఆరినార మొలతాడును సాంగ్యంగా చెల్లించారు. అనంతరం స్వామి, అమ్మవార్లు పల్లకిలో ఊరేగుతూ పెంచలకోనకు చేరుకున్నారు.శ్రీవారి సమర్పణకు అడవి గడ్డలు తీసుకువస్తున్న గిరిజనులు విద్యుద్దీపకాంతులీనుతున్న పెనుశిల క్షేత్రంఅంకురార్పణతో శ్రీకారం పెనుశిల లక్ష్మీనరసింహస్వామికివారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. స్వామివారి నందనవనంలోని పుట్టమట్టిని తీసుకొచ్చి అందులో నవధాన్యాలు కలిపి వేదమంత్రోచ్ఛరణాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాల్లో ఆలయ డీసీ సాగర్బాబు, చెంగాళమ్మ ఆలయ ఏసీ వెంకటేశ్వర్లు, సీఐ సుబ్రమణ్యం, ఎస్ఐ మాల్యాద్రి పాల్గొన్నారు. వేడుకగా స్నపన తిరుమంజనం కోనలోని క్రేన్ మండపంలో మధ్యాహ్నం 12 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.స్వామి,అమ్మవార్ల ఉత్సవర్లకు పాలు, తేనె, పెరుగు, చందనం, వివిధ పండ్ల రసాలు, కొబ్బరినీళ్లుతో అభిషేకం చేశారు. -
బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
నారాయణవనం : నారాయణవనంలో వెలసిన పద్మావతీ సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ చేయనున్నారు. 9 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం రోజూ ఉదయం, రాత్రి వివిద వాహనాలపై స్వామి వారు ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని అలయంలో చలువ పందిళ్లు వేసి, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. మాడ వీధుల్లో దశావతార మూర్తుల కటౌట్లను ఏర్పాటు చేశారు. ఆలయ అధికారి నాగరాజు, ప్రధాన అర్చకుడు శ్రీధరభట్టాచార్య మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ శనివారం గరుడసేవ, 27వ తేదీ సోమవారం ఉదయం రథోత్సవం, సాయంత్రం 7 గంటలకు జరిగే ఆర్జిత కల్యాణోత్సవంలో రూ 1,000 చెల్లించి దంపతులు పాల్గొనవచ్చునని తెలిపారు. 29వ తేదీ బుధవారం పద్మసరస్సులో చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహనంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయని వివరించారు. -
కౌంటింగ్కు పటిష్ట బందోబస్తు
తిరుపతి క్రైమ్ : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు కల్పించనున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్రాజు తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఎస్పీ కార్యాలయం సిబ్బంది గౌరవ వందనం చేసి, పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఎస్పీ మాట్లాడుతూ కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఇటీవల జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని తిరిగి ప్రజా విశ్వాసం చూరగొనేలా సమష్టిగా పనిచేస్తామని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించేలా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ముగిశాయని, లెక్కింపు మాత్రమే మిగిలి ఉందన్నారు. ఇప్పటికే ప్రజలు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం చేయబడిందని వెల్లడించారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో పని చేయటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇలాంటి పుణ్యక్షేత్రంలో గొడవలు జరగడం చాలా దురదృష్టకరమని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు. కౌంటింగ్ సందర్భంగా రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇస్తామని, ఇబ్బంది కలిగించే వారిని నిర్బంధిస్తామని తెలిపారు. అనంతరం ఆయనకు ఏఎస్పీలు, డీఎస్పీలు శుభాకాంక్షలు తెలిపారు. -
రాడ్తో దాడి చేసినా సీఐ ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
కీలకమైన స్ట్రాంగ్ రూమ్ ఉన్న శ్రీపద్మావతి మహిళా వర్సిటీ ముందు వేలాది మంది గుమికూడి ఆందోళ న చేస్తుంటే వద్దని వారించిన తిరుపతి రూరల్ సీఐ తమీమ్ అహ్మద్పై చిత్తూరు నుంచి వచ్చిన పులివర్తి నాని అనుచరులు రాడ్తో దాడి చేశారు. సీఐ తలపై బలంగా కొట్టడంతో రక్తగాయాలు అయ్యాయి. అడ్డుకున్న కానిస్టేబుల్ను సైతం గొంతుపట్టుకుని చంపేందుకు యత్నించారు. యూనివర్సిటీ పోలిస్స్టేషన్ సీఐపై కూడా దాడికి యత్నించారు. రక్తగాయా లు అయిన సీఐ కూడా ఎందుకు ఫిర్యాదు ఇవ్వలేద ని సిట్ బృందం ఆరా తీసింది. నాని బెదిరింపులతోనే సీఐ ఫిర్యాదుపై వెనక్కితగ్గినట్లు సమాచారం. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో క్యూలైన్ ఆక్టోపస్ బిల్డింగ్ వరకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 90,721 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 50,599 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.28 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉన్న వారికి 2 గంటల్లో దర్శనమవుతోంది. నేటి నుంచి న్యాయమూర్తులకు శిక్షణ తిరుపతి లీగల్ : తిరుపతిలోని శ్వేత భవనంలో సోమవారం నుంచి 24వ తేదీ వరకు రాయలసీమ జిల్లాల్లోని 30 మంది న్యాయమూర్తులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తిరుపతి మండల న్యాయ సేవా సంస్థ సిబ్బంది తెలిపారు. ఉదయం 9 గంటలకు ఈ శిక్షణ తరగతులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్పీడీ వెన్నెల స్వాగతోపన్యాయం చేయనున్నట్లు చెప్పారు. ముఖ్యఅతిథిగా తిరుపతి ఐదో అదనపు జిల్లా జడ్జి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇన్చార్జి జడ్జి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ జి.రామ్గోపాల్ హాజరు కానున్నట్లు వివరించారు. సీనియర్ ట్రైనర్లు సుదర్శన్ సుందర్ ప్రసాద్, సుబ్బన్న ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఓ మోస్తరు వర్షం తిరుపతి అర్బన్ : మండే ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలను వరుణుడు కరుణించాడు. తొలకరితో పలకరించి ఉపశమనం కలిగించాడు. జిల్లాలో రెండు రోజులుగా పడుతున్న చిన్నపాటి వర్షాలతో వాతావరణం చల్లబడింది. ప్రధానంగా శనివారం జిల్లాలో 198.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చంద్రగిరిలో 76.6 మిల్లీమీటర్లు, ఎర్రావారిపాళెం–1.0, వెంకటగిరి– 52.2, రామచంద్రాపురం–19.4, రేణిగుంట–19.2, నాగలాపురం–4.2, వడమాలపేట–4.0, తొట్టంబేడు–3.6, డక్కిలి–3.4, తిరుపతి రూరల్– 2.8 , కేవీబీపురం–2.8, శ్రీకాళహస్తి–2.2, నారాయణవనం–2.0, బాలాయపల్లె–1.6, పుత్తూరు–1.2, సూళ్లూరుపేట– 1.0, బుచ్చినాయుడుకండ్రిగలో 0.6 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆదివారం జిల్లాలో 63.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యంది. పాకాలలో 25.2 మిల్లీమీటర్లు, చిన్నగొట్టిగల్లు–24.4, ఎర్రావారిపాళెం–10.8, చంద్రగిరిలో 2.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు వివరించారు. భక్తులతో కిక్కిరిసిన బోయకొండ చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజారెడ్డి, ఈఓ చంద్రమౌళి ఆధ్వర్యంలో ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు. -
కంటైనర్ను ఢీకొన్న లారీ
– డ్రైవర్కు గాయాలు శ్రీకాళహస్తి(తొట్టంబేడు): తిరుపతి– శ్రీకాళహస్తి మార్గంలో రాచగున్నేరి వద్ద కంటైనర్ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. కార్ల లోడ్తో వస్తున్న కంటైనర్ను తిరుపతి వైపు వస్తున్న ఖాళీ లారీ ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించబోయి ఢీకొంది. దీంతో వైఎస్సార్ జిల్లా నందలూరుకు చెందిన లారీ డ్రైవర్ కృష్ణయ్య(45) కేబిన్లో ఇరుక్కుపోయాడు. స్థానికులు శ్రమించి కృష్ణయ్యను బయటకు తీశారు. 108లో చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని తిరుపతికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీకాళహస్తి రూరల్ సీఐ అజయ్కుమార్ తెలిపారు. ఇదెక్కడి 144 సెక్షన్..? – వారపు సంతలో కిక్కిరిసిన జనం చంద్రగిరి : నియోజకవర్గంలో పోలింగ్ రోజు, తర్వాత గొడవలు చెలరేగిన నేపథ్యంలో అధికారులు 144 సెక్షన్ విధించారు. నలుగురుకు మించి జనం గుడికూడదని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పంచాయతీ అధికారులు సైతం వారపు సంతను రద్దు చేస్తున్నట్లు మూడు రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఆదివారం వారపు సంత మామూలుగా సాగడంతో పెద్ద సంఖ్యలో జనం రోడ్డుపైకి చేరుకున్నారు. దీంతో చంద్రగిరి టవర్క్లాక్ సెంటర్ జనంతో నిండిపోయింది. 144 సెక్షన్ను అమలు చేయాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
అనుక్షణం.. అప్రమత్తం
తిరుపతి అర్బన్ : కౌంటింగ్ పూర్తయ్యే వరకు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ పోలీసులు విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఆదేశించారు. ఎస్పీ హర్షవర్ధన్రాజుతో కలిసి ఆదివారం పద్మావతి మహిళా వర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ముందు సందర్శకుల రిజిస్టర్లో సంతకం చేశారు. అనంతరం ఆయన బ్యారికేడింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణ కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ పెంచల కిషోర్, ఏఎస్పీలు వెంకట్రావు, కులశేఖర్, రాజేంద్ర, శ్రీనివాస రావు, చంద్రగిరి ఆర్ఓ నిషాంత్ రెడ్డి, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
మమ్మేలు.. మాతంగి
● వైభవంగా తాతయ్యగుంట గంగమ్మజాతర ● భక్తులతో కిక్కిరిసిన ఆలయం ● పొంగళ్లు పొంగించి మొక్కులు చెల్లించుకున్న మహిళలు ● ఇంటింటా పూజలందుకున్న మాతంగి వేషధారులు తిరుపతి కల్చరల్ : తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా ఐదో రోజు ఆదివారం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ఉత్సవాల్లో భాగంగా కై కాల కులస్తులు మాతంగి వేషం ధరించి నగరంలో భక్తుల ఇంట పూజలు అందుకున్నారు. మాతంగి అమ్మవారిని భక్తులు తమ ఇంటికి ఆహ్వానించి పూజలు చేసి హారతులు సమర్పించారు. జాతర మొక్కుబడిలో భాగంగా వందలాది మంది వివిధ వేషధారణలతో నగరంలో సందడి చేశారు. గంగమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారి పాదాల చెంత ప్రణమిల్లి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దసంఖ్యలో మహిళలు పొంగళ్లు పొంగించి నైవేద్యం సమర్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో గంగమ్మ ఆలయం కిక్కిరిసింది. అమ్మవారి మూలవిరాట్కు అర్చకులు విశేష పూజలు నిర్వహించి మాతంగి అలంకరణలో కొలువుదీర్చారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక అభిషేకాలతో శాంతి అమ్మవారి జాతర చాటు నుంచి మాతంగి వేషం రోజు వరకు విభిన్నరీతుల్లో వేషధారణలతో అలసిన గంగమ్మతల్లిని శాంతింపజేసేందుకు సోమవారం అర్ధరాత్రి 12.15 గంటలకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. క్షీరం, పంచామృతం, నారికేళ జలం, పసుపు నీటితోపాటు ఇతర మంగళద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. అనంతరం మూలమూర్తికి విశేష పుష్పాలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. నేడు సున్నపు కుండల వేషాలు తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా ఆరో రోజు సోమవారం ఇద్దరు కై కాల కులస్తులు సున్నపు కుండల వేషాలు ధరిస్తారు. పెద్దగంగమ్మ, చిన్నగంగమ్మలకు ప్రతీకలుగా వీరు భక్తుల ఇంట పూజలు అందుకుంటారు. అలాగే మొక్కుబడిలో భాగంగా భక్తులు చప్పరాలు ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోనున్నారు. -
శాస్త్రోక్తం.. ధ్వజారోహణం
శ్రీకాళహస్తి మండలం ఊరందూరులోని చెన్నకేశవస్వామి ఆలయం ధ్వజపటం ఎగురవేస్తున్న దృశ్యం శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఊరందూరులో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఆలయంలో ఆదివారం ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంకురార్పణతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టి సర్వదేవతలకు ఆహ్వానం పలికారు. ఈ నెల 28వ తేదీ వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిపించనున్నారు. ఈ సందర్భంగా ఉభయదేవేరీ సమేతంగా శ్రీవారు హంసవాహనంపై ఊరేగారు. పెద్దసంఖ్యలో భక్తులు దేవదేవేరులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ముక్కంటి ఆలయ కమిటీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈఓ ఎస్వీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. – శ్రీకాళహస్తి -
సేద్యం.. సన్నద్ధం
● ఖరీఫ్కు అనుకూలిస్తున్న వాతావరణం ● 65,250 హెక్టార్లలో సాగుకు అవకాశం ● దుక్కులకు సిద్ధమవుతున్న రైతాంగం ● విత్తనాలు.. ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం తిరుపతి అర్బన్ : వరుణుడి కరుణతో పుడమి పులకించింది. జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండడంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో 65,250 హెక్టార్లలో పంటల సాగు చేపట్టనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పలు ప్రాంతాల్లో రైతులు పొలాలను దుక్కిదున్నుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసింది. అన్నదాతలు సైతం విత్తనాల కోసం రైతుభరోసా కేంద్రాలకు(ఆర్బీకే) వెళ్లి తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఈ పక్రియ జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని ఆర్బీకేల్లో మొదలైంది. ముందుస్తుగానే ప్రభుత్వం సైతం విత్తనాలను రైతు భరోసా కేంద్రాలకు సరఫరా చేసింది. 50శాతం సబ్సిడీతో జీలగలు, జనుములు, పిలిపెసర, 40శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు అందించేందుకు చర్యలు చేపట్టింది. మరోవైపు ఎరువుల సరఫరాపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపు పంటల సాగు చేసే సమయంలో రైతులు ఆర్ధిక ఇబ్బందులు పడకుండా ప్రభత్వం ఖరీఫ్ సాగు ముందే ఏటా అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా కింద రూ.5,500 చొప్పున పెట్టుబడి సాయం జమ చేస్తోంది. అయితే ఈసారి ఎన్ని కల నేపథ్యంలో వీటిని జమ చేస్తారా, లేదా? అని రైతులు ఆందోళన చెందుతున్నారు. పథకాల సొమ్ములను జమ కాకుండా ఆపాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి అడ్డుకున్న ప్రతిపక్ష పార్టీలు.. ఇప్పుడైనా రైతు భరోసా నిధులు విడుదల చేయనిస్తారా, లేదా? అన్నది వేచి చూస్తున్నారు. -
