మన ఉనికికి ఏదన్నా ప్రమాదమంటారా..!
మన ఉనికికి ఏదన్నా ప్రమాదమంటారా..!
Published Wed, Nov 15 2017 1:16 AM | Last Updated on Mon, Aug 20 2018 8:13 PM
Advertisement
Related news by tags
-
చర్లపల్లి టెర్మినల్ రెడీ!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రయాణికులకు సకల సదుపాయాలతో ఎయిర్పోర్టు తరహాలో చర్లపల్లి టెర్మినల్ను తీర్చిదిద్దారు. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపైన ఒత్తిడిని తగ్గించేందుకు నాలుగో టెర్మినల్గా దక్షిణమధ్య రైల్వే చర్లపల్లి పునరి్నర్మాణం చేపట్టింది. సుమారు రూ.434 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు 98 శాతం పూర్తయినట్లు స్వయంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రకటించారు. వాస్తవానికి లోక్సభ ఎన్నికల కంటే ముందే దీన్ని వినియోగంలోకి తేవాలని భావించినప్పటికీ అప్పట్లో ఇంకా కొన్ని పనులు మిగిలిపోవడం వల్ల సాధ్యం కాలేదు. ఆ తరువాత ఎన్నికల కోడ్ వచ్చేసింది. ప్రస్తుతం దాదాపుగా పనులన్నీ పూర్తి కావడంతోనే త్వరలోనే చర్లపల్లి టెర్మినల్ను ప్రారంభించనున్నారు.రోజుకి 50 రైళ్ల రాకపోకలకు అవకాశంసికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్న దృష్ట్యా ప్రస్తుతం సికింద్రాబాద్ వరకు రాకపోకలు సాగిస్తున్న కొన్ని రైళ్లను త్వరలో చర్లపల్లి నుంచి నడుపనున్నారు. 9 ప్లాట్ఫామ్లతో ఏర్పాటు చేసిన చర్లపల్లి నుంచి రోజుకు 50 రైళ్లు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం 30 రైళ్లతో (15 జతలు) చర్లపల్లి స్టేషన్ను వినియోగంలోకి తేనున్నారు. మొదట 25 వేల మందికి పైగా చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనున్నారు. రైళ్లు పెరిగే కొద్దీ ప్రయాణికుల సంఖ్య పెరగనుంది.ఔటర్కు చేరువలో...⇒ ఔటర్రింగ్ రోడ్డుకు చేరువలో ఉన్న చర్లపల్లి స్టేషన్కు నగరవాసులు వివిధ ప్రాంతాల నుంచి ఔటర్ మీదుగా చేరుకొనేందుకు అవకాశం ఉంది. మరోవైపు ఎంఎంటీఎస్ రెండో దశలో విస్తరించిన సికింద్రాబాద్–ఘట్కేసర్ రూట్లో ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు కూడా ప్రారంభం కానున్నాయి.⇒ దీంతో ప్రయాణికులు నగరానికి పడమటి నుంచి తూర్పు వైపు తేలిగ్గా రాకపోకలు సాగించవచ్చు. ⇒ ప్రయాణికుల సదుపాయాల్లో భాగంగా 5 లిఫ్టులు, 9 ఎస్కలేటర్లు ఉన్నాయి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు సోలార్ పవర్ ప్రాజెక్టును చేపట్టారు. ⇒ ప్రయాణికుల రాకపోకల కోసం రెండు సబ్వేలను నిర్మించారు. అలాగే రహదారులను విస్తరించారు. సుమారు 4 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకర్లను సిద్ధం చేశారు.చర్లపల్లి నుంచి నడిచే రైళ్లు ఇవే... ⇒ షాలిమార్ నుంచి సికింద్రాబాద్కు రాకపోకలు సాగిస్తున్న ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ (18045/18046),. ⇒ చెన్నై నుంచి నాంపల్లి స్టేషన్కు నడిచే చార్మినార్ ఎక్స్ప్రెస్ (12603/12604) ⇒ గోరఖ్పూర్ నుంచి సికింద్రాబాద్కు రాకపోకలు సాగించే (12589/12590) గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్.. ⇒ హైదరాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17011/17012), సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (12757/12758), ⇒ గుంటూరు–సికింద్రాబాద్ (17201/17202) గోల్కొండ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17233/17234) భాగ్యనగర్ ఎక్స్ప్రెస్.. ⇒ విజయవాడ–సికింద్రాబాద్ (12713/12714) శాతవాహన ఎక్స్ప్రెస్, గుంటూరు–సికింద్రాబాద్ (12705/12706) ఎక్స్ప్రెస్, తదితర రైళ్లను చర్లపల్లి నుంచి నడుపనున్నారు. ⇒ మొత్తంగా మొదట 15 జతల రైళ్లు చర్లపల్లి నుంచి ప్రారంభం కానున్నాయి. -
రాష్ట్రం నుంచి ఢిల్లీకి సూట్కేసులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఆరు నెలల కిందట అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ పార్టీ ఆర్జీ ట్యాక్స్, ఆర్ట్యాక్స్, యూకే ట్యాక్స్, బీవీ ట్యాక్స్ పేరుతో వసూళ్లకు తెగబడింది. ఢిల్లీకి మూటలు మోసే పనిలో పడింది. పదేళ్లు కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటే, ఇప్పుడు తెలంగాణ ప్ర భుత్వాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ దోచుకుంటోంది. పరిపాలనను పక్కనబెట్టి భూకబ్జాలు, సెటిల్మెంట్లు, కమీషన్లు, పర్సంటేజీల పేరుతో ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్న సొమ్మును పోటీపడి ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు ఢిల్లీకి కప్పం కట్టే పనిలో బిజీ అయిపోయారు’అని అని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ధ్వజమెత్తారు.శంషాబాద్లో శుక్రవారం బీజేపీ రాష్ట్ర విస్త్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్. కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. పదేళ్ల బీఆర్ఎస్ కుటుంబ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ’’మంత్రులు, ఎమ్మెల్యేలు సహా బీఆర్ఎస్ నాయకులు అవినీతికి పాల్పడని రంగం లేదు.ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, గ్రానైట్ మాఫియా, లిక్కర్ మాఫియా, డ్రగ్స్ మాఫియాలో కూరుకుపోయి ప్రజాధనాన్ని, రాష్ట్ర ఖజానాను లూఠీ చేశారు. పర్యవసానంగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఆఖరుకు ఇప్పుడే పుట్టిన బిడ్డకు సైతం నెత్తిన లక్షల రూపాయల అప్పు మూటను మోపారు. తామేమీ తక్కువ కాదన్నట్లుగా కొత్తగా అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ పార్టీ అక్రమ వసూళ్లకు తెగబడింది. ఢిల్లీకి మూటలు మోసే పనిలో పడింది. పేరు మారిందే కానీ పెద్దగా బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు తేడాలేదు. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను నయవంచన చేసి అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ పార్టీ అతితక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది.’’అని విమర్శించారు. ఫిరాయింపులే కార్యాచరణగా.. ’’ప్రజాపాలనపై సోయిలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఫిరాయింపులను ప్రధాన కార్యాచరణగా ముందుకెళ్తోంది. గత బీఆర్ఎస్ పార్టీ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, ప్రజా తీర్పునకు, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడుస్తోంది. శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు పార్టీ మారితే డిస్ క్వాలిఫై చేయాలన్న కాంగ్రెస్పారీ్ట, తమ ఎజెండాను తుంగలో తొక్కింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కాంగ్రెస్లో చేర్చుకుంటుంది. గాంధీ భవన్ గులాబీ భవన్లా మారింది.’’అని కిషన్రెడ్డి నిందించారు. సెక్యూరిటీ లేకుండా రాహుల్కు ఓయూలో తిరిగే దమ్ముందా?: బండి సంజయ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తోందంటూ మాట్లాడుతున్న రాహుల్ గాం«దీకి సవాల్ విసురుతున్నా. తెలంగాణలో మీ కాంగ్రెస్ పార్టే అధికారంలో ఉంది కదా! సెక్యూరిటీ లేకుండా మీకు ఉస్మానియా యూనివర్శిటీలో తిరిగే దమ్ముందా? తెలంగాణలో నిరుద్యోగం అంటువ్యాధిలా ఏ స్థాయిలో విస్తరిస్తుందో వారిని కలిసి మాట్లాడితే తెలుస్తుంది.అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేసిన కాం గ్రెస్ పార్టీయే అంటువ్యాధి లాంటిది. మోదీరోజ్గార్ మేళాతో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. అయినా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా విస్తరిస్తోందని రాహుల్ గాంధీ చెప్పడం సిగ్గు చేటు’’అని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. రిటైర్డ్ పోలీసు అధికారిని చైర్మన్ చేయడం వల్లనే సమస్యలు: ఎంపీ రఘునందన్ ’’ప్రభుత్వం ఓ రిటైర్డ్ పోలీసు అధికారిని టీజీఎస్పీ చైర్మన్గా నియమించింది. ఆయన పదవీకాలం డిసెంబర్తో ముగియనుంది. తన హయాంలో ఉద్యోగాలు భర్తీ చేయాలన్న తప్పుడు ఆలోచనతోనే సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. డీఎస్సీ కోసం మరో 45 రోజుల సమయం కేటాయించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గ్రూప్–1,2,3 ఉద్యోగ పోస్టులను పెంచకుండా నిరుద్యోగులను మోసం చేసింది.గ్రూప్–1 మెయిన్స్కు 1ః100 ఎంపిక చేయాలని ప్రతిపక్షంలో ఉండగా, ఇదే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిండు సభలో గుర్తు చేశారు’’అని ఎంపీ రఘునందన్ పేర్కొన్నారు. నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనకు బీజేపీ మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలున్నా కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదనీ, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ జరిపించాలని మాట్లాడిన రేవంత్ ఇప్పుడెందుకు నోరుమెదపడం లేదని రఘునందన్ నిలదీశారు. కాలేజీల నుంచి ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు: ఈటల ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల యాజమాన్యాల నుంచి కూడా ఆర్ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. అందుకే విద్యార్థుల నుంచి యాజమాన్యాలు ఎక్కువ డబ్బులు తీసుకునే దుస్థితి నెలకొందన్నారు. కాంట్రాక్టర్లు, సర్పంచులు చేసిన పనులకు బిల్లులు ఇచ్చే అధికారం తమకు లేదంటూ ఆర్థిక శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారన్నారు. శుక్రవారం శంషాబాద్లో బీజేపీ విస్తృత సమావేశం సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి బిల్లుకి 8 శాతం డబ్బులు ముందు చెల్లిస్తేనే బిల్లులు విడుదల చేసే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ డబ్బులు కూడా లంచం ఇస్తే తప్ప వచ్చేలా లేవన్నారు.ప్రతిబిల్లుకి డబ్బులు తీసుకునే నీచ సంస్కృతి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వచి్చందని మండిపడ్డారు. ఏడు నెలల కాలంలోనే అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాల క్రమబదీ్ధకరణకు సంబంధించి జీవో నంబర్ 58, 59ని అమలు చేస్తానని హామీ ఇచి్చన రేవంత్రెడ్డి దానిని మరచారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశం లేదని, కాంగ్రెస్ పట్ల విశ్వాసం లేదని, ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎన్నికలు వచి్చనా గెలుపొందేది బీజేపీయేనని ధీమా వ్యక్తంచేశారు. -
హైదరాబాద్కు కిషన్ రెడ్డి ఏం తెచ్చాడు?: మంత్రి పొన్నం ఫైర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్రెడ్డి హైదరాబాద్కు ఏం తెచ్చాడు? అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అలాగే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ అసమర్థుడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.కాగా, మంత్రి పొన్నం తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్కు కౌంటరిచ్చారు. మంత్రొ పొన్నం ప్రభాకర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘హైదరాబాద్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా కిషన్రెడ్డి మాట్లాడటాన్ని ఖండిస్తున్నాను. హైదరాబాద్కు కిషన్ రెడ్డి ఏం తెచ్చాడు?. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు హైదరాబాద్ను నిర్లక్ష్యం చేశాయి.తెలంగాణకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి కాగానే హైదరాబాద్ ఇంచార్జీ మంత్రిగా కలిశాను. కేటీఆర్ కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయాడు. కేటీఆర్ పెద్ద అసమర్థుడు. హైదరాబాద్ అస్తవ్యస్తం కావడానికి కారణం కేటీఆరే. ఉద్యోగ క్యాలెండర్ తప్పకుండా ఇస్తాం. ఉద్యోగ నియామకాలు జాప్యం అవుతున్నాయని మొన్నటి వరకు ప్రశ్నించి, ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయండి అంటున్నారు. రాజకీయ నాయకుల ఉచ్చులో విద్యార్థులు పడకండి. విద్యార్థుల న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరిస్తాం’ అని కామెంట్స్ చేశారు. -
సికింద్రాబాద్ – గోవా మధ్య కొత్త బైవీక్లీ ఎక్స్ప్రెస్ రైలు
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలనుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్ప్రెస్ రైలును (17039/17040) ప్రారంభించనుంది. ఈ బై వీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయల్దేరి గోవా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం అవుతుంది. ఇప్పటివరకు వారానికి ఒక రైలు 10 కోచ్లతో సికింద్రాబాద్ నుంచి బయల్దేరి గుంతకల్కు చేరుకుని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 కోచ్లతో కలుపుకుని గోవాకు చేరుకునేది. ఇది కాకుండా కాచిగూడ –యలహంక మధ్య వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్లే 4 కోచ్లను కలిపేవారు. ఈ 4 కోచ్లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ – గోవా మధ్య తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు. అయితే సికింద్రాబాద్ – గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలామంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ...రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు ఈ ఏడాది మార్చి 16న కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖ రాశారు.మళ్లీ కేంద్రంలో మూడోసారి మోదీ సర్కారు అధికారంలోకి రావడంతో..ఈ ప్రాజెక్టు విషయాన్ని ఇటీవల రైల్వేశాఖ మంత్రిని కలిసిన సందర్భంగా కిషన్రెడ్డి గుర్తు చేశారు. దీనిపై అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. దీంతో సికింద్రాబాద్–వాస్కోడిగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. ఈ రైలు సికింద్రాబాద్, కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ వాస్కోడిగామా చేరుకుంటుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై జి.కిషన్రెడ్డి ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. -
గోవా వెళ్లే తెలుగు వారికి కేంద్రం గుడ్న్యూస్..
సాక్షి, ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్‑గోవా మధ్య కొత్త బైవీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ను ప్రారంభించనుంది. సికింద్రాబాద్ నుంచి బుధ, శుక్రవారాల్లో ఈ రైలు గోవా బయలుదేనుంది. గోవా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం కానుంది. సికింద్రాబాద్, కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ.. వాస్కోడగామా చేరుకుంటుంది. ఈ సందర్భంగా ప్రధాని, రైల్వే శాఖ మంత్రులకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకూ వారానికి ఒకరైలు 10 కోచ్లతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్కు చేరుకొని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్ళే మరో 10 కోచ్లతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు ప్రయాణం సాగించేది. ఇది కాకుండా కాచీగూడ - యలహంక మధ్యన వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్ళే 4 కోచ్ లను కలిపేవారు. ఈ 4 కోచ్ లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ - గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు.ఇలా సికింద్రాబాద్ - గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలా మంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ మార్చి 16, 2024 నాడు రాశారు. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రైల్వేశాఖ ఈ ప్రతిపాదనను పక్కన పెట్టాల్సి వచ్చింది.మళ్లీ కేంద్రంలో మూడోసారి మోదీ సర్కారు అధికారంలోకి రావడంతో.. ఈ ప్రాజెక్టు విషయాన్ని ఇటీవల రైల్వేశాఖ మంత్రిని కలిసిన సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తుచేశారు. దీనిపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. దీంతో సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ప్రకటించింది.ఈ నిర్ణయంపై కిషన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో అవసరమైన ఈ రైలును ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ బైవీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వాస్కోడగామా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం అవుతుంది. ఇది సికింద్రాబాద్, కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ.. వాస్కోడగామా చేరుకుంటుంది.
Related News by category
-
Balasana: ఒత్తిడిని తగ్గించే బాలాసనం
బాలాసనంలో శరీరం మొత్తం ముందుకు సాగి, చంటి పిల్లలు బోర్లా పడుకున్నప్పుడు కనిపించే భంగిమలో ఉంటారు. దీనిని శశాంకాసనం అనికూడా ఉంటారు. ఈ ఆసనంలో వెన్నెముక సాగి, మోకాళ్లు బలపడతాయి. పోత్తికడుపులోని అవయవాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుం నొప్పి సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి తగ్గి, శరీరం మొత్తం విశ్రాంతి పొందుతుంది.ముందుగా మ్యాట్పైన కాలి మడమల మీద హిప్ భాగం ఉండేలా వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి ఎత్తాలి. శ్వాస వదులుతూ తల, పోట్ట భాగాన్ని ముందుకు మెకాళ్ల మీదుగా పూర్తిగా వంచాలి. చేతులను నేలపై తలకిరువైపులా వెడల్పుగా ‘వి’ ఆకారంలో ఉంచాలి. ఈ పోజిషన్లో 30 సెకన్లపాటు ఆగి, విశ్రాంతి ΄పోందాలి. తర్వాత తిరిగి వజ్రాసనంలోకి రావాలి. ఇలా సుమారు 10 సార్లు చేయాలి. ఫలితాలు: రోజువారీ పనుల ద్వారా కలిగే ఒత్తిడి, చిరాకులాంటి సమస్యలు దూరం అవుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పేగులు, కాలేయం, మూత్రపిండాలకు బలం చేకూరుతుంది. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నవారికి మంచి ఉపశమనం లభిస్తుంది. ఎముకల సమస్యతో బాధపడేవారు, హైబీపి ఉన్నవారు నిపుణుల సూచనలు తీసుకోవాలి. – జి. అనూషా రాకేష్, యోగా ట్రైనర్ -
