auto driver
-
ఆటో డ్రైవర్ చెంపదెబ్బ..కుప్పకూలిన మాజీ ఎమ్మెల్యే
బెంగళూరు:కర్ణాటక బెలగావిలో విషాదఘటన జరిగింది. గోవాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సూర్యాజీ(68) మమ్లేదార్ బెలగావిలో ఖాడే బజార్లోని ఓ లాడ్జి బుక్ చేసుకున్నారు. లాడ్జికి కారులో వస్తుండగా అక్కడి ఇరుకైన రోడ్డులో చిన్న ప్రమాదం జరిగింది. సూర్యాజీ కారు ఓ ఆటోను చిన్నగా ఢీకొట్టింది. ఆటోకు పెద్ద నష్టమేమీ జరగకపోయినా ఆ ఆటో డ్రైవర్ సూర్యాజీతో గొడవకు దిగాడు.ఈ గొడవలో సూర్యాజీని ఆ ఆటో డ్రైవర్ చెంపపై కొట్టాడు. ఇది ఇక్కడితో ముగిసిన తర్వాత సూర్యాజీ లాడ్జికి చేరుకుని మెట్లు ఎక్కి తన గదిలోకి వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా సూర్యాజీ చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. సూర్యాజీ చనిపోవడానికి గల కారణాలను డాక్టర్లు వెల్లడించాల్సి ఉంది. పోలీసులు ఆటో డ్రైవర్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆటో డ్రైవర్తో గొడవతో పాటు సూర్యాజీ కుప్పకూలిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో నమోదయ్యాయి. కాగా, సూర్యాజీ గోవాలోని పొండా నియోజకవర్గానికి 2012 నుంచి 2017 దాకా ఎమ్మెల్యేగా పనిచేయడం గమనార్హం. -
భార్య పుట్టింటికి వెళ్లిందని ఆటోడ్రైవర్ సంబరం
బొమ్మనహళ్లి: బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ ఒకరు తన భార్య పుట్టింటికి వెళ్లడంతో తనకు సంతోషంగా ఉందని పోస్టర్ను తన ఆటోకి వేసుకొని తన ఆటోలో ఎక్కిన ప్రయాణికులకు బిస్కెట్లు పంపిణీ చేసిన సంఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. దానిని ఒక ప్రయాణికుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం అది చక్కర్లు కొడుతోంది. ఆటో డ్రైవర్ తన ఆటోలో ఉన్న తన సీటు వెనుకాల పోస్టర్ను కన్నడతోపాటు ఇంగ్లిష్లో వేయడంతో పాటు దాని పక్కనే బిస్కెట్లు పెట్టి తన ఆటో ఎక్కిన వారికి వాటిని ఇవ్వడంతో పాటు సంతోషం వ్యక్తం చేశాడు. దాంతో ఒక ప్రయాణికుడు ఆటో డ్రైవర్ సంతోషాన్ని చూసి దానిని సోషల్ మీడియాలో పెట్టాడు. దాంతో ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. View this post on Instagram A post shared by EPIC MEDIA (@_epic69) -
చుక్కలు పాడిన చక్కటి పాట..!
బిటిష్ రాక్ బ్యాండ్ ‘కోల్డ్ ప్లే’ వరల్డ్ టూర్తో హల్చల్ చేస్తోంది, మన దేశంలోనూ ప్రదర్శన ఇచ్చింది. ఒకప్పటి ‘యూనివర్శిటీ కాలేజ్ లండన్’ మిత్రులు ‘కోల్డ్ ప్లే’గా సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు.సేఫ్టీ, యెల్లోలాంటి ఆల్బమ్లతో శ్రోతలకు దగ్గరయ్యారు. లైవ్ పెర్ఫార్మెన్స్లో తమదైన ప్రత్యేకత చాటుకున్నారు.ఇటీవల అహ్మదాబాద్కు చెందిన ఆటోడ్రైవర్ ‘కోల్డ్ ప్లే’ హిట్ సాంగ్ ‘స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్’ పాడి నెటిజనుల చేత వారెవా అనిపించుకున్నాడు. కొందరైతే ‘కోల్డ్ ప్లే తదుపరి కచేరిలో ప్రత్యేక స్థానానికి ఇతడు అర్హుడు’ అని ప్రశంసించారు.‘నేను కోల్డ్ ప్లేకు వీరాభిమానిని’ అంటున్నాడు ఆటోడ్రైవర్. ‘స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్’ మనం కూడా ఒకసారి పాడుకుందాం....కాజ్ యూ ఆర్ ఏ స్కై/ కాజ్ యూ ఆర్ ఏ స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్ఐయామ్ గొన్నా గివ్ యూ మై హార్ట్/ కాజ్ యూ లైట్ అప్ ది పాఐ డోన్ట్ కేర్ కాజ్ యూ ఆర్ ఏ స్కై View this post on Instagram A post shared by Navendu (@chasing.nothing) (చదవండి: బ్రకోలి ఆరోగ్యానికి మంచిదని కొనేస్తున్నారా..?) -
విజయ్ పార్టీలో ఆటో డ్రైవర్కు కీలక పదవి
సాక్షి, చెన్నై: నాగరిక రాజకీయం అంటూ ముందుకు సాగుతున్న తమిళగ వెట్రి కళగం నేత విజయ్ తన పార్టీ రూపు రేఖలను వినూత్నంగా తీర్చిదిద్దుతున్నారు. సూట్ కేసులతో విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే వారిని పక్కన పెట్టి, తన అభిమానిగా చేసిన సేవలకు గుర్తింపు ఇస్తున్నారు. ఇందులో భాగంగా చెన్నైలో ఓ జిల్లాకు ఆటోడ్రైవర్ను కార్యదర్శిగా నియమించారు. కోయంబత్తూరులో దివ్యాంగుడికి జిల్లా కార్యదర్శి పదవి కేటాయించారు. గృహిణిగా ఉన్న తన వీరాభిమానికి రామనాధపురం జిల్లా కార్యదర్శి పదవి అప్పగించారు. వివరాలు.. తమిళగ వెట్రి కళగం ఆవిర్భావం, జెండా ఆవిష్కరణ, మహానాడు నిర్వహణ అంటూ అన్నీ వినూత్నంగా విజయ్ నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 2026 అసెంబ్లీ ఎన్నికలే తన లక్ష్యం అంటూ ముందుకు సాగుతున్న ఆయన ప్రజా ప్రయాణానికి శ్రీకారం చుట్టినా, ఇంకా పూర్తిస్థాయిలో రాజకీయాలతో ప్రజలలోకి చొచ్చుకెళ్లలేదు. ఇందుకోసం కసరత్తులు జరుగుతున్నాయి. అదే సమయంలో పార్టీ పరంగా జిల్లాల