convicted
-
ట్రంప్కు బేడీలు
-
బెయిల్ కాదు.. జైలు
సాక్షి, హైదరాబాద్: ‘జైలు కాదు.. బెయిల్’అన్న సుప్రీంకోర్టు న్యాయసూత్రం ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. దేశంలోని జైళ్లలో మగ్గుతున్న వారిలో రెండింట మూడో వంతు విచారణ ఖైదీలే. బెయిల్ లాంటి అంశాల్లో సత్వర విచారణ జరపాలని న్యాయ కోవిదులు చెబుతున్నా అమలు మాత్రం ఆమడ దూరం అన్నట్టుగానే ఉంది. బెయిల్ వచ్చినా ఆర్థిక స్తోమత లేక, పూచీకత్తు ఇచ్చేవారు లేక విడుదలకు నోచుకోని వారు కూడా ఉండటం మరింత దారుణం.విచారణ జరిగి శిక్షపడే నాటికి.. వారికి పడే శిక్షాకాలం కూడా పూర్తవుతున్న వారు కొందరు ఉండగా, ఆ తర్వాత నిర్దోషులుగా విడుదలవుతున్న వారు మరికొందరు. అంటే నేరం చేయకున్నా కొందరు జైళ్లలో మగ్గుతున్నారన్న మాట. ఏళ్లుగా జైళ్లలో ఉండి ఆ తర్వాత నిర్దోషులుగా విడుదలైనా.. వారి జీవితం, కుటుంబాలు ఆగమైనట్టే కదా అనేది బాధితుల వాదన. మరి ఈ విచారణ ఖైదీల సమస్యకు పరిష్కారం ఎప్పుడు.. ఎలా.. అన్నది ప్రశ్నార్థకం. అయితే గత నెల జైలు అధికారులకు సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు కొంత ఉపశమనం కలిగించనున్నాయి. యువతే అధికం... విచారణ ఖైదీల్లో అత్యధికం యువతే. 2022 గణాంకాలను పరిశీలిస్తే.. 18–30 ఏళ్ల మధ్య ఖైదీలు 2,15,471 మంది ఉండగా, 30–50 ఏళ్ల మధ్య 1,73,876 మంది ఉన్నారు. మొత్తం 4,34,302 విచారణ ఖైదీల్లో రెండింట మూడోవంతు(66శాతం) యువతే ఉండటం గమనార్హం.విచారణా ఖైదీల హక్కులు.. ⇒సత్వర విచారణ పొందేందుకు అర్హులు ⇒హింస, అమానవీయ ప్రవర్తనకు గురికాకుండా హక్కు ఉంటుంది ళీ సరైన కారణాలను అందించకపోతే జైలు నుంచి కోర్టుకు తరలించేటప్పుడు సంకెళ్లు వేయడానికి వీలులేదు. ⇒కేసు విషయంలో కోర్టుకు దరఖాస్తు చేసుకొని ఉచిత న్యాయ సేవలు పొందవచ్చు. ⇒అరెస్టు చేసే సమయంలో వారి కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడికి తెలియజేయాలి. ⇒నిర్దిష్ట భద్రతా ప్రమాణాలకు లోబడి కుటుంబ సభ్యులకు ఖైదీని సందర్శించే అవకాశం.సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. 2023లో, అంతకుముందు.. ‘జైలు కాదు.. బెయిల్’అనే సూత్రం ప్రమాణంగా విచారణ సాగాలి. విచారణ ఖైదీలతో జైళ్లు కిక్కిరిసిపోవడం న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఒక వ్యక్తిని కోర్టులో నిలబెట్టి, దోషిగా నిరూపించాలని పోలీసులు ఎక్కువగా భావిస్తున్నారు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయం ప్రమాదకరం. ఇది పేద, బలహీన వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బెయిల్ పొందినా ఆర్థిక స్తోమత, పూచీకత్తు ఇచ్చేవారు లేక చాలా మంది జైళ్లలోనే మగ్గుతున్నారు. ఈ కారణాలతో జైళ్లలో సంఖ్య పెరిగిపోతోంది. 2024, ఆగస్టులో... దేశవ్యాప్తంగా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్న అండర్ ట్రయల్ ఖైదీలను త్వరితగతిన విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని జైళ్ల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేస్తున్నాం. కొత్త క్రిమినల్ న్యాయచట్టం భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని సెక్షన్ 479 ప్రకారం సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలి. మూడు నెలల్లోగా అండర్ ట్రయల్ ఖైదీల దరఖాస్తులను ప్రాసెస్ చేయాలి. అయితే, ఈ నిబంధన మరణశిక్ష లేదా జీవిత ఖైదు వంటి ఘోరమైన నేరాలకు పాల్పడిన అండర్ ట్రయల్లకు వర్తించదు. – సుప్రీంకోర్టుఅండర్ ట్రయల్ ఖైదీలకు లీగల్ డిఫెన్స్ కౌన్సిల్స్ ద్వారా న్యాయ సాయం అందిస్తాం. దీని కోసం జైళ్లకు కూడా వెళతాం. న్యాయ సాయం కావాల్సిన వారికి న్యాయవాదులను ఏర్పాటు చేస్తాం. బెయిల్ వచి్చన తర్వాత ఒకవేళ పెద్ద మొత్తంలో షూరిటీలు చెల్లించలేని వారు ఉంటే.. కోర్టును సంప్రదించి ఆ మొత్తాన్ని తగ్గించేలా తోడ్పాటునందిస్తాం. –తెలంగాణ లీగల్ సరీ్వసెస్ అథారిటీ -
నేను అధ్యక్షుడినే కాదు.. తండ్రిని కూడా: జో బైడెన్
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్(54)ను గన్ కోనుగోలు కేసులో మొత్తం మూడు ఆరోపణల్లోనూ కోర్టు దోషిగా తేల్చింది. 2018లో గన్ కొనుగోలు చేసిన సమయంలో డ్రగ్స్కు బానిసకాదంటూ ఆయుధ డీలర్కు అబద్దం చెప్పారని, ఆ గన్ను 11 రోజుల పాటు అక్రమంగా తన వద్దే ఉంచుకున్నాడని న్యాయమూర్తులు నిర్ధారించారు. తన కుమారుడి కేసుపై తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు.‘‘నేను అమెరికాకు అధ్యక్షుడిని. కానీ, నేను కూడా ఒక తండ్రిని. ఈ కేసుకు సంబంధించి హంటర్ ఆప్పీల్ను పరిగణలోకి తీసుకున్నందుకు న్యాయపరమైన ప్రక్రియను గౌరవిస్తాను’’ అని జోబైడెన్ అన్నారు. దీంతో క్రిమినల్ కేసులో దోషిగా తేలిన కుమారుడిని కలిగి ఉన్న తొలి అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్గా నిలవటం గమనార్హం.ఇక.. ఈ కేసు విచారించిన డెలావెర్లోని ఫెడరల్ కోర్టు జడ్జి మేరీ ఎల్లెన్ నొరీకా మాత్రం హంటర్కు 120 రోజుల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో పూర్తి తీర్పు అక్టోబర్లో వెలువడనుందని చెప్పారు. సాధారణంగా ఇలాంటి నేరాలకు గరిష్టంగా 25 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశాలు ఉన్నాయి. హంటర్ బైడెన్పై మరో కేసు కూడా ఉంది. పన్ను ఎగ్గొట్టిన ఆరోపణలపై కాలిఫోర్నియా కోర్టు సెప్టెంటర్లో విచారణ జరపనుంది. -
Hush money case: డొనాల్డ్ ట్రంప్ దోషి
న్యూయార్క్/వాషింగ్టన్: ఒక కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(77) అప్రతిష్ట మూటగట్టుకున్నారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్కు 1.30 లక్షల డాలర్లు అక్రమంగా చెల్లించి, బిజినెస్ రికార్డులు తారుమారు చేసిన కేసులో న్యూయార్క్ కోర్టు ఆయనను దోషిగా తేలి్చంది. ట్రంప్పై నమోదైన 34 తీవ్ర అభియోగాలన్నీ రుజువయ్యాయని వెల్లడించింది. జూలై 11న న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వడంతోపాటు శిక్ష ఖరారు చేయనుంది. ఈ వ్యవహారంలో ట్రంప్కు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. శిక్ష పడినప్పటికీ.. మరో ఆరు నెలల్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ పోటీ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు కాబోవని అంచనా వేస్తున్నారు. న్యూయార్క్ కోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. కోర్టు బయట ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ న్యాయమూర్తి అవినీతికి పాల్పడి తప్పుడు తీర్పు ఇచ్చారని విమర్శించారు. ఇక్కడేం జరిగిందో ప్రజలకు తెలుసని చెప్పారు. అసలైన తీర్పును నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజలు ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు. తాను నిజాయతీపరుడినని, ఎలాంటి తప్పూ చేయలేదని పేర్కొన్నారు. అమెరికా కోసం, అమెరికా రాజ్యాంగం కోసం పోరాటం కొనసాగిస్తానని వెల్లడించారు. ఈ పోరాటంలో అంతిమ విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. హష్ మనీ కేసులో దోషిగా తేలిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ నిబ్బరంగానే కనిపించారు. కోర్టులో నిశ్శబ్దంగా ఉండిపోయారు. తుది తీర్పు వచ్చేదాకా బెయిల్పై బయటే ఉంటారు. జూలై 11న శిక్ష ఖరారు కానుంది. నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారైంది. జూలై 15న మిల్వాకీలో రిపబ్లికన్ జాతీయ సదస్సులో ట్రంప్ అభ్యరి్థత్వాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(81)తో డొనాల్డ్ ట్రంప్ తలపడతారు. కోర్టు తీర్పుపై బైడెన్–కమలా హారిస్ ప్రచార విభాగం ప్రతినిధి, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మైఖేల్ టైలర్ హర్షం వ్యక్తం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని న్యూయార్క్ కోర్టు తేల్చిచెప్పిందని అన్నారు ఏమిటీ కేసు? శృంగార తార స్టార్మీ డేనియల్తో ట్రంప్ సన్నిహితంగా గడిపినట్లు వార్తలొచ్చాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరు విప్పితే తనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ట్రంప్ అడ్డదారి ఎంచుకున్నారు. ఆమె నోరు మూయించేందుకు 1.30 లక్షల డాలర్లు తన లాయర్ ద్వారా చెల్లించారు. ఎన్నికల ప్రచారం కోసం పారీ్టకి అందిన విరాళాల నుంచే ఈ సొమ్మును స్టార్మీ డేనియల్కు చేరవేశారు. అక్రమ చెల్లింపులను కప్పిపుచ్చడానికి బిజినెస్ రికార్డులను తారుమారు చేశారు. ఈ వ్యవహారమంతా బహిర్గతం కావడంతో అమెరికాలో గగ్గోలు మొదలైంది. ట్రంప్పై విచారణ అధికారులు 34 అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో న్యూయార్క్ కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. 22 మంది సాక్షులను న్యాయస్థానం ప్రశ్నించింది. ఎన్నికల చట్టాన్ని ట్రంప్ ఉల్లంఘించారని, పోర్న్ స్టార్కు చెల్లించిన సొమ్మును కోర్టు ఖర్చుల కింద చూపించారని ప్రాసిక్యూటర్లు వాదించారు. ట్రంప్ తనతో ఏకాంతంగా గడిపిన మాట నిజమేనని స్టార్మీ డేనియల్ కోర్టుకు ఇచి్చన వాంగ్మూలంలో అంగీకరించారు. గురువారం 12 మంది న్యాయమూర్తుల ప్యానెల్ చరిత్రాత్మక తీర్పు వెలువరించింది.ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయొచ్చా? న్యూయార్క్ కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ట్రంప్ భవితవ్యంపై పడింది. కోర్టు ఆయనకు జైలు శిక్ష గానీ, జరిమానా గానీ విధిస్తే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా? చట్టపరంగా అది సాధ్యమేనా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం చూస్తే నేరస్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకొనే నిబంధన ఏదీ లేదని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయాకు చెందిన న్యాయశాస్త్ర ప్రొఫెసర్ రిచర్డ్ ఎల్.హసెన్ చెప్పారు. చట్టపరంగా ఇప్పుడు ట్రంప్ అభ్యరి్థత్వానికి వచ్చే ముప్పేమీ లేదని అన్నారు.కారాగారమా? గృహ నిర్బంధమా? ⇒ ట్రంప్పై 34 అభియోగాలు రుజువయ్యాయి. ఒక్కో అభియోగానికి గరిష్టంగా నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష, 5 వేల డాలర్ల దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. ⇒ జైలు శిక్ష కాకుండా జరిమానా, ప్రొబేషన్/సామాజిక సేవను శిక్షగా విధించవచ్చు. ప్రొబేషన్ శిక్ష విధిస్తే ప్రొబేషన్ అధికారి ఎదుట ట్రంప్ తరచుగా హాజరు కావాల్సి ఉంటుంది. కండీషనల్ డిశ్చార్జి అనే శిక్ష వేస్తే ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాల్సిన అవసరం ఉండదు. ⇒ గృహ నిర్బంధం విధించే అవకాశం సైతం లేకపోలేదు. అప్పుడు ట్రంప్ తన ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఆయన చుట్టూ ఎల్రక్టానిక్ నిఘా పెడతారు. హౌజ్ అరెస్టు అయితే ట్రంప్ నాలుగు గోడల మధ్య నుంచే ఎన్నికల ప్రచారం చేయాలి. ⇒ ట్రంప్ జైలుకెళ్తారా? అంటే కచ్చితంగా చెప్పలేమని న్యాయ నిపుణులు అంటున్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కోర్టు ఆయనకు జైలుశిక్ష విధించకుండా కేవలం జరిమానాతో సరిపెట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. రాజకీయ దురుద్దేశాలతోనే నాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ఇది హష్మనీ వ్యవహారం కాదు. ఇది బహిర్గతం చేయకూడదనే ఒక ఒప్పందం మాత్రమే. పూర్తిగా చట్టబద్ధంగానే జరిగింది. ఇలాంటివి అమెరికాలో సర్వసాధారణమే. ప్రత్యర్థులు నన్ను ఇలా ఇరికించారంటే వారు ఇక ఎవరినైనా ఇరికించగలరు. నాపై తప్పుడు కేసు పెట్టి, ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారు. వారి ఆటలు సాగవు – డొనాల్డ్ ట్రంప్ -
చెక్ బౌన్స్ కేసులో దోషిగా మంత్రి
బెంగళూరు: కర్ణాటక పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ మంత్రి మధు బంగారప్పను చెక్ బౌన్స్ కేసులో ప్రత్యేక కోర్టు దోషిగా తేలి్చంది. ఫిర్యాదుదారులైన రాజేశ్ ఎక్స్పోర్ట్స్ సంస్థకు రూ.6.96 కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆయనను ఆదేశించింది. మరో రూ.10 వేలను కర్ణాటక ప్రభుత్వానికి చెల్లించాలని స్పష్టం చేసింది. జరిమానా చెల్లించకపోతే ఆరు నెలలపాటు సాధారణ జైలు శిక్ష అనుభించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆకాశ్ ఆడియో–వీడియో ప్రైవేట్ లిమిటెట్ను మొదటి నిందితులుగా, ఆకాశ్ ఆడియో–వీడియో ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మధు బంగారప్ప రెండో నిందితుడిగా కోర్టు గుర్తించింది. రాజేశ్ ఎక్స్పోర్ట్స్ సంస్థ నుంచి మధు బంగారప్ప రూ.6 కోట్లు డిపాజిట్ రూపంలో తీసుకున్నారు. చాలా రోజులు తిరిగి చెల్లించలేదు. గట్టిగా నిలదీయగా చెక్కు ఇచ్చారు. బ్యాంకు ఖాతాలో నగదు లేకపోవడంతో అది బౌన్స్ అయ్యింది. దాంతో రాజేశ్ ఎక్స్పోర్ట్స్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. -
కిరాతకుడికి రష్యా అధ్యక్షుడి క్షమాభిక్ష! సైనికుడిగా ఉక్రెయిన్ సరిహద్దుకు..
ప్రియురాలిని అత్యంత కిరాతకంగా చంపిన హంతకుడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్షమాభిక్ష ప్రసాదించారు. అంతేకాదు అతన్ని సైనికుడిగా ఉక్రెయిన్ సరిహద్దుకు పంపారు. వ్లాదిస్లావ్ కాన్యుస్ అనే వ్యక్తి తన మాజీ ప్రియురాలు వెరా పెక్తెలేవాను అత్యంత కిరాతకంగా చంపాడు. ఇందుకుగానూ అతనికి 17 ఏళ్ల శిక్ష పడగా ఇంకా సంవత్సరం కూడా పూర్తవకముందే అధ్యక్షుడు పుతిన్ అతనికి క్షమాభిక్ష పెట్టి వదిలేయడం చర్చనీయాంశంగా మారింది. తనకు బ్రేకప్ చెప్పిందన్న కక్షతో పెక్తెలేవాను కాన్యుస్ అత్యాచారం చేసి, 111 సార్లు కత్తితో పొడిచి, మూడున్నర గంటల పాటు చిత్రవధ చేశాడు. ఆ తర్వాత ఆమె మెడకు కేబుల్ వైర్ బిగించి అత్యంత కిరాతకంగా హతమార్చాడని ‘ది సన్’ కథనం ద్వారా తెలిసింది. హతాశయురాలైన మృతురాలి తల్లి మృతురాలి తల్లి ఒక్సానా.. సైనిక దుస్తులలో ఆయుధం చేతపట్టి ఉన్న హంతకుడు కాన్యుస్ ఫొటోలను చూసి హతాశయురాలయ్యారు. తన కుమార్తెను అత్యంత పాశవికంగా హత్య చేసిన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టి జైలు నుంచి వదిలేయడాన్ని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. అంతటి కిరాతకుడికి ఆయుధం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇది చాలా అన్యాయమని, తన కూతురు ఆత్మకు శాంతి చేకూరదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఆ హంతకుడు బయట ఉంటే తమను కూడా చంపేస్తాడని ఆందళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న దక్షిణ రష్యాలోని రోస్టోవ్కు కాన్యుస్ను బదిలీ చేసినట్లు జైలు అధికారులు ధ్రువీకరించారని మహిళా హక్కుల కార్యకర్త అలియోనా పోపోవా తెలిపారు. ఆమె నవంబర్ 3 నాటి రష్యన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీస్ నుంచి వచ్చిన ఒక లేఖను బయటపెట్టారు. కాన్యుస్కు క్షమాభిక్ష లభించిందని, ఏప్రిల్ 27న అధ్యక్షుడి ఆదేశాలతో అతని శిక్షను రద్దు చేసినట్లు ఆ లేఖలో ఉంది. కాగా క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ చర్యను సమర్థించారు. ఉక్రెయిన్లో పోరాడటానికి పంపిన రష్యన్ ఖైదీలు వారి నేరాలకు "రక్తంతో" ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నట్లు ‘ఏఎఫ్పీ’ నివేదించింది. -
టీవీ మహిళా జర్నలిస్టు హత్యకేసు: ఆ దుర్మార్గులదే ఈ పని!
Justice for journalist Soumya Vishwanathan యువ మహిళా టీవీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో ఎట్టకేలకు న్యాయం జరిగింది. సంచలనం రేపిన ఈ కేసులో ఐదుగురు నిందితులను కోర్టు దోషిలుగా నిర్ధారించింది. రవికపూర్, అమిత్ శుక్లా, అజయ్ కుమార్, బల్జీత్ మాలిక్, అజయ్ సేథీలను సాకేత్ కోర్టు దోషులుగా బుధవారం తేల్చి చెప్పింది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జర్నలిస్ట్ సౌమ్యా విశ్వనాథన్ 2008 సెప్టెంబరు 30న ఢిల్లీలో తన కారులో గాయాలతో శవమై కనిపించారు. ఇది తొలుత యాక్సిడెంట్ కేసుగా నమోదుచేశారు. కానీ తలపై తుపాకీతో కాల్చినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. ఆ తరువాత సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. 2009 మార్చిలో నిందితులను పోలీసులు అదుపులోకి విచారించగా సౌమ్యాను తామే హత్య చేసినట్లు అంగీకరించారు. తుపాకితో కాల్చి ఆమెను అతి కిరాతకంగా హత్య చేసిన దుండుగులు.. మృతదేహాన్ని కారులో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పోలీసులు తేల్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జిత్ మాలిక్, అక్షయ్ కుమార్, అజయ్ సేథిలను దోషులుగా తేల్చింది. అంతేకాదు, మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చట్టంలోని నిబంధనల ప్రకారం దోపిడి కేసులోనూ దోషులుగా పేర్కొంది. వీరిలో రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జిత్ మాలిక్, అక్షయ్లను హత్య, దోపిడీ కేసులో దోషులుగా నిర్దారించిన కోర్టు.. వీరికి సహకరించినందుకు ఐదో నిందితుడు అజయ్ను కూడా దోషిగా ప్రకటించింది. పదిహేనేళ్ల సుదీర్ఘ విచారణను అక్టోబరు 13న పూర్తిచేసిన సాకేత్ కోర్టు అడిషినల్ సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ పాండే.. తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే. డిఫెన్స్, ప్రాసిక్యూషన్ ఈ నెల ప్రారంభంలో తమ వాదనలను పూర్తి చేయడంతో అదనపు వాదనలు లేదా వివరణల కోసం నాలుగు రోజులు సమయం ఇచ్చారు. ఎటువంటి అభ్యర్థనలు రాకపోవడంతో తీర్పును బుధవారం వెలువరించారు. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) పోయిన నా బిడ్డ ఎలాగూ తిరిగి రాదు,కానీ : తల్లి ఆవేదన కోర్టు తీర్పుపై సౌమ్యా విశ్వనాథన్ తల్లి మాధవి విశ్వనాథన్ భావోద్వేగానికి లోనయ్యారు. తన కూతురు ఎలాగూ చనిపోయింది.. ఆమె తిరిగి రాదు కానీ ఈ తీర్పు నేరస్థుల్లో భయాన్ని రేపుతుంది. లేదంటే వాళ్లు మరింత రెచ్చిపోతారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా ఈ కేసును విచారించిన పోలీసు అధికారిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. కనీసం వారికి జీవిత ఖైదు విధించాలని కోరారు. (భీకర పోరు: సాహో ఇండియన్ సూపర్ విమెన్, వైరల్ వీడియో) #WATCH | Journalist Soumya Vishwanathan murder case: Soumya Vishwanathan's parents in Delhi's Saket court for verdict in the case pic.twitter.com/95wY7t6OBd — ANI (@ANI) October 18, 2023 జిగిషాను హత్యచేసిన వాళ్లే సౌమ్యాను కూడా ఇది ఇలా ఉంటే కాల్ సెంటర్ ఉద్యోగి జిగిషా ఘోష్ హత్యలో వీళ్లేనేరస్థులు కావడం గమనార్హం. జిగిషా హత్యలో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడంతోనే విశ్వనాథన్ హత్య కేసును కూడా ఛేదించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కేసులో రవి కపూర్ అమిత్ శుక్లా లను తొలుత అరెస్టు చేశారు. అనంతర బల్జీత్ మాలిక్, అజయ్ సేథీలతో పాటు వారిపై ఛార్జ్ షీట్ (జూన్ 2010) దాఖలు చేశారు. నవంబర్ 2010లో విచారణ ప్రారంభమైంది. విచారణ జూలై 2016లో ముగిసింది. కపూర్, శుక్లాలకు మరణశిక్ష, మాలిక్కు ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే, జనవరి 2018లో కపూర్, శుక్లాల మరణశిక్షను హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. అయితే మాలిక్ జీవిత ఖైదును సమర్థించింది. -
మానవమృగం.. శిక్ష అనుభవించినా బుద్ధి మారలేదు..
భోపాల్: మధ్యప్రదేశ్లోని సాట్నాకు చెందిన ఓ దుర్మార్గుడు రాకేష్ వర్మ(35) చేసిన నేరమే మళ్ళీ చేసి తానొక మానవ మృగాన్నని నిరూపించుకుని కటకటాల పాలయ్యాడు. గతంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చి మళ్ళీ మరో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను స్థానికంగా ఒక ఆసుపత్రిలో చేర్పించగా ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెబుతున్నాయి ఆసుపత్రి వర్గాలు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేంద్ర సింగ్ చోహాన్ తెలిపిన వివరాల ప్రకారం సాట్నా జిల్లాలోని కృష్ణా నగర్లో నివాసముండే రాకేష్ వర్మ పన్నెండేళ్ల క్రితం నాలుగున్నరేళ్ల వయసున్న మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఆ నేరానికి అతడికి పదేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఏడు సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించిన రాకేష్ వర్మ ఏడాదిన్నర క్రితమే జైల్లో సత్ప్రవర్తన కింద విడుదలయ్యాడు. బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జగత్ దేవ్ తాలిబ్ ప్రాంతం నుండి ఓ మైనర్ బాలికను లాలిస్తున్నట్లు నటించి అపహరించుకుపోయాడు. మాకు విషయం తెలిసిన తర్వాత గాలింపు చేపట్టగా బాలిక రేప్ కు గురైందని గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ప్రాధమిక చికిత్స అనంతరం మైనర్ బాలికను రేవాకు తరలించగా బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు అక్కడి వైద్యులు. ఇది కూడా చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం.. -
లైంగిక వేధింపుల కేసులో మాజీ డీజీపీకి మూడేళ్ల శిక్ష
తమిళనాడు:లైంగిక వేధింపుల కేసులో తమిళనాడు మాజీ డీజీపీకి న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఐపీఎస్ అధికారి, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ) రాజేశ్ దాస్ను విల్లుపురం న్యాయస్థానం దోషిగా తేల్చింది. తోటి సీనియర్ అధికారి రాజేశ్ దాస్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళా ఐపీఎస్ అధికారి 2021లో ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి కే పళనిస్వామి భద్రతపై విధులకు వెళ్లిన క్రమంలో తనను వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఆరోపణలపై దాస్ను అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దర్యాప్తు చేయడానికి ఆరుగురి వ్యక్తులతో కూడిన ఓ కమిటీని కూడా నియమించింది. ఈ కేసు అప్పటి ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించింది. ఎన్నికల బరిలో నిలిచిన ఎంకే స్టాలిన్.. తనను గెలిపిస్తే ఈ కేసును న్యాయబద్దంగా దర్యాప్తు చేపిస్తానని ప్రజలకు హామీ కూడా అప్పట్లో ఇచ్చారు. ఇదీ చదవండి:గవర్నర్ Vs సీఎం స్టాలిన్:సెంథిల్ బాలాజీ అంశంలో మరో వివాదం.. -
చిలుక సాక్ష్యంతో నిందితుడికి జీవిత ఖైదు!
