అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యం | The goal the betterment of marginalized communities | Sakshi

అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యం

Published Mon, Dec 12 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM

అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యం

అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యం

చిట్వేలి: సమాజంలో బడుగు, బలహీన అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతే తమ పార్టీ లక్ష్యమని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. చిట్వేలి మండలం యన్‌.ఉప్పరపల్లెలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని, విలేకరులతో మాట్లాడారు. పార్టీ బలోపేతానికి పాటు పడుతున్న కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు.  ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయక పోయినా పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు నాయకులు గణాంకాలతో గొప్పలు చెప్పుకుంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ చెవ్వు శ్రీనివాసులురెడ్డి, నాయకులు చొప్పా వెంకటరెడ్డి, మహేష్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, చంగల్‌రెడ్డి, రమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు గౌసియా, నరసింహులు, కరిముల్లాఖాన్, బషీరుద్దీన్, వెంకటరమణ, లోకేష్, పద్మాకర్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement