Adi
-
తీవ్రవాదం నేపథ్యంలో...
‘వినాయకుడు, విలేజ్లో వినాయకుడు, కేరింత’ వంటి సెన్సిబుల్ హిట్ సినిమాలు తీసిన సాయికిరణ్ అడివి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ (ఒ.జి.యఫ్). ఆది సాయికుమార్ హీరోగా నటించారు. ప్రముఖ రచయిత అబ్బూరి రవి ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. ప్రతిభా అడివి, కట్టా ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమాస్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బీహెచ్, సతీష్ డేగల, పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 18న విడుదల కానుంది. సాయికిరణ్ అడివి మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా కల్పిత కథాంశంతో రూపొందిన చిత్రమిది. తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. శ్రీచరణ్ పాకాల చక్కటి స్వరాలు, నేపథ్య సంగీతం అందించాడు. మా సినిమాలో దేశభక్తి గీతాన్ని పాడిన కీరవాణిగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘తొలిసారి ఎన్.ఎస్.జి కమాండోగా నటించాను. నా లుక్కు మంచి స్పందన వచ్చింది. సాయికిరణ్ అడివిగారు కథపై ఎంతో పరిశోధన చేసి ఈ సినిమా తీశారు. కశ్మీర్ పండిట్ల జీవితాలను, అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించారు’’ అన్నారు ఆది సాయికుమార్. ‘ఎయిర్ టెల్’ మోడల్ శషా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జైపాల్ రెడ్డి నిమ్మల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ రెడ్డి తుమ్మ, సహ నిర్మాత: దామోదర్ యాదవ్ (వైజాగ్). -
జెట్ ఎయిర్వేస్ : ఉద్యోగుల చొరవ
సాక్షి, న్యూఢిల్లీ : రుణభారంతో కుదేలైన విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్పై దివాలా ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు తమ సంస్థను గట్టెక్కించేందుకు , తద్వారా తమ భవిష్యత్తు భరోసాకు నడుం బిగించారు. ఆది గ్రూపు భాగస్వామ్యంతో ఉద్యోగుల కన్సార్షియం బిడ్ దాఖలు చేసేందుకు ముందుకు వచ్చింది. ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్) ద్వారా 75 శాతానికి బిడ్ దాఖలు చేస్తామని శుక్రవారం ప్రకటించింది. సంస్థ ఉద్యోగులు ఇలాంటి చొరవ తీసుకోవడం ఇదే తొలిసారని బిజినెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. భారత విమానయాన చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయమని అంటున్నారు. "ఇది నిజంగా ప్రధానమంత్రి కల 'సబ్కా సాథ్, సబ్ కా వికాస్ సబ్ కా విశ్వస్' ను సూచిస్తుందంటూ , ఉద్యోగుల కన్సార్షియం ఆదిగ్రూప్ జారీ చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలో ఏర్పాటు విలేకరుల సమావేశంలో సొసైటీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్ పైలట్స్, జనరల్ సెక్రటరీ, జెట్ సీనియర్-మోస్ట్ పైలట్లలో ఒకరైన కెప్టెన్ అశ్వని త్యాగి, ఆది గ్రూపు ప్రతినిధులు పాల్గొన్నారు. కంపెనీకి రుణాలిచ్చిన 26 సంస్థల తరపున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జెట్ ఎయిర్వేస్పై 2016 నాటి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ చట్టం ప్రకారం కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్(సీఐఆర్పీ) దివాలా ప్రక్రియ పిటీషన్ దాఖలు చేసింది. ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం ఈ పిటీషన్ను ఈ నెల 20న స్వీకరించగా తదుపరి విచారణ జూలై 5న జరగనుంది. భారత్లో దివాలా ప్రక్రియకు చేరిన తొలి విమానయాన సంస్థగా జెట్ ఎయిర్వేస్ నిలిచింది. ఐఆర్పీగా నియమితులైన ఆశీష్ చౌచారియా 90 రోజుల్లో రిజల్యూషన్ ప్రణాళికను అందజేయాలని ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం ఆదేశించింది. కాగా బ్యాంక్లు, ఇతర ఆర్థిక సంస్థలకు జెట్ ఎయిర్వేస్ కంపెనీ రూ.8 500 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకు, ఇతర రుణదాతలకు, వెండార్లకు కలిపి మొత్తం 25వేల కోట్ల లోనే బకాయిలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి ఈ కంపెనీ కార్యకలాపాలు నిలిపేసిన సంగతి తెలిసిందే. -