కమిటీల ఏర్పాటును విస్తృతం చేశారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, కొన్ని చోట్ల రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక జిల్లా, మరికొన్ని చోట్ల మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక జిల్లాను తీర్చిదిద్ది కమిటీలను ప్రకటిస్తూ వస్తున్నారు. ఒక్కో జిల్లాకు ఒక కార్యదర్శి, ఒక సంయుక్త కార్యదర్శి, ఒక సహాయ కార్యదర్శి, ఒక కోశాధికారితో పాటూ 10 మంది సర్వ సభ్య సమావేశం సభ్యులను నియమిస్తున్నారు. ఈ పది మందిలోనూ నలుగురు మహిళలను తప్పనిసరిగా నియమిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు విడతలుగా కార్యదర్శులు జాబితాను విడుదల చేశారు. ప్రతి విడతలతోనూ 19 చొప్పున జిల్లాలకు కమిటీలు ఉంటూ వచ్చాయి.సాధారణ కార్యకర్తలకు గుర్తింపు ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు తన అభిమాన సంఘాల్లో శ్రమిస్తున్న సాదాసీదా వ్యక్తులను గుర్తించి వారికి పదవులు అప్పగిస్తుండటం విశేషం. ఇందులో భాగంగా దక్షిణ చెన్నై ఉత్తర జిల్లా కార్యదర్శి టీ నగర్కు చెందిన కె. అప్పును నియమించారు. ఈ అప్పు ఆటో డ్రైవర్, రోజు వారి ఆటో నడపడం ద్వారా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. విజయ్ను గుండెల్లో పెట్టుకుని ఆయనే సర్వం అని ముందుకెళ్తూ వచ్చిన అప్పుకు పార్టీలో గుర్తింపు కల్పించారు. జిల్లా కార్యదర్శి పదవి అప్పగించి, రాజకీయ ప్రయాణానికి అవసరమయ్యే అన్ని బాధ్యతలను పార్టీ చూసుకునే దిశగా ఏర్పాట్లు చేయడం విశేషం. అలాగే, కోయంబత్తూరు తూర్పు జిల్లా కార్యదర్శిగా దివ్యాంగుడైన బాబును నియమించారు. మూడు చక్రాల వాహనంలో తిరుగుతూ విజయ్ కోసం ప్రాణాలరి్పంచేందుకు సిద్ధం అని చెప్పుకుంటూ వచ్చిన బాబును గుర్తించి పదవి అప్పగించడం మరో విశేషం. ఇక, తనకు వీరాభిమానిగా ఉన్న గృహిణి మలర్ వెలి జయబాలను గుర్తించి రామనాథపురం జిల్లా కార్యదర్శి పదవిని అప్పగించారు. పదవులు తమకంటే తమకు ఇవ్వాలని అనేక మంది తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తుంటే, తనకు నిజమైన సేవకులుగా ఉండే వారిని గుర్తించి విజయ్ పదవులను అప్పగిస్తుండడం గమనార్హం. విజయ్ అభిమానాన్ని చూస్తారేగానీ, నోట్లను, షూట్ కేసులను కాదు అని ఆటో డ్రైవర్ అప్పు పేర్కొంటున్నారు. తన లాంటి వారికి రాజకీయ గుర్తింపు కలి్పంచే విధంగా పదవి అప్పగించిన విజయ్ను సీఎం చేయడమే లక్ష్యంగా శ్రమిస్తానని దివ్యాంగుడైన బాబు పేర్కొంటున్నారు. -
ఆటో డ్రైవర్ కిరాతకం.. మహిళపై అత్యాచారం
ముంబై: ఇరవై ఏళ్ల మహిళపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్ును ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నలసోపరా నివాసి అయిన మహిళ మంగళవారం అర్థరాత్రి గోరేగావ్లోని రైల్వే స్టేషన్ సమీపంలో కనిపించింది. అయితే ఒక ఆటోను బుక్ చేసుకున్న ఆ మహిళకి ఆటో డ్రైవర్ మాయ మాటలు చెప్పి అర్నాలా బీచ్కు తీసుకెళ్లాడు. తొలుత ఒక హోటల్కు తీసుకెళ్లదామని ప్లాన్ చేసిన ఆటో ్డ్రైవర్.. ఆ మహిళ వద్ద సరైన గుర్తింపు ాకార్డులు లేకపోవడంతో హోటల్ రూమ్ ఇవ్వలేదు. ాదాంతో అక్కడ్నుంచి ఆ మహిళని నేరుగా బీచ్కు తీసుకెళ్లాడు. ఆ మహిళ ఇంటికి సరిగ్గా 12 కి.ీమీ ఉంటుందని పోలీసులు తమ ివిచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.ప్రైవేట్ పార్ట్స్ లో సర్జికల్ బ్లేడ్, రాళ్లుఆ ుమహిళపై అత్యాచారానికి పాల్పడిన అనంతరం నిందితుడిగా భావిస్తున్న ఆటో డ్రైవర్.. ఆమె ప్రైవేట్ పార్ట్స్లో సర్జికల్ బ్లేడ్ తో పాటు రాళ్లను చొప్పించినట్లు గుర్తించారు. ఈ ఘటన తర్వాత తనకు విపరీతమైన నొప్పి రావడంతో ఆమె స్థానిక పోలీసుల్ని సంప్రదించింది. దాంతో సదరు మహిళని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా, సర్జికల్ బ్లేడ్, రాళ్లతో సహా ఇతర వస్తువులను ఆమె ప్రైవేట్ భాగాలలో బలవంతంగా చొప్పించినట్లు వెల్లడైంది. వైద్యులు విజయవంతంగా వస్తువులను తొలగించినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఆటో డ్రైవర్ ను శుక్రవారం అదుపులోకి తీసుకుని అత్యాచారం కేసు నమోదు చేశారు.ఆ మహిళపై గతంలో రెండుసార్లు అత్యాచారంఅయితే ఆ మహిళపై గతంలో కూడా అత్యాచారం జరిగిన విషయాన్ని ఆమె తండ్రి తమకు చెప్పినట్లు ోపోలీసులు పేర్కొన్నారు. 2023లో ముంబై నిర్మలా నగర్ శివాజీ నగర్లో ఆమె అత్యాచారానికి గురైన విషయాన్ని పోలీసులు తెలిపారు.ఆమె మానసిక పరిస్థితి బాగాలేకనే..!ఆ మహిళ మానసిక పరిస్థితిపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మానసిక పరిస్థితి బాగా లేకనే ఆమె పలుమార్లు అత్యాచారానికి ుగురై ఉండవచ్చినదే పోలీసుల అనుమానం. -
ఆటో డ్రైవర్ను కలిసిన సైఫ్ అలీఖాన్.. ఎంత నగదు ఇచ్చారంటే?
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. సైఫ్పై దాడి జరిగిన తర్వాత ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానా తన ఆటోలోనే లీలావత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. సకాలంలో ఆస్పత్రికి చేరుకోవడంతో సైఫ్కు ప్రాణాపాయం తప్పింది. దీంతో ఆటో డ్రైవర్ను పలువురు అభినందించారు.ఈనెల 16న సైఫ్ ఇంట్లోకి చోరీకి యత్నించిన వ్యక్తి హీరోపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్కు తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వెంటనే సైఫ్ ఆస్పత్రికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ సమయంలో సైఫ్ను ఆటోలో ముంబయిలోని లీలావతికి తీసుకెళ్లారు భజన్ సింగ్. ఆ సమయంలో అతనెవరో తాను గుర్తు పట్టలేదన్నారు. సకాలంలో ఆస్పత్రికి చేర్చడమే తన లక్ష్యంగా ఆటో నడిపినట్లు భజన్ సింగ్ వెల్లడించారు. అయితే సైఫ్ ప్రాణాలు కాపాడిన భజన్ సింగ్కు ముంబయికి చెందిన ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ అందించింది. సైఫ్ ఆర్థిక సాయం..తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్కు సైఫ్ అలీ ఖాన్ ఆర్థిక సాయమందించారు. తనవంతుగా రూ.50 వేలను భజన్ సింగ్ రానాకు అంద జేశారు. ఈ సందర్భంగా ఆపద సమయంలో తనను రక్షించినందుకు అతనికి సైఫ్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే అంతకు ముందు తన ఆటోలో వచ్చింది సైఫ్ అలీఖాన్ అని తెలియదని.. వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని భజన్ సింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.నిందితుడి అరెస్ట్.. సైఫ్ అలీఖాన్పై దాడి చేసిన నిందిచతుడి ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్కు చెందిన మహమ్మద్ షరీఫుల్గా అతన్ని గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన కోర్టులో హాజరు పరచగా ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. దీంతో పోలీసులు అతనితో పాటు సైఫ్ ఇంటికి వెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. -
వెంటాడి మరీ.. పట్టపగలే హనుమకొండలో దారుణం
హనుమకొండ, సాక్షి: పట్టపగలే నగరంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం పోయేలా చేసింది. అందరూ చూస్తుండగా.. వెంటాడి మరీ అతన్ని కిరాతకంగా హత్య చేశారు. హనుమకొండలో బుధవారం దారుణం చోటు చేసుకుంది.ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరు వ్యక్తులు తమలో తాము గొడవ పడ్డారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగడంతో హత్యకు దారి తీసింది. మాచర్ల రాజ్కుమార్, ఏనుగు వెంకటేశ్వర్లు ఆటోడ్రైవర్లు. ఈ ఇద్దరికీ స్థానికంగా ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది.అయితే ఈ విషయమై ఇద్దరు నడిరోడ్డుపై వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోవెంకటేశ్వర్లు రాజ్కుమార్ను వెంబడించాడు. సుబేదారి డీమార్ట్ ఎదురుగా దొరకబుచ్చుకుని దారుణంగా చంపాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృత దేహాన్ని.. ఎంజీఎంకు తరలించారు. ఆపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
సైఫ్ అలీ ఖాన్పై దాడి.. ఆటో డ్రైవర్కు పారితోషికం ఎంత ఇచ్చారంటే? (ఫోటోలు)
-
సైఫ్ అలీ ఖాన్ను గుర్తు పట్టలేదు.. డబ్బులు కూడా తీసుకోలేదు: ఆటో డ్రైవర్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సైఫ్ ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇంట్లో చోరికి యత్నించిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని 30 ఏళ్ల బంగ్లాదేశీయునిగా(Bangladesh) పోలీసులు గుర్తించారు. అతని అసలు పేరు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్. భారత్ వచ్చాక బిజయ్ దాస్గా పేరు మార్చుకున్నాడని అధికారులు తెలిపారు.అయితే దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ను ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తండ్రిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆటో డ్రైవర్ వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తెలిపారు. అయితే సైఫ్ను రక్షించినందుకు అతనికి ముంబయిలోని ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ఆ రోజు రాత్రి జరిగిన విషయాన్ని వెల్లడించారు. తాను ఆటోలో వెళ్తండగా ఓ మహిళ ఆగండి అంటూ గట్టిగా అరిచిందని.. దీంతో వెంటనే యూ టర్న్ తీసుకుని బిల్డింగ్ గేట్ దగ్గరికి వచ్చానని తెలిపాడు. అక్కడి రాగానే ఆ వ్యక్తి దుస్తులంతా ఎర్రగా రక్తంతో తడిసిపోయి ఉన్నాయి.. అప్పుడు సమయం దాదాపు 2 గంటల 45 నిమిషాలవుతోందని అతను వివరించాడు. రోడ్డు పూర్తిగా నిర్మానుష్యంగా ఉండడంతో.. బాంద్రా వెస్ట్ నుంచి టర్నర్ రోడ్, హిల్ రోడ్ ద్వారా లీలావతి హాస్పిటల్కు చేరుకున్నాం. వారివెంట వచ్చిన పిల్లవాడు మధ్యలో కూర్చున్నాడు.. అతని కుడి వైపున గాయపడిన వ్యక్తి (సైఫ్) కూర్చున్నాడు.. కానీ రాత్రి కావడంతో నేను అతన్ని గుర్తించలేకపోయాను.. వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేరుకోవడమే లక్ష్యంగా ఆటోను నడిపినట్లు వెల్లడించారు. -
హైదరాబాద్లో హత్య.. కోదాడలో శవం
కోదాడ: సామాజిక మాధ్యమంలో చురుగ్గా ఉండే ఓ బాలిక చేసిన తప్పిదం ఆమె తల్లిదండ్రులను హంతకులుగా మార్చగా, మరో యువకుడు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఈ ఏడాది మార్చి నెలలో హైదరాబాద్లో హత్యకు గురై.. నాగార్జునసాగర్ కాలువలో శవంగా తేలిన యువకుడి కేసును పోలీసులు తొమ్మిది నెలల తర్వాత ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన ఓ కారు డ్రైవర్ తన భార్యతో కలిసి బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్కు వలసవచ్చి జగద్గిరిగుట్ట సమీపంలో నివాసముంటున్నారు. వీరికి 10వ తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే సదరు బాలిక తరచూ రీల్స్ చేస్తూ పోస్ట్ చేసేది. ఈ పోస్టులను బోరబండకు చెందిన వివాహితుడైన ఆటో డ్రైవర్ కుమార్ గమనించి ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి పరిచయం పెంచుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో కుమార్ బాలికకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లి ఒక దగ్గర బంధించాడు. ట్యాబ్ సాయంతో కనిపెట్టి.. తమ కుమార్తె కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని భావించారు. ఈ క్రమంలో బాలిక ట్యాబ్ను ఓపెన్ చేసి కుమార్తో చేసిన చాటింగ్ను గుర్తించారు. దీంతో బాలిక తల్లి మరో స్త్రీగా సామాజిక మాధ్యమంలో ఆటో డ్రైవర్ కుమార్తో పరిచయం పెంచుకుని తమ ఇంటికి ఆహ్వానించింది. ఆటోలో కుమార్ జగద్గిరిగుట్టకు వచ్చాడు. కుమార్ రాగానే అతడిని బంధించి తమ కుమార్తె ఆచూకీ చెప్పాలని ప్రాధేయపడ్డారు. ఎంత బతిమిలాడినా కుమార్ ఆచూకీ చెప్పకపోవడంతో అతడిపై తీవ్రంగా దాడి చేశారు. ఆ దాడిలో కుమార్ అపస్మారకస్థితికి చేరడంతో అతడి కాళ్లు, చేతులు కట్టేసి కారులో విజయవాడ వైపు తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో మునగాల వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న నాగార్జునసాగర్ ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద ముక్త్యాల మేజర్ కాలువలో కుమార్ను పడేసి తిరిగి హైదరాబాద్కు వెళ్లిపోయారు. కుమార్ మృతదేహం కోదాడ సమీపంలోని బాలాజీనగర్ వద్ద కాలువ ఒడ్డుకు చేరింది. పోలీసులు గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి స్థానిక కొమరబండ చెరువు అంచున ఖననం చేశారు. టెక్నాలజీ పట్టించింది.. మార్చిలో జరిగిన ఈ ఘటన తర్వాత బాలిక తల్లిదండ్రులు హైదరాబాద్ చేరుకుని తమకు ఏమీ తెలియనట్లు వారి పనులు వారు చేసుకోసాగారు. సదరు బాలిక కూడా హైదరాబాద్లోని నింబోలిఅడ్డాలోని ఓ అనాథశరణాలయంలో ఉందని తెలుసుకొని ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. కుమార్ కనిపించకపోవడం, ఆటో కూడా దొరక్కపోవడంతో కుమార్ భార్య బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కుమార్ ఆటోకు ఉన్న నంబర్ ప్లేట్ మార్చి సదరు బాలిక తండ్రి ఉపయోగిస్తున్నాడు. దానిపై ఉన్న పేటీఎం క్యూఆర్ కోడ్ను మాత్రం తొలగించలేదు. ఆటోకు ఉన్న ప్రత్యేకమైన బంపర్ను కూడా అలాగే ఉంచారు. ఈ ఆనవాళ్లతో 10 రోజుల క్రితం పోలీసులు ఆటోను పట్టుకొని దానిని ఉపయోగిస్తున్న బాలిక తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య విషయం బయటపడింది. బోరబండ పోలీసులు రెండు రోజుల క్రితం కోదాడకు వచ్చి మృతదేహాన్ని జేసీబీ సాయంతో తవ్వించారు. ఎముకలను డీఎన్ఏ పరీక్షలకు పంపి అది కుమార్ మృతదేహమా.. కాదా అని నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం బాలిక ఒంటరిగా మారగా, కుమార్ భార్య భర్తను కోల్పోయి రోడ్డున పడింది. -
