కొంపదీసి మన బిచ్చగాళ్ళ ఏరివేతను పరిగణనలోకి తీసుకున్నారా ఏంటి సార్!!
కొంపదీసి మన బిచ్చగాళ్ళ ఏరివేతను పరిగణనలోకి తీసుకున్నారా ఏంటి సార్!!
Published Tue, Nov 28 2017 4:02 AM | Last Updated on Mon, Aug 20 2018 8:13 PM
Advertisement
Related news by tags
-
రెగట్టాలో మనోళ్ల హవా
సాక్షి, హైదరాబాద్: నగరం వేదికగా కొనసాగుతున్న సెయిలింగ్ మాన్సూన్ రెగట్టా పోటీల్లో మరోసారి తెలంగాణ సెయిలర్లు రాణిస్తున్నారు. సాగర్లో జరుగుతున్న 15వ మాన్సూన్ రెగట్టాలో బుధవారం అండర్–16 ఆప్టిమిస్ట్ ఫ్లీట్లో ఉద్బవ్ స్కూల్ నుంచి గోవర్ధన్పల్లార, లాహిరి కొమరవెల్లి, దీక్షిత కొమరవెల్లి విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు. గోవర్ధన్ తన విజయాలతో రెండవ స్థానం కన్నా ముందే ఉన్నప్పటికీ అగ్రస్థానం కోసం మరో 4 రేసులతో నైపుణ్యాలను ప్రదర్శించాలి. సెయిలింగ్ స్టార్ లాహిరికి ఓ ప్రమాదంలో ఎడమ చేయి విరగడంతో మొదటి రెండు రేసులకు అనుమతించలేదు. చివరకు వైద్యుడి పర్యవేక్షణలో అనుమతించడంతో లాహిరి ఒక రేసులో మొదటి స్థానంలో నిలిచింది. అయినప్పటికీ 39 సెయిలర్ ఫ్లీట్లో ప్రశంసనీయంగా 19వ స్థానంలో నిలిచింది. ఐఎల్సీఏ 4 బాలుర విభాగంలో టీఎస్సీ మైసూర్కు చెందిన కృష్ణ దివాకర్ మధ్యప్రదేశ్కు చెందిన ఏకలవ్య బాథమ్ (3వ స్థానం)ను బీట్ చేసి అగ్రస్థానంలో నిలిచాడు. శశాంక్ బాథమ్ రెండవ స్థానంలో ఉన్నాడు. బాలికల విభాగంలో సోమ్యా సింగ్, అలియా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంటర్నేషనల్ 420 మిక్స్డ్ లోకల్స్లో తనుజా కామేశ్వర్, వైష్ణవి అగ్రస్థానంలో నిలిచారు. బాలికల హాఫ్ రిగ్ ఫ్లీట్లో అఖిల కొప్పుల (13) స్వర్ణం, రెయిన్బో హోమ్స్ ముషీరాబాద్కు చెందిన నికిత జీరు (12) రజతం సాధించారు. -
అమెజాన్ ప్రైమ్లో ఫ్యాషన్–బ్యూటీ సారధితో భేటీ
అమెజాన్ ఇండియా ఆధ్వర్యంలో ప్రైమ్ డే ఈ నెల 20న నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమెజాన్లో బ్యూటీ అండ్ లగ్జరీ కేటగిరీల సారధిగా ఎంపికైన సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ షాలిని మట్టాతో భేటీ అవకాశాన్ని అందిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. జంషెడ్పూర్కు చెందిన షాలిని విశాఖపట్నంలో పెరిగి..ఐఐటీ ఢిల్లీలో ఇంజనీరింగ్ డిగ్రీని, ఐఐఎం కోల్కత్తాలో ఎంబీఏ పూర్తి చేసుకున్నారనీ, ఆపై కంటెంట్, సోషల్ మీడియా మార్కెటింగ్ రంగంలోకి ప్రవేశించారన్నారు. విధుల్లో భాగంగా లైవ్ వీడియో షాపింగ్ను పర్యవేక్షిస్తారని, క్రియేటర్ కమ్యూనిటీలను నిరి్మంచడం, బ్యూటీ సోషల్ మీడియా, ఇన్ఫ్లుయెన్సర్ కంటెంట్ క్రియేషన్ వర్క్స్ట్రీమ్లను నిర్వహిస్తారన్నారు. -
షాహీ నాష్టా.. నోరూరించే నిజాంల నాటి వంటకాలు
షాహీ నాష్టా.. అంటే నిజాం కాలంలో ఉదయం పూట అల్పాహారం. పాయారోటీ, గుర్దాభాజీ, ఖీమారోటీ, ఖిచిడీ ఖీమాలాంటి పదార్థాలను నిజాములు అల్పాహారంగా సేవించేవారు. నిజాముల కాలం నాటి వంటకాలు కొన్ని నేటికీ ప్రజాదరణలో ఉన్నాయి. క్రమేణా ఈ వంటకాలన్నీ పాతబస్తీ హోటళ్లు, సికింద్రాబాద్లోని ఒకటి రెండు హోటళ్లలో సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో నగరంలో నాన్వెజ్ బ్రేక్ఫాస్ట్ అందించే రెస్టారెంట్ల సంఖ్య పెరుగుతోంది. జంటనగరాలతోపాటు శివారు ప్రాంతాల్లో నాన్వెజ్ అల్పాహార వంటకాల కోసం ఉదయం పూట వందలాది మంది వేచి చూస్తారంటే అతిశయోక్తి కాదు. – సికింద్రాబాద్వయసుతో పని లేకుండా... ప్రతిరోజు 6 గంటల నుంచే వేడివేడిగా మాంసాహారపు వంటకాల అల్పాహారాలను రెస్టారెంట్ల నిర్వాహకులు సిద్ధంగా ఉంచుతున్నారు. భాజీగుర్దా, ఖీమా కర్రీ, పాయ వంటి పురాతన వంటకాలతోపాటు చిల్లిగారె, పూరి, ఇడ్లీ, వడ, దోశ, రాగిముద్ద వంటి బ్రేక్ఫాస్ట్ను చికెన్, మటన్తో కూడిన వివిధ వంటకాలతో రడీగా ఉంచుతున్నారు. మరికొన్ని హోటళ్లు అయితే ఉదయం 5 గంటల నుంచి 11.30 గంటల వరకూ నాన్వెజ్ వంటకాలను అందుబాటులో ఉంచుతున్నారు. రాత్రి 12 గంటల లోపే నాణ్యమైన మాంసం, అవసరమైన ఆకుకూరలు, మసాలాలను సిద్ధం చేసుకుని తెల్లవారుజామున ఒంటిగంట, రెండు గంటల ప్రాంతంలో వంటలు ప్రారంభిస్తున్నారు. ఉదయం 5 గంటలకు రెస్టారెంట్లను తెరిచి పూరి, రోటీ ఇతర టిఫిన్లతో కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు.వయసుతో పని లేకుండా... ఉదయం వేళల్లో చోటా ఆరగించేవాళ్లలో అన్ని వయస్కుల వాళ్లూ కనిపిస్తున్నారు. 18 ఏళ్ల నవయువకుల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకూ ఈ టిఫిన్లు ఆరగిస్తున్నారు. కేవలం నాన్వెజ్ కర్రీతో ప్రత్యేకంగా లభించే టిఫిన్లు ఆరగించడం కోసం వచ్చే వాళ్లు మిత్రులుగా మారిన వారూ ఉంటున్నారు. నాన్వెజ్ టిఫిన్లు సేవించేవారు మైదానాల్లోనే మిత్రులుగా మారుతున్నారు. కొందరు ఐతే ఏకంగా నాన్వెజ్ టిఫిన్స్ కోసం చాట్ గ్రూప్స్ మెయింటెన్ చేస్తున్నారు. వారాంతాల్లో జాతరే!రోజు రోటీ, ఇతర టిఫిన్లు తినేందుకు నాన్వెజ్ టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్ల వద్ద కస్టమర్లు బారులు తీరుతున్నారు. శని, ఆదివారం వచి్చందంటే చాలు మాంసాహార టిఫిన్సెంటర్ల ముందు జాతర కనిపిస్తుంది. భాజీగుర్దా.. ఖీమాతో రోటీపాటు, ఇడ్లీ, వడ, దోశ వంటి అల్పాహారాలు కూడా మాంసం కూరలతో తినేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో కస్టమర్లతో రెస్టారెంట్ల వద్ద సందడి వాతావరణం కనిపిస్తుంది. మార్నింగ్ వాకర్లు, స్మిమ్మర్లు, జిమ్కు వెళ్లేవాళ్లు, క్రికెటర్లు వారాంతపు రోజులు, సెలవు దినాల్లో వ్యాయామం ముగించుకున్నాక నేరుగా మాంసాహార టిఫిన్ సెంటర్ల వద్దకు చేరుకుంటారు. వీళ్లే కాకుండా పలువురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కూడా సెలవు దినాల్లో నాన్వెజ్ టిఫిన్స్ ఆరగించేందుకు ఉవి్వళ్లూరు తున్నారు. -
Standing Desk: నిలబడి వర్క్ చేస్తే ఆరోగ్యానికి మేలు!
నిలబడి వర్క్ చేస్తే ఆరోగ్యానికి మేలంటున్న కార్పొరేట్స్ సుదీర్ఘకాలం కూర్చోవడం స్మోకింగ్తో సమానం వెన్నునొప్పికి దారితీస్తున్న సిట్టింగ్ పొజిషన్ పలు అధ్యయనాల నివేదికల్లో స్పష్టం వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు కారణంగా కార్పొరేట్ ప్రొఫెషనల్స్కి వెన్నునొప్పి సమస్య ముదిరి తన రోజువారీ కార్యకలాపాలను సైతం ప్రభావితం చేస్తోంది. నగరంలోని ఓ మొబైల్ వాలెట్ కంపెనీలో పనిచేస్తున్న అన్షుల్, స్నేహితుల సలహా మేరకు స్టాండింగ్ డెస్్కను ఎంచుకున్నాడు. ‘ఇప్పుడు, నా వెన్నునొప్పి తగ్గిపోయింది’ అని అన్షుల్ చెబుతున్నారు.. ఎక్కువ గంటలు కూర్చోవడం స్మోకింగ్తో సమానమైన వ్యసనంగా తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకు తగ్గట్టే పలు రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్న నేపథ్యంలో డెస్క్ జాబ్స్ చేసే నగరవాసులకు స్టాండింగ్ డెస్్కలు పరిష్కారంగా మారిపోయాయి. ఆధునిక పరిస్థితుల్లో మనం కంప్యూటర్లు, టెలివిజన్లు ఇతర ఎల్రక్టానిక్ పరికరాల ముందు కూర్చొని ఎక్కువ సమయం గడుపుతున్న కొద్దీ, మన శారీరక మానసిక ఆరోగ్యంపై నిశ్చల జీవనశైలి తాలూకు ప్రతికూల ప్రభావాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి ఒక సులభ పరిష్కారం స్టాండింగ్ డెస్్క., దీనిని సిట్–స్టాండ్ డెస్క్ అని కూడా పిలుస్తారు. కూర్చున్నా.. నిలబడి ఉన్న భంగిమలకు అనుగుణంగా సర్దుబాటు చేయగల డెస్్క. రోజంతా రెండు రకాల భంగిమలకు మధ్య మారడానికి వీలుగా ఇవి రూపొందాయి.చలనం.. ఆలోచనల ఫలం..ఆరోగ్య లాభాలను గుర్తించిన మీదట నగరానికి చెందిన ప్రోగ్రామర్ అభిõÙక్ మాండ్లోయ్ 3 నెలల క్రితం స్టాండింగ్ డెస్్కకి మారారు, కంపెనీ అతనికి ఫరి్నచర్ అలవెన్స్ ఇచి్చంది. ‘ఈ మార్పుకు గాను నాకు రూ.27,000 ఖర్చయ్యింది. అయితే దీని వల్ల లాభాలు అంతకు మించి వస్తున్నాయి. నిలబడి ఉన్నప్పుడు నేను నలువైపులా కదలగలను. అది నేను మరింత వేగంగా ఆలోచించగలిగేలా చేస్తుంది’ అని మాండ్లోయ్ అన్నారు. ఆధునిక సంస్థలు ఉద్యోగుల పని పరిసరాలు, వారి ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యతనిస్తున్నాయి. ఉద్యోగులు ఉత్తమమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండేలా వివిధ మార్గాల్లో ప్రయతి్నస్తున్నారు. ఫిట్నెస్ అగ్రిగేటర్ జింపిక్ వ్యవస్థాపకుడు అమరేష్ ఓజా మాట్లాడుతూ, ‘స్టాండింగ్ డెస్క్ మరింత చురుకుగా పని చేసేలా చేస్తుందని తన స్టార్టప్లోని సగం మంది సిబ్బంది ఇప్పటికే స్టాండింగ్ డెస్్కలను కొనుగోలు చేశారని చెప్పారు. అదే క్రమంలో యాపిల్ సంస్థ సైతం తన కొత్త ప్రధాన కార్యాలయం యాపిల్ పార్క్లో పనిచేసే ఉద్యోగులందరికీ స్టాండింగ్ డెస్క్లను ఏర్పాటు చేసిందని సమాచారం. డెస్్కకు డిమాండ్... ఈ స్టాండింగ్ డెస్్కకు సంబంధించిన బ్రాండెడ్ ఉత్పత్తుల ధరలు రూ. 20,000 నుంచి ప్రారంభమై రూ. 50,000 వరకూ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ బలపడడంతో అది స్టాండింగ్ డెస్్కల డిమాండ్ పెరగడానికి దారితీసింది. ‘కోవిడ్కు ముందుతో పోలిస్తే ఈ డెస్్కల సేల్స్ ఇప్పుడు రెట్టింపైంది’ అని ఎర్గో డెస్క్ రిటైల్ స్టోర్ నిర్వాహకులు రాహుల్ మాథుర్ అన్నారు. గత త్రైమాసికం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ సొల్యూషన్ల డిమాండ్ 45% కంటే పెరిగి, ఇప్పటికీ స్థిరంగా పెరుగుతోందని ఫరి్నచర్ రెంటల్ పోర్టల్ సిటీఫరి్నష్ వ్యవస్థాపకుడు నీరవ్ జైన్ వెల్లడించారు. స్టాండింగ్ డెస్్కల కోసం కార్యాలయాల నుంచి బల్క్ ఆర్డర్లు తగ్గాయి, అదే సమయంలో రిటైల్ అమ్మకాలు పెరిగాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రారంభమైనప్పటి నుంచి రిటైల్ అమ్మకాలు 100% పెరిగాయని ఎర్గోనామిక్ ఫర్నిచర్ స్టార్టప్ పర్ప్లర్క్ వ్యవస్థాపకుడు గుణశేఖరన్ జయరామన్ అంటున్నారు. నిరి్వరామం ప్రమాదం... నగరంలోని ఓ ఆస్పత్రిలో వెన్నెముక సర్జరీ చీఫ్ డాక్టర్ అరుణ్ భానోట్ మాట్లాడుతూ ‘సరైన భంగిమలో ఉపయోగించినప్పుడు స్టాండింగ్ డెస్క్లు మంచి ఫలితాలను అందిస్తాయి’ అని స్పష్టం చేశారు. అయితే ఎక్కువగా వంగిన భంగిమలో గానీ, లేదా నిలుచుని పనిచేస్తుంటే అది కొత్త సమస్యలకు దారి తీస్తుంది’ అని భానోట్ హెచ్చరిస్తున్నారు. మణికట్టు డెస్్కపై ఫ్లాట్గా ఉన్నప్పుడు మోచేతులు 90 డిగ్రీల కోణంలో ఉండాలని సూచిస్తున్నారు. అయితే 30 నిమిషాల కంటే ఎక్కువసేపు నిరి్వరామంగా నిలబడడం అంత మంచిది కాదని స్పష్టం చేశారు.కూర్చోవడం వర్సెస్ నిల్చోవడం..⇒ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ తరహా నిశ్చల జీవనశైలికి దూరం అయ్యేలా స్టాండింగ్ డెస్్కని ఉపయోగించవచ్చు. తద్వారా పలు వ్యాధుల ప్రమాదాన్ని నివారించవచ్చు. ⇒ ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ పరిమితంగా మారుతుంది. ఇది చిత్తవైకల్యం వంటి మెదడు జబ్బుల ప్రమాదానికి దారితీస్తుంది. నిలబడి ఉన్నప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. దానికి అవసరమైన ఆక్సిజన్ ఇతర పోషకాలను అందిస్తుంది. ⇒ చాలాసేపు కూర్చోవడం వల్ల అలసట బద్ధకం వస్తాయి. దీనికి విరుద్ధంగా, స్టాండింగ్ శక్తి స్థాయిలను పెంచి చురుకుదనాన్ని ఇస్తాయి. ⇒ సృజన, సమస్యల పరిష్కార సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ఉత్పాదకతను పెంచడంలో స్టాండింగ్ డెస్్కలు సహాయపడతాయని, తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడం వీలవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ⇒ గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల మన వెన్నెముక కుదించబడే అవకాశం ఉంది. ఇది వెన్నునొప్పికి దారితీస్తుంది. అదే నిలబడి ఉన్న డెస్్కలు నిటారుగా నిలబడటానికి మన కోర్ కండరాలకు మద్దతు అందించడం ద్వారా వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడతాయి. ⇒ గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల మన మనస్సు పలు చోట్లకు సంచరించేలా చేస్తుంది. దీని వల్ల ఏకాగ్రత కష్టమవుతుంది. దీనికి భిన్నంగా స్టాండింగ్ డెస్్కని ఉపయోగించడం ద్వారా మన దృష్టి ఏకాగ్రతలను మెరుగుపరచవచ్చు. -
ఎయిర్పోర్ట్లో కొత్త లాంజ్
శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎన్కామ్ (ఇఎన్సీఎఎల్ఎమ్) హాస్పిటాలిటీ ‘ట్రాన్సిట్ బై ఎన్కామ్’ పేరిట ఏర్పాటైన తమ అధునాతన లాంజ్ను మంగళవారం ప్రారంభించింది. ఎన్కామ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వికాస్ శర్మ మాట్లాడుతూ ఎయిర్పోర్ట్లోని లెవల్ డి అరైవల్స్ వద్ద ఉన్న ఈ ట్రాన్సిట్ లాంజ్లో ప్రయాణికుల కోసం 17చ.మీ మీటర్ల నుంచి 51 చ.మీ వరకూ పరిమాణంలో 57 గదులు, జిమ్, ఎన్రూట్ కేఫ్, కాఫీ మేకర్, వాక్–ఇన్ షవర్స్, వైఫై, కరెన్సీ మార్పిడి, లగేజీ స్పేస్ లతో పాటు స్పా సౌకర్యం ప్రత్యేక ఆకర్షణ అని వివరించారు.
Related News by category
-
Balasana: ఒత్తిడిని తగ్గించే బాలాసనం
బాలాసనంలో శరీరం మొత్తం ముందుకు సాగి, చంటి పిల్లలు బోర్లా పడుకున్నప్పుడు కనిపించే భంగిమలో ఉంటారు. దీనిని శశాంకాసనం అనికూడా ఉంటారు. ఈ ఆసనంలో వెన్నెముక సాగి, మోకాళ్లు బలపడతాయి. పోత్తికడుపులోని అవయవాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుం నొప్పి సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి తగ్గి, శరీరం మొత్తం విశ్రాంతి పొందుతుంది.ముందుగా మ్యాట్పైన కాలి మడమల మీద హిప్ భాగం ఉండేలా వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి ఎత్తాలి. శ్వాస వదులుతూ తల, పోట్ట భాగాన్ని ముందుకు మెకాళ్ల మీదుగా పూర్తిగా వంచాలి. చేతులను నేలపై తలకిరువైపులా వెడల్పుగా ‘వి’ ఆకారంలో ఉంచాలి. ఈ పోజిషన్లో 30 సెకన్లపాటు ఆగి, విశ్రాంతి ΄పోందాలి. తర్వాత తిరిగి వజ్రాసనంలోకి రావాలి. ఇలా సుమారు 10 సార్లు చేయాలి. ఫలితాలు: రోజువారీ పనుల ద్వారా కలిగే ఒత్తిడి, చిరాకులాంటి సమస్యలు దూరం అవుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పేగులు, కాలేయం, మూత్రపిండాలకు బలం చేకూరుతుంది. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నవారికి మంచి ఉపశమనం లభిస్తుంది. ఎముకల సమస్యతో బాధపడేవారు, హైబీపి ఉన్నవారు నిపుణుల సూచనలు తీసుకోవాలి. – జి. అనూషా రాకేష్, యోగా ట్రైనర్ -
చిన్నారి సేవాగుణం
ఎంతోమంది విదేశాలకు వెళ్లిన తర్వాత పుట్టి పెరిగిన ప్రాతాన్ని మర్చిపోతుంటారు. కాని కరీంనగర్ నుంచి అమెరికా వెళ్లి అక్కడ నివాసం ఉంటున్న ఓ ప్రవాస భారతీయుడి కుమార్తె సొంత ఊరిపై మమకారంతో అనాథ విద్యార్థుల కోసం విరాళాలు సేకరించి అందించింది. ఈ రకంగా తన తల్లితండ్రులు పెరిగిన ఊరిపై ప్రేమను చాటుకుంది.కరీంనగర్ పట్టణానికి చెందిన ప్రవాస భారతీయులు లక్కాకుల వినయ్ అమెరికాలోని మిచిగాన్ లో నివసిస్తుండగా వారి కూతురు లక్కాకుల హరిణి అమెరికాలోని నోవి హైస్కూల్లో విద్యనభ్యసిస్తున్నారు. హరిణి ΄ాఠశాల సామాజిక సేవాకార్యక్రమంలో భాగంగా రూ.1.65 లక్షల మేరకు విరాళాలు సేకరించింది. ఈ మొత్తాన్ని హరిణి కరీంనగర్ పట్టణంలోని వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలగోకులంలో 40 మంది అనాథ విద్యార్థులకు విద్యాబుద్ధులను గరపడంతో΄ాటు సకల సౌకర్యాలను కలుగజేస్తున్నారని తెలుసుకొని వారి అవసరాల కోసం విరాళంగా ఇచ్చారు. వయసులో చిన్న అయినా, పెద్ద మనసుతో విరాళాలు సేకరించి ఇచ్చిన హరిణికి బాలగోకులం విద్యార్థులు, వెంకట్ ఫౌండేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
సాయం కాపాడుతున్న ప్రాణం
క్రౌడ్ ఫండింగ్పెద్ద జబ్బుతో ఆసుపత్రి పాలైన నిరుపేదల దగ్గర లక్షల్లో ఖర్చుచేసేటంత డబ్బు ఉండదు. ప్రాణాలు నిలబడాలంటే ఏం చేయాలి మరి? ఇందుకు సమాధానమే క్రౌడ్ ఫండింగ్. ఆరోగ్యం, విద్య, జంతువుల సంక్షేమం, ప్రకృతి వైపరీత్యాలు, మహిళా సాధికారత కోసం విరాళాలను క్రౌడ్ ఫండింగ్ ద్వారా సమకూర్చుతున్నాయి కొన్ని ఆన్లైన్ వేదికలు.కర్నూలు జిల్లాకు చెందిన తొమ్మిదేళ్ల సానియా వెంట్రిక్యులర్ సెస్టల్ డిఫెక్ట్ వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి చికిత్సకు రూ.12 లక్షలు కావాలి. తండ్రి రాళ్లు కొట్టే పని చేస్తుంటాడు. తల్లి గృహిణి. కుమార్తెకు చికిత్స చేయించే స్తోమత లేకపోవడంతో వీరికి ‘ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్’ అండగా నిలిచింది. ఈ ఫౌండేషన్ విభిన్న వేదికల్లో క్రౌడ్ ఫండింగ్ చేపట్టింది. రూ.12 లక్షలు క్రౌడ్ ఫండింగ్ ద్వారా జమ అయ్యి, చిన్నారికి చికిత్స జరిగింది. ప్రాణాలు నిలబడ్డాయి. రహ్మద్ బాషా విజయవాడలో పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఇటీవల అతనికి నెలల నిండకుండానే 704 గ్రాముల బరువుతో కూతురు పుట్టింది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఐసీయు లో చికిత్స పోందుతోంది. పాప చికిత్సకు రూ.14 లక్షలు అవసరం. దయచేసి, సహాయం చేసి, మా పాపను బతికించండి’ అని క్రౌడ్ఫండింగ్ నిధుల సమీకరణ లింక్లో విన్నవించుకున్నాడు. చికిత్సకు అవసరమయ్యే డబ్బు వారికి అందుతోంది. కేరళలోని ఎర్నాకుళానికి చెందిన సారంగ్ మీనన్, అదితి నాయర్ల ఏడాదిన్నర కుమారుడు నిర్వాణ్ వెన్నెముక కండరాల క్షీణత అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ చికిత్సకు దాదాపు రూ.17.5 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చె΄్పారు. ఈ వ్యాధి నివారణకు ఉపయోగించే వన్టైమ్ డ్రగ్ జోల్జెన్మ్సా ఇండియాలో అందుబాటులో లేదు. దీనిని అమెరికా నుంచి తెప్పించాలి. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ΄్లాట్ఫామ్ ద్వారా తెలియజేయడంతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా 72 వేల మంది విరాళాలు అందించారు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా, మా వల్ల ఏమవుతుంది... అంటూ కుదేలవ్వాల్సిన పని లేదని చెప్పే ఇలాంటి కథనాలు ఎంతో ధైర్యాన్నిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఎంత అవసరం వచ్చినా, దాతల నుంచి విరాళాలు తెచ్చి పెట్టేందుకు నేడు ఎన్నో వేదికలు పనిచేస్తున్నాయి. వేలాది మంది బాధితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయి. అదే సమయంలో ఇలాంటి బాధితులకు సాయం చేశామనే సంతృప్తి దాతలకు లభిస్తోంది. కాకపోతే విరాళం ఇచ్చే ముందు విచారించి, నిజమైనదేనని నిర్ధారించుకోవడం ద్వారా తమ దానం నిష్ఫలం కాకుండా చూసుకోవచ్చు. మెడికల్ క్రౌడ్ ఫండింగ్ ΄్లాట్ఫామ్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటే.. సాయం పోందచ్చు. తోచినంత సాయమూ చేయచ్చు.నిధుల సేకరణ ఇలా..!దాతల సాయం అవసరమైన ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ΄్లాట్ఫామ్లను (ఇంపాక్ట్ గురూ, మిలాప్, కెట్టో, గో ఫండ్ మి, కిక్స్టార్టర్... మొదలైనవి) సంప్రదించవచ్చు ∙΄ాన్, ఆధార్, మెడికల్ డాక్యుమెంట్లు సమర్పించాలి. ఎంక్వైరీ అనంతరం వారి తరఫున నిధుల సమీకరణ పేజీని అవి సిద్ధం చేస్తాయి సాయం అవసరమైన వారు ఈ పేజీ లింక్ను తమ నెట్వర్క్లో షేర్ చేసుకోవాలి ∙విరాళంలో కొంత మొత్తాన్ని కమీష్న్ రూపంలో మినహాయించుకునేందుకు సమ్మతి తెలియజేస్తే, వారి తరఫున క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు విస్తృత ప్రచారాన్ని చేపడతాయి ∙విరాళం ఇచ్చేందుకు పేమెంట్ లింక్లు కనిపిస్తాయి. ఇలా చేసే చెల్లింపులన్నీ పన్ను రాయితీ కల్పిస్తాయి ∙కావాల్సిన మొత్తం వచ్చినా, గడువు ముగిసినా లేదంటే బాధితులు అకాలంగా మరణించినా నిధుల సమీకరణ ఆగిపోతుంది. అనంతరం ఈ మొత్తం నుంచి కమీష్న్ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని బాధితులకు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు చెల్లిస్తాయి. ఇలా చేసే ముందు హాస్పిటల్ బిల్లులను చెక్ చేస్తాయి.విశ్వసనీయమైన ఎంపికక్రౌడ్ ఫండింగ్లో ప్రతి ప్రయత్నం సవాల్తో కూడుకున్నదే. ప్రచారం చేసినప్పటికీ మొత్తం నిధుల సేకరణ లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో క్రౌడ్ఫండింగ్ విశ్వసనీయమైన ఆర్థిక ఎంపికగా మారినందున మోసం, దుర్వినియోగం వంటివీ జరగచ్చు. తప్పుదారి పట్టించే లేదా మోసపూరితమైన నిధుల సమీకరణను చూసినట్లయితే, దానిని వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. – సాయంతి రాయ్, హెడ్ కమ్యూనికేషన్స్, మిలాప్ -
ఆకాంక్షలే ఆలంబనగా రొట్టెల పండగ
అక్కడకు తరలి వచ్చేవారివి చిన్న చిన్న కోరికలే. చదువు రావాలి, ఉద్యోగం రావాలి, వివాహం జరగాలి, సంతానం కలగాలి అనే... జీవితంలో ఆకాంక్షలు ఉండాలి. ఆ ఆకాంక్షలు నెరవేరతాయనే ఆశ ఉండాలి. అలాంటి వారికి అభయమిచ్చే ఆధ్యాత్మిక వేడుకలు ఎన్నో. అలాంటి వాటిలో ఒకటి ‘రొట్టెల పండగ’ నెల్లూరులో జరిగే ఈ పండగలో స్త్రీలు విశేషంగా ΄ాల్గొంటారు. ప్రతి సంవత్సరం మొహరం పండగ వేళలో నెల్లూరు వీధులు ΄ోటెత్తుతాయి. దేశ విదేశాల నుంచి జనం నెల్లూరులోని బారా షహీద్ దర్గా దగ్గరకు చేరుకుంటారు. కులం, మతం, భాష, ్ర΄ాంతం... తేడా లేకుండా అక్కడి స్వర్ణాల చెరువులో మొక్కు మొక్కుకుంటారు. లేదా తీర్చుకుంటారు. మొక్కు తీరిన వారు రొట్టె పంచుతారు. మొక్కుకునే వారు ఆ రొట్టెను స్వీకరిస్తారు. తరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం చెక్కు చెదరడం లేదు. ప్రతి సంవత్సరం ఐదు రోజుల ΄ాటు జరిగే ఈ వేడుక నిన్నటి నుంచి çఘనంగా జరుగుతోంది. ఇది ప్రధానంగా స్త్రీల పండగ.