ప్రేక్షకులు చెడిపోకూడదు
ఆది, ఆశ్లేష జంటగా ప్రభాకర్ ఇప్పు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సహచరుడు’. వెరీ గుడ్ సినీ స్కూల్ పతాకంపై రవికుమార్ గంజి నిర్మించారు. సాయి శ్రీనివాస్ సంగీతం అందించారు. ఈ చిత్రం బిగ్ సీడీని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆవిష్కరించగా, ఆడియో సీడీని నిర్మాత సాయి వెంకట్ విడుదల చేశారు. రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘సహచరుడు’ లాంటి చిన్న సినిమాలు వచ్చినప్పుడే ఎంతోమంది కొత్తవారు ఇండస్ట్రీకి వస్తారు. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘ఎనిమిదేళ్ల కష్టమే ‘సహచరుడు’ సినిమా. ఒక సినిమా వల్ల ప్రేక్షకులు చెడిపోకూడదు అనేదే నా ఉద్దేశం. హృదయాన్ని తాకే సందేశం మా సినిమా ద్వారా ఇచ్చాం’’ అన్నారు ఇప్పు ప్రభాకర్. ‘‘ట్రెండ్కి తగ్గ మ్యూజిక్ ఇవ్వాలని మొదట అనుకున్నాం. కానీ, అందరికీ అర్థమయ్యే లిరిక్స్తో ట్యూన్ చేసాం. పాటలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ సాయి శ్రీనివాస్. ఆది, ఆశ్లేష, నిర్మాత రవికుమార్ గంజి, పాటల రచయిత రామారావు తదితరులు పాల్గొన్నారు. -
అందులో నా స్వార్థం కూడా ఉంది – అల్లు అరవింద్
‘‘మా గీతా ఆర్ట్స్తో పాటు యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలతో కలిసి ‘వి4 క్రియేషన్స్’ అనే కొత్త సంస్థని స్టార్ట్ చెయ్యడంలో నా స్వార్థం కూడా ఉంది. యంగ్స్టర్స్తో కలిసి ఉంటే వాళ్లు ఎలా ఆలోచిస్తున్నారు అనేది అర్థమవుతుంది. తద్వారా అప్డేటెడ్గా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలు తీసే వీలుంటుంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఆది, వైభవీ శాండిల్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో యాంకర్, నటుడు ప్రభాకర్ దర్శకత్వంలో వి4 క్రియేషన్స్పై ‘బన్నీ’ వాసు నిర్మించిన ‘నెక్ట్స్ నువ్వే’ ట్రైలర్ని హైదరాబాద్లో విడుదల చేశారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘కొత్త బేనర్ని స్టార్ట్ చెయ్యడానికి కారణం ఏంటని అందరూ అడుగుతున్నారు. ఏ నిర్మాతైనా తను నమ్మిందే కరెక్ట్ అని సిన్మాలు తీస్తూ వెళితే కొన్నాళ్లకు సినిమాలు తియ్యకుండా ఆగిపోతారు. మారుతున్న ట్రెండ్కి తగ్గట్టుగా సినిమాలు తీస్తేనే కంటిన్యూ అవ్వగలుగుతాం. వి4లో మూడు బేనర్లే ఉన్నాయి. నాలుగోది బేనర్ కాదు. ఫ్రెష్ థాట్స్, యునీక్ సబ్జెక్ట్స్తో వచ్చేవారు నాలుగోవారు అవుతారు’’ అన్నారు. ‘‘నవంబర్ 3న సిన్మాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘ఆదితో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాం’’ అని జ్ఞానవేల్ రాజా అన్నారు. ‘‘నేనీ సినిమా డైరెక్ట్ చేశానంటే కారణం అల్లు శిరీష్. టాలెంట్ని ఎంకరేజ్ చెయ్యడంలో శిరీష్ ముందుంటారు. మంచి సినిమా తీశానన్న తృప్తి కలిగింది’’ అన్నారు ప్రభాకర్. నటుడు సాయికుమార్, దర్శకుడు మారుతి, వైభవి, సంగీత దర్శకుడు సాయికార్తీక్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ పాల్గొన్నారు. -
తండ్రికి విలన్... కుమారుడికి?
హీరోయిజమ్, విలనిజమ్... జగపతిబాబు నటనలో రెండిటినీ తెలుగు ప్రేక్షకులు చూశారు. మలయాళీలకు ఆయన నటనలోని విలనిజమ్ మాత్రమే తెలుసు. అసలు పేరు కంటే కొసరు పేరు ‘డాడీ గిరిజ’గా అక్కడి ప్రేక్షకులకు తెలుసు. మోహన్లాల్ ‘పులి మురుగన్’ (తెలుగులో ‘మన్యం పులి’గా విడుదలైంది)లో డాడీ గిరిజగా జగపతిబాబు ప్రదర్శించిన విలనిజమ్ అటువంటిది మరి! మలయాళంలో ఆయన నటించిన తొలి చిత్రమది. తాజాగా మరో చిత్రం అంగీకరించారు. ఇందులో మోహన్లాల్ కుమారుడు ప్రణవ్ హీరో. సిన్మా పేరు ‘ఆది’. అప్పుడు మోహన్లాల్ ‘పులి మురుగన్’తో మలయాళంలో విలన్గా మంచి పేరు తెచ్చుకున్న జగపతిబాబు, ఇప్పుడు ఆయన కుమారుడు ప్రణవ్ మోహన్లాల్ ‘ఆది’లోనూ విలన్గా నటిస్తున్నారా? లేదా? అనే అంశాన్ని యూనిట్ సభ్యులు ప్రస్తుతానికి సీక్రెట్గా ఉంచారు! -
