-
ప్రముఖ కంపెనీ మాజీ హెచ్ఆర్ హెడ్.. ఒడిశా అభ్యర్థుల్లో రిచెస్ట్
ఆదిత్య బిర్లా గ్రూప్ మాజీ హెచ్ఆర్ హెడ్, ప్రస్తుత లోక్సభ ఎన్నిలల్లో కటక్ నుంచి బీజేడీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంతృప్త్ మిశ్రా సుమారు రూ. 461 కోట్ల ఆస్తులను ప్రకటించారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఒడిశా అభ్యర్థుల్లో ఈయనే అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు.సంతృప్త్ మిశ్రా ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత గత ఫిబ్రవరిలో బీజేడీలో చేరారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఆయన ఆదాయపు పన్ను రిటర్న్స్ 2021-22లో రూ. 76.23 కోట్లు, 2022-23లో రూ. 66.21 కోట్లుగా ఉన్నాయి. నామినేషన్ దాఖలు సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్లో రూ.408 కోట్ల విలువైన చరాస్తులు, రూ.4 కోట్ల బ్యాంకు డిపాజిట్లు సహా రూ.53 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు.మ్యూచువల్ ఫండ్స్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, బాండ్లు, షేర్లలో మిశ్రా పెట్టుబడి మొత్తం ప్రస్తుత విలువ దాదాపు రూ. 308 కోట్లు. రూ.2.3 కోట్లకు పైగా విలువైన విలాసవంతమైన కార్లు ఆయనకున్నాయి. ఇక మిశ్రా భార్య చరాస్తుల విలువ రూ. 11.72 కోట్లు అని నివేదిక పేర్కొంది. ఒడిశాలో ఎటువంటి స్థిరాస్తి లేనప్పటికీ, మిశ్రాకు మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో వ్యవసాయ భూమి, హైదరాబాద్, ముంబైలలో ఫ్లాట్లు ఉన్నాయి.కాగా ఒడిశాలో 21 లోక్స్థానాలు, 147 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్నింటికీ ఏక కాలంలో నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సంతృప్త్ మిశ్రా పోటీ చేసే కటక్ లోక్సభ స్థానానికి మే 25న ఆరో దశలో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. -
భీకర గాలులు–నేలకొరిగిన చెట్లు
పర్లాకిమిడి: అల్పపీడన ద్రోణి ప్రభావంతో పర్లాకిమిడి, కాశీనగర్ సమితిల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీకర గాలులతో భారీ వృక్షాలు పలుచోట్ల నేలకొరిగాయి. సోమవారం సాయంత్రం నుండి రాత్రి వరకూ కురిసిన పెనుగాలి వర్షానికి డోలాట్యాంకు రోడ్డులో దండుమాలవీధి చర్చి వద్ద రెండు చెట్లు విరిగిపడ్డాయి. కాశీనగర్ సమితి సిద్ధమణుగు గ్రామంలో పెద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా పడటంతో పర్లాకిమిడి, గుణుపురం, రాయగడ, కోరాపుట్కు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. చెట్లను జిల్లా ప్రకృతి వైపరీత్యాల నివారణ సిబ్బంది తొలగించి రోడ్డును క్లియర్ చేశారు. పెనుగాలులకు పర్లాకిమిడిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
ప్రచార వాహనాలకు అనుమతి తప్పనిసరి
పర్లాకిమిడి: ఎన్నికల ప్రచారానికి వినియోగించే వాహనాలు, మైకుల కోసం అధికారుల నుంచి విధిగా అనుమతి తీసుకోవాలని గంజాం, గజపతి జిల్లాల ఎన్నికల ఖర్చు పరిశీలకుడు చంద్రికా గార్గ్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్లో పర్లాకిమిడి, మోహానా, దిగపోహాండి నియోజికవర్గాల అభ్యర్థులకు చెందిన ఎన్నికల ఖర్చుల రిజిష్టరు, ఖాతాలను మంగళవారం పరిశీలించారు. ఆమెతో పాటు జిల్లా ఎన్నికల అధికారి స్మృతిరంజన్ ప్రధాన్, డీఆర్డీఏ అధికారి గుణనిధి నాయక్, ఇతర ఎన్నికల సిబ్బంది ఈనెల ఒకటి నుంచి ఏడో తేదీ వరకూ జరిగిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సహాయ అధికారి గుణనిధి నాయక్ మాట్లాడుతూ.. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా మైక్ సౌండింగ్ ప్రచారంలో వాడుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. వాహనాల కోసం విధిగా ఆన్లైన్లో రిజిష్టరు చేసుకొని ఎన్నికల అధికారుల అనుమతి పొందాలన్నారు. వాహనాల ఖర్చుల వివరాలను అభ్యర్థుల తరఫున ఏజెంట్లు విధిగా పొందుపరచాలని సూచించారు. ఎన్నికల పరిశీలకులు చంద్రికా గార్గ్ -