హత్య జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత నిందితుడి జైలు శిక్ష విధించింది కోర్టు. అదీకూడా ఒక చిలుక సాక్ష్యం ఆధారంగా ఈ కేసు చిక్కుముడి వీడి నిందితుడికి శిక్ష పడేలా జరగడం ఈకేసులో మెయిన్ ట్విస్ట్. ఇలాంటి విచిత్రమైన కేసు ఇదే ప్రపథమం కాబోలు. అసలేం జరిగిందంటే..ప్రముఖ ఆంగ్ల పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ విజయ్ శర్మ భార్య నీలం శర్మ ఫిబ్రవరి 20. 2014న హత్యకు గురయ్యారు. ఐతే ఆరోజు అతడి భార్య, పెంపుడు కుక్క హత్యకు గురవ్వడమే కాకుండా ఆ ఇంట్లో చోరీ కూడా జరిగింది. వాస్తవానికి ఆరోజు విజయ్ శర్మ తన కొడుకు రాజేష్, కుమార్తె నివేదితతో కలిసి ఫిరోజాబాద్లోని ఒక వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లారు. ఐతే అతడి భార్య నీలం మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది. అదేరోజు అర్థరాత్రి విజయ్ శర్మ, పిలల్లు ఇంటికి తిరిగి వచ్చి చూడగా..తన భార్య, కుక్క మృతదేహాలను చూసి అంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. దీంతో వారు పోలీసులును ఆశ్రయించగా..వారిని నిందితుడు పదునైనా ఆయుధంతో గాయపరిచినట్లు చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు. ఐతే ఈ ఘటన జరిగిన రోజు తమ పెంపుడు చిలుక చేస్తున్న అరుపులకు అనుమానం వచ్చి తన మేనల్లుడిని ఆశుని ప్రశ్నించాల్సిందిగా అభ్యర్థించాడు. ఈ క్రమంలో పోలీసులు చిలుక ముందు అనుమానితులు ఒక్కొక్కటి పేరు చెబుతున్నప్పుడూ..అశుకి భయపడి అషు.. అషు అని పిలవడం ప్రారంభించింది. దీంతో అశుని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన తర్వాత పక్షి సైలెంట్ అయిపోయి తినడం తాగడం మానేసిందని ఆరునెలల తర్వాత చనిపోయిందని విజయ్ శర్మ కూతురు నివేదిత చెప్పింది. ఈ కేసు ఆద్యాంతం చిలుక కీలక సాక్ష్యం ఆధారంగా ఉండటంతో..నిందితుడి జీవిత ఖైదు విధించింది కోర్టు. అదికూడా హత్య జరిగిన తొమ్మిదేళ్లకు శిక్ష పడింది. ఈలోగా నివేదిత తండ్రి విజయ్ శర్మ కూడా కరోనా మహమ్మారి సమయంలో నవంబర్ 14, 2020న చనిపోయారు. తమ కుటుంబం అంతా ఆశుకి శిక్ష పడాలని కోరుకున్నామని నివేదిత ఆవేదనగా చెబుతోంది. ఈ మేరకు నివేదిత మాట్లాడుతూ..ఆశు తమ ఇంటికి తరుచుగా వచ్చి వెళ్లేవాడని, తన ఎంబీఏ చదువుకు కూడా తన నాన్న రూ. 80 వేలు ఇచ్చాడని తెలిపింది. ఆశుకి తమ ఇంట్లో ఆభరణాలు, డబ్బు ఎక్కడ ఉంటాయో తెలుసనని కాబట్టే చాలా పక్కగా ప్లాన్ చేసి చంపగలిగాడని కన్నీటిపర్యంతమైంది. (చదవండి: వధువు అలంకరణ చూసి..పెదాలు చప్పరించకుండా ఉండలేరు) -
‘జిలేబీ బాబా’ లీలలు.. ఏకంగా 120 మందిపై అకృత్యాలు.. అంతటితో ఆగకుండా..
మంత్ర తంత్రాల మాటున మహిళలను చెరబట్టిన ‘జిలేబీ బాబా’ పాపం పండింది. 120 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఆ కీచకుడు ఎట్టకేలకు దోషిగా తేలాడు. ఆ వివరాలు.. జిలేబీ బాబా అసలు పేరు అమర్పురి అలియాస్ అమర్వీర్. అతనిది పంజాబ్లోని మాన్సా ప్రాంతం. 20 ఏళ్ల క్రితం కుటుంబంతో కలిసి హరియాణాలోని తొహనాకు వచ్చాడు. తొహనా రైల్వే రోడ్డులో జిలేబీ దుకాణం తెరిచాడు. ఈక్రమంలో భార్య కన్నుమూయడంతో అమర్వీర్ రెండేళ్లు పత్తాలేకుండా పోయాడు. తర్వాత తొహనాకు తిరిగొచ్చి తాంత్రిక విద్యలు తెలుసంటూ నాటకానికి తెరతీశాడు. సమస్యలేవైనా తొలగించేస్తా అంటూ జిలేబీ బాబాగా అవతారమెత్తాడు. జనాల దృష్టిని ఆకర్షించాడు. ఆధ్యాత్మిక చింతన పేరుతో కొందరిని బురిడీ కొట్టించి బాబా బాలక్నాథ్ గుడిలో పూజారిగా కూడా పని చేయడం ప్రారంభించాడు. ఆత్మలు ఆవహిస్తాయని... మాయమాటలు చెప్పి ఎందరో మహిళలను లొంగదీసుకున్నాడు. తాంత్రిక పూజలు చేసేటప్పుడు ఆత్మలు వారిని ఆవహిస్తాయని నమ్మించేవాడు. తర్వాత వారికి మత్తు మందు ఇచ్చి స్పృహ లేకుండా చేసేవాడు. తర్వాత వారిపై అకృత్యానికి ఒడిగట్టేవాడు. అంతటితో ఆగకుండా వాటిని వీడియోలు కూడా తీసేవాడు. ఆ వీడియోలను సదరు బాధితులకు చూపించి బ్లాక్మెయిల్ చేసి సొమ్ము రాబట్టేవాడు. మరికొందరిని తనతో సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసేవాడు. అయితే, ఒక వీడియో బాబా బాగోతాన్ని బట్టబయలు చేసింది. జిలేబీ బాబా ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదే అదనుగా కొందరు మహిళలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాబా నివాసముంటున్న చోట పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయడంతో 120కి పైగా వీడియోలు, కొన్ని మత్తు పదార్ధాలు లభించాయి. దాంతో అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించిన హరియాణా కోర్టు అతడిని దోషిగా తేలుస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. -
బాప్రే!.. ఏకంగా 11 వేలకు పైగా హత్యలు చేసిన 97 ఏళ్ల వృద్ధురాలు
ఒకటి రెండు కాదు ఏకంగా వేలమందిని హత్య చేసింది ఒక వృద్ధురాలు. రెండో ప్రప్రంచ యుద్ధం సమయం నాటి కేసులో కోర్టు తాజాగా ఆమెను దోషిగా తేల్చి శిక్ష విధించింది. వివరాల్లోకెళ్తే.. 97 ఏళ్ల వృద్ధురాలు ప్రస్తుత పోలాండ్కి సమీపంలో ఉన్న స్టట్థాప్ నాజీ నిర్బంధ శిబిరంలో కార్యదర్శిగా పనిచేసింది. ఆ సమయంలో ఆమె అక్కడ నిర్బంధంలో ఉన్న యుద్ధ ఖైదీలు సుమారు 10,500 మందికి పైగా హత్యకు గురయ్యారు. ఐతే ఆ హత్యల్లో ఈ వృద్ధురాలు ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిందితులకు సహకరించినట్లు జర్మనీలో ఇట్జెహులో జిల్లా కోర్డు మంగళవారం పేర్కోంది. ఆ కేసులో ఆమెకు రెండేళ్ల బహిష్కరణ శిక్ష తోపాటు ఆమె ఈ హత్యలు చేసినప్పుడూ వయసు 18 నుంచి 19 సంవత్సరాల మద్య ఉండటంతో అప్పటి బాల నేరస్తుల చట్టం ప్రకారం విధించే శిక్షలను కూడా విధిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. వాస్తవానికి ఆమెపై దాదాపు 11,412 మంది హత్యలకు సహకరించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఐతే 2021 నుంచి కోర్టులో ట్రయల్స్ ప్రారంభం కావడం ఆలస్యమైంది. అదీగాక ఆమె కూడా అనారోగ్యంతో ఉండటంతో కోర్టుకు అందుబాటులో లేకుండా పోయింది. ఆ వృద్ధురాలు 1943 నుంచి 1945 కాలంలో స్టట్థాప్ నాజీ నిర్బంధ శిబిరంలో పనిచేసింది. అక్కడ నిర్బంధంలో ఉన్న దాదాపు 65 వేల మంది ఆకలితో లేదా వ్యాధులతో మరణించారు. మరికొంతమంది స్టట్థాప్లోని గ్యాస్ చాంబర్లో మరణించారు. వారంతా నాజీల నిర్మూలన ప్రచారంలో పాల్గొన్న యుద్ధ ఖైదీలు, వారిలో కొందరూ యూదులు కూడా ఉన్నట్లు సమాచారం. ఐతే ఇది రెండో ప్రపంచ యుద్ధ నేరాలకు సంబంధించిన చివరి కేసు విచారణ అని జర్మనీ స్థానికి మీడియా పేర్కొనడం గమనార్హం. (చదవండి: రష్యా బలగాలకు ఆకస్మిక ఆదేశాలు.. భయాందోళనలో ఉక్రెయిన్) -
పోలీసు పుత్రిడి నుంచి ఉగ్రవాదిగా అజీజ్... 16 ఏళ్ల జైలు శిక్ష
సాక్షి హైదరాబాద్: పాక్ నిఘా సంస్థ లష్కరే తొయిబా (ఎల్ఈటీ) ఆదేశాల మేరకు హైదరాబాద్లో భారీ విధ్వంసాలకు కుట్రపన్నిన కేసులో నిందితుడిగా ఉన్న అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్ దోషిగా తేలాడు. ఇతడికి 16 ఏళ్ల జైలు శిక్ష, రూ.26 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చినట్లు శనివారం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏసీపీ పి.వెంకటేశ్వర్లు వివరించారు. ఈ కేసులో మరో నిందితుడు మహ్మద్ నిస్సార్కు న్యా యస్థానం 2011లోనే 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పెట్రోల్ పంపులో మేనేజర్గా.. భవానీనగర్కు చెందిన గిడ్డా అజీజ్ తండ్రి మెహతబ్ అలీ హెడ్ కానిస్టేబుల్గా పని చేశారు. అజీజ్ 1985 నుంచి 87 వరకు పాతబస్తీలోని మదీనా ప్రాంతంలోని ఓ పెట్రోల్ పంపులో మేనేజర్గా పని చేశాడు. నల్లగొండ జిల్లా బోనాల్పల్లికి చెందిన సిమి ఉగ్రవాది మహ్మద్ ఫసీయుద్దీన్ ద్వారా ఉగ్రవాద బాటపట్టాడు. ఎల్ఈటీకి అనుబంధంగా ఆజం ఘోరీ ఏర్పాటు చేసిన ఇండియన్ ముస్లిం మహమ్మదీ ముజాహిదీన్ సంస్థతో సన్నిహితంగా మెలిగాడు. హత్యలు, దోపిడీలతో పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ఫసీ అతని అనుచరుడు మీర్ 1993 జూన్ 21న కార్ఖానా పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. 2000లో జగిత్యాలలో జరిగిన ఎన్కౌంటర్లో ఘోరీ చనిపోయాడు. దీంతో సౌదీ అరేబియాకు వెళ్లిపోయిన గిడ్డా అజీజ్ అక్కడే ఇంటర్నేషనల్ ఇస్లామిక్ రిలీఫ్ ఆర్గనైజేషన్ (ఐఐఆర్వో) అనే సంస్థలో చేరాడు. పూర్తి స్థాయి జిహాదీ వలంటీర్లతో కూడి న ఈ సంస్థలో అజీజ్ కీలకపాత్ర పోషించాడు. భారీ విధ్వంసానికి కుట్ర.. ‘బాబ్రీ’ ఉదంతం తర్వాత రెచ్చిపోయిన అజీజ్ అయోధ్యతో పాటు హైదరాబాద్లోనూ భారీ స్థాయిలో విధ్వంసానికి కుట్రపన్నాడు. అప్పట్లో బోస్నియా– చెచెన్యాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాలకు ఆకర్షితుడైన అజీజ్ 1995లోనే ఆ దేశానికి వెళ్లి వచ్చాడు. ఆ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు అనేక మంది యువతకు ఉగ్రవాద శిక్షణ కూడా ఇచ్చాడు. 1995 జూలై 17 బోస్నియా నుంచి అసలు పేరుతోనే పాస్పోర్ట్ పొందాడు. ఆపై భారత్కు వచ్చిన గిడ్డా అజీజ్ 1993 జనవరి 7న సికింద్రాబాద్ ఆర్పీఓ కార్యాలయం నుంచి తన పేరుతోనే మరో పాస్పోర్ట్ తీసుకున్నాడు. 2000 అక్టోబర్ 3న అబ్దుల్ కరీం పేరుతో ఇంకో నకిలీ పాస్పోర్ట్ పొందాడు. అజీజ్, నిస్సార్ సహా మరొకరిని నగర పోలీసులు 2001 ఆగస్టు 28న హుమాయున్నగర్ పరిధిలోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి వద్ద అరెస్టు చేశారు. అజీజ్ నుంచి ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, బెల్జియంలో తయారైన పిస్టల్, క్యాట్రిడ్జిలు, బోస్నియా పాస్పోర్ట్, రెండు నకిలీ పాస్పోర్టులు, ఎలక్ట్రిక్ సర్క్యూట్ బోర్డులు, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెయిల్ పొందిన అజీజ్ సౌదీకి పారిపోయాడు. మూడేళ్లే అక్కడే ఉన్న అజీజ్ 2004లో నగరానికి వచ్చాడు. సికింద్రాబాద్లో ఉన్న గణేష్ దేవాలయం పేల్చివేతకు కుట్రపన్నాడు. సౌదీలో తలదాచుకుని.. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పేలుళ్లకు పన్నిన ఈ కుట్రను ఛేదించిన టాస్క్ఫోర్స్ పోలీసులు మిగిలిన నిందితుల్ని అరెస్టు చేయగా... గిడ్డా అజీజ్ త్రుటిలో తప్పించుకున్నాడు. బోస్నియా పాస్పోర్ట్ వినియోగించి అడ్డదారిలో సౌదీ పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. అజీజ్ది నకిలీ పాస్పోర్ట్ అని గుర్తించిన సౌదీ అధికారులు 2007లో అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసులు రెండు కేసుల్లో వాంటెడ్గా ఉన్న అజీజ్పై 2008లో ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించారు. సౌదీలో నకిలీ పాస్పోర్ట్ కేసు విచారణ, శిక్ష పూర్తికావడంతో అక్కడి అధికారులు 2016లో భారత్కు బలవంతంగా తిప్పిపంపించారు. దీంతో అప్పటి నుంచి 2001 నాటి విధ్వంసాల కేసు విచారణ సాగి అజీజ్కు 16 ఏళ్ల శిక్ష పడింది. (చదవండి: ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం) -
‘పరారీలో ఉంటే ముందస్తు బెయిలు వీలుకాదు’
సాక్షి, న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వ్యక్తి , నేరస్తుడిగా ప్రకటితమైన వ్యక్తి ముందస్తు బెయిలుకు అనర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోసం కేసులో పట్నా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను గురువారం జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం విచారించింది. వ్యాపార లావాదేవీల్లో మోసం చేసిన కేసు కావడంతో నిందితుడు ముందస్తు బెయిలుకు అర్హుడని హైకోర్టు భావించిందని తెలిపింది. అయినప్పటికీ ఐపీసీ సెక్షన్ 406 (నేర ఉల్లంఘన), 420 (మోసం), 467 (ఫోర్జరీ), 468, 470 (నకిలీ డాక్యుమెంట్లు) ప్రకారం నేరాలు జరిగి ఉండొచ్చు. కేసులో ఆరోపణల స్వభావం పరిశీలించాలి. వ్యాపార లావాదేవీల నుంచే ఆరోపణ అని భావించరాదు’’ అని పేర్కొంది. నిందితుడిపై మేజిస్టేట్ కోర్టులో ఛార్జిషీటు నమోదైందని గుర్తుచేసింది. -
మాజీ మేనేజర్ హత్య కేసులో దోషి డేరా బాబా
చండీగఢ్: డేరా సచ్చా సౌదా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా అధిపతి గుర్మీత్ రామ్రహీమ్ సింగ్ను దోషిగా సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చింది. తన ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడినందుకు 2017లో 20 ఏళ్ల జైలు శిక్ష పడటంతో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరాబాబా ప్రస్తుతం రొహ్తక్లోని సునరియా జైలులో ఉన్నాడు. పంచ్కులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రంజిత్ సింగ్ కేసుపై శుక్రవారం విచారణ జరిపింది. ఈ కేసులో క్రిషన్ లాల్, జస్బీర్ సింగ్, అవ్తార్ సింగ్, సబ్దిల్లను కూడా దోషులుగా తేల్చినట్లు సీబీఐ స్పెషల్ ప్రాసిక్యూటర్ హెచ్పీఎస్ శర్మ తెలిపారు. ఈ కేసు తీర్పు ఈ నెల 12వ తేదీన వెలువడనుందని వివరించారు. డేరా ప్రధాన కార్యాలయంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న తీరుపై బయటకు వచ్చిన ఒక ఆకాశరామన్న ఉత్తరం వెనుక రంజిత్ సింగ్ హస్తం ఉన్నట్లు డేరా చీఫ్ అనుమానించాడని, ఆ నేపథ్యంలోనే 2002లో అతడు హత్యకు గురయ్యాడని సీబీఐ తన చార్జిషీట్లో పేర్కొంది. రామ్చందర్ ఛత్రపతి అనే జర్నలిస్ట్ హత్య కేసులోనూ రెండేళ్ల క్రితం డేరాబాబాకు కోర్టు జీవిత ఖైదు విధించింది. చదవండి: (సరిహద్దుల్లో మరోసారి బరితెగించిన చైనా) -
ఎన్నికల్లో అధిక ఖర్చు: సర్కోజీని దోషిగా తేల్చిన కోర్టు
పారిస్: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీని ఆ దేశంలోని ఓ కోర్టు దోషిగా తేల్చింది. ఎన్నికల ప్రచారంలో నిర్ణయించిన మొత్తం కన్నా ఎక్కువ మొత్తం ఖర్చు చేయడం ద్వారా ఆయన నేరానికి పాల్పడినట్లు తేల్చింది. శిక్షగా ఏడాదిపాటు గృహ నిర్బంధంలోనే ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. ఎల్రక్టానిక్ మానిటరింగ్ బ్రేస్లెట్ ధరించి ఇంట్లో ఉండాలని తీర్పు చెప్పింది. ఈ శిక్షను ఆయన తిరిగి అప్పీల్ చేసే అవకాశం ఉంది. 2007 నుంచి 2012 వరకు అధ్యక్షుడిగా పని చేసిన సర్కోజీ, 2012 ఎన్నికల్లో నిర్ణయించిన ఆర్థిక మొత్తం కన్నా రెండింతలు ఎక్కువ ఖర్చు చేశారని కోర్టు తేలి్చంది. -
ఆ పోలీసు అధికారి దోషి
వాషింగ్టన్: అమెరికా సహా ప్రపంచ దేశాల్లో సంచలనం సృష్టించిన ఆఫ్రికన్ అమెరికాన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో మాజీ పోలీసు అధికారి డెరెక్ చౌవిన్ను దోషిగా తేలుస్తూ స్థానిక కోర్టు తీర్పు చెప్పింది. 12 మంది జ్యూరీ సభ్యులున్న కోర్టు ఈ ఘటనను ఉద్దేశపూర్వకంగా చేయని సెకండ్ డిగ్రీ మర్డర్, థర్డ్ డిగ్రీ మర్డర్ అని మంగళవారం వెలువరించిన తీర్పులో పేర్కొంది. చౌవిన్ బెయిల్ని రద్దు చేసింది. మూడు వారాల పాటు 45 మంది సాక్షుల్ని విచారించిన కోర్టు సోమవారం 10 గంటలకు పైగా తుది విచారణ జరిపింది. అయితే శిక్షను న్యాయస్థానం వాయిదా వేసింది. న్యాయమూర్తి పీటర్ కాహిల్ 8 వారాల్లో శిక్ష ఖరారు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా అమెరికా చట్టాల ప్రకారం చౌవిన్కు 40 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. తీర్పు వెలువరించిన సమయంలో డెరెక్ చౌవిన్కు ముఖానికి సర్జికల్ మాస్కు ధరించి ఉండడంతో అతని ముఖంలో భావాలేవీ బయటకు రాలేదు. మరోవైపు ఫ్లాయిడ్ మృతితో జాతి వివక్షకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమించిన వారు, ఫ్లాయిడ్ మద్దతు దారులు న్యాయస్థానం తీర్పు చెప్పినప్పుడు కోర్టు హాలు బయటే వేచి ఉన్నారు. తీర్పు వెలువడగానే పెద్ద పెట్టున హర్షాతిరేకాలు చేశారు. అతనికి ఉరిశిక్ష వేయాలంటూ నినదించారు. ఈ తీర్పు ఓ ముందడుగు: బైడెన్ జాతి వివక్షకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో ఈ తీర్పు అతి పెద్ద ముందడుగు అవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. తీర్పు వచ్చిన తర్వాత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్తో కలిసి వైట్ హౌస్నుంచి ఆయన మాట్లాడారు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలకి కాంగ్రెస్ సభ్యులందరూ ఇంకా కృషి చేయాలన్నారు. ‘‘ఈ తీర్పు చాలదు. మనం ఇక్కడితో ఆగిపోకూడదు. అయితే న్యాయవ్యవస్థలో ఇదో పెద్ద ముందడుగు’’అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన బైడెన్ ఎంతో కొంత న్యాయం జరిగిందన్నారు. ఈ తీర్పు తో తాను ఊరట పొందానని అన్నారు. ఐ కాంట్ బ్రీత్ అన్న జార్జ్ ఫ్లాయిడ్ ఆఖరి మాటలు అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇది కేవలం నల్లజాతీయుల సమస్య కాదని, ప్రతీ అమెరికన్ సమస్యని అన్నారు. అందరికీ న్యాయం అని తాము కంటున్న కలల్ని జాతి వివక్ష దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊపిరి పీల్చుకున్నాం : ఫ్లాయిడ్ సోదరుడు పోలీసు అధికారి డెరెక్ చౌవిన్ను న్యాయస్థానం దోషిగా తేల్చడంతో తామంతా ఊపిరిపీల్చుకున్నామని ఫ్లాయిడ్ సోదరుడు ఫిలోనైస్ అన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన అనుకూలంగా తీర్పు వచ్చినా జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఊపిరి ఆడట్లేదు... కాలు తీయండి నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ మిన్నియాపాలిస్లోని ఒక దుకాణంలో నకిలీ 20 డాలర్ల నోటుతో సిగరెట్లు కొనుగోలు చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. ఆ దుకాణంలో పని చేసే ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసు అధికారిగా ఉన్న శ్వేతజాతీయుడు డెరెక్ చౌవిన్ 2020, మే 25 రాత్రి ఫ్లాయిడ్ను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అత్యంత కర్కశంగా వ్యవహరించాడు. 46 ఏళ్ల వయసున్న ఫ్లాయిడ్ను రోడ్డుమీదకి ఈడ్చుకొచ్చాడు. తన మోకాలితో ఫ్లాయిడ్ మెడపై గట్టిగా నొక్కి పెట్టి ఉంచాడు. ఫ్లాయిడ్ ఊపిరి ఆడడం లేదంటూ ఎంత మొరపెట్టుకున్నా చౌవిన్ కర్కశ హృదయం కరగలేదు. తొమ్మిది నిమిషాలు పైగా అలా తొక్కి పెట్టి ఉంచాడు. దీంతో ఫ్లాయిడ్ గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకి రావడంతో ప్రజలు ఆగ్రహోద్రిక్తులయ్యారు. ‘‘ఐ కాంట్ బ్రీత్. ఐ కాంట్ బ్రీత్’’అన్న ఫ్లాయిడ్ చివరి మాటలు విన్న వారి హృదయాలు కరిగి నీరయ్యాయి. -
బొగ్గు స్కాంలో దోషిగా తేలిన మాజీమంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేను బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా తేలుస్తూ ఢిల్లీ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేతో పాటు మరో ముగ్గురు అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతం, సీఎంల్ డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాల్లను కూడా దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చింది. 1999లో ఝార్ఖండ్లోని గిరిధిలో ఉన్న బ్రహ్మదిహ బొగ్గు గనులను కాస్ట్రాన్ టెక్నాలజీస్ లిమిటెడ్కు కేటాయించగా, ఇందులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో దీనిపై విచారణకు ఆదేశించారు. దశాబ్ధాలుగా ఈ విషయంపై విచారణ కొనసాగింది. ఈ కేటాయింపుల్లో దిలీప్ రేతో పాటు మరో ముగ్గురు అవినీతికి పాల్పడినట్లు ప్రత్యేక కోర్టు గుర్తించింది. మాజీ ప్రధాని అటల్బిహారి వాజ్పేయీ ప్రభుత్వ హయంలో దిలీప్ రే ఉక్కు, బొగ్గుశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నెల 14న దిలీప్ రేతో పాటు దోషిగా తేలిన మరో ముగ్గురుకు కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. చదవండి: యూఎన్ఓవి అనవసర వ్యాఖ్యలు: భారత్ -
పర స్త్రీ వ్యామోహంతో ‘దోశ కింగ్’ పతనం
సాక్షి, చెన్నై: ‘దోశ కింగ్’గా పేరొందిన శరవణభవన్ వ్యవస్థాపకుడు రాజగోపాల్కు జీవితఖైదు ఆదివారం నుంచి మొదలు కానుంది. హత్య కేసులో న్యాయస్థానం ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రాజగోపాల్ జీవితంలో ఒక సినిమాకు సరిపడా కథ ఉంది. చిన్నతనంలో కడు బీదరికం అనుభవించి, స్వయంకృషితో ఉన్నత స్ధానానికి ఎదిగి.. మూఢ విశ్వాసాల కారణంగా ఎలా పతనం అయ్యాడో చెప్పడానికి ఆయన జీవితం ఓ గొప్ప ఉదాహరణ. ‘మహిళలపై వ్యామోహం, హత్య చేసైనా సొంతం చేసుకోవాలనే బలహీనత కారణంగా చివరకు కారాగారం పాలయ్యారు. ఎప్పుడూ నుదుటిపై గంధపు బొట్టు పెట్టుకుని, తెల్లని దుస్తులు ధరించే 71 ఏళ్ల రాజగోపాల్ తమిళనాడులోని తక్కువ కులానికి చెందిన ఉల్లిపాయల వ్యాపారి కుమారుడు. 1981లో చెన్నైలో కిరాణా దుకాణంతో జీవితాన్ని ప్రారంభించిన రాజగోపాల్, ధైర్యంగా అడుగు ముందుకు వేసి తన మొదటి రెస్టారెంట్తో దిగువ మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇడ్లీ, దోసెలు రుచి చూపించారు. అలా ఇంతింతై శరవణ భవన్ పేరు భారతదేశమంతా పాకింది. శరవణభవన్ గ్రూప్నకు దేశ, విదేశాల్లో కలిపి 20 వరకు హోటళ్లున్నాయి. ఆయన రెస్టరెంట్స్లోని గోడలపై దేవతల చిత్రపటాల పక్కనే రెండు ఫోటోలు కనిపిస్తాయి. ఒకటి కుమారులతో కలిసి, మరొకటి తను నమ్మిన ఆధ్యాత్మిక గురువుతో రాజగోపాల్ దిగిన ఫొటో. తన దగ్గర పనిచేసే కింది స్థాయి ఉద్యోగులకు కూడా ‘హెల్త్ ఇన్సూరెన్స్’ కల్పించి వారికి పెద్ద దిక్కులా మారారు. ఓ జ్యోతిష్కుడి మాటవిని 2000 సంవత్సరం ప్రారంభంలో తన కింది ఉద్యోగి కుమార్తెను మూడవ భార్యగా పొందడానికి విఫలయత్నం చేశారు. అప్పటికే సదరు యువతి ప్రేమ వివాహం చేసుకొన్న కారణంగా ఆయన్ని తిరస్కరించడంతో ఆమె భర్తను 2001లో హత్య చేయించాడు. 2004లో కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మళ్లీ అప్పీలు చేసుకోవడంతో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు మార్చిలో సమర్థించింది. కోర్టు ఆదేశాల మేరకు జూలై 7 నుంచి ఆయనకు శిక్ష అమలు చేస్తారు. అట్టడుగుస్థాయి నుంచి శిఖరాలను అధిరోహించిన రాజగోపాల్ శేషజీవితాన్ని జైలు ఊచల వెనుక గడపనున్నారు. -
మరణించేవరకు జైలు జీవితమే..
పఠాన్కోట్: ఏడాదిన్నర క్రితం తీవ్ర సంచలనం సృష్టించిన కఠువా సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని కోర్టు సోమవారం దోషులుగా తేల్చింది. వారిలో ముగ్గురికి యావజ్జీవ శిక్ష (జీవితఖైదు), ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రధాన నిందితుడు సంజీరామ్ కొడుకు అయిన విశాల్ను కోర్టు సరైన సాక్ష్యాలు లేని కారణంగా నిర్దోషిగా విడుదల చేసిందని బాధితురాలి కుటుంబం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఫరూఖీ ఖాన్ చెప్పారు. పంజాబ్లోని పఠాన్కోట్లోని సెషన్స్ కోర్టు ఈ కేసును సంవత్సరంపాటు విచారించిన అనంతరం న్యాయమూర్తి తేజ్వీందర్ సింగ్ సోమవారం తీర్పు చెప్పారు. ఈ కేసును జమ్మూ కశ్మీర్లో కాకుండా బయటి కోర్టు విచారించాలని గతేడాది మే 7న సుప్రీంకోర్టు ఆదేశించడంతో పఠాన్కోట్ కోర్టు ఈ కేసును విచారించింది. రణ్బీర్ పీనల్ కోడ్ (ఆర్పీసీ) కింద కోర్టు వారిని దోషులుగా తేలుస్తూ, బయట మీడియా ప్రతినిధులు భారీ సంఖ్యలో వేచి ఉండగా తీర్పు వెల్లడించింది. కోర్టులోకి విలేకరులను అనుమతించలేదు. జమ్మూ కశ్మీర్లోని కఠువాలో గతేడాది జనవరిలో ఎనిమిదేళ్ల బాలికపై ఓ ఆలయంలో సామూహిక అత్యాచారం, హత్య జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. బాలికను అపహరించి, ఆలయంలో బంధించి, నాలుగురోజుల పాటు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన అనంతరం బండరాళ్లతో మోదీ హత్య చేశారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. కోర్టు ఈ కేసులో మొత్తం ఆరుగురిని దోషులుగా తేల్చగా, వారిలో నలుగురు పోలీసులే కావడం గమనార్హం. మరణించేవరకు జైలు జీవితమే.. బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న ఆలయ సంరక్షకుడు సంజీరామ్, ప్రత్యేక పోలీస్ అధికారి (ఎస్పీవో) దీపక్ ఖజూరియాతోపాటు మరో వ్యక్తి ప్రవేశ్కుమార్లను కోర్టు దోషులుగా తేల్చింది. ఈ ముగ్గురూ అత్యాచారం, హత్య, నేరపూరిత కుట్రకు పాల్పడటంతోపాటు సాక్ష్యాలను నాశనం చేశారంటూ వచ్చిన ఆరోపణలు రుజువైనట్లు కోర్టు తెలిపింది. వీరిని దోషులుగా ప్రకటిస్తూ జీవిత ఖైదు విధించింది. జీవిత ఖైదు అంటే మరణించేంత వరకు జైలులో ఉండాల్సిందేనని కోర్టు స్పష్టంగా వివరించింది. అలాగే మరో ఎస్పీవో సురేంద్ర వర్మ, ఎస్సై ఆనంద్ దత్తా, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్లు సాక్ష్యాలను నాశనం చేశారంటూ వారికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానా విధించింది. జరిమానా కట్టలేకపోతే మరో ఆరునెలలు ఎక్కువగా జైలు జీవితం గడపాలని ఆదేశించింది. ఆనంద్ దత్తా, తిలక్ రాజ్లు కేసులో సాక్ష్యాలను నాశనం చేసేందుకు సంజీరామ్ నుంచి రూ. 4 లక్షలు తీసుకున్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. బాలిక సంచార జాతికి చెందిన అమ్మాయి కాగా, వారి మైనారిటీ జాతిని పూర్తిగా లేకుండా చేసేందుకు చాలా పకడ్బందీగా కుట్ర పన్ని ఈ నేరానికి ఒడిగట్టారని చార్జిషీట్లో పోలీసులు పేర్కొన్నారు. తీర్పుపై మెహబూబా హర్షం.. కోర్టు తీర్పు పట్ల జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు హర్షం వ్యక్తం చేశారు. ‘నేరస్తులను చట్టానికి లోబడి వీలైనంత కఠినంగా శిక్షించాలి. ఇలాంటి నేరస్తులకు మద్దతు తెలిపిన రాజకీయ నేతలను ఏదైనా అనడానికి అసలు పదాలు లేవు’ అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. బీజేపీ నాయకులు గతంలో నిందితులకు మద్దతుగా నిలవడం తెలిసిందే. దోషులకు అత్యంత కఠిన శిక్ష పడేలా చేయాలని మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. దోషులందరికీ మరణశిక్ష వేయాలంటూ హైకోర్టులో జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేయాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్మన్ రేఖా శర్మ కోరారు. మరణశిక్ష పడుతుందనుకున్నాం.. ‘నేరస్తులకు మరణశిక్ష పడుతుందని మేం ఆశించాం. నిర్దోషిగా బయటపడిన వ్యక్తీ.. ప్రధాన నిందితుడేనని మేం వింటున్నాం. అలాంటప్పుడు అతణ్ని ఎందుకు విడుదల చేశారు’అని బాలిక తండ్రి అన్నారు. బాధిత కుటుంబం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు ఓ ప్రకటన విడుదల చేస్తూ, తాము కోర్టు తీర్పును పరిశీలించిన అనంతరం పై కోర్టుకు వెళ్తామనీ, నిర్దోషిగా విడుదలైన విశాల్ను దోషిగా తేల్చాలని అప్పీల్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఓ బాలనేరస్థుడితో సహా మొత్తం ఎనిమిది మందిపై జమ్మూ కశ్మీర్ పోలీసులు అభియోగపత్రం దాఖలు చేయగా, ఏడుగురిపై విచారణను ఈ కోర్టు చూసుకుంది. ఎప్పుడేం జరిగిందంటే.. ► 2018 జనవరి 10: కఠువా జిల్లాలోని రసనా గ్రామంలో బకర్వాల్ సంచార జాతికి చెందిన 8 ఏళ్ల బాలిక గుర్రాలను మేపుతుండగా ఆమె ఆచూకీ గల్లంతు. ► జనవరి 12: బాలిక తండ్రి ఫిర్యాదుతో హీరానగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు. ► జనవరి 17: బాలిక మృతదేహం లభ్యం. గ్యాంగ్రేప్ తర్వాత చంపేసినట్లు పోస్ట్మార్టం నివేదికలో వెల్లడి. ► జనవరి 22: దేశవ్యాప్త నిరసనలతో జమ్మూ కశ్మీర్ క్రైం బ్రాంచ్కు కేసు బదిలీ. ► ఫిబ్రవరి 16: నిందితులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన హిందూ ఏక్తా మంచ్. ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నేతలు, మంత్రులు చంద్ర ప్రకాశ్, లాల్ సింగ్. ► మార్చి 1: ప్రధాన నిందితుడు, ఆలయ సంరక్షకుడు సంజీరామ్ను బంధువైన బాల నేరస్తుడి అరెస్టుకు వ్యతిరేకంగా హిందూ ఏక్తా మంచ్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నేతలు, మంత్రులు. ► ఏప్రిల్ 9: మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా తేల్చి, వారిలో ఏడుగురిపై అభియోగపత్రాన్ని కఠువా కోర్టులో దాఖలు చేసిన పోలీసులు ► ఏప్రిల్ 10: బాల నేరస్తుడినని చెప్పుకున్న ఎనిమిదో వ్యక్తి పైనా అభియోగపత్రం దాఖలు చేసిన పోలీసులు. ► ఏప్రిల్ 14: మంత్రివర్గం నుంచి తప్పుకున్న చంద్ర ప్రకాశ్, లాల్ సింగ్. బాధితులకు న్యాయం చేయాలన్న ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్. ► ఏప్రిల్ 16: కఠువాలో ప్రధాన సెసన్స్ కోర్టు జడ్జి ముందు విచారణ ప్రారంభం. ► మే 7: కఠువా నుంచి పంజాబ్లోని పఠాన్కోట్కు విచారణను మార్చిన సుప్రీంకోర్టు. విచారణను రహస్యంగా, వేగవంతంగా, మీడియాకు దూరంగా చేపట్టాలని ఆదేశించిన సుప్రీం కోర్టు. ► 2019 జూన్ 3: విచారణను ముగించిన పఠాన్ కోట్ సెషన్స్ కోర్టు. ► జూన్ 10: దోషులుగా తేల్చుతూ తీర్పు వెల్లyì ంచిన కోర్టు. సాంజీ రామ్ కఠువా దోషులు దీపక్ ఖజురియా ఎస్సై ఆనంద్ దత్తా, సురేందర్ వర్మ, తిలక్ రాజ్ -
కథువా హత్యాచార కేసు : ముగ్గురికి జీవిత ఖైదు
చండీగఢ్ : దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కథువా అత్యాచార కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా నిర్ధారించిన పఠాన్కోట్ స్పెషల్ కోర్టు సోమవారం మధ్యాహ్నం వారిలో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆలయ పూజారి సాంజీ రామ్, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్ ఖజూరియా, ప్రవేష్కుమార్లకు జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో దోషులుగా తేలిన ముగ్గురు పోలీసు అధికారులు సురేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, ఆనంద్ దత్తాలకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతకుముందు ఈ కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా ఖరారు చేస్తూ ప్రత్యేక న్యాయస్ధానం తుదితీర్పు వెలువరించింది. కాగా, జమ్ముకశ్మీర్లోని కథువా జిల్లాలో గతేడాది జనవరిలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆలయంలోనే హత్యాచారం చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం విదితమే. బాధితురాలికి మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఘటన కలకలం రేపింది. బాలికను గ్రామంలోని ఓ దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల తర్వాత అత్యంత దారుణ పరిస్థితిలో బాలిక మృతదేహం బయటపడింది. పాశవికమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు,. నిరసనలు హోరెత్తాయి. ఈ కేసులో గ్రామ పెద్ద సాంజి రామ్, అతని కొడుకు విశాల్, మైనర్ మేనల్లుడితోపాటు ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు దీపక్ ఖజురియా, సురేందర్ వర్మలను క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సాంజిరామ్ నుంచి నాలుగు లక్షలు లంచం తీసుకుని ఆధారాలను ధ్వంసంచేశారనే ఆరోపణలపై కానిస్టేబుల్ తిలక్రాజ్, సబ్ ఇన్సిపెక్టర్ ఆనంద్ దత్తా కూడా అరెస్టయ్యారు. జమ్మూకశ్మీర్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. కేసు విచారణను సుప్రీంకోర్టు పఠాన్కోట్ కోర్టుకు బదిలీ చేసింది. -
హత్య కేసులో మంత్రి కుమారుడికి జీవిత ఖైదు
ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ పరిశ్రమల మంత్రి టుంకె టగ్రా కుమారుడు కజుమ్ బగ్రాకు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. వెస్ట్ సియాంగ్ జిల్లా ఆలో పట్టణంలోని హోటల్ వెస్ట్ వెలుపల కెంజుం కంసి అనే వ్యక్తిని 2017 మార్చి 26న బగ్రా కాల్చిచంపారనే అభియోగాలు రుజువైనందున ఆయనకు జీవిత ఖైదు విధించినట్టు కోర్టు వెల్లడించింది. ఓ కాంట్రాక్టుకు సంబంధించి చెల్లింపులపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో బాగ్రా ఆ వ్యక్తిని హత్య చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. హోటల్ వెలుపల ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో హత్య దృశ్యాలు రికార్డు కావడంతో మంత్రి కుమారుడి నేరం కెమెరా కంటికి చిక్కింది. ఈ హత్య జరిగిన సమయంలో మంత్రి టుంకె టగ్రా అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్నారు. -
సామూహిక లైంగిక దాడి : దోషులుగా తేలిన ఆరుగురు
రాంచీ : జార్ఖండ్లోని ఖుంటి జిల్లా కొచాంగ్లో గత ఏడాది ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఐదుగురు యువతులపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఆరుగురు నిందితులను సివిల్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఫాదర్ అల్ఫాన్సోతో పాటు మరో ఐదుగురిని దోషులుగా కోర్టు నిర్ధారించిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుశీల్ జైస్వాల్ తెలిపారు. సామూహిక లైంగిక దాడి కేసులో అల్ఫాన్సో ప్రధాన కుట్రదారుడుగా కోర్టు గుర్తించిందని వెల్లడించారు. గత ఏడాది జూన్ 19న ఖుంటి జిల్లాలోని ఓ గ్రామంలో వీధి నాటకం ప్రదర్శిస్తున్న ఓ ఎన్జీవోకు చెందిన ఐదుగురు యువతులను అపహరించిన దుండగులు వారిని తుపాకీతో బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన దుమారం రేపిన సంగతి తెలిసిందే. జాతీయ మహిళా కమిషన్ ఈ కేసును తీవ్రంగా పరిగణించడంతో జూన్ 23న జార్ఖండ్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. -
లైంగిక దాడి కేసులో ఆశారాం కుమారుడు దోషి