ఎవరు ఈ బారా షహీద్?మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడంలో భాగంగా టర్కీ నుంచి సుమారు 300 ఏళ్ల క్రితం 12 మంది మతబోధకులు భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కొడవలూరు మండలంలోని గండవరంలో తమిళనాడు వాల్జారాజులకు, బీజాపూర్ సుల్తాన్లకు మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ 12 మంది వీరమరణం ΄÷ందారు. వీరి తలలు గండవరంలో తెగిపడగా మొండాలను గుర్రాలు నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు తీసుకు వచ్చాయి. ఈ 12 మంది నెల్లూరు ఖ్వాజీకి కలలో కనపడి తమను అక్కడే సమాధి చేయాలని కోరడంతో అక్కడే సమాధులు నిర్మించారు. 12ను ఉర్దూలో బారా, వీర మరణం ΄÷ందిన అమరులను షహీద్లుగా పిలుస్తారు. అందుకే ఈ దర్గాకు బారా షహీద్ అనే పేరొచ్చింది. రొట్టెల ఆనవాయితీతమిళనాడు నుంచి నెల్లూరు వరకు ఆర్కాట్ నవాబుల ఏలుబడిలో ఉన్నప్పుడు నవాబు భార్య జబ్బు పడితే ఆమెకు నయం అయ్యే మార్గం కోసం నవాబు ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో బారా షహీద్ దర్గా దగ్గర బట్టలు ఉతుకుతున్న రజకునికి ఆ రాత్రి బారా షహీద్లు కనబడి మా సమాధుల దగ్గరి మట్టి తీసుకుని నవాబు భార్య నుదుటికి రాస్తే నయం అవుతుందని చె΄్పారు. ఆ సంగతి రజకుడు ఊరి వారికి తెలుపగా వారు నవాబుకు తెలియచేశారు. మట్టి తెప్పించిన నవాబు దానిని తన భార్య నుదుటికి రాయగా 24 గంటల్లో ఆమెకు నయం అయ్యింది. దాంతో అతడు అంత దూరం నుంచి బారా షహీద్ దర్గాను చూడటానికి వచ్చాడు. దర్శనం అయ్యాక అక్కడ ఉన్న పేదలకు రొట్టెలు పంచాడు. మొక్కు తీరాక ఇలా రొట్టెలు పంచడం ఆనవాయితీ అయ్యింది. ఈ నెల 21 వరకు రొట్టెల పండగ జరుగుతుంది.వివాహం రొట్టె.. సంతాన రొట్టెనెల్లూరు బారా షహీద్ దర్గాలో మొక్కు రొట్టెతో ముడిపడి ఉంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు ఉద్యోగం, ప్రమోషన్, సౌభాగ్యం, సంతానం, విద్య, స్వగృహం, వ్యా΄ారం... ఈ కోరికలు నెరవేరాలని మొక్కుకునేందుకు వస్తారు. గతంలో మొక్కిన మొక్కులు తీరిన వారు రొట్టెలతో వస్తారు. వారి నుంచి రొట్టె తీసుకోవాలి. అంటే గతంలో వివాహ మొక్కు మొక్కుకుని వివాహం జరిగిన వారు రొట్టెలతో వస్తారు. వివాహం కావలసిన వారు వారి దగ్గర నుంచి రొట్టె స్వీకరించి తినాలి. మొక్కు తీరాక వాళ్లు ఇలాగే రొట్టెను తెచ్చి ఇవ్వాలి. బారా షహీద్ దర్గా పక్కనే ఉన్న స్వర్ణాల చెరువులో మోకాళ్ల లోతుకు దిగి స్త్రీలు ఈ రొట్టెల బదలాయింపు చేసుకుంటారు. బాకీ తీరాలనే రొట్టె, స్థలం కొనాలనే రొట్టె, ర్యాంకుల రొట్టె... ఇవన్నీ అదృష్టాన్ని బట్టి దొరుకుతాయి. అన్నింటి కంటే ఎక్కువగా ఆరోగ్య రొట్టె కోసం వస్తారు. – కొండా సుబ్రహ్మణ్యం, సాక్షి, నెల్లూరు -
పర్వత పుత్రి సాహు శ్రద్ధాంజలి సాహు...
ఒడిశాలో పుట్టి, హైదరాబాద్లో పెరిగిన పంతొమ్మిదేళ్ల అమ్మాయి. బీటెక్ ఫైనలియర్. చదివేది సాఫ్ట్వేర్ కోర్సే అయినా తన పరిజ్ఞానాన్ని దేశ రక్షణరంగం కోసం అంకితం చేయాలనుకుంటోంది. ‘ఆ కల కోసమే ఎన్సీసీలో చేరాను, ఆ కల నెరవేర్చుకునే క్రమంలో నన్ను నేను నిరూపించుకోవడం కోసమే పర్వతాన్ని అధిరోహించాను’ అంటోంది. గత జూన్ నెల 21వ తేదీన కాంగ్ యాత్సే 2 పర్వతాన్ని అధిరోహించి, శిఖరం మీద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది. ‘నా కల చాలా పెద్దదని నాకు తెలుసు. ఆ కలను సాకారం చేసుకోవడానికి శ్రద్ధగా ఒక్కో అడుగు వేస్తున్నాను’ అంటూ ‘సాక్షి ఫ్యామిలీ’తో తన పర్వతారోహణ అనుభవాల్ని పంచుకుంది శ్రద్ధాంజలి సాహు. కాంగ్ యాత్సే పర్వతశ్రేణి హిమాలయాల్లో లధాక్ రీజియన్లో ఉంది. కాంగ్ యాత్సే పర్వత శిఖరం ఎత్తు 6,250 మీటర్లు. నా మౌంటెనీరింగ్ జర్నీ చాలా తమాషాగా జరిగి΄ోయింది. ఎయిత్లోనో, నైన్త్ క్లాస్లోనో గుర్తులేదు. హిందీలో ‘ఎవరెస్ట్ మేరీ శిఖర్’ అనే ΄ాఠం ఉండేది. మా హిందీ టీచర్ ఆ ΄ాఠాన్ని ఎంత అద్భుతంగా చె΄్పారంటే... బచేంద్రి΄ాల్లాగ నేను కూడా పర్వతారోహణ చేయాలనుకున్నాను. పర్వతాల గురించి తెలుసుకోవడం కూడా అప్పటి నుంచే మొదలైంది. గత ఏడాది ఏప్రిల్లో ఎన్సీసీ, హైదరాబాద్ కమాండర్ కల్నల్ అనిల్ ఆధ్వర్యంలో మౌంటెనీరింగ్ అవకాశం రాగానే మరేమీ ఆలోచించకుండా ట్రైనింగ్కి వెళ్లాను. హెచ్ఎమ్ఐ (హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్) ఆధ్వర్యంలో డార్జిలింగ్లో నెల రోజులు బేసిక్ ట్రైనింగ్, ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్, సెర్చ్ అండ్ రెస్యూ్క మెథడ్స్ ట్రైనింగ్ ఉత్తరాఖండ్లో పూర్తి చేసుకుని ఎక్స్పెడిషన్కు సిద్ధమయ్యాను. అమ్మకు దూరంగా యాభై రోజులుఢిల్లీలో మే 28న ఫ్లాగ్ ఆఫ్, జూన్ 29న ఫ్లాగ్ ఆన్ జరిగింది. ముందు, వెనుక ప్రయాణాలన్నీ కలిపి యాభై రోజులు ఇంటికి దూరంగా ఉండడం అదే మొదటిసారి. అమ్మానాన్నల దగ్గర ఉన్నప్పుడు వాళ్ల ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటాం. వాళ్లకు దూరంగా ఉండడం ఎంత కష్టమో దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. అమ్మానాన్నల ప్రేమ ఎంత అమూల్యమైనదో తెలిసి వచ్చిన క్షణాలవి. ఎయిర్ఫోర్స్లో ఉద్యోగానికి వెళ్లాలనుకున్నప్పుడు అమ్మ ఒప్పుకోలేదు. మౌంటెనీరింగ్కీ ఒప్పుకోలేదు. అమ్మను ఒప్పిస్తే నాన్న ఆటోమేటిగ్గా ఒప్పుకుంటాడని, అమ్మను బాగా కన్విన్స్ చేశాను. ఈ టాస్క్ను విజయవంతంగా పూర్తి చేశాను. ఇక రక్షణరంగాన్ని కెరీర్గా ఎంచుకోవడం గురించి ఒప్పించి, నాకున్న డిఫెన్స్ యూనిఫామ్ కల నెరవేర్చుకోవాలి. ఇప్పుడు ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది. ఆరోహణలో అవరోధాలు కాంగ్ యాత్సే 2 పర్వతారోహణ మర్ఖా వ్యాలీ దగ్గర మొదలవుతుంది. మౌంటెనీరింగ్ బూట్స్, క్రాంపన్స్లలో ఐదు కేజీల బరువులుంటాయి. అవసరమైన వస్తువులతో ఇరవై కేజీల బ్యాగ్ మోస్తూ నడక మొదలవుతుంది. ఐదువేల మీటర్లు దాటిన తర్వాత బేస్క్యాంప్ ఉంటుంది. అక్కడి వరకు మన అన్నం, పప్పు ఉంటాయి. ఆంతకు పైకి వెళ్లే కొద్దీ అన్నం ఉడకదు, చ΄ాతీలు కాల్చడం కుదరదు. డ్రై రేషన్... అంటే డ్రై ఫ్రూట్స్, నట్స్, చాక్లెట్లు, న్యూట్రిషన్ బిస్కట్లు, ఓఆర్ఎస్ ΄్యాకెట్లతో ప్రయాణం కొనసాగుతుంది. నడక... నడక... ధ్యానంలాగ తదేక దీక్షతో సాగుతుంది. అడుగు పడిన చోట గట్టిగా ఉందా జారుతోందా అని మన ముందు వాళ్ల అడుగులను గమనిస్తూ వెళ్లాలి. ఈ నడక సమయంలో అనేక ఆలోచనలు వస్తాయి. ముందుకెళ్లి ఏం సాధిస్తాం, వెనక్కి వెళ్తే నష్ట΄ోయేదేముంది... అని కూడా అనిపిస్తుంది. ఆరోహణ పూర్తయ్యేటప్పటికి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారుతాం. పరస్పరం సహకరించుకోవడంతో΄ాటు ఉద్వేగాలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండడం, ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వినే లక్షణం కూడా అలవడుతుంది. శిఖరాన్ని చేరినప్పుడు సమయం ఉదయం ఏడున్నర. సూర్యోదయం అయింది. చుట్టూ తెల్లని వలయం ఆవరించినట్లు ఉంది. వైట్ అవుట్ అంటారు. మేఘాలు ఆవరించి ఉంటాయి. పది మీటర్ల దూరాన ఉన్న మనిషి కూడా కనిపించడు. శిఖరాన్ని అధిరోహించినప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించగలిగినంత సాహిత్యాన్ని చదవలేదు’’ అని నవ్వుతూ ముగించింది శ్రద్ధాంజలి సాహు. మౌంటెనీరింగ్లో వచ్చే ఏడాది జరిగే మౌంట్ ఎవరెస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పెడిషన్కు ఆమెకు ఆహ్వానం వచ్చింది. ఎంపిక ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి
Advertisement
Comments
Please login to add a commentAdd a comment