చేనేతలకు రుణాలందించేందుకు చర్యలు
చేనేత, జౌళి శాఖ ఏడీ పవన్కుమార్ అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లాలోని చేనేతలకు ముద్ర పథకం ద్వారా రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చేనేత, జౌళి శాఖ ఏడీ పవన్కుమార్ తెలిపారు. రుణాల ముంజూరుకు పెద్ద ఎత్తున దరఖాస్తులందాయన్నారు. ఫీల్డ్ ఆఫీసర్ల ద్వారా క్షేత్రస్థాయిలో ఆయా దరఖాస్తులను పరిశీలిస్తామన్నారు. చేనేతల ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా, మగ్గం తదితర వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత అర్హత కలిగిన వారందరికీ రుణాలను మంజూరు చేసేందుకు బ్యాంకులకు వివరాలను అందిస్తామన్నారు. -
విజయానందంలో మరగదనాణియం
తమిళ సినిమా: మరగదనాణియం చిత్ర యూనిట్ విజయానందంలో మునిగి పోయింది. యాక్సస్ ఫిలింస్ ఫ్యాక్టరీ పతాకంపై ఢిల్లీబాబు నిర్మించిన చిత్రం మరగదనాణియం. ఆది, నిక్కీగల్రాణి జంటగా నటించిన ఈ చిత్రానికి ద్రార సరవణ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆనందరాజ్, ముండాసుపట్టి రామ్దాస్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రం గత వారంలో తెరపైకి వచ్చి విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చెన్నైలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ను నిర్వహించింది. ఇందులో చిత్ర నిర్మాత ఢిల్లీబాబు మాట్లాడుతూ ఉరుమీన్ తరువాత తన సంస్థ నిర్మించిన తాజా చిత్రం మరగదనాణియం అన్నారు. ఒక కమర్షియల్ హీరోగా ఎదుగుతున్న ఆది ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారేమిటన్న భావన తనకు కలిగిందన్నారు. అదే విధంగా నటి నిక్కీగల్రాణి మగగొంతుతో మాట్లాడే పాత్రలో నటించి మెప్పించారన్నారు. ఇది సాధారణ హీరోహీరోయిన్ల ప్రేమ, ఐటమ్ సాంగ్స్లతో కూడిన చిత్రం కాదని చిత్ర హీరో ఆది అన్నారు. నిజం చెప్పాలంటే తాను లేకపోయినా ఈ చిత్ర విజయం సాధ్యం అవుతుందేమోగాని, ముండాసుపట్టి రామ్దాస్ తదితర పాత్రదారులు లేక పోతే సాధ్యం కాదన్నారు. ఆ పాత్రలకు అంత ప్రాధాన్యత ఇవ్వడం, యూనిట్ మొత్తం నిజమైన శ్రమనే ఈ చిత్ర విజయానికి కారణంగా ఆది పేర్కొన్నారు. ఈ చిత్రం తెలుగులోనూ విజయవంతంగా సాగుతుండడం విశేషం. -
కారు... కిరికిరి... కితకితలు!
శమంతకమణి... ఇదేదో పురాణాల్లో కథ కాదు! పాత సినిమాల్లో ఐటమ్ సాంగో లేదంటే అమ్మాయి పేరో అంత కన్నా కాదు. మరేంటి? అంటే... ఓ కారు! సదరు కారుతో నలుగురు కుర్రాళ్ల జీవితాలు ఏ విధంగా ముడి పడ్డాయనే కథతో రూపొందిన సినిమా ‘శమంతకమణి’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వి. ఆనంద్ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ఎవరూ ఊహించని మలుపులతో ఉత్కంఠగా సాగుతుందీ సినిమా. జూలై 14న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘సినిమాలో ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్గా నారా రోహిత్, కృష్ణగా సుధీర్బాబు, కార్తీక్గా ఆది, ‘కోటిపల్లి’ శివగా సందీప్ కిషన్ నటించారు. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారి. వీళ్ల మధ్య సంబంధం ఏంటి? ఎలా కలుసుకున్నారు? అనే అంశాలతో పాటు వీళ్ల మధ్య సీన్లు ఆసక్తికరంగానూ, వినోదాత్మకంగానూ ఉంటాయి. ఇక, కారు కిరికిరి ఏంటనేది తెరపై చూడాలి’’ అన్నారు. చాందినీ చౌదరి, జెన్నీ, హనీ, అనన్య సోనీ, ఇంద్రజ, కస్తూరి, సుమన్, తనికెళ్ల భరణి నటించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. -
నా ముందు తలదించుకొని బతకాల...
నాగిరెడ్డి అంటే మాటలా? మాట మాటకూ మందుపాతర దట్టించి పేల్చగలడు. పండ్లు నూరుతూ ప్రత్యర్థిని బెంబేలెత్తించగలడు. ‘రేయ్... పో... ఎక్కడో ఒక చోట హాయిగా బతుకు. లేదు... ఇక్కడే బతుకుతానంటావా... ఇల్లు ఇస్తా. ఎకరం పొలం ఇస్తా. నా ముందు తలదించుకొని బతకాల. తల ఎత్తావో... నరికేస్తా!’ అంటూ ప్రత్యర్థి ముఖం మీదే పిడుగులు కురిపించగలడు.. ‘ఆది’ సినిమాలో నాగిరెడ్డిగా అసమాన నటన ప్రదర్శించారు రాజన్ పి. దేవ్. రాజన్ను చూస్తే... మన ఊళ్లోనో, మరో చోటో కనిపించే పెద్ద మనిషిలాంటి విలన్ గుర్తుకు వస్తాడు తప్ప ఎక్కడి నుంచో దిగుమతి అయిన ‘మల్లువుడ్ విలన్’ గుర్తుకురాడు.‘మన ఇలనే’ అన్నంతగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజన్ పి. దేవ్ ఈవారం మన ‘ఉత్తమ విలన్’ ‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది కదా!’రాజన్ కూడా ఆ గూటి పలుకే పలికారు. రాజన్ నాన్న ఎస్.జె.దేవ్ ప్రసిద్ధ నాటకకళాకారుడు. చిన్నప్పుడు ఆటల కంటే నాటకాల మధ్యే ఎక్కువ కాలం గడిపేవాడు రాజన్. రిహార్సల్ సమయంలో పెద్ద పెద్ద నటుల నుంచి వినిపించే భారీ డైలాగులు, చిన్న రాజన్ పెదాల మీద అలవోకగా ప్రతిధ్వనించేవి. నాన్న ఎస్.జె.దేవ్ను ఆదర్శంగా తీసుకొని ఎన్నో నాటకాల్లో నటించారు రాజన్. సీనియర్ రంగస్థల కళాకారుడు ఎన్.ఎన్.పిల్లై ఆధ్వర్యంలో ఎన్నో నాటకాల్లో ఎన్నో రకాల పాత్రలు పోషించారు రాజన్. నటించడం మాత్రమే కాదు... చిన్నవయసులోనే నాటకాలు రాయడం, దర్శకత్వంలాంటివి చేసేవాడు. ‘మలయాళం నాటక వేది’ పేరుతో ఒక నాటక సంస్థను స్థాపించి ‘రాధమ్’ అనే నాటకం రాసి దర్శకత్వం చేశారు. అయితే ఈ నాటకం పెద్ద డిజాస్టరై రాజన్ను ఆర్థికసమస్యల్లో కూడా నెట్టింది. వేరొకరయితే ‘నాటకాలకో దండం మీకో దండం’ అని మూటా ముల్లే సర్దుకునే వారు. పోయిన చోటే వెదుక్కోవాలనుకునే రాజన్ వెనక్కి తగ్గలేదు. ఎస్.ఎల్.పురం సదానందన్ నాటకం ‘కట్టుకుతిర’లో ప్రధాన పాత్రను పోషించారు. ఈ నాటకం వందకు పైగా ప్రదర్శనలు పూర్తి చేసుకోవడంతో రాజన్ పేరు కేరళ మొత్తం సుపరిచితం అయింది. హరిశ్రీ థియేటర్ వారి ఒక నాటకంలో మానసిక వికలాంగుడి పాత్ర ధరించి శభాష్ అనిపించుకున్నారు రాజన్. ‘బెస్ట్ యాక్టర్’గా స్టేట్ అవార్ట్ కూడా గెలుచుకున్నారు.నాటకరంగంలో తిరుగులేని నటుడు అనిపించుకున్న రాజన్ ఆ తరువాత సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఫజిల్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎంటె మమట్టికుట్టియమక్కు’ చిత్రంతో రాజన్ ఫిలిం కెరీర్ మొదలైంది. రాజన్ వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చిన ‘కట్టుకుతిర’ నాటకం సినిమాగా వచ్చింది. అయితే ఆ నాటకంలో తాను చేసిన లీడ్రోల్ వేరే నటుడికి దక్కడం రాజన్ని నిరాశకు గురిచేసింది. ఇదే విషయాన్ని ఒక ఇంటర్య్వూలో చెప్పుకున్నారు రాజన్. ఇది చదివిన ‘కట్టుకుతిర’ దర్శకుడు తన మరో చిత్రం ‘ఇంద్రజాలం’లో ‘కార్లోస్’ అనే విలన్ రోల్ రాజన్కు ఇచ్చాడు. ‘కార్లోస్’ పాత్రతో రాజన్ కెరీర్ మలుపు తిరిగింది. ఎన్నో చిత్రాల్లో విలన్గా నటించారు. విలన్ పాత్రల్లో రాజన్ ఎంత పాపులర్ అయ్యాడంటే... ‘‘ఆయన పని గట్టుకొని క్రూరమైన డైలాగులు చెప్పాల్సిన పనిలేదు. ఆ ముఖం, కళ్లు చాలు విలనిజాన్ని చాటడానికి’’ అనేవాళ్లు.క్రూరత్వంతోనే విలనీ పండుతుందనేది నిజమే అయినా కాస్త హ్యూమర్ టచ్తో కూడా విలనిజాన్ని పండించి తనదైన శైలిని చాటుకున్నారు రాజన్. తమిళ, కన్నడ, తెలుగు సినిమాలలో అవకాశాలు రాజన్ను వెదుక్కుంటూ వచ్చాయి. తెలుగులో ‘ఖుషీ’ ‘ఆది’ ‘నాగా’ ‘దిల్’ ‘ఒక్కడు’ ‘ఆర్యా’ ‘గుడుంబ శంకర్’ ‘బాలు’ ‘బన్నీ’ ‘వీరభద్ర’ ‘యోగి’ ‘కాళిదాస్’ ‘క్రిష్ణ’... మొదలైన సినిమాలలో నటించారు. అవివీతి పోలీసు అధికారి నుంచి ఫ్యాక్షనిస్ట్ వరకు... ప్రతి పాత్రలోనూ తన మార్క్ విలనిజాన్ని చాటుకొని ‘ఉత్తమ విలన్’గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన రాజన్ పి. దేవ్ 2009లో చనిపోయారు. చాలామంది ప్రేక్షకులకు ఆయన మలయాళ నటుడు అనే విషయం తెలియదు. మన తెలుగు విలనే అన్నంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘రాజన్ పి. దేవ్’ అనే ఆయన పేరు కొద్దిమందికే తెలిసి ఉండవచ్చు. అయితే ‘నాగిరెడ్డి’ ‘యం.పీ. అవతారం’ ‘కుమారస్వామి మామ’ మొదలైన పేర్లతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచిత విలనీయుడుగా గుర్తుండిపోతారు రాజన్ పి. దేవ్. -
మరగదనాణయంకు యూ సర్టిఫికెట్
మరగదనాణయం చిత్రానికి సెన్సార్బోర్డు యూ సర్టిఫికెట్ అందించింది.ఆది, నిక్కీగల్రాణి జంటగా నటించిన చిత్రం మరగదనాణయం.ఆనందరాజ్, మునీష్కాంత్, కాళీవెంకట్, అరుణ్ రాజ కామరాజ్, డేనీ, కోటాశ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎంఎస్.భాస్కర్, మైమ్గోపి ము ఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని నవదర్శకుడు ఏఆర్కే.శరవణ్ దర్శకత్వంలో యాక్సెస్ ఫిలిం ఫాక్టరీ పతాకంపై డిల్లీబాబు నిర్మిస్తున్నారు.యాక్షన్, ఎండ్వెచర్, వినోదం కలగలిపిన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని చిత్ర వర్గాలు వెల్లడించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న మరగదనాణయం చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలిపారు. చిత్రాలకు యూ సర్టిఫికెట్ రావడమే గగనంగా మారిన తరుణంలో తమ చిత్రానికి యూ సర్టిఫికెట్ రావడం సంతోషంగా ఉందని చిత్ర నిర్మాత ఢిల్లీబాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు.మంచి కథా చిత్రాలను నిర్మాంచాలన్న ఒక ఆశయంతో ఈ రంగంలోకి వచ్చామని, మరగద నాణయం ఆ స్థాయిలో ఉంటుందని చెప్పారు. ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై మంచి స్పందనను పొందుతోంది.చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుందన్నది గమనార్హం. -
నలుగురు హీరోలతో సినిమా అసాధ్యం అన్నారు
‘భలే మంచి రోజు’ వంటి హిట్ చిత్రం తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య టాలీవుడ్లో ఓ సంచలనానికి తెరలేపారు. ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ మూవీ తీసేందుకే కొందరు దర్శకులు ఆలోచిస్తుంటే, ఏకంగా నలుగురు హీరోలతో పాటు, ఓ సీనియర్ నటుడితో మల్టీస్టారర్ మూవీకి శ్రీకారం చుట్టారు. నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్బాబు, ఆది హీరోలుగా, డా. రాజేంద్రప్రసాద్ ప్రత్యేక పాత్రలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వి.ఆనంద్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు శ్రీను వైట్ల క్లాప్ ఇచ్చారు. నటుడు రాజేంద్రప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నటుడిగా నలభై ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ఇన్నేళ్లుగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఆనంద్ ప్రసాద్గారితో ‘అమ్మాయి నవ్వితే’ సినిమా చేశా. నలుగురు హీరోలున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో నేను కీలకపాత్ర చేస్తున్నా. మేమంతా కలిసి చేస్తున్న ఈ సినిమా గ్యారంటీ హిట్ అవుతుంది’’ అన్నారు. శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘ఇంజనీరింగ్ పూర్తి కాగానే ఫేస్బుక్లో ఉద్యోగం చేసే టైమ్లో రాసుకున్న తొలి కథ ఇది. ఈ కథ చాలామందికి వినిపించా. ‘నలుగురు హీరోలు కలిసి తెలుగులో సినిమా ఎక్కడ చేస్తారు.. ఇది అసాధ్యం’? అన్నారందరూ. ఈ కథ వినగానే ఆనంద్ ప్రసాద్గారు ఎగ్జయిట్ అయ్యి, మనం సినిమా చేద్దామన్నారు. ఇంత మంది హీరోలు తెలుగులో చేస్తున్న తొలి సినిమా ఇది. భారీ మల్టీస్టారర్ చిత్రాలకు మా సినిమా నాంది పలుకుతుంది’’ అన్నారు. ‘‘మార్చి మొదటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది’’ అని ఆనంద్ ప్రసాద్ తెలిపారు. -
మా అబ్బాయితో పక్కింటబ్బాయి తీస్తా
- సాయికుమార్ ‘‘చాలా రోజులుగా నేను, ఆది కలిసి నటించాలనుకున్నాం. మా కోరికను వీరభద్రమ్ తీర్చాడు. ‘గరం’ చిత్రం సమయంలో ఆదితో ‘పక్కింటబ్బాయి’ పేరుతో సినిమా తీద్దామనుకున్నా. దర్శకుడు ‘చుట్టాలబ్బాయి’ చేస్తానని చెప్పడంతో సెలైంట్ అయిపోయా. కానీ తప్పకుండా ‘పక్కింటబ్బాయి’ చిత్రం తీస్తా. ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని సాయికుమార్ అన్నారు. ఆది, నమితాప్రమోద్ జంటగా వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి నిర్మించిన ‘చుట్టాలబ్బాయి’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ను హైదరాబాద్ లో నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ-‘‘ ‘అహ నా పెళ్లంట’, ‘పూలరంగడు’ చిత్రాలప్పుడు చాలా ఆనందం పొందాను. ‘చుట్టాలబ్బాయి’తో ఆ సంతోషం రెట్టింపు అయింది. ప్రేక్షకులు మా చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు. విజయయాత్రలో భాగంగా తిరుపతిలో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసినప్పుడు నాలోని కొద్దిపాటి టెన్షన్ కూడా పోయింది’’ అన్నారు. ‘‘విజయ యాత్రలో ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ మరచిపోలేనిది. సినిమాను చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఈ విజయం నాలో మరింత ఉత్సాహం నింపింది’’ అని ఆది చెప్పారు. నిర్మాతలు రామ్ తాళ్లూరి, వెంకట్ తలారి, ప్రతాని రామకృష్ణ గౌడ్, బీఏ రాజు, నటులు భద్రం, చమ్మక్ చంద్ర, కెమేరామన్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
సిటీలో చుట్టాలబ్బాయ్
డాబాగార్డెన్స్: చుట్టాలబ్బాయ్ సినిమా విజయోత్సవం శుక్రవారం వీ–మాక్స్ «థియేటర్లో సందడిగా సాగింది. విజయయాత్రలో భాగంగా ఆ చిత్ర యూనిట్, హీరో ఆది, నటుడు సాయికుమార్ వీ–మాక్స్ «థియేటర్కు విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ తన కుమారుడు ఆదితో తొలిసారిగా నటించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. విజయయాత్ర తిరుపతిలో ప్రారంభమైందని, శ్రీకాకుళంలో శనివారం ముగుస్తోందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు సాయికుమార్ సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారన్నారు. హీరో ఆది మాట్లాడుతూ ఈ చిత్రం తొలి షో నుంచి హిట్ టాక్ వచ్చిందన్నారు. ఎనిమిది సినిమాల తర్వాత తండ్రితో నటించానని చెప్పారు. చిత్ర దర్శకుడు వీరభద్ర మాట్లాడుతూ తాము ఊహించినదానికంటే ఎక్కువ విజయం సాధించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో శ్రీలక్ష్మీనారాయణ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ప్రతినిధులు చంద్రశేఖర్, కిరణ్, శ్రీరామ్, వీ–మాక్స్ «థియేటర్ నిర్వాహకులు విజయ్, సురేంద్ర, వాసు పాల్గొన్నారు. -
నవ్వించే అబ్బాయ్...
ఆది, నమితా ప్రమోద్ జంటగా వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తుళ్ళూరి నిర్మిసున్న చిత్రం ‘చుట్టాలబ్బాయ్’. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుగుతోంది. జూలై 6న పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శనివారం హైదరాబాద్లో ఈ చిత్రం టీజర్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘అందర్నీ ఆకట్టుకునే కుటుంబ కథా చిత్రమిది. ప్రారంభం నుంచి ఈరోజు వరకూ చాలా పాజిటివ్ వైబ్స్తో షూటింగ్ ముందుకు సాగుతోంది. తమన్ అద్భుతమైన బాణీలు అందించారు’’ అన్నారు. ఆది మాట్లాడుతూ - ‘‘కన్ఫ్యూజ్ కామెడీతో పూర్తి వినోదాత్మకంగా దర్శకుడు చిత్రాన్ని రూపొందించారు. బ్రహ్మానందంగారు, నాకు మధ్య సన్నివేశాలు అందర్నీ నవ్విస్తాయి’’ అని చెప్పారు. ‘‘రాజమండ్రి, హైదరాబాద్, బ్యాంకాక్ తదితర ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం’’ అని నిర్మాతలు చెప్పారు. ఈ వేడుకలో ఛాయాగ్రాహకుడు ఎస్.అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త చిత్రానికి సిద్ధం అవుతున్న ఆది
యువ నటుడు ఆది తాజా చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈరం తదితర చిత్రాల్లో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్న నటుడు ఆది. ఆయన తమిళంలో యాగవరాయన్ నాకాక్క చిత్రం తరువాత మరో చిత్రం చేయలేదు. ఆ చిత్రం విడుదలై ఏడాది అవుతోంది. అయితే ఇటీవల తెలుగులో సరైనోడు చిత్రంలో అల్లుఅర్జున్కు విలన్గా నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. చిన్న గ్యాప్ తరువాత ఆది తమిళంలో కథానాయకుడిగా నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై జి.ఢిల్లీబాబు నిర్మించనున్నారు. ఇందులో ఆదికి జంటగా నటి శివదా నటించనున్నారు. ఏఆర్కే.శరవణ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి పీవీ.శంకర్ చాయాగ్రహణం, డిబు సంగీతాన్ని అందించనున్నారు. చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. -
'చూట్టాలబ్బాయి' వర్కింగ్ స్టిల్స్
-
రికవరీ బాబ్జీ కహానీ!
‘‘కుటుంబ భావోద్వేగాలతో వినోదభరితంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. మన చుట్టూ ఉండే వారందరినీ కలుపుకొని పోయే రికవరీ బాబ్జీ పాత్రలో నటిస్తున్నా. జూన్ మొదటి వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని హీరో ఆది పేర్కొన్నారు. ఆది, నమిత, యామిని జంటగా రామ్ తాళ్లూరి సమర్పణలో వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి నిర్మిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ సినిమా షూటింగ్ ఎనభై శాతం పూర్తయింది. ఈ సందర్భంగా వీరభద్రమ్ మాట్లాడుతూ- ‘‘ ‘పూల రంగడు’ చిత్రకథ మొదట ఆదికే వినిపించా. కానీ, డేట్ల ప్రాబ్లమ్స్ వల్ల ఆదితో చేయలేకపోయా. ‘చుట్టాలబ్బాయి’ కథ సాయికుమార్ గారికి, ఆదికి నచ్చి వెంటనే ఓకే చెప్పేశారు. ఇది పూర్తిగా యాక్షన్ నిండిన ఎంటర్ టైనర్’’ అని దర్శకుడు తెలిపారు. ‘‘సినిమా ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకు ప్రేక్షకులు నవ్వుకుంటూనే ఉంటారు’’ అని నిర్మాత అన్నారు. -
ప్రతి మలుపూ కొత్తగా...!
‘యముడికి మొగుడు, చంటి, బంగారు బుల్లోడు, పెదరాయుడు’... లాంటి కమర్షియల్ టచ్ ఉన్న కుటుంబ కథాచిత్రాలనందించి సక్సెస్ఫుల్ దర్శకుడనిపించుకున్నారు రవిరాజా పినిశెట్టి. ఆయన రెండో కుమారుడు ఆది పినిశెట్టి తమిళంలో గుర్తింపున్న హీరో. ఇక, పెద్ద కుమారుడు సత్యప్రభాస్ తండ్రి బాటలో దర్శకుడయ్యారు. తమ్ముడు ఆది హీరోగా తండ్రి నిర్మాణంలో ఆదర్శ చిత్రాలయ పతాకంపై సత్యప్రభాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మలుపు’. ఇవాళ తెరపైకొస్తున్న ఈ చిత్రం గురించి సత్యప్రభాస్ మాట్లాడుతూ - ‘‘నేను ఏంబీఏ పూర్తి చేశాక అమెరికా వెళ్లాను. అక్కడి ఫిలిమ్ ఇన్స్టిట్యూట్లో చేరాలంటే ఏదైనా షార్ట్ ఫిలిమ్ తీయాలి. అప్పుడు ‘మై సిస్టర్ అండ్ ఐ’ పేరుతో నేను తీసిన షార్ట్ ఫిలిమ్ చూసి, చేర్చుకున్నారు. అక్కడ డిగ్రీ పూర్తి చేశాక, కమర్షియల్, కామెడీ టచ్ ఉంటూనే కొత్త రకం సినిమాలు తీయాలని బలంగా నిర్ణయించుకుని ఇండియాకు వచ్చాను. ఆ మేరకు నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ‘మలుపు’ చేశాను. ప్రతి మలుపూ కొత్తగా ఉంటూ, ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది. దర్శకుడిగా నాన్నగారి ప్రభావం నా పై లేదు. ఆయన కూడా మేము స్వశక్తిగా ఎదగాలనుకుంటారు. ఈ సినిమా చూసి, ‘పాసయ్యావ్.. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యు’ అని అభినందించారు’’ అని చెప్పారు. హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ, ‘‘గంటా యాభై నిమిషాల నిడివితో సాగే ఈ చిత్రం ఓ కొత్త సినిమా చూసిన ఫీల్ని ప్రేక్షకులకు కలిగిస్తుంది. నేపథ్యం అంత కొత్తగా ఉంటుంది’’ అని తెలిపారు. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘సరైనోడు’లో ఆది పినిశెట్టి విలన్గా నటిస్తున్నారు. ‘‘హీరోగానే చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. నటుడన్నాక అన్ని రకాల పాత్రలూ చేయాలన్నది నా అభిప్రాయం. అందుకే ‘సరైనోడు’ ఒప్పుకున్నా. అందులో నేను స్టైలిష్ అండ్ స్లీక్ విలన్గా కనిపిస్తా’’ అని యువ నటుడు చెప్పారు. -
చూస్తే... డిజప్పాయింట్ కారు!
‘‘మదన్ ఈ చిత్రాన్ని బాగా డెరైక్ట్ చేశాడు. సినిమా బాగా వచ్చింది. ఫీల్గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఇందులో మంచి సోల్ ఉంటుంది. ఆది డ్యాన్స్, ఫైట్స్, అదా శర్మ నటన హైలైట్ ’’ అని సాయికుమార్ తెలిపారు. ఆది, అదాశర్మ జంటగా వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాస సాయి స్క్రీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో పి.సురేఖ నిర్మించిన ‘గరం’ ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడింది. ‘‘ఈ చిత్రానికి మంచి టెక్నీషియన్స్, నటులు పనిచేశారు. ‘గరం’ చిత్రం అమెరికాలో కూడా పెద్ద రేంజ్లో విడుదలవుతోంది. ఓ మంచి సినిమాను అందరూ ఆదరించాలి’’ అని సాయికుమార్ పేర్కొన్నారు. దర్శకుడు మదన్ మాట్లాడుతూ- ‘‘నా దృష్టిలో ఈ సినిమా ఇప్పటికే హిట్. తనికెళ్ల, పోసాని వంటి నట-రచయితలతో పనిచేసే అవకాశం ఈ చిత్రంతో వచ్చింది. సాయికుమార్ గారు నాకు స్వేచ్ఛనిచ్చి, మంచి పని రాబట్టుకున్నారు’’ అని చెప్పారు. ‘‘సీనియర్లతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. సినిమాపై మంచి అంచనాలున్నాయి. యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా ఇది. ‘గరం’ చూసినవారెవరూ డిజప్పాయింట్ అవరు’’ అని ఆది తెలిపారు. అదాశర్మ, తనికెళ్ల, పోసాని, పృథ్వి, నాజర్, చైతన్య కృష్ణ, కథారచయిత శ్రీనివాస్ గవిరెడ్డి పాల్గొన్నారు. -
ఈ ఏడాది ఆదితో కలసి నటిస్తా
సాక్షి, తిరుమల: తన కుమారుడు ఆదితో కలసి ఈ ఏడాది ఓ చిత్రంలో నటించనున్నట్లు ప్రముఖ నటుడు సాయికుమార్ తెలిపారు. ఆదివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2015లో తాను నటించిన పటాస్, పండుగ చేస్కో, భలే మంచిరోజు చిత్రాలు సంతృప్తినిచ్చాయని తెలిపారు. కన్నడలో నటించిన విజయరంగీత్ తరంగా చిత్రం ఆస్కార్కు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు. ఈ ఏడాది నాలుగైదు భారీ చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పారు. తన కుమారుడు ఆది హీరోగా నటిస్తున్న గరం చిత్రం ఫిబ్రవరి 12న విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని, తన సతీమణి సురేఖ నిర్మాణ సారథ్యంలో దీన్ని నిర్మిస్తున్నామని అన్నారు. తన 40 ఏళ్ల సినీ ప్రస్థానం సంతోషంగా సాగిపోతోందని పేర్కొన్నారు. -
ఈ గరం... అందరికీ ప్రియం!
‘‘మదన్ మంచి టేస్ట్ఫుల్ డెరైక్టర్. సాయికుమార్ గారు నిర్మాతగానూ, ఆది హీరోగానూ ఈ సినిమాతో బిగ్ కమర్షియల్ సక్సెస్ సాధించాలి’’ అని హీరో గోపీచంద్ ఆకాంక్షించారు. ఆది, అదాశర్మ జంటగా మదన్ దర్శకత్వంలో వసంతా శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్క్రీన్స్ బ్యానర్పై పి. సురేఖ నిర్మించిన చిత్రం ‘గరం’. అగస్త్య స్వరాలందించిన ఈ సినిమా పాటల సీడీని బుధవారం రాత్రి హైదరాబాద్లో గోపీచంద్ ఆవిష్కరించి, హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్కు అందించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ - ‘‘మదన్గారు ఈ చిత్రాన్ని చాలా కమర్షియల్గా హ్యాండిల్ చేశారు. నరేశ్గారి పాత్ర హైలైట్. అగస్త్య ఇచ్చిన ట్యూన్లు, రీరికార్డింగ్ బ్యూటిఫుల్’’ అని చెప్పారు. హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ - ‘‘ఆది డ్యాన్స్లు చితగ్గొట్టేశాడు. ఈ సంస్థలో నేను కూడా సినిమా చేయాలనుకుంటున్నా’’ అని తెలిపారు. ఆది లాంటి హార్డ్ వర్కింగ్ హీరోని ఇంతవరకూ చూడలేదని హీరో నిఖిల్ పేర్కొన్నారు. సాయి కుమార్ ఈ సినిమాతో గొప్ప నిర్మాత అవుతారని సీనియర్ నరేశ్ అన్నారు. ఆది రియల్గా ఎనర్జిటిక్ హీరో అని ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు చెప్పారు. ‘గరం’ అందరికీ ప్రియం అని సాయికుమార్ నమ్మకం వ్యక్తపరిచారు. ఈ వేడుకలో రానా, అభిరామ్ దగ్గుబాటి, సందీప్ కిషన్, అచ్చిరెడ్డి, రాధామోహన్, కేవీవీ సత్యనారాయణ, సుశాంత్, రఘు కారుమంచి, భాస్కరభట్ల, షకలక శంకర్, సత్యప్రకాశ్, బీఏ రాజు, వీరభద్రమ్, బాబ్జీ, ‘గరం’ టీమ్ నుంచి దర్శకుడు మదన్, కెమేరామన్ సురేందర్రెడ్డి, ఇతర సభ్యులు మాట్లాడారు. -
‘గరం’ టీజర్ను ఆవిష్కరించిన ప్రభాస్
-
ఆది హీరోగా 'చుట్టాలబ్బాయి'
-
నటుడు, సాయికుమార్ తండ్రి పీజే శర్మ మృతి
-
ఆది దంపతులు
నేటితో నా బ్యాచిలర్ లైఫ్కి ఆఖరి రోజు! ‘‘అప్పుడే పెళ్లేంటి? అన్నారు. ‘కరెక్టు టైమ్కి భలేగా చేసుకుంటున్నావ్’ అన్నారు. ఆలోచించాను. ఆ రెంటినీ తూకం వేసుకుని నాన్నకు ఓ మాట చెప్పాను. నాన్న... ‘నీ మాటే నా మాట’ అన్నారు. వెంటనే అరుణకి ఓకే చెప్పాను. సో... హ్యాపీగా ఏడడుగులు వేయడానికి రెడీ అయ్యాను. మీ అందరి బ్లెస్సింగ్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ... - మీ ఆది