GHMC Mayor
-
నేటితో GHMC పాలకమండలి ఏర్పడి నాలుగేళ్లు పూర్తి
-
కంగారు పెట్టించిన మేయర్ మేడం
-
HYD: జారిపడ్డ మేయర్ విజయలక్ష్మి
సాక్షి,హైదరాబాద్:గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్ గద్వాల విజయలక్ష్మికి తృటిలో ప్రమాదం తప్పింది. నగర సుందరీకరణ పనుల్లో భాగంగా నగరంలో సోమవారం(ఫిబ్రవరి 3) పాదయాత్ర చేస్తున్న సందర్భంగా నాగార్జున సర్కిల్ ఫుట్పాత్పై మేయర్ కాలుజారి కిందపడ్డారు.కిందపడ్డ మేయర్ను పక్కనే ఉన్న హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఓదార్చారు.అనంతరం స్వల్ప గాయాలతో మేయర్ తన పాదయాత్రను కొనసాగించారు. -
No Confidence Motion: అస్త్రశ్రస్తాలతో సిద్ధమైన విపక్షాలు
సాక్షి, హైదరాబాద్: దాదాపు ఏడాది కాలంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో గురువారం జరగనున్న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాన్ని అన్ని పార్టీలూ సవాల్గా తీసుకుంటున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్పై ప్రత్యేక సమావేశం, ప్రజా సమస్యలపై సాధారణ సమా వేశం రెండూ ఒకేరోజు నిర్వహిస్తున్నారు. మేయర్పై అవిశ్వాస తీర్మానం అంశం ఇప్పటి వరకు హాట్టాపిక్గా ఉన్నప్పటికీ, దాని సాధ్యాసాధ్యాలు అంచనా వేసిన పార్టీలు ప్రస్తుత సమావేశంలో ప్రజా సమస్యలనే ప్రముఖంగా ప్రస్తావించాలని తమ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశాయి. విపక్షాలు సంధించే ప్రశ్నలను, ఎదురయ్యే పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు తగిన యుక్తి ప్రదర్శించాల్సిందిగా కాంగ్రెస్ తమ పార్టీ కార్పొరేటర్లకు వివరించినట్లు తెలిసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబులు బుధవారం మేయర్, కొందరు కార్పొరేటర్లతో మినిస్టర్స్ క్వార్టర్స్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ ఎమ్మెల్సీలు, కొందరు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశానికి బయలుదేరేముందు గురువారం ఉదయం మరోసారి కాంగ్రెస్ కార్పొరేటర్లు మంత్రి పొన్నంతో ఆయన నివాసంలో సమావేశం కానున్నట్లు సమాచారం. మంగళవారం బీజేపీ కార్పొరేటర్లకు జాతీయ, రాష్ట్ర నేతలు దిశానిర్దేశం చేశారు. నిధుల కోసం.. పార్టీలకతీతంగా కార్పొరేటర్లు తమ ఫండ్ కోసం పట్టుబట్టనున్నారు. ఎన్నికలకు మిగిలింది ఏడాది కాలమే. తిరిగి ఓట్లకోసం ప్రజల వద్దకు ఎలా వెళ్లాలని వారిలో వారే చర్చించుకుంటున్నారు. మేయర్ కేవలం స్టాండింగ్ కమిటీ సభ్యులకు మాత్రం రూ.25 కోట్ల ఫండ్ ఇవ్వాలని కమిషనర్ను కోరడం కార్పొరేటర్లకు పుండుపై కారం చల్లినట్లుగా మారింది. ఈ నేపథ్యంలో సభ సజావుగా సాగుతుందా.. లేక ఎప్పటిలాగే రసాభాసగానే ముగుస్తుందా? అన్నది కొద్ది గంటల్లో వెల్లడి కానుంది. మొత్తానికి వాతావరణం మాత్రం వాడీవేడిగానే ఉంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అడ్డగోలు బడ్జెట్ బడ్జెట్ అడ్డగోలుగా ఉందని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. నగర ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులతో వారికి మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ఎండగట్టనున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారుల అనుభవ రాహిత్యంతో బడ్జెట్ రూపకల్పనే సవ్యంగా లేదని అవి విమర్శిస్తున్నాయి. స్టాండింగ్ కమిటీలో బడ్జెట్ తొలుత ఆమోదం పొందకపోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాయి. రూ.8 వేల కోట్లకుపైగా ఉన్న బడ్జెట్పై సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేయనున్నాయి. సభలో మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వకుంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాయి. బీఆర్ఎస్ తమ హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు కనిపించడం లేదని, తాము పూర్తి చేసిన పనులను కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటోందని గళమెత్తనుంది. ఇక కాంగ్రెస్.. తమ ప్రభుత్వంలోని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పనుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వ హయాంలోనే జీహెచ్ఎంసీకి రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించడాన్ని ప్రస్తావించనుంది. కమిషనర్కు తొలి సమావేశం జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తికి పాలకమండలి తొలి సమావేశం ఇది. కొందరు హెచ్ఓడీలు కూడా కొత్త. సభ్యులనుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ఎలా స్పందిస్తారో, ఎలాంటి సమాధానాలిస్తారో సభలో వెల్లడి కానుంది. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో కాంగ్రెస్ కార్పొరేటర్ల బలం 24 మందికి పెరిగినప్పటికీ, వారిలో ఎందరు పార్టీకి అనుకూలంగా గళమెత్తనున్నారో తెలియని పరిస్థితి. బహుశా, ఈ విషయం తెలిసే పార్టీ వారంతా సభలో కలిసికట్టుగా వైరి పక్షాలను ఎదుర్కొనాలని మంత్రి పొన్నం వారికి సూచించారు. సభ అధ్యక్షత వహించే మేయర్కు పరిస్థితి క్లిష్టంగానే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గొడవలతోనే సరిపెడతారా.. సమస్యలు పరిష్కరిస్తారా? నగరంలో పలు సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. రాత్రుళ్లు వీధి దీపాలు వెలగడం లేదని నెలల తరబడిగా ప్రజలు మొత్తుకుంటున్నా పట్టించుకున్న దిక్కు లేదు. సమావేశంలో వీటిని ప్రస్తావిస్తారా లేదా అని ప్రజలు ప్రశి్నస్తున్నారు. దిగువ సమస్యలను తీర్చాలంటున్నారు. చెత్త సమస్యలు ఎప్పటికీ తీరడం లేదు. ప్రతిరోజూ స్వచ్ఛ ఆటో కారి్మకులు ఇంటింటికీ వెళ్లడం లేదు. దీనిపై ఎవరిని సంప్రదించాలో అర్థం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా మారాయి. తిరిగి సీఆర్ఎంపీ ఏజెన్సీలకే కట్టబెట్టాలనే యోచనతో కాబోలు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇంజినీర్లు పనులు చేయడం లేదు. కాలనీలతో పాటు ప్రధాన రోడ్లలోనూ గుంతలు కనిపిస్తున్నాయి. ప్రజలకు బర్త్, డెత్సర్టిఫికెట్ల కోసం అగచాట్లు తప్పడం లేదు. పుడ్ సేఫ్టీ లేక ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నా, లక్షల బిల్లులు చెల్లిస్తున్నా, ప్రాణాలు పోతున్నా జీహెచ్ఎంసీ నిద్ర పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నా, హోటళ్ల తనిఖీల్లో లోపాలు బట్టబయలవుతున్నా ఎలాంటి మార్పూ లేదు. నాలాల కోసం ఏటా వందల కోట్లు ఖర్చు పెడుతున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అక్రమ భవనాల నిర్మాణాలకు హద్దూపద్దూ లేకుండా వెలుస్తున్నాయి. దాంతో పరిసరాల్లోని ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కళ్లెదుట నిలువెత్తు అక్రమాలు కనిపిస్తున్నా చర్యల్లేకుండాపోయాయి. ఇలా వివిధ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు మొత్తుకుంటున్నా, ప్రతిసారీ అధికార, ప్రతిపక్ష సభ్యుల గందరగోళాలతోనే ముగిస్తున్నారు. ఈసారైనా చర్చించి పరిష్కరిస్తారా? అని ప్రజలు ప్రశి్నస్తున్నారు. -
GHMC: అవగాహన లేకుండా ‘అవిశ్వాసం’
సాక్షి, హైదరాబాద్: బల్దియా పాలకమండలి ఏర్పాటై వచ్చే నెల 10వ తేదీకి నాలుగేళ్లు పూర్తి కానుండటం.. ఆ తర్వాత మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో గురువారం జరగనున్న జీహెచ్ఎంసీ ప్రత్యేక బడ్జెట్, సాధారణ సర్వసభ్య సమావేశాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కౌన్సిల్ ఈ సమావేశాల సందర్భంగా ఏం జరుగుతుందోనని ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్నా అందుకు పాలకమండలి సమావేశం వేదిక కాకపోయినప్పటికీ, పొలిటికల్ హీట్ మాత్రం పెరిగింది. ఈ నేపథ్యంలో కౌన్సిల్ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం బీజేపీ కార్పొరేటర్లతో ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ నాయకుడు, ఎంపీ కె.లక్ష్మణ్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. పలువురు పార్టీ అగ్రనేతలు కూడా హాజరైన ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై నిలదీయాలని ఉద్భోదించారు. కేంద్రం నిధులివ్వడం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పదే పదే అంటున్నందున జీహెచ్ఎంసీలో ప్రజలు వేల కోట్ల పన్నులు కడుతున్నా మీరెందుకు వారికి పనులు చేయడం లేదని ప్రశ్నించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నిధులు ఎక్కడికి మళ్లిస్తున్నారో అడగాలని, ఆ నిధులన్నీ ఏం చేస్తున్నారో నిలదీయాలని సూచించారు. ముఖ్యంగా.. జీహెచ్ఎంసీ బడ్జెట్పైనా, ప్రజా సమస్యలపైనా గళమెత్తాలని ఆదేశించారు. సమస్యలపై ప్రశ్నించేందుకు బీజేపీ సభ్యులకు అవకాశమివ్వకపోవడం తగదన్నారు. ప్రశ్నల ద్వారా సమాధానాలు రాబట్టాలన్నారు. మేయర్పై అవిశ్వాసానికి సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని తెలిసింది. హాజరైన కార్పొరేటర్లు ముగ్గురే.. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో తమ పార్టీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఆమె బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్గా గెలిచి మేయర్ కావడం తెలిసిందే. పాలకమండలి తొలి ఎన్నికల్లో కాంగ్రెస్కు వచి్చంది కేవలం రెండు కార్పొరేటర్ స్థానాలే అయినప్పటికీ, ఏడాది క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జీహెచ్ఎంసీలోనూ కాంగ్రెస్ బలం పెరిగింది. ప్రస్తుతం ఆ పారీ్టలో 24 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, కౌన్సిల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు మేయర్ ఆహ్వానానికి కేవలం ముగ్గురు మాత్రమే హాజరు కావడం బల్దియాలో చర్చనీయాంశంగా మారింది. అనుసరించాల్సిన వ్యూహం కోసం పిలిస్తే కనీస సంఖ్యలో కూడా సభ్యులు రాలేదు. అవగాహన లేకుండా ‘అవిశ్వాసం’ తనపై ఏ పార్టీవారు అవిశ్వాస తీర్మానం పెట్టుకున్నా తనకు అభ్యంతరం లేదని మేయర్ విజయలక్ష్మి ఉప్పల్లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. చట్టం, నిబంధనల మేరకు వారికా అవకాశం ఉందంటూ ఫిబ్రవరి 11 తర్వాత మాత్రమే అది సాధ్యమన్నారు. ఆలోగా ఏయే పార్టీలు కలిసి అవిశ్వాసం పెడతాయో చూద్దామన్నారు. అసలు అవిశ్వాసం పెట్టాలంటే ఎంత బలం ఉండాలో వారికి తగిన అవగాహన లేదన్నారు. తనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన అవినీతి వ్యాఖ్యలపై స్పందిస్తూ, పదేళ్లుగా తాను, దాదాపు యాభయ్యేళ్లుగా తనతండ్రి కేశవరావు రాజకీయాల్లో ఉన్నా.. మా లైఫ్స్టైల్ ఏంటో, కొత్తగా ఎమ్మెల్యేలైన బీఆర్ఎస్ వారి లైఫ్ స్టైల్ ఏంటో ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. ఎవరు అవినీతికి పాల్పడుతున్నారో దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చునన్నారు. బీజేపీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ వ్యాఖ్య జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పక్ష నాయకుడు దర్పల్లి రాజశేఖర్రెడ్డి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కలిసిన విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఈటల రాజేందర్కు దక్కకుండా ఉండేందుకు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలివిగా ప్లాన్ చేశారని ఆరోపించారు. గద్దర్కు అవార్డు ఇవ్వకపోవడం గురించి చేసిన వ్యాఖ్య ద్వారా బీజేపీ అధ్యక్ష పదవికి ఈటల అర్హుడు కాదనే సంకేతాలిచ్చారన్నారు. -
ఆఫీస్ ఎన్ని గంటలకు?..మీరు వస్తున్నది ఎన్నింటికి?
సాక్షి,సిటీబ్యూరో: అయినా తీరు మారలేదు. ఎంతకూ రీతి మారలేదు. ఇష్టం వచి్చనప్పుడు రావడం.. ఓపిక ఉన్నప్పుడు ఫైళ్లు కదపడం.. ఏళ్లుగా ఇదే తంతు. తనిఖీలు చేసి హెచ్చరించినా వారికి లెక్కలేదు. మేయర్ సీరియస్ అయినా పట్టించుకోరు. ఇదీ జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారుల పనితీరు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి మరోసారి కోపమొచ్చింది. గతంలో రెండు పర్యాయాలు కార్యాలయాల్లో తనిఖీలు చేసినప్పుడు సిబ్బంది ఎవరూ తమ సీట్లలో కనిపించకపోవడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఆయా విభాగాల్లో ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొన్ని విభాగాల్లో మధ్యాహ్నం 12 గంటలవుతున్నా అధికారులు తమ తమ స్థానాల్లో లేకపోవడంపై మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై సహించేది లేదని, సమయపాలన పాటించనివారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలస్యంగా వచ్చేవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తనకు నివేదిక పంపాల్సిందిగా అన్ని విభాగాలకు సర్క్యులర్లు పంపినా, ఎందుకు పంపలేదంటూ టౌన్ప్లానింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టౌన్ ప్లానింగ్పైనే ఎక్కువ ఫిర్యాదులు ప్రజావాణిలో ఎక్కువ ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్వే ఉంటున్నాయని, పరిష్కారం కాక ప్రజలు జీహెచ్ఎంసీ చుట్టూ తిరుగుతున్నారని మేయర్ అన్నారు. హెల్త్ సెక్షన్లో కొందరు పని మాని సెల్ఫోన్ వీక్షణంలో నిమగ్నం కావడాన్ని గుర్తించి సీరియస్ అయ్యారు. ఇన్చార్జి సీఎంఓహెచ్ సీట్లో లేకపోవడంపై మండిపడ్డారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడ తనిఖీలు చేస్తున్నారో తెలుసుకోవాలని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ముత్యం రాజును ఆదేశించగా, ఆయన శేరిలింగంపల్లి ఫుడ్ఇన్స్పెక్టర్కు ఫోన్ చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ సక్రమంగా సమాధానం ఇవ్వకపోవడంతో మేయర్ మండిపడ్డారు. వెటర్నరీ విభాగంలోనూ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇంతకు ముందు కూడా రెండుసార్లు అన్ని విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు చేశానని, అయినా వారి తీరు మారలేదన్నారు. ఆయా విభాగాల సిబ్బంది ఉదయం 10:30 గంటల వరకు ఆఫీసులకు రావాలని, 10:40 నిమిషాల వరకు కూడా రాకపోతే ఆలస్యంగా నమోదు చేస్తామని, ఇలా మూడు పర్యాయాల ఆలస్యానికి క్యాజువల్ లీవ్ కట్ చేస్తామని, అవి లేనివారికి ఈఎల్ కట్చేస్తామని హెచ్చరించారు. తనిఖీల సందర్భంగా మేయర్ వెంట అడిషనల్ కమిషనర్ నళినీపద్మావతి ఉన్నారు. అనంతరం మేయర్ మీడియాతో మాట్లాడుతూ ఆలస్యంగా వచ్చేవారి గురించి తనకు ప్రతినెలా నివేదిక అందజేయాలని అన్ని విభాగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీలోని ప్రతి ఉద్యోగి ఫేషియల్ రికగి్నషన్ హాజరులో పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. -
కాంగ్రెస్లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో ఆమె హస్తం గూటికి చేరుకున్నారు. కాగా, కొద్దిరోజలుగా మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఆమె హస్తం గూటికి చేరారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి చేరుకున్న విజయలక్ష్మి.. సీఎం, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్లో చేరిపోయారు. ఇక, అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా హస్తం తీర్థం పుచ్చుకున్నారు. -
పార్టీ మారినా.. నో ఫియర్!!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా ఆమె పదవికి ఢోకా లేదు. అలాగే డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నా ఆమె పదవికీ నష్టం లేదు. ఎన్నికైన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వేరే పార్టీకి మారితే అనర్హత వేటుపడే ప్రమాదం ఉన్నా మేయర్, డిప్యూటీ మేయర్లకు మాత్రం పదవులు పోయే ప్రమాదం లేదు. జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల మేరకు కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ పారీ్టలు మారినా వారి పదవులు పోయే అవకాశం లేదు. మొత్తం పాలక మండలిలో మెజార్టీ సభ్యుల అవిశ్వాస తీర్మానం ద్వారా మాత్రమే వారి పదవులు పోయే ప్రమాదం ఉన్నా, బాధ్యతలు చేపట్టాక నాలుగేళ్ల వరకు కూడా అలాంటి అవకాశం లేదు. అందుకే వారు ఏ పారీ్టకి మారినా దాదాపు మరో ఏడాది వరకు వారి çపదవులకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ప్రస్తుత పాలకమండలిలో మేయర్గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా శ్రీలత బాధ్యతలు స్వీకరించింది 2021 ఫిబ్రవరి 11న. 2025 ఫిబ్రవరి 10 వరకు వారి పదవులకు వచి్చన ముప్పు ఏమీ లేదు. ఒకవేళ వారి పనితీరు బాగాలేదనో, మరో కారణంతోనో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనుకున్నా అప్పటి వరకు ఆగాల్సిందే. కాబట్టి.. ఇప్పుడు జీహెచ్ఎంసీలో పార్టీల బలాబలాలు, అవిశ్వాస తీర్మానాలు అనేవి అసలు అంశమే కాదని అటు అధికారులతో పాటు ఇటు రాజకీయ నేతలు సైతం చెబుతున్నారు. నాలుగేళ్ల గడువు తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా వారి పదవులకు మిగిలి ఉండేది స్వల్ప సమయం మాత్రమే. అప్పటికి పార్టీల బలాబలాల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. మారనున్న బలాబలాలు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరికలు భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేయర్ పార్టీ మారుతుండగా, ఇదివరకే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, డిప్యూటీ మేయర్ దంపతులు శ్రీలత, శోభన్రెడ్డిలు సైతం కాంగ్రెస్లో చేరడం తెలిసిందే. ఇదే వరుసలో దాదాపు ఇరవైమంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి సైతం కొందరిని లాగే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉన్నట్లు తెలిసింది. ఫలించిన కాంగ్రెస్ వ్యూహం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచే జీహెచ్ఎంసీ మేయర్గా ప్రతిపక్ష పార్టీ వారుండరాదనే పట్టుదలతో ఉంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేది తమ ప్రభుత్వమే అయినందున మేయర్, డిప్యూటీ మేయర్లు కూడా తమ పార్టీ వారే ఉండాలనే వ్యూహంతో పనిచేసింది. ఆ దిశగా సఫలమైన కాంగ్రెస్ ఇక కార్పొరేటర్లపైనా వల వేయనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ సభ్యులు గెలిచింది ఇద్దరే అయినప్పటికీ, ప్రస్తుతం ఆ సంఖ్య డజనుకు చేరింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీల నుంచి దాదాపు 30 మంది వరకు కాంగ్రెస్లో చేరతారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని, ఎమ్మెల్యేలు పారీ్టలు మారితే వారి అనుయాయులు, అనుచరులుగా ఉన్న కార్పొరేటర్లు కూడా పార్టీ మారతారని చెబుతున్నారు. తమ డివిజన్లలో ఎక్కువ అభివృద్ధి పనులు జరగాలంటే, అందుకు అవసరమైన నిధులు పొందాలంటే అధికార పారీ్టలో ఉంటేనే సాధ్యమని కార్పొరేటర్లు సైతం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల నాటికే కాంగ్రెస్ సభ్యుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందనే అభిప్రాయాలున్నాయి. -
జీహెచ్ఎంసీ మేయర్కు కాంగ్రెస్ ఆహ్వానం
బంజారాహిల్స్ (హైదరాబాద్): ‘రెండుసార్లు కార్పొరేటర్గా బంజారాహిల్స్ డివిజన్ ప్రజలు గెలిపించారు. దీపాదాస్ మున్షీ మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. మా డివిజన్ ప్రజలు, కార్యకర్తలు, కార్పొరేటర్లతో చర్చించిన తర్వాతనే నా నిర్ణయం ప్రకటిస్తాను’ అని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహా రాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డిలు బంజారాహిల్స్లోని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ కేశవరావు ఇంటికి వెళ్లారు. అక్కడే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కేశవరావులతో గంటపాటు చర్చించారు. కాంగ్రెస్లోకి రావాల్సిందిగా, పార్టీని బలోపేతం చేయా ల్సిందిగా దీపాదాస్ వారిని ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో విజయలక్ష్మి రాజకీయ భవిష్యత్పై భరోసా ఇచ్చినట్టు సమాచారం. -
హస్తం గూటికి జీహెచ్ఎంసీ మేయర్?
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో ఆమె హస్తం గూటికి వెళ్తారా? అనే సస్పెన్స్ నెలకొంది. కాగా, తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ సిటీ నాయకులపై దృషి సారించింది. దీంతో, తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మేయర్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో, ఆమె నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని దీపాదాస్ మున్షీ ఆహ్వానించారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం చెబుతాను. వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటాను. రెండు సార్లు నన్ను గెలిపించిన కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోను అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు వేగవంతం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, అసంతృప్త నేతలను టార్గెట్ చేసి హస్తం గూటికి తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ గూటికి ప్రతిపక్ష పార్టీలోని సీనియర్ నేతలు, అంతకుముందు కాంగ్రెస్ను వీడిన నేతలు హస్తం గూటికి చేరుతున్నారు. -
రణరంగమైన జీహెచ్ఎంసీ
హైదరాబాద్: బల్దియా సర్వసభ్య సమావేశం రణరంగమైంది. ప్రతిపక్షాల నిరసనలు, ధర్నాలతో దద్దరిల్లింది. బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం 9 గంటలకే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ పరిసరాల్లో వందలాది పోలీసులు పహారా కాశారు. తమను పర్మనెంట్ చేయాలంటూ కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్న బల్దియా ఔట్ సోర్సింగ్ కార్మికులను బీజేపీ కార్పొరేటర్లు తమ వెంట తీసుకుని జీహెచ్ఎంసీ కార్యాలయానికి ర్యాలీగా వస్తుండగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. కొందరు కార్మికులను ఈడ్చి వాహనాల్లో పడేశారు. చెత్త ఊడ్చి నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న తమను ప్రభుత్వం అత్యంత హీనంగా చూస్తోందంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయనిపక్షంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మేయర్ చాంబర్ వద్ద బైఠాయింపు.. ► సమావేశాన్ని తొందరగా ముగించడంతో బయటకు వచ్చిన బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ చాంబర్ వద్ద బైఠాయించారు. వీరి నినాదాలతో జీహెచ్ఎంసీ ప్రాంగణం హోరెత్తింది. ధర్నా చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మేయర్ ఒక డమ్మీ అంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆకుల శ్రావణి, మహాలక్ష్మిగౌడ్, ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్లు ఆరోపించారు. తాము కొత్త హామీలను నెరవేర్చాలని అడగట్లేదు. ఔట్సోర్సింగ్ కార్మికులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని సీఎం గతంలో ప్రకటించారని, ఆయన ప్రకటనను అమలు చేయాలని కోరితే కౌన్సిల్ని రద్దు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా మేయర్ రద్దు చేయడం దారుణమంటూ విమర్శించారు. వారం రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుంటే మేయర్ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అమెరికాలో ఉన్న మంత్రి కేటీఆర్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తూ కౌన్సిల్ను అర్ధంతంగా రద్దు చేయించారంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. పోలీసులు రంగప్రవేశం చేసి బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లను అక్కడినుంచి పంపించారు. ఈ క్రమంలో పోలీసులకు కార్పొరేటర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ప్రొటోకాల్ రగడ జీహెచ్ఎంసీలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని రాజకీయాల కతీతంగా అన్ని పార్టీలూ కోరాయి. అభివృద్ధి పనుల శిలాఫలకాలపై కార్పొరేటర్ల పేర్లు వేయడం లేదని, ప్రొటోకాల్ పాటించడం లేదని.. ముఖ్యంగా వాటర్ బోర్డు పనుల్లో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయని కార్పొరేటర్లు మండిపడ్డారు. వీధి దీపాలు, చెత్త సమస్యలు, డీసిల్టింగ్, నాలాల సమస్యలు తదితర సమస్యలపై ధ్వజమెత్తారు. ఎప్పటిలాగే అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పర వాదోపవాదోలతో సభను మేయర్ విజయలక్ష్మి త్వరితంగా ముగించారు. అందుకు నిరసనగా మేయర్ కార్యాలయం ఎదుట ప్రతిపక్షాలు ధర్నా నిర్వహించాయి. కార్మికుల సమస్యలు తెలిసేలా బీజేపీ సభ్యులు చెత్త తరలింపు కార్మికుల వేషధారణలతో ఆందోళన నిర్వహించారు. మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ముఖ్యాంశాలు ఇలా.. ► తెలంగాణ రాష్ట్రం వచ్చాక జీహెచ్ఎంసీ ఔట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి వారిని పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని అమలు చేయాలని సభ్యులు మధుసూదన్రెడ్డి (బీజేపీ), రాజశేఖర్రెడ్డి (కాంగ్రెస్), సలీంబేగ్ (ఎంఐఎం)లు కోరారు. బీఆర్ఎస్ సభ్యుడు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ సమర్థించారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచింది కూడా కేసీఆరే అన్నారు. ఆర్టీసీ కార్మికుల మాదిరిగానే సందర్భం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి తప్పకుండా చేస్తారని బీఆర్ఎస్ సభ్యులు అన్నారు. అందుకు ఎవరు అడ్డుపడ్డారో తెలుసునన్నారు. ఈ మేరకు తీర్మానం చేయాలని ప్రతిపక్ష సభ్యులు కోరారు. ఈ అంశంపై మేయర్ సూచన మేరకు కమిషనర్ రోనాల్డ్రాస్ మాట్లాడుతూ.. మేయర్తో చర్చించి సభ్యుల అభిప్రాయాన్ని ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరిస్తామని చెప్పారు. నిబంధనలు పాటించడం లేదు.. ► ఆయా పనుల సందర్భంగా అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని, శిలాఫలకాలపై కార్పొరేటర్ల పేర్లు వేయడం లేరని, ప్రారంభోత్సవాలకు చివరి నిమిషంలో సమాచారమిస్తున్నారని, ప్రారంభోత్సవాలకు వస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీ డివిజన్ నాయకుల ఫొటో లేనందున వెళ్లిపోయిన సంఘటనలున్నాయని సభ దృష్టికి తెచ్చారు. వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేసినా పంద్రాగస్టు నాడు జెండా ఎగురవేసే దిక్కు లేకుండా పోయిందని, ప్రభుత్వ పథకాలైన కళ్యాణలక్ష్మి, దళితబంధువంటి వాటి పంపిణీ సందర్భంగా తమను ఆహ్వానించడం లేరని, అక్కడా ఎమ్మెల్యేల పెత్తనమే సాగుతోందన్నారు. ప్రొటోకాల్ పాటించడం లేదని మేయర్ అంగీకరించారు. ఇంటర్నల్ రాజకీయాల వల్లేనని అధికారి తెలపడంతో ఇకపై ఇలాంటి పరిస్థితి ఎదురవకుండా తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ రోనాల్డ్ రాస్ హామీ ఇచ్చారు. ►వీధిదీపాలు, చెత్త, నాలాలు, వీధికుక్కలు తదితర సమస్యల్ని సభ్యులు ప్రస్తావించారు. ► కార్పొరేటర్లకు గౌరవమివ్వకున్నా భరిస్తున్న మీరు బానిసలంటూ బీఆర్ఎస్ సభ్యులనుద్దేశించి బీజేపీ సభ్యులు వ్యాఖ్యానించారు. కిషన్రెడ్డి చెప్పులు మోసేవారంటూ ఒకరు, కేసీఆర్ చెప్పులు మోసేవారంటూ ఒకరు రెండు పార్టీల వారు పరస్పరం వాదించుకున్నారు. ► జడ్సీలు కార్పొరేటర్లతో నెలకోసారి సమావేశం పెడితే స్థానికంగానే సమస్యలు పరిష్కారమవుతాయని బీజేపీ సభ్యులు ప్రస్తావించారు. ► పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.500 నుంచి అన్ని ప్రభుత్వాలు పెంచుతూవచ్చాయని, చరిత్ర తెలియనందున మేయర్ బీఆర్ఎస్సే పెంచిందన్నారని కాంగ్రెస్ సభ్యురాలు అనడంతో, మేయర్ను అవమానించారని, క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ► మేయర్ అన్ని అంశాలను చర్చించకుండా సభను త్వరితంగా ముగించడంపై బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు మేయర్ చాంబర్ ఎదుట బైఠాయించి మేయర్ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పార్కింగ్ ప్రదేశానికి తరలించారు.అక్కడా ధర్నాకు దిగడంతో పోలీస్ వ్యాన్లలోకి ఎక్కించారు. ► కార్మికులను పర్మనెంట్ చేయాలంటూ అన్ని పార్టీలూ కోరినా మేయర్ తీర్మానం చేయకపోవడంపై వారు మండిపడ్డారు. ► మీడియాను కౌన్సిల్హాల్లోకి అనుమతించలేదు. నిరసనగా విషయాన్ని మేయర్కు తెలియజేయాలనుకున్న ప్రతినిధులను పట్టించుకోకుండా మేయర్ కౌన్సిల్ హాల్లోకి వెళ్లిపోయారు. ► ప్రజాధనంతో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో ప్రజాసమస్యలను పట్టించుకోకుండా త్వరగా ముగించారని బీజేపీ, కాంగ్రెస్ విమర్శించాయి. ఇక పోలీస్స్టేషన్ల వద్ద నిరసనలు పార్టీలకతీతంగా జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో మొదటి అంశంగా ఔట్సోర్సింగ్ కార్మికుల పర్మనెంట్ అంశాన్ని లేవనెత్తి, విషయాన్ని ప్రభుత్వానికి పంపేలా చేసిన కార్పొరేటర్లకు జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు యు,గోపాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఇకనుంచి జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో కాకుండా పోలీస్స్టేషన్ల వద్ద నిరసన తెలియజేయాల్సిందిగా గోపాల్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఉదయం 5 గంటల నుంచి పోలీస్స్టేషన్ల వద్ద ఉంటూ శాంతియుతంగా సమస్యలపై నిరసన తెలియజేయాలని సూచించారు. సీఐ, ఎస్ఐలకు కార్మికుల సమస్యల గురించి వివరించాలని కోరారు. డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఉద్యమం ఆగవద్దన్నారు. -
కార్పొరేటర్లు కాదు.. అధికారులే వాకౌట్
హైదరాబాద్: కార్పొరేటర్లకు బదులుగా అధికారులు సమావేశాన్ని బహిష్కరించి వాకౌట్ చేసిన ఘటన బుధవారం జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో చోటుచేసుకుంది. వాటర్బోర్డు అధికారులను తీవ్రంగా అవమానించారంటూ వాటర్బోర్డు అధికారులు సమావేశం నుంచి వాకౌట్ చేయగా, వారికి మద్దతుగా జీహెచ్ఎంసీ అధికారులు సైతం తాము కూడా బాయ్కాట్ చేస్తున్నామంటూ ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. దీంతో మేయర్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశం నిర్వహించాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టినా మేయర్ వినిపించుకోలేదు. మంగళవారం డ్రైనేజీ సిల్ట్ను తీసుకువెళ్లి బీజేపీ కార్పొరేటర్లు వాటర్బోర్డు ఎండి కార్యాలయంలో పూలకుండీల్లో వేయడం తెలిసిందే. దీనికి నిరసనగా వాటర్బోర్డు అధికారులు వాకౌట్ చేశారు. సమావేశం మొదలైన దాదాపు 20 నిమిషాలకే బీజేపీ సభ్యుల ఆందోళనల మధ్య వాయిదా వేస్తున్నట్లు మేయర్ ప్రకటించడంతో సమావేశం ఎలాంటి చర్చ, ప్రశ్నోత్తరాలు లేకుండానే వాయిదా పడింది. వాయిదా పడ్డాక సైతం కార్పొరేటర్లు, అధికారులు ఎవరికి వారుగా ఎదుటివారి తీరును విమర్శిస్తూ వాదనలు వినిపించారు. ఇంత చేస్తున్నా అవమానిస్తారా? మధ్యాహ్నం 12.30 గంటలకు సమావేశం ప్రారంభమైంది. ఇటీవల మరణించిన ఎమ్మెల్యే సాయన్న, బీజేపీ కార్పొరేటర్ దేవర కరుణాకర్, నాలాలో మరణించిన బాలిక మౌనిక, ఉగ్రవాదుల దాడిలో మరణించిన సైనికులకు సంతాపం తెలుపుతూ సభ్యులు మౌనం పాటించారు. సభాధ్యక్షత వహించిన మేయర్ విజయలక్ష్మి ప్రారంభోపన్యాసం ముగియగానే లంచ్ బ్రేక్ ప్రకటన చేయగా బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చే శారు. అంతలోనే వాటర్ బోర్డు ఈడీ సత్యనారాయణ తనకు మాట్లాడే అవకాశశమివ్వాలంటూ మాట్లాడారు. తాగునీరు, మురుగు నీరు నిర్వహణ పనులు చేస్తున్న తాము 186 కి.మీ నుంచి గోదావరి, 110 కి.మీ నుంచి కృష్ణాలతో పాటు సింగూరు, మంజీరాల నుంచి నీటిని ఇంటింటికీ అందిస్తున్నామని, 200 ఎయిర్టెక్ మెషీన్లతో మురుగునీటి సమస్యలు తీరుస్తున్నామని, అయినా తమను అవమానించినందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నామంటూ వెళ్లిపోయారు. వెంటనే జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత లేచి వారికి మద్దతుగా జీహెచ్ఎంసీ అధికారులందరం బాయ్కాట్ చేస్తున్నామంటూ ప్రకటించడంతో అందరూ వెళ్లిపోయారు. బీజేపీ సభ్యులు పోడియం వైపు దూసుకెళ్లి సభ జరగాలని పట్టుబట్టినా మేయర్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో అందరూ బయటకు వెళ్లిపోయారు. అధికారులిలా ప్రవర్తిస్తారా?: బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రజల కోసం పని చేస్తున్న తాము వారి సమస్యలను ప్రస్తావిస్తే పట్టించుకోని అధికారులు సభను బహిష్కరించడం దారుణమని బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు విమర్శించారు. ఎక్కడైనా రాజకీయ నేతలు వాకౌట్ చేస్తారు కానీ.. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ప్రశ్నిస్తే వాకౌట్ చేస్తారా? అంటూ అధికారుల తీరును తప్పుబట్టారు. ఓవైపు నాలాల్లో , అగ్ని ప్రమాదాల్లో, కుక్కకాట్లు, దోమలతో ప్రజలు చస్తున్నా అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదని, ప్రజల ఈ సమస్యలు చర్చించాల్సిన సమావేశం జరగకుండా చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యులు నాలాల్లో పసిప్రాణాల మరణాలు, కుక్కకాట్ల చావులపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. నల్లదుస్తులతో సభకు.. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని జీహెచ్ఎంసీ తీరుకు నిరసనగా బీజేపీ కార్పొరేటర్లు నల్లదుస్తులతో సభకు హాజరయ్యారు. సభ వాయిదా పడ్డాక సైతం కౌన్సిల్ హాల్లోనే ఉన్న బీజేపీ కార్పొరేటర్లు మేయర్ రావాలంటూ డిమాండ్ చేశారు. కరెంట్ తీసేసినా వారు కదలకపోవడంతో, సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో పోలీసులు వారిని అక్కడినుంచి తరలించారు. నిరసన కార్యక్రమం కేటీఆర్కు ముందే తెలుసా? అధికారులు నిరసన వ్యక్తం చేయనున్న విషయాన్ని సభకు ముందస్తుగానే వాటర్బోర్డు అధికారులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. వాటర్బోర్డులో జరిగిన ఘటనను ఎండీ దానకిశోర్ మంత్రికి వివరించగా, ఏ పార్టీ వారైనా కార్పొరేటర్లు అలా వ్యవహరించడం తగదని మంత్రి సమాధానమిచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందువల్లే వాటర్బోర్డుకు మద్దతుగా జీహెచ్ఎంసీ అధికారులు బాయ్కాట్ చేశారంటున్నారు. గతంలో అధికారుల వాకౌట్లు గతంలో మాజిద్ హుస్సేన్ మేయర్గా ఉన్నప్పుడు కమిషనర్గా ఉన్న సోమేశ్కుమార్ సమావేశం నుంచి వాకౌట్ చేసినప్పటికీ, కొద్దిసేపు విరామం తర్వాత పలువురు నచ్చచెప్పడంతో తిరిగి సమావేశాన్ని నిర్వహించారు. సమీర్శర్మ కమిషనర్గా, బండ కార్తీకరెడ్డి మేయర్గా ఉన్నప్పుడు సైతం కమిషనర్ సమావేశం నుంచి వెళ్లిపోయిన ఘటనను కొందరు గుర్తు చేస్తున్నారు. కానీ అధికారులంతా మూకుమ్మడిగా వాకౌట్ చేయడం ఇదే ప్రథమం. మేయర్ వచ్చాకే అధికారులు సభలోకి ప్రవేశించడం ఈ సందర్భంగా గమనార్హం. ప్రజాధనం దుబారా.. ప్రతి సమావేశంలోనూ గందరగోళం సృష్టిస్తూ వాయిదా వేస్తున్నారని, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని, సమావేశాల సందర్భంగా భోజనాలు, ఇతరత్రా ఖర్చుల పేరిట జీహెచ్ఎంసీ ఖజానాకు రూ.లక్షల ఖర్చు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. బ్లాక్డే: మేయర్ సభ వాయిదా పడ్డాక బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి మేయర్ మీడియాతో మాట్లాడుతూ.. సీటులోకి రాకముందే తనను మహిళ అని కూడా చూడకుండా దూషించారని, అధికారులను సిగ్గుందా? అనడం సమంజసమా అని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ అప్రజాస్వామిక భాష వాడలేదన్నారు. కార్పొరేటర్లు అధికారులను అవమానించడంతో వారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదన్నారు. ఇదొక బ్లాక్డే అని వ్యాఖ్యానించారు. మర్యాద ఇవ్వకపోతే పనులు చేయం: మమత కార్పొరేటర్లు అధికారులతో మర్యాదగా ప్రవర్తించకపోతే సహకరించబోమని కూకట్పల్లి జోనల్ కమిషనర్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత తెలిపారు. సభ వాయిదా అనంతరం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. కార్పొరేటర్ల అనుచిత ధోరణికి నిరసనగా సమావేశాన్ని బాయ్కాట్ చేశామన్నారు. జీహెచ్ఎంసీ, వాటర్బోర్డు అధికారులు కష్టపడి పనిచేస్తున్నా, అందరి ముందూ ఇష్టం వచ్చినట్లు తిడుతూ అధికారులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. ► గ్రేటర్ నగరంలో ప్రజల ప్రాణాలకు రక్షణలేకుండా పోయిందంటూ బీజేపీ సభ్యులు వ్యంగ్యంగా ప్రదర్శనలు నిర్వహించారు. నన్ను చంపమని కోరేందుకు దోమ వేషంలో వచ్చానంటూ ఒకరు.. మేం కౌన్సిల్ హాల్లోకి వెళ్లాక ఏ అగ్ని ప్రమాదం జరుగుతుందోనని కుటుంబ సభ్యులు ఈ అగ్నిమాపక పరికరాలు ఇచ్చి పంపారని, కార్లలోనూ వీటిని ఉంచారని ఒకరు.. హఠాత్తుగా వానొస్తే చెరువులయ్యే రోడ్లతో కారు కొట్టుకుపోతే మాకు ఈత రానందున రక్షణగా టైర్లు, రక్షణ జాకెట్లు ఇచ్చారని కొందరు వివిధ పరికరాలతో, వేషధారణలతో వచ్చి సమావేశానికి ముందు వ్యంగ్యంగా నిరసనలు వ్యక్తం చేశారు. ► ఈ రకంగానైనా అధికారులకు సిగ్గు వస్తుందేమోననే తలంపుతోనే ఈ ప్రదర్శనలకు దిగామన్నారు. అధికారులు బాయ్కాట్ చేయడం సిగ్గుచేటని, మేయర్ కౌన్సిల్ను అదుపు చేయలేకపోయారని సభ వాయిదాపడ్డాక కొప్పుల నరసింహారెడ్డి, ఆకుల శ్రీవాణి తదితర కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. మేయర్ అనుమతి లేకుండానే, మేయర్ కుర్చీకి గౌరవమివ్వకుండా అధికారులు ఇష్టానుసారం వాకౌట్ చేయడం తగదని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, సభను అదుపు చేయలేని మేయర్ దిగిపోవాలని కొందరు డిమాండ్ చేశారు. అధికారులు ఎక్కడా ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేరని, జోన్లలోనూ అవే పరిస్థితులని, ప్రజలకు తాము సమాధానాలు చెప్పలేకపోతున్నామని పేర్కొన్నారు. నగరాన్ని డల్లాస్ చేస్తామని చెప్పినా, నాలాల్లో ప్రాణాలు పోతుండటం వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. వాటర్బోర్డు వైఫల్యాలు తెలుపుతూ పూల మొక్కలిచ్చేందుకు వెళ్లిన తమను గూండాల్లా భావించి పోలీస్స్టేషన్లకు తరలిస్తారా అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్, మేయర్ విజయలక్ష్మి మొద్దునిద్ర వీడాలన్నారు. కొసమెరుపు.. వాటర్బోర్డు సమస్యను జీహెచ్ఎంసీ సమావేశంలో లేవనెత్తి సభను రద్దు చేయడమేంటో అంతుచిక్కడంలేదంటూ నగరవాసులు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా జీహెచ్ఎంసీ సమావేశాలకు వాటర్బోర్డు అధికారులు హాజరు కారు. ఏమైనా అత్యవసర సందర్భాల్లోనే సంబంధిత అధికారి మాత్రమే హాజరవుతారు. -
బీజేపీ కార్పొరేటర్ల తీరుపై అధికారుల నిరసన
-
సికింద్రాబాద్ కళాసిగూడలో విషాదంపై మేయర్ విజయలక్ష్మి రియాక్షన్
-
మలబార్ గోల్డ్ & డైమండ్స్ను ప్రారంభించిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
-
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కచ్చితంగా చర్యలు తీసుకుంటాం: మేయర్
-
కుక్కల దాడిలో బాలుడి మృతి బాధాకరం: మేయర్
-
కుక్కల దాడిలో చిన్నారి మృతి బాధాకరం: మేయర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన బాధాకరమన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఈ పరిణామంపై సాక్షి వరుస కథనాల నేపథ్యంలో స్పందించిన ఆమె అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వీధి కుక్కలను కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. నగరంలో కుక్కలను స్టెరిలైజ్ చేసేందుకు.. ప్రతీరోజూ 30 వాహనాలు తిరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇప్పటిదాకా 4 లక్షల కుక్కలకు స్టెరిలైజ్ చేసినట్లు గణాంకాలు వివరించారామె. నగరంలో ఐదున్నర లక్షలకుపైనే వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు ఆమె తెలిపారు. అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందడం బాధాకరమన్న ఆమె.. ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారామె. కుక్కలు ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారామె. అంతకు ముందు మేయర్ విజయలక్ష్మి అధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ భేటీకి జోనల్ కమిషనర్లు, వెటర్నరీ అధికారులు హాజరయ్యారు. వీధి కుక్కల కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆమె అధికారుల నుంచి వివరాలను సేకరించారు. -
కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై విచారణకు ఆదేశం
-
మూడు నెలల్లో నాలా పనులు పూర్తి చేయండి
ఎల్బీనగర్: జోనల్ పరిధిలో చేపట్టిన నాలా నిర్మాణ పనులను మూడు నెలలో పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలలో వరద ముంపు ప్రభావిత ప్రజలకు ఇబ్బంది ఉండకూడదని ప్రభుత్వం రూ.858 కోట్లతో 52 పనులను చేపట్టిందని ఆమె తెలిపారు. ఎల్బీనగర్ జోనల్ స్థాయి సమీక్ష సమావేశం మంగళవారం ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ పంకజతో కలిసి ఆమె నిర్వహించారు. సమావేశంలో ఎల్బీనగర్, హయత్నగర్, సరూర్నగర్, కాప్రా, ఉప్పల్ సర్కిల్ పరిధిలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, సమయానికి పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని, రూ.114 కోట్లతో చేపట్టిన పనులు మూడు నెలలో పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తయ్యే వరకు ఎవరికీ సెలవులు ఇవ్వొదని సీఈని మేయర్ ఆదేశించారు. టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే ఏజెన్సీలు పనులు ప్రారంభించేలా అధికారులు కృషి చేయాలన్నారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం కింద 14 పనులు చేపట్టామని, వాటిలో 6 పనులు పూర్తి కాగా , మిగతావి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. శానిటేషన్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ››ఈ విషయంలో ఏఎంహెచ్ఓలదే పూర్తి బాధ్యత అని అన్నారు. జోనల్లో మరుగుదొడ్లు వంద శాతం అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలన్నారు. మున్సిపాలిటీలో ఘన పదార్థాలు రోజు రోజుకూ పెరుగుతున్నందున సమర్థ నిర్వహణకు సర్కిళ్లలో ప్రత్యామ్నాయంగా రెండో స్థాలాన్ని చూసి ఉంచాలని డీసీలకు సూచించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రధాన రహదారులకు ఉన్న లింకు రోడ్డులను అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎన్డీపీ సీఈ కిషన్, ఎస్ఈలు శ్రీనివాస్రెడ్డి, రవీందర్, అశోక్రెడ్డి, సీపీ ప్రసాద్రావు, హార్టికల్చర్ డీడీ రాజ్కుమార్, ఈఈ ఎలక్ట్రికల్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. వరదనీటి కాలువ పనుల పరిశీలన నాగోలు: ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 103 కోట్ల 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల (వరదనీటి కాలువ పనులు)ను మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్రెడ్డి, ఎస్ఎన్డీపీ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. నాగోల్ డివిజన్ పరిధిలోని బండ్లగూడ చెరువు వద్ద జరుగుతున్న పనులను వారు పరిశీలించారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని, ఈ పనులు పూర్తి అయితే నియోజకవర్గ పరిధిలోని కాలనీలు నీట మునిగే సమస్య పరిష్కారమవుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఆనంతులరాజిరెడ్డి, చెరుకు ప్రశాంత్, టీఆర్ఎస్ పార్టీ నాగోలు డివిజన్ అధ్యక్షుడు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
GHMC: ఆస్తుల ధ్వంసం, మేయర్ ఆగ్రహం, బీజేపీ కార్పొరేటర్లపై కేసు
సాక్షి, బంజారాహిల్స్: బీజేపీ కార్పొరేటర్లు తమ అనుచరులతో కలిసి జీహెచ్ఎంసీ ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక మార్గాలు ఉన్నప్పటికీ మన కార్పొరేషన్ ఆస్తులను మనమే ధ్వంసం చేయడం సరికాదన్నారు. బంజారాహిల్స్లోని మేయర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ విజయలక్ష్మి మాట్లాడారు. ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల ఆస్తిని ధ్వంసం చేయడంపై బీజేపీ కార్పొరేటర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలని, రాజ్యాంగ పరమైన పదవిలో ఉండి ఇలాంటి దాడులకు పాల్పడితే ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోతుందన్నారు. చదవండి: GHMC: రణరంగంగా మారిన మేయర్ చాంబర్.. తనను కలిసేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ రాకపోవడంపై బీజేపీ కార్పొరేటర్లు సమాధానం ఇవ్వాలన్నారు. ఆ విషయాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇలాంటి దాడులకు పాల్పడటం సరికాదన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై స్పందించి వెంటనే పరిష్కరించటంలో రాజీపడటం లేదన్నారు. తాను నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో లోతట్టు ప్రాంతాలు సందర్శించి అధికారులను, ప్రజలను అప్రమత్తం చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఎల్బీనగర్ జోన్లోని సరూర్నగర్ ప్రాంతం ఎక్కువ ముంపునకు గురైన సందర్భంలో వెల్ఫేర్ అసోసియేషన్, కార్పొరేటర్లు, అధికారులతో సమీక్ష చేసి తాత్కాలిక, శాశ్వత పరిష్కార చర్యలు తీసుకున్నామని తెలిపారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో జూన్ 29న వర్చువల్ ద్వారా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లు విన్నవించిన సమస్యలను పరిష్కరించినట్లు స్పష్టం ఆమె స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించలేకపోతున్నామని, ఈ విషయం బీజేపీ కార్పొరేటర్లకు తెలిసినప్పటికీ కావాలనే దాడి చేశారని అన్నారు. కార్పొరేటర్లు సహా 20 మందిపై కేసు ఖైరతాబాద్: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుర్చీలు, పూల కుండీలు, టేబుల్, అద్దాలను ధ్వంసం చేయడంతో బీజేపీ కార్పొరేటర్లు సహా 20 మందిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
GHMC: రణరంగంగా మారిన మేయర్ చాంబర్..
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని, కార్పొరేటర్లకు బడ్జెట్ కేటాయించాలనే డిమాండ్లతో బీజేపీ కార్పొరేటర్లు తమ అనుచరులతో మేయర్ విజయలక్ష్మి కార్యాలయంలోనికి చొచ్చుకుపోవడం రణరంగాన్ని తలపించింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్ర తోపులాట జరిగింది. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు కమిషనర్ చాంబర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ గుంపుగా పోగైన వారు జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కాసేపు బైఠాయించారు. అక్కడి నుంచి మేయర్ చాంబర్వైపు వెళ్లారు. కార్పొరేటర్లతో పాటు వారి అనుచరులు దాదాపు రెండొందల మంది వరకు గుంపులుగా చేరడాన్ని గుర్తించిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ముందుకు దూసుకువెళ్తూ వరండాలోని పూలకుండీలను ధ్వంసం చేశారు. చదవండి: కుంకుమ పువ్వు సాగుపై కేటీఆర్ ప్రశంస మేయర్ అప్పటికింకా కార్యాలయానికి రాలేదు. ఆమె చాంబర్లోకి వెళ్లి ఫర్నిచర్ను, ల్యాంపులు, పూలకుండీలను ధ్వంసం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ల నేమ్బోర్డులు పీకిపారేశారు. కేబుల్వైర్లు తెంపారు. జీహెచ్ఎంసీ పేరున్న బోర్డుపై నల్లరంగు పూశారు. చాంబర్లో బైఠాయించారు. మేయర్కో హటావో.. జీహెచ్ఎంసీ బచావో తదితర నినాదాలతో కూడిన పోస్టర్లను చాంబర్లో అంటించారు. మెరుపు ధర్నాతో కాసేపు ఏం జరుగుతోందో అక్కడున్నవారికి అర్థం కాలేదు. ఈ పరిణామాలతో దాదాపు రెండు గంటల పాటు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చదవండి: ఎంకి పెళ్లి సుబ్చి చావుకొచ్చిందన్నట్టు.. వారికి సంతోషమే.. కానీ.. పగిలిపోయిన పూలకుండీలను ఒకచోటకు చేరుస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది కార్పొరేటర్లుగా ఎన్నికై ఏడాదవుతున్నా ఇంతవరకు సమావేశాలు నిర్వహించలేదని, కార్పొరేటర్లకు బడ్జెట్ కేటాయించలేదని నినాదాలు చేశా రు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్ జులుం నశించాలని నినదించారు. సమస్యలు పరిష్కరించకపోతే కేసీఆర్, కేటీఆర్ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. ఒకసారి నిర్వహించిన వర్చువల్ సమావేశంలో తమ వాణి వినిపించలేకపోయామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని, సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజాసమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు బీజేపీ నేతలు, వారి అనుయాయులను అరెస్టు చేశారు. -
నాకు తెలియకుండానే ప్రారంభిస్తారా? మేయర్ అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: తనకు తెలియకుండానే పనులు జరుగుతుండటంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని ఇంజినీరింగ్ పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు తనకు తెలియకుండానే, తనకు ఆహ్వానం లేకుండానే జరగడంతో ప్రొటోకాల్ పాటించడం లేరని అసహనానికి గురైన మేయర్ విషయాన్ని కమిషనర్, ఇంజినీరింగ్ ఉన్నతాధికారులకు తెలియజేశారు. వివరణ కోరుతూ కమిషనర్ లోకేశ్కుమార్ సదరు పనులు జరిగిన నాలుగు జోన్లకు చెందిన డీఈఈలు, ఈఈలతో పాటు ఎస్ఈలకు కూడా మెమోలు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంబంధిత అధికారులు ఇప్పటికే తమ వివరణలు కూడా పంపినట్లు సమాచారం. -
వివాదాల్లో మేయర్ గద్వాల్.. సోషల్ మీడియాలో విమర్శలు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ మేయర్గా పదవీబాధ్యతలు స్వీకరించి ఇంకా నెలరోజులు కాలేదు...అప్పుడే గద్వాల్ విజయలక్ష్మి వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆమె మాటలు, చేతలు ఎందుకనోగానీ వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యంగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మేయర్ హోదాలో ఒక టీవీ చానల్కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వరదలపై చేసిన వ్యాఖ్యలు, అందుకు ఆమె ప్రతిస్పందన జనం ఇంకా మరచిపోక ముందే జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎన్నికల కరపత్రాల పంపిణీ వివాదానికి తావిచ్చింది. తాజాగా క్యాంప్ ఆఫీస్కు (ఇంటికి) 25 కేవీ జనరేటర్ కావాలంటూ కమిషనర్కు నోట్ పెట్టడం దుమారం రేపుతోంది. ఓవైపు ప్రభుత్వం 24 గంటలపాటు కోతల్లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతుంటే, తరచూ విద్యుత్ కోతల వల్ల పనులకు అంతరాయం కలుగుతూ, రోజువారీ పనుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ‘నోట్’లో పేర్కొన్నారు. ఈ నెల 2వ తేదీన ఆమె రాసిన ఈ నోట్ కాపీ వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో, శుక్రవారం సాయంత్రం వివరణనిస్తూ మేయర్ విజయలక్ష్మి పత్రికా ప్రకటన జారీ చేశారు. తన నివాసం వద్ద విద్యుత్లైన్ల నిర్మాణానికి తవ్వకాలు జరుగుతున్నందున విద్యుత్ అంతరాయం కలుగుతోందని, అందువల్లే తాత్కాలికంగా విద్యుత్ జనరేటర్ ఏర్పాటు చేయాల్సిందిగా కమిషనర్ను కోరినట్లు పేర్కొన్నారు. అంతేతప్ప నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉందని తాను పేర్కొన్నట్లుగా కొన్ని ప్రసారమాధ్యమాల్లో వస్తున్న కథనాలు అవాస్తవమని, ప్రజలను తప్పుదారి పట్టించేవిధంగా ఉన్న వీటిపై తానూ తీవ్ర వ్యధ చెందుతున్నానని వివరించారు. బయటకు పొక్కడంపై ఆరా.. ఇదిలా ఉండగా, కమిషనర్కు మేయర్ పంపిన నోట్ ప్రతి బయటకు ఎలా వెళ్లిందని జీహెచ్ఎంసీ అధికారులు ఆరా తీస్తున్నారు. సదరు సదుపాయం సమకూర్చేందుకుగాను నోట్ కాపీ ఎవరెవరి దగ్గరకు వెళ్లింది..ఎక్కడ లీకై ఉంటుందా అని ఆరా తీస్తున్నారు. మేయర్ గౌరవ వేతనం రూ.50 వేలు, కార్పొరేటర్లకు రూ.6 వేలు పాలకమండలి సభ్యుల జీతభత్యాలూ చర్చనీయాంశంగా మారాయి. కార్పొరేటర్లకు నెలకు రూ.6 వేల గౌరవ వేతనం ఉండగా, మేయర్కు రూ.50 వేలు, డిప్యూటీ మేయర్కు రూ.25 వేలుగా ఉంది. రూ.4 వేల ఫోన్బిల్లుతోపాటు కార్పొరేటర్ కుటుంబానికి రూ.5 లక్షల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుంది. మేయర్, డిప్యూటీ మేయర్లకు వాహనాల సదుపాయంతోపాటు కార్యాలయ ఖర్చులు కూడా చెల్లిస్తున్నారు. తమ గౌరవ వేతనాలు పెంచాల్సిందిగా గత పాలకమండలి నుంచే కార్పొరేటర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గౌరవ వేతనమనేది జీతం కాదని, ప్రజాసేవ చేస్తామని వచ్చేవారు ఎక్కువగా ఆశించవద్దని అభిప్రాయపడుతున్న వారూ ఉన్నారు. పన్నులు వసూలు చేయొద్దు: బీజేపీ కార్పొరేటర్లు గత సంవత్సరం నుంచి కరోనా వల్ల ప్రజల ఆర్థిక పరిస్థితులు దిగజారినందున ఆస్తిపన్ను వసూళ్లు, ట్రేడ్లైసెన్సుల ఫీజులు వసూలు చేయరాదని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు శుక్రవారం జీహెచ్ఎంసీ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. చదవండి: మేయర్ అసంతృప్తి.. అస్సలు బాలేదంటూ కామెంట్ -
మేయర్ అసంతృప్తి.. అస్సలు బాలేదంటూ కామెంట్
సాక్షి, హైదరాబాద్ : ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీసేలా కేంద్రం ర్యాంకింగ్ ఇచ్చిందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి వ్యాఖ్యానించారు. భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాను ఇటీవల కేంద్ర విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై మేయర్ స్పదింస్తూ.. సులభతరం జీవనం ర్యాంకింగ్లో నగరానికి కేంద్రం 24వ స్థానం ఇవ్వడం సరికాదన్నారు. ముత్యాల నగరంగా పేరొందిన హైదరాబాద్.. దేశంలోని అన్ని మెట్రో నగరాల కన్నా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే నగర ర్యాంకింగ్ను తగ్గించారని విమర్శించారు. 24వ ర్యాంక్ను హైదరాబాదీలు అంగీకరించరని విజయలక్ష్మి చెప్పారు. చదవండి: ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్: టాప్ ప్లేస్లో బెంగళూరు ఇదిలా ఉండగా.. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్-2020ను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. నగరాల్లో జీవనం సాగించేందుకు అనుకూల పరిస్థితులకు అనుగుణంగా ఈ ర్యాంకులను కేటాయించింది. మిలియన్కు(10 లక్షల) పైగా జనాభా ఉన్న నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. ఆ తరువాతి స్థానాల్లో పుణె, అహ్మదాబాద్ ఉన్నాయి. అయితే 13వ స్థానంలో ఢిల్లీ, 15వ స్థానంలో విశాఖ ఉంగా హైదరాబాద్ 24వ స్థానంలో నిలిచింది. చదవండి: నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు: మేయర్ గుజరాత్కేనా.. హైదరాబాద్కు ఆ అర్హత లేదా? -
జీహెచ్ఎంసీ మేయర్గా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి
-
జీహెచ్ఎంసీ మేయర్గా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్గా గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా మోతె శ్రీలత సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని 7వ అంతస్తులోని మేయర్ చాంబర్లో విజయలక్ష్మి, ఒకటవ అంతస్తులోని డిప్యూటీ మేయర్ చాంబర్లో శ్రీలత సర్వమత ప్రార్థనల అనంతరం పదవీ బాధ్యతలు తీసుకునే ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, మహమూద్అలీ, ఈటల రాజేందర్, ఎంపీ కె.కేశవరావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లను అభినందించారు. నగరంలోని పలువురు ప్రముఖులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం పనిచేస్తా : మేయర్ విజయలక్ష్మి నగర ప్రజలకు సేవ చేసేందుకు తన శక్తి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తానని సోమవారం మేయర్గా బాధ్యతలు చేపట్టిన గద్వాల్ విజయలక్ష్మి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. హైదరాబాద్ నగర మేయర్గా ప్రమాణం చేయడం తనకు లభించిన సంపూర్ణ గౌరవమని, అందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్లకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: షేక్పేట తహసీల్దార్.. బదిలీ రగడ! -
నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు: మేయర్
సాక్షి, బంజారాహిల్స్: నగరంలో వందేళ్లలో ఎన్నడూ రానంత రికార్డు స్థాయిలో గత ఏడాది అక్టోబర్లో కురిసిన వర్షాలతో వరదలతో నగర జనజీవనం అతలాకుతమైంది. అంతటి భారీ వర్షాలు, వరదలు రాకుండా చూడాలని దేవుణ్ని వేడుకుంటానని చెప్పే క్రమంలో తన వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం బంజారాహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇటీవల ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాటలను వక్రీకరించి తప్పుడు సంకేతాలు వెళ్లేలా వైరల్ అవుతున్నాయన్నారు. హైదరాబాద్ నగరంలో వరదలు రావొద్దు అనేది మాత్రమే తన మనోగతమని, మొత్తానికే వర్షాలు రావొద్దని కాదని ఆమె స్పష్టం చేశారు. ఇక షేక్పేట తహసీల్దార్ బదిలీ వ్యవహారంలో రాజకీయ ప్రమేయమేమీ లేదని చెప్పారు. తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదన్నారు. బదిలీలనేవి రెవెన్యూ శాఖ చూసుకుంటుందని, దాంట్లో తనకు ఎలాంటి పాత్ర లేదని మేయర్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. చదవండి: మేయర్ వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్ మేయర్ ఎన్నిక: వారు అలా.. వీరు ఇలా.. -
జీహెచ్ఎం'షీ టీమ్'
-
మేయర్ ఎన్నిక: వారు అలా.. వీరు ఇలా..
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నో సంశయాలు.. ఊహాగానాలు.. మరెన్నో అంచనాలను పటాపంచలు చేస్తూ జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోటీ జరిగినప్పటికీ.. మేయర్ ఎన్నికకు 4, డిప్యూటీ మేయర్ ఎన్నికకు 4 నిమిషాలు చొప్పున 8 నిమిషాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం ఎన్నికల ప్రక్రియ 20 నిమిషాల్లోనే ముగిసింది. గురువారం ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం, అది ముగిశాక 12.30 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఎన్నికలు పూర్తి చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను టీఆర్ఎస్ సునాయాసంగా గెలుచుకుంది. మేయర్గా రాజ్యసభ సభ్యుడు కేశవరావు కుమార్తె, బంజారాహిల్స్ డివిజన్ కార్పొరేటర్ గద్వాల విజయలక్షి్మ, డిప్యూటీ మేయర్గా టీఆర్ఎస్ నాయకుడు మోతె శోభన్రెడ్డి సతీమణి మోతె శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు. ఎంఐఎం సభ్యులు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్కు 32 మంది ఎక్స్అఫీషియో సభ్యులున్నప్పటికీ అందరూ హాజరు కాలేదు. విప్కు అనుగుణంగానే అందరూ వ్యవహరించారని విప్ జారీ చేసిన ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్రావు తెలిపారు. టీఆర్ఎస్కు తగినంత బలమున్నందున ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విని యోగించుకునేందుకు వీలుగా పారీ్టయే వారిని రావద్దని సూచించినట్లు తెలిపారు. హాజరుకాని వారిలో లోక్సభ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి, రాజ్యసభ సభ్యులు బి.లక్ష్మీనారాయణ, ఫరీదుద్దీన్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తదితరులున్నారు. రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్కు మాత్రం విప్ జారీ కాలేదని సమాచారం. ఆయన సమావేశానికి హాజరు కాలేదు. మేయర్గా ఎన్నికయ్యాక గద్వాల విజయలక్ష్మి సభలోనే ఉన్న తన తండ్రి కేశవరావుకు పాదాభివందనం చేశారు. అనంతరం సభ్యులందరికీ విడివిడిగా ధన్యవాదాలు తెలిపారు. సన్నిహితులను ఆలింగనం చేసుకున్నారు. చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులంతా ఓట్లు వేశారు. బీజేపీ అభ్యర్థులకు కేవలం బీజేపీ సభ్యులు మాత్రమే ఓట్లు వేశారు. జీహెచ్ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లుండగా, లింగోజిగూడ కార్పొరేటర్ మృతి చెందడంతో ప్రస్తుతం 149 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు ఎన్నికలో పాల్గొనలేదు. మిగతా 147 మంది కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఎక్స్అఫిషియో సభ్యులుగా ఓటున్న అయిదుగురు రాజ్యసభ సభ్యుల్లో డి.శ్రీనివాస్, వి.లక్ష్మీకాంతరావు హాజరు కాలేదు.15 మంది ఎమ్మెల్సీల్లో 10 మంది, 21 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది హాజరైనట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఎంపీలు కిషన్రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ సైతం పోలింగ్లో పాల్గొనలేదు. ఎమ్మెల్సీ కవిత పలువురికి సూచనలిస్తూ కనిపించారు. మంత్రి తలసాని పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ టీఆర్ఎస్ సభ్యులకు సూచనలిచ్చారు. చదవండి: ‘మమ్మీ కంగ్రాట్చులేషన్, ఐ లవ్యూ’ మేయర్ పదవి ఆశించింది వాస్తవమే: మోతె శ్రీలతారెడ్డి తెలిసినా తగ్గలేదు సాక్షి, సిటీబ్యూరో: మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ తమవద్ద లేదని తెలుసు. అయినా బీజేపీ తమ అభ్యర్థులను మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు బరిలోకి దించింది. అప్పటి వరకు పైకి చూసేందుకు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్న అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష మజ్లిస్లు తీరా ఓటింగ్ సమయం ఒక్కటవడంతో ఆ పారీ్టకి ఓటమి తప్పలేదు. ఎన్నికల సమయంలో ఆ రెండు పారీ్టలు పన్నిన కుట్రలను, కొనసాగిస్తూ వస్తున్న అంతర్గత సంబంధాలను బహిర్గతం చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. కౌన్సిల్ వేదికగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష మజ్లిస్ల అపవిత్ర పొత్తులను బహిర్గతం చేసి ఆందోళనకు దిగింది. ఆ రెండు పార్టీలపై తీవ్రంగా మండిపడింది. సంఖ్యాబలం లేదని తెలిసీ.. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56 స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ 48 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాలు, ఎంఐఎం 44 స్థానాలను కైవసం చేసుకుంది. వీరిలో లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్గౌడ్ ప్రమాణ స్వీకారాణికి ముందే మృతి చెందారు. దీంతో బీజేపీ సీట్ల సంఖ్య 47కు చేరింది. ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. దీంతో మేయర్ ఎన్నికకు ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. అధికార టీఆర్ఎస్కు ఎక్స్అఫిíÙయో ఓట్లు 32 ఉండగా, బీజేపీకి 2, ఎంఐఎంకు 10 ఉన్నాయి. అయితే అధికార టీఆర్ఎస్కు కార్పొరేటర్ సహా ఎక్స్ అఫిషియో ఓట్లు ఎక్కువే. తీరా ఓటింగ్ సమయంలో ఎంఐఎం మ ద్దతు తెలుపడంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను ఆ పార్టీ సునాయాసంగా దక్కించుకుంది. -
మేయర్ పదవి ఆశించింది వాస్తవమే: మోతె శ్రీలతారెడ్డి
సాక్షి, బంజారాహిల్స్: గ్రేటర్ హైదరాబాద్లో త్వరలోనే బస్తీ యాత్ర చేపట్టి స్థానిక సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందుబాటులో ఉండే విధంగా నగరంలోని ప్రతి బస్తీలో బస్తీ దవాఖానాలు, కమ్యూనిటీ హాళ్లు ఉండాలన్నదే తన లక్ష్యమని, ఇప్పుడున్న బస్తీ దవాఖానాలు మరింత పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని మెరుగు పరిచేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తామని తన తొలి ప్రాధాన్యత కూడా ఇదేనన్నారు. రోడ్లు చాలా చోట్ల దెబ్బతిన్న విషయాన్ని గుర్తించామని, వాటిని కూడా బాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి రహిత జీహెచ్ఎంసీని రూపొందించడమే తన లక్ష్యమని వెల్లడించారు. కరప్షన్ ఫ్రీ అనేది తన లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు. అవినీతిపై ఎందాకైనా వెళ్లి పోరాడతానని స్పష్టం చేశారు. నగర అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అందరి సలహాలు తీసుకుంటానని వెల్లడించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తానని మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు మహిళలకు ఇవ్వడంపై సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు గ్రేటర్ మహిళల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. గతంలో మహిళా మేయర్లు ఉన్నా ఒకే సమయంలో మేయర్, డిప్యూటీ మేయర్ మహిళలకే ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. హైదరాబాద్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పాటుపడతానని, ఐటీ హబ్గా ఉన్న నగరాన్ని హెల్త్ హబ్గా, పరిశుభ్రమైన నగరంగా మార్చడమే తన లక్ష్యమన్నారు. హైదరాబాద్ను ఎంతో అభివృద్ధి చేశారు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొంత మందే మహిళలు ఉండేవారని, కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఒక్కొక్కరిగా వందల సంఖ్యలో మహిళలు రావడం తనకెంతో తృప్తి కలిగించిన అంశమన్నారు. ఈ ప్రభుత్వంలోనే మహిళలకు ఎన్నో అవకాశాలు దక్కాయని, ప్రతి రంగంలోనూ మహిళలు దూసుకుపోతున్నారని వెల్లడించారు. మహిళగా గర్వపడుతున్నానన్నారు. మహిళలే ముందుండి తనను నడిపించారని ప్రతి గెలుపులోనూ బంజారాహిల్స్ డివిజన్ మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. తన వెన్నంటి నిలిచి ఉన్నతిని కోరుకున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వంలో పని చేస్తున్నందుకు ప్రతిఒక్కరూ గర్విస్తున్నారని వెల్లడించారు. కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్ను ఎంతో అభివృద్ధి చేశారు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. నగర అభివృద్ధి విషయంలో అలుపెరుగని కృషి చేస్తా. జీహెచ్ఎంసీలో లోటు బడ్జెట్ ఉందన్న విషయాన్ని బాధ్యతలు స్వీకరించిన తర్వాత సమీక్షిస్తా. అందరితో కలిసి ప్రజలకు మెరుగైన సేవలందించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తాం. విశ్వనగరం సాధిస్తాం. చదవండి: ‘మంచిగ ఉంటేనే బట్టకాల్చి మీదేసే రోజులివి’ ప్రమాణ స్వీకారంలో పదనిసలు నాన్న ఆశీర్వాదం.. బంజారాహిల్స్: జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం నిర్వహించారు. ఉదయం టీఆర్ఎస్ కార్పొరేటర్లు తెలంగాణ భవన్కు వచ్చారు. బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి పేరును మేయర్గా సీల్డ్ కవర్లో తీసుకెళ్లారు. సమావేశానికి హాజరయ్యే ముందు గద్వాల విజయలక్ష్మి తన నివాసంలో తండ్రి కేకే ఆశీస్సులు తీసుకున్నారు. పూజలు చేసి.. బంజారాహిల్స్: ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లేముందు జీహెచ్ఎంసీ మేయర్గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి ఎన్బీటీనగర్లోని శివాలయంలో, అయ్యప్ప స్వామికి, సాయిబాబాకు పూజలు నిర్వహించారు. దైవభక్తి అధికంగా ఉన్న ఆమె ప్రతిరోజూ ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ సాయిబాబా ఆలయాన్ని ఆమె సొంత నిధులతో కట్టించారు. బయోడేటా పేరు : గద్వాల విజయలక్ష్మి భర్త : బాబిరెడ్డి తల్లిదండ్రులు: కే.కేశవరావు, వసంత కుమారి పుట్టిన తేదీ: 28–01–1964 వయసు : 56 విద్యార్హత : బీఏ, ఎల్ఎల్బీ, జర్నలిజం నివాసం : బంజారాహిల్స్, ఎన్బీటీ నగర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా: డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి సికింద్రాబాద్: తనకు లభించిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ పదవిని తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా లభించిన గౌరవంగా భావిస్తున్నానని మోతె శ్రీలతారెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్ నుంచి కార్పొరేటర్గా గెలిచిన మోతె శ్రీలతారెడ్డి గురువారం జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. \ మొదటిసారి కార్పొరేటర్గా గెలిచి, డిప్యూటీ మేయర్గా ఎన్నిక కావడంతో ఎలా ఫీలవుతున్నారు? నన్ను డిప్యూటీ మేయర్ చేయడంతో ఉద్యమకారులకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందన్న భావనను మరోమారు బలపరిచింది. తెలంగాణ ఉద్యమం తొలిరోజు నుంచి నా భర్త శోభన్రెడ్డి ఉన్నారు. ఆయన ఉద్యమ పటిమకు ప్రతిఫలం అనుకుంటున్నాను. డిప్యూటీతో అసంతృప్తికి గురయ్యారా? ఉద్యమ సమయంలోనూ, రాష్ట్రం ఏర్పాటయ్యాక మొత్తంగా 21 సంవత్సరాలు టీఆర్ఎస్తోనే ప్రయాణించాం. మేయర్ పదవి ఆశించింది వాస్తవమే. డిప్యూటీతో అయినా గుర్తింపు లభించినందుకు సంతృప్తి లభించింది. నగర అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఎలా ఉంటుంది? మేయర్ గద్వాల విజయలక్ష్మికి నగర అభివృద్ధిలో సంపూర్ణ సహకారం అందిస్తా. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నాటి నుంచి నగరం శరవేగంగా అభి వృద్ధి చెందుతోంది. సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ చూపిన మార్గంలో అభివృద్ధి పనులు చేపడతాం. ఈ ప్రాంతం నుంచి గెలిచిన మీరు సికింద్రాబాద్ ప్రాంతానికి ఏం చేస్తారు? దశాబ్దాలుగా సికింద్రాబాద్ ప్రాంత సమస్యలు తెలుసు. ఇక్కడి నుంచి డిప్యూటీ స్పీకర్ టీ.పద్మారావుగౌడ్, పశుసంవర్ధక శాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం నుంచి డిప్యూటీ మేయర్ కావడం గర్వంగా ఉంది. వారిద్దరి సహకారంతో సికింద్రాబాద్ను అన్ని విధాలా అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నిస్తాను. బయోడేటా పేరు: మోతె శ్రీలతారెడ్డి భర్త: శోభన్రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు. తల్లిదండ్రలు: బేతి యశోధ, రంగారెడ్డి. పుట్టిన తేదీ: 01–03–1971. వయసు: 49 సంవత్సరాలు. విద్యార్హత: బీఏ సంతానం: ఇద్దరు అమ్మాయిలు. రాజీవి, శ్రీతేజస్విని (అమెరికాలో ఉంటున్నారు). నివాసం: తార్నాక, సికింద్రాబాద్. -
‘మమ్మీ కంగ్రాట్యులేషన్, ఐ లవ్యూ’
సాక్షి, హిమాయత్నగర్ : బల్దియా కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం.. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక సందర్భంగా గురువారం పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. ► మేయర్ పదవి రావడం లేదనే సమాచారంతో టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి అసంతృప్తితో దోమలగూడలోని తన తల్లి నివాసానికి వెళ్లిపోయారు. ఎంపీ సంతోష్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేకే, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆమెకు ఫోన్ చేశారు. ►సుమారు పది నిమిషాల పాటు ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశారు. మేయర్ ఎన్నిక సమయంలోగా ఆమె తిరిగి వచ్చారు. ఈ మాత్రం దానికి అలగడం ఎందుకు.. తిరిగి రావడం ఎందుకంటూ బీజేపీ సభ్యులు మాట్లాడుకోవడం వినిపించింది. ►మేయర్ ఎన్నికకు మద్దతుగా టీఆర్ఎస్కు సభ్యులు చేతులెత్తి ఓట్లు వేయడంతో బీజేపీ సభ్యుల అరుపులతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. ►ఓ పక్క మంత్రి కేటీఆర్ మజ్లిస్తో పొత్తు ఉండదని చెబుతూనే ఇక్కడ మాత్రం కవిత, ఎంపీ సంతోష్లు పొత్తు కుదుర్చుకుని, ఏ రకంగా నీతి మాటలు మాట్లాడతారంటూ ఎన్నిక ముగిశాక పలువురు మీడియాతో మాట్లాడారు . ►మేయర్ ఎన్నికకు ముందే హాల్ వెలుపలకు వచ్చిన కొందరు ఎంఐఎం సభ్యులు ఏం చేద్దాం.. అధిష్టానం చెప్పినట్లు మనం వినాల్సిందేగా.. హ్యాండ్స్ రేజ్ చేద్దామంటూ మాట్లాడుకున్నారు. ►ఎన్నిక పూర్తయ్యాక బయటకు వచ్చిన ఎంఐఎం సభ్యులను పలకరిస్తూ మీడియా ప్రతినిధులు టీఆర్ఎస్తో పొత్తు ఉండదని మీ అధినాయకులు చెప్పారని గుర్తుచేయగా, మాకు పర్సనల్ ఇంట్రస్ట్ ఉండదు కదా.. అంటూ వెళ్లిపోయారు. ►కాంగ్రెస్ కార్పొరేటర్లు రజిత, సింగిరెడ్డి శిరిషా రెడ్డిలు ప్రమాణ స్వీకారం ముగియగానే బయటకు వచ్చారు. ►సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందాలకు తెరతీశారంటూ ఆరోపించారు. ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్షాతో.. ఇక్కడ మజ్లిస్ స్నేహాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు హైడ్రామా క్రియేట్ చేశారన్నారు. ►టీఆర్ఎస్, ఎంఐఎం పొత్తుపై ఎమ్మెల్సీ కవితను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఇద్దరు మహిళలు మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికవ్వడం ఆనందంగా ఉందంటూ సమాధానాన్ని దాటవేశారు. జైతెలంగాణ నినాదాలు చేసుకుంటూ గన్పార్క్లోని అమరవీరుల స్థూపానికి కార్పొరేటర్లతో కలిసి వెళ్లారు. ►డిప్యూటీ మేయర్గా మోతే శ్రీలత ఎన్నిక కావడంతో ఆమె కుమార్తె తేజస్వి భావోద్వేగానికి గురయ్యారు. హాలు నుంచి బయటకు వచ్చిన తల్లిని హత్తుకుని విషెస్ చెప్పారు. తల్లిని కిస్ చేస్తూ మమ్మీ కంగ్రాట్చులేషన్, ఐ లవ్యూ అంటూ ఎగిరి గంతేశారు. -
అమెరికా పౌరసత్వాన్ని వదిలేసుకున్న విజయలక్ష్మి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ నూతన మేయర్గా టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. మేయర్ పీఠం కోసం పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆమె వైపు మొగ్గు చూపింది. సీనియర్ నేత, కేసీఆర్ సన్నిహితుడు కేశవరావు కూతురైన విజయలక్ష్మి.. బంజారాహిల్స్ డివిజన్ 93 కార్పొరేటర్గా రెండు సార్లు ఎన్నికయ్యారు. ఈ సారి ఏకంగా మేయర్ పీఠాన్ని అధిరోహించారు. ఆమె వ్యక్తిగత వివరాలు ఇలా ఉన్నాయి... బాల్యం, విద్యాభ్యాసం.. కేశవరావు కుమార్తె అయిన విజయలక్ష్మి బాల్యం, విద్యాభ్యాసం మొత్తం అంతా హైదరాబాద్లోనే సాగింది. హోలీ మేరీ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన విజయలక్ష్మి.. రెడ్డి మహిళా కాలేజీలో చదివారు. భారతీయ విద్యాభవన్లో జర్నలిజం పూర్తి చేశారు. అనంతరం సుల్తానా ఉల్ లూమ్ లా కాలేజీలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. వివాహం.. విజయలక్ష్మి వివాహం బాబీ రెడ్డితో జరిగింది. పెళ్లి తర్వాత ఆమె అమెరికా వెళ్లారు. దాదాపు 18 ఏళ్లపాటు అమెరికాలోనే ఉన్నారు. అక్కడ ఆమె అగ్రరాజ్యంలోనే ఐదు అతిపెద్ద యూనివర్సిటీల్లో ఒకటైన నార్త్ కరోలినా యూనివర్సిటీలో.. కార్డియాలజీ విభాగంలో రీసెర్చ్ అసిస్టెంట్గా పని చేశారు. 2007లో భారత్ తిరిగొచ్చిన విజయలక్ష్మి.. రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని కొనసాగించడం కోసం అమెరికా పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. రాజకీయ ప్రస్థానం తొలిసారి 2016లో విజయలక్ష్మి టీఆర్ఎస్ తరఫున బంజారాహిల్స్ కార్పొరేటర్గా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అప్పటి నుంచి బంజారాహిల్స్ డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మరో సారి విజయం సాధించి.. ఈ సారి ఏకంగా మేయర్ పదవిని అలంకరించారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత.. డిప్యూటీ మేయర్గా ఎన్నికైన మోతే శ్రీలత తార్నాక డివిజన్ నుంచి గెలుపొందారు. ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే.. బీఏ చదివిన శ్రీలత శోభన్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు రాజీవి, శ్రీతేజస్వి. 20 ఏళ్లుగా బొటిక్ నిర్వహించిన శ్రీలత.. తరువాత రాజకీయాల్లో ప్రవేశించారు. కొంతకాలం పాటు టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. తాజా ఎన్నికల్లో తార్నక కార్పొరేటర్గా విజయం సాధించిన మోతే శ్రీలత.. డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకున్నారు. -
మేయర్ ఎన్నిక: ‘ఓవైసీ, కేసీఆర్ చీకటి ఒప్పందం’
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్ మేయర్ ఎన్నికతో అసదుద్దిన్ ఓవైసీ, సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందం బయటపడిందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ దర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలో ఎంఐఎం పోటీ చేయకుండా అధికార టీఆర్ఎస్కు మద్దతు ప్రటించిన విషయం తెలిసిందే. మేయర్ అభ్యర్థిని బరిలో నిలపకుండా టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి విజయానికి సపొర్టు తెలిపింది. దీంతో మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. సందర్భంగా ఢిల్లీలో ఎంపీ గురువారం మాట్లాడుతూ.. రాబోయే ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యమని అన్నారు. అదే విధంగా గిరిజన మహిళల మీద కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ అర్వింద్ ఖండించారు. మీటింగ్కు వచ్చిన మహిళలను కుక్కలతో పోలుస్తావా అని కేసీఆర్పై ధ్వజమెత్తారు. కేసీఆర్ అబద్ధాలు చెప్పడు అంటే అది పెద్ద జోక్ అని ఎంపీ అర్వింద్ అన్నారు. కేసీఆర్ పెద్ద అవినీతి పుట్ట అని పేర్కొన్నారు. ప్రతి ఊరికి అంతా ఇస్తా ఇంతా ఇస్తా అనడం అబద్దమని, నాగార్జునసాగర్ ఎన్నికల్లో కేసీఆర్కు ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. అసెంబ్లీలో దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మూడు గుంటలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. చదవండి:వారిది అక్రమ సంబంధం: మేయర్ ఎన్నికపై బండి సంజయ్ -
‘టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో’
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంఐఎం సహాయంతో మేయర్, ఉప మేయర్ పదవులు దక్కించుకోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అక్రమ సంబంధం మరో సారి బహిర్గతమైందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము చెప్పిన విషయం నిజమైందని చెప్పారు. టీఆర్ఎస్, ఎంఐఎం రెండు పార్టీలు చీకట్లో ప్రేమించుకుంటూ బయటకు వేర్వేరు అని చెప్పే ప్రయత్నం చేశాయని పేర్కొన్నారు. మేయర్ ఎన్నికపై జరిగిన పరిణామాలపై గురువారం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆ రెండూ పార్టీలు కలిసి పోటీ చేయకపోయి ఉంటే టీఆర్ఎస్కు సింగిల్ డిజిట్ కూడా వచ్చేది కాదని బండి సంజయ్ తెలిపారు. టీఆర్ఎస్ పక్కా మతతత్వ పార్టీ అయిన ఎంఐఎం చెంచా అని ఈ రోజు ఋజువైనదని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉండటం ఖాయమని స్పష్టం చేశారు. సిగ్గు లేక ఎన్నికల్లో తాము వేర్వేరు అని చెప్పుకుని ప్రచారం చేసుకున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతివంతమైన రాజకీయం చేయాలని భావిస్తే బహిరంగ పొత్తు పెట్టుకోవాల్సిందని సూచించారు. ఈ రెండు పార్టీలు కలిసి భాగ్యనగరాన్ని దోచుకునే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. తమ పార్టీ కార్పొరేటర్లు హైదరాబాద్ను కంటికి రెప్పలా కాపాడుకుంటారని తెలిపారు. పైసా అవినీతి చేసినా, ఇంచు జాగా వదిలేసినా ఆ రెండు పార్టీలను బజారుకు లాగుతామని హెచ్చరించారు. ప్రజలు టీఆర్ఎస్ నీచ రాజకీయాలను సహించారని, అవకాశం వచ్చినా ప్రతి సారి కర్రు కాల్చి వాటా పెడతారని తెలిపారు. -
మేయర్ ఎన్నిక: గ్రేటర్పై మరోసారి గులాబీ జెండా
-
మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకున్న టీఆర్ఎస్
-
కేసీఆర్ వ్యూహం: ఒవైసీ అనూహ్య నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : ఉత్కంఠకు తెరపడింది. జీహెచ్ఎంసీ మేయర్ పీఠంపై అధికార టీఆర్ఎస్ జెండా ఎగరేసింది. ముందునుంచి ఊహించినట్లే గులాబీ బాస్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు వ్యూహత్మకంగా వ్యవహరించి మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను దక్కించుకున్నారు. మెరుపు వేగంతో దూసుకువచ్చిన బీజేపీ దూకుడును సునాయాసంగా ఎదుర్కొన్నారు. మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే ఎన్నిక సందర్భంగా ఎంఐఎం పార్టీ వ్యవహరించిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. మేయర్ బరిలో తాము కూడా ఉంటామని తొలినుంచి ప్రచారం చేసిన అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయించింది. కీలకమైన సమయంలో అధికార టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించింది. మేయర్ అభ్యర్థిని బరిలో నిలపకుండా టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి విజయానికి సపొర్టు తెలిపింది. మేయర్ అభ్యర్థులుగా టీఆర్ఎస్ నుంచి విజయలక్ష్మి, బీజేపీ నుంచి మేయర్ అభ్యర్ధి రాధా ధీరజ్రెడ్డి పోటీలో నిలిచారు. ఎన్నిక ప్రక్రియను చేపట్టిన హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి.. నియమనిబంధనల ప్రకారం మేయర్ ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు వివిధ పార్టీలకు చెందిన ఎక్స్ అఫిషియో సభ్యులు కౌన్సిల్ హాల్లో కూర్చున్నారు. అనంతరం పోటీలో నిలిచిన ఇద్దరు సభ్యులకు ఎక్కువ మంది సభ్యులు ఎవరికి మద్దతు తెలిపితే (చేతులెత్తి) వారిని విజేతలు ప్రకటిస్తామన్నారు. దీంతో అధికార టీఆర్ఎస్ అభ్యర్థికి ఎక్కువ మంది మద్దతు (56+32) తెలపడంతో విజయం సాధించారు. వ్యూహత్మకంగా వ్యహరించిన కేసీఆర్.. అయితే 44 మంది కార్పొరేటర్ల మద్దతుతో పాటు పదిమంది ఎక్స్అఫిషియో సభ్యులున్న ఎంఐఎం మేయర్ ఎన్నికకు దూరంగా ఉండటం రాజకీయ వర్గల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్-ఎంఐఎం పార్టీల మధ్య ఉన్న ఒప్పందం కారణంగానే ఒవైసీ ఈ నిర్ణయం తీసుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే మేయర్ పీఠం టీఆర్ఎస్కు, డిప్యూటీ మేయర్ ఎంఐఎంకు దక్కెలా సీఎం కేసీఆర్, ఒవైసీ ఒప్పందం కుదుర్చుకున్నారని తొలినుంచి ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే గ్రేటర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్.. రెండు కీలక పదవులను దక్కించుకోవడంలో వ్యూహత్మకంగా వ్యవహరించారు. దీంతో రాజధాని నగరంపై మరోసారి పట్టునిలుకున్నారు. మేయర్ ఎన్నిక: గ్రేటర్పై మరోసారి గులాబీ జెండా -
