Anant Ambani
-
కుమారుడి పెళ్లి ఖర్చుపై విమర్శలు.. నీతా అంబానీ రిప్లై
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు, అందుకు చేసిన ఖర్చుకు సంబంధించి విమర్శలు వస్తున్న నేపథ్యంలో అనంత్ తల్లి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ(Nita Ambani) స్పందించారు. ఇటీవల బ్లూమ్బర్గ్ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.‘ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల వివాహం కోసం తమ వంతు కృషి చేయాలని కోరుకుంటారు. మేం చేసింది కూడా అదే. ఇది మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అని నేను భావిస్తున్నాను’ అని అన్నారు. వేడుకల స్థాయిని పెంచుతూ భారతీయ వారసత్వాన్ని చాటాలని నీతా నొక్కి చెప్పారు. భారతీయ సంప్రదాయాలు, వారసత్వం, సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేసినందుకు సంతోషంగా ఉందని ఆమె ఇంటర్వ్యూలో అన్నారు. తన కుమారుడు అనంత్ ఆస్తమా కారణంగా చిన్నప్పటి నుంచి స్థూలకాయంతో పోరాడుతున్నాడని చెప్పారు. సమస్యలున్నా ఆత్మవిశ్వాసం కలిగిన పెళ్లికొడుకుగా వేదికపైకి వచ్చాడన్నారు.జులై 12, 2024లో ఒకటైన అనంత్ అంబానీ-రాధికమర్చెంట్ల వివాహం ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లో చర్చకు దారితీసింది. వీరి వివాహం మూడు ప్రధాన ఘట్టాల్లో జరిగింది. 2024 మార్చిలో అంతర్జాతీయ ప్రముఖులు జామ్నగర్లో మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హజరయ్యారు. ఇందులో రిహానా, అకాన్, జస్టిన్ బీబర్, దిల్జిత్ దోసాంజ్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్.. వంటి సినీతారలు కలిసి చిందేశారు. తర్వాత క్రూయిజ్ షిప్లో ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చారు. చివరకు ముంబయిలోని బీకేసీలో వివాహం జరిగింది.ఇదీ చదవండి: శాంతించిన కూరగాయలు, ఆహార ధరలుఅనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహానికి దేశీయ ప్రముఖులతోపాటు విదేశాల్లోని దిగ్గజ సంస్థల సీఈఓలు హాజరయ్యారు. దాంతో వారికి సకల సౌకర్యాలు సమకూర్చేలా ఏర్పాట్లు జరిపారు. అందులో భాగంగా ప్రముఖుల కోసం ఏకంగా అంబానీ కుటుంబం మూడు ఫాల్కన్ 2000 జెట్లను, 100 సాధారణ విమానాలను అద్దెకు తీసుకుంది. క్లబ్ వన్ ఎయిర్ సంస్థ సీఈఓ రాజన్ మెహ్రా అంబానీ జెట్ విమానాలను అద్దెకు తీసుకున్నట్లు అప్పట్లో ధ్రువీకరించారు. పెళ్లికి వచ్చిన అతిథులను తిరిగి వారి గమ్యస్థానాలను చేర్చడానికి వీటిని వినియోగిస్తారని చెప్పారు. ఇలా పెళ్లికి భారీగా ఖర్చు చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో తాజాగా నీతా అంబానీ ఇంటర్వ్యూలో స్పందించారు. -
Maha Kumbh Mela : సింపుల్గా, హుందాగా రాధిక-అనంత్ అంబానీ జంట
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబంతో కలిసి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్నమహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఈ భక్తజన సంద్రంలో అంబానీ కుటుంబంకూడా చేరింది. ముఖేష్ అంబానీ,కోకిలాబెన్ అంబానీ, ఆకాశ్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతాతో పాటు, అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ,చిన్న కోడలు రాధిక మర్చంట్ (ఫిబ్రవరి 11న) త్రివేణి సంగమంలో పవిత్ర ఆచారాలలో పాల్గొని పవిత్ర స్నానం చేశారు. (మున్నార్ : థ్రిల్లింగ్ డబుల్ డెక్కర్ బస్, గుండె గుభిల్లే! వైరల్ వీడియో)మహా కుంభ్లో, రాధిక తన లుక్తో ఆకట్టుకుంది. నేవీ బ్లూ సిల్క్ లగ్జరీ కుర్తాలో హుందాగా కనిపించింది. గోల్డ్ జరీ ఎంబ్రాయిడరీతో జయంతి రెడ్డి రూపొందించిన ఈ దుస్తుల విలువ ఇపుడు హాట్ టాపిక్గా నిలిచింది. V-నెక్లైన్ ,మోచేయి వరకు పొడవున్న స్లీవ్లు నెక్లైన్ బోర్డర్లను జరీ ఎంబ్రాయిడరీతో తీర్చి దిద్దారు. ఈ కుర్తాకు కాంట్రాస్టింగ్ పుదీనా గ్రీన్ ధోతీ ప్యాంటు, మ్యాచింగ్ దుపట్టాతో జత చేసింది. దీని ధర లక్ష రూపాయలని వివిధ నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే జ్యయుల్లరీ తక్కువగా ఉంచినప్పటికీ మోడ్రన్గా ఉండటం విశేషం. సింపుల్ పోనీటైల్తో డైమండ్ స్టడ్ చెవిపోగులు, హారాన్ని ధరించి ఆధ్యాత్మిక లుక్లో అలరించింది. (Valentines Day : లవ్ బర్డ్స్కోసం ది బెస్ట్ డెస్టినేషన్ ఇదే!)ఇక రాధికకు జతగా అనంత్ అంబానీ అద్భుతమైన ఎరుపు రంగు దుస్తుల్లో కనిపించాడు. వెండి మోటిఫ్లు , చక్కటి,చిక్కటి బంగారు ఎంబ్రాయిడరీ చేసిన మెరూన్ వెయిస్ట్కోట్, షైనింగ్ రెడ్ ఎరుపు కుర్తాను ధరించాడు. అలాగే బంగారు గొలుసు, నుదుటిన తిలకంతో తన సాంప్రదాయ రూపాన్ని పూర్తి చేశాడు. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) కాగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలోమహా కుంభమేళా 2025 ఉత్సాహంగా సాగుతోంది. సూర్యుని చుట్టూ బృహస్పతి చుట్టే కక్ష్య పూర్తైన సూచనగా జరుపుకునే ముఖ్యమైన తీర్థయాత్ర పండుగ ఇది. 12-కుంభమేళా చక్రం ముగింపును ఇది సూచిస్తుంది. దీనిని అధికారికంగా 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళాగా పిలుస్తారు. ఈ కార్యక్రమం జనవరి 13న మొదలై, ఫిబ్రవరి 26 వరకు సాగనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశంగా గుర్తింపు పొందింది. -
మహా కుంభమేళాలో అంబానీ ఫ్యామిలీ (ఫోటోలు)
-
బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ వేడుకలో రాధికా అంబానీ స్టెప్పులు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కోడలు, అనంత్ అంబానీ భార్య రాధికా అంబానీ తన డ్యాన్స్తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ వేడుకలో రాధిక అంబానీ తనదైన శైలిలో ఆకట్టుకుంది. స్టైలిష్ లుక్తో అందర్నీ కట్టి పడేసింది. స్నేహితులు కృష్ణ పరేఖ్, యష్ సింఘాల్ సంగీత్ వేడుకలో అనంత్ అంబానీ,రాధికా అంబానీతో కలిసి తమ స్నేహితులతో కలిసి సందడి చేశారు. అంతేకాదు అనార్కలి డిస్కో చలి అంటూ ప్రెండ్స్తో కలిసి సూపర్ స్టెప్పులేసింది రాధిక. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. రాధికా అంబానీ తన స్నేహితుల బృందంతో కలిసి విలాసవంతమైన సంగీత్ వేడుకలో నృత్యం చేసింది. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. ఇటీవల ముంబైలో ట్రైడెంట్ ఒబెరాయ్ హోటల్లో జరిగిన విలాసవంతమైన సంగీత్ వేడుకలో 'అనార్కలి డిస్కో చలి'కి తన అద్భుతమైన స్టెప్పులేసింది. 2012 చిత్రం హౌస్ఫుల్ 2 మూవీలోని ఈ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ వివాహానికి రాధిక అంబానీ స్టైలిష్ లుక్ మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. సిల్వర్ కలర్ లెహెంగాలో అందంగా ముస్తాబైంది. డైమండ్ బ్యాంగిల్స్ , చెవిపోగులతో తన లుక్ మరింత గ్రాండ్గా ఉండేలా జాగ్రత్తపడింది. దిల్ ధడక్నే దో చిత్రంలోని గల్లన్ గుడియాన్ లాంటి పాటలకు కూడా ఆమె ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ కనిపించింది. మరో వీడియోలో, ఆమె భర్త అనంత్ అంబానీ, వరుడు యష్ సింఘాల్, వారి స్నేహితులతో కలిసి నృత్యం చేస్తూ కనిపించారు. ఇదీ చదవండి: సబీర్ భాటియా లవ్ స్టోరీ : స్టార్ హీరోయిన్తో లవ్? కానీ పెళ్లి మాత్రం! View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) కాగా వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ చ శైలా మర్చంట్ దంపతుల కుమార్తెరాధికా మర్చంట్. అలాగే అంబానీముఖేష్ , నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.వివాహం తర్వాత తన అంబానీ ఇంటి పేరుతో కలిపి రాధికా అంబానీగా మారిపోయింది. యూరప్లో క్రూయిజ్తో సహా రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ వేడుకల పాటు గత ఏడాది జూలై 12న అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇది "ఇండియాస్ వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్"గా నిలిచింది. ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక డిసెంబరులో రిలీజ్ చేసిన " మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024" జాబితాలో అనంత్-రాధికా అంబానీ కపుల్ని చేర్చడం విశేషం. -
అంతరించిపోయిన ఐకానిక్ పక్షులకోసం అనంత్ అంబానీ కీలక నిర్ణయం
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి చెందిన వంతారా వన్య ప్రాణుల సంరక్షణలో మరో కీలక అడుగు వేసింది. ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణను అభివృద్ధి చేయడంలో కృషి చేస్తున్న వంతారా బ్రెజిల్లో దాదాపు అంతరించి పోయినట్టు ప్రకటించిన ఐకానిక్ పక్షులను రక్షించేందుకు నడుంబిగించింది. బ్రెజిల్లోని కాటింగా బయోమ్ అడవిలో అంతరించిపోయిన 41 స్పిక్స్ మకావ్ (Cyanopsitta spixii) లకు పునరుజ్జీవం తెచ్చేందుకు రంగంలోకి దిగింది. ఇందుకు సంబంధించి వంతారా అనుబంధ సంస్థ గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ (GZRRC), అసోసియేషన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ థ్రెటెండ్ పేరెట్స్ (ACTP)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.2000లో అంతరించిపోయినట్లు ప్రకటించినన స్పిక్స్ మాకా (సైనోప్సిట్టా స్పిక్సీ) అనే జాతిని పునరుద్ధరించే ప్రయాణంలో ఈ ఐకానిక్ పక్షులను బ్రెజిల్లోని వాటి స్థానిక ఆవాసాలకు తిరిగి పరిచయం చేయడమే ఈ చొరవ లక్ష్యం. ఇందులో GZRRC ప్రాజెక్ట్లో విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.జర్మనీలోని బెర్లిన్లోని ఏసీటీపీ బ్రీడింగ్ సెంటర్ నుండి 41 స్పిక్స్ మకావ్లను బ్రెజిల్లోని బాహియాలోని విడుదల కేంద్రానికి విజయవంతంగా తరలించడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని సాధించిందిఅనంత్ అంబానీ నేతృత్వంలోని వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్ట్ వంతారా. ఈ గ్లోబల్ రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్లో భాగంగా, వంతారా నిపుణులు ఏసీటీపికి మార్గదర్శకత్వం చేయడంతో పాటు కీలకమైన వనరులను అందిస్తారు. వీటిల్లో 2022లో 20 స్పిక్స్ మకావ్లను అడవిలోకి తిరిగి ప్రవేశపెట్టడం జరిగిందని, దీని ఫలితంగా 20 సంవత్సరాలలో తొలిసారి పిల్లలు పుటాయనీ, ఇది ప్రోగ్రామ్ పురోగతికి సామర్థ్యానికి నిదర్శనమని వంతారా ప్రకటించింది.బ్రెజిల్కు బదిలీకి ఎంపిక చేయబడిన 41 స్పిక్స్ మకావ్లను వాటి వంశపారంపర్యత, ఆరోగ్యం ఆధారంగా ఎంపిక చేశారు. ఇందులో 23 ఆడ, 15 మగ, 3 ఇంకా నిర్ధారించని చిన్న పిల్లలున్నాయి. ఈ సంవత్సరం విడుదలకు సిద్ధమవుతున్న బృందంలో కొన్ని చేరగా, మరికొన్ని దీర్ఘకాలిక పరిరక్షణ ప్రయత్నాలకు మద్దతుగా బ్రీడింగ్ ప్రోగ్రామ్లో చేర్చారు.. బదిలీకి ముందు, పక్షులు బెర్లిన్లోని ఒక బ్రీడింగ్ ఫెసిలిటీలో 28 రోజుల కంటే ఎక్కువ క్వారంటైన్లో ఉన్నాయి. అక్కడి అడవి పర్యావరణాన్ని ప్రభావితం చేసే ఏవైనా వ్యాధులకు లేవని నిర్దారించుకునేందుకు వీలుగా సమగ్ర పరీక్షలు నిర్వహించారు. జనవరి 28న, ఆ పక్షులు బెర్లిన్ నుండి చార్టర్డ్ విమానంలో బ్రెజిల్లోని పెట్రోలినా విమానాశ్రయానికి బయలు దేరి, అక్కడికి చేరుకున్న తర్వాత, వాటిని నేరుగా క్వారంటైన్ సౌకర్యానికి తరలించారు. ఈ బదిలీని ఇద్దరు పశువైద్యులు , ఏసీటీపిఒక కీపర్ జాగ్రత్తగా పర్యవేక్షించారు, వీరితో పాటు వంటారా GZRRC నుండి నిపుణుల బృందం కూడా ఉంది.స్పిక్స్ మకావ్స్ రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్కు వారి అద్భుతమైన కృషి చేసిన అనంత్ అంబానీ , వంతారాబృందానికి ACTP వ్యవస్థాపకుడు మార్టిన్ గుత్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అంతరించిపోయిన జాతుల రక్షణలోఆర్థిక సహాయంతో పాటు, నైపుణ్యం ఎంతో అమూల్యమైనదని కొనియాడారు.హాలీవుడ్ చిత్రం రియోలో ప్రముఖంగా కనిపించిన స్పిక్స్ మకా, బ్రెజిలియన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా 2019లో, బ్రెజిల్లో ఒక ప్రత్యేక విడుదల కేంద్రం స్థాపించారు. ఆ తర్వాత 2020లో జర్మనీ బెల్జియం నుండి 52 పక్షులను రవాణా చేశారు. 2022లో, 20 స్పిక్స్ మకావ్లను వాటి సహజ ఆవాసాలలోకి విడుదల చేయగా, ఏడు అడవి కోడిపిల్లలు జన్మించాయి. భారతదేశ వైవిధ్యమైన వన్యప్రాణుల వారసత్వాన్ని పునరుద్ధరించడానికి కూడా వంతారా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కట్టడిలో ఉన్న ఖడ్గమృగాలను సురక్షితమైన ఆవాసాలలోకి తిరిగి ప్రవేశపెట్టడం, సంతానోత్పత్తి , ఆవాస పునరుద్ధరణ ద్వారా ఆసియా సింహాల జనాభాను బలోపేతం చేయడం వాటి సంతానోత్పత్తి కార్యక్రమం తర్వాత చిరుతలను భారతీయ అడవులకు తిరిగి తీసుకురావడం వంటివి ఉన్న సంగతి తెలిసిందే. -
అంబానీ జూకు ఏనుగుల తరలింపుపై విమర్శలా?!
ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్.. ఎక్కడ గుజరాత్..? మూడు వేలకు పైగా కిలోమీటర్ల దూరం. అంత దూరం నుంచి.. అదీ ట్రక్కులలో ఏనుగులను తరలించడం ఏంటి?. స్పెషల్ ట్రక్కులలో అంబానీ కుటుంబానికి చెందిన జూకు ఏనుగులను తరలించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మూగజీవుల కోసం పోరాడే ఉద్యమకారులైతే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దృశ్యాలు చూసి.. ‘‘పాపం ఏనుగులు.. డబ్బుంటే ఏమైనా చేయొచ్చా?’’ అని తిట్టుకునేవారు లేకపోలేదు. అయితే..అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) నుంచి మాత్రమే కాదు.. అసోం(Assam) నుంచి కూడా జామ్ నగర్లోని అనంత్ అంబానీకి చెందిన వంతార జూనకు ఏనుగులను తరలించారట. ఈ తరలింపునకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి అనుమతులు లేవని.. పైగా వన్యప్రాణులను అలా బంధించడమూ నేరమేనని కొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నిజనిర్ధారణలు చేసుకోకుండా పోస్టులు పెట్టేస్తున్నారు. అయితే ఇలాంటి తరలింపునకు అసలు అనుమతులు ఉన్నాయా?. వన్యప్రాణులను ఇలా జంతు ప్రదర్శన శాలలో ఉంచొచ్చా?. దారిలో వాటికి ఏదైనా జరగరానిది జరిగితే ఎలా?... ఎవరిది బాధ్యత? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంలో వాస్తవమెంత?. అయితే ఇవేం అడవుల నుంచి బలవంతంగా తరలిస్తున్న ఏనుగులు కాదని అధికారులు వివరణ ఇస్తున్నారు. జంతు సంరక్షణ చర్యల్లో భాగంగానే వాటిని తరలిస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఏనుగులను బంధించి.. వాటితో సొమ్ము చేసుకుంటున్న ముఠాల నుంచి వాటికి విముక్తి కలిగిస్తున్నారు. రిలయన్స్ వంతార జూ ‘చైన్ ఫ్రీ’ ఉద్యమం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమం భాగంగా ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. అయితే తాజా వీడియోలపై విమర్శల నేపథ్యంలో.. ఇటు వంతారా నిర్వాహకులు కూడా స్పందించారు.ఆరోగ్యకరమైన వాతావరణంలో అవి జీవిస్తాయని మాది గ్యారెంటీ. వాటికి గౌరవప్రదమైన జీవితం అందించడమే మా ఉద్దేశం’’ అని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఇందుకు అవసరమైన ప్రక్రియ అంతా అధికారికంగానే నిర్వహించినట్లు స్పష్టత ఇచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారమే నడుచుకున్నట్లు, అలాగే.. గుజరాత్ , అరుణాచల్ ప్రదేశ్ అటవీ శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, ఏనుగుల తరలింపు కోసం రవాణా శాఖల నుంచీ ప్రత్యేక అనుమతులు పొందినట్లు పేర్కొంది.అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే.. అవి అటవీ ఏనుగులు కాదని, ప్రైవేట్ ఓనర్ల నుంచి వాటిని వంతారా కొనుగోలు చేసినట్లు తెలిపింది. త్రిపుర హైకోర్టు వేసిన హైపవర్ కమిటీతో పాటు సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని స్పష్టం చేసింది. వాటిని తరలించిన ఆంబులెన్స్లు కూడా ప్రత్యేకమైన సదుపాయాలతోనే తరలించినట్లు పేర్కొంది.అసోం ప్రభుత్వం మాత్రం.. తమ భూభాగం నుంచి ఏనుగుల తరలింపేదీ జరగలేదని స్పష్టం చేసింది. అసోం నుంచి గుజరాత్ ప్రైవేట్ జూకు జంతువుల తరలింపు పేరిట అసత్య ప్రచారాలు, కథనాలు ఇస్తున్నారని ఆ రాష్ట్ర సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ వివరణలలేవీ వైల్డ్లైఫ్(Wild Life) యాక్టవిస్టులను సంతృప్తి పర్చడం లేదు. పైగా వాతావరణ మార్పు వాటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని, యానిమల్ ఆంబులెన్స్ పేరిట తరలిస్తున్న వాహనాల్లో ఎలాంటి సదుపాయాలు లేవని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని అంటున్నారు. మరోవైపు.. ఈ వ్యవహారం ఇటు సోషల్ మీడియాలో, అటు రాజకీయంగా విమర్శలకు దారి తీసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ వ్యక్తుల కోసం పని చేస్తున్నాయంటూ ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయి.వంతార.. రిలయన్స్ సౌజన్యంతో నడిచే అతిపెద్ద జంతు సంరక్షణశాల. దేశంలోనే అతిపెద్దది. ముకేష్ అంబానీ(Mukesh Ambani) తనయుడు అనంత్ చిన్నప్పటి నుంచి యానిమల్ లవర్ అట. అలా.. మూగ జీవుల సంరక్షణ ప్రధాన ఉద్దేశంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ దేశంలో ఎక్కడా లేనన్ని సేవలతో ఈ జూను నడిపిస్తున్నాయి. వేటగాళ్ల చేతిలో బందీ అయిన, గాయపడిన ప్రాణులను రక్షించి చికిత్స చేయడం, కాపాడాటం, వాటికి పునరావాసం కల్పించడంపై దృష్టిపెట్టింది ఫౌండేషన్. ఈ ప్రాజెక్టు కింద భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోని ప్రాణులను కూడా కాపాడుతున్నారు. ఇది గుజరాత్ లోని జామ్ నగర్ రిఫైనరీ కాంప్లెక్స్లోని రిలయన్స్ గ్రీన్ బెల్ట్లో సుమారు 600 ఎకరాల్లో విస్తరించి ఉంది.ఏమేం ఉన్నాయంటే..వంతార జూ(Vantara Zoo)లోనే లక్ష చదరపు అడుగుల్లో హాస్పిటల్, పరిశోధనా కేంద్రం నిర్మించారు. జంతువుల ట్రీట్మెంట్ కోసం అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు.. లేటెస్ట్ టెక్నాలజీతో ICU, MRI, CT స్కాన్, X-రే, అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, డెంటల్ స్కాలార్, లిథోట్రిప్సీ, డయాలసిస్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ సర్జరీలకు లైవ్ వీడియో కాన్ఫరెన్సులు ఉన్నాయి. బ్లడ్ ప్లాస్మాను వేరు చేసే టెక్నాలజీ కూడా ఉంది. ఈ కేంద్రంలో 2 వేలకు పైగా ప్రాణులు, 43 జాతుల వాటిని కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అంతరించే జాతులకు సంబంధించిన 7 రకాల వన్యప్రాణులు కూడా ఇక్కడ ఉన్నాయి.. అలాగే విదేశాల్లో అంతరించే దశలో ఉన్న ప్రాణులనూ రక్షిస్తున్నారిక్కడ. రెస్క్యూలో భాగంగా ఇప్పటికే 2వందలకు పైగా ఏనుగులను సేవ్ చేసి.. వంతారలోని ఏనుగుల రక్షణ కేంద్రంలో వదిలేశారు. జూను చూసేందుకు 3వేల-4వేల మంది పనిచేస్తున్నారు. భారత్ తో సహా ప్రపంచంలోని పేరొందిన జంతుశాస్త్ర నిపుణులు.. వైద్య నిపుణులు కొందరు వంతార మిషన్ లో భాగమైయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థలు.. ప్రభుత్వ పరిశోధనా సంస్థలు కూడా వంతార జూకు సహకరిస్తున్నాయి. -
వంతారాకు కొత్త అతిథులు
ఇస్కాన్ మాయాపూర్కు చెందిన రెండు ఏనుగులు బిష్ణుప్రియ, లక్ష్మీప్రియల సంరక్షణ బాధ్యతలను జంతు పునరావాస కేంద్రం వంతారా తీసుకోనుంది. గత ఏప్రిల్లో బిష్ణుప్రియ మావటిపై దాడి చేసిన విషాద సంఘటన తరువాత ఈ మేరకు ఇస్కాన్, వంతారా మధ్య ఒప్పందం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆధ్వర్యంలోని జామ్నగర్లో ఉన్న వంతారా జంతు సంరక్షణ కేంద్రం ప్రసిద్ధి చెందింది.అనంత్ అంబానీ స్థాపించిన వంతారా ఈ రెండు ఏనుగులకు శాశ్వత నివాసం కల్పించనుంది. ఈ ఏనుగుల బదిలీకి సంబంధించి త్రిపుర హైకోర్టు ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ నుంచి పూర్తి ఆమోదం లభించింది. ఆపదలో ఉన్న అడవి జంతువులను రక్షించడం, ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించడానికి అనువైన ప్రాంతాలను అన్వేషించడం ఈ కమిటీ బాధ్యత.బిష్ణుప్రియ, లక్ష్మీప్రియ ఏనుగుల కోసం సహజ ఆవాసాన్ని ప్రతిబింబించేలా వంతారాలో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇస్కాన్ మాయాపూర్ 2007 నుంచి లక్ష్మీప్రియను, 2010 నుంచి బిష్ణుప్రియను ఆలయ ఆచారాలకు, వివిధ పండుగ సందర్భాలకు ఉపయోగిస్తోంది. కొన్ని కారణాల వల్ల గత ఏప్రిల్లో బిష్ణుప్రియ మావటిపై దాడి చేసింది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఇండియా, వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్తో సహా జంతు సంరక్షణ సంస్థలు ఇస్కాన్ ఏనుగులను సంరక్షణ కేంద్రానికి తరలించాలని తెలిపాయి.ఇదీ చదవండి: ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి అంబానీ హాజరువంతారాఅనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. -
అనంత్ చేతికి అరుదైన వాచ్: ప్రత్యేకతలివే..
కొంతమందికి కార్లంటే ఇష్టం, మరికొందరికి బైకులు, ఇంకొందరికి వాచీలు. ఇలా ఎవరి అభిరుచి వారిది. అయితే వాచీలను ఎక్కువగా ఇష్టపడే వారిలో భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు 'అనంత్ అంబానీ' (Anant Ambani) కూడా ఒకరు. గతేడాది 'రాధికా మర్చెంట్'ను (Radhika Merchant) పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన అనంత్.. ఇటీవల ఓ ఖరీదైన వాచ్ ధరించి కనిపించారు.అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఏకంగా రూ. 22 కోట్లు అని తెలుస్తోంది. ఇది ది రిచర్డ్ మిల్లే RM 52-04 స్కల్ బ్లూ సఫైర్. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాచీలలో ఇది ఒకటి. ఇలాంటివి ప్రపంచంలో కేవలం మూడు మాత్రమే ఉన్నాయని సమాచారం. ఈ వాచ్ రష్యా అధ్యక్షుడు 'వ్లాదిమిర్ పుతిన్' ప్రెస్ సెక్రటరీ 'డిమిత్రి పెస్కోవ్' (Dmitry Peskov) వద్ద కూడా ఉన్నట్లు తెలుస్తోంది.రిచర్డ్ మిల్లే RM 52-04 బ్లూ సఫైర్ ఒకే పీస్తో తయారు చేశారు. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ వాచ్ మాత్రమే కాకుండా అనంత్ అంబానీ వద్ద పటెక్ ఫిలిప్పె, అడెమార్స్ పిగ్యుట్ వంటి ఇతర బ్రాండెడ్ వాచీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.రిచర్డ్ మిల్లే RM 52-04 స్కల్ బ్లూ సఫైర్ ప్రత్యేకతలుఒకే పీస్తో తయారైన ఈ వాచ్ మధ్య భాగంలో ఒక పుర్రె ఆకారం.. క్రాస్బోన్ ఉండటం చూడవచ్చు. దీని కింద వంతెనల లాంటి నిర్మాణాలను చూడవచ్చు. ఇవన్నీ ఖరీదైన మెటల్తో రూపొందించడం వల్ల చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. పేరుకు తగ్గట్టుగానే ఇది నీలం రంగులో ఉండటం కూడా గమనించవచ్చు, ఇది ఐస్ క్యూబ్ మాదిరిగా ఉంటుంది.అనంత్ అంబానీఅనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు. అనంత్ జూలై 12, 2024న రాధిక మర్చంట్ను పెళ్లి చేసుకున్నారు. ఈయన వద్ద ఖరీదైన వాచీలు మాత్రమే కాకుండా.. రోల్స్ రాయిస్ కల్లినన్ వంటి కార్లు కూడా ఉన్నాయి. ఇషా అంబానీ, ఆకాష్ అంబానీలు.. అనంత్ అంబానీ తోబుట్టువులు. View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology) -
డిసెంబర్ 30 వరకు.. వంతారా కార్నివాల్ అడ్వెంచర్
వన్యప్రాణులను రక్షించడానికి, వాటికి పునరావాసం కల్పించడానికి ఏర్పాటైన 'వంతారా' తాజాగా 'వాంతారియన్ రెస్క్యూ రేంజర్స్' పేరుతో ఓ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం 2024 డిసెంబర్ 30 వరకు జరగనుంది. ఈ ఈవెంట్ ప్రత్యేకించి జంతు ప్రేమికుల కోసం ఏర్పాటు చేసింది.వాంతారియన్ రెస్క్యూ రేంజర్స్ కార్యక్రమంలో చిక్కుకున్న పక్షులను విడిపించడం, రక్షించిన జంతువులకు ఆహారం ఇవ్వడం, ఆవాసాలను రక్షించడం నేర్చుకోవడం వంటి సవాళ్లను అనుకరించడంలో ఇంటరాక్టివ్ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. వన్యప్రాణుల అక్రమ రవాణాపై క్లిష్టమైన పోరాటాన్ని నొక్కిచెబుతూ.. తప్పిపోయిన జంతువులలో ఒకదాన్ని రక్షించడంలో సాహసం ముగుస్తుంది.కార్యకలాపాలను పూర్తి చేసిన పిల్లలు.. రక్షించిన జంతు బొమ్మను అందుకుంటారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక ప్రదేశంలో జంతువులు, పక్షుల బొమ్మలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వీటితో పాటు ఎక్కడ చూసినా శాంటా బొమ్మలను కూడా చూడవచ్చు.వంతారాఅనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. -
అనంత్-రాధిక హల్దీ.. వెలుగులోకి మరో వీడియో! వైరల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ రాధికల పెళ్లి ఎంతలా అంగరంగ వైభవంగా జరిగిందో తెలిసిందే. ఆ వేడుకకు సంబంధించిన ప్రతి ఫోటో, వీడియోలు నెట్టింట సందడి చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అంబానీలు ధరించే కాస్ట్యూమ్స్, నగలు, తదితరాలు చాలా హాట్టాపిక్గా నిలిచాయి కూడా. అయితే ఆ వేడుకకు సంబంధించి ఓ వీడియోని మాత్రం అందరూ మిస్ అయ్యాం. సరదసరదాగా సాగే హల్దీ వేడుకకు సంబంధిచిన మరో వీడియో తాజగానెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంబానీలకు సన్నిహితుడైన అకా ఓర్హాన్ అవత్రమణి షేర్ చేసిన ఈ లేటెస్ట్ వీడియోలో అంబానీలంతా ఖుషీగా గడిపినట్లు కనిపించింది. అతిధులంతా పసుపునీళ్లు ఒకరిపై ఒకరూ వేసుకుంటూ సందడి చేశారు. ఆ వీడియోలో నీతా అంబానీ పసుపు నీళ్లు పడకుండా తప్పించుకోవడంలో విఫల ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వేడుకకు హోస్ట్గా ఉన్న నీతా అంబానీ సైతం అంరిలానే హల్దీ దాడిని ఎదుర్కోవడం ఫన్నీగా ఉంటుంది. ఇక అనంత్ అంబానీ బావమరిది ఆనంద్ పిరమల్ ఒకరిపై ఒకరు పసుపు నీళ్లు, పూలతో దాడి చేయడం, మరోపక్క అతిథులంతా నవ్వుతూ ఉన్నట్లు వీడియోలో కనిపించింది. ఈ హల్దీ ఫంక్షన్ ముంబైలోని అంబానీ కుటుంబానికి చెందిన ఆంటిలియాలో జరిగింది. ఈ వేడుకలో జాన్వీ కపూర్, అర్జున్ కపూర్, రణ్వీర్ సింగ్ తదితర తారలు పాల్గొన్నారు. అంతేగాదు ఈ లెటెస్ట్ ఓర్రీ వీడియోలో ధోల్ బీట్లు, డ్యాన్స్లతో ఇతర అతిథులు ఎంత సరదాగా గడిపారో కూడా కనిపిస్తోంది. కాగా, అనంత్ రాధిక మర్చంట్ల వివాహం ఈ ఏడాది జూలై 12న అత్యంత లగ్జరియస్గా జరిగింది. (చదవండి: అందమైన శరీరాకృతికి బీబీఎల్ సర్జరీ: అంటే ఏంటీ..? ఎదురయ్యే దుష్ర్పభావాలు..) -
ట్రెండింగ్లో నిలిచిన కొత్త పెళ్లి కూతురు.. ఇంకొందరు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్అంబానీ చిన్న కోడలు రాధిక మర్చెంట్ 2024 ఏడాదికిగాను గూగుల్ సెర్చ్లో ట్రెండింగ్లో నిలిచారు. ముఖేశ్అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జులైలో రాధిక మర్చెంట్తో జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహానికి అంతర్జాతీయ ప్రముఖులు, సెలబ్రిటీలు, సినీతారలు హాజరై సందడి చేశారు. దాంతో అంబానీ కోడలు గురించి చాలామంది గూగుల్లో సెర్చ్ చేసినట్లు తెలిసింది.2024లో రాధిక మర్చెంట్తోపాటు మరికొందరు ట్రెండింగ్లో నిలిచారు.1. వినేష్ ఫొగాట్: భారతదేశపు రెజ్లింగ్ స్టార్రెజ్లర్ వినేష్ ఫొగాట్ 2024లో అత్యధికంగా గూగుల్లో సెర్చ్ చేసిన భారతీయ వ్యక్తుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. పారిస్ ఒలింపిక్లో మహిళల 50 కేజీల రెజ్లింగ్ పోటీలో 100 గ్రాముల అధిక బరువుండి దానికి అర్హత సాధించలేకపోయారు.2. నితీష్ కుమార్: బిహార్ రాజకీయ వ్యూహకర్తబిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2024 లోక్సభ ఎన్నికల సమయంలో విపరీతమైన ప్రజాదరణ పొందారు. తన రాజకీయ ఎత్తుగడలు, పొత్తులపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.3. చిరాగ్ పాశ్వాన్: రాజకీయ నాయకుడుదివంగత కేంద్ర మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నటనకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించారు. మోడీ 3.0 కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.4. హార్దిక్ పాండ్యా: క్రికెటర్క్రికెట్లో ఆల్ రౌండర్గా పేరున్న హార్దిక్ పాండ్యా మోడల్ నటాసా స్టాంకోవిక్తో విడాకులు తీసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు.5. పవన్ కళ్యాణ్: రాజకీయ నాయకుడుప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ 2024 జూన్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.6. శశాంక్ సింగ్: కొత్త క్రికెట్ స్టార్శశాంక్ సింగ్ ఐపీఎల్ క్రికెట్లో తన అద్భుతమైన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించారు.7. పూనమ్ పాండే: మోడల్, నటిగర్భాశయ క్యాన్సర్తో పూనమ్ పాండే మృతి చెందినట్లు ఆమె అనుచరులు తెలిపారు. తర్వాత అది ఫేక్ అని, తాను బతికే ఉన్నానని చెప్పింది.8. రాధిక మర్చెంట్: అంబానీ కోడలుజులైలో అనంత్ అంబానీతో గ్రాండ్ వెడ్డింగ్ నేపథ్యంలో రాధికా మర్చంట్ పేరు వైరల్గా మారింది.9. అభిషేక్ శర్మ: క్రికెటర్క్రికెటర్ అభిషేక్ శర్మ ఐపీఎల్లో అసాధారణ ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నారు.10. లక్ష్య సేన్: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు2024 పారిస్ ఒలింపిక్స్లో లక్ష్య సేన్ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. -
‘మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024’ జాబితాలో యువజంట (ఫొటోలు)
-
అనంత్-రాధిక అంబానీ ‘ప్రేమమందిరం’ దుబాయ్ లగ్జరీ విల్లా, ఫోటోలు
-
అనంత్-రాధికా అంబానీ అదిరిపోయే దుబాయ్ విల్లా, ఫోటోలు వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తమ చిన్న కొడుకు అనంత్ అంబానీకి అద్భుతమైన పెళ్లి కానుక ఇచ్చారు. అత్యంత వైభవంగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహాన్ని ఇటలీలో జరిపించిన అంబానీ దంపతులు అలాగే కనీవినీ ఎరుగని రీతిలో రెండు ప్రీ-వెడ్డింగ్ బాష్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటలీలోని ఓ క్రూజ్ షిప్లో భారీ పార్టీని ఏర్పాటు చేసారు. ఇందంతా ఒక ఎత్తయితే అంబానీలు తమ చిన్న కోడలు రాధికా మర్చెంట్కు దుబాయ్లో 640 కోట్ల విలువైన బంగ్లాను కానుకగా ఇచ్చారు. ఈ లగ్జరీ బంగ్లాకు సంబంధించిన ఫోటోలు ఇపుడు నెట్టింట సందడి చేస్తున్నాయి.దుబాయ్లోని ఫేమస్ పామ్ జుమైరాలో ఈ విలాసవంతమైన విల్లా ఉంది. దుబాయ్లో అత్యంత ఖరీదైన విల్లాలో ఇదొకటి. దాదాపు 3000 చదరపు అడుగుల్లో ఈ విల్లాను నిర్మించారు. ఈ విల్లా మొత్తంలో 10 బెడ్రూంలు, 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. సొగసైన లివింగ్ రూమ్లు, బెడ్రూమ్లు విలాసవంతమైన బాత్రూమ్ల ఇలా ప్రతీది చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా జాగ్రత్తపడ్డారట. ఇటాలియన్ మార్బుల్, అద్భుతమైన ఆర్ట్వర్క్తో అలంకరించిన 10 ఖరీదైన బెడ్రూమ్లు, ఆకట్టుకునే ఇంటీరియర్స్తో విల్లా ఒక అద్భుత కళాఖండంగా ఉంటుందని సమాచారం. ఇండోర్, అవుట్డోర్ పూల్స్ ఉన్నాయి. పాంపరింగ్ సెషన్ల కోసం ప్రైవేట్ స్పా, ప్రైవేట్ సెలూన్ కూడా ఉన్నాయి. పెద్ద కోడలు శ్లోకా మెహతాకి 450 కోట్ల ఖరీదైన బంగ్లాతో పాటు రూ. 200 కోట్ల ఖరీదైన నెక్లెస్ ఇచ్చారు. ఈ ఏడాది జులై 12న రాధిక, అనంత్ అంబానీ వివాహ వేడుక చాలా గ్రాండ్గా నిర్వహించిన సంగతి తెలిసిందే.👉 ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదీ చదవండి: పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...! -
పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...!
పెళ్లి తరువాత అమ్మాయిలకు అత్తింటి పేరు వచ్చి చేరడం సాధారణం. అయితే ఇది వారి వ్యక్తిగత ఇష్లాలు, ఆచారాలను బట్టి కూడా ఉంటుంది. తాజాగా రిలయన్స్ సామ్రాజ్యాన్ని సృష్టించిన అంబానీ ఇంటి కోడలు రాధికా మర్చంట్ పేరు మార్చుకుంది. పెళ్లి తర్వాత, రాధిక మర్చంట్ తన పేరులో 'అంబానీ'ని అధికారికంగా చేర్చుకుంది. రాధికా మర్చంట్ తన భర్త అనంత్ అంబానీ ఇంటిపేరును తన పేరులో చేర్చుకోవడంతో ‘రాధిక అంబానీ’గా అవతరించింది. వ్యాపారవేత్త విరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధికా మర్చంట్ తన చిరకాల బాయ్ఫ్రెండ్ అనంత్ అంబానీని ఈ ఏడాది జూలైలో పెళ్లాడింది. రాధిక తన తండ్రి వ్యాపారమైన ఎన్కోర్ హెల్త్కేర్కు డొమెస్టిక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంది. ఇటీవల ఎంటర్ప్రెన్యూర్ ఇండియాతో మాట్లాడిన ఆమె తన భవిష్యత్ కెరీర్ ప్లాన్లను కూడా వివరించింది. ముఖ్యంగా దక్షిణాది మార్కెట్లలో తమ వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి సారించినట్లు రాధిక వెల్లడించింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తీసుకురావాలని ఆమె భావిస్తున్నట్టు తెలిపింది.ఇదీ చదవండి : Kartika Purnima 2024: 365 వత్తులు వెలిగిస్తే పాపాలు పోతాయా? -
అనంత్ అంబానీ వంతారాకు కొత్త అతిధులు
అనంత్ అంబానీ స్థాపించిన 'వంతారా' (Vantara) గురించి అందరికి తెలుసు. జామ్నగర్లో ఉన్న ఈ వన్యప్రాణుల రెస్క్యూ కేంద్రానికి మూడు ఆఫ్రికన్ ఏనుగులు విచ్చేసాయి. ఇందులో రెండు ఆడ ఏనుగులు, మరొకటి మగ ఏనుగు. వీటి వయసు 28 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్నట్లు సమాచారం.వంతారాను ట్యునీషియాలోని ఒక ప్రైవేట్ జంతుప్రదర్శనశాల అధికారులు సంప్రదించి, ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఏనుగుల పోషణ కష్టమైందని వెల్లడించింది. సుమారు 20ఏళ్ల క్రితం నాలుగు సంవత్సరాల వయసున్న 'అచ్తామ్, కనీ, మినా' అనే ఏనుగులు బుర్కినా ఫాసో నుంచి ట్యునీషియాలోని ఫ్రిగ్యుయా పార్కుకు వచ్చాయి. అప్పటి నుంచి అవి సుమారు 23 సంవత్సరాలు అక్కడి సందర్శకులను కనువిందు చేశాయి.ప్రస్తుతం ట్యునీషియాలో వాటి పోషణ భారమైంది. దీంతో భారతదేశంలోని వంతారాకు తరలించాలని నిశ్చయించారు. జాతీయ, అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఏనుగులను ప్రత్యేకమైన చార్టర్డ్ కార్గో ఎయిర్క్రాఫ్ట్ ద్వారా భారత్కు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వంతారాకు విచ్చేసిన ఆఫ్రికా ఏనుగులు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వెటర్నరీ అధికారులు వెల్లడించారు. ఏనుగులకు జుట్టు రాలడం, చర్మం సంబంధిత సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. అచ్తామ్కు స్ప్లిట్ టస్క్ & మోలార్ టూత్ ఇన్ఫెక్షన్ ఉంది. కని ఏనుగు గోళ్లు పగిలినట్లు చెబుతున్నారు. కాబట్టి వీటికి సరైన వైద్య చికిత్స అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఏనుగులకు ప్రత్యేకమైన వసతిని కూడా వంతారాలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.వంతారాఅనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. -
లాల్బాగ్చాకు అనంత్ అంబానీ స్వర్ణకిరీటం
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ప్రఖ్యాతి గాంచిన లాల్బాగ్చా రాజా వినాయకుడికి రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రిలయన్స్ ఫౌండేషన్తో కలిసి భారీ విరాళం అందజేశారు. రూ.15 కోట్ల విలువైన 20 కిలోల స్వర్ణ కిరీటాన్ని తన ఆరాధ్య దైవానికి సమరి్పంచారు. లాల్బాగ్చా రాజా భారీ విగ్రహాన్ని గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్తో ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహం తర్వాత వస్తున్న తొలి వినాయక చవితి కావడంతో స్వర్ణ కిరీటాన్ని తన ఇష్ట దైవానికి అందించినట్లు తెలుస్తోంది. -
ఐకానిక్ లాల్బాగ్చా రాజా వినాయకుడికి, అనంత్ అంబానీ బంగారు కానుక
గణేష్ ఉత్సవాలకు మహారాష్ట్రలోని ముంబై నగరం పెట్టింది పేరు. అందులోనూ ముంబైలోని ఐకానిక్ లాల్బాగ్చా రాజా వినాయక ఉత్సవం మరింత స్పెషల్గా ఉంటుంది. ఇప్పటికే లాల్బాగ్చా రాజా వినాయకుడి ఫస్ట్లుక్ను విడుదల చేశారు. తాజాగా పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ, గణనాథునిపై తమ భక్తిని, గౌరవాన్ని మరోసారి ఘనంగా చాటుకున్నారు. ముఖ్యంగా అనంత అంబానీ, రాధిక వివాహం తర్వాత తొలి వినాయక చవితి కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.నవ వరుడు అనంత్ అంబానీ ముంబైలోని వినాయకుడికి ఘనమైన కానుకను బహూకరించారు. 20 కేజీల బంగారు కిరీటాన్ని గణేషుడికి బహుమతిగా ఇచ్చారు. దీని విలువ రూ.15 కోట్లు. ఈ కిరీటాన్ని దాదాపు 2 నెలల కష్టపడి తయారు చేసినట్లు కమిటీ వెల్లడించింది. సంప్రదాయ మెరూన్ కలర్ దుస్తుల్లో విలువైన ఆభరణాలకు తోడు ఈ ఏడాది బంగారు కిరీటంతో భక్తుల పూజలందుకోనున్నాడు గణేశుడు.కాగా 'కింగ్ ఆఫ్ లాల్బాగ్' అని పిలిచే లాల్బాగ్చా రాజా ముంబైలో అత్యధికంగా సందర్శించే గణేష్ మంటపం. ప్రతీ సంవత్సరం వేలాది మంది భక్తులు తరలివస్తారు. గత పదిహేనేళ్లుగా అనంత్ అంబానీ లాల్బాగ్చా రాజా కమిటీకి మద్దతుగా నిలుస్తున్నారు అనంత్ అంబానీ.लालबागचा राजाचे, प्रसिद्धी माध्यमांसाठी फोटो सेशन गुरुवार दिनांक 5 सप्टेंबर 2024 रोजी संध्याकाळी ठिक 7 वाजता करण्यात आले आहे. त्या वेळेची क्षणचित्रे.#lalbaugcharaja Exclusive live on YouTube :https://t.co/XAHhCLjBM6 pic.twitter.com/fg07hI096z— Lalbaugcha Raja (@LalbaugchaRaja) September 5, 2024 -
పారిస్లో కొత్తజంట..అథ్లెట్ల గురించి ఏం చెబుతున్నారంటే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు, కోడలు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పారిస్ ఒలింపిక్స్లో సందడి చేశారు. భారత క్రీడాకారుల మ్యాచ్లు వీక్షించిన అనంతరం ఈ నవ దంపతులు మీడియాతో మాట్లాడారు. ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెట్లు మరిన్ని పథకాలు సాధిస్తారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ..‘దేవుడి దయతో భారత క్రీడాకారులు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. ఇండియా చాలా పతకాలు సాధిస్తుందని అనుకుంటున్నాను. భారత అథ్లెట్లు ప్రతి ఇండియన్ గర్వపడేలా చేస్తారని విశ్వసిస్తున్నాను’ అన్నారు. అనంత్ భార్య రాధిక మర్చంట్ మాట్లాడుతూ..‘పారిస్ ఒలింపిక్స్లో మొదటి ఇండియా మ్యాచ్ని వీక్షించినందుకు చాలా సంతోషంగా ఉంది. భారత్ ఆటగాళ్ల తీరు అద్భుతంగా ఉంది. మరింత ఉత్సాహంతో పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధిస్తారని నమ్ముతున్నాను. ఈ క్రీడల వల్ల చాలామంది యువకులు స్ఫూర్తి పొందుతున్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: బ్యాంకు సర్వీస్ ప్రొవైడర్పై ర్యాన్సమ్వేర్ దాడి!పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అక్కడ రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఇండియా హౌజ్’ పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారత సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా దాన్ని రూపొందించారు. రిలయన్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, ఐవోఏ సభ్యురాలు నీతా అంబానీ ఇటీవల ఇండియా హౌజ్లో భారతీయ క్రీడాకారుల విజయాలను సెలబ్రేట్ చేశారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటికే రెండు పతకాలతో స్టార్ షూటర్ సరబ్జోత్ సింగ్, మనుభాకర్ పారిస్లో విజయఢంకా మోగించారు.#WATCH | #ParisOlympics2024 | Reliance Industries Chairman Mukesh Ambani's son Anant Ambani says, "I am sure that with god's grace, the Indian team will perform very well and we will win many medals. I am sure the Indian team will make every Indian like me proud."Anant Ambani's… pic.twitter.com/HzDwTwNsKn— ANI (@ANI) July 31, 2024 -
ప్యారిస్ ఒలింపిక్స్ : లవ్బర్డ్స్ సందడి, వీడియో వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్నకుమారుడు, కోడలు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్యారిస్ ఒలింపిక్స్లో సందడి చేశారు. గతనెలలో(జూలై 12)న వివాహ బంధంతో ఒక్కటైన లవ్బర్డ్స్ వివాహ వేడుకలతరువాత విశ్వక్రీడా సంరంభం ఒలింపిక్స్ గ్యాలరీలో జంటగా మెరిసారు. అనంత్-రాధిక ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ప్యారిస్ ఒలింపిక్స్ వేడుకల్లో ఆసియా కుబేరుడుముఖేష్ అంబానీ, ఈషా అంబానీ, ఆమె భర్త ఆనంద్ పిరామిల్ పాల్గొంటున్నవీడియో కూడా సందడిగామారింది. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ అయిన నీతా ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్న ప్రాంగణంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన తొలి ఇండియా హౌజ్ లాంచ్ చేశారు. భారతీయ టెక్స్టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్కు చెందిన వస్తువులు, ఇతక కళాఖండాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంటాయి. అలాగే భారత స్టార్ షూటర్ సరబ్జోత్ సింగ్, మనుభాకర్ను నీతా అంబానీ ప్రత్యేకంగా అభినందించి, వారితో సెల్పీలు దిగి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) -
నాలుక అబద్ధం చెప్పదు..