చిన్నారి సేవాగుణం
ఎంతోమంది విదేశాలకు వెళ్లిన తర్వాత పుట్టి పెరిగిన ప్రాతాన్ని మర్చిపోతుంటారు. కాని కరీంనగర్ నుంచి అమెరికా వెళ్లి అక్కడ నివాసం ఉంటున్న ఓ ప్రవాస భారతీయుడి కుమార్తె సొంత ఊరిపై మమకారంతో అనాథ విద్యార్థుల కోసం విరాళాలు సేకరించి అందించింది. ఈ రకంగా తన తల్లితండ్రులు పెరిగిన ఊరిపై ప్రేమను చాటుకుంది.కరీంనగర్ పట్టణానికి చెందిన ప్రవాస భారతీయులు లక్కాకుల వినయ్ అమెరికాలోని మిచిగాన్ లో నివసిస్తుండగా వారి కూతురు లక్కాకుల హరిణి అమెరికాలోని నోవి హైస్కూల్లో విద్యనభ్యసిస్తున్నారు. హరిణి ΄ాఠశాల సామాజిక సేవాకార్యక్రమంలో భాగంగా రూ.1.65 లక్షల మేరకు విరాళాలు సేకరించింది. ఈ మొత్తాన్ని హరిణి కరీంనగర్ పట్టణంలోని వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలగోకులంలో 40 మంది అనాథ విద్యార్థులకు విద్యాబుద్ధులను గరపడంతో΄ాటు సకల సౌకర్యాలను కలుగజేస్తున్నారని తెలుసుకొని వారి అవసరాల కోసం విరాళంగా ఇచ్చారు. వయసులో చిన్న అయినా, పెద్ద మనసుతో విరాళాలు సేకరించి ఇచ్చిన హరిణికి బాలగోకులం విద్యార్థులు, వెంకట్ ఫౌండేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
సాయం కాపాడుతున్న ప్రాణం
క్రౌడ్ ఫండింగ్పెద్ద జబ్బుతో ఆసుపత్రి పాలైన నిరుపేదల దగ్గర లక్షల్లో ఖర్చుచేసేటంత డబ్బు ఉండదు. ప్రాణాలు నిలబడాలంటే ఏం చేయాలి మరి? ఇందుకు సమాధానమే క్రౌడ్ ఫండింగ్. ఆరోగ్యం, విద్య, జంతువుల సంక్షేమం, ప్రకృతి వైపరీత్యాలు, మహిళా సాధికారత కోసం విరాళాలను క్రౌడ్ ఫండింగ్ ద్వారా సమకూర్చుతున్నాయి కొన్ని ఆన్లైన్ వేదికలు.కర్నూలు జిల్లాకు చెందిన తొమ్మిదేళ్ల సానియా వెంట్రిక్యులర్ సెస్టల్ డిఫెక్ట్ వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి చికిత్సకు రూ.12 లక్షలు కావాలి. తండ్రి రాళ్లు కొట్టే పని చేస్తుంటాడు. తల్లి గృహిణి. కుమార్తెకు చికిత్స చేయించే స్తోమత లేకపోవడంతో వీరికి ‘ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్’ అండగా నిలిచింది. ఈ ఫౌండేషన్ విభిన్న వేదికల్లో క్రౌడ్ ఫండింగ్ చేపట్టింది. రూ.12 లక్షలు క్రౌడ్ ఫండింగ్ ద్వారా జమ అయ్యి, చిన్నారికి చికిత్స జరిగింది. ప్రాణాలు నిలబడ్డాయి. రహ్మద్ బాషా విజయవాడలో పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఇటీవల అతనికి నెలల నిండకుండానే 704 గ్రాముల బరువుతో కూతురు పుట్టింది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఐసీయు లో చికిత్స పోందుతోంది. పాప చికిత్సకు రూ.14 లక్షలు అవసరం. దయచేసి, సహాయం చేసి, మా పాపను బతికించండి’ అని క్రౌడ్ఫండింగ్ నిధుల సమీకరణ లింక్లో విన్నవించుకున్నాడు. చికిత్సకు అవసరమయ్యే డబ్బు వారికి అందుతోంది. కేరళలోని ఎర్నాకుళానికి చెందిన సారంగ్ మీనన్, అదితి నాయర్ల ఏడాదిన్నర కుమారుడు నిర్వాణ్ వెన్నెముక కండరాల క్షీణత అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ చికిత్సకు దాదాపు రూ.17.5 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చె΄్పారు. ఈ వ్యాధి నివారణకు ఉపయోగించే వన్టైమ్ డ్రగ్ జోల్జెన్మ్సా ఇండియాలో అందుబాటులో లేదు. దీనిని అమెరికా నుంచి తెప్పించాలి. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ΄్లాట్ఫామ్ ద్వారా తెలియజేయడంతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా 72 వేల మంది విరాళాలు అందించారు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా, మా వల్ల ఏమవుతుంది... అంటూ కుదేలవ్వాల్సిన పని లేదని చెప్పే ఇలాంటి కథనాలు ఎంతో ధైర్యాన్నిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఎంత అవసరం వచ్చినా, దాతల నుంచి విరాళాలు తెచ్చి పెట్టేందుకు నేడు ఎన్నో వేదికలు పనిచేస్తున్నాయి. వేలాది మంది బాధితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయి. అదే సమయంలో ఇలాంటి బాధితులకు సాయం చేశామనే సంతృప్తి దాతలకు లభిస్తోంది. కాకపోతే విరాళం ఇచ్చే ముందు విచారించి, నిజమైనదేనని నిర్ధారించుకోవడం ద్వారా తమ దానం నిష్ఫలం కాకుండా చూసుకోవచ్చు. మెడికల్ క్రౌడ్ ఫండింగ్ ΄్లాట్ఫామ్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటే.. సాయం పోందచ్చు. తోచినంత సాయమూ చేయచ్చు.నిధుల సేకరణ ఇలా..!దాతల సాయం అవసరమైన ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ΄్లాట్ఫామ్లను (ఇంపాక్ట్ గురూ, మిలాప్, కెట్టో, గో ఫండ్ మి, కిక్స్టార్టర్... మొదలైనవి) సంప్రదించవచ్చు ∙΄ాన్, ఆధార్, మెడికల్ డాక్యుమెంట్లు సమర్పించాలి. ఎంక్వైరీ అనంతరం వారి తరఫున నిధుల సమీకరణ పేజీని అవి సిద్ధం చేస్తాయి సాయం అవసరమైన వారు ఈ పేజీ లింక్ను తమ నెట్వర్క్లో షేర్ చేసుకోవాలి ∙విరాళంలో కొంత మొత్తాన్ని కమీష్న్ రూపంలో మినహాయించుకునేందుకు సమ్మతి తెలియజేస్తే, వారి తరఫున క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు విస్తృత ప్రచారాన్ని చేపడతాయి ∙విరాళం ఇచ్చేందుకు పేమెంట్ లింక్లు కనిపిస్తాయి. ఇలా చేసే చెల్లింపులన్నీ పన్ను రాయితీ కల్పిస్తాయి ∙కావాల్సిన మొత్తం వచ్చినా, గడువు ముగిసినా లేదంటే బాధితులు అకాలంగా మరణించినా నిధుల సమీకరణ ఆగిపోతుంది. అనంతరం ఈ మొత్తం నుంచి కమీష్న్ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని బాధితులకు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు చెల్లిస్తాయి. ఇలా చేసే ముందు హాస్పిటల్ బిల్లులను చెక్ చేస్తాయి.విశ్వసనీయమైన ఎంపికక్రౌడ్ ఫండింగ్లో ప్రతి ప్రయత్నం సవాల్తో కూడుకున్నదే. ప్రచారం చేసినప్పటికీ మొత్తం నిధుల సేకరణ లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో క్రౌడ్ఫండింగ్ విశ్వసనీయమైన ఆర్థిక ఎంపికగా మారినందున మోసం, దుర్వినియోగం వంటివీ జరగచ్చు. తప్పుదారి పట్టించే లేదా మోసపూరితమైన నిధుల సమీకరణను చూసినట్లయితే, దానిని వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. – సాయంతి రాయ్, హెడ్ కమ్యూనికేషన్స్, మిలాప్ -
ఆకాంక్షలే ఆలంబనగా రొట్టెల పండగ
అక్కడకు తరలి వచ్చేవారివి చిన్న చిన్న కోరికలే. చదువు రావాలి, ఉద్యోగం రావాలి, వివాహం జరగాలి, సంతానం కలగాలి అనే... జీవితంలో ఆకాంక్షలు ఉండాలి. ఆ ఆకాంక్షలు నెరవేరతాయనే ఆశ ఉండాలి. అలాంటి వారికి అభయమిచ్చే ఆధ్యాత్మిక వేడుకలు ఎన్నో. అలాంటి వాటిలో ఒకటి ‘రొట్టెల పండగ’ నెల్లూరులో జరిగే ఈ పండగలో స్త్రీలు విశేషంగా ΄ాల్గొంటారు. ప్రతి సంవత్సరం మొహరం పండగ వేళలో నెల్లూరు వీధులు ΄ోటెత్తుతాయి. దేశ విదేశాల నుంచి జనం నెల్లూరులోని బారా షహీద్ దర్గా దగ్గరకు చేరుకుంటారు. కులం, మతం, భాష, ్ర΄ాంతం... తేడా లేకుండా అక్కడి స్వర్ణాల చెరువులో మొక్కు మొక్కుకుంటారు. లేదా తీర్చుకుంటారు. మొక్కు తీరిన వారు రొట్టె పంచుతారు. మొక్కుకునే వారు ఆ రొట్టెను స్వీకరిస్తారు. తరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం చెక్కు చెదరడం లేదు. ప్రతి సంవత్సరం ఐదు రోజుల ΄ాటు జరిగే ఈ వేడుక నిన్నటి నుంచి çఘనంగా జరుగుతోంది. ఇది ప్రధానంగా స్త్రీల పండగ.ఎవరు ఈ బారా షహీద్?మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడంలో భాగంగా టర్కీ నుంచి సుమారు 300 ఏళ్ల క్రితం 12 మంది మతబోధకులు భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కొడవలూరు మండలంలోని గండవరంలో తమిళనాడు వాల్జారాజులకు, బీజాపూర్ సుల్తాన్లకు మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ 12 మంది వీరమరణం ΄÷ందారు. వీరి తలలు గండవరంలో తెగిపడగా మొండాలను గుర్రాలు నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు తీసుకు వచ్చాయి. ఈ 12 మంది నెల్లూరు ఖ్వాజీకి కలలో కనపడి తమను అక్కడే సమాధి చేయాలని కోరడంతో అక్కడే సమాధులు నిర్మించారు. 12ను ఉర్దూలో బారా, వీర మరణం ΄÷ందిన అమరులను షహీద్లుగా పిలుస్తారు. అందుకే ఈ దర్గాకు బారా షహీద్ అనే పేరొచ్చింది. రొట్టెల ఆనవాయితీతమిళనాడు నుంచి నెల్లూరు వరకు ఆర్కాట్ నవాబుల ఏలుబడిలో ఉన్నప్పుడు నవాబు భార్య జబ్బు పడితే ఆమెకు నయం అయ్యే మార్గం కోసం నవాబు ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో బారా షహీద్ దర్గా దగ్గర బట్టలు ఉతుకుతున్న రజకునికి ఆ రాత్రి బారా షహీద్లు కనబడి మా సమాధుల దగ్గరి మట్టి తీసుకుని నవాబు భార్య నుదుటికి రాస్తే నయం అవుతుందని చె΄్పారు. ఆ సంగతి రజకుడు ఊరి వారికి తెలుపగా వారు నవాబుకు తెలియచేశారు. మట్టి తెప్పించిన నవాబు దానిని తన భార్య నుదుటికి రాయగా 24 గంటల్లో ఆమెకు నయం అయ్యింది. దాంతో అతడు అంత దూరం నుంచి బారా షహీద్ దర్గాను చూడటానికి వచ్చాడు. దర్శనం అయ్యాక అక్కడ ఉన్న పేదలకు రొట్టెలు పంచాడు. మొక్కు తీరాక ఇలా రొట్టెలు పంచడం ఆనవాయితీ అయ్యింది. ఈ నెల 21 వరకు రొట్టెల పండగ జరుగుతుంది.వివాహం రొట్టె.. సంతాన రొట్టెనెల్లూరు బారా షహీద్ దర్గాలో మొక్కు రొట్టెతో ముడిపడి ఉంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు ఉద్యోగం, ప్రమోషన్, సౌభాగ్యం, సంతానం, విద్య, స్వగృహం, వ్యా΄ారం... ఈ కోరికలు నెరవేరాలని మొక్కుకునేందుకు వస్తారు. గతంలో మొక్కిన మొక్కులు తీరిన వారు రొట్టెలతో వస్తారు. వారి నుంచి రొట్టె తీసుకోవాలి. అంటే గతంలో వివాహ మొక్కు మొక్కుకుని వివాహం జరిగిన వారు రొట్టెలతో వస్తారు. వివాహం కావలసిన వారు వారి దగ్గర నుంచి రొట్టె స్వీకరించి తినాలి. మొక్కు తీరాక వాళ్లు ఇలాగే రొట్టెను తెచ్చి ఇవ్వాలి. బారా షహీద్ దర్గా పక్కనే ఉన్న స్వర్ణాల చెరువులో మోకాళ్ల లోతుకు దిగి స్త్రీలు ఈ రొట్టెల బదలాయింపు చేసుకుంటారు. బాకీ తీరాలనే రొట్టె, స్థలం కొనాలనే రొట్టె, ర్యాంకుల రొట్టె... ఇవన్నీ అదృష్టాన్ని బట్టి దొరుకుతాయి. అన్నింటి కంటే ఎక్కువగా ఆరోగ్య రొట్టె కోసం వస్తారు. – కొండా సుబ్రహ్మణ్యం, సాక్షి, నెల్లూరు -
పర్వత పుత్రి సాహు శ్రద్ధాంజలి సాహు...
ఒడిశాలో పుట్టి, హైదరాబాద్లో పెరిగిన పంతొమ్మిదేళ్ల అమ్మాయి. బీటెక్ ఫైనలియర్. చదివేది సాఫ్ట్వేర్ కోర్సే అయినా తన పరిజ్ఞానాన్ని దేశ రక్షణరంగం కోసం అంకితం చేయాలనుకుంటోంది. ‘ఆ కల కోసమే ఎన్సీసీలో చేరాను, ఆ కల నెరవేర్చుకునే క్రమంలో నన్ను నేను నిరూపించుకోవడం కోసమే పర్వతాన్ని అధిరోహించాను’ అంటోంది. గత జూన్ నెల 21వ తేదీన కాంగ్ యాత్సే 2 పర్వతాన్ని అధిరోహించి, శిఖరం మీద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది. ‘నా కల చాలా పెద్దదని నాకు తెలుసు. ఆ కలను సాకారం చేసుకోవడానికి శ్రద్ధగా ఒక్కో అడుగు వేస్తున్నాను’ అంటూ ‘సాక్షి ఫ్యామిలీ’తో తన పర్వతారోహణ అనుభవాల్ని పంచుకుంది శ్రద్ధాంజలి సాహు. కాంగ్ యాత్సే పర్వతశ్రేణి హిమాలయాల్లో లధాక్ రీజియన్లో ఉంది. కాంగ్ యాత్సే పర్వత శిఖరం ఎత్తు 6,250 మీటర్లు. నా మౌంటెనీరింగ్ జర్నీ చాలా తమాషాగా జరిగి΄ోయింది. ఎయిత్లోనో, నైన్త్ క్లాస్లోనో గుర్తులేదు. హిందీలో ‘ఎవరెస్ట్ మేరీ శిఖర్’ అనే ΄ాఠం ఉండేది. మా హిందీ టీచర్ ఆ ΄ాఠాన్ని ఎంత అద్భుతంగా చె΄్పారంటే... బచేంద్రి΄ాల్లాగ నేను కూడా పర్వతారోహణ చేయాలనుకున్నాను. పర్వతాల గురించి తెలుసుకోవడం కూడా అప్పటి నుంచే మొదలైంది. గత ఏడాది ఏప్రిల్లో ఎన్సీసీ, హైదరాబాద్ కమాండర్ కల్నల్ అనిల్ ఆధ్వర్యంలో మౌంటెనీరింగ్ అవకాశం రాగానే మరేమీ ఆలోచించకుండా ట్రైనింగ్కి వెళ్లాను. హెచ్ఎమ్ఐ (హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్) ఆధ్వర్యంలో డార్జిలింగ్లో నెల రోజులు బేసిక్ ట్రైనింగ్, ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్, సెర్చ్ అండ్ రెస్యూ్క మెథడ్స్ ట్రైనింగ్ ఉత్తరాఖండ్లో పూర్తి చేసుకుని ఎక్స్పెడిషన్కు సిద్ధమయ్యాను. అమ్మకు దూరంగా యాభై రోజులుఢిల్లీలో మే 28న ఫ్లాగ్ ఆఫ్, జూన్ 29న ఫ్లాగ్ ఆన్ జరిగింది. ముందు, వెనుక ప్రయాణాలన్నీ కలిపి యాభై రోజులు ఇంటికి దూరంగా ఉండడం అదే మొదటిసారి. అమ్మానాన్నల దగ్గర ఉన్నప్పుడు వాళ్ల ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటాం. వాళ్లకు దూరంగా ఉండడం ఎంత కష్టమో దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. అమ్మానాన్నల ప్రేమ ఎంత అమూల్యమైనదో తెలిసి వచ్చిన క్షణాలవి. ఎయిర్ఫోర్స్లో ఉద్యోగానికి వెళ్లాలనుకున్నప్పుడు అమ్మ ఒప్పుకోలేదు. మౌంటెనీరింగ్కీ ఒప్పుకోలేదు. అమ్మను ఒప్పిస్తే నాన్న ఆటోమేటిగ్గా ఒప్పుకుంటాడని, అమ్మను బాగా కన్విన్స్ చేశాను. ఈ టాస్క్ను విజయవంతంగా పూర్తి చేశాను. ఇక రక్షణరంగాన్ని కెరీర్గా ఎంచుకోవడం గురించి ఒప్పించి, నాకున్న డిఫెన్స్ యూనిఫామ్ కల నెరవేర్చుకోవాలి. ఇప్పుడు ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది. ఆరోహణలో అవరోధాలు కాంగ్ యాత్సే 2 పర్వతారోహణ మర్ఖా వ్యాలీ దగ్గర మొదలవుతుంది. మౌంటెనీరింగ్ బూట్స్, క్రాంపన్స్లలో ఐదు కేజీల బరువులుంటాయి. అవసరమైన వస్తువులతో ఇరవై కేజీల బ్యాగ్ మోస్తూ నడక మొదలవుతుంది. ఐదువేల మీటర్లు దాటిన తర్వాత బేస్క్యాంప్ ఉంటుంది. అక్కడి వరకు మన అన్నం, పప్పు ఉంటాయి. ఆంతకు పైకి వెళ్లే కొద్దీ అన్నం ఉడకదు, చ΄ాతీలు కాల్చడం కుదరదు. డ్రై రేషన్... అంటే డ్రై ఫ్రూట్స్, నట్స్, చాక్లెట్లు, న్యూట్రిషన్ బిస్కట్లు, ఓఆర్ఎస్ ΄్యాకెట్లతో ప్రయాణం కొనసాగుతుంది. నడక... నడక... ధ్యానంలాగ తదేక దీక్షతో సాగుతుంది. అడుగు పడిన చోట గట్టిగా ఉందా జారుతోందా అని మన ముందు వాళ్ల అడుగులను గమనిస్తూ వెళ్లాలి. ఈ నడక సమయంలో అనేక ఆలోచనలు వస్తాయి. ముందుకెళ్లి ఏం సాధిస్తాం, వెనక్కి వెళ్తే నష్ట΄ోయేదేముంది... అని కూడా అనిపిస్తుంది. ఆరోహణ పూర్తయ్యేటప్పటికి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారుతాం. పరస్పరం సహకరించుకోవడంతో΄ాటు ఉద్వేగాలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండడం, ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వినే లక్షణం కూడా అలవడుతుంది. శిఖరాన్ని చేరినప్పుడు సమయం ఉదయం ఏడున్నర. సూర్యోదయం అయింది. చుట్టూ తెల్లని వలయం ఆవరించినట్లు ఉంది. వైట్ అవుట్ అంటారు. మేఘాలు ఆవరించి ఉంటాయి. పది మీటర్ల దూరాన ఉన్న మనిషి కూడా కనిపించడు. శిఖరాన్ని అధిరోహించినప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించగలిగినంత సాహిత్యాన్ని చదవలేదు’’ అని నవ్వుతూ ముగించింది శ్రద్ధాంజలి సాహు. మౌంటెనీరింగ్లో వచ్చే ఏడాది జరిగే మౌంట్ ఎవరెస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పెడిషన్కు ఆమెకు ఆహ్వానం వచ్చింది. ఎంపిక ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి
Advertisement
Comments
Please login to add a commentAdd a comment