కాంగ్రెస్లోకి బీజేపీ నాయకుడు దాస్ భొత్ర
జయపురం: బొరిగుమ్మ సమితి మాజీ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత దాస్ భొత్ర మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బొరిగుమ్మలో గల కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో దాస్ భొత్రను జయపురం నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తారాప్రసాద్ బాహిణీపతి సాదరంగా ఆహ్వానించారు. భొత్రకు నువాగుడ, పాతబొరిగుమ్మ, జిలిమిలి, ఖుడిగుడ తదితర గ్రామాల్లో మంచి పేరున్న నాయకుడని, అతడి వెంట వందలాది మంది కార్యకర్తలు ఉన్నారని, అతడి పట్ల భొత్ర సంప్రదాయ ప్రజలకు ఆదరణ ఉందని, కాంగ్రెస్లో కలవటం వల్ల తమ పార్టీకి మేలు కలుగుతుందని కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దేవేంద్ర బాహిణీపతి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా తాను బీజేపీలో ఉంటూ బొరిగుమ్మలో ఆ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశానని, కొంత కాలంగా బీజేపీ తనను విస్మరించిందని దాస్ ఆరోపించారు. ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి బొరిగుమ్మ సమితిలో శాంతిభద్రతలు పరిరక్షించేందుకు, సారా ప్రవాహాన్ని అరికట్టేందుకు చేపట్టి ఉద్యమాలకు, సమితి అభివృద్ధికి చేసిన కృషి తనను ఆకర్షించడంతో కాంగ్రెస్లో చేరినట్లు వెల్లడించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
మళ్లీ బీజేడీదే అధికారం
● మంత్రి అతాన్ సవ్యసాచి నాయక్ రాయగడ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈసారి కూడా రాష్ట్రంలో బీజేడీ పార్టీ అధికారంలోకి రానుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, రాయగడ జిల్లా ఎన్నికల పరిశీలకులు అతాన్ సవ్యసాచి నాయక్ జోష్యం చెప్పారు. స్థానిక బీజేడీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతిచోటా ప్రజాదారణతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యంగా రాయగడ జిల్లాలో గల గుణుపూర్, రాయగడ, బిసంకటక్ శాసనసభలతోపాటు కొరాపుట్ లోక్సభ స్థానాల్లో కూడా తమ పార్టీ అభ్యర్థులు అధిక మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు మెచ్చిన పథకాలు . ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు ప్రజలు మెచ్చినవి కావడంతో బీజేడీ పాలనపై నమ్మకం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రజల బాగోగులతో పాటు వారికి సుస్థిర పాలనను అందించే ఏకై క పార్టీగా బీజేడీ ఆవిర్భవించిందన్నారు. సంక్షేమ పథకాలే పార్టీ విజయానికి నాంది పలుకుతున్నాయన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ధికి అమలు చేసిన మిషన్ శక్తి, స్వయం సహాయక బృందాలు, మమత తదితర పథకాలు విజయవంతం కావడంతో బీజేడీకి ఆదరణ పెరిగిందన్నారు. దానికి అనుగుణంగా వారికి అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తుండటం పార్టీ అభివృద్ధికి మరో మైలు రాయిగా నిలిచిందన్నారు. విభేదాలు లేవు.. పార్టీలో ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవని, అందరూ కలిసి పార్టీ విజయానికి కృషి చేస్తున్నారని ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. జిల్లాలో నెక్కంటి భాస్కరరావు, కృష్ణ మహాపాత్రో వంటి సీనియర్ నాయకులు పార్టీ విజయానికి నిరంతరం పని చేస్తున్నారన్నారు. వారి నాయకత్వంలో పార్టీ మరింత అభివృద్ధి చెందిందని కొనియాడారు. ఈ సమావేశంలొ రాయగడ శాసనసభ నియోజకవర్గం నుంచి పొటీ చేస్తున్న అనసూయా మాఝి, బీజేడీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు జగదీష్ పాత్రో తదితరులు పాల్గొన్నారు. .
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ ఛాంపియన్గా శ్రీలంక
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
సీవీడ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్’ (ఫొటోలు)
బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!
టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement