devara
-
జపాన్ లో దేవర తాండవం
-
దేవర ప్రమోషన్లతో బిజీగా జూనియర్ ఎన్టీఆర్..
-
ఈ ఏడాదిలో 'జాతర' చూపించిన స్టార్స్
తెలుగు సినిమాల్లో జాతర ఎపిసోడ్స్ ప్రేక్షకులను థియేటర్స్కు వచ్చేలా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది జాతర జోరు బాగా కనిపించింది. కొన్ని చిత్రాల్లో జాతర ఎపిసోడ్స్ కీలకంగా నిలవగా, కొన్ని చిత్రాలు జాతర నేపథ్యంలోనే సాగాయి. సినిమా హిట్కి జాతర ఓ కారణంగా నిలిచింది. ఇక 2024లో వెండితెరపై జాతర హైలైట్గా నిలిచిన తెలుగు చిత్రాల గురించి తెలుసుకుందాం.అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ సినిమా ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాస్తోంది. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను మించిందని ఈ సినిమా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ఇంకా ప్రదర్శితమవుతోంది. దీంతో ‘పుష్ప: ది రూల్’ వసూళ్లు ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా ఈ సినిమా విజయానికి ఓ ముఖ్య కారణం జాతర ఎపిసోడ్ అన్నది కొందరి అభిప్రాయం.ఈ ఎపిసోడ్లో కొత్త గెటప్లో అల్లు అర్జున్ నటన, దర్శకుడు సుకుమార్ టేకింగ్, కొరియోగ్రాఫర్ విజయ్ నృత్యరీతులకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ జాతర ఎపిసోడ్ లుక్తోనే ఈ సినిమా క్లైమాక్స్లోనూ అల్లు అర్జున్ ఫైట్ ఉండటం విశేషం. ఈ ఎపిసోడ్ని దాదాపు మూడు నెలలు డిజైన్ చేసుకుని, నెల రోజుల పాటు, భారీ బడ్జెట్తో చిత్రీకరించారని తెలిసింది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ స్వరకర్త. మరో సంగీత దర్శకుడు సామ్సీఎస్ ఈ జాతర ఎపిసోడ్కు ఆర్ఆర్ అందించారని తెలిసింది. ఇక ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటించిన ‘దేవర’లోనూ జాతర ఎపిసోడ్ హైలైట్ అయింది.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీని రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ తండ్రీ కొడుకుగా (తండ్రి దేవర, కొడుకు వర పాత్రల్లో ఎన్టీఆర్ నటించారు) నటించిన ఈ సినిమా తొలి భాగం ‘దేవర పార్టు 1’ సెప్టెంబరు 27న విడుదలైంది. ఈ సినిమాలో జాతర నేపథ్యంలో వచ్చే రెండు సన్నివేశాలు (ఒక సన్నివేశం దేవరతో, మరొక సీన్ వరతో) కథను మలుపు తిప్పుతాయి. ఇలా జాతర ఎపిసోడ్స్ ‘దేవర పార్టు 1’లో కీలకంగా కనిపిస్తాయి. అలాగే జాతర సమయంలో ‘వీరాధి వీరుల తిరునాళ్ల జరుపుకోవాల... రారా వీర’ అంటూ లిరిక్స్తో సాగే ‘ఆయుధ పూజ’ పాట కూడా ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది.‘దేవర’ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. అలాగే ఈ ఏడాది వచ్చిన హిట్ మూవీస్లో ‘క’ చిత్రం ఒకటి. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రంతో సుజీత్ – సందీప్ ద్వయం దర్శకులుగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలోని జాతర ఎపిసోడ్ కథకు కీలకంగా ఉంటుంది. అలాగే ‘ఆడు ఆడు ఆడు... అమ్మోరే మురిసేలా ఆడు’ అంటూ వచ్చే జాతర పాట ప్రేక్షకులను అలరించింది. ‘పుష్ప: ది రూల్’ సినిమా జాతర ఎపిసోడ్కు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన సంగీత దర్శకుడు సామ్ సీఎస్యే ‘క’ సినిమాకు స్వరకర్త. ఇలా జాతర ఎపిపోడ్స్తో కథ మలుపు తిరిగిన సినిమాలు కొన్నైతే, జాతర నేపథ్యంలోనే మరికొన్ని సినిమాలు తెలుగు తెరపైకి వచ్చాయి.యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ ఫిల్మ్ ‘పొట్టేల్’ ఈ కోవలోకే వస్తుంది. తెలంగాణలోని ఓ ఊర్లో పుష్కరానికి ఒకసారి జరిగే జాతర నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. జాతర నేపథ్యమే కాకుండా చదువు ప్రాముఖ్యతను కూడా తెలిపేలా దర్శకుడు సాహిత్ మోత్ఖురి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. అలాగే నూతన నటీనటులు సందీప్ సరోజ్, త్రినాథ్ వర్మ, ఈశ్వర్ రచిరాజు, పెండ్యాల యశ్వంత్ తదితరులు నటించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ హిట్ ఫిల్మ్గా నిలిచింది.నూతన దర్శకుడు యదు వంశీ తెరకెక్కించిన ఈ సెమీ పీరియాడికల్ ఫిల్మ్ పురుషోత్తంపల్లి అనే గ్రామంలో జరిగే సంఘటనలు, రాజకీయాలు, స్నేహం నేపథ్యంలో ఉంటుంది. పన్నెండేళ్లకొకసారి పురుషోత్తంపల్లిలో జరిగే భరింకాళమ్మ తల్లి జాతర ఈ సినిమాకు కీలకంగా ఉంటుంది. ఈ జాతర ఎపిసోడ్ అలరించింది. ఇంకా ధ్రువ వాయు నటించి, దర్శకత్వం వహించిన ‘కళింగ’ సినిమాలో కూడా జాతర ప్రస్తావన, జాతర సాంగ్ ఉంటాయి. ఇలా జాతర టచ్తో ఈ ఏడాది వచ్చిన అన్ని సినిమాలూ ఆడియన్స్ మెప్పు పొందడం విశేషం. 2024తో ఈ జాతర ఆగడంలేదు... 2025లో రానున్న చిత్రాల్లో కొన్నింటిలో ‘జాతర’ సందడి కనిపించనుంది. – ముసిమి శివాంజనేయులు -
ఓటీటీలో సంచలన రికార్డు సాధించిన 'దేవర’
-
బెస్ట్ మెలోడీ సాంగ్ ఇదే..!
-
ఫ్యావరేట్ టైం:బోయ్ ఫ్రెండ్తో దేవర బ్యూటీ ఫెస్టివ్ మూడ్ (ఫొటోలు)
-
ఇకపై తెరపై దావూదీ...
దేవర... వర... ‘దేవర’ చిత్రంలో ఈ రెండుపాత్రల్లో అభిమానులకు రెండింతల ఆనందాన్నిచ్చారు ఎన్టీఆర్. అభిమానులు విజిల్స్ వేయకుండా ఉండలేని విధంగా డైలాగ్స్ పలికారు. ఫైట్స్లో విజృంభించారు... సాంగ్స్లో స్టెప్స్ అదరగొట్టారు... ఎమోషనల్ సీన్స్లో మనసును తాకారు. ఇలా మొత్తం మీద ఎన్టీఆర్ మరోసారి నటుడిగా విజృంభించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృçష్ణ .కె నిర్మించిన ‘దేవర’ మంచి వసూళ్లు సాధిస్తూ, దూసుకెళుతోంది. దాంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఆ విశేషాల్లోకి...‘దేవర’ చిత్రం విడుదలకు రెండు రోజుల ముందు ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన హైదరాబాద్కు చేరుకున్నారు. అయితే గురువారం ఈ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ జరగాల్సి ఉండగా దేవీ నవరాత్రుల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్మీట్కు అనుమతి లభించలేకపోవడంతో కుదరలేదు. ఇక హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో చిత్రబృందం సక్సెస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది. ఈ సెలబ్రేషన్స్లో రాజమౌళి, ప్రశాంత్ నీల్, ‘దిల్’ రాజు, డీవీవీ దానయ్య, నాగవంశీ వంటివారితోపాటు పలువురు పంపిణీదారులుపాల్గొన్నారు. ఆరేళ్లకు సోలోగా... ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోని సిల్వర్ స్క్రీన్పై సోలో హీరోగా చూసింది ‘అరవింద సమేత వీర రాఘవ’ (2018) తర్వాత ‘దేవర’లోనే. ఈ గ్యాప్లో ‘ఆర్ఆర్ఆర్’తో తెరపై కనిపించారు. ఈ చిత్రంలో రామ్చరణ్ మరో హీరో అని తెలిసిందే. ఇక ఆరేళ్లకు ఎన్టీఆర్ సోలోగా నటించిన చిత్రం కావడం, దేవర–వరగా రెండుపాత్రల్లో ఎన్టీఆర్ కనిపించడం ఫ్యాన్స్కి ఐ ఫీస్ట్ అయింది. 7 రోజులకు రూ. 400 కోట్లు ‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ తర్వాత హీరో ఎన్టీఆర్–దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన చిత్రం కావడంతో ‘దేవర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ‘మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు.. కాదు కూడదు అని మీరు మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా...’, ‘దేవర అడిగినాడంటే... సెప్పినాడని అదే సెప్పినాడంటే...’ అంటూ విడుదలైన డైలాగ్స్, ‘చుట్టమల్లె...’పాట, దివంగత ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీకి తెలుగులో తొలి చిత్రం వంటివన్నీ ‘దేవర’ సినిమాపై అంచనాలు పెంచాయి. ఆ అంచనాలను ‘దేవర’ చేరుకున్నాడని చెప్పడానికి వసూళ్లు నిదర్శనం. విడుదలైన ఏడు రోజులకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ. 400 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇక పండగ సెలవులు మొదలయ్యాయి కాబట్టి వసూళ్ల దూకుడు ఆగదని ఊహించవచ్చు. దసరా సెలవులు... ‘దేవర’ దూకుడు దసరా పండగ సెలవులు మొదలయ్యాయి. సెలవులు,పోటీలో మరో భారీ చిత్రం లేకపోవడం ‘దేవర’కి కలిసొచ్చే విషయం. ఇంకో వారం దాకా వసూళ్ల దూకుడు ఆగదనే అంచనాలు ఉన్నాయి. పైగా అభిమానులను ఖుషీ చేసేలా శుక్రవారం నుంచి ‘దావూదీ...’పాటను కూడా జోడించారు. ‘దేవర’ విడుదలకు కొన్ని రోజులు ముందు విడుదలైన ఈపాటకు మంచి స్పందన లభించింది. కానీ సినిమాలో లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. అయితే శుక్రవారం నుంచి అన్ని థియేటర్లలో ఈపాట కనిపిస్తోంది. ‘దేవర 2’ ఎప్పుడంటే... ‘దేవర 2’ షూట్ను వచ్చే ఏడాది చివర్లో ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. 2026లో ‘దేవర 2’ విడుదలయ్యే చాన్స్ ఉందట. ఈ గ్యాప్లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేస్తారు ఎన్టీఆర్. అలాగే హిందీలో ‘వార్ 2’ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలవుతుంది. ప్రశాంత్ నీల్తో చేసే చిత్రం 2026 జనవరిలో విడుదల కానుంది. ఒకవేళ ‘దేవర 2’ కూడా 2026లోనే విడుదలైతే అప్పుడు ఒకే ఏడాదిలో ఎన్టీఆర్ రెండు సినిమాల్లో కనిపించినట్లు అవుతుంది. అదే జరిగితే 2016 (నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్) తర్వాత... పదేళ్లకు ఒకే ఏడాది ఎన్టీఆర్ రెండు సినిమాల్లో కనిపించేది 2026లోనే అవుతుంది. -
దేవర మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
Janhvi Kapoor: దేవర మూవీలో జాన్వీ అందాలు నెక్స్ట్ లెవల్ (ఫోటోలు)
-
‘దేవర’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఆ భయాన్ని గౌరవించాలి: దర్శకుడు కొరటాల శివ
‘‘మనిషికి ధైర్యం అవసరమే కానీ మితి మీరిన ధైర్యం మంచిది కాదు. అలాగే మనకు తెలియకుండానే మనలో భయం ఉంటుంది. ఆ భయాన్ని గౌరవించాలి. భయమే మనల్ని సరైన దారిలో ఉంచుతుంది. ఈ విషయాన్నే ‘దేవర’లో గట్టిగా చెప్పాను’’ అని దర్శకుడు కొరటాల శివ అన్నారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రూ΄పొందిన చిత్రం ‘దేవర’. కల్యాణ్రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం తొలిభాగం ‘దేవర:పార్టు 1’ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో కొరటాల శివ చెప్పిన విశేషాలు..⇒ ‘దేవర’ కథను చెప్పినప్పుడు ఎన్టీఆర్గారు స్పందించిన తీరుతోనే నెక్ట్స్ లెవల్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఇది పూర్తీగా కల్పిత కథ. ‘దేవర’ కథను ఎన్టీఆర్గారితోనే అనుకున్నా. ఈ సినిమాలోని దేవరపాత్రకు మరొకర్ని అనుకున్నాననే వార్తల్లో నిజం లేదు (ఈ చిత్రంలోని తండ్రీకొడుకులు ‘దేవర’, ‘వర’పాత్రలను ఎన్టీఆర్ చేశారు). చెప్పాలంటే... దేవరపాత్రను మించి వరపాత్ర ఉంటుంది. మాస్ హీరోగా ఎన్టీఆర్గారి ఇమేజ్ను దృష్టిలో పెట్టుకునే ‘దేవర’ కథ రాశాను. ఇక అల్లు అర్జున్గారితో నేను అనుకున్న కథ వేరు. ‘దేవర’కు ఆ కథకు ఏమాత్రం సంబంధం లేదు. ⇒పాన్ ఇండియా అనేది నాకు తెలియదు. కానీ ‘దేవర’ పెద్ద కథ. సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ సమయంలో మూడు గంటల్లో ‘దేవర’ కథను చెప్పలేమని అర్థమైంది. దాంతో ఈ సినిమాను రెండు భాగాలుగా చెప్పాలనుకున్నాం. ఇదేదో వ్యాపారం కోసమో లేక సంచ లనం కోసమో చేసింది కాదు. ఒక భాగంలో కథ చెప్పలేనప్పుడు రెండు భాగాల్లో చెప్పాలి. అయితే ‘దేవర 3, దేవర 4’ అంటూ ఏమీ లేవు. ⇒ మనిషిలో భయం ఉండాలని ‘దేవర’ సినిమాతో చెప్పాలనుకున్నా. కానీ ఈ భయాన్ని నేను జాన్వీ కపూర్లో చూశాను. తన డైలాగ్ పేపర్స్ను వారం రోజుల ముందే కావాలని అడిగి మరీ జాన్వీ సాధన చేసేది. తొలి రోజు సెట్స్లో జాన్వీ కపూర్ అడుగుపెట్టి డైలాగ్స్ చెప్పగానే ఎన్టీఆర్ ఫెంటాస్టిక్ అన్నారు. ⇒ఓ సినిమాను ప్రమోట్ చేయడం, మార్కెటింగ్ చేసే విషయాల్లో రాజమౌళిగారిలా నాకు మంచి ప్రావీణ్యం లేదు. అందుకే ఈ విషయాన్ని నేను నిర్మాతలకే వదిలేస్తాను. దర్శకుడిగా నా పనికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక ‘దేవర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం దురదృష్టకరం. టీమ్ అంతా వారి స్పీచ్ల స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నారు. కానీ ఇంతలో అలా జరిగిపోయింది. చిరంజీవిగారితో నా అనుబంధం ఎప్పుడూ బాగానే ఉంటుంది. మేం చేసిన ‘ఆచార్య’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ‘యూ విల్ బౌన్స్ బ్యాక్ శివ’ అని నాకు మెసేజ్ పంపిన తొలి వ్యక్తి చిరంజీవిగారు. అయితే ఆయన ఓ సందర్భంలో మాట్లాడిన మాటలకు మరో అర్థం వచ్చేలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మనం ఒక పరీక్ష సరిగ్గా రాయకపోతే తర్వాతి పరీక్ష బాగా రాయాలనుకుంటాం.ఇదీ అంతే. ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న (2022) విడుదలైంది. వెంటనే మే 19న (2022) ‘దేవర’ మోషన్ పోస్టర్ని రిలీజ్ చేయాలని ఆ పనిలో పడిపోయాను. అయితే ‘దేవర’ షూటింగ్ సముద్రంపై చేయాలి. ఇందుకు ఎలా ప్రిపేర్ అవ్వాలని ఆలోచించుకుని, ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, సినిమాను సెట్స్పైకి తీసుకు వెళ్లడానికి నాకు కాస్త ఎక్కువ సమయం పట్టింది.సోషల్ మీడియా మాధ్యమం నుంచి నేను బయటకు వచ్చాను. మెల్లి మెల్లిగా సోషల్ మీడియా లేకపోతే మనం జీవించలేమా? అన్న ధోరణిలోకి వెళ్లిపోతున్నాం. అలాగే సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరిగిపోయింది. నెగిటివిటీ ఉండొచ్చు... కానీ ద్వేషం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇది మంచిది కాదు. -
భయం అంటే ఏంటో తెలియాలి అంటే దేవర చూడాలా..!
-
ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చాలా బాధాకరం...
-
#Devara : ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ HD (ఫొటోలు)
-
'దేవర' కోసం జాన్వీ ఇలా ముస్తాబు.. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు (ఫొటోలు)
-
మూడు నెలల పాటు షూటింగ్స్ కు దూరంగా ఎన్టీఆర్.. కారణం ఇదే!
‘దేవర’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ ఫ్రీ అవుతారు. సో... ఇక తదుపరి చిత్రం షూటింగ్తో బిజీ అవుతారనుకోవచ్చు. అయితే ఓ మూడు నెలల తర్వాతే నెక్ట్స్ మూవీ షూట్లో పాల్గొంటారట ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల 21న ఆరంభమవుతుంది. (చదవండి: శ్రీలంకవైపు ఇండియన్ సినిమా చూపు)అయితే అప్పుడు ఎన్టీఆర్ పాల్గొనరట. ఈ హీరో లేని సన్నివేశాల చిత్రీకరణ మొదలుపెడతారు. 21 నుంచి దాదాపు 40 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొనరు. జనవరిలోనే ఈ చిత్రం సెట్స్లోకి ఎంట్రీ ఇస్తారట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు ఎన్టీఆర్. ఈ మూడు నెలల సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తారట. కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ఇదేనా?సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఫుల్ ఫోకస్ ఎన్టీఆర్ సినిమాపైనే పెట్టేశాడు. కేజీయఫ్, సలార్ మాదిరే ఈ చిత్రం కూడా రెండు భాగాలుగా రాబోతున్నట్లు సమాచారం. ఒక వేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పండగే. ఎందుకంటే ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీయఫ్ రెండు భాగాలుగా వచ్చి సూపర్ హిట్గా నిలిచాయి. అలాగే సలార్ పార్ట్ 2 కూడా రాబోతుంది. ఈ రెండు చిత్రాల మాదిరే ఎన్టీఆర్ మూవీ కూడా కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మైత్రీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ అనుకుంటున్నారట. -
16 ఏళ్లయింది.. ఎన్టీఆర్ కోసం తెగ ఆరాటపడ్డ యాంకర్.. ఇన్నాళ్లకు! (ఫొటోలు)
-
ఏపీలో 'దేవర' అదనపు షోలకు అనుమతి.. టికెట్ ధరలు ఇలా
జనతా గ్యారేజ్ హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'దేవర'. సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమాకు ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్రామ్ సమర్పకులు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి 'సరిపోదా శనివారం'.. డేట్ ఫిక్స్)దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కడంతో భారీ బడ్జెట్ ఖర్చు చేశారు. దీంతో సినిమా టికెట్ ధరలతో పాటు స్పెషల్ షోల విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చిత్ర యూనిట్ కొద్దిరోజుల క్రితం సంప్రదించింది. దీంతో తాజాగా ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి టికెట్ ధరకు అధనంగా ఎంతమేరకు పెంచుకునే వెసులుబాటు ఉందో చెబుతూ ఒక జీవోను రిలీజ్ చేసింది.టికెట్ల రేట్లు ఇలా..'దేవర' విడుదల రోజు అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు ఆరు ఆటలకు ఏపీ అనుమతిచ్చింది. ఆ తర్వాత రోజు 5 షోలు ప్రదర్శించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇలా 9రోజుల వరకు అదనపు షోలు ఉండనున్నాయి. ఇదే క్రమంలో దేవర టికెట్ల ధరలను సైతం పెంచుకునే అవకాశం ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ మొదటి తరగతి టికెట్స్కు రూ. 110, దిగువ తరగతి రూ.60 వరకు పెంచింది. మల్టీప్లెక్స్లలో అయితే రూ. 135 చొప్పున పెంచింది. జీఎస్టీతో కలుపుకొనే ఈ ధరలు ఉండనున్నాయి. అంటే ఈ లెక్కన సింగిల్ స్క్రీన్లో దేవర టికెట్ ధర రూ. 225 ఉంటే మల్టీప్లెక్స్లలో మాత్రం రూ.320 ఉండనుంది. ఈ పెరిగిన ధరలు సెప్టెంబర్ 27 నుంచి 14 రోజుల పాటు ఉండనున్నాయి. -
ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పూనకాలే.. దేవర ఆయుధ పూజ సాంగ్ లీక్..
-
Devara Movie: సానా పెద్ద కథ సామి అంటే ఇదా..!
-
దేవర ఔట్ డోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్?
-
నైజాం నుండే రికార్డ్స్ వేట మొదలుపెట్టనున్న దేవర..
-
దేవర రన్ టైం అడిగిన సందీప్ వంగకి కౌంటర్ ఇచ్చిన ఎన్టీఆర్
-
Devara: రిలీజ్ కు ముందే రికార్డులు!
-
చివరి 40 నిమిషాలు అద్బుతమే
-
Janhvi Kapoor: చీరలో అదిరిపోయిన దేవర బ్యూటీ (ఫోటోలు)
-
తిమింగలంపై ఎన్టీఆర్ రైడ్ దేవర కోత.. యూట్యూబ్ మోత..
-
ఎన్టీఆర్ 'దేవర' HD మూవీ స్టిల్స్ (ఫోటోలు)
-
దేవర సాంగ్ మీద భారీ ట్రోలింగ్..
-
ఎన్టీఆర్ 'దేవర' మూవీ సాంగ్ అదిరిపోయే HD స్టిల్స్
-
6 ఏళ్ళ ఎన్టీఆర్ అభిమానుల ఎదురుచూపు
-
Janhvi Kapoor: ఎరుపు రంగు చీరలో సరికొత్త లుక్తో జాన్వీ కపూర్ (ఫోటోలు)
-
ఆయుధ పూజ ఆరంభం
హీరో ఎన్టీఆర్ ఆయుధ పూజ చేస్తున్నారు. అయితే ఈ పూజ ‘దేవర’ కోసం. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరు«ధ్ సంగీతదర్శకుడు. కాగా ఈ సినిమాలో ఆయుధ పూజ నేపథ్యంలో సాగే ఓ పాట ఉందట. ప్రస్తుతం ఈ పాటని తెరకెక్కిస్తున్నారని సమాచారం. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటని ఎన్టీఆర్, ఇతర తారాగణంపై రాత్రి వేళల్లో చిత్రీకరిస్తున్నారని టాక్. పతాక సన్నివేశాలకు ముందు ఈ పాట వస్తుందట. రెండు భాగాలుగా రూపొందుతోన్న ‘దేవర’ తొలి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. -
నా లోకమే నా మైమరపు
దేవరపై తన ప్రేమనంతా పాట రూపంలో చూపించేసింది తంగమ్. ‘చుట్టమల్లె చుట్టేస్తావె తుంటరి చూపు... ఊరికే ఉండదు కాసేపు... అస్తమానం నీ లోకమే నా మైమరపు... చేతనైతే నువ్వే నన్నాపు...’ అంటూ తన ప్రేమను వ్యక్తపరిచింది. దేవరగా ఎన్టీఆర్, తంగమ్గా జాన్వీ కపూర్ నటిస్తున్న ‘దేవర’ చిత్రంలోని పాట ఇది. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తొలి భాగం సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ ఆరంభించి, ఒక్కో పాట విడుదల చేస్తున్నారు. సోమవారం ‘చుట్టమల్లె చుట్టేస్తావె...’ అంటూ సాగే ఈ సినిమాలోని రెండో పాటను రిలీజ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ స్వరపరచిన ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా శిల్పా రావ్ పాడారు. బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ చేశారు.హై యాక్షన్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ‘దేవర’ చిత్రానికి కెమెరా: ఆర్. రత్నవేలు. -
డిఫరెంట్ స్టైలిష్ లుక్స్తో దేవర భామ.. ఫోటోలు
-
ఎన్టీఆర్ ఒక సెకెన్ లో స్టెప్పేస్తే.. నేను వేయడానికి 10 డేస్ పట్టింది..
-
ఎన్టీఆర్ దేవర పై పోటీకి సై అంటున్న తమిళ స్టార్ హీరో..
-
ట్రైబల్ కథల్
ఒక సింహాసనం కోసం రెండు తెగలు పోటీ పడతాయి... సముద్ర తీరంలో ఉండే ఆదివాసీల కోసం ఓ వ్యక్తి పోరాటం చేస్తాడు... తమ హక్కుల కోసం పోరాటం చేస్తాడు ఓ గిరిజన తెగ నాయకుడు... ఓ తెగకు చెందిన వ్యక్తి శివభక్తుడిగా మారతాడు... సినిమా పాయింట్ ఏదైనా ఈ సినిమాలన్నింటిలోనూ కామన్ పాయింట్ ‘ట్రైబల్’ నేటివిటీ. ఇలా ట్రైబల్ కథల్తో రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.⇒ ‘కాన్సార్ ఎరుపెక్కాలా...’ అంటూ ‘సలార్: సీజ్ఫైర్’ చిత్రంలో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్కి అటు అభిమానులు ఇటు ప్రేక్షకుల కేకలు, అరుపులతో థియేటర్లు దద్దరిల్లాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్’. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా మొదటి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ గత ఏడాది విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. కాన్సార్ సింహాసనం కోసం శౌర్యాంగ, ఘనియార్ తెగలు పోటీపడటం, వారికి దక్కకుండా తన సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం మన్నార్ తెగకు చెందిన రాజ మన్నార్ చేసే ప్రయత్నం... ఈ మూడు తెగలు ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలు రచించడం మొదటి భాగంలో చూశాం. చివరికి ఏ తెగవారు కాన్సార్ సింహాసనం చేజిక్కించుకున్నారనేది తెలియాలంటే మలి భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’ విడుదల వరకూ ఆగాల్సిందే. ఇంకా సెకండ్ పార్ట్ షూటింగ్ ఆరంభం కాలేదు. ⇒ ‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ‘దేవర’ కోసం ఎన్టీఆర్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ సినిమా బ్యాక్డ్రాప్ ఏంటో చెప్పింది. ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. నందమూరి కల్యాణ్రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. భారతదేశంలో విస్మరణకు గురైన సముద్ర తీర ్రపాంతాలకు చెందిన ఆదివాసీల కోసం దేవర చేసే పోరాటమే ఈ సినిమా అని సమాచారం. ఈ చిత్రం మొదటి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ⇒ ‘చావుని ఎదిరించే వాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం’ అంటూ ‘తంగలాన్’ మూవీ ట్రైలర్లో హీరో విక్రమ్ చెప్పిన డైలాగ్ పవర్ఫుల్గా ఉంది. పా. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాలతో ఈ చిత్రం రూపొందింది. బంగారు గనుల తవ్వకాన్ని వ్యతిరేకించే గిరిజన తెగ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఆ తెగ నాయకుడి పాత్రలో విక్రమ్ నటించారట. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ⇒ సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘కంగువ’. శివ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాలో సూర్య ఆటవిక జాతికి చెందిన ఓ తెగ నాయకుడిగా నటించారు. ఓ దట్టమైన అడవిలో రెండు ఆటవిక జాతుల మధ్య పోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు గ్లింప్స్ చూస్తే అర్థం అవుతుంది. అలాగే ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఓ గిరిజన యోధుడైన కంగువ 1678 నుంచి ప్రస్తుత కాలానికి వస్తాడు. ఓ మహిళా సైంటిస్ట్ సాయంతో తన మిషన్ని పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్ ఏంటి? ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైమ్ ట్రావెల్ ఎలా చేశాడు? అనే నేపథ్యంలో భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలతో ఈ సినిమా కథ సాగుతుందని టాక్. ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. ⇒ మంచు విష్ణు నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాలో ఓ తెగకు చెందిన తిన్నడు (ఆ తర్వాత శివ భక్తుడు కన్నప్పగా మారారు) పాత్ర చేస్తున్నారు మంచు విష్ణు. ఈ చిత్రంలో తిన్నడు వాడిన విల్లు విశిష్టత గురించి ఇటీవల మేకర్స్ తెలిపారు. తన బిడ్డ తిన్నడు ధైర్యసాహసాలకు ముగ్దుడైన నాద నాథుడు ప్రత్యేకమైన విల్లును తయారు చేస్తాడు. ఆ విల్లును ఉపయోగిస్తూ తన తెగను, అడవిలో సమతుల్యతను తిన్నడు ఎలా కాపాడాడు? అనే నేపథ్యంలో సాగే సీన్స్ ఆసక్తిగా ఉంటాయట. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుందట. -
దేవర డబ్బింగ్ వర్క్ స్టార్ట్! గూస్ బంప్స్ పుట్టిస్తున్న లీక్డ్ డైలాగ్!
-
అనంత్ అంబానీ పెళ్లిలో ధగధగ మెరిసిపోతున్న దేవర భామ.. పోటోలు
-
దేవర ఆటా పాటా
‘దేవర’ రొమాంటిక్ మోడ్ ఇంకా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దేవరగా ఎన్టీఆర్ కనిపిస్తారు. ఇటీవల జాన్వీ, ఎన్టీఆర్ పాల్గొనగా ఈ సినిమాకు చెందిన ఓ పాటను థాయ్లాండ్లో చిత్రీకరించారు మేకర్స్. తాజాగా ఎన్టీఆర్, జాన్వీ కాంబినేషన్లో మరో రొమాంటిక్ సాంగ్ను చిత్రీకరించడానికి యూనిట్ ప్లాన్ చేసిందని సమాచారం.ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ స్పెషల్ సెట్ను రెడీ చేస్తున్నారని, వచ్చే వారం ఈ సెట్లో ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని టాక్. ఇప్పటికే యాక్షన్ పార్ట్, టాకీ ఎక్కువ శాతం పూర్తి కావడంతో కొరటాల శివ పాటల చిత్రీకరణపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్, ప్రకాశ్రాజ్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కల్యాణ్రామ్ సమర్పణలో కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ‘దేవర’ రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగాన్ని సెప్టెంబరు 27న విడుదల చేయనున్నారు. -
Janhvi Kapoor: పూలగౌనులో దేవర బ్యూటీ సోయగాలు (ఫోటోలు)
-
థాయ్లాండ్లో పాట
హీరో ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్ థాయ్లాండ్లో చిందేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరిపై అక్కడ ఓ పాటని చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ‘జనతా గ్యారేజ్’(2016) వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ మూవీ ద్వారా జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. కల్యాణ్రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘దేవర’ కీలక షెడ్యూల్ని థాయ్లాండ్లో ప్లాన్ చేశారు కొరటాల శివ. ఎన్టీఆర్, జాన్వీ కపూర్లపై ఓ సాంగ్తో పాటు ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్లో పాల్గొనేందుకు ఈ నెల 17న హైదరాబాద్ నుంచి ఎన్టీఆర్, ఈ నెల 16న ముంబై నుంచి జాన్వీ కపూర్ థాయ్లాండ్కి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరిపై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ‘పఠాన్, వార్, ఫైటర్’ వంటి చిత్రాల్లో మంచి స్టెప్స్ను కంపోజ్ చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఈ పాటకి నృత్యరీతులు సమకూర్చుతున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేశారు బాస్కో మార్టిస్. హై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రెండు భాగాలుగా రూపొందుతోన్న ‘దేవర’ చిత్రం మొదటి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరు«ద్. -
చలో థాయ్లాండ్
హీరో ఎన్టీఆర్ థాయ్లాండ్కి పయనమయ్యారు. ‘దేవర’ మూవీ తాజా షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లారు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. నందమూరి కల్యాణ్రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘దేవర’ కీలక షెడ్యూల్ను గోవాలో పూర్తి చేసుకుని ఇటీవల హైదరాబాద్ చేరుకుంది చిత్రబృందం. తర్వాతి షెడ్యూల్ కోసం సోమవారం ఎన్టీఆర్ హైదరాబాద్ నుంచి థాయ్లాండ్ ప్రయాణం అయ్యారు.ఆయనతోపాటు భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు అభయ్, భార్గవ్ కూడా ఉన్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్న ఎన్టీఆర్ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ‘దేవర’ షూటింగ్లో పాల్గొనేందుకు జాన్వీ కపూర్ కూడా ఆదివారం సాయంత్రం థాయ్లాండ్కు బయలుదేరారు. అక్కడ ఎన్టీఆర్, జాన్వీలపై ఓ పాటతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట కొరటాల శివ. రెండు భాగాలుగా రూపొందుతోన్న ‘దేవర’ తొలి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. -
గోవాలో ఆటా పాటా...
మళ్లీ గోవా వెళ్లాడు దేవర. ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కల్యాణ్రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగాన్ని ఈ ఏడాది అక్టోబరు 10న రిలీజ్ చేయనున్నట్లు గతంలో మేకర్స్ వెల్లడించారు.ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ గోవాలో ప్రారంభమైంది. ఎన్టీఆర్తో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో ఓ సాంగ్, కొంత టాకీ పార్ట్, ఓ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట. ఈ ఏడాది మార్చిలో ‘దేవర’ యూనిట్ గోవాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించింది. ఇప్పుడు మళ్లీ గోవాలో షూటింగ్ జరుగుతోంది. -
ఎన్టీఆర్ కోసం అనిరుధ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే సాంగ్
-
దేవర ముంగిట నువ్వెంత!
ఎన్టీఆర్ ఫ్యాన్స్కు శుభవార్త. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డేని పురస్కరించుకుని ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’ నుంచి 19న ‘ఫియర్’ అనే తొలి సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘జనతా గ్యారేజ్ ’(2016) వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. నందమూరి కల్యాణ్రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ‘దేవర’ నుంచి ‘ఫియర్..’ అంటూ సాగే పాట ఈ నెల 19న విడుదల కానుంది. ఈ పాటలో ‘దేవర ముంగిట నువ్వెంత..’ అనే పదాలు ఉన్నట్లు సమాచారం. రెండు భాగాలుగా రూపొందుతోన్న ‘దేవర’ చిత్రం మొదటి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. సైఫ్ అలీఖాన్, ప్రకాశ్రాజ్, శ్రీకాంత్ నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు. -
‘దేవర’ చలో వైజాగ్
వైజాగ్ వెళ్లనున్నారట ‘దేవర’ టీమ్. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. జాన్వీకపూర్ హీరోయి న్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నరైన్, సైఫ్ అలీఖా న్ , టామ్ షైన్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వైజాగ్లో ్రపారంభం కానుందని ఫిల్మ్నగర్ సమాచారం. అయితే ఈ షెడ్యూల్లో తొలుత ఎన్టీఆర్ పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరిస్తారట మేకర్స్. ప్రస్తుతం ముంబైలో హిందీ చిత్రం ‘వార్ 2’తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఆ సినిమా తాజా షెడ్యూల్ పూర్తయిన తర్వాత ‘దేవర’ సెట్స్లో ఎన్టీఆర్ జాయి న్ అవుతారట. కల్యాణ్రామ్, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ‘దేవర’ రెండు భాగాలుగా విడుదల కానుంది. కాగా ఈ సినిమా తొలి భాగాన్ని ఈ ఏడాది అక్టోబరు 10న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. -
ఎన్టీఆర్తో నటించాలని ఉంది: ఊర్వశి
ఊర్వశి రౌతేలా.. ప్రత్యేకించి పరిచయం అక్కర్లేని పేరు. తన గ్లామర్తో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో.. ప్రత్యేకించి యువతలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారీ బ్యూటీ. తాజాగా ఊర్వశి రౌతేలా ఎక్స్లో చేసిన ఓ పోస్ట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఎన్టీఆర్తో కలిసి ఉన్న ఫొటోను ఆమె షేర్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో, ఎన్టీఆర్ అభిమానుల్లో చర్చకు తెరలేపింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ సినిమాలో ఊర్వశి నటించనున్నారేమో? అనే చర్చలు జరుగుతున్నాయి. ‘వార్ 2’ హిందీ సినిమా చిత్రీకరణ కోసం ముంబయ్లో ఉన్నారు ఎన్టీఆర్. ఆయనతో జిమ్లో దిగిన ఫొటోను ఊర్వశి సోషల్ మీడియాలో షేర్ చేసి.. ‘‘ఎన్టీఆర్గారు మన ప్రియమైన, నిజమైన గ్లోబల్ సూపర్ స్టార్. క్రమశిక్షణ, నిజాయితీ, వినయపూర్వకంగా ఉండే వ్యక్తి. మీ దయ, ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయం. సమీప భవిష్యత్తులో మీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘దేవర’ చిత్రంలో ఊర్వశి రౌతేలా ప్రత్యేక పాటలో కనిపించనున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఊర్వశి తెలుగులో ‘వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద’ వంటి చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో తన డ్యాన్స్తో అలరించారు. మరి... ఎన్టీఆర్ సినిమాలో నటించాలనే ఆసక్తి కనబరుస్తున్న ఊర్వశికి ఆ చాన్స్ వస్తుందా? అనేది చూడాలి. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
పాట.. ఫైటు
గోవాకు బై బై చెప్పారు ‘దేవర’. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. శ్రుతీ మరాఠి, చైత్ర, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. కాగా ఇటీవల గోవాలో మొదలైన ‘దేవర’ సినిమా చిత్రీకరణ ముగిసిందని సమాచారం. ఓ ఫైటు సీక్వెన్స్ తో పాటు ఓ పాటను చిత్రీకరించారట మేకర్స్. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబినేషన్ లోని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిందని తెలిసింది. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభం అవుతుందని, ఏప్రిల్ మొదటివారంలో ఈ కొత్త షెడ్యూల్ ఉండే అవకాశం ఉందని భోగట్టా. కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ స్వరకర్త. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ఈ ఏడాది అక్టోబరు 10న విడుదల కానుంది. -
పుష్ప 2 సాంగ్ ని మించి దేవర బంపర్ సాంగ్!
-
శ్రుతికి స్వాగతం పలికిన 'దేవర'
మరాఠీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న గుజరాతీ అమ్మాయి శ్రుతీ మరాఠే తెలుగు చిత్ర పరిశ్రమకు వస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ సినిమాతో శ్రుతి తెలుగుకు పరిచయం కానున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న ‘దేవర’ షూటింగ్లో శ్రుతి జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మాధ్యమాల వేదికగా వెల్లడించారు శ్రుతి. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న షెడ్యూల్ పూర్తి కాగానే పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ కేరళ వెళ్లాలనే ఆలోచనలో ఉందని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ‘దేవర’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ఈ ఏడాది అక్టోబరు 10న విడుదల కానుంది. -
రామ్ చరణ్తో సినిమా.. క్లారిటీ ఇచ్చిన 'దేవర' బ్యూటీ
రామ్ చరణ్తో జాన్వీ కపూర్ నటిస్తున్న చిత్రం త్వరలో ఆరంభం కానుందని కొద్దిరోజుల క్రితం బోనీకపూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో దేవర చిత్రం తర్వాత టాలీవుడ్లో మరొక ఛాన్స్ జాన్వీకి దక్కిందని పలు వార్తలు ట్రెండ్ అయ్యాయి. ఈ విషయంపై తాజాగా జాన్వీ కపూర్ ఇలా స్పందించారు. ' నా సినిమాల అప్డేట్స్ గురించి మా నాన్న (బోనీ కపూర్) పలు విషయాలు పంచుకున్నారు. నన్ను సంప్రదించకుండానే నాన్నగారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఏ సినిమాల్లో నటించబోతున్నానని ఆయన చెప్పారో వాటి గురించి ఇప్పట్లో మాట్లాడలేను. ప్రస్తుతం నేను తెలుగులో 'దేవర' మాత్రమే చేస్తున్నాను.' అని చెప్పారు. ‘ఉప్పెన’తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సన ద్వితీయ చిత్రంగా రామ్చరణ్ హీరోగా ఓ సినిమా (‘RC 16’ వర్కింగ్ టైటిల్) తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్కి జోడీగా ఎవరు నటిస్తారు? అంటూ తెరపైకి వచ్చిన హీరోయిన్ల పేర్లలో జాన్వీ కపూర్ పేరు ప్రముఖంగా ఉంది. దీంతో ఈ విషయం గురించి బోనీకపూర్ను ప్రశ్నించగా.. రామ్ చరణ్తో జాన్వీ సినిమా చేస్తుందని ప్రకటించారు. ఆపై కోలీవుడ్ హీరో సూర్యకు జోడీగా ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారికంగా ప్రకటన లేదు. కానీ, బోనీకపూర్ ఈ విషయాన్ని వెల్లడించడంతో గత కొద్దిరోజులగా వైరల్గా మారింది. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనున్న ‘ఆర్సీ 16’ ఏప్రిల్లో సెట్స్పైకి వెళ్లనుందని టాక్. -
దేవర డేట్ ఫిక్స్
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు ‘దేవర’. ఈ ఏడాది అక్టోబరు 10న ‘దేవర’ చిత్రం తొలి భాగం విడుదల కానుంది. ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. కాగా తొలి భాగాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా వేశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబరు 10న సినిమాని విడుదల చేయనున్నట్లు శుక్రవారం వెల్లడించారు మేకర్స్. -
దేవర రిలీజ్ పై దిల్ రాజు కీలక వ్యాఖ్యలు
-
అభిమానులకు దేవర స్పెషల్ విషెస్!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అభిమానులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ విష్ చేశారు. పండుగ సందర్భంగా ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం యంగ్ టైగర్కు విషెస్ చెబుతున్నారు. కాగా.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది శ్రీదేవి ముద్దుల కూతురు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే దేవరకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లింప్స్లో సముద్రంలో ఫైట్ సీన్ను చూసిన ఫ్యాన్స్ దేవర కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. Wishing everyone a very Happy Pongal. — Jr NTR (@tarak9999) January 14, 2024 -
అందుకేనేమో ఎర్ర సముద్రం అంటారు!
‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్–డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం తొలి భాగం ‘దేవర పార్ట్ 1’ ఏప్రిల్ 5న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. కాగా ఈ సినిమా గ్లింప్స్ను ఆయా భాషల్లో సోమవారం విడుదల చేశారు మేకర్స్. ‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్తో గ్లింప్స్ రిలీజైంది. ‘‘దేవర’ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, కెమెరా: రత్నవేలు. -
గోవా టు హైదారాబాద్
హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇటీవల గోవాలో మొదలైన ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయినట్లు తెలిసింది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, జాన్వీ.. ఇలా ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. అలాగే ‘దేవర’ నెక్ట్స్ షెడ్యూల్ డిసెంబరులో హైదరాబాద్లో ప్రారంభం కానుందని సమాచారం. కల్యాణ్రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని తొలి భాగం ‘దేవర పార్ట్ 1’ ఏప్రిల్ 5న విడుదల కానుంది. -
మొన్నటివరకు రిలాక్స్.. ఇకపై దబిడి దిబిడే
షార్ట్ బ్రేక్ తీసుకున్నారు... ఫుల్లుగా రిలాక్స్ అయ్యారు. గెట్ సెట్ గో అంటూ హుషారుగా షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అయ్యారు. కొంత గ్యాప్ తర్వాత సెట్స్లోకి అడుగుపెడుతున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. బిజీ బిజీ దాదాపు యాభై రోజులు యూఎస్లో గడిపి, ఇటీవలే హైదరాబాద్కు వచ్చారు ప్రభాస్. ఇక సినిమా షూటింగ్లతో బిజీ కావాలనుకుంటున్నారు. ఇందుకు తగ్గ యాక్షన్ ΄్లాన్ను రెడీ చేసుకున్నారు. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’, ‘రాజా డీలక్స్’ (వర్కింగ్ టైటిల్), ‘సలార్’ చిత్రాలు ఉన్నాయి. ముందుగా ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్లో పాల్గొననున్నారట. మరో మూడు, నాలుగు రోజుల్లో ఈ చిత్రం కొత్త షెడ్యూల్ను ్రపారంభించాలనుకుంటున్నారట. ఈ షెడ్యూల్లో ప్రధానంగా ప్రభాస్, దీపికా పదుకోన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలి సింది. గతంలో చిత్ర యూనిట్ ప్రకటించిన ప్రకారం ‘కల్కి 2898 ఏడీ’ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కావాల్సింది. అయితే వాయిదా పడుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభాస్ మరో చిత్రం ‘రాజా డీలక్స్’ విషయానికి వస్తే.. మారుతి దర్శకత్వంలో రూ΄÷ందుతున్న ఈ చిత్రాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నారట ప్రభాస్. మరోవైపు ప్రభాస్ డైరీలో ఉన్న ‘సలార్’ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమా తొలి భాగం ‘సలార్: సీజ్ ఫైర్’ సెప్టెంబరు 28న రిలీజ్ కానుంది. సో.. మలి భాగం షూటింగ్ని ఆరంభించడానికి ΄్లాన్ చేస్తున్నారట. మొత్తం మీద ప్రభాస్ బిజీ బిజీ. టార్గెట్ ఫిక్స్ ‘దేవర’ సినిమా విషయంలో హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ స్పీడ్ మామూలుగా లేదు. ఈ సినిమా వరుస షూటింగ్ షెడ్యూల్స్ చకా చకా పూర్తవుతున్నాయి. అయితే గత నెల మూడో వారంలో ఓ యాక్షన్ షెడ్యూల్ను పూర్తి చేశాక ఈ టీమ్ చిన్న గ్యాప్ తీసుకుంది. రెండు వారాల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ మళ్లీ అంటే.. జూలై 31న ‘దేవర’ కొత్త షూటింగ్ షెడ్యూల్లో జాయిన్ అయ్యారు. ఈ కొత్త షెడ్యూల్ రెండు వారాల పాటు సాగుతుందని, ఓ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తారని తెలిసింది. పీటర్ హెయిన్స్ అండ్ టీమ్ ఈ యాక్షన్ సీక్వెన్స్ను డిజైన్ చేసిందట. ఈ షెడ్యూల్తో ‘దేవర’ మేజర్ యాక్షన్ పార్ట్ పూర్తవుతుందని, తదుపరి షెడ్యూల్స్లో ఇతర ప్రధాన తారాగణమైన ఈ చిత్రం విలన్ సైఫ్ అలీఖాన్, హీరోయిన్ జాన్వీ కపూర్ వంటి వారు పాల్గొనగా, టాకీ పార్ట్ను షూట్ చేస్తారని తెలిసింది. నవంబరు కల్లా ఈ సినిమా షూటింగ్ని పూర్తి చేసేలా ఎన్టీఆర్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారని ఫిల్మ్నగర్ టాక్. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. షూటింగ్ కాస్త ముందుగానే ముగిసినా.. గ్రాఫిక్స్, పోస్ట్ప్రొడక్షన్ వర్క్స్ కోసం ‘దేవర’ టీమ్ ఎక్కువ టైమ్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ‘దేవర’ తర్వాత హిందీ ‘వార్ 2’, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని చిత్రాలతో ఎన్టీఆర్ బిజీ అవుతారు. ఏప్రిల్లో రిలీజ్? హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ సూపర్ డూపర్ హిట్ సాధించింది. ప్రస్తుతం మలి భాగం ‘పుష్ప: ది రూల్’ సెట్స్లో ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్కు ఇటీవల కాస్త గ్యాప్ వచ్చింది. మళ్లీ ఈ నెల మొదటివారంలో ‘పుష్ప: ది రూల్’ సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్లాలని సుకుమార్ సన్నాహాలు చేశారని తెలిసింది. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్ కూడా జాయిన్ అవుతారట. అలాగే ‘పుష్ప: ది రూల్’ను తొలుత ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ షెడ్యూల్స్కి గ్యాప్ రావడంతో వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఇక ఈ సినిమా కాకుండా... దర్శకుడు త్రివిక్రమ్తో ఓ సినిమా, ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్రెడ్డి వంగాతో ఓ సినిమాను అల్లు అర్జున్ కమిటైన సంగతి తెలిసిందే. -
స్టార్ట్ యాక్షన్
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కల్యాణ్రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో ‘దేవర’ లోని ఓ యాక్షన్ షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ఆగస్టు తొలివారంలో ప్రారంభం అవుతుందనీ, ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తారని టాక్. ఈ ఫైట్ ఇంట్రవెల్ సమయంలో వస్తుందని ఫిల్మ్నగర్ భోగట్టా. స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ్స ఈ యాక్షన్ సీక్వెన్ ్సను డిజైన్ చేయనున్నట్లు టాక్. అలాగే ఈ సినిమాలోని ప్రధాన తారాగణం అయిన సైఫ్ అలీఖాన్ , జాన్వీకపూర్లతో పాటు, కొందరు కీలక పాత్రధారులపై ఈ షెడ్యూల్లోనే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారట కొరటాల. ‘దేవర’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. -