ఆటో రామన్న
-
రోజుకో చావుతో తెలంగాణ తెల్లారుతోంది: రేవంత్ సర్కారుపై కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అసమర్థ పాలనలో తెలంగాణలో రోజుకు ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రలకు బడుగు బలహీన వర్గాలు బలైపోతున్నాయని అన్నారు. రైతులు, ఆటోడ్రైవర్లతోపాటు వివిధ వర్గాలకు చెందిన వారు నిత్యం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్లో స్పందిస్తూ..రోజుకో చావుతో తెలంగాణ తెల్లారుతోందని, కాంగ్రెసోడి కుట్రలకు బలైపోతున్నదని మండిపడ్డారు. రాజ్యహింసతో రాష్ట్రం నిత్యం తల్లడిల్లుతోందని, గాయాలతో గోడుగోడునా విలపిస్తోందని విమర్శించారు. రైతు రారాజుగా బ్రతికిన తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృత్యమాయెనని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధికి చిరునామాగా మారిన రాష్ట్రంలో జీవనోపాధి కరువై బడుగులు బలిపీఠం ఎక్కవట్టెనని ఆయన వాపోయారు. ఇది ఎవడు చేసిన పాపమని, ముమ్మాటికీ మార్పు తీసుకొచ్చిన శాపమేనని పేర్కొన్నారు.రోజుకో చావుతో తెలంగాణ తెల్లారుతోంది కాంగ్రెసోడి కుట్రలకు బలైపోతుంది!రాజ్యహింసతో నిత్యం తల్లడిల్లుతోందిగాయాలతో గోడుగోడునా విలపిస్తోంది!రైతు రారాజుగా బ్రతికిన తెలంగాణలో... అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృత్యమాయే!ఉపాధికి చిరునామాగా మారిన రాష్ట్రంలో..జీవనోపాధి కరువై బడుగులు… pic.twitter.com/KPHWnAg7PN— KTR (@KTRBRS) November 19, 2024 -
మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి
-
ఆటో డ్రైవర్ల ధర్నాకు కేటీఆర్ మద్దతు
-
ఇందిరాపార్క్ వద్దకు ఆటోలో ప్రయాణించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల మహా ధర్నాకు మద్దతు తెలిపిందేందుకు వెళ్లిన ఆయన ఆటోలో ప్రయాణించారు. కేటీఆర్ మొదట నందినగర్లోని తన నివాసం నుంచి కారులో బయలుదేరారు. ఆ తర్వాత కొందరు సీనియర్ నాయకులతో కలిసి ఆటో ఎక్కిన కేటీఆర్ మహాధర్నా వద్దకు చేరుకున్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన ఆటో డ్రైవర్తో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆటో యూనియన్స్ మహాధర్నాకు నాయకత్వం వహిస్తున్న ఆటో కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు పథకం కారణంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామన్న ప్రభుత్వ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.Live: "ఆటో డ్రైవర్ల మహా ధర్నా"కు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS https://t.co/GLu6PB9jbC— BRS Party (@BRSparty) November 5, 2024 తెలంగాణ వచ్చాక ఆటో డ్రైవర్లకు రోజు రూ. 2 వేలు సంపాదిస్తే అన్ని ఖర్చులూ పోను.. 8 వందలు మిగిలేవి. అదే ఇప్పుడు మహాలక్ష్మి పథకంతో 8 వందలు వస్తే ఖర్చులు పోను 2 వందలు మిగలడం లేదు, అధికారంలోకి రాక ముందు గతంలో ఆటోలో తిరిగిన రాహుల్ గాంధీ అన్నారు. అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి 12,000 వేలు ఇస్తాను అన్నారు. కానీ ఏమీ ఇవ్వలేదు. 12 నెలల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు తీర్చిన గ్యారంటీలు ఎన్ని అని ఆలోచన చేయాలి. ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కోలేక ఈ 12 నెలల్లో ఎందరు తనువు చాలించారో లెక్కలతో సహా అసెంబ్లీలో ఇచ్చాం. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నారు. కానీ చేయలేదు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. ఆనాడు కేసీఆ ర్తెచ్చిన ఇన్స్యూరెన్స్ను తొలగించాలి అనుకుంటున్నారు. ఓలా, ఉబర్తో జరుగుతున్న నష్టాన్ని పురిస్తా అన్న మాట మీద ప్రభుత్వం నిలబడాలి.రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది. బయటకు పోతే తంతారు అని.. పోలీసుల బందోబస్తు లేనిది బయటకు పోవుడు కష్టం అన్నట్లు ఉంది. హోమ్ గార్డుతో సహా అందరు పోలీసులు కష్టల్లోనే ఉన్నారు. ఇంకా నాలుగు ఏళ్ల సినిమా ఉంది. జైల్లో పెట్టిన మేము వెనక్కి తగ్గము మీరు మా వెంట ఉండాలి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి అని కోరుతున్నాం. ఏఐటీయూసీతో పాటు అనేక ఆటో కార్మికులు అందరూ వల్ల సమస్యల పట్ల జెండాలు ఒకటవ్వాలి. అసెంబ్లీలో శాసన సభ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. మీ తరుపున మేము కొట్లడతాము. ఆటో కార్మిక ఐక్యత వర్ధిల్లాలి.’ అని తెలిపారు. -
మార్పు కోసం.. ఆటో డ్రైవర్ ఆలోచన..
సాక్షి, హైదరాబాద్: ఆయనో ఆటో డ్రైవర్.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ ఉరుకులు పరుగుల జీవితం.. ఎంతో కష్టపడితే కానీ ఐదు వేళ్లూ నోట్లోకి వెళ్లవు. కానీ ఆయన ఆలోచనలు మాత్రం ప్రతిక్షణం సమాజం గురించే.. సమాజంలో ఉన్న సమస్యలు.. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న విపరీత ధోరణులపై అనుక్షణం ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే యువతలో, సమాజంలో మార్పు తీసుకురావాలని సంకల్పించాడు. అయితే ఓ ఆటోడ్రైవర్.. తాను ఏదో ఒకటి చేయాలని సంకల్పించాడు. తన పరిధిలో ఏం చేయగలనో ఆలోచించాడు. కూడళ్లు, విద్యుత్ స్తంభాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో మనం మారాలి.. మార్పు రావాలి.. అంటూ కొటేషన్స్ రాయడం ప్రారంభించారు. ఆయన పేరు దాడే శ్రీనివాస్.. అంబర్పేటకు చెందిన శ్రీనివాస్.. రెండున్నరేళ్లకు పైగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు.రోజుకో కొటేషన్..వివేకానంద సూక్తులు, వాక్యాలు తనకు ఎంతో స్ఫూర్తినిస్తాయని చెబుతున్నాడు 45 ఏళ్ల శ్రీనివాస్. ఈయనకు దేశ భక్తి కూడా ఎక్కువే. తన ఆటోలో ప్రయాణించే వారు తమ సమస్యలు చెప్పుకొంటుంటే ఎంతో బాధ అనిపించేదని, వీటన్నింటికీ కారణం సమాజంలో పెరుగుతున్న విపరీత ధోరణులే కారణమని పేర్కొంటున్నాడు. ఇక, తల్లిదండ్రులను ఆస్తుల కోసం హింసించడం.. పెద్ద వారిపై గౌరవం లేకుండా ఉండటం వంటివి ఎన్నో ఉదంతాలు చూసి ఆవేదనకు గురయ్యేవాడినని గుర్తు చేసుకున్నాడు. ఇక, యువత చెడు అలవాట్లకు బానిసై విలువలు లేని జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి వారిలో చిన్న మార్పు అయినా వస్తుందనే నమ్మకంతో ఇలా కొటేషన్లు రాస్తున్నానని చెప్పాడు. అలాగే తన ఆటోపై కూడా ప్రతి రోజూ కొత్త కొటేషన్లు రాస్తుంటానని వివరించాడు.చిన్నతనంలోనే నగరానికి.. షాద్నగర్ కుర్వగూడకు చెందిన శ్రీనివాస్ చిన్నతనంలోనే నగరానికి వలస వచ్చాడు. ఇంటరీ్మడియెట్లోనే చదువు ఆపేసిన శ్రీనివాస్.. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిని కూడా చిన్నప్పటి నుంచే మంచి మార్గంలో నిలపాలనే ఉద్దేశంతో ఇంట్లో చిన్న బోర్డు ఏర్పాటు చేసి, దానిపై మంచి సూక్తులు రాసేవాడట. దీంతో వారు కూడా పెద్ద చదువులు చదువుకొని.. మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ధర్మబద్ధంగా, సహనంతో ప్రతి ఒక్కరూ జీవిస్తే సమాజంలో ఉన్న అనేక సమస్యలు రూపుమాపుతాయనేది తన నమ్మకమని చెబుతున్నాడు. -
ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన భార్య!
తొండంగి: కథ అడ్డం తిరిగింది.. ఐదు రోజుల కిందట జరిగిన ఆటో డ్రైవర్ మృతి కేసులో కొత్త కోణం బయట పడింది.. భార్యే ప్రియుడితో కలసి చంపిందని బంధువులు అనుమానిస్తుండగా, వారిద్దరూ పారిపోతుండగా బంధువులు, గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తొండంగి మండలం ఏవీ నగరంలో గురువారం చర్చనీయాంశమైంది. మృతుని సోదరుడు, సోదరి, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఏవీ నగరం గ్రామానికి చెందిన బత్తిన మధుబాబు (38)కు ఇదే గ్రామానికి చెందిన అతని మేనమామ డేగల ప్రకాష్ కుమార్తె శిరీషతో 2014లో వివాహం జరిగింది.వీరికి ఆరేళ్ల జాయ్ అనే పాప ఉంది. ఆటో డ్రైవర్గా మధుబాబు జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి తమ్ముడు కిషోర్, చెల్లెలు ఝాన్సీరాణి ఉన్నారు. తల్లిదండ్రులు చాలాకాలం కిందట మృతి చెందారు. కాగా కిషోర్ కాకినాడ ఆర్టీసీలో మెకానిక్గా చేస్తున్నాడు. శిరీష నర్సుగా కొంత కాలం కిందట కత్తిపూడి రిఫరల్ ఆస్పత్రిలో పనిచేసింది. అక్కడ పనిచేసిన సమయంలో శంఖవరం మండలం శృంగవరం గ్రామానికి చెందిన పీతల ప్రశాంత్తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలిసిన మధుబాబుకు, శిరీషల మధ్య తరచూ మనస్పర్థలు వచ్చాయి. దీంతో భర్తను విడిచి శిరీష హైదరాబాద్లో చెల్లెలు ఇంటికి కుమార్తెను తీసుకుని వెళ్లిపోయింది. 20 రోజుల కిందట శిరీష హైదరాబాద్లో కుమార్తె జాయ్ను ఉంచి మళ్లీ ఏవీ నగరంలోని మధుబాబు ఇంటికి వచ్చింది. ఈ నెల 17న మధుబాబుకు బీపీ తక్కువగా ఉందని కత్తిపూడిలో రిఫరల్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు శిరీష 18న కాకినాడలో ఉంటున్న మరిది కిషోర్కు తెలిపింది. దీంతో ఏవీ నగరంలో తన స్నేహితుడిని ఆస్పత్రికి వెళ్లమని చెప్పి అనంతరం కిషోర్ ఆస్పత్రికి చేరుకున్నాడు. అనంతరం మధుబాబుకు పలు పరీక్షలు చేయాలని వైద్యులు సూచించడంతో శుక్రవారం ఏవీ నగరంలో ఇంటికి వచ్చారు. ఆ రోజంతా ఆరోగ్యంగానే మధుబాబు గ్రామంలో తిరిగాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం ఉదయం చనిపోయాడని శిరీష అతని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. మధుబాబు ఒంటిపై గాయాలున్నట్టు కిషోర్ చూసి శిరీష ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో ఐదు రోజుల అనంతరం బుధవారం అర్ధరాత్రి శిరీషతో అక్రమ సంబంధం ఉన్న పీతల ప్రశాంత్ గ్రామంలోకి రావడం, వీరిద్దరూ పారిపోతుండగా పట్టుకున్నామని మృతుని సోదరుడు కిషోర్, చెల్లెలు భర్త చిన్న తెలిపారు. పట్టుబడిన వారిని పోలీసులకు అప్పగించారు. అక్రమ సంబంధం కారణంగా ప్రియునితో కలసి తన అన్నను హతమార్చారని కిషోర్, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధుబాబు మృతి మిస్టరీగా మారింది.అనుమానాస్పద మృతిగా కేసుఏవీ నగరంలో మధుబాబు మృతిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్టు ఎస్సై జగన్మోహన్రావు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహిస్తామన్నారు. కేసు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. -
కన్నడ టీచర్.. ఈ ఆటోడ్రైవర్
బొమ్మనహళ్లి: బెంగళూరు కర్ణాటక రాజధాని అన్న సంగతి తెలిసిందే. కానీ ఇక్కడ కొన్ని లక్షల మందికి కన్నడ రాదు, తెలియదు. అదే పెద్ద వింత. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చినవారు ఇందులో ఎక్కువ. అటువంటి వారికి కొంచైమెనా కన్నడ కస్తూరి గొప్పతనాన్ని వివరించాలని ఓ ఆటోడ్రైవర్ కంకణం కట్టుకున్నాడు. అతనే బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్ అజ్మల్ సుల్తాన్. ఆటోలో కొన్ని పోస్టర్లను అతికించాడు. అందులో ఆంగ్ల, కన్నడ పదాల అర్థాలు ఉన్నాయి. ఎవరైనా సులభంగా కన్నడను తెలుసుకోవచ్చు. నమస్కార సార్– హెలో సార్, ఎల్లి ఇదిరా– వేర్ ఆర్ యూ?, ఎస్ట్ అయితు– హౌ మచ్?, యూపిఐ ఇదియా క్యాష్ నా– ఈజ్ ఇట్ యుపిఐ, ఆర్ క్యాష్? అనే చిన్న చిన్న పదాలతో పోస్టర్లు ఉన్నాయి. చాలా సరళంగా కన్నడను అర్థం చేసుకోవచ్చని ఆయన చెబుతున్నారు. కన్నడ రానివారు ఆటోలో ఎక్కినప్పుడు గమ్యం చేరేవరకు కొన్ని కన్నడ పదాలను నేర్పించే యత్నం చేస్తానని చెప్పాడు. ఆయన కృషి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఆదరణ పొందుతోంది. -
‘ఆటో’ బతుకులు అస్తవ్యస్థం
సాక్షి, అమరావతి: ‘అటో డ్రైవర్ కె.శివారెడ్డి ఊర్మిళనగర్ రెండో లైనులో అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. ఇటీవల వచ్చిన బుడమేరు వరదలకు ఆ ఇల్లు మునిగిపోయింది. జీవనాధారమైన ఆటోతో పాటు ద్విచక్రవాహనం పూర్తిగా పాడైపోయాయి. సచివాలయ సిబ్బంది వచ్చి వివరాలు నమోదు చేసుకుని వెళ్లారు. కానీ ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా పరిహారం రాలేదు. అప్పు చేసి ఆటోకు మరమ్మతులు చేయించుకుంటే రూ.45 వేలు ఖర్చయింది. ఇంటికిగానీ, వాహనాలకు గానీ పరిహారం ఇప్పించాలంటూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాడు.పదహారేళ్లుగా ఇదే ప్రాంతంలో ఆటో నడుపుతున్న నా పేరు ఎందుకు జాబితాలో లేదని ఎవరిని అడిగినా సమాధానం చెప్పడంలేదని వాపోతున్నాడు.’’...ఇది బుడమేరు వరదల్లో ఆటోలను కోల్పోయిన వేలాది మంది డ్రైవర్ల ఆవేదన. నగరంలో తిరిగే ఆటోలలో అతకధికం సింగ్ నగర్, ఇందిరానాయక్ నగర్, పాయకాపురం, కండ్రిగ, వాంబేకాలనీ, మిల్క్ ప్రాజెక్ట్, డాబా కోట్లు సెంటర్, రాజరాజేశ్వరిపేట, నందమూరి కాలనీ, భరతమాత కాలనీ, ఊరి్మళనగర్ల నుంచే వస్తున్నాయి. అక్కడి నిరుద్యోగులు డ్రైవర్లుగా మారి జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వారందరి జీవితాలు అస్తవ్యస్ధంగా మారాయి. ఈ నేపధ్యంలో ఆ ప్రాంతాల్లో పర్యటించి బాధితుల బతుకు చిత్రంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ ఇది.