నీర్ దోసె అంటే నూనె వేయకుండా పెనం మీద నీటిని చల్లి వేసే దోసె. మైసూర్ మసాలా దోసె, రసం ఇడ్లీ, టొమాటో ఉప్మా, ఆనియన్ ఊతప్పం... ఇవన్నీ మనకు తెలిసినవే, ఖోట్టో... ఇది ఇడ్లీ పిండిని పనస ఆకులతో అల్లిన బుట్టలో వేసి ఆవిరి మీద ఉడికించే వంటకం. ఈ దక్షిణాది రుచుల పేరు చెబితే ముంబయి వాసుల నోట్లో నీళ్లూరతాయి. క్రికెట్ ప్లేయర్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్లు ఈ రుచుల కోసం ముంబయి నగరం, మాతుంగలో ఉన్న మైసూర్ కేఫ్ను విజిట్ చేసేవాళ్లు.స్వాతంత్య్రానికి ముందు 1936 నుంచి ముంబయిలో స్టవ్ వెలిగించిన ఈ కేఫ్కి గవాస్కర్, సచిన్ల కంటే ముందు ఏ ప్రముఖులు క్యూ కట్టారో తెలియదు. కొత్త పెళ్లికొడుకు అనంత్ అంబానీ ఆదివారాలు ఇక్కడే గడిచేవని ఇటీవల తెలిసింది. తన పెళ్లి వేడుకలో ఈ కేఫ్ స్టాల్ కూడా పెట్టించారు. వధువు రాధికా మర్చంట్కు ఈ కేఫ్ నిర్వహకురాలు శాంతెరీ నాయక్ను చూపిస్తూ ‘మీట్ మైసూర్ కేఫ్ ఓనర్’ అని పరిచయం చేశాడు. వధువు ఆ పెద్దావిడపాదాలను తాకి నమస్కరించింది. ఈ వీడియోతో శాంతెరీ ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది.టూర్లో ‘టేస్ట్’ చూస్తాను..ముంబయి నగరం, మాతుంగ ఏరియాలో కింగ్స్ సర్కిల్ రైల్వేస్టేషన్ దగ్గర ఉంది మైసూర్ కేఫ్. శాంతెరీ నాయక్ మామగారు నాగేశ్ రామ నాయక్ ఈ కేఫ్ను స్థాపించాడు. కర్నాటక నుంచి ముంబయిలో అడుగు పెట్టి ఆహారమే తన కుటుంబానికి అన్నం పెడుతుందని నమ్మారాయన. ఆ నమ్మకాన్ని నిలబెట్టారు శాంతెరీ నాయక్. ఇప్పుడామె కుమారుడు నరేశ్ నాయక్ సహాయంతో కేఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘బెస్ట్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్’ అనే ప్రజల ప్రశంసలే ఆమె అందుకున్న పురస్కారాలు. వివిధ ప్రదేశాలను పర్యటించడం ఆమె హాబీ. పర్యటనలో భాగంగా ఆయా ప్రదేశాల్లో ఏయే ఆహారాలు అందుబాటులో ఉంటున్నాయి, పర్యాటకులు ఏ రుచులను ఎక్కువ గా ఇష్టపడుతున్నారో గమనిస్తూ, వాటిని రుచి చూస్తానని చె΄్తారామె.కస్టమర్ అభిప్రాయమే తుదితీర్పు..‘‘వంటలను ఇష్టపడడమే నా సక్సెస్ ఫార్ములా. అమ్మకు సహాయం చేసే క్రమంలోనే రుచిగా వండడంలో మెళకువలు తెలిశాయి. అమ్మ వండిన పదార్థాలను ఇంటికి వచ్చిన అతిథులకు వడ్డించే బాధ్యత కూడా నాదే. వాళ్లకు ఏది నచ్చిందో అర్థమయ్యేది. అదే ఫార్ములాను కేఫ్ నిర్వహణలోనూ అనుసరించాను. మన ఉద్యోగులను నమ్మాలి, అంతకంటే ఎక్కువగా కస్టమర్లను నమ్మాలి. రుచి, అభిరుచుల విషయంలో కస్టమర్ల నోటి నుంచి వచ్చిన మాటే వేదవాక్కు. పదార్థాల రుచిని ఆస్వాదించిన నాలుక ఫీడ్ బ్యాక్ విషయంలో అబద్ధం చెప్పదు’’ అంటారు శాంతెరీ నాయక్. డెబ్బైఏళ్ల వయసులో కూడా చురుగ్గా, కేఫ్ నిర్వహణ పట్ల శ్రద్ధగా ఉన్నారామె. వార్థక్యం దేహానికి మాత్రమే, మనసుకు కాదు, పనిచేసే మనస్తత్వానికి కాదని నిరూపిస్తున్నారు శాంతెరీ నాయక్. -
అది ఫేక్ న్యూస్.. అంబానీ బుక్ చేసుకోలేదు
జులై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వివాహం ముంబైలో ఎంతో వైభవంగా జరిగింది. అంబానీ ఇంట జరిగిన ఈ వేడుకలకు ప్రముఖ సెలబ్రిటీలు, పారిశ్రామిక దిగ్గజాలు, ఇతర దేశాల ప్రముఖులు హాజరయ్యారు. వీరి పెళ్ళికి సుమారు ఐదు వేలకోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం.అనంత్, రాధికల వివాహానంతరం లండన్కు వెళ్లనున్నట్లు పలు మీడియా సంస్థలు ఇటీవల నివేదించాయి. అయితే వారు అక్కడ ఉండటానికి ప్రముఖ 7 స్టార్ లగ్జరీ హోటల్ & గోల్ఫింగ్ ఎస్టేట్ స్టోక్ పార్క్ను రెండు నెలలకు బుక్ చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ ఇందులో ఎటువంటి నిజం లేదని స్టోక్ పార్క్ తన సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.సాధారణంగా మేము ప్రైవేట్ విషయాలపై స్పందించము. కానీ ఇటీవల వస్తున్న పుకార్లలో ఎటువంటి నిజం లేదని మీడియాలలో వస్తున్న పుకార్లలో నైజం లేదని స్టోక్ పార్క్ వెల్లడించింది. మొత్తానికి అంబానీ లండన్లో స్టోక్ పార్క్ బుక్ చేయలేదని స్పష్టమైపోయింది. View this post on Instagram A post shared by Stoke Park (@stokepark) -
అనంత్ పెళ్లిలో హైలెట్గా ఏనుగు ఆకారపు డైమండ్ బ్రూచ్..ఆ డిజైన్లోనే ఎందుకంటే..!
ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ రాధికల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకలో వాళ్లు ధరించే దుస్తలు దగ్గర నుంచి డ్రస్లు, కార్లు అన్ని హైలెట్గా నిలిచాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే..ఆ వివాహ వేడుకలో అంబానీలంతా పైజామకు ధరించిన ఏనుగు ఆకారపు డైమండ్ పతకం అత్యంత హైలెట్గా నిలిచింది. ముఖేశ్తో సహా అనంత్, ఆకాశ్ అందరూ ఈ ఆకారపు ఆభరణాన్నే ధరించారు. దీని వెనుక దాగున్న ఆసక్తికర స్టోరీ ఏంటని అక్కడున్న వాళ్లందరూ చర్చించుకున్నారు. ఎందుకిలా వారంతా ఆ జంతువు ఆకృతిలో డిజైన్ చేసిన ఆభరణం ధరించారంటే..ఈ ఆభరణాన్ని కాంతిలాల్ ఛోటాలాల రూపొందించారు. అనంత్ అమిత జంతు ప్రేమికుడు. అతని వెంచర్ వంతారాలో వన్యప్రాణులు సంరక్షణ కోసం అనంత్ ఎంతగానో కేర్ తీసుకుంటాడు. అందుకు నిదర్శనంగా ఇలా ఏనుగు ఆకారపు డైమండ్ బ్రోచ్లను సదరు ఆభరణాల వ్యాపారులు తయారు చేశారు. నీతా అంబానీ సూచన మేరకు ఇలా అంబానీ కుటుంబంలోని మగవాళ్లంతా ధరించేలా ఏనుగు ఆకారపు ఆభరణాలను రూపొందించారట. ఈ పతకం జామ్నగర్లోని వంటరా వద్ద వన్య ప్రాణుల సంరక్షణ కోసం అనంత్ చేస్తున్న కృషికి గుర్తుగా ఇలాంటి వజ్రాలతో రూపొందించిన ఏనుగు ఆకారపు బ్రోచెస్ తయారు చేసినట్లు ఆభరణ వ్యాపారులు చెప్పుకొచ్చారు. అలాగే ఈ ఆభరణాన్ని రూపొందించడంతో నీతా కూడా తమకు సహకారం అందించినట్లు తెలిపారు. అనంత్కి మాత్రమే గాక ఆమె మనవడికి ఏనుగులంటే మహా ఇష్టమని చెబుతున్నారు. ఇక్కడ అంబానీలు ధరించే బ్రూచ్ గంభీరమైన అరణ్యాన్ని ప్రదర్శించేలా పచ్చలు, వజ్రాలతో ఏనుగు ఆకృతిలో ఈ ఆభరణాన్ని అందంగా తీర్చిదిద్దారు. View this post on Instagram A post shared by Kantilal Chhotalal (@kantilalchhotalal)(చదవండి: స్టైల్ ఐకాన్ నటాషా పూనావాలా గ్లాస్ మాదిరి పర్సు ధర ఎంతంటే..?) -
అయిందా.. బాగయిందా.. అంబానీని కూడా వదిలిపెట్టవా? (ఫోటోలు)
-
అనంత్ అంబానీ బూండీ జాకెట్..రియల్ గోల్డ్తో ఏకంగా 110 గంటలు..!
అనంత్ రాధికల వివాహ వేడుకలు అత్యంత ఘనంగా ముగిశాయి. అయితే ఆ వేడుకులో అంబానీ కుటుంబ సభ్యలు ధరించిన నగలు, డిజైనర్ వేర్లు గురించి నెట్టింట హాట్టాపిక్గా నిలిచాయి. ఇంతవరకు నీతా, ఇషా, రాధికల డిజైనర్ వేర్లు, నగలు గురించి విన్నాం. కానీ అనంత్ ధరించిన డ్రస్ కూడా అత్యంత ఖరీదైనదే గాక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. భారతీయ హస్తకళను అంబానీలు గౌరవిస్తారు అనేలా వారి ధరించే ప్రతి డిజైనర్వేర్లో కచ్చితంగా ఎంబ్రాయిడరీ ఉంటుంది. అదీ కూడా భారత పురాత సంప్రదాయ ఎంబ్రాయిడరీ మెళుకువలే ఎక్కుగా ఉండటం విశేషం. అనంత్ తన వివాహ వేడుకలో మనీష్ మల్హోత్రా డిజైనర్ వేర్ బూండీ జాకెట్ని ధరించాడు. దీనిపై చేతితో ఎంబ్రాయిడరీ చేసిన డిజైన్ ఉంటుంది. దీన్ని నిమైన బంగారంతో అలంకరించారు. రాజస్థాన్లోని నాథద్వారా ఆలయానికి సంబంధించిన పిచ్వాయ్ పేయింటింగ్ ఆధారంగా రూపొందించారు. ఇది కృష్ణుడి జీవితంలోని ఇతివృత్తాలను వర్ణిస్తుంది. ఇందులో తామరలు, చెట్లు, ఆవులు, నెమళ్లు తదితరాలు ఉంటాయి. ముగ్గురు భిల్వారా కళాకారులచే 600 గంటలకు పైగా కష్టపడి రూపొందించారు. దీనిపై సుమారు 100 రియల్ బంగారు ఆకులను వినియోగించారు. View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) ఇంతకీ పిచ్వై ఆర్ట్వర్క్ అంటే..పిచ్వాయ్ పెయింటింగ్ అనేది రాజస్థాన్లోని నాథద్వారా నుంచి ఉద్భవించిన సాంప్రదాయ భారతీయ కళారూపం. ఇది ప్రధానంగా శ్రీకృష్ణుని ఆరాధనతో ముడిపడి ఉంది. ముఖ్యంగా శ్రీనాథ్జీగా అతని అభివ్యక్తిలో. ఈ క్లిష్టమైన పెయింటింగ్లు సాధారణంగా వస్త్రంపై వేస్తారు. వాటిని ఆలయ హాంగింగ్లుగా ఉపయోగిస్తారు అని ప్రొఫెసర్ ఫులారి పంచుకున్నారు.పిచ్వాయ్ పెయింటింగ్స్ చరిత్ర 17వ శతాబ్దానికి చెందినది. ఈ సంప్రదాయం నాథద్వారాలో ప్రారంభమయ్యింది. ఇది హిందూమతంలోని పుష్టిమార్గ్ శాఖ అనుచరులకు ప్రముఖ పుణ్యక్షేత్రం. భక్తుల కోసం కృష్ణుడి కథలను దృశ్యమానంగా వివరించే లక్ష్యంతో, కృష్ణుడి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను చిత్రీకరించేలా ఆలయ కళాకారులు చిత్రలేఖనాలు సృష్టించారు. కాలక్రమేణా ఈ సంప్రదాయం పరిణామం చెందింది. కళాకారులు తమ నైపుణ్యాలను తమ తరాలకు అందించి ఈ కళను నిలిచిపోయేలా చేశారు. ఈ ఆర్ట్లో ఉండే ప్రత్యేకత క్లిష్టమైన వివరాలు, శక్తిమంతమైన రంగులు. ముఖ్యంగా కళారూపంలో కృష్ణుడితో కూడిన విస్తృతమైన దృశ్యాలను రూపొందించే అద్భుతమైన కుంచె పని ఉంటుంది. దీనిలో తరచుగా గోపికలు, ఆవులు, తామరలు, అతని దివ్య నాటకం (లీలలు) తదితర చిహ్నాలు ఉంటాయి. అందుకోసం ఖనిజాలు, కూరగాయల నుంచి తయారు చేసిన సహజ రంగులను ఉపయోగించడంతో ఆ ఆర్ట్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుందని ప్రొఫెసర్ ఫులారి వివరించారు. అయితే ఈ పెయింటింగ్ మరింత హైలెట్ అయ్యేలా ఒక్కోసారి 24 క్యారెట్ల బంగారాన్ని వినియోగిస్తుంటారని కూడా చెప్పారు. ఈ కళ దృశ్యమాన ఆనందాన్నే కాకుండా ఆధ్యాత్మిక అనుభవాన్ని కూడా అందిస్తుంది. (చదవండి: ఇదేం వింత చట్టం! భార్య పుట్టినరోజు మర్చిపోవడమే నేరమా..!)