'దేవర' తర్వాత జాన్వీని తమిళ్కు పరిచయం చేయనున్న టాప్ హీరో
నటి శ్రీదేవి ఈ పేరే అందానికి బ్రాండ్ అంబాసిడర్. మొదట కోలీవుడ్లో బాలనాటిగా తెరంగేట్రం చేసిన ఈమె ఆ తర్వాత టాప్ హీరోయిన్గా పేరు పొందారు. అలా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ప్రముఖ హీరోల సరసన నటించి ఇండియన్ సినీ చరిత్రలో తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నారు. ఆమె జీవితం కథానాయకిగానే ముగిసింది. ఇక శ్రీదేవి వారసురాలిగా రంగప్రవేశం చేస్తున్న పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్లో ఇప్పటికే క్రేజీ కథానాయకిగా రాణిస్తోంది. నటన కంటే తన అందాలతో సోషల్ మీడియాను ఊపేస్తున్న జాన్వీకపూర్పై దక్షిణాది సినిమా చూపు చాలా కాలం క్రితమే పడింది. పలువురు ప్రముఖ దర్శక, నిర్మాతలు తమ చిత్రాల ద్వారా పరిచయం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆమెకు దక్షిణ చిత్రాల్లో నటించాలన్న కోరిక ఉన్నా సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చింది. అలా ఇటీవలే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' చిత్రంలో నటించడానికి అంగీకరించింది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. (ఇదీ చదవండి: పుష్ప-2లో ఐటం సాంగ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లా!) కాగా జాన్వీకపూర్ దక్షిణాదిలో తన రెండవ చిత్రాన్ని కోలీవుడ్లో చేయబోతున్నారని తాజా సమాచారం. కోలీవుడ్లో కమలహాసన్, శ్రీదేవిలది సూపర్ హిట్ కాంబో. కాగా శ్రీదేవి వారసురాలు జాన్వీకపూర్ను కమలహాసన్ కోలీవుడ్లో పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. ఇటీవల విక్రమ్ చిత్రంతో బంపర్ హిట్ కొట్టిన ఆయన ప్రస్తుతం తన 233వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్న్స్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. (ఇదీ చదవండి: ‘భాగ్ సాలే’మూవీ రివ్యూ) కాగా మరోపక్క ఆయన వరుసగా చిత్రాలు నిర్మిస్తున్నారు. నటుడు శింబు హీరోగా ఒక చిత్రం, శివకార్తికేయన్తో మరో చిత్రం చేస్తున్న కమలహాసన్, ఇటీవల చిన్నచిత్రంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన 'లవ్ టుడే' చిత్ర దర్శకుడు, కథానాయకుడు ప్రదీప్ రంగనాథం హీరోగా, నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని కమల్ నిర్మాతగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలోనే నటి జాన్వీకపూర్ను కథానాయకిగా నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇందులో కమల్ ఒక కీలక పాత్రలో చేయనున్నట్లు సమచారం. -
దేవర మూవీ కోసం ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్...
-
దేవర టైటిల్ నాదే.. కొట్టేశారు: బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
యంగ్ టైగర్ జూనియర్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఎన్టీఆర్ 30'. ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఇప్పటికే ‘దేవర’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారనే టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. దీంతో దీనిపై నిర్మాత బండ్ల గణేశ్ చేసిన నెట్టింట్లో వైరలవుతోంది. ఆ టైటిల్ను కొట్టేశారంటూ ఆరోపిస్తూ ఆయన ట్వీట్ చేశారు. (ఇది చదవండి: బాలీవుడ్ హీరో ఇంట్లో తీవ్ర విషాదం..!) అయితే ఈ సినిమాకు దేవర అనే టైటిల్ను మూవీ యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ పేరునే ఖరారు చేస్తున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. టైటిల్ ఆసక్తికరంగా ఉండడంతో తారక్ అభిమానులు సైతం ఈ పేరుతో ఇమేజ్లు తయారు చేసి షేర్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. బండ్ల గణేశ్ ట్వీట్లో రాస్తూ..'దేవర అనే టైటిల్ నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. నేను మర్చిపోవడం వల్ల.. నా టైటిల్ను కొట్టేశారు' అంటూ పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ‘నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్. ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా. ఆయన కూడా నాకు దేవరే’ అని మరో ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు టైటిల్ ఏదో తెలియాలంటే మాత్రం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. (ఇది చదవండి: వారికి అచ్చిరానీ టాలీవుడ్.. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' పరిస్థితి ఏంటీ?) దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్ నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు 😡 https://t.co/Y4guc8Yl34 — BANDLA GANESH. (@ganeshbandla) May 19, 2023 -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు
గుడిపాడు (గూడూరు రూరల్): దేవరకు హాజరై తిరుగు ప్రయాణంలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. గుడిపాడు గ్రామంలో సోమవారం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మునగాలకు చెందిన చాకలి మద్దిలేటి (ఆటో డ్రైవర్), సురేష్ ఇద్దరూ బంధువులు. వీరు కర్నూలులో జీవిస్తున్నారు. మూడు రోజుల క్రితం గూడూరులో బం«ధువులు చేపట్టిన దేవర కార్యక్రమానికి ఇద్దరూ కుటుంబీకులతో హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం మద్దిలేటి ఆటోలో కర్నూలుకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో గూడూరు మీదుగా మంత్రాలయం వెళ్తున్న ఎమ్మిగనూరు డిపో గుడిపాడు వద్ద ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కావడంతో అందులో ఉన్న ముగ్గురు ఎగిరి రోడ్డుపై పడ్డారు. చాకలి సురేష్ తలకు గాయమై అధిక రక్త స్రావం కావడంతో ఆసుపత్రికి తరలించేలోపు మృత్యువాతపడ్డాడు. మద్దిలేటి కాలు, చెయ్యి విరిగి తీవ్ర గాయాలపాలు కాగా, ఏడు నెలల గర్భిణి అతని భార్య ఎల్లమ్మ తీవ్రంగా గాయపడి అపస్మాకరస్థితికి చేరుకుంది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ పవన్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డు ప్రమాదంపై స్థానికులను అడిగితెలుసుకున్నారు. మృతుడు సురేష్కు భార్య వెంకటేశ్వరమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.