Adventure
-
కొత్తగూడెంలో ఎకో అడ్వెంచర్ పార్క్
లోతైన క్వారీలు, ఎత్తైన మట్టి దిబ్బలు, రాకాసి బొగ్గు, దుమ్మూ ధూళి.. సింగరేణి గనులు (Singareni Mines) అనగానే ముందుగా గుర్తొచ్చేది ఇవే.. కానీ ఇప్పుడు అందమైన వనాలు, ఔషధ మొక్కలు, సీతాకోక చిలుకల పార్కులకు (Butterfly Park) సింగరేణి పాత గనులు చిరునామాలుగా మారుతున్నాయి. మైనింగ్లో జరిగే నష్టాలను ఆయా సంస్థలే పూరించాలని కేంద్ర పర్యావరణ శాఖ తెచ్చిన నిబంధన మేరకు మూసివేసిన గనుల వద్ద సింగరేణి సంస్థ కొన్నాళ్లుగా భారీగా మొక్కలు నాటి అడవులు (Forests) పెంచుతోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అందమైన ఎకో పార్కులను అభివృద్ధి చేయటం మొదలుపెట్టింది. కొత్తగూడెంలో ఎనిమిది హెక్టార్ల విస్తీర్ణంలో ఎకో పార్క్ను ఇప్పటికే సిద్ధం చేసింది. - సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఅందమైన వనాలు సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో రూ.3 కోట్లతో ఏర్పాటుచేసిన ఎకో పార్క్లో బటర్ఫ్లై గార్డెన్ను ఏర్పాటుచేశారు. ఎడారి, ఔషధ మొక్కలు, తాళ్లవనం (వివిధ దేశాలకు చెందిన తాటి చెట్లు), బోన్సాయ్ వంటి వివిధ దేశాల అరుదైన మొక్కలతో వేర్వేరు థీమ్లతో ఈ పార్క్ను అభివృద్ధి చేశారు. పార్క్ ప్రాంగణంలోనే సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో రెండు కొలనులు ఉన్నాయి. సందర్శకులు ధ్యానం చేసుకునేందుకు బుద్ధవనం సిద్ధంగా ఉంది. వీటితోపాటు బర్డ్వాచ్ సెంటర్, వ్యూ పాయింట్, టాయిలెట్లు, కెఫటేరియాలు సిద్ధమయ్యాయి. పట్టణానికి దూరంగా నలువైపులా ఎత్తయిన కొండలు, దట్టంగా పరుచుకున్న చెట్ల నడుమ ఆధునిక సౌకర్యాలతో ఈ ఎకో పార్క్ను ఏర్పాటుచేశారు. ఇక్కడికి స్టడీ టూర్ల కోసం విద్యార్థులు వస్తున్నారు. టూరిజం శాఖకు అప్పగించే యోచనశ్రీరాంపూర్ ఏరియాలో మరో ఎకో పార్క్ (Eco Park) నిర్మా ణం జరుగుతోంది. ఈ రెండింటి తరహాలోనే సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో ఎకో పార్క్లను రెండుమూడేళ్లలో ఏర్పాటుచేస్తారు. ఆ తర్వాత భవిష్యత్లో మూతపడే ప్రతీ గని వద్ద ఇలాంటి పార్కులు నెలకొల్పుతారు. వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చాక టూరిజం శాఖకు అప్పగించే యోచనలో సింగరేణి ఉంది. ఇప్పుడిప్పుడే ఎకో టూరిజం పుంజుకుంటుండటం,ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఉండడంతో సింగరేణి సహకారం పర్యాటకరంగానికి మరిన్ని వన్నెలు అద్దనుంది.మైనింగ్పై అవగాహన కల్పించేలా.. ఎకో పార్క్ పక్కనే ఉన్న గౌతం ఖని ఓపెన్కాస్ట్ ఓవర్ బర్డెన్ మట్టి దిబ్బలపై పెంచిన వనంలో సైక్లింగ్ ట్రాక్, నాలుగు కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ పాత్లను అభివృద్ధి చేస్తున్నారు. దీన్ని ఎకో అడ్వెంచర్ పార్క్గా అప్గ్రేడ్ చేయనున్నారు. పార్క్ సమీపంలో వెంకటేశ్ ఖని మెగా ఓపెన్కాస్ట్ త్వరలో మొదలుకానుంది. దీంతో ఓపెన్కాస్ట్ ఉపరితలంపై మరో వ్యూ పాయింట్ (View Point) సిద్ధం చేసి.. ప్రతీరోజు నిర్ణీత సమయంలో గనుల్లో జరిగే బ్లాస్టింగ్ను సందర్శకులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా మైనింగ్ ప్రక్రియలో అడవులు, భూమి, జలవనరులకు జరిగే నష్టాలు ఎలా ఉంటాయి? వాటిని భర్తీ చేయడంలో సింగరేణి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని నిర్ణయించారు.ఇదీ చదవండి: ఇప్పటి రాజోలి.. ఒకప్పుడు అడవి -
డిసెంబర్ 30 వరకు.. వంతారా కార్నివాల్ అడ్వెంచర్
వన్యప్రాణులను రక్షించడానికి, వాటికి పునరావాసం కల్పించడానికి ఏర్పాటైన 'వంతారా' తాజాగా 'వాంతారియన్ రెస్క్యూ రేంజర్స్' పేరుతో ఓ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం 2024 డిసెంబర్ 30 వరకు జరగనుంది. ఈ ఈవెంట్ ప్రత్యేకించి జంతు ప్రేమికుల కోసం ఏర్పాటు చేసింది.వాంతారియన్ రెస్క్యూ రేంజర్స్ కార్యక్రమంలో చిక్కుకున్న పక్షులను విడిపించడం, రక్షించిన జంతువులకు ఆహారం ఇవ్వడం, ఆవాసాలను రక్షించడం నేర్చుకోవడం వంటి సవాళ్లను అనుకరించడంలో ఇంటరాక్టివ్ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. వన్యప్రాణుల అక్రమ రవాణాపై క్లిష్టమైన పోరాటాన్ని నొక్కిచెబుతూ.. తప్పిపోయిన జంతువులలో ఒకదాన్ని రక్షించడంలో సాహసం ముగుస్తుంది.కార్యకలాపాలను పూర్తి చేసిన పిల్లలు.. రక్షించిన జంతు బొమ్మను అందుకుంటారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక ప్రదేశంలో జంతువులు, పక్షుల బొమ్మలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వీటితో పాటు ఎక్కడ చూసినా శాంటా బొమ్మలను కూడా చూడవచ్చు.వంతారాఅనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. -
సాహసకృత్యాలకు చిరునామా మయూరి ఎకో పార్క్
స్టేషన్ మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ‘మయూరి హరితవనం’ (ఎకో అర్బన్ పార్క్) ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఈ పార్క్ వనవిహార కేంద్రంగా రూపుదిద్దుకుంది. జిల్లా కేంద్రం అప్పన్నపల్లి శివారులోని ఈ ఎకో అర్బన్ పార్క్ పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. ఈ నేచర్పార్క్ అర్బన్ లంగ్స్ స్పేస్ పర్యాటక కేంద్రంగా మారుతోంది. 2,087 ఎకరాల్లో మయూరి పార్క్ను అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకుల ఆహ్లాదం కోసం అన్ని రకాల వసతులు ఉండడంతో ఎకో పార్క్కు సందర్శకుల తాకిడి అధికమైంది. ఎకో అర్బన్ పార్కులో సౌకర్యాలు పార్క్లో చిల్డ్రన్స్ పార్క్, బటర్ఫ్లై గార్డెన్, కరెన్సీ పార్క్, రోజ్ గార్డెన్, రాశీవనం, నక్షత్ర వనం, నవగ్రహ వనం, హెర్బల్ గార్డెన్లు పర్యాటకులకు అమితంగా ఆకర్షిస్తున్నాయి. పార్క్లో మాకావ్ ఎన్క్లోజర్, స్వాన్ పాండ్, హిల్వ్యూ పాయింట్, ప్రత్యేకంగా జంగిల్ సఫారీ, ఫ్లాగ్ పాయింట్, ఆస్ట్రిచ్ బర్డ్ ఎన్క్లోజర్లను ఏర్పాటు చేశారు. ఆకట్టుకుంటున్న అడ్వెంచర్ గేమ్లు పార్క్లో పెద్దల కోసం ఏర్పాటు చేసిన జిప్లైన్, జిప్సైకిల్, చిన్నారులకు జిప్సైకిల్, జిప్లైన్ తదితర అడ్వెంచర్ గేమ్స్ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. పెద్దల జిప్ సైకిల్ రూ.150, జిప్లైన్ రూ.70, చిన్నారుల జిప్సైకిల్ రూ.30, జిప్లైన్ రూ.30గా నిర్ణయించారు. జిప్సైకిల్ రానుపోను 600 మీటర్లు, జిప్లైన్ 200 మీటర్ల వరకు ఉంటుంది. వీకెండ్ రోజుల్లో ముఖ్యంగా చిన్నారులు, యువత జిప్ సైకిల్, జిప్ లైన్పై హుషారుగా సందడి చేస్తున్నారు. పార్క్లో అడల్ట్, చిల్డ్రన్స్ బోటింగ్తోపాటు నేచర్ నైట్ క్యాంపింగ్ సైట్ అందుబాటులో ఉంది.అడవిలో జంగిల్ సఫారీ పార్క్లో జంగిల్ సఫారీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పార్క్ నుంచి అడవిలో రానుపోను 14 కిలోమీటర్లు ఈ జంగిల్ సఫారీ ఉంటుంది. పార్క్ నుంచి ప్రారంభమయ్యే ఈ సఫారీ గోల్ బంగ్లా వాచ్ టవర్ వరకు తీసుకెళ్లి తిరిగి పార్క్కు చేరుకుంటుంది. సఫారీలో నెమళ్లు, జింకలు, ఇతర జంతువులను తిలకించే అవకాశం ఉంటుంది. రూ.2 వేలు చెల్లించి 8 మంది జంగిల్ సఫారీ చేయవచ్చు. మరిన్ని సాహస క్రీడల ఏర్పాటు పర్యాటకులను ఆకట్టుకునే విధంగా మయూరి పార్క్లో భవిష్యత్లో మరిన్ని సాహస క్రీడలను ఏర్పాటు చేస్తాం. రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్, ట్రెక్కింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. జంగిల్ సఫారీకి పర్యాటకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. – సత్యనారాయణ, డీఎఫ్వో, మహబూబ్నగర్ -
సర్కస్ కాదు.. సర్కారు ఉద్యోగి సాహసం
-
సముద్ర సాహసాలు చేయాలనుందా? అయితే ఈ గేమ్ ఆడాల్సిందే!
‘బారెంట్స్ అండ్ ఫిషింగ్.. నార్త్ అట్లాంటిక్ ఫ్రాంఛైజీలకు సీక్వెల్గా వచ్చిన గేమ్ షిప్స్ ఎట్ సీ. ఈ బ్రాండ్–న్యూ గేమ్ప్లేలో రకరకాల కొత్త ఫీచర్లు ఉన్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. చాలాకాలంగా ఎదురు చూస్తున్న మల్టీప్లేయర్ మోడ్లో వచ్చిన ఈ గేమ్ ద్వారా మహా సముద్రాలకు సంబంధించి రియలిస్టిక్ ఎక్స్పీరియెన్స్ను సొంతం చేసుకోవచ్చు.నెక్ట్స్ జనరేషన్ షిప్ స్టిమ్యులేషన్గా వచ్చిన ఈ గేమ్లో మొదటిసారిగా సర్వీస్, కార్గో నౌకలను పరిచయం చేశారు. వీటిలో సరికొత్త గేమ్ప్లే ఫీచర్లో ఉంటాయి. ‘స్నేహితులతో కలిసి నార్వేజియన్ సముద్రంలోకి వెళ్లండి. సినిమాటిక్–క్వాలిటీ ఓషన్ స్టిమ్యులేషన్ దీని సొంతం. సముద్ర సాహసాలు చేయాలనే ఉత్సాహం మీలో ఉందా? అయితే షిప్స్ ఎట్ సీలోకి వచ్చేయండి’ అంటుంది గేమ్ డెవలపర్ మిస్క్ గేమ్స్.జానర్స్: ఎర్లీ యాక్సెస్, స్ట్రాటజీ వీడియో గేమ్,ల్యాట్ఫామ్: మైక్రోసాఫ్ట్ విండోస్,ఇంజిన్: అన్రియల్ ఇంజిన్ 5.ఇవి చదవండి: ఈ టేస్టీ స్నాక్స్తో.. స్కూల్ లంచ్ బాక్సుకి రెడీ అయిపోండి..! -
గేమింగ్.. 'రక్షకుడు' వచ్చాడు!
యాక్షన్–అడ్వెంచర్ గేమ్ ‘ఘోస్ట్ ఆఫ్ సుషిమ’ విడుదల అయింది. థర్డ్–పర్సన్ పర్స్పెక్టివ్ నుంచి ఆడే గేమ్ ఇది. సుషిమ ద్వీపాన్ని రక్షించడానికి రంగంలోకి దిగిన ‘సకాయ్’ అనే సమురాయ్ని ప్లేయర్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అకీరా కురోసావా సినిమాలు, కామిక్ బుక్ సిరీస్ ‘ఉసాగి యోజింటో’ ప్రేరణతో ఈ గేమ్ను రూపొందించారు.గేమ్ ల్యాండ్స్కేప్, మినిమలిస్టిక్ ఆర్ట్ స్టైల్ను యాక్షన్–అడ్వెంచర్ గేమ్ ‘షాడో ఆఫ్ ది కొలోసస్’ ప్రభావంతో చేశారు. గేమ్లోని లొకేషన్లు ‘పర్ఫెక్ట్ ఫొటోగ్రాఫర్స్ డ్రీమ్స్’ అనిపించేలా అందంగా ఉంటాయి. ఇలన్ ఎస్కేరి, షిగేర్ ఉమేలయాషి ఈ గేమ్ సౌండ్ ట్రాక్ను అద్భుతంగా కం΄ోజ్ చేశారు.‘చారిత్రకంగా, సాంస్కృతికంగా ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాం’ అని మేకర్స్ చెబుతున్నారు.జానర్: యాక్షన్–అడ్వెంచర్మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్ప్లాట్ఫామ్స్: ప్లేస్టేషన్ 4, ప్లే స్టేషన్ 5, విండోస్.ఇవి చదవండి: అరుదైన ప్రతిభ.. అక్షత! -
'సముద్ర గర్భం'లోకి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ గేమ్ ట్రై చేయండి!
సముద్ర గర్భంలోకి వెళ్లడం అంటే మరో ప్రపంచంలోకి వెళ్లినట్లే. పరిచిత, అపరిచిత, వింత, క్రూర.. రకరకాల జీవులు మనకు సవాలు విసురుతాయి. సాహసం ఏమాత్రం నీరు కారి΄ోయినా జీవితం నీటిపాలు కావాల్సిందే. అందుకే సముద్ర గర్భంలో ప్రతి క్షణం...విలువైన సాహసమే. సముద్ర గర్భంలో సాహస యాత్ర చేయాలని ఉందా? అయితే ఈ గేమ్ మీ కోసమే.అడ్వెంచర్ సిమ్యూలెషన్ గేమ్ ‘ఎండ్లెస్ ఒషియన్ లుమినస్’ విడుదలైంది. జపాన్ గేమింగ్ కంపెనీ ‘అరిక’ డెవలప్ చేసిన గేమ్ ఇది. ‘ఎండ్లెస్ ఓషన్’ సిరీస్లో వస్తున్న థర్డ్ గేమ్. సముద్రగర్భ ప్రపంచాన్ని రికార్డ్ చేయడానికి ఈ గేమ్లో ప్లేయర్ స్కూబా డైవర్ పాత్ర పోషించాల్సి ఉంటుంది.ప్లాట్ఫామ్: నిన్టెండో స్విచ్,జానర్స్: అడ్వెంచర్, సిమ్యులేషన్,మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీ ప్లేయర్ -
మహిళల సమస్యలపై ‘సాహస్’ అస్త్రం
సాక్షి, హైదరాబాద్: పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై ‘సాహస్’పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చని మహిళా భద్రత విభాగం అధికారులు తెలిపారు. ఉద్యోగం చేసే మహిళలు ఈ పోర్టల్లో తమ సమస్యలు చెప్పుకునేందుకు ‘గెట్ హెల్ప్’ఆప్షన్ ఉన్నట్టు వారు వెల్లడించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ ఉదయం 10–30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 7331194540 నంబర్లోనూ ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. సాహస్ పోర్టల్ను ఇప్పటికే ప్రారంభించామని, మహిళల్లో అవగాహన కోసం దీనిపై మరింత ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు. పని ప్రదేశంలో మహిళా ఉద్యోగుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు మొదలు.. లైంగిక వేధింపులపై ఎలా ఫిర్యా దు చేయాలి, న్యాయ సాయం ఎలా పొందాలో పోర్టల్లో పొందుపరిచినట్టు తెలిపారు. ఫిర్యాదులకు https:// womensafetywing. telangana. gov. in/ sahas/ లో క్లిక్చేసి వివరాలు పొందవచ్చని వివరించారు. -
97 నుంచి 77 కట్ చేస్తే... ఆ కరేజ్ ఇలా ఉంటుంది!
97 సంవత్సరాల వయసులో రెండు అడుగులు వేగంగా వేయాలంటేనే కష్టం. అలాంటిది ‘పారా మోటరింగ్ అడ్వెంచర్’ చేస్తే... మహారాష్ట్రలోని నాగ్పుర్కు చెందిన ఉషా తూసే 97 సంవత్సరాల వయసులో పారామోటరింగ్ సాహసం చేసి నెటిజనులు ‘వావ్’ అనేలా చేసింది. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో 1.2 మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది. ఆర్మీ పారా–కమాండో పైలట్స్, ఎయిర్ ఫోర్సు వెటరన్స్ ఆపరేట్ చేసే ఫ్లైయింగ్ రైనో పారామోటరింగ్ విభాగం బామ్మ చేత ఈ సాహసాన్ని చేయించింది. ‘97 ఇయర్ వోల్డ్ కరేజ్ అండ్ 20 ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్’ అనే కాప్షన్తో ‘ఎక్స్’లో ఈ వీడియో క్లిప్ను పోస్ట్ చేసింది. ‘సాహసంలో జీవనోత్సాహం కూడా ఉంటుంది అనే వాస్తవాన్ని ఆవిష్కరించే వీడియో ఇది’. ‘ఎంతోమందిని ఇన్స్పైర్ చేసే వీడియో’.... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి నిజానికి ఉషాకు సాహసం కొత్త కాదు. భర్త ఆకస్మిక మరణం, పిల్లల బరువు బాధ్యతల సమయంలో కూడా ఆమె డీలా పడిపోలేదు. ఒంటి చేత్తో కుటుంబాన్ని ధైర్యంగా పోషించింది. -
హైదరాబాద్లో అడ్వెంచర్స్.. వీకెండ్లో చిల్ అవ్వండి
హైదరాబాద్లో అంటేనే నోరూరించే కమ్మని వంటకాలు, అనేక పర్యాటక ప్రదేశాలకు ఫేమస్. వీకెండ్ వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి వచ్చి రిలాక్స్ అవుతుంటారు. అడ్వెంచర్ యాక్టివిటిస్కి కూడా హైదరాబాద్ అడ్డాగా మారుతుంది. ఒకప్పుడు పారాగ్లైడింగ్ అంటే గోవా, బెంగళూరు వంటి ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ వేదికగా ఎన్నో అడ్వెంచర్ స్పాట్స్, అది కూడా తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చేశాయి. అవేంటో తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే. బంగీ జంపింగ్ లైఫ్లో ఒక్కసారైనా బంగీ జంపింగ్ను ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొండలు, బ్రిడ్జి వంటి ఎత్తైన ప్రదేశాల నుంచి తాళ్లతో శరీరాన్ని కట్టుకొని కిందకు దూకండి చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. బంగీజంపింగ్ చేయాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ అడ్వెంచర్ యాక్టివిటి కోసం మన హైదరాబాద్లోనే చాలా ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. వాటిలో రామోజీ ఫిల్మ్ సిటీ,లియోనియా రిసార్ట్, డిస్ట్రిక్ గ్రావిటి పార్క్ వంటి ప్రాంతాల్లో అందుబాలో ఉంది. దీని ధర సుమారు రూ.3500 నుంచి 4500 వరకు ఉంటుంది. 12 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వ్యక్తులు ఎవరైనా బంగీ జంప్ చేయొచ్చు. దీనికోసం ముందుగానే బీపీ, హార్ట్రేట్ వంటివి చెక్ చేస్తారు. ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తులకే బంగీ జంపింగ్ అనుమతిస్తారు. పారాగ్లైడింగ్ రెక్కలు కట్టుకొని ఆకాశలో ఎగురుతూ భూమిపై ఉన్న ప్రకృతి అందాలను చూడాలంటే పారాగ్లైడింగ్ బెస్ట్ ఛాయిస్.ఆకాశంలో పక్షలతో పోటీ పడి ఎగురుతూ భూమి పై అందాలను ఆస్వాదించవచ్చు. అయితే పారాగ్లైడింగ్ అన్ని చోట్ల వీలు పడదు. ఇందుకు కొంత ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులతో పాటు వాతావరణం కూడా అనుకూలించాలి. హైదరాబాద్లో కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర్లో అందుబాటులో ఉంది. ధర రూ.3500 జిప్లైన్ చాలా ప్రాంతాల్లో జిప్లైన్ కోసం 50 మీటర్ల నుంచి ఎత్తులో బ్యూటిఫుల్ నేచర్ను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. హైదరాబాద్లో శామీర్పేట్లోని డిస్ట్రిక్ట్ గ్రావిటీ అడ్వెంచర్ పార్క్, ఎక్సోటికా బొటిక్ రిసార్ట్ వంటి ప్రాంతాల్లో జిప్లైన్ యాక్టివిటి అందుబాలో ఉంటుంది. ధర రూ. 700-1000 వరకు ఉంటుంది. వీకెండ్స్లో ధర మారుతుంది) స్కై డైవింగ్ ఎత్తుగా ఉండే ప్రాంతాల నుంచి గాల్లోకి దూకే సాహసక్రీడను స్కై డైవింగ్ అంటారు. వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం నుంచి ఒక్కసారిగా కిందికి దూకుతూ చేసే స్కై డైవింగ్ ఎక్స్పీరియన్స్ను ఇండోర్లో కూడా పొందచ్చు. అది ఎక్కడంటే..గండిపేట సమీపంలో గ్రావిటీజిప్ అడ్వెంచర్ స్పోర్ట్స్లో ఈ ఇండోర్ స్కై డైవింగ్ ఎక్స్పీరియన్స్ను పొందిచ్చు. ఇందుకోసం ఇండోర్ స్కైడైవింగ్ కోసం 23 అడుగుల ఎత్తుతో ప్రత్యేక సిలిండర్ రూపొందించారు. ధర సుమారు రూ. 3300 నుంచి 4300 వరకు ఉంటుంది. (వీకెండ్స్లో ధర మారుతుంటుంది) ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ కోసం సిటీలో చాలా ప్రాంతాలు ఉన్నా అనంతగిరి హిల్స్ బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. వీకెండ్ వస్తే చాలు ఇక్కడికి ఫ్రెండ్స్తో ఎక్కువగా హైదరబాదీలో ట్రెక్కింగ్కు వెళ్తుంటారు. ఇందుకోసం రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. క్లౌడ్ డైనింగ్ సాధారణంగా రెస్టారెంట్లో ఎవరైనా భోజనం చేస్తారు. కానీ ఆకాశానికి, భూమికి మధ్యలో ఎత్తైన ప్రదేశంలో భోజనం చేస్తే ఆ ఫీలింగే వరే. గాల్లోకి ఎగిరిపోయి అక్కడి నుంచి కిందకు చూస్తూ భోజనం చేస్తే ఆ థ్రిల్లింగ్ చెప్పక్కర్లేదు. ఇండియాలోనే మొట్టమొదటిసారి ఇలాంటి ఎక్స్పీరియన్స్ పొందాలంటే హైదరాబాద్లోని క్లౌడ్ డైనింగ్కు వెళ్లాల్సిందే. ఇది హైటెక్ సిటీ సమీపంలో ఉంటుంది. ఈ క్లౌడ్ డైనింగ్.. భూమికి 160 ఎత్తుల అడుగులో ఉంటుంది. దాదాపు అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ భోజనం చేయాలంటే.. రూ.5,000 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. -
డబ్బింగ్ షురూ
కార్తీ హీరోగా నటించిన అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ‘జపాన్’. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సునీల్, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ కీలక పాత్రల్లో నటించారు. ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో ఎస్ఆర్ ప్రకాశ్బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని వెల్లడిస్తూ, ఇందుకు సంబంధించిన ఓ వీడియోను చిత్ర యూనిట్ షేర్ చేసింది. ‘‘కార్తీ పుట్టినరోజు (మే 25) సందర్భంగా విడుదల చేసిన ‘జపాన్’ గ్లింప్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రత్యేకమైన కాన్సెప్ట్తో రూపొందించిన ఈ చిత్రంలో కార్తీ డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా ‘జపాన్’ చిత్రంలో గోల్డ్ స్మగ్లింగ్ చేసే వ్యక్తి పాత్రలో కార్తీ కనిపిస్తారని కోలీవుడ్ టాక్. -
నారూటే సెపరేటు..చీర కట్టులో సర్ఫింగ్
చీరతో కొన్ని రకాల సాహస క్రీడలు, ఫీట్లు చేయడం కాస్త కష్టం. అందులోనూ స్కూబా వంటివి అయితే అస్సలు కుదరదు. అలాంటిది ఓ మహిళ చీరతో ఆ సాహసానికి దిగింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ మహిళ చీర కట్టులో గాలిపటల సర్ఫింగ్ చేసింది. ఆమె పేరు కాత్యా సైనీ. ఈ నెల ప్రారంభంలోనే లైసెన్స్ పొందిన స్కూబా డైవింగ్ శిక్షకురాలు ఆమె. కాగా అందుకు సంబంధించిన వీడియో జూలై 10న నెట్టింట పోస్ట్ అవ్వడంతో తెగ వైరల్ అవ్వుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు కొందరూ మెచ్చుకోగా మరికొందరూ ఫైర్ అయ్యారు. ఒక నెటిన్ ఇది క్రాస్ కల్చర్ ఇలాంటిది నాకు చాలా ఇష్టం. నువ్వు ఓ అద్భతం అంటూ ఆ మహిళని ప్రసంశించాడు. మరో వ్యక్తి ఏ ఉద్దేశ్యంతో ఇలాంటి సాహసం చేశారో తెలియదు. కొన్ని సాహస క్రీడలకు చీర నిషిద్ధం. అలాంటి ప్రమాదకరమైన ఫీట్లు చేస్తున్నప్పుడూ చీర ఇరుక్కుంటే పరిస్థితి ఏంటి అంటూ ఫైర్ అయ్యారు. ఈ వీడియోకి లక్షలకు పైగా లైక్లు వ్యూస్ వచ్చాయి. మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Katya Saini (@katyasaini) (చదవండి: ఓ దేశానికి హాలిడే ట్రిప్గా వెళ్లితే.. ఆ దేశ అధ్యక్షుడి సడెన్ ఎంట్రీతో..) -
సాగర గర్భంలో కలిసిన సాహస వీరులు
ఎప్పుడో వందేళ్ల కిందట.. అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి ఐదుగురు మృత్యువాత పడ్డారు. టైటాన్ అనే మినీ సబ్మెరిన్(సబ్ మెర్సిబుల్)లో వీక్షణకు బయల్దేరి.. సముద్ర గర్భంలోనే కలిపిపోయారు వాళ్లు!. దాదాపు ఐదురోజులపాటు ప్రపంచం మొత్తం వాళ్ల జాడ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చింది. అమెరికా తీర రక్షణ దళం ఆధ్వర్యంలో పలు దేశాలకు చెందిన రెస్క్యూ టీంలు సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. గురువారం నాడు గంట గంటకు ఉత్కంఠ రేపిన ఈ వ్యవహారం.. చివరకు శకలాల గుర్తింపు ప్రకటనతో విషాదాంతంగా ముగిసింది. యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రకటన ప్రకారం.. టైటానిక్ శకలాల సమీపంలోనే ఓడ ముందుభాగం నుంచి సుమారు 1,600 అడుగుల దూరంలో టైటాన్ శిథిలాలు పడి ఉన్నాయి. రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్(ROV) వీటిని గురువారం ఉదయం గుర్తించినట్లు ప్రకటించింది కోస్ట్గార్డ్. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం కెనడాలోని న్యూఫౌండ్లాండ్ నుంచి ఐదుగురితో కూడిన ‘టైటాన్’ సాహసయాత్ర ప్రారంభం అయ్యింది. పోలార్ ప్రిన్స్ అనే నౌక సాయంతో టైటాన్ను నీటి అడుగుకు పంపించారు. గంటన్నర తర్వాత.. పోలార్ప్రిన్స్తో టైటాన్కు సంబంధాలు తెగిపోయాయి. ఈ విషయాన్ని వెంటనే అమెరికా తీర రక్షణ దళం దృష్టికి తీసుకెళ్లింది ఈ యాత్ర నిర్వాహణ సంస్థ ఓషన్గేట్. న్యూఫౌండ్ల్యాండ్ తీరానికి 400 మైళ్ల దూరంలో ఉత్తర అట్లాంటిక్లో టైటాన్ అదృశ్యమై ఉంటుందని భావించింది కోస్ట్గార్డ్. అప్పటి నుంచి 13,000 అడుగుల (4,000 మీటర్లు) లోతుల్లో టైటాన్ జాడ కనిపెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. సముద్ర అగాథంలోకి చేరుకుని జలాంతర్గామిని కనిపెట్టడం అత్యంత కష్టమని నిపుణులు మొదటి నుంచి వేసిన అంచనా కొంతవరకు నిజమైంది కూడా. ఇలా జరిగిందేమో.. విపత్తు పేలుడు..Catastrophic Implosion టైటాన్ ప్రమాదానికి కారణం ఇదేనని యూఎస్ కోస్ట్గార్డ్ ఓ అంచనా వేస్తోంది. నీటి అడుగుకు వెళ్లే క్రమంలో.. ఛాంబర్లోని ఒత్తిడి వల్లే మినీసబ్మెర్సిబుల్ పేలిపోయి ఉంటుందని ప్రకటించింది. అయితే.. నీటి అడుగున సబ్మెర్సిబుల్(మినీజలంతర్గామి) విషయంలోనే కాదు.. సబ్మెరిన్ల(జలంతర్గాముల) విషయంలోనూ ఇది జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అధిక అంతర్గత ఒత్తిడి వల్ల సబ్మెరిన్లు ఒక్కోసారి ఆగిపోయి.. నీటి అడుగుకు వెళ్లిపోతాయట. ఒక్కోసారైతే ఆ ఒత్తిడి భరించలేక అవి పేలిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. టైటాన్ పేలిపోయిన ఖచ్చితమైన క్షణం మాత్రం చరిత్రలో ఓ మిస్టరీగా మిగిలిపోయే అవకాశమే ఉంది. ఒకవేళ టైటాన్ శకలాల చెంత మృతదేహాల జాడ కనిపించినా.. అట్లాంటిక్ అడుగున ఉన్న వాతావరణం నుంచి బయటకు తేలేని పరిస్థితి ఉందని యూఎస్ కోస్ట్గార్డ్ అధికారికంగా ప్రకటించింది. 🚨 Breaking News All five people onboard on #Submersible are all very sadly died, #OceanGate confirms. This video shows how the accident happened with the submarine. 💔#Titanic #Titan pic.twitter.com/W82X9OawuD — WOLF™️ (@thepakwolf) June 22, 2023 ఆది నుంచి విమర్శలే.. వాషింగ్టన్ ఎవరెట్టెకు చెందిన ప్రైవేట్ కంపెనీ ఓషన్గేట్. 2009లో స్టాక్టన్ రష్, గుయిలెర్మో సోహ్నలెయిన్లు దీనిని స్థాపించారు. నీటి అడుగున టూరిజంతో పాటు అన్వేషణలకు, పరిశోధనలు ఈ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. అందుకుగానూ ఛార్జి చేస్తుంటుంది. 2021 నుంచి టైటానిక్ శకలాలను చూసేందుకు టైటాన్ అనే సబ్ మెర్సిబుల్ ద్వారా యాత్రికులను తీసుకెళ్తూ వస్తోంది. ఈ అడ్వెంచర్ టూర్లో 400 మైళ్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. టైటాన్లో.. ముగ్గురు ప్రయాణికులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. వాళ్లకు తగ్గట్లే సీటింగ్ ఉంటుంది. దాదాపు 6.5 మీటర్ల పొడవున్న ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల దాకా బరువు ఉంటుంది. కార్బన్, టైటానియం కలయిక గోడలు ఉన్నాయి. సోనార్ నేవిగేషన్ సిస్టమ్, హైఎండ్ కెమెరా ఎక్విప్మెంట్, పవర్ఫుల్ ఎల్ఈడీ లైట్లు.. వీటితో పాటు లోపలికి ప్రవేశించడానికి, బయటకు రావడానికి ఒక్కటే ద్వారం ఉంటుంది. ఇది 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. తాజాగా వెళ్లిన ఐదుగురికి(ఒక పైలట్, మిగిలిన నలుగురు యాత్రికులు) 2.50 లక్షల డాలర్లు చెల్లించారు. మన కరెన్సీ లెక్కలో.. అది రూ.2 కోట్లకు పైమాటే. అయితే టైటాన్ నిర్మాణం అట్లాంటిక్ అగాధంలోకి వెళ్లడానికి పనికిరాదంటూ మొదటి నుంచి కొందరు నిపుణులు మొత్తుకుంటున్నా.. ఓషన్గేట్ మాత్రం యాత్రలు నిర్వహిస్తూనే వస్తోంది. అంతేకాదు దానిని ఆపరేట్ చేసేందుకు ఉపయోగించే రిమోట్ విషయంలోనూ తీవ్ర విమర్శలు.. మరోవైపు సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. టైటానిక్ శకలాలకు చూసేందుకు గతంలో ఇతర దేశాలకు చెందిన కంపెనీలు ప్రయత్నించి భంగపడ్డాయి. అయితే చాలామంది నిపుణులు ఈ యాత్రను ఆత్మహత్య సదృశ్యంగా వర్ణించారు కూడా. ఇదీ చదవండి: టిక్.. టిక్.. టిక్.. సస్పెన్స్ థ్రిల్లర్లా టైటాన్ కోసం.. డబ్బే కాదు.. గుండెధైర్యం ఉన్నోళ్లు కూడా! ‘టైటాన్ సబ్మెర్సిబుల్’ మొత్తం ఐదుగురు టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లారు. సాధారణంగా ఇలాంటి యాత్రలకు ఎంపిక ప్రక్రియ కూడా పకడ్బందీగానే జరుగుతుంది. అయితే ఈసారి యాత్రలో వెళ్లిన వాళ్లంతా.. గతంలో సాహస యాత్రలు చేసిన అనుభవం ఉన్నవాళ్లూ ఉన్నారు. కానీ, ఈసారి సాహసయాత్ర వాళ్లను ప్రాణాలను బలిగొంది. డాషింగ్ అండ్ డేరింగ్ హార్డింగ్.. బ్రిటన్కు చెందిన 58ఏళ్ల బిలియనీర్ హమీష్ హార్డింగ్ ప్రస్తుతం యూఏఈలో ఉంటున్నారు. దుబాయ్కు చెందిన యాక్షన్ ఏవియేషన్స్ కంపెనీ చైర్మన్గా వ్యహరిస్తున్నారు. వైమానిక రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలతోపాటు వివిధ రకాల సేవలను ఈ సంస్థ అందిస్తోంది. ఆయన మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించారు. అతను ఒక సాహసికుడు. 2022లో జెఫ్ బెజోస్ నిర్వహించిన బ్లూ ఆరిజిన్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. అనేకసార్లు దక్షిణ ధ్రువాన్ని కూడా సందర్శించారు. మహాసాగరంలో అత్యంత లోతైన ‘మరియానా ట్రెంచ్’లో ఎక్కువసేపు గడిపారు. ఈయన ఆస్తి సుమారు ఒక బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. నమీబియా నుంచి భారత్కు 8 చీతాలను తెప్పించే కసరత్తులో ఆయన భారత ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. పాకిస్థాన్కు చెందిన ప్రముఖ వ్యాపారి షెహజాదా దావూద్, అతడి కుమారుడు సులేమాన్లు. బ్రిటిష్-పాకిస్థానీ బిలియనీర్ షాజాదా దావూద్(48), ఆయన కుమారుడు సులేమాన్(19) కూడా మినీ జలాంతర్గామిలో ఉన్నారు. షాజాదా.. కరాచీ కేంద్రంగా.. పాక్లో అతిపెద్ద కంపెనీ అయిన ఇంగ్రో కార్పొరేషన్కు వైస్ ఛైర్మన్. ఇంగ్రో సంస్థ శక్తి, వ్యవసాయం, పెట్రోకెమికల్స్ టెలికమ్యూనికేషన్స్లో భారీగా పెట్టుబడులను కలిగి ఉంది. 2022లో ఈ సంస్థ 350 బిలియన్ రూపాయల ($1.2 బిలియన్) ఆదాయాన్ని ప్రకటించింది. పాకిస్థాన్లోని అత్యంత ధనవంతుల జాబితాలో షాజాదా తండ్రి హుస్సేన్ దావూద్ పేరు ప్రతిసారీ ఉంటుంది. సర్రేలో భార్యా, ఓ కూతురు, కొడుకుతో ఆయన సెటిల్ అయ్యారు. దావూద్కు యూకేలోని ఉన్నతవర్గాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన పలు సాహస యాత్రల్లో పాల్గొన్నారు కూడా. ఓషియన్ గేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్టన్ రష్.. ఓషన్గేట్ సహవ్యవస్థాపకుడు. ట్రైనింగ్ పైలట్ అయిన రష్.. గతంలో టైటానిక్ శకలాలను చూసి వచ్చారు కూడా. నిపుణుడి హోదాలో ఆయన ఆ బృందం వెంట వెళ్లారు. ఫ్రెంచ్ సబ్మెర్సిబుల్ పైలట్ పాల్ హెన్రీ నార్జిలెట్.. నౌకాదళంలో కమాండర్గా పని చేసిన అనుభవం ఉంది ఈయనకి. అత్యంత లోతైన ప్రదేశాల్లో పని చేసే టీంలకు ఈయన కెప్టెన్గా వ్యవహరించారు. నావికుడిగా పాతికేళ్ల అనుభవమూ ఉంది. ది ఫ్రెంచ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ సీలో చేరి.. ప్రపంచవ్యాప్తంగా పలు శాస్త్రీయ పర్యటనలకు వెళ్లారాయన. విలాసవంతమైన టైటానిక్ నౌక.. 1912 ఏప్రిల్ 14న అట్లాంటిక్ మహాముద్రంలో ఓ మంచుకొండను ఢీ కొట్టి మునిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 1500 మంది జలసమాధి అయ్యారు. ఈ భారీ ఓడ శిథిలాలను 3,800 మీటర్ల లోతులోని సముద్ర గర్భంలో 1985లో గుర్తించారు. ఇదీ చదవండి: వేల అడుగుల లోతుల్లో టైటానిక్.. మీరూ చూసేయండి -
భూగర్భ హోటల్..అక్కడికి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే!
ఇంతవరకు ఎన్నో లగ్జరీ హోటళ్ల గురించి విని ఉంటాం. ఆకాశంలోనూ, సముద్రం అడుగున ఉండే అత్యంత ఖరీదైన హోటళ్లను చూశాం. కానీ భూగర్భంలో వేల అడుగుల లోతుల్లో హోటల్.. అంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఐతే అక్కడకి వెళ్లాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఒకరకంగా సాహసంతో కూడిన పని. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడుందంటే.. యూకేలో నార్త్ వేల్స్లో ఎరారీ నేషనల్ పార్క్లోని స్నోడోనియా పర్వతాల కింద ఉంది. భూగర్భంలో ఏకంగా 1,375 అడుగుల దిగువున ఉంది. అందుకే ఈ హోటల్ ప్రపంచంలోనే అత్యంత లోతుగా ఉండే హోటల్గా గుర్తింపు పొందింది. దీని పేరు 'డీప్ స్లీప్ హోటల్'. ఈ హోటల్కు వెళ్లడమే ఓ అడ్వెంచర్. ఎరారీ నేషనల్ పార్క్లో పర్వతాల కింద ఉండే ఈ హోటల్లో క్యాబిన్లు, రూమ్ల సెటప్ అదిపోతుంది. ఈ హోటల్లోకి వచ్చేక అక్కడ ఉన్న ఆతిథ్యాన్ని చూసి.. అక్కడకి చేరుకోవడానికి పడ్డ పాట్లన్నింటిని మర్చిపోతారు. ఇందులో ట్విన్ బెడ్లతో కూడిన నాలుగు క్యాబిన్లు, డబుల్ బెడ్తో ప్రత్యేకు గుహలాంటి రూములు అతిధులను మత్రముగ్దుల్ని చేస్తాయి. ఇక్కడ ఏడాది ఏడాది పొడవునా 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ..క్యాబిన్లకు థర్మల్ లైనింగ్ ఉండటంతో వెచ్చగానే ఉంటుంది. అయినప్పటికీ ఈ అండర్ గ్రౌండ్ హోటల్లో బస చేసేందుకు వెచ్చగా ఉండే దుస్తులనే ధరించాల్సి ఉంటుంది. ఆ హోటల్ కేవలం రాత్రి పూట బస చేయడానికి అతిథులను ఆహ్వానిస్తుంది. అదికూడా కేవలం శనివారం రాత్రి నుంచి ఉదయ వరకు మాత్రమే అక్కడ బస. ఈ హోటల్కి చేరుకోవడం అలాంటి ఇలాంటి ఫీట్ కాదు. ఓ సాహస యాత్ర. మొదటగా పర్యాటకులు పర్వతాల మీదకు కాలినడన శిఖరాన చేరకున్న తర్వాత హోటల్ నిర్వాహకులు భూగర్భంలోకి వెళ్లడానికి కావాల్సిన హెల్మెట్, లైట్, బూట్లు ఇతరత్రా వస్తువులకి సంబంధించి సంరక్షణ కిట్ని ఇస్తారు. వాటిని ధరించి గైడ్ సమక్షంలో బండ రాళ్ల వెంట ట్రెక్కింగ్ చేసుకుంటూ..మెట్ల బావులు, వంతెనలు దాటుకుంటూ కఠిన దారుల వెంట ప్రయాణించాలి. అలా ప్రయాణించక పెద్ద ఐరన్ డోర్ వస్తుంది. కానీ ఇక్కడకు పిల్లలకు మాత్రం 14 ఏళ్లు దాటితేనే అనుమతిస్తారు. ఇక ప్రైవేట్ క్యాబిన్లో ఇద్దరికి బస రూ. 36 వేలు కాగా , గుహ లాంటి గదికి గానూ రూ. 56 వేలు వెచ్చించాల్సి ఉంది. అయితే ఇక్కడకు వచ్చే పర్యాటకులు మాత్రం ఇంత పెద్ద సాహసయాత్ర చేసి ఆ హోటల్లో బస చేయడం ఓ గొప్ప అనుభూతి అంటున్నారు. అంతేగాదు తమ జీవితంలో మంచి నిద్రను పొందామని ఆనందంగా చెబుతున్నారు పర్యాటకులు. (చదవండి: ఈ టూర్ యాప్ మహిళల కోసమే.. ఇందులో ప్రత్యేకతలు ఏంటో చూసేయండి) -
భారతదేశంలోని టాప్ 10 సాహస ప్రదేశాలు
-
రైడింగ్కి సిద్ధమైపోండి.. మరిన్ని హంగులతో 390 అడ్వెంచర్ వచ్చేసింది!
2023 KTM 390 Adventure Spoke Wheels: కుర్రకారుకు ఎంతో ఇష్టమైన 'కెటిఎమ్ 390 అడ్వెంచర్' KTM 390 Adventure) ఇప్పుడు కొన్ని ఆధునిక హంగులతో దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. ఈ బైక్ ప్రైస్, డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ విఫణిలో విడుదలైన కొత్త 'కెటిఎమ్ 390అడ్వెంచర్' ధర రూ. 3.60 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ లేటెస్ట్ బైక్ ఇప్పుడు మరింత ఆఫ్ రోడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వైర్-స్పోక్ రిమ్లను కలిగి ఉండటం వల్ల మరింత రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. కొత్త మార్పులు.. గతంలో చాలామంది కెటిఎమ్ బైక్ రైడర్లు ఈ వైర్-స్పోక్ రిమ్ ఫీచర్ ఉంటే మరింత గొప్ప రైడింగ్ అనుభూతిని పొందవచ్చని అభిప్రాయం వ్యక్తం చేయడం వల్ల చివరకు కంపెనీ ఆ ఫీచర్ తీసుకువచ్చింది. ఇందులో అల్యూమినియం వైర్-స్పోక్ రిమ్లు ఉన్నాయి. ఇవి కూడా ట్యూబ్-టైప్ మెట్జెలర్ టూరెన్స్ టైర్లను కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. (ఇదీ చదవండి: భారత్లో అరంగేట్రం చేయనున్న ఎక్స్ఎల్7 - ఫీచర్స్కి ఫిదా అవ్వాల్సిందే!) లేటెస్ట్ కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఇప్పుడు అడ్జస్టబుల్ సస్పెన్షన్ కూడా కలిగి ఉంటుంది. అయితే ఫోర్క్ కంప్రెషన్ అండ్ రీబౌండ్ కోసం మాత్రమే అడ్జస్టబుల్ ఉంటుంది. కానీ ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ లేదు. అదే సమయంలో 10 స్టెప్ ఫ్రీలోడ్ & 20 స్టెప్ రీబౌండ్ అడ్జస్ట్ పొందుతుంది. ఈ కొత్త మార్పులు మాతర్మే కాకుండా ఈ బైక్ ఇప్పుడు కొత్త ర్యాలీ ఆరెంజ్ కలర్ ఆప్షన్లో కూడా లభిస్తుంది. (ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్గా మారిన ఇంజినీర్.. సంపాదన రూ. 50 లక్షల కంటే ఎక్కువే!) డిజైన్, ఫీచర్స్ కూడా దాదాపు దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటాయి. ఇంజిన్ విషయానికి ఇందులో 373 సిసి 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 42.9 bhp పవర్, 37 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది, కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది. ఇలాంటి మరిన్ని విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి -
HYD: ఎస్సై సార్ సాహసం.. ప్రాణాలకు తెగించి 16 మందిని కాపాడాడు
సాక్షి, హైదరాబాద్: మనిషికి సమయస్ఫూర్తితో పాటు ధైర్యసాహసాలు కూడా అవసరమే!. తన ప్రాణాలకు తెగించి మరీ ఇక్కడో ఎస్సై సార్.. పదహారు మంది ప్రాణాలను కాపాడారు. రియల్ హీరో అనిపించుకున్నారు. మంగళవారం ప్రగతి భవన్ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. పదహారు మందిని డీసీఎంలో తరలిస్తుండగా.. ఖైరతాబాద్ వైపు వచ్చే వాహనం నడుపుతున్న హోంగార్డు రమేష్కు ఫిట్స్ వచ్చింది. దీంతో వాహనం అదుపు తప్పి.. డివైడర్ మీదకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో డీసీఎంలో ఉన్న బంజారాహిల్స్ ఎస్సై కరుణాకర్ రెడ్డి అప్రమత్తం అయ్యారు. కిందకు దూకి ప్రాణాలకు తెగించి వాహనాన్ని కంట్రోల్ చేశారు. ఈ క్రమంలో ఆయనకు, మరో కానిస్టేబుల్ సాయి కుమార్కు గాయాలైనట్లు తెలుస్తోంది. ఎస్సై సార్ సాహసంతో 16 మంది ప్రమాదం నుంచి బయటపడగా.. గాయపడిన ఎస్సై కరుణాకర్ను, రమేష్ను ఆస్పత్రికి తరలించారు. -
భారీ పైథాన్, పులులతో విజయ్ అడ్వెంచర్.. వీడియో వైరల్
ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండకు యూత్లో మంచి క్రేజ్ ఉంది. తెలంగాణ యాసలో విజయ్ మాట్లాడే తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇక అతడి డ్రెస్సింగ్ స్టైల్ కూడా డిఫరేంట్గా ఉంటుంది. ఇక తను ఏం చేసిన అందులో స్పెషాలిటీ ఉండేలా జాగ్రత్త పడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తాడు ఈ ‘రౌడీ’ హీరో. ఇటీవల లైగర్ చిత్రంతో ఫ్యాన్స్ని అలరించిన విజయ్ ప్రస్తుతం దుబాయ్లో సందడి చేస్తున్నాడు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కిన ‘నేనింతే’ హీరోయిన్, వరుడు ఎవరో తెలుసా? కుటుంబంతో కలిసి అరబ్ దేశంలో వాలిపోయాడు. అక్కడ ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న విజయ్ ఎప్పటికప్పుడు తమ ఫొటోలు షేర్ చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేశాడు విజయ్. దుబాయ్లోని ఓ పార్క్ను సందర్శించి అక్కడ పక్షులు, జంతువులతో సరదాగా గడిపాడు. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ జీవితంలో మరో మధుర జ్ఞాపకాలను కూడబెట్టుకున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోలో విజయ్ పులులు, సింహాలు, పైతాన్లతో అడ్వంచర్ చేస్తూ కనిపించాడు. చదవండి: కన్నీళ్లు రావడం లేదు.. అంతకంటే చలించే సంఘటన ఇంకేముంటుంది: సింగర్ సునీత సైఫ్ బెల్సాసా అనే వ్యక్తి ఆర్గనైజ్ చేస్తున్న ప్రైవేట్ జూని సందర్శించి అక్కడ పాములని తన మెడలో వేసుకున్నాడు. భారీ ఫైథాన్ ఒంటిపై పాకించుకున్నాడు. అక్కడి పక్షులు, కోతులు లాంటి చిన్న చిన్న జంతువులకు ఫుడ్ తినిపించాడు. బోనులో సింహంతో టగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడాడు. పులి పిల్లకు పాలు పట్టించాడు. మొత్తానికి జంతువులు, పక్షులతో తమ సమయాన్ని ఆస్వాదించిన విజయ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
న్యూస్ మేకర్: గగనాన్ని జయించింది
‘పక్షి తన రెక్కలను విశ్వసించాలేగాని అంబరం అంచుల్ని చూడగలదు’ అంది మంగళవారం రోజు 10 వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ (పారాచూటింగ్) చేసిన లాన్స్నాయక్ మంజు. భారత సైన్యంలో ఈ ఘనత సాధించిన తొలి వనితగా మంజు రికార్డు సృష్టించింది. ఆర్మీలో మిలటరీ పోలీస్ విభాగంలో పని చేసే మంజును భారతసైన్యం ఈ ఫీట్ కోసం ఎంచుకుంది. ఇందుకోసం అడ్వంచర్ వింగ్ ఆమెకు శిక్షణ ఇచ్చింది. మంగళవారం ఇద్దరు స్కైడైవర్లతో పాటు ‘ఎ.ఎల్.హెచ్.ధ్రువ్’ (అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్)లో నింగిలోకి ఎగిరిన మంజు పదివేల అడుగులకు చేరాక జంప్ చేసి తోటి స్కైడైవర్లతో పాటు కొన్ని సెకండ్ల పాటు ఉమ్మడి విన్యాసం చేసింది. ఆ తర్వాత పారాచూట్ విప్పుకుని సురక్షితంగా నేలకు దిగింది. ‘మంజు సాధించిన ఈ ఘనత సైన్యంలో పని చేసే మహిళలకు స్ఫూర్తిదాయకం’ అని ఆర్మీ అధికారులు వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధం నుంచి మన దేశంలో రెండో ప్రపంచ యుద్ధం నుంచి పారాచూట్ రెజిమెంట్ (1941 ఆవిర్భావం) ఉంది. కాని ఇది మగవారికి ఉద్దేశించబడింది. యుద్ధాల్లో మన సైన్యానికి పారాట్రూప్స్ విశేష సేవలు అందించాయి. అయితే ప్రయివేట్ వ్యక్తులు పారాచూటింగ్ చేయడానికి కూడా మన దేశంలో అనుమతులు అంత సులభం కాదు. శిక్షణ కూడా అంతంత మాత్రమే. అందుకే విదేశాలకు వెళ్లి స్కై డైవింగ్లో శిక్షణ తీసుకుంటూ ఉంటారు ప్రయివేటు వ్యక్తులు. మన దేశంలో స్కై డైవింగ్ చేసిన తొలి స్త్రీ ప్రయివేటు వ్యక్తే. రేచల్ థామస్ అనే కేరళ రైల్వే ఉద్యోగి 2002లో అది నార్త్ పోల్లో 7000 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి ఈ రికార్డును సొంతం చేసుకోవడమే కాదు ‘పద్మశ్రీ’ కూడా అందుకుంది. ఇటీవల కాలంలో స్త్రీలు చాలామంది ప్రయివేటుగా స్కై డైవింగ్ నేర్చుకుని జంప్ చేస్తున్నారు. మహిళల ముందంజ ఇటీవల త్రివిధ దళాలలో పని చేస్తున్న స్త్రీలు రికార్డులు సాధించి వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సంవత్సరం మే నెలలోనే కెప్టెన్ అభిలాష బరాక్ ఆర్మీ ఏవియేషన్లో మొదటి మహిళా ఆఫీసర్గా నియమితురాలైంది. గత సంవత్సరం ఇండియన్ ఎయిర్ఫోర్స్లో మాయ సుదన్ మొదటి మహిళా ఫైటర్ పైలట్గా బాధ్యత పొందింది. ఫ్లయిట్ లెఫ్టినెంట్ హినా జైస్వాల్ మొదటి మహిళా ఫ్లయిట్ ఇంజనీర్గా తొలి అడుగు వేసింది. ఇవన్నీ ఘనకార్యాలే. వారి వరుసలో ఇప్పుడు మంజు చేరింది. గగనాన్ని జయించాలని ఇటీవల మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి యువతులు కూడా అభిలషిస్తున్నారు. సైన్యంలో చేరో ఏవియేషన్ చదువులు చదివో లేకుంటే కనీసం ఎయిర్ హోస్టెస్గా అయినా ఆకాశంలో విహరిస్తున్నారు. అనుకోవాలే గానీ చేయొచ్చని నిరూపించే వీరంతా విజేతలే. ఆర్మీకి చెందిన లాన్స్నాయక్ మంజు స్కై డైవింగ్ చేసిన తొలి సైనికురాలిగా చరిత్ర సృష్టించింది. 10 వేల అడుగుల ఎత్తు నుంచి దూకి ఇటీవల ఆమె ఈ రికార్డు సాధించింది. -
సాధారణ తాడుపై థ్రిల్ ఏముందనుకున్నారేమో.. అగ్నిపర్వతంపై నడక
నిప్పులగుండం మీద నడక తెలిసిందే. కానీ.. ఇది జారిపడితే బూడిద కూడా మిగలకుండా పోయే లావాపై నడక. ఊహించడానికే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదా! కానీ నడిచి చూపించారు బ్రెజిల్కు చెందిన రాఫేల్ బ్రీదీ, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ స్కుల్జ్. సాహసాలు చేయడంలో ఆరితేరిన ఈ ఇద్దరికీ తాడు మీద నడవడమంటే మంచినీళ్ల ప్రాయం. అయితే సాధారణ తాడు మీద నడిస్తే... సాహసమేముందనుకున్నారేమో! టానా ద్వీపంలో ఉన్న అగ్నిపర్వతంపై 137 అడుగుల ఎత్తులో తాడుపై నడిచారు. ఓ వైపు లావా ఎగసి పడుతుండగానే... ఆ తాడుపై 856 అడుగుల మేర నడిచి.. గిన్నిస్ రికార్డును సృష్టించారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
రష్యా అగ్ని పర్వతంపై మెరిసిన త్రివర్ణం
మరిపెడరూరల్/ముషీరాబాద్: గిరిజన సాహసికుడు యశ్వంత్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. రష్యాలోని 5,642 మీటర్ల ఎత్తయిన ఎల్బ్రస్ అగ్ని పర్వతాన్ని అధిరోహించాడు. పర్వత శ్రేణిపై భారత జాతీయ పతకాన్ని ఎగురవేసి దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటాడు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండాకు చెందిన భూక్య రాంమ్మూర్తి, జ్యోతి దంపతుల కుమారుడు యశ్వంత్కు చిన్నప్పటి నుంచే పర్వతారోహణ అంటే ఇష్టం. గతేడాది జూన్లో జమ్మూకశ్మీర్లోని 5,602 మీటర్ల ఎత్తయిన ఖార్డుంగ్లా పర్వతాన్ని, ఆగస్టులో ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. ఈ ఏడాది జూన్లో హిమాచల్ ప్రదేశ్లోని ఎత్తయిన యునామ్ మంచు పర్వత శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. ఈ క్రమంలో ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ కంపెనీ వారు యశ్వంత్ను రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతారోహణకు ఎంపిక చేశారు. యశ్వంత్ 5,642 మీటర్ల ఎత్తయిన ఈ అగ్ని పర్వతాన్ని ఇటీవలే అధిరోహించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. -
తెలుగు బాలుడి సాహసయాత్ర.. రోజుకు 150 కిలోమీటర్లు సైకిల్పై..
సాక్షి, న్యూఢిల్లీ: తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లలపై రుద్దకుండా, పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాలంటూ 10వ తరగతి పూర్తిచేసిన తెలుగు బాలుడు 15 ఏళ్ల ఉర్దనపల్లి ఆశిష్ చెన్నై నుంచి లద్దాఖ్ రాజధాని లేహ్ వరకు సైకిల్ మీద సాహసయాత్ర చేశాడు. వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన ఆశిష్ కుటుంబం వ్యాపారరీత్యా కొన్నేళ్ల కిందట చెన్నైలో స్థిరపడింది. సైక్లింగ్పై ఆసక్తి ఉన్న ఆశిష్ జూలైలో చెన్నై నుంచి సైకిల్పై బయలుదేరి 41 రోజుల్లోనే లేహ్కు చేరుకున్నాడు. సైకిల్యాత్రను పూర్తిచేసి తిరుగుప్రయాణంలో ఢిల్లీకి చేరుకున్న ఆశిష్ సహా అతడి కుటుంబసభ్యులు ఏపీభవన్లో మీడియాతో మాట్లాడారు. ఆశిష్ మాట్లాడుతూ సైకిల్ యాత్రలో మైదాన ప్రాంతంలో రోజూ 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు చెప్పాడు. చండీఘడ్ నుంచి పర్వత ప్రాంత ప్రయాణం మొదలయ్యాక ప్రతికూల వాతావరణం, వర్షం కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడినా యాత్రను కొనసాగించినట్లు తెలిపాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాలన్నదే తన కల అని పేర్కొన్నాడు. తనపై తల్లిదండ్రులెప్పుడూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు. చెన్నై నుంచి లండన్కు సైకిల్యాత్ర చేయనున్నట్లు ఆశిష్ చెప్పాడు. (క్లిక్: 23 నిమిషాల్లో 2005 కిక్స్.. తైక్వాండోలో బాలిక ప్రతిభ) -
మహాసముద్రంలో మిస్టరీలు.. మరి మీరు రెడీనా!
సముద్రంలో కనివిని ఎరగని జీవజాలాలే కాదు... ఎన్నో మిస్టరీలు దాగున్నాయి. వాటిని ఛేదించాలనుకుంటున్నారా? ఉత్సాహం ఉందా? అయితే పదండీ... ఈ నెలలో విడుదలైన సర్రియల్ అండర్ వాటర్ అడ్వెంచర్ గేమ్ ఫజిల్... స్లీట్. సముద్రాన్ని బయటి నుంచి చూడడం వేరు, సముద్రగర్భంలోకి వెళ్లడం వేరు. ఇప్పుడు మనం లో లోపటికి వెళుతున్నాం. అదిగో... తిమింగలానికి బాప్లాంటి రాక్షస తిమింగలం ఎదురొస్తుంది. అది నోరు తెరిస్తే... కోరల రూపంలో పదునైన గునపాల వనం కనిపిస్తుంది. అది మళ్లీ నోరు మూసే లోపే మనం తప్పించుకోవాలి. (క్లిక్: యూట్యూబ్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఇదే!) కమ్మని సంగీతం వినిపిస్తే అటువైపు వెళతాం. ఏదో జంతువులాగుంది. బూర వాయిస్తుంది. వెళ్లాలా? వద్దా? అని ఆలోచించేలోపే అది మనపై ఎటాక్ చేయవచ్చు. అటు వైపు వెళితే... మన ‘పాతాళభైరవి’లో హీరోకు కనిపించే పే.....ద్ద విగ్రహంలాంటిది కనిపించి కళ్లెర్ర చేయవచ్చు. ఇంకొంచెం దూరం వెళితే... అందమైన దీపాలు అద్భుతమైన వెలుగుతో కనిపిస్తాయి. ‘ఆహా’ అనుకునే లోపే ఆ దీపాలు కాస్త భారీ గొంగళి పురుగుల ఆకారంలో మనల్ని వేటాడడానికి వస్తుంటాయి. ఇవి కొన్ని మాత్రమే. మరి మీరు రెడీనా! జానర్: అడ్వెంచర్ ఇండీ డెవలపర్స్: స్పైరల్స్ సర్కస్ -
ఓరి.. భడవా! అమ్మ తిట్టిందని..18 కి.మీ నడిచి వెళ్లి..
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో శుక్రవారం అదృశ్యమైన 9 ఏళ్ల బాలుడు విష్ణువర్ధన్ ఆచూకీ లభించింది. పోలీసులు శనివారం బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. అయితే ఘటనలో బాలుడు ఎక్కడకు వెళ్లాడు? ఏమయ్యాడు? ఎలా దొరికాడనే విషయాలు తెలిస్తే.. వీడు పిల్లాడు కాదు.. పిడుగు అనిపిస్తుంది. టూటౌన్ సీఐ యుగంధర్ తెలిపిన వివరాలు.. ప్రశాంత్నగర్కు చెందిన గీత పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ పక్కింటి అబ్బాయితో గొడవపడటంతో తల్లి మందలించింది. దీంతో శుక్రవారం ఉదయం స్కూల్కు వెళుతున్నట్టు చెప్పి కనిపించకుండాపోయాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు గాలింపు చేపట్టారు. ఇంటి నుంచి వెళ్లిన రోజు ఉదయం 9 గంటలకు ప్రశాంత్నగర్ నుంచి నడుచుకుంటూ గిరింపేట దుర్గమ్మ గుడి దాటినట్టుగా సీసీ కెమెరాల్లో గుర్తించారు. తవణంపల్లె మండలం దిగువ తడకరలో ఉంటున్న గీత తల్లిదండ్రులు కూడా శనివారం చిత్తూరుకు చేరుకుని పిల్లాడి కోసం వెతకసాగారు. ఇదిలా ఉండగా, విష్ణువర్దన్ నిన్న సాయంత్రానికే చిత్తూరు నుంచి దాదాపు 18 కి.మీ దూరంలో ఉన్న తవణంపల్లెలో దిగువ తడకర సమీపంలోని ఓ గ్రామానికి చేరుకున్నాడు. చీకటి పడడంతో అక్కడే ఓ ఇంటి వద్ద పడుకుని.. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దిగువ తడకరకు చేరుకున్నాడు. బాలుడిని చూసిన స్థానికులు వెంటనే విషయాన్ని గీత తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో పోలీసులు దిగువ తడకరకు వెళ్లి బాలుడిని సురక్షితంగా తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తల్లిపై కోపంతో విష్ణువర్ధన్ అంతదూరం నడుచుకుంటూ తన అమ్మమ్మ, తాత ఇంటికి ఎవరి సాయం లేకుండా వెళ్లడంపై పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. రెండుసార్లు తడకరకు బస్సులో వెళ్లిన విష్ణువర్దన్.. అక్కడక్కడా చూసిన కొండగుర్తులతో దిగువ తడకరకు నడిచి వెళ్లడం విశేషం. -
వయసుకు సవాలు విసురుతూ.... మరో సాహసానికి సై!
‘ఈ వయసులో సాహసం ఏమిటి!’ అనుకునే వాళ్లు చాలామందే ఉండొచ్చు. ‘సాహసానికి వయసుతో పనేమిటి?’ అని దూసుకుపోయేవాళ్లు చాలా తక్కువమందే ఉండొచ్చు. అయితే రెండో కోవకు చెందిన చాలా తక్కువ మందే చాలా ఎక్కువమందికి స్ఫూర్తి ఇస్తుంటారు బచేంద్రిపాల్ ఈ కోవకు చెందిన మహిళ. బచేంద్రిపాల్... పర్వతాలు పులకరించే పేరు. సాహసాలు అమితంగా ఇష్టపడే పేరు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలిభారతీయ మహిళగా ఆమె పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. అరవై ఏడు సంవత్సరాల పాల్ ఈ వయసులోనూ మరో సాహసయాత్రకు సిద్ధం అవుతున్నారు. సాహసానికి సై అంటున్నారు. యాభై ఏళ్లు దాటిన తొమ్మిదిమంది మహిళలతో కలిసి అపూర్వ సాహస యాత్ర చేయబోతున్నారు. బృందానికి నాయకత్వం వహిస్తారు. అరుణాచల్ప్రదేశ్ నుంచి మొదలయ్యే యాత్ర లద్దాఖ్లో ముగుస్తుంది. హిమాలయపర్వతశ్రేణుల గుండా సుమారు అయిదు నెలల పాటు సాగే యాత్ర ఇది. ఈ యాత్రలో వయసు పరిమితులు, వాతావరణ ప్రతికూలతలు, పదిహేడువందల అడుగులకుౖ పెగా ఎత్తు ఉన్న ‘లంకాగ’లాంటి పర్వతాలు సవాలు విసరనున్నాయి. ఈ సాహస బృందంలోని సభ్యులు: 1. బచేంద్రిపాల్ (67, ఉత్తర్ కాశీ) 2. గంగోత్రి సోనేజి (62, బరోడా) 3. శ్యామలాపద్మనాభన్ (64, మైసూర్) 4. చేతనా సాహు (54, కోల్కతా) 5. పాయో ముర్ము (53, జంషెడ్పూర్) 6. చౌలా జాగిర్దార్ (63, పాలన్పుర్) 7. సవితా దప్వాల్ (52, భిలాయ్) 8. డాక్టర్ సుష్మా బిస్సా (55, బికనేర్) 9. బింబ్లా దేవోస్కర్ (55, నాగ్పుర్) 10. మేజర్ కృష్ణ దూబే (59, లక్నవూ) ‘సాహసాలకు ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే, ఇక చాలు అనిపించవు. ప్రతీ సాహసం దేనికదే ప్రత్యేకతగా నిలుస్తుంది. కొత్త అనుభూతులను ఇస్తుంది. యాభై సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి సిద్ధమైనప్పుడు సాహసయాత్ర కాదు దుస్సాహస యాత్ర చేస్తున్నావు అని హెచ్చరించిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. యాభై ఏళ్ల వయసులో ఇదేం పని! అని వెక్కిరించిన వాళ్లు ఉన్నారు. అయితే నేను వాటిని మనసులోకి తీసుకోలేదు. లక్ష్యమే నా ప్రాణం అయింది. అలా యాభైఏళ్ల వయసులో నా చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోగలిగాను. ఇప్పుడు కూడా వెనక్కిలాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాభైనాలుగేళ్ల వయసులో ఈ సాహసం ఏమిటీ అంటున్నారు చాలామంది. ఇప్పుడు కూడా విజయంతోనే సమాధానం చెబుతాను’ అంటుంది ఈ బృందంలో ఒకరైన 54 ఏళ్ల చేతనా సాహు. ఈ పదిమంది ఉత్తరకాశీలో శిక్షణ తీసుకున్నారు. ‘అరవై ఏళ్లు దాటిన తరువాత ఎప్పుడూ నడిచే దారికంటే ఇంకొంచెం ఎక్కువ దూరం నడిస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది. అదేమిటోగానీ శిక్షణ సమయంలో బాగా అలిసిపోయినట్లు నాకు ఎప్పుడూ అనిపించలేదు. మనోబలం అంటే ఇదేనేమో’ అంటుంది గంగోత్రి సోనేజి. ఆమె వయసు అక్షరాల అరవైరెండు! 4,625 కిలోమీటర్ల ఈ సాహసయాత్ర అంతర్జాతీయ మహిళాదినోత్సవం (మార్చి–8) రోజు ప్రారంభమై ఆగస్టులో ముగుస్తుంది. ‘ఆరోగ్యస్పృహ విషయంలో అన్ని వయసుల మహిళలకు స్ఫూర్తి ఇచ్చే యాత్ర ఇది’ అంటుంది బచేంద్రిపాల్. విజయోస్తు -
జడతో కారు లాగిన చిన్నారి!
మార్కాపురం: రెండు జడలతో కారును లాగి అందర్నీ అబ్బురపరిచిందో చిన్నారి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన క్రీడా కోచ్ చిట్టిబాబు కుమార్తె టి.బిందు (సౌజన్య) స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. (చదవండి: వెంట్రుకలను ఎందుకలా కత్తిరిస్తున్నారని అడిగా..) బుధవారం పీఎస్ కాలనీలోని మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్లో సాహసం చేసి అందరితో శభాష్ అనిపించుకుంది. పట్టుమని 12 ఏళ్లు నిండని చిన్నారి.. తన జడతో మారుతీకారును 50 మీటర్లు లాగింది. ఈ సాహసాన్ని చూసిన ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి బిందును అభినందించారు. -
Manjarabad Fort: మంజారాబాద్.. స్టార్ఫోర్ట్
ఆకాశంలో మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాన్ని చూడాలంటే తలెత్తి చూస్తే చాలు. నేల మీద ఉన్న ఈ నక్షత్రాన్ని చూడాలంటే మాత్రం ఆకాశంలో విహరించాల్సిందే. ఈ టూర్లో ఈ నక్షత్రకోటతోపాటు పశ్చిమ కనుమల ప్రకృతి విన్యాసాలన్నీ ఆస్వాదించవచ్చు. కర్ణాటక ఊటీ... నక్షత్రం ఆకారంలో ఉన్న ఈ కోట కర్ణాటక, హసన్ జిల్లాలో ఉంది. ఈ కోట సందర్శన పెద్ద సాహసం అనే చెప్పాలి. నాచు మధ్య జాగ్రత్తగా అడుగులు వేస్తూ దిగుడుబావి ఒడ్డుకు చేరడం యువతకే సాధ్యం. ఏడాది మొత్తం ఇక్కడ చల్లగానే ఉంటుంది. ఈ చల్లదనానికి పశ్చిమ కనుమల పచ్చదనం కూడా కారణమే. సక్లేశ్పురా నుంచి ఈ కోటకు ప్రయాణం మొదలైనప్పటి నుంచి కాఫీ గింజల పరిమళం ఉత్సాహాన్నిస్తుంది. ఆకాశాన్నంటుతున్న పోక చెట్లు మీ ప్రయాణం కూడా ఆకాశం వైపేనని గుర్తు చేస్తాయి. యాలకుల చెట్లు వాతావరణాన్ని సుగంధభరితం చేస్తుంటే మిరియాల గుత్తులు ఒకింత ఘాటు వాసనతో ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్నిస్తుంటాయి. చల్లటి వాతావరణంలో గొంతు గరగర అనిపిస్తే రెండు మిరియాలను నమిలితే పర్యటన ఆరోగ్యంగా ముందుకు సాగుతుంది. మధ్యలో చిన్న చిన్న నీటి కాలువలు పాదాలను కడుగుతుంటాయి. కొండల్లో ప్రవహించే స్వచ్ఛమైన నీరు చల్లగా పాదాలను స్పృశిస్తుంటే చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఈ హిల్స్టేషన్ను ఊటీతో పోలుస్తారు. ఊటీ సంపన్నుల పర్యాటక క్షేత్రం అయితే ఇది పేదవారి పర్యాటక ప్రదేశమని చెబుతారు. మంచులో మెరిసిన నక్షత్రం... హసన్ జిల్లా కేంద్రానికి 45 కి.మీల దూరంలో మల్నాడు రీజియన్, సక్లేశ్పురా పట్టణానికి దగ్గరలో ఉన్న స్టార్ఫోర్ట్ అసలు పేరు మంజారాబాద్ కోట. మంజు అంటే కన్నడలో మంచు అని అర్థం. ఎప్పుడూ మంచు తెర కమ్మినట్లే ఉంటుంది ఇక్కడి వాతావరణం. ఇది మైసూరు పాలకుల వేసవి విడిదిగా ఉండేది. ఈ కోటలో పెద్ద ఆయుధాగారం ఉండేదని ఇప్పుడున్న ఆనవాళ్లు చెబుతుంటాయి. మైసూర్ కోట నుంచి ఈ కోటకు రహస్య మార్గం ఉండేదని స్థానిక కథనం. ఎనిమిది కోణాల నిర్మాణం ఇది. నిజానికి దీనిని ఎనిమిది రెక్కల పద్మం ఆకారం అనే చెప్పాలి. అయితే మూలలు కోసుగా కోణాకారంలో ఉండడంతో నక్షత్రకోటగా వాడుకలోకి వచ్చింది. -
కేటీఎం బంపర్ ఆఫర్... ఈ బైక్పై భారీ తగ్గింపు
రైడర్స్కి గుడ్న్యూస్ కేటీఎం సంస్థ తన బైకులపై భారీ ఆఫర్లను ప్రకటించింది. కేటీఎంలో ఎంట్రీ లెవల్ లైట్వెయిట్ బైక్ 250 అడ్వెంచర్ ధరను తగ్గించింది. బైక్ ప్రమోషన్లో భాగంగా కేటీఎం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణ అవసరాలతో పాటు లాండ్రైడ్కి కూడా వెళ్లగలిగేలా అడ్వెంచర్ 250 బైక్ని కేటీఎం మార్కెట్లోకి తెచ్చింది. 250 సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన ఈ బైకుపై రూ. 25,000 డిస్కౌంట్ని సంస్థ అందిస్తోంది. ఆఫర్ వర్తింపుతో హైదరాబాద్ ఎక్స్షోరూం ధర రూ. 2,28,480గా ఉంది. అడ్వెంచర్ 250 బైకుపై అందిస్తోన్న డిస్కౌంట్ 2020 జులై 14 నుంచి ఆగస్టు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కేటీఎం తెలిపింది. ధర తగ్గింపుతో కేటీఎంలో పాపులర్ మోడల్ డ్యూక్కి అడ్వెంచర్కి మధ్య ధరల వత్యాసం బాగా తగ్గిపోయింది. రోజువారి రవాణా అవసరాలు తీర్చడంతో పాటు వీకెండ్లో లాంగ్ టూర్ వేసేందుకు వీలుగా బైకర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అడ్వెంచర్ను డిజైన్ చేసినట్టు బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సుమిత్ నారంగ్ తెలిపారు. అడ్వెంచర్ బైకు 248 సీసీ ఫోర్ వాల్వ్ సింగిల్ సిలిండర్ ఇంజన్తో పాటు డబ్ల్యూపీ అపెక్స్ సస్పెన్షన్, ఏబీఎస్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. -
అడ్వెంచర్: సాగర గర్భాన వందేళ్ల నాటి నౌకల అన్వేషణ
సాక్షి, విశాఖపట్నం: వందేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని సముద్రంలో మునిగిపోయిన నౌకల ఆనవాళ్లను గుర్తించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. సముద్ర గర్భంలో దాగి ఉన్న చారిత్రక ఆనవాళ్లను కనుగొని బాహ్య ప్రపంచానికి పరిచయం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే ఓ నౌక ఆనవాళ్లను గుర్తించిన లివిన్ అడ్వెంచర్స్ బృందానికి ఈ బాధ్యత అప్పగించింది. శ్రీకాకుళం జిల్లాకు సమీపంలో మూడుచోట్ల వివిధ సందర్భాల్లో నౌకలు మునిగిపోయాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ తీరంలో వందేళ్ల క్రితం మునిగిపోయిన బ్రిటిష్ ఇండియా నావిగేషన్ కంపెనీకి చెందిన చిలకా షిప్ ఆనవాళ్లను విశాఖ జిల్లాకు చెందిన లివిన్ అడ్వెంచర్స్ బృందం 2020లో కనిపెట్టింది. బారువా తీరం చేరే సమయంలో షిప్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఈ నౌక మునిగిపోయింది. ఈ షిప్ తీరానికి ఎంత దూరంలో ఉంది, దాని శిథిలాలు ఎలా ఉన్నాయనే విషయాల్ని బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. ఇదే తరహాలో మరో రెండు చోట్ల నౌకలు మునిగిపోయినట్టు చరిత్ర చెబుతోంది. దీంతో శ్రీకాకుళం కలెక్టరేట్ వర్గాలు ఆ రెండుచోట్ల అన్వేషణ సాగించాలంటూ లివిన్ అడ్వెంచర్స్ సంస్థను సంప్రదించాయి. జోగంపేట, భావనపాడు బీచ్లలో.. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు బీచ్కు కొంత దూరంలో విదేశీ నౌక వందేళ్ల క్రితం మునిగిపోయినట్టు చరిత్రలో ఉంది. ఈ షిప్ ఎంత దూరంలో మునిగిపోయింది, ఆ షిప్ ఏ దేశానికి చెందినది, అది కార్గోనా లేక ప్రయాణికులతో వెళ్లే నౌకా అనే వివరాలు మాత్రం ఎక్కడా లేవు. అదేవిధంగా పోలాకి మండలం జోగంపేట తీరంలోనూ ఒక నౌక మునిగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1944లో జరిగిన బాంబు దాడుల్లో ఒక నౌక జోగంపేట తీరంలో ధ్వంసమైనట్టు గుర్తించారు. దీని పేరు సిలికాన్ షిప్ అని తెలిసింది. అయితే.. ఈ షిప్ ఏ దేశానికి చెందినది, ఎంతమంది ప్రయాణికులతో వచ్చింది తదితర వివరాలేవీ వెలుగులోకి రాలేదు. ఈ రెండుచోట్ల సాగర గర్భంలో చిక్కుకున్న చరిత్ర ఆనవాళ్లని అన్వేషించేందుకు లివిన్ అడ్వెంచర్స్ సంస్థ సమాయత్తమవుతోంది. ఈ నెల మొదటి వారంలో ఈ బృందం భావనపాడు తీరంలో అన్వేషణ సాగించాల్సి ఉండగా.. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇన్స్ట్రక్టర్ బలరాం నాయుడు, డైవ్ మాస్టర్ రాహుల్, అడ్వాన్స్ డైవర్ లక్ష్మణ్ కలిసి సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తూ.. అన్వేషణ మొదలు పెట్టనున్నారు. -
వరల్డ్ గ్రేటెస్ట్ లవర్: ‘ఆయనకు 130 మంది లవర్స్’
‘కాసనోవా ఎవరు?’ అనే ప్రశ్నకు ‘వరల్డ్ గ్రేటెస్ట్ లవర్’ ‘ఆయనకు 130 మంది లవర్స్’ ‘ఆయన చూపుల మాయజాలంలో ఎంత అందగత్తె అయినా చిక్కుకుపోవాల్సిందే’....ఇలా ఎన్నో వినిపిస్తాయి. కాసనోవా ఆత్మకథ ఇప్పటికీ హాట్కేకే!. కాసనోవాపై ఆసక్తితో ఆయన గురించి చరిత్రకారులు ఎప్పటికప్పడూ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజా పరిశోధన చెప్పేదేమిటంటే...కాసనోవా మంచి వైద్యుడు అని. ఆయన వైద్యుడు కాలేకపోయినా(ఫెయిల్డ్ డాక్టర్) వైద్యశాస్త్రం పట్ల ఆసక్తిని మాత్రం వదులుకోలేదు. ఎన్నో వైద్య పుస్తకాలు చదివేవాడు. వైద్యానికి సంబంధించి ఆయన ఆలోచనలు, పరిశీలనలు, అంచనాలు చాలా విలువైనవి అంటున్నారు పరిశోధకులు. మొటిమల నివారణ నుంచి గర్భస్రావరం వరకు ఆయన స్త్రీలకు ఎన్నో సలహాలు ఇచ్చేవాడట. ఆయన చరిత్రపై ‘శృంగారపర్వం’ మాత్రమే డామినెట్ చేయడంతో ఆయనలోని నిపుణుడైన వైద్యుడి గురించి ఎవరూ పట్టించుకోలేదు. వెనిస్లో జన్మించిన గియాకోమో జిరోలామో కాసనోవా... సైనికుడు, జూదరి, వ్యాపారి, సాహసికుడు, రచయిత.. ఇలా ఎన్నో కావాలనుకున్నాడు.. పదిమందిలో పేరు తెచ్చుకోవడానికి కాదు, పలువురు స్త్రీల మనసు దోచుకోవడానికి! ఒకానొక సమయంలో కాసనోవా డిప్రెషన్లోకి వెళ్లాడు. దాని నుంచి బయటపడడానికి రోజుకు 10 గంటలు తన జ్ఞాపకాలను రాసేవాడు. ‘ఐసోలేషన్’ అనే మాట ఇప్పుడు చాలా గట్టిగా వింటున్నాంగానీ ఆరోజుల్లోనే కాసనోవా ఐసోలేషన్లోకి వెళ్లాడు. కరోనా కాదు సుమీ! తన ఆత్మకథ ‘స్టోరీ ఆఫ్ మై లైఫ్’ పూర్తిచేయడానికి. ఈ పుస్తకం పై ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ 18వ శతాబ్దంలో యూరోపియన్ల సాంఘిక జీవితాన్ని సాధికారికం గా చెప్పిన పుస్తకం అనడంలో ఎవరూ విభేదించరు. చదవండి: పద్మావతీ! నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి ఇల్లు – ఆఫీస్ వేగం తగ్గినా రన్నింగే -
కేటీఎం అడ్వెంచర్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: ప్రీమియం మోటర్సైకిళ్ల బ్రాండ్ కేటీఎం శుక్రవారం కొత్త మోడల్ ‘‘కేటీఎం 250 అడ్వెంజర్’’ను విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద బైక్ ధర రూ.2,48,256 గా ఉంది. దేశవ్యాప్తంగా అన్ని షోరూంల్లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో అమర్చిన 248 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 30 హార్స్పవర్ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ స్లిప్పర్ క్లచ్ సాయంతో సిక్స్–స్పీడ్ గేర్ బాక్స్(6–గేర్లు) వ్యవస్థతో పనిచేస్తుంది. దేశీయ మార్కెట్లో ఈ బైక్కు పోటీగా రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్, హీరో ఎక్స్పల్స్ మోడళ్లు ఉన్నాయి. భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న అడ్వెంచర్ మోటార్ సైకిళ్ల విభాగాన్ని విస్తరించే లక్ష్యంతో ఈ మోడల్ను ఆవిష్కరించినట్లు కంపెనీ తెలిపింది. ప్రపంచస్థాయి ఫీచర్లతో రూపకల్పన చేసిన ఈ మోడల్ను కస్టమర్లు ఆదరిస్తారని కంపెనీ ఆశిస్తోంది. అడ్వెంజర్ టూరింగ్, అవుట్డోర్ ప్రయాణాలు పట్ల ఆసక్తి చూపుతున్న యువతకు ఇది సరైన ఎంపిక అని బజాజ్ ఆటో బైకింగ్ ప్రెసిడెంట్ సుమీత్ తెలిపారు. (చదవండి: కొత్త రికార్డు సృష్టించిన షియోమి) -
శిఖరాన చేనేత
చేనేత గొప్పతనాన్ని శిఖరస్థాయికి తీసుకెళ్లేందుకు చీరలు, చేనేత వస్త్రాలు ధరించి ఆస్ట్రేలియాలోని కొసియోస్కో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించి వచ్చిన ఈ ఐదుగురు పర్వతారోహకులు.. చేనేత కార్మికుల దైనందిన జీవన సాహస యాత్రలో పోలిస్తే తమదసలు కష్టమే కాదని అంటున్నారు. ట్రెకింగ్, మౌంటెనీరింగ్.. సాహసక్రీడలు. మగవాళ్లు వాటిని హాబీగా మలుచుకుంటే హీరోలుగా అభివర్ణిస్తుంది లోకం. మహిళలు ట్రాక్సూట్ వేసుకుంటే ‘ఇదేం పోకడ’ అంటూ పెదవి విరుస్తుంది. అదీ పెళ్లయి, పిల్లలు పుట్టాక ఈ అభిరుచికి ప్రాక్టికల్ రూపమిస్తామంటే హవ్వ అంటూ బుగ్గలు నొక్కకుంటుంది. ఇవన్నీ ఎదుర్కొన్నారు వీళ్లు. లక్షల్లో డబ్బునూ ఖర్చుపెట్టుకున్నారు. ట్రాక్సూట్ కాదు.. చీరకుచ్చిళ్లను బొడ్లో దోపుకొని మరీ 7,310 అడుగుల ఎత్తున్న కొసియోస్కో పర్వతాన్ని అధిరోహించారు. సరదా కోసం కాదు. తెలుగు నేతకు చేయూతనివ్వడానికి! మన చేనేత గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి! ‘ప్రైడ్ ఆఫ్ తెలంగాణ.. టాప్ ఆఫ్ మౌంట్ కొసియోస్కో’ థీమ్తో జరిగిన ఈ అధిరోహణలో రాజీ, లావణ్య, సృజన, హసిత, సమన్యు పాల్గొన్నారు. ఈ టీమ్లో అందరికన్నా చిన్నవాడు సమన్యు. ఏడేళ్లు. పిన్న వయసు పర్వతారోహకుడిగానూ (కిలిమంజారో) వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఒకరికి ఒకరు ఎలా పరిచయం? ఈ బృందానికి నాయకత్వం వహించిన రాజీ ప్రొఫెషనల్ మౌంటెనీర్. ఈమె చిన్ననాటి స్నేహితురాలే లావణ్య. ఉన్నత చదువులు, పెళ్లితో ఈ ఇద్దరి దారులు వేరయ్యారు. కూతురి కోసం తనూ పర్వతారోహకురాలిగా మారిన లావణ్య మౌంటెనీరింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చిన్నప్పటి ఫ్రెండ్ రాజీని కలుసుకుంది. జీవితంలోని మంచిచెడ్డలతోపాటు మౌంటెనీరింగ్ గురించీ మాట్లాడుకున్నారు. పెళ్లి, పిల్లలతో ఒళ్లుచేసిన తాను మౌంటెనీ రింగ్ చేయగలనా అన్న లావణ్య సందేహాన్ని పటాపంచలు చేస్తూ ధైర్యాన్నిచ్చింది రాజీ. అంతకుముందే ఇతర పర్వతారోహణలో సృజనతో పరిచయం ఉంది రాజీకి. అలా వీళ్లంతా ఒక ఫ్యామిలీలా మౌంటెనీరింగ్ స్టార్ట్ చేశారు. ఆ టైమ్లోనే వీవర్స్ కష్టనష్టాల గురించి విన్నది రాజీ. వాళ్లకు ఏదైనా సాయం చేయాలనుకుంది. లావణ్య, సృజనలతో చెప్పింది. అందరూ కలిసి సిద్దిపేట, నారాయణ్పేట, గద్వాల, పొచంపల్లి వెళ్లారు. గ్రౌండ్ వర్క్ చేశారు. నేయడమూ నేర్చుకున్నారు. రాజీ అయితే ఓ డాక్యుమెంటరీ కూడా తీసింది. ఈ నాలుగు ప్రాంతాలకు ప్రాతినిధ్యంగా నలుగురు నాలుగు చీరలను తీసుకున్నారు. రాజీ, లావణ్య, సృజన చీరలు కట్టుకుంటే గద్వాల చీరను మ్యాక్సిలా హసితకు, పోచంపల్లి కుర్తాను సమన్యుకి కుట్టించారు. దేశం హద్దులు దాటి ప్రపంచ పర్వతాల మీద ఈ నేతను రెపరెపలాడించాలనుకుని ఆస్ట్రేలియాలోని కొసియోస్కొ పర్వతం అధిరోహించారు. మామూలుగా ట్రాక్ సూట్లో అయితే ఆరుగంటల్లో ఎక్కి దిగొచ్చు ఈ పర్వతాన్ని. చీరలో కాబట్టి వీళ్లకు పదిగంటలు పట్టింది. భవిష్యత్లోనూ దీన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. చీరలు కట్టుకుని పర్వతం ఎక్కిన ప్పుడు ఫారిన్ మౌంటెనీర్స్ వీళ్లను ఆసక్తిగా గమనించి, దగ్గరకు వచ్చి ఆ చీరల గురించి, ఫ్యాబ్రిక్ గురించి, అవి ఎక్కడ దొరుకుతాయో అడిగి మరీ తెలుసుకున్నారట. అలా తమ మోటో, పర్పస్ సర్వైవ్ అయింది అంటున్నారు రాజీ. ‘‘యాక్చువల్గా యూత్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ను బిల్డప్ చేయడానికి మౌంటెనీరింగ్ను ప్రమోట్ చేస్తున్నాం. దాంతోపాటు చేనేతనూ థీమ్గా తీసుకున్నాం. యువత చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతోంది. ఆత్మహత్య దాకా వెళ్తోంది. ఆ టెండెన్సీని పోగొట్టి వాళ్లలో ధైర్యం నింపాలన్నదే మా లక్ష్యం. మౌంటెనీరింగ్ వల్ల.. మనకున్న సమస్యలు చాలా చిన్నగా కనిపిస్తాయి. వీటిని మనం ఇంత పెద్దగా చూస్తున్నాం అనిపిస్తుంది. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ఉండే గుణం అలవడుతుంది. ముందసలు ‘వాట్ పీపుల్ విల్ సే’ అన్న థాట్కే చెక్ పెట్టే అటిట్యూడ్ అలవడుతుంది. దీనివల్ల లైఫ్లో ఎన్ని హర్డిల్స్ వచ్చినా గాభరాపడం. చాలెంజ్గాతీసుకుంటాం. స్పోర్టివ్గా ఉంటాం. ఇది మేం ఎక్స్పీరియెన్స్ అవుతున్నాం కూడా! మౌంటెనీ రింగ్లో విమెన్కు స్పెషల్ చాలెంజెస్ ఉంటాయి. ఎక్కడపడితే అక్కడ వాష్ రూమ్స్ ఉండవు. మెన్స్ట్రు వల్ సైకిల్ ఉంటుంది. ఇలాంటి ఆడ్ సిట్యువేషన్స్ అన్నిటినీ తట్టుకునే శక్తిని అలవాటు చేస్తాయి. షైని తగ్గించి కలివిడితనాన్ని పెంచుతాయి. మొత్తంగా స్ట్రాంగ్ అండ్ స్టబర్స్ పర్సనాలిటీ తయారవుతుంది’’ అంటారు రాజీ. మంచి షెఫ్ని అవుతా రాజీ ఆంటీ వాళ్లు ట్రెడిషనల్ క్యాస్టూమ్స్ వేసుకొని కొసియోస్కో వెళ్దామని చెప్పినప్పుడు అబ్బా... ఎందుకు అనిపించింది. కాని వాళ్లతోపాటు వీవర్స్ దగ్గరకు వెళ్లి డే టు డే లైఫ్లో వాళ్లు ఫేస్ చేస్తున్న హర్డిల్స్ చూసినప్పుడు వాళ్లకోసం ఏదైనా చేయాలనిపించింది. బేసిగ్గా నేను క్లాసికల్ డ్యాన్సర్ని. మౌంటెనీరింగ్ కంటే కూడా డ్యాన్స్, కుకింగ్ అంటే ఎక్కువ ఇష్టం. పెద్దయ్యాక మంచి షెఫ్ కావాలనుకుంటున్నా. ఆస్ట్రేలియాలో కొసియోస్కో దగ్గర రెస్టారెంట్ పెట్టాలనుంది. అక్కడ గైడ్తో మాట్లాడేసుకున్నా కూడా (నవ్వుతూ). – హసిత నాన్న డ్యాన్స్ చేశారు అక్క, అమ్మ వాళ్లతో ఫస్ట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు వెళ్లా. తర్వాత రాజీ ఆంటీతో కిలిమంజారో ఎక్కాను. కిలిమంజారో ఎక్కిన అందరికన్నా యంగెస్ట్ కిడ్ నేనే అని తర్వాత తెలిసింది నాకు. స్కూల్లో నా ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా ఫీలయ్యారు – పేపర్లో నీ పేరు వస్తుందిరా అని. టీచర్స్ క్లాప్స్ కొట్టించారు. నాన్నేమో ఎయిర్పోర్ట్లోనే డ్యాన్స్ చేసేశాడు. తాతయ్యేమో ఫైవ్ థౌజెండ్ పెట్టి సైకిల్ కొనిచ్చారు. కొసియోస్కో ఎక్కేప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశా. పెద్దయ్యాక కూడా మౌంటెనీరింగ్ కంటిన్యూ చేస్తా. – సమన్యూ నమ్మినదాని మీద ఎఫర్ట్స్ పెట్టాలి నేను ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ని.అరుణిమ సిన్హా (కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ ఎక్కిన పర్వతారోహకురాలు) ఇన్స్పిరేషన్తో మౌంటెనీర్నయ్యా. పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. హ్యాండ్లూమ్స్ ప్రమోషన్ కోసం చీరలతో మౌంటెనీరింగ్ చేద్దామన్న రాజీ థాట్ నచ్చడంతో ఆస్ట్రేలియా కొసియోస్కో ప్లాన్ చేసుకున్నాం. సక్సెస్ అయ్యాం. మా ఈ టూర్ వల్ల చేనేత కార్మికుల జీవితాల్లో రాత్రికిరాత్రే మార్పు రాకపోవచ్చు. కాని వాళ్ల కళను, కష్టాన్ని ప్రపంచానికి చాటామన్న సంతృప్తి మిగిలింది. మౌంటెనీరింగ్. ఇంజనీరింగ్ చదివి జాబ్ చేయకుండా కొండలు గుట్టలు పట్టుకు తిరుగు తోందని తెలిసినవాళ్లు చాలా కామెంట్సే చేస్తుంటారు. పెళ్లి చేయకుండా ఏంటీ ఇదంతా అని మా పేరెంట్స్ మీదా ప్రెజర్ ఉంటోంది. విని నవ్వుకోవడమే. లిజన్ టు యువర్ సెల్ఫ్ డోంట్ లిజన్ టు సొసైటీ.. మౌంటెనీరింగ్ నేర్పిన లెసన్, పెరిగిన సెల్ప్ కాన్ఫిడెన్స్ ఇది. – సృజన మా పాప వల్లే..! నేను, మావారు ఇద్దరం బిజినెస్ ఫీల్డ్లోనే ఉన్నాం. నిజానికి మౌంటెనీరింగ్ వంటివన్నీ నా కప్ ఆఫ్ టీ కాదు. మా అమ్మాయి (హసిత)కి తోడుగా మౌంటెనీరింగ్కి వెళ్లాల్సి వచ్చింది. మౌంటెనీరింగ్ కోసం ట్రైనింగ్ తీసుకోవడానికి ఇన్స్టిట్యూట్కి మాతో పాటు మా బాబునూ (సమన్యు) తీసుకెళ్లేదాన్ని. వాడూ ఇంట్రెస్ట్ చూపడంతో ఫిట్నెస్ టెస్ట్ చేశారు. అట్లా మావారు తప్పించి మా ఫ్యామిలీ అంతా మౌంటెనీరింగ్ స్టార్ట్ చేశాం (నవ్వుతూ). మా ఫస్ట్ ఎక్స్పీరియెన్స్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్. తర్వాత కిలిమంజారో ఎక్కాం. మా పాప వల్ల వచ్చి ఇలా కంటిన్యూ అవుతున్నా. దీనివల్ల కనిపించే ప్రాఫిట్ ఏమీ ఉండదు. పైనుంచి ఖర్చు. కాబట్టి చూసేవాళ్లకు ఇదంతా పిచ్చిగానే అనిపిస్తోంది. కాని మౌంటెనీరింగ్ వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్ వేరు. దేన్నయినా ఎదర్కోగలమనే ధైర్యం వచ్చింది. ఫిట్నెస్ పెరిగింది. మొన్న ట్రిప్లోనే ఎయిట్ కేజెస్ తగ్గా. – లావణ్య వీవర్స్ ముందు మనమెంత? మా తమ్ముడు భరత్ మౌంటెనీర్. నాకు అక్రోఫోబియా (ఫియర్ ఫర్ హైట్స్). ఒకసారి తమ్ముడితో కలిసి మౌంటెనీరింగ్కు వెళ్లా. హైట్స్ æ భయం పోయి అప్పటి నుంచి నాకూ మౌంటెనీరింగ్ అంటే ఇంట్రెస్ట్ కలిగింది.అంతకుముందు కార్పొరేట్ ఫీల్డ్లో వర్క్ చేసేదాన్ని. ఫైవ్ ఇయర్స్ కిందట మౌంటెనీర్గా జర్నీ స్టార్ట్ చేశా. ఆడపిల్లలు కూడా ఇండిపెండెంట్గా ఉండాలని అలాగే పెంచారు మా నాన్న. మా సొంతూరు కర్నూలు. ఎక్స్పోజర్ ఉండాలని నన్ను హైదరాబాద్లో, హాస్టల్లో ఉంచి చదివించారు నాన్న. లోకజ్ఞానం వచ్చేవరకే ఆయన నన్ను హాస్టల్లో దింపడం, హాలిడేస్లో తీసుకెళ్లడం చేశారు. తర్వాత నుంచి నన్నే రమ్మనేవారు. అలా చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్గా ఉండడం అలవాటు చేశారు. కాబట్టి నా మౌంటెనీరింగ్ పట్లా అభ్యంతరమేమీ లేదు వాళ్లకు. అత్తింట్లో కూడా అబ్జెక్షన్స్ లేవు. మావారు ఎంకరేజ్ చేశారు. నేను బయటిదేశాలకు వెళితే బాబునూ చూసుకుంటారు. చుట్టాలు, బయటి వాళ్ల నుంచే కామెంట్స్ తప్ప ఇంట్లో వాళ్లందరూ ఫుల్ సపోర్టే. – రాజీ -
శునకం ప్రధాన పాత్రలో చిత్రం
జంతువులు నటించిన చాలా చిత్రాలు గతంలో తెరపైకొచ్చాయి. అయితే జంతువులే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రాలు ఎక్కువగా హాలీవుడ్లోనే రూపొందాయి. అలాంటిది ఒక కుక్క ప్రధాన పాత్రలో భారతీయ సినీ పరిశ్రమలోనే తొలిసారిగా ఏడ్వెంచర్ కథా చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు దర్శకుడు శక్తివేల్ పెరుమాళ్స్వామి తెలిపారు. ఈయన ఇంతకుముందు ఉరుమీన్ అనే వైవిధ్యభరిత కథా చిత్రాన్ని రూపొందించారు. కాల్టైల్ సినిమాస్, యునైటెడ్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గురించిన ప్రకటన, ఫస్ట్లుక్ ఫోస్టర్ను చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసింది. ఈ చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ కుక్కకు, మనిషికి మధ్య అనుబంధం, ఒకరికి ఒకరు చేసుకునే సాయం గురించి ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. కేరళలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిస్తున్న ఎండ్వేంచర్ కథా చిత్రం ఇదని తెలిపారు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు. -
వెల్డన్ విజయ్..
పి.గన్నవరం: జనవరి 25వ తేదీ సాయంత్రం.. ఓ ప్రైవేటు స్కూల్ పిల్లలు బడి నుంచి ఇంటికి వెళుతున్నారు. ఈ క్రమంలో ఎల్కేజీ విద్యార్థి ప్రమాదవశాత్తూ పంటకాలువలో పడి కొట్టుకుపోతున్నాడు. అది గమనించిన అదే స్కూల్కు చెందిన మూడో తరగతి విద్యార్థి వెంటనే ఆ బాలుడిని రక్షించేందుకు సిద్ధమయ్యాడు. సమయస్ఫూర్తితో అక్కడ అందుబాటులో ఉన్న ఒక తాడును తన చేతికి కట్టుకుని పంటకాలువలో పడిన విద్యార్థికి అందించాడు. అతికష్టం మీద అతడిని గట్టుకు చేర్చాడు. ఆ చిన్నారి ప్రాణం నిలిపాడు. అతడి సాహసం, ధైర్యంపై ప్రస్తుతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పి.గన్నవరం మండలం బెల్లంపూడిలో జరిగింది. మూడేళ్ల బాలుడిని ప్రాణాలకు తెగించి కాపాడిన ఎనిమిదేళ్ల గూటం విజయ్ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ కారెం శివాజీ బుధవారం బెల్లంపూడి గ్రామంలో అభినందించారు. బెల్లంపూడికి చెందిన గూటం శ్రీనివాసరావు కుమారుడు విజయ్ గ్రామంలోని సత్యజ్యోతి కాన్వెంటులో మూడో తరగతి చదువుతున్నాడు. అదే పాఠశాలలో నూకపెయ్యి సమీర్ అనే బాలుడు ఎల్కేజీ చదువుతున్నాడు. ఈనెల 25 వతేదీ సాయంత్రం కాన్వెంటు విడిచిపెట్టిన అనంతరం విద్యార్థులు ఇళ్లకు వెళుతుండగా సమీర్ ప్రమాదవశాత్తూ పంట కాలువలో పడి కొట్టుకుపోతున్నాడు. వెనుక వస్తున్న గూటం విజయ్ ఈ ప్రమాదాన్ని గమనించి ఎంతో చాకచక్యంగా అతడిని ఒడ్డుకు చేర్చాడు. అప్పటికే నీళ్లు తాగేసిన సమీర్ను స్థానికులు స్థానిక వైద్యుని వద్దకు తీసుకెళ్లగా ప్రాణాపాయం తప్పింది. మండల విద్యాశాఖ అధికారిణి కోన హెలీనా, కాన్వెంటు కరస్పాండెంట్ విళ్ల గోపాలకృష్ణ, రాష్ట్ర మాలల జేఏసీ కో కన్వీనర్ కోట రామ్మోహనరావు, నాయకులు నేరేడిమిల్లి రఘు, గన్నవరపు చిన్ని తదితరులు విజయ్ను అభినందించారు. -
కొండను తవ్వేసిన ఒకే ఒక్క మనిషి
-
మైలారం నల్లగుట్టలో ప్రకృతి వింత
3.5 కిలోమీటర్లు పొడవైన గుహలు ⇒ బొర్రా గుహలకు సరిజోడు ⇒ అడ్వంచర్ టూరిజానికి అడ్రస్ ⇒ అభివృద్ధికి కసరత్తు సాక్షి, భూపాలపల్లి: అమర్నాథ్ శివలింగాన్ని తలపించే విధంగా సున్నంతో వెలిసిన లింగం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగు చూ సింది. ఇటీవల తెలంగాణ సోషల్ మీడియా ఫోరం ఆధ్వర్యంలో గణపురం మండలం మైలారం సమీపంలో ఉన్న నల్లగుట్టలో ఉన్న సున్నపు గుహల్లో పరిశీలించిగా శివలింగాన్ని పోలిన ఆకారం బయటపడింది. అక్కడి వారికి ఈ గుహల గురించి ఎప్పటి నుంచో తెలిసిన స్థానికంగా ఉంటున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు సదానందం గతేడాది ఈ గుహల గురించి ప్రపంచానికి తెలియజేశారు. అప్పటి నుంచి ప్రజాప్రతినిధులు, పర్యాటకశాఖ అధికారులు సందర్శించారు. ఇటీవల తెలంగాణ పర్యాటకశాఖ ప్రోత్సాహంతో నలభై మందితో కూడిన తెలంగాణ సోషల్ మీడియా ఫోరం సభ్యులు ఈ గుహల్లో అనువణువు గాలించగా పలు ఆసక్తికర అంశాలు తెలిశాయి. శివుడి లింగం, ఆవు పొదుగు, నగిషీలు, ఎగిరే పక్షులు, నేల మీద వాలిన డేగ, సింహం, మానవ ముఖం వంటి పలు ఆకృతుల్లో సహజ సిద్ధంగా ఏర్పడ సున్న పు శిలలు వెలుగు చూశాయి. గుహల్లో అనేక దారులు మైలారం నల్లగుట్ట నుంచి గుహల్లోకి వెళ్లడానికి అనేక దారులు ఉన్నాయి. నల్లగుట్టలకు పడమ టి వైపున ఉన్న మార్గం సహజసిద్ధమైన కోట మార్గంలా ఉంది. మిగిలిన వైపులా మానవ ని ర్మిత కట్టడాలు ఉన్నాయి. లోనికి మార్గాలు చిన్నగా ఉన్నప్పటికీ వెళ్లిన తర్వాత గుహలు చాలా పెద్దగా ఉన్నాయి. నల్లగుట్టల్లో ఉన్న సున్నపు గుహలు దాదాపు 3.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. గుహల ఎత్తు 5 నుంచి 100 అడుగులు ఉండగా వెడల్పు 10 నుంచి 100 అడుగులుగా ఉంది. కొన్ని గుహ లు విశాలమైన గదుల మాదిరిగా ఉన్నాయి. కొన్ని గుహల్లోకి గాలి, వెలుతురు దారళంగా వస్తుండగా కొన్ని గుహలు చిమ్మ చీకట్లో గబ్బిలాల ఆవాసాలుగా ఉన్నాయి. లోపల సగటు ఉష్ణోగ్రత 25 సెల్సియస్ డిగ్రీలుగా ఉంది. తేమ ఎక్కువగా లేదు. గుహల్లో కొన్ని చోట్ల పాకుతూ వెళ్లాలి. ఆదిమానవుల ఆనవాళ్లు గుహల్లో నీటి వనరుల ఆనవాళ్లు ఉండటాన్ని బట్టి ఇది ప్రాచీన కాలంలో ఆదిమానవుల ఆవాసమై ఉండవచ్చని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా బృందం జరిపిన పర్యటనలో సున్నపు గుహల్లో ఆదిమానవులు కాలం నాటి పలు ఉపకరణాలు, నాటి అవశేషాలు లభించాయి. వీటిలో రాతి గొడ్డళ్లు, రాతి సుత్తెలు, గీకుడు రాళ్లు, కుండ పెంకులు, మట్టి పాత్రలు ఉన్నాయి. కొన్ని రాళ్ల మీద చిత్రాలు కనిపించాయి. ఈ గుహల్లో కొన్ని ఎముకలు లభించాయి. వీటిని పరిశోధన నిమిత్తం సీసీఎంబీకి పంపారు. విస్తీర్ణంలో బొర్రా గుహల కంటే పెద్దగా ఉన్న మైలారం సున్నపు గుహలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సి ఉంది. లింగాకృతి... ఏడాది కిందట సున్నపు గుహలు వెలుగులోకి వచ్చినా వీటిని పూర్తిగా ఎవరూ చూడలేదు. ఇటీవల తెలంగాణ సోషల్ మీడియా సభ్యులు ఈ సాహసానికి ఒడిగట్టారు. మొత్తం నలభై మంది సభ్యుల బృందంలో నలుగురు సభ్యులు టార్చిలైటు వెలుతురులో గుహల్లో ఉన్న సన్నని మార్గాల గుండా పాకుతూ లోపలికి వెళ్లి పరిశీలించారు. ఇందులో ఓ గుహలో శివలింగం ఆకృతి వెలుగు చూసింది. ఈ లింగం అమర్నాథ్ లింగాన్ని పోలి ఉండటం విశేషం. మైలారం నల్లగుట్ట సున్న పు గుహల్లో ఆకట్టుకునే ఆకృతులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి. నల్లగుట్ట ఆర్కియన్ శిలలతో ఏర్పడింది. వర్షపు నీటిలో ఉండే సహజమైన ఆమ్లతత్వం కొండ రాళ్లలో ఉండే సున్నాన్ని కరిగించడం వల్ల సున్నపు రాళ్ల కొండలో గుహలుగా ఏర్పడ్డాయి. పై నుంచి కారిన సున్నపు అవక్షేపాలు గట్టి పడి గుహల గోడల పై వివిధ ఆకృతులుగా మారాయి. ఇవి నేలదాక చేరితే స్తంభాలుగా మా రిపోతాయి. నేల మీదకు చేరిన అవక్షేపాలు ముద్దగా మారి పలు ఆకృతులు సంతరించుకుంటాయని చెబుతున్నారు. -
యూట్యూబ్లో చూసి... బాలుడి సాహసం
కరీంనగర్ : కరీంనగర్లో ఓ సాహసం బాలుడి ప్రాణాలను బలిగొంది. యూట్యూబ్లో సాహస వీడియో చూసిన బాలుడు దానిని చేసేక్రమంలో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే...విద్యానగర్కు చెందిన రఘచారి కుమారుడు ధనుష్ నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ల్యాప్టాప్ ఉండటంతో యూట్యూబ్లో సాహసాలను చూసిన ధనుష్ అదేమాదిరిగా సాహసం చేశాడు. నోట్లో కిరోసిన్ పోసుకుని మంటలు ఊదే ప్రయత్నం చేయగా..నోరు కాలి తీవ్రంగా గాయపడ్డాడు. నాలుగు రోజులుగా హైదరాబాద్లో చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
తిరుమలలో వెంకన్న భక్తుల సాహసం.
-
మరో అడ్డగోలు సాహాసం
-
రెండేళ్ల చిన్నారి సాహసయాత్ర!
బీజింగ్: రెండేళ్ల చైనా చిన్నారి చేసిన సాసహయాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. చిన్నారి తనతో పాటు ఏడాది వయసున్న తమ్ముడు, చెల్లిని వెంట తీసుకొని సిటీ చూడటానికి బయలుదేరింది. ఒంటిమీద బట్టలు కూడా లేకుండా ఉన్న ఆ పాప.. ప్యాంపర్స్తో ఉన్న ఇద్దరిని వెంటబెట్టుకొని సాగించిన ఆ సాహసయాత్ర చివరికి పోలీస్ స్టేషన్లో ముగిసింది. వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ చైనాలోని యునాన్ ప్రావిన్సులో ఓ రెండేళ్ల చిన్నారి తన ఇద్దరు సిబ్లింగ్స్ను వెంటబెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. జియాండే టౌన్లో అలా నడుచుకుంటూ వెళ్తన్న వారికి ఎదురైన స్థానికులు.. చిన్నారులు పెద్దవారి సహాయం లేకుండా ఒంటరిగా వెళ్తుడటం చూసి ఆశ్చర్యపోయారు. కొందరైతే ముద్దులొలికే చిన్నారులకు లాలీపాప్లు కూడా ఇచ్చి సంతోషపడ్డారు. అనంతరం చిన్నారుల విషయాన్ని పోలీసులకు తెలుపగా వారు ముగ్గురినీ స్టేషన్కు తీసుకెళ్లారు. అనంతరం స్టేషన్కు వచ్చిన చిన్నారుల తల్లి.. తాను ఇంట్లో నిద్రపోతున్న సమయంలో చిన్నారులు బయటకు వచ్చారని తెలిపింది. వేకువజామునే ఆఫీసుకు వెళ్లిన తన భర్త.. డోర్ లాక్ చేయడం మరిచాడని, అందుకే చిన్నారులు బయటకు వెళ్లారని పోలీసులకు తెలిపింది. నిద్రలేవగానే చిన్నారుల కోసం బయటంతా గాలించినా ఫలితం లేదని.. పోలీసులు తీసుకెళ్లారన్న విషయం ఓ స్థానికుడు తనకు చెప్పినట్లు పేర్కొంది. దీంతో పోలీసులు వివరాలను సరిచూసుకొని చిన్నారులను ఆమెకు అప్పగించారు. వారు నివాసమున్నది ఓ అపార్ట్మెంట్లోని ఆరో అంతస్తులో అన్న విషయం విని పోలీసులు షాక్ తీన్నారు. పిల్లలను వదిలేసి గుర్రుపెట్టిన సదరు తల్లిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తుండగా.. కొందరు మాత్రం 'పాపం ఆమె తప్పేం లేదు.. పెద్దమ్మాయే(రెండేళ్లపాప) సాహసయాత్రకు బయలుదేరింది' అంటున్నారు. -
శునకాలు కావు... అంతకు మించి!
విశ్వాసం వాటి గుణం, సాహసం వాటి నైజం, క్రమశిక్షణ వాటికి అలంకారం... నేర నిరూపణ ప్రక్రియలో నిత్యం పోలీసుల వెన్నంటి ఉండి దొంగల పాలిట సింహ స్వప్నాలవి. యూనిఫాం వేసుకోని ఈ రక్షక శునకాల గురించి... వాటికి మాటలు రాకపోవచ్చు... కానీ ‘సావధన్’ అని గట్టిగా వినిపిస్తే చాలు రెండు కాళ్లపై నించుని సంసిద్ధమయ్యే సంస్కారం వాటి సొంతం. వాటికి మనంత ఆలోచన లేకపోవచ్చు... ఖాకీ చొక్కా వెనుక పరిగెత్తి చనిపోయేందుకు కూడా సిద్ధపడే తెగువ వాటికే సొంతం. ఆయుధాలు వాడడం తెలియకపోవచ్చు... దొంగల నుంచి బాంబుల వరకు ఏదైనా సరే పసిగట్టేందుకు వెనుకాడని తత్వం వాటికి మాత్రమే సొంతం. అవినీతి మకిలి అంటని పోలీసుల సరసన వాటికీ చోటు ఉంటుంది. దేశం కోసం ఊపిరి వదిలిన వీరుల సరసన ఆ దళానికీ గౌరవం ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి పోలీసు అధికారీ ఒప్పుకుంటారు. ఎందుకంటే శాఖలోని శునకాలు అంటే కేవలం జంతువులు కాదు. అంతకు మించి... - ఎచ్చెర్ల ఇదే మన దళం... టైగర్, రాణి, డాన్, లిమో, ఝూన్సీ... మన పోలీసులకు నేర నిరూపణ ప్రక్రియలో సాయపడుతున్న శునకాల పేర్లు. పేర్ల లాగానే వీటి సంరక్షణ కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. ఇవి హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన లే బ్రా, డాబన్మెన్ జాతి కుక్కలు. వీటిలో ఝూన్సీ నేర విభాగంలో పనిచేస్తుంది. క్లూస్ టీమ్లో కీలకంగా సేవలు అందిస్తుంది. దొంగతనాలు జరిగేటప్పుడు, హత్యలు, అల్లర్లు, ఇతర తీవ్ర నేరాలు జరిగేటప్పుడు నిందితులు గాలింపుల్లో పోలీసులకు సాయపడుతుంది. మిగతా నాలుగు డాగ్లు బాంబులు స్క్వాడ్తో పని చేస్తాయి. వీటికి బాంబులు నిర్వీర్యం చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీఐపీలు సదస్సులు జరిగేటప్పుడు సభావేదికలు, ఇతర ప్రాంతాలు, వంతెనలు, కల్వర్టులు, బాంబు బెదిరింపు ఉన్న ప్రారంతాల్లో తనిఖీల్లో ఈ డాగ్ స్క్వా డ్స్ కీలకం. శిక్షణ+క్రమశిక్షణ ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వు కార్యాలయంలో వీటి కోసం ప్రత్యేకంగా ఒక బ్లాక్ నిర్వహిస్తున్నారు. నిష్ణాతులైన పోలీసులు వీటికి రోజూ శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణలో డాగ్లు మర్యాదగా నడుచుకోవటం, ఎదుటి వారిని గౌరవించటం, కూర్చోవటం, నిల్చోవటం, ఫైర్ జంప్, హడిల్ జంప్, గోడలు గెంతటం వంటి అంశాలపై తర్పీదునిస్తారు. ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు సూరపునాయుడు, సురేష్, వీవీ రమణ, సీహెచ్ ప్రసాద్, ఆదినారాయణ ఈ డాగ్లకు నిత్యం శిక్షణ ఇస్తారు. వీరి శిక్షణ శునకాలు చూపే క్రమశిక్షణలో స్పష్టంగా తెలుస్తుంది. ఏటా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం స్థాయిలో రేంజ్ మీట్ నిర్వహిస్తారు. అందులో మూడు జిల్లాలు డాగ్ల పనితీరు సమీక్షిస్తారు. వెనుక బడ్డ డాగ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఎనిమిదేళ్లు గ్యారెంటీ శునకాలు రక్షణ శాఖలో కనీసం ఎనిమిదేళ్లు చురుగ్గా సేవలు అందిస్తాయి. ఈ లోపుగా కొత్త బృందాలను తయారు చేస్తూ ఉంటారు. వీటికి బీమా కూడా చేయిస్తారు. బీమా కంపెనీలు ఎనిమిదేళ్లు పాలసీలు ఇస్తాయి. ఆహారమూ ప్రత్యేకమే... వీటికి ప్రత్యేక ఆహారం ఇస్తారు. ఒక కుక్కకు నెలకు రూ. 5800 ఆహారం కోసం ఖర్చు చేస్తారు. ప్రత్యేకంగా తయారు చేసిన యాక్సీ ఆడాల్ట్, రోయల్ కెనాల్ కంపెనీలకు చెందిన ఆహారం ఇస్తారు. ఈ ఆహారం ద్వారా కుక్కలకు సరిపడే విటమిన్స్, ప్రొటీన్స్ లభిస్తాయి. -
భళా భాళిక
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సైదాబాద్లోని సెయింట్ మాజ్ హైస్కూల్ బాలికలు సాహస విన్యాసాలతో అబ్బురపరిచారు. సోమవారం పాఠశాలలో నిర్వహించిన వియత్నాం మార్షల్ ఆర్ట్స్ శిక్షణలో భాగంగా ఆత్మరక్షణకు సంబంధించిన ‘వోవినమ్’ ప్రక్రియను అద్భుతంగా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి... సరసరా కత్తులు దూసి... ఎదురొచ్చిన శత్రువునెలా మట్టికరిపించాలో చేసి చూపించారు. -
టైటిల్ మారిన సాహసం
సాహసం చిత్రం పేరు ఇప్పుడు సాగహం ఎండ్ర వీరచ్చయల్గా మారింది. ప్రశాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సాహసం.ఆస్ట్రేలియా బ్యూటీ అమండా కథానాయకిగా కోలీవుడ్కు పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని స్టార్ మూవీస్ పతాకంపై త్యాగరాజన్ భారీ ఎత్తున నిర్మించారు. నవ దర్శకుడు అరుణ్రాజ్వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాజర్, తంబిరామయ్య, ఎంఎస్.భాస్కర్, జాన్విజయ్, దేవదర్శిని, లిమాబాబు ముఖ్య పాత్రలు పోషించారు. బాలీవుడ్ క్రేజీ నటి నర్గిస్ఫక్రి ప్రత్యేక పాటలో ప్రశాంత్తో ఆడి పాడిన ఈ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించిన జులాయి చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం.అయితే దీన్ని కాన్సెప్ట్ మారకుండా చిన్న చిన్న మార్పులతో మళ్లీ తెలుగులో విడుదల చేయనున్నట్లు నిర్మాత త్యాగరాజన్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించడం విశేషం. కారణం ప్రశాంత్కు తెలుగులో మంచి ఆదరణ ఉండడమే అని చెప్పవచ్చు. ఎస్ఎస్.తమన్ సంగీతాన్ని అందించిన చిత్రం గీతాలు ఇప్పటకే యూట్యూబ్లో విడుదలై హల్చల్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి మొదట సాహసం అని పేరును నిర్ణయించారు. అయితే ఇప్పుడు దాన్ని సాగసం ఎండ్ర వీరచ్చెయల్ అని మార్చినట్లు నిర్మాత వెల్లడించారు. సాహసం అన్నది తమిళ భాషకు చెందిన వాక్యం కాదని ప్రభుత్వ రాయితీలు పొందే అవకాశం ఉండదనే కారణంగానే చిత్రం పేరును మార్చినట్లు త్యాగరాజన్ వివరించారు. సాగహం ఎండ్ర వీరచ్చెయల్ చిత్ర విడుదల హక్కుల్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ పొంది ఈ నెల 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు చేయనుంది. నటుడు ప్రశాంత్ తదుపరి హిందీ చిత్రం స్పెషల్ 26 రీమేక్లో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. -
సాహసం సేయకురా డింభకా!
బ్రిటన్లోని యార్క్షైర్కు చెందిన ఆంటోని బ్రిట్టన్ (38) ఓ స్టంట్ మాస్టర్. చిన్నప్పటి నుంచే సాహసాలు చేయడమంటే ఇష్టం. కాళ్లు చేతులు కట్టివేయించుకొని నదిలోకి దూకడం, తల్లకిందులుగా మండే తాడుకు వేలాడుతూ అది కాలి తెగేలోపే సురక్షితంగా భూమికి దిగడం, బోనులో బంధించుకొని దాన్ని సముద్రంలో ముంచడం... ఇలాంటి ఫీట్లు చేస్తుంటాడు. వృత్తిరీత్యా వెల్డర్ అయినప్పటికీ సమయం చిక్కినప్పుడల్లా సాహసాలు చేస్తుంటాడు. కిందటి శనివారం ఇలాగే మనోడు ఓ సాహసం తలపెట్టాడు. ఆరడుగుల లోతు గొయ్యి తవ్వించుకొని దాంట్లో ‘సజీవ సమాధి’ అవ్వాలనుకున్నాడు. మీరు చదివింది నిజమే. ఎందుకంటే తృటిలో చావు తప్పి కన్నులొట్ట బోయింది. జనం చూస్తుండగా ఆంటోని బ్రిట్టన్ను గొయ్యిలో పడుకోబెట్టి మట్టి కప్పేశారు. చేతులతోనే మట్టి తొలగించుకొని... ఊపిరి ఆగేలోగా బయటపడాలి. బాగానే ప్రాక్టీసు చేసినా... ఈసారి పాపం బయటపడలేకపోయాడు. నిమిషం... రెండు నిమిషాలు... మూడు నిమిషాలు సమాధిలో ఎలాంటి కదలిక లేదు. అనుమానం వచ్చిన సహాయ సిబ్బంది రంగంలోకి దిగి... గబగబా సమాధిని తవ్వేశారు. లోపల చూస్తే అచేతనంగా ఆంటోని. నోరు, ముక్కు నిండా మట్టి. అంబులెన్స్ రెడీగా ఉంది కాబట్టి పారామెడిక్స్ ఆగిన అతని గుండె మళ్లీ పనిచేసేలా చేయగలిగారు. అలా మృత్యుముఖం దాకా వెళ్లొచ్చిన ఇతన్ని మరోసారి ‘సాహసం సేయకురా డింభకా’ అనాలేమో. -
పిచ్చెక్కించిన పులిబొమ్మ
తంపా: ఒక బాలుడు తెచ్చుకున్న పులిబొమ్మ.. తంపా విమానాశ్రయ అధికారులకు తలపోటు తీసుకొచ్చింది. ఆ వెంటనే రిలీఫ్ ఇచ్చి సరికొత్త ఆలోచనకు ప్రాణంపోసి వారిలో నవ్వులు పూయించింది. ఓవెన్ అనే ఆరేళ్ల బాలుడు తన కుటుంబంతో కలిసి హ్యూస్టన్ వెళ్లేందుకు తంపా విమానాశ్రయానికి వచ్చాడు. అయితే, తన వెంట తెచ్చుకున్న హాబ్స్ అనే పులిబొమ్మ పోగొట్టుకున్నాడు. దీంతో అతడు బిక్కమొఖం పెట్టుకొని ఏడుపు మొదలుపెట్టాడు. ఏం చేయాలో పాలుపోక తల్లి దండ్రులు విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారంతా కలిసి ఎయిర్ పోర్ట్ మొత్తం జల్లెడ పెట్టారు. ఒక సాహసయాత్ర మాదిరిగా చేసి చివరికి చిన్న పిల్లలు ఆడుకునే ప్రాంతంలో దానిని గుర్తించడంతో ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద సాహసయాత్రగా చేసిన ఈ కార్యక్రమాన్ని 'ఎడ్వంచర్' అనే పేరుతో అప్పటికప్పుడు డాక్యుమెంటరీ రూపొందించారు. పులిబొమ్మ హాబ్స్తో ఫొటోలు దిగారు. ఆ పిల్లాడికి చూపించి సంతోష పెట్టారు. ఎట్టకేలకు ఓవెన్ తిరిగి తనకిష్టమైన హాబ్స్తో హ్యూస్టన్ వెళ్లాడు. -
మార్క్ట్లోకి ’అడ్వెంచర్ సిరీస్’ పల్సర్బైక్స్
-
మొసళ్లతో శ్రీనివాస్ ఫ్రెండ్షిప్
-
సాహసవీరుడు.. సాగర యాత్ర
ఊరి పొలిమేర వరకూ వెళ్లాలంటేనే ఒకరిని వెంటరమ్మంటాం. అదే లాంగ్ ట్రిప్ అయితే.. దోస్తుల మందను వెంటేసుకుపోతాం. అలాంటిది ఒంటరిగా సముద్రయానం అంటే ఎలా ఉంటుంది.అదీ ఒక్క రోజో.. రెండు రోజులో కాదు.. ఏకంగా 151 రోజులు. నాన్స్టాప్ జర్నీ. ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇంతకంటే కష్టమైన అడ్వెంచర్ ఇంకేదీ ఉండదనిపిస్తుంది. కడలి కెరటాలపై సాగిన ఆ యువకుడి జర్నీ... ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారు ఐదువేల మందికి పైగానే ఉన్నారు. అంతరిక్ష యాత్ర చేసిన వారు 500 మంది వరకూ ఉంటారు. కడలి కెరటాలపై నాన్స్టాప్గా భూగోళాన్ని చుట్టొచ్చింది మాత్రం 80 మందే. ఇలాంటి క్లిష్టమైన యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన మొదటి భారతీయుడు, సెకండ్ ఏషియన్.. నేవీ లెఫ్టినెంట్ కమాండర్ అభిలాష్ టామీ. ప్రభుత్వం ఆయనను కీర్తి చక్ర అవార్డుతో గౌరవించింది. ఇటీవల నగరానికి వచ్చిన అభిలాష్ని ‘సిటీప్లస్’ పలకరించింది.. మా నాన్న నేవీలో పని చేసేవారు. అందుకే చిన్నప్పటి నుంచి నేవీ అంటే ఇష్టం. సముద్ర ప్రయాణాలంటే ఆసక్తి ఉండేది. ఎప్పుడూ సముద్రానికి దగ్గరగా ఉండాలని కోరుకునేవాణ్ని. అందుకే నేవీలో చేరాను. సముద్ర జలాలపై తేలి ఆడుతూ సాగే సెయిలింగ్ గేమ్ అంటే భలే సరదా. సెయిలింగ్ గేమ్కు సంబంధించిన పుస్తకాలు చదివేవాణ్ని. నేవీ కాంపిటీషన్స్లో చాలాసార్లు పాల్గొన్నాను. అన్ని రకాల బోట్స్ నడిపాను. ఇదే సమయంలో నేవీ అధికారులు నాన్స్టాప్ సర్కమ్ నావిగేషన్ ప్రాజెక్ట్ తలపెట్టారు. బోట్లో నాన్స్టాప్గా గ్లోబ్ చుట్టిరావాలి. అదీ ఒంటరిగా. దీని గురించి అనుకున్నప్పుడు వాళ్లు నన్నే మొదట అడిగారు. నా డ్రీమ్ పూర్తి చేసుకునే అవకాశం రావడంతో వెంటనే సరేనన్నాను. ఆమే స్పూర్తి.. గతంలో సర్కమ్ నావిగేషన్ గురించి ఒక మ్యాగజైన్లో చదివాను. 1999లో ఆ రేస్ టీమ్లో ఈబెల్ అనే ఓ ఫ్రెంచ్ లేడీ ఉన్నారు. ఆమే నాకు స్ఫూర్తి. ఆవిడ చేయగలుగుతున్నప్పుడు నేనెందుకు చేయలేను అని అనిపించింది. నా టూర్కు ముందు మలేసియాలో సెయిలింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను. 2012 నవంబర్ 1న ముంబైలో నా సముద్రయానం మొదలైంది. దక్షిణం నుంచి హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అంట్లాంటిక్ ఓషన్ అలా 40 వేల కిలోమీటర్లు బోట్లో ప్రయాణించాను. 151 రోజుల ప్రయాణం తర్వాత అంటే 2013 మార్చ్ 31న ముంబై చేరుకున్నాను. లంగరుతో పని లేదోయ్.. పూర్తిగా సముద్రం మీదుగా సాగే ఈ యాత్రలో సహాయం చేయడానికి ఎవరూ ఉండరు. అన్ని రకాల వాతావరణ పరిస్థితులకూ సిద్ధంగా ఉండాలి. మనకు మనమే అన్నీ కావాల్సి ఉంటుంది. వాతావరణం, వంట, ఐటీ, రూట్ మ్యాప్ ఇలా అన్నీ తెలిసుండాలి. మరో మనిషి సాయం నేరుగా అందే అవకాశం లేదు. అన్నింటికన్నా ముఖ్యంగా మానసికంగా బలంగా ఉండాలి. కాస్త డీలా పడ్డా.. ప్రయాణం పెద్ద ప్రమాదంగా మారిపోతుంది. ఆలోచనను పక్కదారి పట్టకుండా చూసుకుంటే ఈజీగా ముందుకెళ్తాం. ఈ ప్రయాణం ఒక్కసారి మొదలైతే డెస్టినేషన్ రీచ్ అయ్యే వర కూ లంగరుతో పని ఉండదు. ఆఫ్టర్ 130 డేస్.. 151 రోజుల యాత్రలో.. 130 రోజుల తర్వాత మనిషిని చూడగలిగాను. నా యాత్ర పూర్తయిన తర్వాత తిరిగి భూమిని చూడటం గొప్ప అనుభూతినిచ్చింది. అట్లాంటిక్ సముద్రంలో తిమింగలాలు వెంటాడాయి. తుఫాన్లంటారా కామన్. మరో 15 రోజుల ప్రయాణం మిగిలి ఉండగా.. బోట్లో మంచినీళ్లు డీజిల్ లీకేజీతో తాగడానికి పనికి రాకుండా పోయాయి. వరుణుడి దయతో ఇన్ని నీళ్లు దొరికాయి. ఇవన్నీ ఒంటరిగా ఎలా హ్యాండిల్ చేశానని ఆలోచిస్తే.. సాహసానికి ఇవన్నీ పరీక్షలే కాని అవరోధాలు కాదనిపిస్తుంటుంది. ఓ మధు -
ప్రపంచ అన్వేషకులు
వివరం: ప్రవరుడిలాగా వారు ఆకాశంలో ఎగరలేదు. వారి పాదాలకు లేపనం పూసిన సిద్ధులు లేరు. పూర్తి భౌతిక శ్రమే! గుర్రాల మీదా, ఓడల మీదా, కాలినడకనా ప్రపంచాన్ని అన్వేషించారు. ‘ప్రపంచం’ అనేది ఈ రూపులో ఉన్నట్టు తెలియని రోజుల్లో జగతి మూలల్ని, మూలాల్ని అందుకునే సాహసం చేశారు. భారతాన్వేషణలో భాగంగా ఇటలీ యాత్రికుడు క్రిస్టఫర్ కొలంబస్ తను ‘ఇండియా’గా పొరపడిన నేల మీద పాదం మోపింది సరిగ్గా అక్టోబర్ 12(1492)నే! ఈ సందర్భంగా కొందరు అన్వేషకుల గురించిన ‘వివరం’. బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ రాసిన ‘చంద్రగిరి శిఖరం’లో కథానాయకుడు శంకర్ రాయ్, పోర్చుగీసు యాత్రికుడు డిగో అల్వరేజ్తో కలిసి ఆఫ్రికా అడవుల్లో వజ్రాల వేటకు బయలుదేరుతాడు. ఈ ప్రయాణంలో వారు దట్టమైన అడవుల్నీ, పక్షుల్నీ, మృగాల్నీ, సెలయేళ్లనీ, వరదల్నీ, గుహల్నీ, బద్ధలవుతున్న అగ్నిపర్వతాల్నీ చూస్తారు. ఒళ్లు గగుర్పొడిచే ఆ యాత్ర గురించి రచయిత ఈ అర్థంలో ఒక మాటంటారు: ఇలాంటి వీరులు తమ ప్రాణాలకు తెగించి కేవలం సంపద కోసమే అంతటి సాహసాలకు ఒడిగడతారనుకోలేం; సంపదకు మించిన కారణమేదో వారిని పురిగొల్పుతుంది. కొందరు మినహాయింపుగా ప్రపంచాన్వేషకులు కూడా ఏదోరకంగా మరింత సంపదను కూడబెట్టే లక్ష్యంతోనే ప్రయాణాలకు సిద్ధపడినట్టు అర్థమవుతుంది. కానీ, ఉరిమే ఉత్సాహం, నర్తించే సంతోషం లాంటివేవో కూడా వారికి ప్రేరేపకాలు అయివుంటాయి. మూలగ్రంథాల్లో ఏముంది? ఈ వరుసలో మనం చెప్పుకునే మొదటి పేరు హ్యూయన్ త్సాంగ్ (క్రీ.శ. 602-664). మతగ్రంథాల మీద ఆయనకు బాల్యంనుంచే ఆసక్తి. సంస్కృతం నేర్చుకున్నాడు. యౌవనంలోకి రాకముందే హంగ్చోలోని బౌద్ధాలయంలో పూజారిగా కుదురుకున్నాడు. చైనాలో చలామణీలో ఉన్న బౌద్ధ గ్రంథాల్లో ‘స్థానిక పైత్యం’ చేరిందేమోనన్న అనుమానంతో, మూలగ్రంథాలకోసం వేల కిలోమీటర్ల దూరంలోని భారత్ వెళ్లాలన్న ఆలోచన కలిగింది. 627-43 మధ్యకాలంలో ఆయన పర్యటన సాగింది. గుర్రం మీద ఇప్పటి సిల్క్రూట్ గుండా ప్రయాణించాడు. ఎడారుల్ని, పర్వత శ్రేణుల్ని దాటడానికి ఇబ్బందిపడ్డాడు. టక్లమాకెన్ ఎడారి అంచున చైనా సైన్యానికి చిక్కాడు. ఏ విధమైన అధికారిక పత్రం లేనందున వాళ్లు నిర్బంధించి, తున్ హువాంగ్ బౌద్ధారామానికి పంపాలనుకున్నారు. ‘మీరు గనక నన్ను నిర్బంధిస్తే, నా ప్రాణం తీసుకోవడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తాను. కానీ చైనా దిశగా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయను’ అని బదులిచ్చానని రాశాడు త్సాంగ్. గోబి ఎడారి, తియన్ షాన్ పర్వతాలు, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, సమర్కండ్ మీదుగా కైబర్ కనుమలు దాటుకొని భారత్లోకి ప్రవేశించాడు. వారణాసి, జలంధర్, పాటలీపుత్రం, నలందలాంటి ప్రశస్తమైన నగరాలన్నీ తిరిగాడు. మన అమరావతి, నాగార్జునకొండకు కూడా వచ్చాడు. అమరావతిలో అభిదమ్మపిటకం అధ్యయనం చేశాడు. హ్యూయన్ త్సాంగ్ రాతల వల్లనే ఈ దారిలోని దేశాల సంస్కృతుల గురించిన సాధికారమైన అవగాహన కలగడానికి వీలు కలిగింది. కోటి నిజాలు ఇటలీలో జన్మించిన మార్కోపోలో(క్రీ.శ.1254-1324) నాన్న నికోలో, మామ మాథ్యూ ఇద్దరూ సముద్ర వర్తకులే. మధ్య ప్రాచ్యంతో వాళ్లకు సంబంధాలుండేవి. నాన్నను తన పదిహేనో యేట మొదటిసారి చూశాడు మార్కో. అలాంటి దిమ్మరుల కుటుంబంలో పుట్టిన మార్కో కూడా 1271లో తొలుత చైనాకు ప్రయాణం కట్టాడు. అర్మేనియా, పర్షియా, అఫ్గానిస్తాన్, పామీర్ పర్వతాలు, గోబి ఎడారి మీదుగా బీజింగ్ చేరుకున్నాడు మూడేళ్ల తర్వాత. చెంగీజ్ఖాన్ మనవడు, అప్పటి రాజు కుబ్లైఖాన్ ఆస్థానంలో పదిహేడేళ్లు ఉద్యోగం చేశాడు. మంగోల్ భాష నేర్చుకున్నాడు. తర్వాత, 1292లో ఓడల మీద, 300 మంది సిబ్బందితో కోరమాండల తీరంలో భారత్లో అడుగుపెట్టాడు. తంజావూరు పాండ్యరాజులను కలిశాడు. హిందుస్తాన్లో ఏడాది గడిపాడు. ఇటలీ తిరిగి వెళ్లాక, తన యాత్రానుభవాలను మరో రచయిత సాయంతో గ్రంథస్తం చేశాడు. తను చూసినవాటిల్లో సగమే రాశానని పేర్కొన్నాడు. చమత్కారంగా ‘పదిలక్షల అబద్ధాలు’గా ఆ పుస్తకం ప్రాచుర్యం పొందింది. కొత్తగా దేశాల పటాలు గీయడం ప్రారంభమవుతున్న ఆ కాలానికి మార్కో పోలో ప్రేరణగా నిలిచాడు. మనదేశం గురించి ఆయన, ఇక్కడి వాతావరణం వేడిగా ఉందనీ, వస్త్రాలు అతి తక్కువ ధరిస్తారనీ రాశాడు. ప్రజలు ఏ దొంగల భయమూ లేకుండా అర్ధరాత్రులు కూడా సంచరిస్తారనీ, ప్రపంచలోనే ఇది వైభవోపేతమైన నేలనీ పేర్కొన్నాడు. ఇంకా, ఏదైనా తాగేప్పుడు పెదాలతో ఎంగిలి చేయకుండా పాత్రను ఎత్తి తాగుతారు. శకునాలు చూస్తారు. ఇళ్లను ఆవుపేడతో అలుకుతారు. పసిపిల్లలకు నువ్వులనూనెతో మర్దనం చేస్తారు. కుడిచేత్తో భోంచేస్తారు, ఎడమచేతిని ఇంకోరకంగా వాడతారు. సముద్రయాత్రకు వెళ్లినవాడు నిస్పృహలో ఉండివుంటాడని నమ్ముతారు. గుర్రాల పెంపకం లేదు. ఐడెన్ (యెమెన్ రేవు పట్నం), ఇంకా దూరప్రాంతాలనుంచి ఓడల్లో వస్తాయి. గుర్రాల్ని మాలిమి చేసే సామర్థ్యం లేకపోవడం వల్ల ఏడాదిలోగా వంద తప్ప మిగతావన్నీ చనిపోతాయి. విదేశీ వ్యాపారులు అశ్వాలతోపాటు ఏ వైద్యుణ్నీ పంపరు, వాళ్లకు కావాల్సింది ఇలా చనిపోవడమే! ఇక్కణ్నుంచి పత్తి, తోలు ఉత్పత్తులు ఓడలకొలదీ ఎగుమతి అవుతాయి. పక్షులు, లతలు తీర్చి, బంగారు, వెండి పోగుల్ని అల్లే ఎరుపు తివాచీల్లో అద్భుతమైన పనితనం ఉంటుంది. ఈ సరుకంతా ఐడెన్లో దిగి, అక్కణ్నుంచి చిన్న పడవల్లోనూ, ఒంటెల మీదా అలెగ్జాండ్రియా(ఈజిప్ట్) దాటిపోతుంది. మన సంగతులు ఏడువందల ఏళ్ల కిందటి ఒక విదేశీ యాత్రికుడి నోట వినడం ముచ్చటగా లేదూ! ఛలో ఇండియా- హలో అమెరికా లేతప్రాయం నుంచే క్రిస్టఫర్ కొలంబస్ (క్రీ.శ.1451-1506) సముద్రం మీద బతికాడు. తొలినుంచీ సాహసి. ‘ఎవరైనా ఎక్కడైనా సముద్రయానం చేసివుంటే, నేను కూడా అక్కడ చేసివున్నాను,’ అని గొప్పగా చెప్పుకున్నాడు. మార్కోపోలోలాగా కొలంబస్ కూడా ఇటలీవాడే! పోలోనే ప్రేరణ కూడా! పాతికేళ్ల వయసులో అట్లాంటిక్ మీద చేసిన ప్రయాణంలో ఫ్రెంచ్ సముద్రదొంగల బారినపడి, తన ఓడను నష్టపరుచుకున్నాడు. పోర్చుగీసు తీరానికి ఈదుతూ వెళ్లి, ప్రాణాలు దక్కించుకున్నాడు. అక్కడే స్థిరపడి ఫెలిపాను వివాహం చేసుకున్నాడు. ఒక కొడుకును కన్నాడు. కానీ అసలైన గమ్యం చేరాల్సేవుంది! అది తక్కువ దూరంలో భారత్కు సముద్రమార్గాన్ని కనిపెట్టడం! పశ్చిమ దిశగా ప్రయాణిస్తే, భారతానికి వేగంగా చేరగలనని విశ్వసించాడు. స్పెయిన్ రాజదంపతుల అండదండలతో 1492లో అక్కడినుంచే ప్రయాణం ప్రారంభించాడు. వెంట, మూడు ఓడలు పింటా, నైనా, శాంతా మరియా; వాటికి తగిన సిబ్బంది; మార్కోపోలో పుస్తకం! క్యానరీ ఐలండ్స్ నుంచి జపాన్కు 2300 మైళ్ల దూరమని వేసుకున్న అంచనా ప్రకారం, 33 రోజుల ప్రయాణం తర్వాత, బహమాస్ దీవుల్లో అడుగుపెట్టాడు. ఇప్పటి లెక్కల ప్రకారం ఆరింతలు తక్కువగా లెక్క గట్టడంతో కొలంబస్ తను చూసిందే ఇండియా అని భ్రమించాడు. తర్వాత, క్యూబా, హైతీ, డొమినికన్ రిపబ్లిక్ చుట్టాడు. పోయేప్పుడు కొందరిని బానిసలుగా పట్టుకెళ్లాడు. ఆసియాకు దగ్గరి దారి కనుక్కున్నానన్న సంతృప్తితోనే కన్నుమూశాడు. కొలంబస్ యాత్ర వల్ల యూరప్ ఖండానికి అమెరికా ద్వారాలు తెరుచుకున్నాయి. ‘కాలనీలు’ వెలిశాయి. ఐరోపా గుర్రాలు, గోధుమ అమెరికాకు వెళ్లాయి. అమెరికా ఆలుగడ్డలు, టొమాటోలు, మొక్కజొన్నలు ఐరోపీయులకు తెలిశాయి. ఐరోపా నుంచి వెళ్లిన చికెన్ ఫాక్స్ అమెరికాలోని కొన్ని తెగల్ని తుడిచిపెట్టినంత పనిచేసింది. ఈ అన్నిరకాల మార్పిడికే ‘కొలంబియన్ ఎక్స్ఛేంజ్’ అనే పదబంధం పుట్టింది! కాస్కో నా వాస్కో! భారత్ నుంచి దిగుమతి అవుతున్న సుగంధ ద్రవ్యాలకు ఐరోపాలో విపరీతమైన ఆదరణ ఉంది. అవి రావడానికి భూమార్గం తప్ప దారిలేదు. ఇది ఖరీదైనదీ, దీర్ఘమైనదీ కూడా. ఈ సమయంలో పోర్చుగల్ రాజు సముద్రయానం గురించి యోచించాడు. దానికి నావికుడు వాస్కోడ గామా(సి.1460-1524) నేతృత్వం వహించాడు. ఆఫ్రికా అంచున ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ తీరాన్ని అప్పటికే బార్తొలేము డయాస్ కనుక్కొనివున్నాడు. కానీ తర్వాతేమిటో తెలియదు. ఎందుకంటే, అట్లాంటిక్ మహాసముద్రంతో హిందూ మహాసముద్రానికి లింకు ఉందా? అదిగానీ ఛేదిస్తే భారతదేశానికి దగ్గరి దారి దొరికినట్టే! ఈ అనుమానాలతోనే వాస్కో ప్రయాణం 1497లో లిస్బన్ నుంచి మొదలైంది. సావో గాబ్రియేల్, సావో రఫెల్, బెరియోలతోపాటు సామాన్ల నిల్వకోసం మరో పేరులేని ఓడ! 170 మంది బలగం! వాళ్లు గుడ్ హోప్ చుట్టూ తిరుక్కోని, మొజాంబిక్, మొంబాసా(కెన్యా), మాలింది(కెన్యా) రేవుల్లో ఆగుతూ, వర్తక అవకాశాల్ని పరిశీలించుకుంటూ, అక్కణ్నుంచి కేరళలోని కోజికోడ్ చేరారు. అయితే, వాళ్ల దగ్గర తగిన మొత్తం లేకపోవడంతో భారత వర్తకులు అనుమానంగా చూశారు. దాంతో పెద్దగా ఏమీ కొనుగోలు చేయకుండానే తిరుగుముఖం పట్టారు. దారిమధ్యలో స్కర్వీ సోకి సగం మంది చనిపోయారు. అయినప్పటికీ అసలైన కుంభస్థలాన్నే కొట్టాడు కాబట్టి స్వదేశంలో వాస్కోకు ఘనస్వాగతం లభించింది. మరో యాత్రలో మళ్లీ వాస్కో భారత్ వచ్చాడుగానీ మలేరియా సోకి చనిపోయాడు. తదుపరి పరిణామాల్లో ఆయన రెండో కొడుకు ఎస్తేవో డ గామా 1540లో ‘పోర్చుగీసు ఇండియా’కు గవర్నర్ అయ్యాడు. భూమి గుండ్రంగానే ఉంది! ‘భూమి బల్లపరుపుగా ఉంటుందని చర్చి అంటోంది, కానీ నాకు తెలుసు అది గుండ్రంగా ఉందని. ఎందుకంటే భూమి నీడను నేను చంద్రుడి మీద చూశాను. నాకు చర్చి మీద కంటే నీడ మీద ఎక్కువ విశ్వాసం ఉంది,’ అన్నాడు ఫెర్డినాండ్ ముజెల్లన్ (1480-1521). ఈయనదీ పోర్చుగలే! మ్యాపులన్నా, ఓడ ప్రయాణాలన్నా ఆసక్తి. భూమి గుండ్రంగా ఉందని నిరూపించడానికి సముద్రయానం చేపట్టాడు. పనిలోపనిగా ‘సుగంధ ద్రవ్యాల దీవి’ బోర్నియో మీద స్పెయిన్కు పెత్తనం కట్టబెట్టే బాధ్యతా తీసుకున్నాడు. 5 ఓడలు(ట్రినిడాడ్, శాన్ ఆంటోనియో, కాన్సెప్షియన్, విక్టోరియా, శాంటియాగో), 270 మంది బలగంతో 1519లో స్పెయిన్లోని సువిల్నుంచి ముజెల్లన్ యాత్ర ప్రారంభమైంది. బ్రెజిల్ చేరుకుని, దక్షిణ అమెరికా తీరం గుండా పటగోనియా వచ్చారు. అక్కణ్నించి ఒడిదుడుకుల మధ్య గువామ్ చేరారు. ఫిలిప్పీన్స్లో స్థానిక పాలకుడితో జరిగిన పోరులో ముజెల్లన్ మరణించాడు. దాంతో సెబాస్టియన్ ఎల్కానో యాత్రకు బాధ్యత తీసుకున్నాడు. వాళ్లు బోర్నియో నుండి హిందూ మహాసముద్రం మీదుగా ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ చుట్టుకొని స్పెయిన్ వచ్చేశారు, మూడేళ్ల తర్వాత, 1522లో. ఈ ప్రయాణంలో విక్టోరియా తప్ప వారి ఓడలన్నీ ధ్వంసమైనాయి. ఎల్కానో కాక మరో 18 మందే బతికారు. అయినప్పటికీ వాళ్లున్న చోటికే తిరిగివచ్చారు కాబట్టి, భూమి గుండ్రంగా ఉందని రుజువైంది. దీన్నే ముజెల్లన్-ఎల్కానో భూప్రదక్షిణగా పేర్కొంటారు. మానవచరిత్రలో ఇలాంటి తొలియాత్ర ఇదే! మహా సముద్రాల్ని కలిపాడు రొవాల్ ఆమున్సెన్ (1872-1928) నార్వే ఓడల యజమానుల ఇంట్లో జన్మించాడు. వాళ్లమ్మకు వైద్యుణ్నవుతానని మాటిచ్చినా, ఆమె మరణానంతరం కుటుంబ వ్యాపారంలో స్థిరపడ్డాడు. లేదు, స్థిరపడగలడా? ఒక తహతహ. ‘ద నార్త్వెస్ట్ ప్యాసేజ్’ కనుక్కోవాలని! ఆర్కిటిక్ మహాసముద్రం నుంచి మొదలై, ఉత్తర అమెరికా ఉత్తర తీరం మీదుగా, కెనడా ఆర్కిపెలాగో గుండా ప్రయాణించి, అట్లాంటిక్ మహాసముద్రాన్ని, పసిఫిక్ మహాసముద్రంతో కలిపే దారి ఇది! ఎంతోమంది దీన్ని అన్వేషించాలని ప్రయత్నించి విఫలమై ఉన్నారు. అలాంటి సమయంలో 1903లో ఆమున్సెన్ ఆరుగురు సిబ్బందితో ‘జో’ మీద బయలుదేరాడు. మధ్యలో నాత్లిక్ ప్రజల నుంచి స్లెడ్ బళ్లను నడపడం, జంతుచర్మాలను తొడుక్కోవడం లాంటి అత్యవసర లైఫ్ స్కిల్స్ నేర్చుకున్నాడు. 1905 చివరికల్లా విజయసంకేతం పంపాడు. అదే ఊపులో దక్షిణ ధృవం మీద పాదం మోపిన మొదటి వ్యక్తి, ఉత్తర ధృవం మీద ‘ఎగిరిన’ మొదటివ్యక్తి అయ్యాడు. ముగింపు వీరి యాత్రా కథనాల్లో మనుషుల్ని బానిసలుగా చేసుకోవడం ఉంటుంది, యుద్ధాలుంటాయి. వారు అప్పటి ప్రపంచ సూత్రాల ప్రకారమే నడుచుకున్నారని భావించడం తప్ప మరో దారిలేదు. పరస్పర గౌరవాన్ని మనిషి నెమ్మదిగా నేర్చుకుంటూ వస్తున్నాడు. తమ స్వీయలాభాల కోసమే ఈ యాత్రలు జరిగివుండొచ్చు. అన్వేషకులు రాకముందు కూడా ఒక దేశం తన మానాన అది బతుకుతూనే ఉంటుంది. అయినా ప్రపంచం ఇప్పుడున్న రీతిలో అనుసంధానం కావడానికి ఇవన్నీ తోడ్పడ్డాయి. బ్రిటనీయుడు చార్లెస్ డార్విన్ (1809-1882) కూడా ‘హెచ్ఎంఎస్’ బీగిల్ (హిస్ మెజెస్టీస్ షిప్; బ్రిటన్ రాజు ఓడకు కూడా బ్రిటన్ రాజుకిచ్చినంత గౌరవమే ఇవ్వాలి కదా!) అనే ఓడలో దక్షిణ అమెరికా తీరం వెంబడి ప్రయాణించాడు. ఆ యాత్రలో సేకరించిన వేలాది నమూనాల ఆధారంగానే జీవపరిణామం, జాతుల ఆవిర్భావం గురించిన తన సిద్ధాంతాల్ని వెల్లడించాడు. హ్యూయన్ త్సాంగ్కంటే 300 ఏళ్ల క్రితమే పాహియాన్ కాలినడకన భారత్ వచ్చాడు. కృష్ణ దేవరాయల కాలంలో న్యూనిజ్(పోర్చుగల్) పర్యటించాడు. ఇస్లాం దేశాల్ని ఇబిన్ బటూటా(మొరాకో) చుట్టివచ్చాడు. కొలంబస్కంటే 500 ఏళ్ల క్రితమే ఉత్తర అమెరికా మీద (ఐస్లాండ్) లీఫ్ ఎరిక్సన్ అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లను ఐరోపాకు కెప్టెన్ జేమ్స్ కుక్(ఇంగ్లండ్) పరిచేయం చేశాడు. మొదటిసారి అంతరిక్షంలోకి ప్రయాణించిన యూరీ గగారిన్(రష్యా), చంద్రుణ్ని తాకిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్(అమెరికా), ఎవరెస్టు అధిరోహించిన ఎడ్మండ్ హిల్లరీ(న్యూజిలాండ్), భారత మ్యాపుల్ని గీయడానికి ఆంగ్లేయులకోసం దేశాన్ని చుట్టిన కిషన్ సింగ్, నైన్ సింగ్ సోదరులు... ఇలా చరిత్ర పొడవునా ఎందరో అన్వేషకులు! రేపెప్పుడో కుజగ్రహం మీద పాదంమోపే తొలి మనిషి ఆవిర్భవిస్తాడు. ఒక మనిషి విజయం ఆ ఒక్కడిదే కాదు. అతడి వెనుక ఇంకెందరిదో కృషి కూడా దాగివుంటుంది. అయితే, ఆ ప్రత్యేక విజయానికి సంకేతంగా నిలుస్తారు కాబట్టి వారినే మనం తలుచుకుంటాం! - రాజ్ -
స్విమ్మింగ్ పూల్ లో దూకి....విద్యార్ధి మృతి
-
కుర్రకారు జోష్ కు బ్రేక్!
టీనేజీ కుర్రాళ్లు దారి తప్పుతున్నారు. సాహసాల పేరుతో చెడుదారిలో పయనిస్తున్నారు. అడ్వెంచర్ ను ఆస్వాదించేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సరదాల కోసం తమ ప్రాణాలతో వాటు సాటివారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. బైక్ రేసింగ్ లతో జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కుర్రకారు జోష్ తో రోడ్డుపై జనం నడవాలంటే జంకాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. హైదరాబాద్ లో బైక్ రేసింగ్ సంస్కృతి వేగంగా పెరుగుతోంది. అర్థరాత్రి, ఉదయం వేళల్లో ఇది ఎక్కువగా ఉంటోంది. సంపన్న వర్గాలకు నిలయమైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తో పాటు నెక్లెస్ రోడ్, గండిపేట చెరువు వంటి పర్యాటక పాంత్రాలు కుర్రకారు రేసింగ్ లకు అడ్డాలు మారాయి. బైకులపై మితిమీరిన వేగంతో వెళుతూ టీనేజర్లు ప్రదర్శించే విచిత్ర విన్యాసాలు ప్రజల ప్రాణాలమీదకు తెస్తున్నాయి. కారు బాబులు కూడా పందాలు వేసుకుంటూ జనాన్ని భయపెడుతున్నారు. పోలీసులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా బైక్ రేసింగ్ లకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా గండిపేట వద్ద బైక్ రేసింగ్ నిర్వహిస్తున్న దాదాపు 80 మంది టీనేజర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 30 బైకులను సీజ్ చేశారు. వీరిలో చాలా మంది 15 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. తల్లిదండ్రులు నిద్రలేవకముందే వారికి తెలియకుండా బైకులు తీసుకొచ్చి వీరు రేసింగ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరికి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. వారి తల్లిదండ్రులు పిలిచి మాట్లాడతామని చెప్పారు. బైక్ రేసింగ్ పాల్పడేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
సాహసాల్లో శ్రద్ధాదాస్!
సాహసాలు చేయాలని అందరికీ ఉంటుంది. కానీ, భయం వెనక్కి లాగేస్తుంది. కొంతమంది మాత్రం ఆ భయాన్ని పక్కకి నెట్టేసి, సాహసాలు చేసేస్తారు. ఇటీవల శ్రద్ధాదాస్ అలానే చేసి ‘సాహస నారి’ అనిపించుకున్నారు. ముంబయ్లోని లోనావాలాలోగల డెల్లా అడ్వంచర్ రిసార్ట్ అండ్ విల్లాస్కి సరదాగా వెళ్లారామె. అక్కడ గుర్రపు స్వారీ చేశారు. రాపెల్లింగ్, ఫ్లయింగ్ ఫాక్స్, రాకెట్ ఎజెక్టర్, పిస్టల్ బ్లో.. ఇలా అక్కడ సాహసభరిత విన్యాసాలను ధైర్యంగా చేసేశారు. మొత్తం మీద భలే టైమ్పాస్ అయ్యిందని శ్రద్ధా పేర్కొన్నారు. -
పులిబిడ్డ!
స్ఫూర్తి సాహసం చేసే వాళ్లు మాత్రమే ‘పులిబిడ్డలు’ కాదు. మంచి పని చేసే వారు కూడా పులి బిడ్డలే. పులుల క్షేమంకోసం నడుం బిగించిన హన్స్ దలాల్.... అక్షరాలా పులిబిడ్డే! రకరకాల శబ్దాల గురించి, తన కెరీర్ గురించి తప్ప... హన్స్ దలాల్ పులుల గురించి ఆలోచించిన సందర్భం మునుపెన్నడూ లేదు. అదేమి చిత్రమో, మధ్యప్రదేశ్లోని కాన్హా నేషనల్ పార్క్లో పులిని చూసిన క్షణం నుంచి... పులుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఆయనలో వెల్లువెత్తింది. ముంబైలోని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ రాత్రి దలాల్కు నిద్ర పట్టలేదు. సాధారణంగా పులి అనగానే ఒకలాంటి గాంభీర్యం కళ్ల ముందు కదలాడుతుంది. తనకేమో వాటి దీనత్వం మాత్రమే కనిపించింది. వాటి మూగరోదన కళ్లలో కనిపించింది. పులుల గురించి సమాచారాన్ని అంతర్జాలంలో చదువుతున్నప్పుడు అవి ఎంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయనే విషయం అర్థమై దలాల్ మనసు కదిలిపోయింది. ‘‘పులులను వేటాడడం సాహసం కాదు. అది పిరికివాళ్లు మాత్రమే చేస్తారు. పులులను రక్షించడం సాహసం. అది కొందరు మాత్రమే చేస్తారు’’ అనుకున్న దలాల్ ఆ కొందరిలో తాను ఒకడు కావాలనుకున్నాడు. ‘ప్రావ్ల్’ (ప్రిజర్వేషన్ ఆఫ్ వైల్డ్ ల్యాండ్స్కేప్స్) పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. నిజానికి అప్పటికీ ఆయనకు కొన్ని స్వచ్ఛందసంస్థల మీద సదభిప్రాయం లేదు. పులుల సంరక్షణ కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగాడు. వర్క్షాప్లు, క్యాంపులు నిర్వహించాడు. పులులకు సంబంధించి ఫుల్టైం ‘సమాచార కార్యకర్త’గా మారిపోయాడు. పట్టణంలో కంటే అడవుల దగ్గరే ఎక్కువ కాలం గడపడం అలవాటు చేసుకున్నాడు. పులుల వేట మీద హృదయం ద్రవించే డాక్యుమెంటరీని తీసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని రాజస్థాన్లోని మోగియ తెగ ప్రజలకు చూపెట్టాడు. మోగియలకు తరతరాలుగా వేట అనేది ప్రధాన వృత్తి. పులిని వేటాడిన వారిని ‘మొనగాడు’గా పరిగణిస్తారు. మొఘల్ల కాలానికి ముందు వీరికి ‘రాయల్ హంటర్’లుగా పేరు. రాజులతో కలిసి వేటకు వెళ్లేవారు. ఒకవిధంగా చెప్పాలంటే వారికి అడవిలో వేట తప్ప బయటి ప్రపంచం తెలియదు. వారిని అర్థం చేసుకోవడానికి దలాల్ అడవుల్లో చాలారోజుల పాటు గడిపాడు. ‘‘మీరు ఇలా కాదు... అలా ఉండాలి’’ అని చెప్పడానికి కూడా చాలామంది భయపడేవారు. ఎందుకంటే వారికి కోపం ఎక్కువ! అలాంటి వారు సైతం దలాల్ రూపొందించిన డాక్యుమెంటరీ చూసి చలించిపోయారు. ముంబై యూనివర్శిటీ, మెల్బోర్న్ యూనివర్శిటీల నుంచి ఆడియో ఇంజనీరింగ్లో డిగ్రీలు తీసుకున్న దలాల్ ముంబైలోని దేవానంద్ రికార్డింగ్ స్టూడియోలో మొదటి ఉద్యోగం చేశాడు. ఆ తరువాత బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. సౌండ్ ఇంజనీర్గా కెరీర్ మంచి ఊపులో ఉన్న సమయంలో... దలాల్ ఇలా పులుల సంరక్షణ అంటూ అడవులు పట్టుకు తిరగాలన్న నిర్ణయం గురించి విని ఆశ్చర్యపోయిన వారు తప్ప ‘మంచి నిర్ణయం’ అన్నవారు లేరు. ‘‘వణ్యప్రాణులను రక్షించాలనుకునే వాళ్లకు సహకారం అందించడమే మా సంస్థ ధ్యేయం’’ అని చెబుతున్న దలాల్ తొలి దశలో భాగంగా ఫారెస్ట్ గార్డ్లకు చేరువ కావాలనుకుంటున్నాడు. నిజానికి వణ్యప్రాణులను రక్షించడంలో వారు రకరకాల ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. కొందరు వేటగాళ్ల చేతిలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ‘‘వన్యప్రాణుల కోసం వాళ్లు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. దురదృష్టమేమిటంటే చాలామంది చేతిలో కాలం చెల్లిన పరికరాలు మాత్రమే ఉన్నాయి. మా స్వచ్ఛందసంస్థ నిర్వహించిన రకరకాల కార్యక్రమాలు, వర్క్షాప్ల నుంచి వచ్చిన డబ్బులతో ఫస్ట్-ఎయిడ్ కిట్స్లాంటివి వారికి ఇవ్వాలనుకున్నాం’’ అంటున్నాడు దలాల్. గమ్యం దిశగా తొలి అడుగు వేశాను అంటున్న దలాల్ ‘‘వణ్యప్రాణుల కళ్లలో భయం లేని కాలం రావాలి’’ అని కోరుకుంటున్నాడు. అతని కోరిక ఫలించాలని ఆశిద్దాం. ప్రతికూల పరిస్థితిలో... చిన్నప్పుడు ‘సెరెబ్రల్ పాల్సి’ అనే మెదడుకు సంబంధించిన రుగ్మతతో బాధ పడ్డాడు హన్స్ దలాల్. సానుకూల దృక్పథంతో దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తుండేవాడు. సంగీతకారుడు కావాలనేది దలాల్ కల. కానీ ఎలాంటి సంగీత పరికరాన్ని పట్టుకోవడానికీ చేతులు సహకరించేవి కాదు. నడవడానికి కూడా చాలా ఇబ్బందులు పడేవాడు. బడిలో చదువు కంటే కళల మీదే ఎక్కువగా ఆసక్తి చూపేవాడు. వయసు పెరుగుతున్నకొద్దీ సంగీతం మీద ఆసక్తి అంతకంతకూ పెరిగింది. గిటారు వాయించడానికి ప్రయత్నించేవాడుగానీ, చేతి వేళ్లు సహకరించేవి కాదు. ఇంకా పాక్షికంగా ఆ ప్రభావం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు. -
పట్టు తప్పితే 'అదో గతే'