అహ్మదాబాద్ : లైంగిక దాడి కేసులో ఆశారాం బాపూ కుమారుడు నారాయణ్ సాయిని సూరత్ సెషన్స్ కోర్టు శుక్రవారం దోషిగా నిర్ధారించింది. సూరత్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై నారాయణ్ సాయి లైంగిక దాడికి పాల్పడినట్టు సెషన్స్ కోర్టు ధ్రువీకరించింది. ఇదే కేసులో గంగా,జమున, హనుమాన్లను కూడా కోర్టు దోషులుగా పేర్కొనగా, మోనికా అనే మహిళను నిర్ధోషిగా నిర్ధారించింది. 2013లో నమోదైన ఈ కేసులో ఆరేళ్ల తర్వాత నారాయణ్ సాయిపై అభియోగాలు రుజువయ్యాయి. ఇక ఈ కేసుకు సంబంధించి దోషులకు ఈనెల 30న శిక్ష ఖరారు చేస్తారు. కాగా, ఆశారాం బాపూ సైతం మహిళలపై లైంగిక దాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రచారంలో నేరస్తులు
సాక్షి, అనంతపురం సెంట్రల్: జిల్లాలో టీడీపీ అభ్యర్థులు బరి తెగిస్తున్నారు. ముఖ్యంగా నేరస్తులను చేరదీసి ప్రజలను భయాందోళనకు గురి చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా ప్రచార కార్యక్రమాలకు రౌడీషీటర్లు, నేర చరిత్ర ఉన్న వ్యక్తులను వెంట తీసుకెళ్తున్నారు. దీని వలన ఆయా గ్రామాల్లో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకుల్లో ఓ రకమైన భయాందోళన కలిగించడమే లక్ష్యంగా పెటుŠుట్కన్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ తరహా వ్యవహారాలు అనంతపురం అర్బన్, రాప్తాడు నియోజకవర్గాల నుంచి ఎక్కువశాతం కనిపిస్తున్నాయి. గతంలోనే వ్యూహరచన తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ తరహా కుట్రపూరిత రాజకీయాలు ప్రారంభించారు. టార్గెట్ 2019గా పెట్టుకొని ప్రత్యర్థి పార్టీలలో చురుగ్గా పాల్గొంటున్న వ్యక్తులను హతమార్చారు. అం దులో భాగంగా వైఎస్సార్సీపీ రాప్తాడు మండల మాజీ కన్వీనర్ ప్రసాద్రెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఈయన బతికుంటే వచ్చే ఎన్నికలకు ఇబ్బందనే కారణంతో ప్రత్యర్థులను చేరదీసి హత్యకు ఉసిగొల్పారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందుకు బలం చేకూర్చే విధంగా హత్య కేసులో నిందితులు ఎప్పుడూ పరిటాల శ్రీరామ్ చుట్టూనే ఉంటున్నారు. అనంతపురం నగరంలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. రౌడీషీటర్ల ఆధిపత్య పోరులో భాగంగా గతేడాది రుద్రంపేటలో జంటహత్యలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో హత్యలో పాల్గొన్న నిందితులను ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి చేరదీస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికల సమయంలో వీరి సేవలను వినియోగించుకోవడం చర్చనీయాంశమైంది. పోలీసు నిఘా వ్యవస్థ చర్యలు శూన్యం పోలీసుశాఖలో నిఘా వ్యవస్థ నేరస్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రౌడీషీటర్లు, హత్యకేసు నిందితులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలి. ఎన్నికల సమయంలో మరింత కఠినంగా వ్యవహరించాలి. అయితే జిల్లాలో పోలీసు నిఘా వ్యవస్థ పెద్దగా దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అధికారపార్టీ అనుయాయులుగా చెలమాణి అవుతున్న రౌడీషీటర్ల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న ఓ సీఐ నేరస్తులకు రాచమర్యాదలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో చాలావరకు వారిని బైండోవర్లు కూడా చేయలేదని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రజలను భయాబ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నా పట్టించుకోవడం లేదు. రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుడు, మండల మాజీ కన్వీనర్ ప్రసన్నాయపల్లి ప్రసాద్రెడ్డి హత్య కేసులో ఉన్న ప్రధాన నిందితుడు పంచగల శ్రీనివాసులు అలియాస్ ఉప్పర శ్రీనివాసులు ఇటీవల టీడీపీ తరఫున జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నాడు. ఈయనకు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ మద్దతు కూడా ఉండడంతో గ్రామాల్లో తిరుగుతున్నాడు. నగరంలో ఓ రౌడీషీటర్ను ఇటీవల నాల్గవ పట్టణ పోలీసులు స్టేషన్కు రావాలని ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా బైండోవర్ చేయాలని నిర్ణయించారు. అయితే సదరు రౌడీషీటర్ స్టేషన్కు రాకుండా నేరుగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్చౌదరి వద్దకు వెళ్లాడు. ఆయన చేత స్టేషన్ ఉన్నతాధికారికి ఫోన్ చేయించడంతో అతడి బైండోవర్ ఆగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. -
డ్రగ్స్ కింగ్, మాజీ రెజ్లర్ భోలాకు షాక్
మొహాలీ: మత్తు పదార్ధాల సరఫరా కేసులో అంతర్జాతీయ మాజీ రెజ్లర్, అర్జున్ అవార్డు గ్రహీత జగదీశ్ సింగ్ భోలాను మొహాలీ సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. సుమారు 6వేల కోట్ల రూపాయల డ్రగ్స్ రాకెట్లో పంజాబ్కు చెందిన డ్రగ్స్ కింగ్ భోలాను 2013లో అరెస్ట్ చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం భోలాతోపాటు మరో 49 మంది నిందితులను బుధవారం సీబీఐ కోర్టుముందు ప్రవేశపెట్టగా వీరిలో చాలామందిని సీబీఐ కోర్టు దోషులుగా నిర్ధారించింది. కాగా భోలా ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్లోని అక్రమ ఫ్యాక్టరీల ద్వారా సింథటిక్ డ్రగ్స్ను తయారుచేసి అంతర్జాతీయ మార్కెట్కు విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కెనడా, ఉత్తర అమెరికా, యూరప్లోని పలు దేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారంటూ అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ డీఎస్పీగా పనిచేస్తున్న భోలాను 2012లో పదవినుంచి తొలగించిన సంగతి తెలిసిందే. -
డేరా బాబాకు మరో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు మరో కేసులో జైలు శిక్షపడనుంది. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసుపై పంచకుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. డేరాబాబాతో పాటు మరో ముగ్గురిని కోర్టు దోషిగా తేల్చింది. నలుగురు దోషులకు జనవరి 17న శిక్షలు ఖరారు చేయనుంది. ప్రస్తుతం ఆయన హర్యానాలోని రోహ్తక్ సునారియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సిర్సాలోని డేరా సచ్చా సౌద హెడ్ క్వార్టర్స్లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి వెలుగులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో 2002 అక్టోబరులో జర్నలిస్ట్ రామచంద్రను డేరాబాబా అనుచరులు దారుణంగా హత్యచేశారు. (జేజేల నుంచి.. జైలు దాకా...!) ఇక ఇప్పటికే ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరాబాబాకు 20 ఏళ్ల జైలు శిక్షపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో తీర్పు వెలువరించాక జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనల్లో 36 మంది చనిపోయారు. ఈ క్రమంలో మళ్లీ అలాంటి ఘటనలు జరగకుడా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. డేరాబాబా దోషిగా తేలిన నేపథ్యంలో పంచకుల ప్రత్యేక కోర్టు ఆవరణలో పోలీసులు భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘాపెట్టారు. (రూ. 20 సంపాదిస్తున్న డేరా బాబా) -
మాజీ ఎమ్మెల్యేకి పదేళ్ల జైలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: బాలికపై అత్యాచారం కేసులో డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎం. రాజ్కుమార్ (52)కు పదేళ్ల జైలు శిక్ష, రూ.42 వేల జరిమానా విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. 2006లో పెరంబలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో కేరళ రాష్ట్రం ఇడిక్కి జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక ఇతని ఇంట్లో పనిచేసింది. అయితే పనిలో చేరిన కొద్ది రోజులకే ఆ బాలిక తన తల్లికి ఫోన్ చేసి ఇక్కడ ఉండలేనని, తనను తీసుకెళ్లాలని కోరింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పెరంబలూరు ప్రయాణమవుతుండగా, రాజ్కుమార్ స్నేహితుడు జయశంకర్ ఫోన్ చేసి అనారోగ్యం కారణంగా బాలికను ఆస్పత్రిలో చేర్పించినట్టు చెప్పాడు. తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లి బాలికను చూడగా స్పృహలేని స్థితిలో కనిపించింది. చికిత్స పొందుతూనే మరణించింది. తన కూతురు మరణంలో పలు అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరంబలూరు పోలీసులు కేసు నమోదు చేసి, శవపంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె అత్యాచారానికి గురై మరణించినట్లు తేలింది. దీంతో డీఎంకే మాజీ ఎమ్మెల్యే రాజ్కుమార్, అతని స్నేహితులు జయశంకర్, అన్బరసు, మహేంద్రన్, హరికృష్ణ, పన్నీర్ సెల్వం సహా ఏడుగురిపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును సీబీసీఐడీ విచారణ చేపట్టి రాజ్కుమార్ను అరెస్టు చేసింది. కేసు పెరంబలూరు న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న సమయంలోనే పన్నీర్ సెల్వం చనిపోయాడు. రాజ్కుమార్ మాజీ ఎమ్మెల్యే కావడంతో ప్రజా ప్రతినిధుల నేరాల విచారణకు ఏర్పడిన ప్రత్యేక కోర్టుకు ఈ కేసు చేరింది. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శాంతి నిందితులైన మాజీ ఎమ్మెల్యే రాజ్కుమార్, జయశంకర్కు పదేళ్ల జైలు శిక్ష, రూ. 42 వేల జరిమానా విధించారు. -
సజ్జన్ కుమార్ దోషే
న్యూఢిల్లీ: 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సజ్జన్ కుమార్(73)ను ఢిల్లీ హైకోర్టు దోషిగా తేల్చింది. ఆయన ఇక మిగిలిన తన జీవిత కాలమంతా జైలులోనే గడపాలని ఆదేశిస్తూ జీవిత ఖైదు విధించింది. సిక్కుల ఊచకోత జరిగిన 34 ఏళ్ల తరువాత సోమవారం కోర్టు తీర్పు వెలువరిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆనాడు రాజకీయ పలుకుబడి, మద్దతు ఉన్న వారే మతం పేరిట హింసకు పాల్పడ్డారని పేర్కొంది. సిక్కు వ్యతిరేక అల్లర్లను మానవత్వంపై జరిగిన నేరంగా అభివర్ణించిన కోర్టు..సజ్జన్ కుమార్పై హత్య, వేర్వేరు మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడానికి నేరపూరిత కుట్ర పన్నడం, గురుద్వారాను అపవిత్రం, విధ్వంసం చేయడం తదితర అభియోగాలను మోపింది. ఈ కేసులో సజ్జన్తో పాటు ఇది వరకే దోషులుగా తేలిన మరో ఐదుగురు ఢిల్లీ వదిలి వెళ్లొద్దని, ఈ నెల 31 లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సజ్జన్ తరఫు లాయర్ వెల్లడించారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు చారిత్రకమని బీజేపీ, శిరోమణి అకాలీదళ్, ఆప్ స్వాగతించాయి. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసును ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో ముడిపెట్టొద్దని కాంగ్రెస్ పేర్కొంది. ముగ్గురు సాక్షుల పోరాట ఫలితం: ఈ కేసులో నిందితులైన సజ్జన్ కుమార్తో పాటు మరో ఐదుగురిపై 2010లో విచారణ ప్రారంభమైంది. మూడేళ్ల తరువాత సజ్జన్ కుమార్ మినహా మిగిలిన వారంతా దోషులని కింది కోర్టు తేల్చింది. ఈ తీర్పును సీబీఐ సవాలు చేయగా తాజాగా జస్టిస్ ఎస్.