సర్వభూపాల వాహనంపై సర్వాంతర్యామి
తిరుపతి కల్చరల్ : శ్రీగోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజుఆదివారం రాత్రి శ్రీవారు పాండురంగస్వామి ఆలంకరణలో సర్వభూపాల వాహనంపై ఊరేగారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు కళా బృంద ప్రదర్శనలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ వేడుకగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు స్వామివారి కల్పవృక్షవాహన సేవను కనులపండువగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిపించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనాలతో విశేషంగా అభిషేకం చేశారు. కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఎఫ్ఏ అండ్ సీఏఓ బాలాజీ, ఆలయ డిప్యూటీ ఈఓ శాంతి, ఆగమ సలహాదారులు సీతారామాచార్యులు, మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ మోహనరావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయులు పాల్గొన్నారు. -
No Headline
నాని అరాచకాలు● ఎన్నిక అనంతరం టీడీపీ అభ్యర్థి నాని కూచువారిపల్లెకు చెందిన చంద్రగిరి ఏఎంసీ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి తల్లిని పక్కకు తోసేసి, ఆ ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇంట్లోని వస్తువులు కాలి బూడిదయ్యే వరకూ నాని, నాని అనుచరులు అక్కడే ఉన్నారు. ● కూచువారిపల్లిలో ఓ బాలుడిని స్వర్ణముఖి నది వద్దకు తీసుకెళ్లి అతనిపై యూరినేషన్ చేసి అమానవీయంగా చితకబాదారు. ● కూచువారిపల్లెలో రామిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్రెడ్డిని రక్షించడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని చుట్టుముట్టారు. ఆయన రెండు కార్లను పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ● మోహిత్రెడ్డి అంగరక్షకుడుగా ఉన్న ఈశ్వర్రెడ్డిని ఓ ఇంట్లో కట్టేసి కొట్టారు. మోహిత్ రెడ్డితోపాటు ఉన్న వేణురెడ్డిని బలవంతంగా కొటాల గ్రామం వద్దకు తీసుకెళ్లి చెప్పులతో కొట్టారు. వళ్లంతా వాతలు పడేలా చితకబాదారు. ● కూచువారిపల్లి రోడ్డుపై నిలబడి ఉన్న బాలుడు కవలికరెడ్డి మర్మాంగాలపై టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తన్ని గాయపరిచారు. ● తిరుపతి రూరల్ పరిధిలోని రామానుజంపల్లి పోలింగ్ కేంద్రం సమీపంలో నిలబడి ఉన్న ఉపేందర్రెడ్డి, మాధవరెడ్డి, ప్రదీప్రెడ్డిపై దాడికి తెగబడ్డారు. ● తిరుచానూరు ఎంపీటీసీ నరేష్రెడ్డిపై పులివర్తి నానీతోపాటు చిత్తూరు నుంచి వచ్చిన రౌడీలు ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. ● పులివర్తి నానితో వచ్చిన రౌడీలు తిరుపతి రూరల్ మండలం, కుంట్రపాకం గ్రామ మాజీ సర్పంచ్ బుచ్చిరెడ్డి కొడుకు అవినాష్రెడ్డిని ఒళ్లంతా బ్లేడ్లతో కోశారు. ● పాకాల మార్కెట్యార్డ్ మాజీ చైర్మన్ నంగా నరేష్ రెడ్డి కొడుకు లవంత్రెడ్డి రెండు చేతుల వేళ్లు రక్తం కారేలా కోసేశారు. బీటెక్ చదువుతున్న ఇతను ప్రస్తుతం పరీక్షలు కూడా రాయలేని పరిస్థితి. ● చెవిరెడ్డి మోహిత్రెడ్డి నామినేషన్ కార్యక్రమం పూర్తిచేసుకుని తిరుపతి నుంచి ఇంటికి వెళ్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కారుపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ● అగరాల గ్రామంపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. ● ‘తమ ప్రభుత్వం వస్తే మీ అంతు చూస్తాం. రోడ్లపై కూడా తిరగనివ్వం’ అంటూ పులివర్తి నాని, అతని అనుచరులు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలను నిత్యం ఫోన్లు చేసి భయపెట్టడం రివాజుగా మారుతోంది. ● పులివర్తి నాని భార్య సుధా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ దాడులకు పిలుపునిచ్చారు. దీనిపై సిట్ బృందం విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలోకార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేయబడతాయిసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి జూన్ 25వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు ● బ్రైడల్ మేకప్స్●● ఒబెసిటీ అండ్ న్యూట్రిషియన్ డైట్ ● హెయిర్ మసాజ్ ● కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్ ● ఫేషియల్స్ ● యాంటి యేజింగ్, థర్మో హెర్బ్ ఫేషియల్స్ ● డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్ ● హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ ● హెయిర్ కట్స్ ● హెయిర్ స్టైల్ ● హెన్నా ప్రిపరేషన్ ● డై అప్లికేషన్● త్రె డ్డింగ్ ● వ్యాక్స్ ● పెడిక్యూర్ ● మెనిక్యూర్ ● బ్లీచింగ్ ● స్కిన్ కేర్ ● హెయిర్ కేర్ ● వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్ వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు24–05–2024 నుంచి 22–06–2024 వరకు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకురిజిస్ట్రేషన్స్ మరియు శిక్షణా స్థలం : Ananga Beauty Studio @ institute, Biragipatteda, Arch Road, Above Canara Bank, Tirupatiసంప్రదించాల్సిన నంబర్లు : 95534 54335, 96666 97219 -
జగన్ ముఖ్యమంత్రి కావాలని పూజలు
వరదయ్యపాళెం: ఆంధ్రప్రదేశ్కు మళ్లీ వైఎస్.జగన్మోహన్రెడ్డే సీఎం కావాలని కోరుతూ కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్, ఆయన సతీమణి చైతన్య భాను ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం ఆయన తన మిత్రుడు భానుప్రకాష్ రెడ్డి కుటుంబీకులతో కలసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పేదలకు మేలు చేసిన జగనన్న మళ్లీ సీఎం అయ్యేలా ఆశీర్వదించాలని స్వామివారిని వేడుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. శాస్త్రోక్తంగా తైలాభిషేకం శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని శనీశ్వరస్వామికి శనివారం శాస్త్రోక్తంగా తైలాభిషేకం నిర్వహించారు. స్వామివారికి నువ్వుల నూనె, మంచి నూనె, పాలు, పెరుగు, చందనం, నారికేళం, కలశ జలాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని పుష్పాలతో విశేషంగా అలంకరించారు. విశేష పూజలు నిర్వహించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఘనంగా చిన్న కొట్టాయి ఉత్సవం శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో చిన్నకొట్టాయి ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అలంకార మండపంలో స్వామి,అమ్మవార్లకు విశేష అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ఆలయంలో ఊరేగించారు. భక్తులు పాల్గొని మొక్కులుతీర్చుకున్నారు. ఈవో ఎస్వీ నాగేశ్వరరావు, పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవ కాంతులు
రాపూరు: లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం అంకురార్పణ నిర్వహించనున్నారు. తిరుమలలో శ్రీపద్మావతి పరిణయోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు శనివారం శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి వేంచేపు చేయగా, వెంట స్వర్ణ పల్లకీలో శ్రీదేవి, భూదేవి అనుసరించారు. అనంతరం బంగారు తిరుచ్చిలో తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. – తిరుమలతిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శనివారం దొర వేషధారణలో భక్తులు సందడి చేశారు. కళాకారుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు స్థానికులను ఉర్రూతలూగించాయి. – తిరుపతి కల్చరల్ -
బంగారు తిరుచ్చిపై కల్యాణ వెంకన్న అభయం
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారు శనివారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వారపు ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్య కై ంకర్యాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి అభిషేక సేవను నిర్వహించి వజ్రవైఢూర్యాలు, మరకత మాణిక్యాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తదుపరి స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను కల్యాణ మండపానికి వేంచేపు చేసి వైఖానస ఆగమోక్తంగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవను చేపట్టారు. సర్వాలంకర శోభితుడైన శ్రీనివాసుడు, అమ్మవార్లతో కలసి బంగారు తిరుచ్చి వాహనంపై ఆశీనులై నాలుగు మాడవీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అనుమానాస్పదంగా వివాహిత మృతి డక్కిలి: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన మండలంలోని వెంబలూరు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నిపింది. మృతురాలి తండ్రి బ్రహ్మయ్య కథనం.. మోపూరు రోడ్డు గ్రామానికి చెందిన బ్రహ్మయ్యకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె లక్ష్మీ కావేరిని(22) రెండేళ్ల క్రితం వెంబులూరు గ్రామానికి చెందిన పాయసం తిరుపాల్, రత్నమ్మ కుమారుడు శివరాజ్కు ఇచ్చి వివాహం జరిపించారు. కొంతకాలం వారి కాపురం సజావుగా సాగింది. తరువాత శివరాజ్తో పాటు తల్లిదండ్రలు అధనపు కట్నం కోసం లక్ష్మీకావేరిని వేధించడం ప్రారంభించారు. మధ్యలో ఓ సారి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత లక్ష్మీకావేరి పుట్టింటికి చేరింది. తర్వాత కొన్నాళ్లకు మెట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో శివరాజ్కు రెండో వివాహం చేయాలని శివరాజా తల్లిదండ్రలు నిశ్చయించారు. తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మీకావేరి శనివారం ఉదయం ఉరి వేసుకొని తనువు చాలించింది. విషయం తెలుసుకుని వెంబులూరుకి వెళ్లగా తమ కుమార్తె కావేరి మృతదేహాన్ని ఇంటి బయట వరండాలో ఉంచి శివరాజా తల్లిదండ్రలు పరారయ్యరని మృతురాలి తండ్రి ఆరోపించారు. తమ కుమార్తె మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, పోలీసులు విచారించి న్యాయం చేయాలని కోరారు. తల్లి ప్రేమకు దూరం కాగా కావేరి, శివరాజ్కు 8నెలలు క్రితం కుమార్తె జన్మించింది. తల్లి మృతి చెందడంతో చిన్నారి తల్లి ప్రేమకు దూరం కావడంతో స్థానికులను కంటతడి పెట్టించింది. -
పరస్పర ఒప్పందాలతో ఆరోగ్యకర జీవనం
తిరుపతి తుడా: ఎస్వీ వైద్యకళాశాల, ఎస్వీ విశ్వవిద్యాలయ పరస్పర ఒప్పందం కారణంగా ఇటు విద్యార్థులకు, అటు అధ్యాపకులకు పరిశోధనలో మెలకువలు తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పఎస్వీ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ డాక్టర్ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. శనివారం వైద్య పరిశోధనపై పరస్పర ఒప్పందాలపై మొదటి సమావేశం నిర్వహించారు. ఎస్వీ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి క్లినికల్.. నాన్ క్లినికల్ వైద్యులు, ఎస్వీ వైద్యకళాశాల, రుయా ఆస్పత్రి నుంచి పంపితే విశ్వవిద్యాలయ క్యాంపస్లో చదువుకుంటున్న విద్యార్థులకు, సిబ్బందికి మెరుగైన వైద్యం అందించడానికి, ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఎస్వీ విశ్వ విద్యాలయంతో మొట్టమొదటిసారిగా పరస్పర ఒప్పందం కోసం సమావేశం నిర్వహించామన్నారు. వైద్య కళాశాల అదనపు వైద్య విద్యాసంచాలకులు, ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్, ఎస్వీ విశ్వవిద్యాలయ రిజిస్టర్ డాక్టర్ మహమ్మద్ హుస్సేన్, ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ మెంబర్ నారాయణబాబు, ఎస్వీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాళ్లు, డాక్టర్ వెంకటేశ్వర్లు (పరిపాలన), డాక్టర్ సునీత (అకడమిక్ ), డాక్టర్ సత్యనారాయణమూర్తి (పరిశోధనలు ), డాక్టర్ శశికళ,(సామాజిక వైద్య విభాగం), ఎస్వీ విశ్వవిద్యాలయ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సుధాకర్రెడ్డి, సీనియర్ టెక్నీషియన్ ముత్తువేలు, ఎస్వీ వైద్యకళాశాల పీఆర్వో వీర కిరణ్ పాల్గొన్నారు. -
ఐదంచెల భద్రత
తిరుపతి సిటీ: కౌంటింగ్ కేంద్రాల వద్ద ఐదంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉన్నట్టు తెలిపారు. 200 మీటర్లలో రాష్ట్ర పోలీస్ బలగాలు, 100 మీటర్లలో రాష్ట్ర సాయుధ బలగాలు మోహరించాయన్నారు. పోలింగ్ రోజున, పోలింగ్ అనంతరం జరిగిన ఘటనల నేపథ్యంలో ఐదంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. శ్రీపద్మావతి మహిళా వర్సిటీ రోడ్ పాయింట్ వద్ద నుంచి సరైన ధ్రువపత్రాలు ఉంటేనే లోనికి పంపుతున్నారని స్పష్టం చేశారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. స్ట్రాంగ్ రూమ్ పరిధిలో ఆరు గార్డ్ పాయింట్లు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచినట్టు వెల్లడించారు. మొత్తం 160 మంది పోలీస్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈవీఎంల భద్రత కోసం సుమారు 96 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమలు స్ట్రాంగ్ రూమ్ల వద్ద 96 సీసీ కెమెరాలతో నిఘా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్కుమార్ మీడియా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్కుమార్మీనా పలు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలపై అధనపు సూచనలు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాజకీయ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఏదైనా సంఘటనపై స్పందించే క్రమంలో ప్రజలు, మీడియా, సంయమనం పాటించాలని సూచించారు. సందేహాలు ఉంటే జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీలను సంప్రదించి వివరణ తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఆర్వో పెంచలకిషోర్, రిటర్నింగ్ అధికారి నిషాంత్రెడ్డి, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ ప్రవీణ్కుమార్ తదితరులు ఉన్నారు. -
కౌంటింగ్పై ప్రత్యేక దృష్టి
తిరుపతి అర్బన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన జరగనుంది. ఈ మేరకు ఓట్ల లెక్కింపునకు మార్గదర్శకాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను జిల్లా యంత్రాంగం చేపట్టింది. ఏర్పాట్లపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. విధివిధానాలు ● కౌంటింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ ఏజెంట్లతో పిచ్చాపాటిగా మాట్లాడకూడదు. ● స్ట్రాంగ్ రూమ్ నుంచి తెచ్చిన ఈవీఎం పెట్టెలకు సీల్ పరిశీలించిన తరువాతే వాటిని టేబుళ్ల వారీగా అందించాలి. ● 17సీ ఫారం–1, కంట్రోల్ యూనిట్ నంబర్, పోలింగ్ స్టేషన్ నంబర్లు సరిపోల్చుకోవాలి. ● కంట్రోల్ యూనిట్లు బ్యాలెట్ యూనిట్కు కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేయాలి. ● సిస్టమ్ డిస్ప్లే అయ్యేంత వరకు వేచి చూడాలి. ఆ తరువాత టోటల్ బటన్ను ప్రెస్ చేసి 17సీ ఫారం–1తో సరిపోల్చుకోవాలి. ● కంట్రోల్ యూనిట్ అడ్రస్ ట్యాగ్ తొలగించాలి. పై కవర్ తీసి, వేసిన సీళ్లను తొలగించిన తరువాత ‘రిజల్ట్ బటన్’ ప్రెస్ చేయాలి. ● అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లను 17సీ ఫారం–2లో నమోదు చేయాలి. ఫారాన్ని కార్బన్ పేపర్ ద్వారా రెండు కాపీలు ఉండేలా చూడాలి. ఓట్ల నమోదు అనంతరం అందులో ఏజెంట్ల సంతకం తీసుకోవాలి. ఒక ప్రతిని తమ వద్ద ఉంచుకుని, అసలు ప్రతిని 17సీ ఫారం–1కు పిన్ చేసి రో–ఇన్చార్జకు అందజేయాలి. వీవీప్యాట్ల లెక్కింపు ఇలా.. ● నియోజకవర్గంలో ఎంపిక చేసిన 5 పోలింగ్ కేంద్రాలకు చెందిన వీవీ ప్యాట్లను ఒకదాని తర్వాత ఒకటి లెక్కించాలి. ● వీవీ ప్యాట్ స్లిప్పును సంబంధిత ట్రేలో ఉంచాలి. పూర్తయిన తరువాత 25 చొప్పున కట్టగా కట్టాలి. స్లిప్పులు చిన్నవిగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ● వీవీ ప్యాట్ కౌంటింగ్ అనంతరం ఆర్ఓ పరిశీలిస్తారు. కౌంటింగ్ ప్రక్రియపై ఆర్వో సంతృప్తి చెందిన తరువాత స్లిప్పును సంబంధిత బాక్స్లో ఉంచి, విధుల్లో ఉన్న ఏర్వోకు అప్పగించాలి. అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రాంతాలు గూడూరు– విశ్వేశ్వరయ్య బ్లాక్, మూడో ఫ్లోర్, రూమ్ నం.407 సూళ్లూరుపేట–విశ్వేరయ్య బ్లాక్, సెకండ్ ఫ్లోర్, రూమ్ నం. 306 వెంకటగిరి– సీవీ రమణ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్, రూమ్ నం. 101 చంద్రగిరి–లైబ్రరీ హాల్, కేఎల్ రావ్ బ్లాక్, ఫస్ట్ఫ్లోర్ తిరుపతి–సీవీ రమణ బ్లాక్, సెకండ్ ఫ్లోర్, రూమ్ నం.312ఏ శ్రీకాళహస్తి–విశ్వేశ్వరయ్య బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నం. 206 సత్యవేడు– సీవీ రమణ బ్లాక్, మూడో ఫ్లోర్, రూమ్ నం.403 -
No Headline
గూడూరు నియోజకవర్గం ● అసెంబ్లీ: విశ్వేశ్వరయ్య బ్లాక్– మూడో ఫ్లోర్, రూమ్ నం.407 ● పార్లమెంట్కు: విశ్వేశ్వరయ్య బ్లాక్– మూడో ఫ్లోర్, రూమ్ నం.407 సూళ్లూరుపేట నియోజకవర్గం ● విశ్వేశ్వరయ్య బ్లాక్ : మూడో ఫ్లోర్– రూమ్ నం.306 ● పార్లమెంట్కు : విశ్వేశ్వరయ్య బ్లాక్ – మూడో 3 ఫ్లోర్, రూమ్ నం.307 వెంకటగిరి నియోజకవర్గం ● అసెంబ్లీకి: సీవీ రమణ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్, రూమ్ నం. 101 ● పార్లమెంట్కు: విశ్వేశ్వరయ్య బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్, రూమ్ నం.105 చంద్రగిరి నియోజకవర్గం ● అసెంబ్లీకి: లైబ్రరీ హాల్, కేఎల్రావ్ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్ ● పార్లమెంట్కు: మల్టీపర్పస్ హాల్, కేఎల్రావ్ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ తిరుపతి నియోజకవర్గం ● అసెంబ్లీకి: సీవీ రమణ బ్లాక్, సెకండ్ ఫ్లోర్, రూమ్ నం.312 ● పార్లమెంట్కు: సీవీ రమణ బ్లాక్, సెకండ్ ఫ్లోర్, రూమ్ నం.301 శ్రీకాళహస్తి నియోజకవర్గం ● అసెంబ్లీకి : విశ్వేశ్వరయ్య బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నం. 206 ● పార్లమెంట్కు: విశ్వేశ్వరయ్య బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నం. 207 సత్యవేడు నియోజకవర్గం ● అసెంబ్లీకి: సీవీ రమణ బ్లాక్, మూడో ఫ్లోర్, రూమ్ నం. 403 ● పార్లమెంట్కు : సీవీ రమణ బ్లాక్, మూడో ఫ్లోర్, రూమ్ నం. 410 జిల్లాలో కౌంటింగ్ కేంద్రాలు స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో తిరుపతిలో జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నారు. -
గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొన్న కారు
– అక్కడికక్కడే యువకుడి మృతి చంద్రగిరి: ఆగి ఉన్న గుర్తుతెలియని వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శనివారం తెల్లవారుజామున పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి, ఐతేపల్లి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... రేణిగుంట మండలం, ఆర్.