మరమ్మతులకు కొత్త అప్పులురోజుల తరబడి ముంపులోనే ఉండటంతో ఆటోలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బయట మెకానిక్ దగ్గర నుంచి కంపెనీ షోరూమ్ వరకూ ఒక్కో దాని మరమ్మతులకే రూ.12 వేల నుంచి రూ.75 వేల వరకూ వ్యయం అవుతోంది. రేడియేటర్, ఇంజిన్, బ్యాటరీతో పాటు బీఎస్ 6 వాహనాల్లో సెన్సార్లు పాడవ్వడంతో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇన్ని వాహనాలకు మరమ్మతులు చేసేందుకు మెకానిక్ల కొరత ఉండటంతో రోజుల తరబడి మోటార్ షెడ్ల వద్దే ఆటోలు పడి ఉంటున్నాయి. ఒకసారి మరమ్మతు చేసినా మళ్లీ మళ్లీ కొత్త లోపాలు బయటపడుతున్నాయి. దీంతో కొత్త అప్పులు చేసి మరమ్మతులకు వెచి్చస్తున్నారు. ఉపాధి లేక, కుటుంబాలను పోషించుకోలేక, వాయిదాలు కట్టలేక అవస్థలు పడుతున్నామని డ్రైవర్లు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఓట్లేయించుకున్న రాష్ట్ర ప్రభుత్వంగానీ, స్థానిక ప్రజాప్రతినిధులుగానీ తమను అసలు పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు.బీమా సంస్థల కొర్రీలువరద నీటిలో మునిగిన ఆటోలకు క్లెయిమ్లు ఎగవేసేందుకు బీమా సంస్థలు ఉన్న అన్ని అవకాశాలనూ వాడుకుంటున్నాయి. బీమా చేసే సమయంలో డ్రైవర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి తెలియని షరతులను పొందుపరిచి వాటిని ఇప్పుడు సాకుగా చూపిస్తున్నాయి. ఒక ఆటోకి బీమా రావాలంటే సుమారు రెండు నెలలు సమయం పడుతుందని తప్పించుకుంటున్నాయి. అదికూడా వరద వచి్చనప్పటి నుంచి ప్రతి దశలోనూ తీసిన ఫొటోలు, వీడియోలు ఉంటేనే బీమా వర్తిస్తుందని మెలికపెడుతున్నాయి.ప్రాణాలే కాపాడుకుంటామా, ఫొటోలు తీస్తామా అంటూ బాధితులు అడుగుతుంటే బీమా సంస్థలు సమాధానం చెప్పడం లేదు. రెండు వారాల్లోనే క్లెయిమ్లు పూర్తి చేసేలా బీమా సంస్థలతో మాట్లాడామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. ఆచరణలో మాత్రం అది శూన్యం. బీమా సంస్థలు కనీసం 45 రోజుల పాటు ఆటోను ఉన్న చోటు నుంచి కదపకుండా ఉంచాలని చెప్పాయి. అప్పటి వరకూ మరమ్మతు చేయకపోతే మొత్తానికే పనికిరాదని, ప్రభుత్వం ఈ విషయంలో పట్టించుకోవడం లేదని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు.పరిహారం లేదురాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సెప్టెంబర్ 1న విజయవాడలో వదర విలయం సృష్టించింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారి జీవనాధారాలైన ఆటోలు, మోటార్ సైకిళ్లు వరద నీటిలో పూర్తిగా మునిపోయాయి. రోజుల తరబడి బురద నీటిలోనే నానిపోవడంతో ఇంజిన్, సెన్సార్లు,కార్బొరేటర్ వంటి ముఖ్యమైన భాగాలు దెబ్బతిన్నాయి. ఆటోకి రూ.10 వేలు, ద్విచక్ర వాహనానికి రూ.3 వేలు చొప్పున పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం రకరకాల కొర్రీలతో మూడొంతుల మందిని మోసం చేసింది. ఆటో నడిపితేగానీ పూటగడవని నిరుపేదలు వాటిని బాగు చేసుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక ప్రభుత్వ కార్యాలయాలు,అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. బుడమేరు వరదల వల్ల దాదాపు 15 వేలకుపైగా అటోలు నీట మునిగితే ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం కేవలం 6,515 మాత్రమే ఉన్నట్టు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో 4,348 ఆటోలకు పరిహారం అందించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేశారు. కానీ వాస్తవానికి మొత్తం బాధితుల్లో దాదాపు 80 శాతం మంది ఆటోవాలాలకు నష్టం పరిహారం అందలేదని బాధితులు చెబుతున్నారు. చాలా మంది పేర్లు బాధితుల జాబితాలోనే లేవు..కొందరి పేర్లు ఉన్నా వారికి డబ్బులు పడలేదు.ఎవరూ పట్టించుకోవట్లేదు‘‘వరదల్లో ఇల్లు మునిగిపోయింది. ఆటో బాగా బెబ్బతింది. ప్రస్తుతానికి నడిచేలా చేయడానికి రూ.8 వేలు ఖర్చయ్యింది. ప్రభుత్వం రూ.10 వేల ఇస్తామని చెప్పింది. కానీ మా వివరాలను నమోదు చేయడానికి కూడా ఎవరూ రాలేదు. సచివాలయంలో అడిగితే కలెక్టరేట్కు వెళ్లమని చెప్పారు. అక్కడికి వెళితే ఎవరూ పట్టించుకోవడం లేదు.’’ –లింగయ్య, ఆటో డ్రైవర్, రాజీవ్నగర్ కాలనీజీవనాధారం పోతే పరిహారం రాదా?‘‘ఆటో నడిపితేగానీ మా కుటుంబం నడవదు. వరదల వల్ల ఆటో మునిగిపోయి జీవనాధారాన్ని కోల్పోయాం. బీమా రావాలంటే 45 రోజులు ఆటోను వాడకూడదంటున్నారు. బాగు చేయించుకునే స్తోమత కూడా లేదు. అయినా జాబితాలో మా పేరు లేదంటున్నారు. సచివాలయానికి వెళ్లి అడిగితే తమకేమీ తెలియని చెబుతున్నారు. మా గోడును ఎవరికి చెప్పుకోవాలి. మమ్మల్ని ఆదుకునేవారెవరు.’’ –బాబ్జి, ఆటో డ్రైవర్, రాజరాజేశ్వరిపేటఅద్దె ఆటోనే ఆధారం‘‘నేను ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతున్నాను. వరదకు ఆటో మునిగిపోయింది. ఎలాంటి పరిహారం రాలేదు. ఎవరిని అడిగినా ఎలాంటి ఉపయోగం లేదు.ఏం చేయాలో తెలియడం లేదు.’’ –దుర్గారావు, ఆటో డ్రైవర్, వాంబేకాలనీ.చాలా ఖర్చవుతోంది‘ఇంటర్ చదివి ఆటో నడుపుతున్నాను. మా నాన్న కూడా ఆటో డ్రైవరే. రెండు ఆటోలూ వరదలో మునిగిపోయాయి.ఒక సారి రిపేరుకి రూ.12 వేలు ఖర్చయ్యింది. కానీ మళ్లీ రేడియేటర్ పాడయ్యింది. నాలుగు రోజులుగా మెకానిక్ దగ్గరే పెట్టి బాగుచేయిస్తున్నాం.’’ –వై.సాయి, ఆటో డ్రైవర్, పాయకాపురం. -
వాచీలోనే క్యూఆర్ కోడ్... అదిరిందయ్యా ఆటో డ్రైవర్!
బెంగళూరుకు చెందిన ఈ ‘స్మార్ట్’ఆటో డ్రైవర్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందనలు అందుకున్నాడు. ఎందుకంటే మనవాడు యూపీఐ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ స్మార్ట్ వాచ్ను వాడుతున్నాడు మరి! సదరు ఫొటోను ఓ నెటిజన్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశాడు. దాంతో అది తెగ వైరలవుతోంది. అలా రైల్వే మంత్రి దృష్టినీ ఆకర్షించింది. ఆ ఫోటోను ఆయన రీట్వీట్ చేశారు. ‘యూపీఐ కా స్వాగ్! చెల్లింపులు మరింత సులువయ్యాయి’అంటూ కామెట్ చేశారు. ఆటోడ్రైవర్కు సోషల్ మీడియాలో ప్రశంసలు వెలులవెత్తుతున్నాయి. ఐటీలో ట్రెండ్ సెట్టర్ అయిన బెంగళూరు ఆ సాంకేతిక పరిజ్ఞానం వాడకంలోనూ ట్రెండ్ సెట్ చేస్తోందంటూ యూజర్లు కామెంట్ చేస్తున్నారు. ‘నవ భారత ముఖచిత్రమిది’అని ఒకరు, ‘డిజిటల్ ఇండియా మ్యాజిక్’అని మరొకరు పోస్ట్ చేశారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2016లో ప్రారంభించిన యూపీఐ బ్యాంకుల మధ్య తక్షణ బదిలీలకు వీలు కలి్పంచడం ద్వారా చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యువతిపై ఓలా డ్రైవర్ దాడి, స్పందించిన ఓలా: వీడియో వైరల్
బెంగళూరులో ఓలా ఆటో డ్రైవర్ ఒక యువతిపై అనుచితంగా ప్రవర్తించి, దుర్బాషలాడి, దాడిచేసిన ఘటన కలకలం రేపింది. బుధవారం జరిగినఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. బాధిత యువతి ఎక్స్లో షేర్ చేసిన వివరాల ప్రకారం తన స్నేహితురాలితో కలిసి బెంగళూరు సిటీలో ఓలా ఆటో రైడ్ను బుక్ చేసుకున్నారు. తొందరగా వెళ్లాలనే ఉద్దేశంలో ఇద్దరూ ఓలా రైడ్ కోసం ప్రయత్నించగా ఇద్దరివీ బుక్ అయ్యాయి. ఇదే వివాదానికి దారి తీసింది. ముందుగా వచ్చిన ఆటోలో యువతులిద్దరూ ఎక్కి కూర్చున్నారు. ఇంతలో 15 నిమిషాలు ఆలస్యం చూపించిన రెండో ఆటోను రద్దు చేసింది. కానీ అక్కడికి చేరుకున్న రెండో ఆటోవాలా తన రైడ్ ఎందుకు క్యాన్సిల్ చేశారంటూ వాదనకు దిగాడు. అంతేకాదు పెట్రోల్ ఊరికే వస్తుందా, అంటూ రెచ్చిపోయాడు. అంతటితో ఆగలేదు దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి దిగాడు ఆటో డ్రైవర్. దీంతో నన్ను చెంపపై ఎందుకు కొట్టావ్ అంటూ ఆమె గట్టిగా నిలదీసింది. అప్పటిదాకా చోద్యం చూస్తూ కూర్చున్న మిగిలిన డ్రైవర్లు, జోక్యం చేసుకుని అతగాడిని పక్కకు తీసుకెళ్లారు.Yesterday I faced severe harassment and was physically assaulted by your auto driver in Bangalore after a simple ride cancellation. Despite reporting, your customer support has been unresponsive. Immediate action is needed! @Olacabs @ola_supports @BlrCityPolice pic.twitter.com/iTkXFKDMS7— Niti (@nihihiti) September 4, 2024కాగా బాధిత యువతి నితి తన నిరాశను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది. ఓలా కస్టమర్ సపోర్ట్ ఫిర్యాదు చేసినా, ఆటోమేటెడ్ ప్రత్యుత్తరాలు మాత్రమే అందాయి తప్ప, అంతకుమించి ఎలాంటి స్పందన లేదని ట్వీట్ చేసింది. తన స్నేహితురాలు క్లాస్ మిస్ కాకుండా చూసుకోవడానికి రెండు ఆటోలను బుక్ చేసుకోవడం మాత్రమే తమ తప్పు అని, రైడ్ రద్దుపై వివాదాలు సర్వసాధారణమైనప్పటికీ, డ్రైవర్ బెదిరింపులు, అమానుష ప్రవర్తన హద్దు మీరిందంటూ ఆగ్రహం చేసింది. అయితే దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.ఓలా స్పందనఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై ఓలా స్పందించింది. డ్రైవర్ చర్యలను ఖండిస్తోంది. నిందితుడైన డ్రైవర్పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అటువంటి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి తమ ప్రయాణీకుల భద్రతకు భరోసాకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. -
'ఆ తల్లి గొప్ప యోధురాలు': 55 ఏళ్ల వయసులో..!
ఓ ఒంటరి తల్లి రెస్ట్ తీససుకునే వయసులో ఆటో నడుపుతూ ఎందరికో ప్రేరణగా నిలిచింది. చెట్టంత కొడుకు ఉండి కూడా అనాథలా తన పొట్ట పోషించుకోవడానికి ఆటో డ్రైవర్గా మారాల్సి వచ్చింది. అందులో ఎదురయ్యే సవాళ్లను లెక్కచేయకుండా యోధురాలి వలే రాత్రిళ్లు కూడా ఆటో నడుపుతోంది. పైగా అడుక్కోవడం తప్పుగాని పనిచేసుకుని బతకడం తప్పుకాదని చెబుతుండటం విశేషం. అందుకు సబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో 55 ఏళ్ల ఓ మహిళ ఆటోను నడుపుతున్నట్లు కనిపిస్తుంది. ఆటో డ్రైవర్గా అర్థరాత్రి సమయాల్లో తిరగడం కష్టమైనా ఉక్కు సంకల్పంతో ధీశాలిగా ఆటోని నడుపుకుంటూ వెళ్లడం విశేషం. తన కొడుకు తనను గౌరవించకపోగా డబ్బుకోసం తనతో గొడపడుతున్నాడనే విషయాన్ని చెప్పుకొచ్చింది. బహుశా నా పెంపకంలోని లోపం అయ్యి ఉండొచ్చని బాధగా చెప్పింది. ఆమె తన భర్తను కోల్పోవడం వల్ల ఇలా రోడ్డు మీదకు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ వృత్తి చేసేందుకు నామూషీగా అనిపించలేదా అని అడగగా..అడుక్కోవడం సిగ్గు కానీ, ఏదో పనిచేసుకుంటున్నప్పుడూ సిగ్గు ఎందుకు అని ఎదురు ప్రశ్న వేస్తోంది. కష్టాల్లో కూడా సానుకూల దృక్పథంతో వ్యవహరించిన తీరు ఎందరికో స్ఫూర్తినిస్తుంది. అందుకు సంబంధించిన వీడియోని ఆయుష్ గోస్వామి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆ ఆ తల్లి గొప్ప యోధురాలు అని, మరికొందరూ..ఆమె కొడుకు మనిషిగా విఫలమయ్యాడు అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ayush Goswami | Business (@aapkartekyaho) (చదవండి: 'అమ్మ చేతి వంటే కంఫర్ట్ ఫుడ్'..!) -
జైనూరులో ఉద్రిక్తత
సాక్షి, ఆసిఫాబాద్/సాక్షి, హైదరాబాద్: గత ఆదివారం ఓ మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం చేయడంతో పాటు హత్యకు ప్రయతి్నంచిన ఘటన మంగళవారం వెలుగులోకి రావడం, బాధిత వర్గం పెద్దయెత్తున ఆందోళనకు దిగడంతో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు బుధవారం ఉదయం నిందితుడి ఇళ్లు, ఆటోను తగలబెట్టడంతో మొదలైన విధ్వంసం సాయంత్రం వరకూ కొనసాగింది. పట్టణంలో బంద్కు పిలుపునిచ్చిన బాధిత వర్గం మరో వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. వారికి చెందిన రెండు ప్రార్థనా మందిరాల్లో ఫర్నిచర్ కొందరు ధ్వంసం చేశారు. నాయకులపై దాడి చేయడమే కాకుండా వారి ఇళ్లపై రాళ్ల వర్షం కురిపించారు. ఇళ్లల్లోకి చొరబడి సామాగ్రి పగులగొట్టారు. కార్లు, మాక్సీ క్యాబ్లు, బైక్లను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. 100కు పైగా దుకాణాలను తగులబెట్టారు. నిందితుడికి చెందిన వర్గం జైనూరు వదిలి మైదాన ప్రాంతానికి తరలి పోవాలని డిమాండ్ చేశారు. వేలాది మంది బాధిత వర్గం వారు పట్టణంలోకి చేరుకుని ఒక్కసారిగా విధ్వంసానికి పాల్పడడం, ఇంకోవైపు మరోవర్గం కూడా కొన్నిచోట్ల దాడులకు దిగడంతో వారిని నిలువరించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. కాగా జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు నేతృత్వంలో బాధిత వర్గాన్ని శాంతింప జేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇరువర్గాల వారు సంయమనం పాటించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఒక ప్రకటనలో కోరారు. బాధితురాలికి మంత్రి సీతక్క పరామర్శ గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జైనూరు బాధితురాలిని మంత్రి సీతక్క పరామర్శించారు. మరింత మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. స్థానిక యువత సంయమనం పాటించాలని కోరారు. కాగా కాలేయ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం షాపెల్లి గ్రామానికి చెందిన ముద్రబోయిన రఘును కూడా మంత్రి పరామర్శించారు.1,000 మంది పోలీసులు, ఆర్ఏఎఫ్తో బందోబస్తు: డీజీపీజైనూరులో జిల్లా యంత్రాంగం కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించిందని డీజీపీ జితేందర్ తెలిపారు. మహిళపై అత్యాచారయత్నం, హత్యాయత్నం ఘటనతో జైనూరులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లు బుధవారం ఒక ప్రకటనలో ఆయన వెల్లడించారు. దాడులు, ప్రతిదాడులతో పరిస్థితి చేయి దాటుతుండడంతో ఆదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, జగిత్యాల, తెలంగాణ స్పెషల్ పోలీసు ప్లాటూన్స్ కలిసి మొత్తం 1,000 మంది పోలీసులను, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను రంగంలోకి దింపినట్లు తెలిపారు. జైనూరులో పరిస్థితిని తనతో పాటు అదనపు డీజీ (శాంతిభద్రతలు), నార్త్ జోన్ ఐజీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్నెట్పై నిషేధం విధించామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీజీపీ వెల్లడించారు. -
Hyderabad: గచ్చిబౌలిలో కిడ్నాప్ కలకలం
హైదరాబాద్, సాక్షి: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేయడానికి ఓ వ్యక్తి యత్నించాడు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ అప్రమత్తం కావటంతో ప్రమాదం తప్పింది. కొండాపూర్ మజీద్ బండలో ఓ ప్రైవేట్ స్కూల్కి వెళ్లేందుకు పిల్లలు ఆటో కోసం చూశారు. అయితే.. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ పిల్లలు చేయిపట్టుకొని ఆటోలో ఎక్కించాడు. అనంతరం ఆటో మజీద్ బండ స్మశానవాటికవైపు వేళ్తుండటంతో అనుమానం వచ్చిన చిన్నారులు ఆ వ్యక్తిని ప్రశ్నించారు. అప్రమత్తం అయిన ఆటో డ్రైవర్ పిల్లలతో పాటు ఉన్న కిడ్నాపర్ పట్టుకొని సమీపంలో ట్రాఫిక్ పోలీసులకు అప్పగించాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ చందానగర్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఉదయం 9 గంటలకు చందానగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన చిన్నారులు సుమారు 8 గంటల పాటు స్టేషన్లో ఉన్నారు. కిడ్నప్ ఘటనస్ధలం తమ పరిధిలోకి రాదంటూ సాయంత్రం గచ్చిబౌలీ పోలీసులకు అప్పగించారు. సకాలంలో స్పందించి తమ పిల్లలను కిడ్నాపర్ నుంచి రక్షించిన ఆటో డ్రైవర్ను పిల్లల కుటుంబ సభ్యులు అభినందించారు. కిడ్నాపర్ను అదుపులోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. -
నీళ్లలో మత్తు మందు ఇచ్చి.. నర్సింగ్ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అఘాయిత్యం
ముంబై: మహిళలపై నిత్యం జరుగుతున్న అఘాయిత్యాలు తీవ్ర ఆందోళనలు రెకేత్తిస్తున్నాయి. కోల్కతా ఘటన తరువాత ఇంకా ఎక్కువయ్యాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో లైంగిక వేధింపుల ఘటనలు నమోదు కాగా.. తాజాగా మరో నర్సింగ్ విద్యార్ధిపై అత్యాచారానికి పాల్పడిన ఉదంతం వెలుగుచూసింది.మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం విధులు పూర్తి చేసుకొని యువతి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రత్నగిరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సింగ్ విద్యార్థిని ఆటోలో ఇంటికి బయల్దేరింది. మార్గమధ్యలో డ్రైవర్ను నీళ్లు అడగ్గా.. అతను తాగే నీటిలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. దీంతో యువతి స్పృహ కోల్పోయి పడిపోయింది. అక్కడి నుంచి ఆమెను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.చంపక్ గ్రౌండ్ సమీపంలో తీవ్ర గాయాలతో బాధితురాలు అపస్మారక స్థితిలో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. యువతికి అనేక గాయాలైనట్లు వైద్యులు తెలపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.ఈ ఘటన రత్నగిరిలో కలకలం రేపింది. ఈ కేసులో సత్వర చర్యలు తీసుకోవాలని, నేరానికి పాల్పడిన నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ నర్సులు, ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రి వెలుపల నిరసనలు చేపట్టారు.