మురళీధర్, జస్టిస్ వినోద్ గోయల్లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం సజ్జన్ కూడా దోషి అని ప్రకటించింది. ముగ్గురు ప్రత్యక్ష సాక్షులు జగదీశ్ కౌర్, ఆమె కజిన్ జగ్షీర్ సింగ్, నిర్ప్రీత్ కౌర్ల అలుపెరుగని పోరాటం వల్లే సజ్జన్కు శిక్ష పడిందని బెంచ్ పేర్కొంది. నిందితులకు శిక్ష పడేందుకు మూడు దశాబ్దాలు పట్టినా కూడా సత్యం గెలిచి, న్యాయం జరుగుతుందని బాధితులకు భరోసా ఇవ్వడం ముఖ్యమని వ్యాఖ్యానించింది. సీబీఐ రంగప్రవేశం చేశాకే సాక్షులు ధైర్యంగా ముందుకొచ్చి నోరు విప్పారని పేర్కొంది. మరోవైపు, సజ్జన్ కుమార్ ఢిల్లీలోనే ఉన్నారని, డిసెంబర్ 31లోగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన తరఫు లాయర్ వెల్లడించారు. ఒకవేళ ఆలోగా అత్యున్నత న్యాయ స్థానంలో తాజా తీర్పును సవాలుచేయకుంటే సజ్జన్కుమార్ లొంగిపోతారని తెలిపారు. కళంకితుడిని సీఎం ఎలా చేస్తారు?: జైట్లీ సజ్జన్ కుమార్కు జీవిత ఖైదు విధించడాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వాగతించారు. ఇదే కేసులో సిక్కులు దోషిగా భావిస్తున్న కమల్నాథ్ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించడాన్ని తప్పుపట్టారు. సిక్కుల ఊచకోతలో సజ్జన్కుమార్ ఒక మాయని మచ్చలా మిగిలిపోయారని, దేశం ఇంత పెద్ద ఎత్తున హత్యాకాండను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. సిక్కుల దృష్టిలో దోషిగా నిలబడిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజే ఈ తీర్పు రావడం గమనార్హమని పరోక్షంగా కమల్నాథ్ను ఉద్దేశించి అన్నారు. 1984 సిక్కుల ఊచకోత కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును రాజకీయం చేయడం సరికాదని, చట్టం తన పనిని తాను చేసుకుపోవాలని కాంగ్రెస్ పేర్కొంది. సిక్కు వ్యతిరేక అల్లర్లలో చెలరేగిన హింసలో కమల్నాథ్ పాత్ర కూడా ఉందని, ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎలా నియమిస్తారని బీజేపీ, శిరోమణి అకాలీదళ్ కాంగ్రెస్ను నిలదీసిన సంగతి తెలిసిందే. అయితే కమల్నాథ్ తనపై వచ్చిన ఆరోపణల్ని తోసిపుచ్చారు. ఈ కేసులో తాను నిందితుడిని కాదని, తనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని మధ్యప్రదేశ్ సీఎంగా ప్రమాణం చేశాక పేర్కొన్నారు. 4 రోజుల్లో 2,733 మంది సిక్కుల ఊచకోత 1984, అక్టోబర్ 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులైన ఇద్దరు సిక్కులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీంతో నవంబర్ 1–4 మధ్య రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా చెలరేగిన హింసలో 2,733 మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. దక్షిణ ఢిల్లీలోని పాలమ్ కాలనీలో ఐదుగురు సిక్కుల హత్య కేసులో సజ్జన్ నిందితుడిగా ఉండగా, కోర్టు తాజాగా తీర్పును ప్రకటించింది. జగదీశ్ కౌర్ భర్త, కొడుకు, ఆమె ముగ్గురు కజిన్లు కేఖర్ సింగ్, గురుప్రీత్ సింగ్, రఘువేందర్ సింగ్లతో పాటు నరేందర్ పాల్ సింగ్, కుల్దీప్ సింగ్..మొత్తం ఐదుగురిని అల్లరి మూకలు దారుణంగా హత్య చేశారు. తన తండ్రిని సజీవంగా దహనం చేయడాన్ని నిర్ప్రీత్ కౌర్ ప్రత్యక్షంగా చూసింది. 34 ఏళ్లు అంటే సుదీర్ఘ కాలమే అయినా నిందితుల అసలు రంగు బయటపెట్టేందుకు కృత నిశ్చయంతో పోరాడామని జగదీశ్ కౌర్, నిర్ప్రీత్ కౌర్ చెప్పారు. తాజా తీర్పు తమకు కొంత సాంత్వన చేకూర్చిందని, ఇన్నాళ్లూ తాము అనుభవించిన అన్యాయం, క్షోభ మరొకరికి రావొద్దని అన్నారు. -
సజ్జన్ కుమార్ను దోషిగా తేల్చిన హైకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ను 1984 సిక్కు వ్యతిరేక ఘర్షణల కేసులో ఢిల్లీ హైకోర్టు సోమవారం దోషిగా తేల్చింది. ఈ కేసులో కాంగ్రెస్ నేతకు విముక్తి కల్పిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు భిన్నంగా హైకోర్టు ఆయనను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో సజ్జన్ కుమార్కు జీవిత ఖైదు విధించింది. 1984, అక్టోబర్ 31న ఇందిరా గాంధీ హత్యానంతరం ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఐదుగురి హత్యకు సంబంధించిన కేసులో జస్టిస్ మురళీధర్, జస్టిస్ వినోద్ గోయల్తో కూడిన బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు మానవత్వంపై జరిగిన దాడిగా పేర్కొన్న హైకోర్టు ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే భరోసాను బాధితుల్లో కల్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈ కేసులో సజ్జన్ను నిర్ధోషిగా పేర్కొంటూ మరో ఐదుగురిని దోషులుగా పేర్కొన్నప్రత్యేక న్యాయస్ధానం ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. మాజీ కౌన్సిలర్ బల్వాన్ కొక్కర్, మాజీ ఎమ్మెల్యే మహేందర్ యాదవ్, కిషన్ కొక్కర్, గిర్ధారి లాల్, కెప్టెన్ భాగ్మల్లను కేసులో దోషులుగా 2013లో ప్రత్యేక న్యాయస్ధానం స్పష్టం చేసింది. ఢిల్లీలోని కంటోన్మెంట్కు చెందిన రాజ్నగర్ ప్రాంతంలో ఒకే కుటుంబంలోని కేహార్ సింగ్, గుర్ప్రీత్ సింగ్, రాఘవేందర్ సింగ్, నరేందర్ పాల్ సింగ్, కుల్దీప్ సింగ్లను హత్య చేసిన కేసులో సజ్జన్ కుమార్ సహా ఐదుగురు ఇతరులు విచారణ ఎదుర్కొన్నారు. జస్టిస్ జీటీ నానావతి కమిషన్ సిఫార్సుల మేరకు సజ్జన్ కుమార్ ఇతరులపై 2005లో కేసు నమోదైంది. -
మాజీ క్రికెటర్కు సుప్రీం ఊరట
న్యూఢిల్లీ : నడి రోడ్డుపై ఓ వ్యక్తిని కొట్టి చంపారనే కేసులో మాజీ క్రికెటర్, పంజాబ్ పర్యాటక మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూను సుప్రీం కోర్టు నిర్ధోషిగా తేల్చింది. 30 ఏళ్ల క్రితం1988 డిసెంబర్ 27న సిద్ధూ అతని స్నేహితుడు రూపీందర్ సింగ్ సంధు పాటియాలలోని రోడ్డుపై తమ జీప్సీని ఆపారు. అదే దారిపై వెళుతున్న గుర్నాం సింగ్.. వాహనాన్ని పక్కకు తొలగించాల్సిందిగా సిద్ధూ, సంధులను కోరాడు. ఇది వారి మధ్య గొడవకు దారి తీసింది. ఈ ఘటనలో గాయపడిన గుర్నాం ఆస్పత్రికి తరలించిన తర్వాత మృతిచెందాడు. సిద్ధూ గాయపరచడం వల్లే గుర్నాం మరణించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన పంజాబ్, హర్యానా హైకోర్టు 2006లో సిద్ధూతోపాటు, సంధుకు లక్ష రూపాయల జరిమానాతో పాటు, మూడు ఏళ్ల జైలు శిక్ష విధించింది. గుర్నాం వైద్య నివేదిక అస్పష్టంగా ఉందంటూ సిద్ధూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు.. హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. సిద్ధూ బాధితుడిని ఉద్దేశపూర్వకంగా గాయపరిచాడని నిర్ధారిస్తూ రూ వేయి జరిమానాను విధించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు సిద్ధూ కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మంత్రివర్గంలో కొనసాగుతున్న సిద్ధూకు న్యాయ సహాయం చేయాలని సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నిర్ణయించారు. కానీ ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం సిద్ధూకు కేసు నుంచి విముక్తి కల్పిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. -
ఇక ఆ హాస్యనటుడు జైలుకేనా?
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ హాస్యనటుడు రాజ్పాల్ యాదవ్ రుణ రికవరీ కేసులో దోషిగా తేలారు. చెక్ బౌన్స్ సహా, ఏడు కేసుల్లో రాజ్పాల్ యాదవ్, అతని భార్య రాధను కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఢిల్లీలోని 'కర్ కర్ డూమా' కోర్టు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అమిత్ అరోరా ఈ తీర్పును వెలువరించారు. ఈ నెల 23న న్యాయస్థానం వీరికి శిక్షలను ఖరారు చేయనుంది. కాగా 2010లో ఒక హిందీ సినిమా నిర్మాణం కోసం రాజ్పాల్ , అతడి భార్య కలిసి ఢిల్లీకి చెందిన వ్యాపారి ఎం.జి.అగర్వాల్ వద్ద రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అయితే ఆ బాకీ తీర్చకపోవడంతో బాధితుడు రికవరీ కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈ బాకీ మొత్తం ఇపుడు రూ. 8కోట్లకు చేరినట్టు అంచనా. గతంలో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన కేసులో సుప్రీంకోర్టు రాజ్పాల్ యాదవ్, అతని భార్యకు ఆరు రోజుల జైలు శిక్షను విధించింది. దీంతోపాటు ముంబై మలాడ్లోని రాజ్పాల్యాదవ్, అతడి భార్యకు చెందిన యాక్సిస్ బ్యాంక్ జాయింట్ అకౌంట్ను, వారి కంపెనీ అకౌంట్ను సైతం అటాచ్ చేయాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇకపోతే బాలీవుడ్ సినిమాలు భూల్ భులయ్యా, పార్టనర్, హంగమా వంటి పలు విజయవంతమైన చిత్రాలతోపాటు, తెలుగులో రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమాకు సీక్వల్ కిక్-2 లో కూడా ఆయన నటించారు. -
సల్మాన్ నిర్మాతల్లో గుబులు
సాక్షి, ముంబయి : కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ను జోథ్పూర్ కోర్టు దోషిగా నిర్ధారించడంతో బాలీవుడ్లో దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. సల్మాన్ హీరోగా రూ వందల కోట్లతో పలు సినిమాలు రూపొందుతుండటంతో ఆయా చిత్ర నిర్మాతల్లో ఉత్కంఠ నెలకొంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద సల్మాన్కు రెండేళ్ల జైలు శిక్ష విధించారు. బాలీవుడ్ కండలవీరుడు ప్రస్తుతం రెమోడిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రేస్ 3 దుబాయ్ షెడ్యూల్ను ఇటీవల పూర్తి చేశారు. ఈద్ సందర్భంగా ఈ మూవీ జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. రేస్ 3తో పాటు అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో అతుల్ అగ్నిహోత్రి నిర్మిస్తున్న భరత్ మూవీకి పనిచేయాల్సి ఉంది. భరత్ తర్వాత సోనాక్షి సిన్హాతో కలిసి దబాంగ్ 3 సెట్స్లో అడుగుపెడతారు. కిక్ 2లో కూడా సల్మాన్ నటించేందుకు రంగం సిద్ధమైంది. ఇంతవరకూ షూటింగ్కు వెళ్లని ఈ మూవీని 2019 క్రిస్మస్కు రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు మరికొద్ది నెలల్లో ప్రసారమయ్యే టెలివిజన్ సో దస్ కా దమ్ను సల్మాన్ నిర్వహిస్తున్నారు. ఇక రియాల్టీ షో బిగ్ బాస్లో తిరిగి సల్మాన్ను ప్రవేశపెట్టాలని మేకర్లు భావిస్తున్నారు. కృష్ణజింకల కేసులో సల్మాన్ను జోధ్పూర్ కోర్టు దోషిగా నిర్ధారించడంతో ఈ ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకమైంది. -
కిరాతకుడికి మహిళా కోర్టు మరణశిక్ష
సాక్షి ప్రతినిధి, చెన్నై: తన కన్న తల్లిని, ఆరేళ్ల చిన్నారిని అమానుషంగా హతమార్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దశ్వంత్ (24)కు తమిళనాడులోని మహిళా కోర్టు మరణదండన విధించింది. చిన్నారిపై అత్యాచారం చేసి సజీవంగా తగలబెట్టినట్లు, డబ్బు ఇవ్వలేదని తల్లినే హతమార్చినట్లు నేరం రుజువు కావడంతో చెంగల్పట్టు మహిళా కోర్టు నిందితునికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు సోమవారం తీర్పు వెల్లడించింది. చెన్నై శివారులోని కున్రత్తూరు సంబంధం నగర్కు చెందిన దశ్వంత్ తల్లిదండ్రులతో కలసి ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. అదే అపార్ట్మెంట్లో బాబు అనే వ్యక్తి కూడా ఉంటున్నారు. బాబు కుమార్తె హాసిని (6)ని దశ్వంత్ గతేడాది ఫిబ్రవరి 5న ఇంటికి సమీపంలోని మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారిని సజీవదహనం చేశాడు. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు గతేడాది ఫిబ్రవరి 7న దశ్వంత్ను అరెస్ట్ చేశారు. గతేడాది సెప్టెంబరు 13న అతడు బెయిల్పై బయటకు వచ్చాడు. జులాయి తిరుగుళ్లకు అలవాటుపడ్డ దశ్వంత్ డబ్బు కోసం తల్లితో గొడవపడేవాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో డిసెంబర్ 2న తల్లిని దారుణంగా హత్యచేసి ఆమె మెడలోని 25 తులాల బంగారు నగలు, బీరువాలోని రూ. 10 వేల నగదు తీసుకుని తమిళనాడు నుంచి పరారయ్యాడు. డిసెంబర్ 8న ముంబైలో తమిళనాడు పోలీసులకు పట్టుబడగా, నిందితుడిని చెంగల్పట్టు మహిళా కోర్టులో హాజరుపరిచి పుళల్ సెంట్రల్ జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో దశ్వంత్ చేసిన నేరాలు సాక్ష్యాధారాలతో రుజువైనందున మరణశిక్ష విధిస్తున్నట్లు చెంగల్పట్టు మహిళా కోర్టు న్యాయమూర్తి వేల్మురుగన్ సోమవారం తీర్పు చెప్పారు. -
డేరా బాబా గుర్మీత్కు శిక్ష వెనక ఆ 8 మంది..
సాక్షి, న్యూఢిల్లీ: డేరా సచ్ఛా సౌధా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు అత్యాచారం కేసుల్లో దాదాపు 15 ఏళ్ల ఆలస్యంగానైనా 20 ఏళ్ల కఠిన కారాగారా శిక్ష పడడానికి ఎనిమిది మంది ప్రాణాలకు తెగించి పోరాడడమే కారణం. 1. ఇద్దరు సాధ్వీలు డేరా సచ్ఛా సౌధాలో ఉంటున్న ఓ సాధ్వీ తనపై బాబా అత్యాచారం జరిపాడంటూ అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి పేరిట 2002లో ఆకాశరామన్న లేఖ రాశారు. ఆ లేఖను పంజాబ్, హర్యానా హైకోర్టు సుమోటాగా తీసుకొని సిబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తులో లేఖ రాసిన సాధ్వీతోపాటు మరో సాధ్వీ బాబా బెదిరింపులకు భయపడకుండా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను సీబీఐ అధికారులకు వివరించారు. మరో 40 మంది సాధ్వీలపై కూడా బాబా అత్యాచారం జరిపారంటూ వారు ఆరోపించారు. అయితే ఆ విషయాన్ని అంగీకరించేందుకు ఇతర సాధ్వీలు ఎవరూ ముందుకు రాలేదు. బాబాపై కేసు నమోదయ్యాక ఏళ్లపాటు, వందల మైళ్ల దూరం ప్రయాణించి ఈ ఇద్దరు సాధ్వీలు అధికారుల ముందు, కోర్టుల ముందు సాక్ష్యాలు చెబుతూ వచ్చారు. 2 రంజిత్ సింగ్ అత్యాచారానికి గురైన ఓ సాధ్వీకి స్వయాన అన్న. డేరా సచ్ఛా సౌధాలో అప్పుడు ఉన్నత స్థానంలో పనిచేస్తున్నారు. చెల్లెలికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని ఆకాశరామన్న పేరిట లేఖ తానే రాసి అది ఓ స్థానిక పత్రికలో ప్రచురితమయ్యేలా చేశారు. లేఖ విషయం బయటకు వచ్చిన కొన్ని రోజుల్లోనే రంజిత్ సింగ్ హత్యకు గురయ్యారు. అది కూడా బాబా రామ్ రహీమ్ సింగ్ చేయించారన్న ఆరోపణపై కేసు నమోదైంది. ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతోంది. 3. రామ్చందర్ ఛత్రపతి హర్యానా నుంచి వెలువడుతున్న స్థానిక పత్రిక ‘పూరా సచ్’ పత్రిక సంపాదకుడు. సాధ్వీకి జరిగిన అన్యాయం గురించి ఆకాశరామన్న పేరిట రంజిత్ సింగ్ రాసిన లేఖను ప్రచురించారు. ఈ లేఖనే హైకోర్టు సుమోటాగా తీసుకొని సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆయన ఇంటివెలుపల 2002లో మోటార్ సైకిల్పై వచ్చిన ఇద్దరు దుండగులు అతినిపై కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్ర గాయాలతో 28 రోజులపాటు ఢిల్లీ ఆస్పత్రిలో మత్యువుతో పోరాడి మరణించారు. తనపై దాడికి కుట్ర పన్నింది బాబానేనంటూ ఆయన తన మరణ వాంగ్మూలంలో ఆరోపించారు. 4. అంశూల్ ఛత్రపతి జర్నలిస్ట్ రాంచందర్ ఛత్రపతి కుమరుడు. 21వ ఏట తండ్రిని పోగొట్టుకున్న అంశూల్ తన తండ్రి నమ్ముకున్న విలువల కోసం పోరాటం సాగించారు. తన తండ్రి హత్యతోపాటు బాబా డేరాలో జరుగుతున్న చీకటి కార్యకాలపాలపై దర్యాపు జరపాల్సిందిగా ఇటు సీబీఐ, అటూ హైకోర్టు చుట్టూ తిరిగారు. తన తండ్రి ప్రచురించిన సాధ్వీ లేఖను కోర్టుకు సమర్పించారు. ఆ లేఖనే కోర్టు సుమోటాగా స్వీకరించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ తర్వాత 2003లో కేసు దర్యాప్తులో భాగమైన ఆయన సిబీఐ విచారణకు సహకరిస్తూ వచ్చారు. 5. జడ్జీ జగ్దీప్ సింగ్ జడ్జీ జగ్జీప్ సింగ్ ఎన్ని వర్గాల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా లొంగకుండా, తానిచ్చే తీర్పు కారణంగా తనకు, తన కుటుంబానికి హాని కలిగే ఆస్కారం ఉందని తెలిసి కూడా నిర్భయంగా నిజాయితీగా కేసు విచారణ జరిపి దోషికి తగిన శిక్ష విధించారు. తనకంటూ ప్రత్యేక ప్రచారం కోరుకోని ముక్కుసూటి వ్యక్తి ఆయన. హర్యానాలోని జింద్కు చెందిన ఆయన పంజాబ్ యూనివర్శిటీలో లా చదివారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో లిటిగేటర్గా వత్తిని ప్రారంభించారు. 2012లో హర్యానా జుడీషియల్ సర్వీసులో చేరారు. 2016లో సీబీఐ కోర్టుకు జడ్జీగా నియమితులయ్యారు. అదే ఏడాది ఓ రోజు తాను కారులో వెళుతుండగా ఓ యాక్సిడెంట్ జరిగి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన తన కారాపి అంబులెన్స్కు కాల్ చేశారు. అంబులెన్స్ సకాలంలో వచ్చే అవకాశం లేకపోవడంతో ఆయనే స్వయంగా తన కారులో క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడు మొదటిసారిగా ప్రజలకు ఆయన పేరు పరిచయం అయింది. 6. పోలీసు డీఐజీ ములింజా నారాయణన్ పంజాబ్, హర్యానా హైకోర్టు కేసు విచారణను సీబీఐకి అప్పగించినప్పుడు ములింజా నారాయణన్ ఢిల్లీలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (స్పెషల్ క్రైమ్స్)కు పని చేస్తున్నారు. ఆయన ఈ కేసు విచారణను పర్యవేక్షించారు. ఈ కేసును త్వరగా కొట్టివేయాల్సిందిగా పలువురి నుంచి తనపై ఒత్తిళ్లు వస్తున్నాయని అప్పట్లో ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు బాబాకు శిక్ష పడిన తర్వాత ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల నుంచే కాకుండా తన పోలీసు అధికారుల నుంచి కూడా కేసును మూసివేయాల్సిందిగా ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిపారు. ఆయన 2009లో పదవీ విరమణ చేశారు. 7. మాజీ సీబీఐ డైరెక్టర్ విజయ్ శంకర్ ఈ కేసులో 2007లో చార్జిషీటు దాఖలు చేసినప్పుడు విజయ్ శంకర్ సీబీఐ డైరెక్టర్గా ఉన్నారు. కేసును నీరుగార్చాల్సిందిగా కోరుతూ పలువురు రాజకీయ నాయకుల నుంచి తనపై ఒత్తిళ్లు వచ్చాయని ఆయన కూడా తెలిపారు. దర్యాప్తు సందర్భంగా ఓసారి పంచకులలోని సీబీఐ కార్యాలయాన్ని డేరా సచ్ఛా కార్యకర్తలు చుట్టుముట్టారు. పోలీసులు సకాలంలో రావడం వల్ల ఆయన దాడి నుంచి తప్పించుకున్నారు. 8. గుర్మీత్ పారిపోయే ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు తన బ్లాక్ కమాండో భద్రతతోపాటు తన ప్రైవేటు సెక్యూరిటీతో పంచకులలోని సెక్టార్ వన్ కోర్టు కాంప్లెక్స్కు కారులో వచ్చిన గుర్మీత్ సింగ్ తనను దోషిగా నిర్ధారించి శిక్ష విధిస్తారని గ్రహించి ప్రైవేటు సెక్యూరిటీ సాయంతో తప్పించుకు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని సకాలంలో గ్రహించిన హర్యానా పోలీసులు, పారా మిలటరీ దళాలు సింగ్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బ్లాక్ కమాండోలతో పెనుగులాట కూడా జరిగింది. ప్రైవేటు సెక్యూరిటీలో ఒకరు పోలీసులపైకి కాల్పులు కూడా జరిపారు. అయినా పోలీసులు భయపడకుండా తమ విధులను నిర్వర్తించారు. బాబా కోర్టు కాంప్లెక్స్ దాట గలిగితే పారిపోయే అవకాశం ఉండేది. ఎందుకంటే కోర్టు చుట్టూ వేలాది మంది ఆయన అనుచరులు గుమిగూడి ఉన్నారు. -
ఛోటా రాజన్కు మరో ఎదురు దెబ్బ
-
ఛోటా రాజన్కు మరో ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్కు మరో ఎదురుదెబ్బ తగలింది. నకిలీ పాస్ పోర్టు కేసులో సోమవారం ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఛోటా రాజన్ను దోషీగా ప్రకటించింది. రేపు (మంగళవారం) రాజన్కు శిక్షను ఖరారు చేయనున్నట్టు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వీరేందర్ కుమార్ గోయల్ ప్రకటించారు. ఫోర్జరీ పత్రాలతో మారుపేరుతో ఛోటా రాజన్ పాస్ పోర్టు పొందినట్టు గతేడాది జూన్ 8న సీబీఐ కోర్టులో అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. రాజన్తో పాటు పాస్ పోర్టు అధికారులు జయశ్రీ దత్తాత్రేయ్ రహతె, దీపక్ నట్వర్లాల్ షా, లలిత లక్ష్మణన్లపై కేసు నమోదైంది. 1998-99లో బెంగళూరులో ఛోటా రాజన్.. మోహన్ కుమార్ అనే పేరుతో నకిలీ పాస్ పోర్టు పొందాడని, ఇందుకు పాస్ట్ పోర్టు అధికారులు సహకరించారని సీబీఐ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. నేరం రుజువు కావడంతో రాజన్తో పాటు అతనికి సహకరించిన వారిని కోర్టులో దోషులుగా ప్రకటించింది. హత్యలు, స్మగ్లింగ్, కిడ్నాప్ సహా రాజన్పై 85కు పైగా కేసులున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్లతో అతనిపై దాఖలైన కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2015 అక్టోబర్లో ఇండోనేసియా పోలీసులకు పట్టుబడ్డ రాజన్ను ఆ ఏడాది నవంబర్లో భారత్కు అప్పగించారు. -
అమెరికాలో తెలుగు వైద్యుడికి శిక్ష
న్యూయార్క్: అమెరికాలో జరిగిన ఓ మెడికల్ కుంభకోణంలో భారతీయ మూలాలున్న వైద్యుడిని అమెరికా కోర్టు దోషిగా తేల్చింది. జడ్జి అతనికి శిక్ష, జరిమానా విధించారు. షికాగోలోని ఓ ఆసుపత్రి రోగులకు సంబంధించి ఫెడరల్ హెల్త్కేర్ ప్రోగ్రామ్ కింద రావాల్సిన మెడికల్ రీయింబర్స్మెంట్ నిధులను కాజేశారని కూచిపూడి వెంకటేశ్వరరావు అనే తెలుగు వైద్యుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై అక్కడి కోర్టు ఐదు నెలలుగా విచారణ చేపట్టి అతడిని దోషిగా నిర్ధారించింది. ఈ కుంభకోణం మూలంగా సేక్రెడ్ హార్ట్ అనే ఆసుపత్రి మూతపడింది. రోగులకు సంబంధించి నిధులను మంజూరు చేసే అధికారం కలిగిన కూచిపూడి వెంకటేశ్వరరావు లంచాలు తీసుకొని అక్రమాలకు తెరలేపారని పేర్కొంది. -
జయలలితను దోషిగా తేల్చిన కోర్టు
-
కళంకిత నేతలను రక్షించే ఆర్డినెన్స్ ఉపసంహరణ
-
దాణా కేసులో లాలూను దోషిగా తేల్చిన కోర్టు