మల్లవరానికి చెందిన సందీప్(31) వ్యక్తిగత పనులపై శుక్రవారం రాత్రి చిత్తూరుకు కారులో పయనమయ్యాడు. అనంతరం పనులు ముగించుకుని శనివారం తెల్లవారుజామున చిత్తూరు నుంచి తిరుపతికి వస్తున్న క్రమంలో ఐతేపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ఆగి ఉండడంతో దాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నుజ్జునుజ్జయ్యింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తిం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. కారు ఢీకొని బేల్దారి మృతి పెళ్లకూరు: గుర్తుతెలియని కారు ఢీకొని బేల్దారి మృతిచెందిన ఘటన శనివారం రాత్రి నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి, చెంబడిపాళెం గ్రామం వద్ద చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ వివరాలు.. నెల్లూరులోని భగత్సింగ్ కాలనీకి చెందిన అలీషైర్(37) బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చెంబడిపాళెం పరిసర ప్రాంతాల్లో ఓ మేసీ్త్ర వద్ద పనిచేసి, పనులు పూర్తయ్యాక గ్రామ సమీపంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో నాయుడుపేట నుంచి తిరుపతి వైపు వెళుతున్న కారు అతి వేగంగా ఢీకొట్టడంతో అలీషైర్ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడు పేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఎంబీయూలో అంతర్జాతీయ సమావేశం
చంద్రగిరి: మండల పరిధిలోని మోహన్బాబు యూనివర్సిటీ(ఎంబీయూ)లో శనివారం అలైడ్ హెల్త్ కేర్ సాంకేతిక పురోగతిపై అంతర్జాతీయ సమావేశం నిర్వహించారు. ఎంబీయూ వీసీ ప్రొఫెసర్ నాగరాజ్ రామారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హెల్త్కేర్ సైన్స్ కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ మాధవి, సీఎంసీ వేలూరు ప్రముఖ రేడియోలజిస్టు డాక్టర్ సంతోష్ బాబు, చైన్నె కావేరి ఆస్పత్రి చీఫ్ బయోకెమిస్ట్రీ డాక్టర్ సెల్వకుమార్లు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత వైద్య ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రాముఖ్యతను వివరించారు. మెడికల్ టెక్నాలజీలో ఏఐ ద్వారా వ్యాధులను నిరూపించడంపై చర్చించారు. అనంతరం రాష్ట్ర హెల్త్కేర్ సైన్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మాధవిని సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. -
ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో ఓ ప్రైవేటు ట్రవెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గరేణిగుంట మండలం, వెదళ్ళ చెరువు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మార్నింగ్ ట్రావెల్స్కు చెందిన బస్సు బెంగళూరు నుంచి అమలాపురం వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బస్సులో మంటలను అదుపు చేయించారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో 12 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను స్థానిక పోలీసులు చొరవ తీసుకొని గమ్యస్థానాలకు పంపారు. ఈ ఘటనపై రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం కాగా, సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది.ఇక.. నిన్న(శుక్రవారం) 71,510 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 43,199 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లుగా లెక్క తేలింది.నేడు ఆగష్టు కోటా టికెట్లుతిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల.సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ సేవా టికెట్లు మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.టికెట్లు పొందిన వారు మే 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలి.మే 17 ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటా, శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను విడుదల.మే 21న మద్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదల.మే 23న అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ టికడట్లు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల.మే 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలమే 24 మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల.https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచన.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పశుపోషకులకు బాసటగా..
జీపీ కార్మికులకు వేతనాలేవి?
సొంత జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించాలి
తడిసిన ధాన్యం కొనాల్సిందే
గో హత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి
అలకాపురికాలనీలో ఆక్రమణ
23న ప్రతిభా పురస్కారాల ప్రదానం
అజీంప్రేమ్జీ యూనివర్సిటీకి ఎంపిక
పని దొరికిందని వెళితే.. ప్రాణం పోయింది
ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
తప్పక చదవండి
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
- మార్చినచోటే మారణకాండ
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
Advertisement