‘బల్దియా’ రాణులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) మేయర్గా టీఆర్ఎస్ పార్టీకి చెందిన బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు. జీహెచ్ఎంసీలో ఈసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అవకాశం లేకపోవడంతో టీఆర్ఎస్, బీజేపీలు బరిలో నిలవగా రెండు పదవులు కూడా గులాబీనే వరించాయి. బుధవారం ఎంఐఎం కూడా విప్ను నియమించడంతో పోటీలో ఉంటుందని భావించినా.. ఎంఐఎం నుంచి అభ్యర్థులెవరూ పోటీ చేయలేదు. మేయర్, డిప్యూటీ మేయర్ రెండు పదవులకూ ఎంఐఎం సభ్యులు టీఆర్ఎస్కే ఓట్లు వేశారు. చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలైనందున ఎంఐఎం వైఖరి ఎలా ఉంటుందోనని పలువురు భావించినా.. ఎంఐఎం సైతం టీఆర్ఎస్కు మద్దతు పలకడంతో గత పాలకమండళ్ల తరహాలోనే ఈసారి కూడా టీఆర్ఎస్, ఎంఐఎం సఖ్యతతోనే పనిచేయగలవని భావిస్తున్నారు. గత ఎన్నికల్లోనే వరిస్తుందనుకున్నా.. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తనయ అయిన విజయలక్ష్మిని గత ఎన్నికల్లోనే మేయర్ పదవి వరిస్తుందని భావించినా.. అప్పట్లో ఆమెకు టికెట్ లభించలేదు. విజయలక్ష్మి ఉన్నత విద్యావంతురాలు, విదేశాల్లో ఉండి వచ్చారు. కాగా, టీఆర్ఎస్ తొలినాళ్ల నుంచి పనిచేస్తున్న మోతె శోభన్రెడ్డి సతీమణి మోతె శ్రీలతను మేయర్ పదవి వరించనుందని ప్రచారం జరిగినా.. ఆమెకు డిప్యూటీ మేయర్ అవకాశం కల్పించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ మహిళలే కావడం విశేషం. డిప్యూటీ మేయర్గా మైనార్టీ వర్గాలకు టీఆర్ఎస్ అవకాశం కల్పిస్తుందని తొలుత భావించినా అలా జరగలేదు. ఐదో మహిళా మేయర్.. గద్వాల విజయలక్ష్మి బల్దియాకు 26వ మేయర్ కాగా, ఐదో మహిళా మేయర్. చివరి వరకు పలు ఊహగానాలు, ఉత్కంఠ నెలకొన్నా.. ఎన్నికల ప్రక్రియ మొత్తం 20 నిమిషాల్లోనే ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మొహంతి ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్కుమార్ సుల్తానియా పరిశీలకులుగా వ్యవహరించారు. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు ముందు ఉదయం 11 గంటలకు కొత్తగా కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్ భాషల వారీగా గ్రూపులుగా విడదీసి అందరినీ ఒకేసారి ప్రమాణం చేయించారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రక్రియ ఇలా సాగింది.. ఎన్నిక ప్రారంభం కాగానే ఎంఐఎం ఓటు వేస్తుందా లేదా తటస్థంగా ఉంటుందా అన్న ఉత్కంఠ సభలో నెలకొంది. అయితే ఎంఐఎం సభ్యులంతా టీఆర్ఎస్ సభ్యులతో పాటు టీఆర్ఎస్ అభ్యర్థులకే ఓట్లు వేశారు. దీంతో బీజేపీ సభ్యులు సభలో కొద్దిసేపు గొడవ చేశారు. టీఆర్ఎస్ సభ్యులు, ఎక్స్అఫీషియో సభ్యులు సహ మొత్తం బలం 88 మంది ఉన్నా.. ఎన్నికయ్యేందుకు వారంతా అవసరం లేకపోవడంతో లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలందరూ హాజరు కాలేదు. వారి ఎక్స్అఫీషియో ఓట్లను ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉపయోగించుకునే అవకాశం ఉన్నందున వాటిని ఇక్కడ వినియోగించుకోలేదని టీఆర్ఎస్ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు ‘సాక్షి’కి తెలిపారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు మహిళా కార్పొరేటర్లు మాత్రమే ఉండటంతో, వారు ఎవరికీ ఓట్లు వేయొద్దని నిర్ణయించుకుని ఎన్నిక ప్రక్రియలో పాలు పంచుకోలేదు. ప్రమాణ స్వీకారం చేయగానే వెళ్లిపోయారు. -
కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు:కలెక్టర్ శ్వేతామహంతి
-
టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు...
-
మేయర్ ఖరారు.. అందరి కళ్లు ఆమెపైనే
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ నూతన కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం కాసేపట్లో జరగనుంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు కూడా అనంతరం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్ ఎవరన్నదానిపై సర్వత్రా చర్చలు జోరుగా సాగుతున్నాయి. అందరి దృష్టి బంజారాహిల్స్ కార్పొరేటర్పైనే నిలిచింది. బంజారాహిల్స్ కార్పొరేటర్గా రెండోసారి గెలిచిన గద్వాల్ విజయలక్ష్మికి మేయర్ పదవి వరించనుందనే వార్తలు గత రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గురువారం ఉదయం తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ దాదాపు ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్.12లోని ఎన్బీటీనగర్లో ఆమె ఇంటి వద్ద కూడా సందడి నెలకొంది. కార్యకర్తలు, నేతల రాకపోకలతో కొత్త వాతావరణం కనిపిస్తోంది. కార్పొరేటర్ తండ్రి టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కేకే కూడా ఢిల్లీకి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు. దీంతో మేయర్ పదవి దాదాపుగా గద్వాల్ విజయలక్ష్మినే వరిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఉత్కంఠకు తెర వేయాలంటే ఇంకొద్ది సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో అందరి కళ్లు బంజారాహిల్స్పైనే కేంద్రీకృతమయ్యాయి. దాదాపుగా గద్వాల్ విజయలక్ష్మి పేరు సీల్డ్ కవర్లోకి ఎక్కిందని ప్రచారం జరుగుతుంది. ఆమె మేయర్గా ఎన్నికైతే ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి మేయర్ పదవి దక్కిన వారిలో రెండోవారు అవుతారు. 1961లో ఖైరతాబాద్ కార్పొరేటర్గా గెలిచిన ఎంఆర్ శ్యామ్రావు మేయర్గా పనిచేసిన విషయం తెలిసిందే. మరోవైపు టీఆర్ఎస్ డిప్యూటీ మేయర్గా మోతె శ్రీలత శోభన్రెడ్డిను ఖరారు చేసినట్లు సమాచారం. -
రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న గ్రేటర్ ఎన్నికలు
-
GHMC: మేయర్గా కేకే కుమార్తె
Time 12:35 టీఆర్ఎస్ పార్టీ సినియర్ నేత, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు కుమార్తె విజయలక్ష్మి జీహెచ్ఎంసీ మేయర్గా ఎన్నికయ్యారు. విజయలక్ష్మి అభ్యర్థిత్వాన్ని మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీవుద్దీన్ ప్రతిపాదించారు. బీజేపీ నుంచి ఆర్కేపురం కార్పొరేటర్ రాధాధీరజ్రెడ్డి పేరును ఆ పార్టీ సభ్యులు ప్రతిపాదించారు. మేయర్ పీఠం కోసం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీ పడ్డారు. సభ్యులు చేతులెత్తి మేయర్ను ఎన్నుకున్నారు. సంఖ్యాపరంగా టీఆర్ఎస్కు ఎక్కువమంది సభ్యుల మద్దతు ఉండటంతో మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. Time 11:10 AM హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి సమావేశాన్ని ప్రారంభించారు. సమావేశానికి హాజరైన సభ్యులకు తొలుత ఆమె ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక్కో పార్టీలతో కూడిన సభ్యులు ఓ గ్రూపుగా ఏర్పడి ప్రమాణం చేస్తామని కొందరు కోరారు. భాషల ప్రతిపాదికన గ్రూపులుగా ఏర్పడిన ప్రమాణం చేస్తామని మరికొందరు కోరారు. కలెక్టర్ శ్వేతామహంతి దానికి అంగీకరించారు. భాష ప్రకారంలో సభ్యులంతా సామూహికంగా ఏర్పడి ప్రమాణం చేశారు. కౌన్సిల్ హాల్లో శ్వేతా మహంతి కార్పొరేటర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 12:30 నిమిషాలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగనుందని కలెక్టర్ తెలిపారు. సభ్యులంతా పది నిమిషాల ముందు కౌన్సిల్ హాల్లోకి రావాలని సూచించారు. తొలుత తెలుగు భాషలో సభ్యులు ప్రమాణం చేశారు. అనంతరం ఉర్దూ భాషలో మాట్లాడే సభ్యులు ప్రమాణం చేశారు. మూడో విడతలో హిందీలో మాట్లాడే సభ్యులు ప్రమాణం చేశారు. చివరిగా ఇంగ్లీష్ భాషలో మాట్లాడే సభ్యులు ప్రమాణం చేశారు. పార్టీ నేతలతో ముఖ్య సమావేశం అనంతరం అన్ని పార్టీల కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. నూతన కార్పొరేటర్లు పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం 149 మంది సభ్యులు ప్రమాణం చేయనున్నారు. సభ్యుల ప్రమాణం అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నిక జరుగనుంది. Time 10:37 Am తెలంగాణ భవన్లో ముఖ్య సమావేశం అనంతరం టీఆర్ఎస్ కార్పొరేటర్ల జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రత్యేక బస్సులో జీహెచ్ఎంసీ ఆఫీస్కు చేరుకున్నారు. మరోవైపు ఎంఐఎం కార్పొరేటర్లు దారుసలాం నుంచి జీహెచ్ఎంసీ ఆఫీస్కు బయల్దేరారు. బషీర్బాగ్ నుంచి బీజేపీ కార్పొరేటర్లు సైతం జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభం కానుంది. Time 10:4 Am జీహెచ్ఎంసీ కొత్త పాలకమండలి భేటీ కాకముందే సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాణస్వీకారానికి ముందు కనీసం కరోనా టెస్టులు కూడా చేయలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లింగోజీ కూడా కార్పొరేటర్ కరోనాతో మరణించడం సభ్యులను కలవరానికి గురిచేస్తోంది. కౌన్సిల్ హాల్లో కనీసం సామాజిక దూరం కూడా పాటించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 193 మంది సభ్యులతో పాటు 34 మంది ఆఫీసర్లు, మరొక 20 మంది ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. హాలులో దాదాపు మూడు గంటల పాటు 250 మంది వరకు ఉంటున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. TIME 10 AM నూతన కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులతో తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశం ముగిసింది. అక్కడి నుంచి సభ్యులంతా జీహెచ్ఎంసీ కార్యాలయానికి బయలుదేరారు. ఈ సమావేశంలో సభ్యులకు మంత్రి కేటీఆర్ కీలక సూచనల చేశారు. TIME 9:40 టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో భేటీ అయ్యారు. మేయర్ ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చిస్తున్నారు. సభ్యులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా హాజరయ్యారు. TIME 9:04 జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా మోతె శ్రీలత శోభన్రెడ్డిని అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. మోతె శ్రీలత శోభన్రెడ్డి తార్నాక కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. TIME 8:47 బషీర్బాగ్ సమీపంలోని ముత్యలమ్మ ఆలయానికి చేరుకుంటున్న బీజేపీ కార్పొరేటర్లు. వారితో పాటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అక్కడికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనల అనంతరం బయలుదేరనున్నారు. TIME 8:40 తెలంగాణ భవన్కు చేరుకుంటున్న నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు. మేయర్ ఎన్నికలో భాగంగా ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో సమావేశం కానున్నారు. అనంతరం జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకోనున్నారు. అర్హత కలిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ గుర్తింపు కార్డులు ధరించి అధికారులకు సహకరించాల్సిందిగా సూచించారు. వారిని గుర్తించేందుకు ఉన్నతాధికారులు ప్రవేశద్వారం వద్ద ఉంటారు. కార్పొరేటర్లు వారు ఎన్నికైనట్లు తెలిపే ధ్రువీకరణ పత్రాన్ని, ప్రిసైడింగ్ అధికారి జారీ చేసిన నోటీసును తీసుకొని రావాల్సిందిగా కోరారు. వారు హాల్లోకి ప్రవేశించి రిజిస్టర్లో సంతకాలు చేస్తారు. వారు ఎక్కడ కూర్చోవాలో సంబంధిత వరుసను ఆఫీసర్లు సూచిస్తారు. ఇందుకు 34 మందిని నియమించారు. ప్రమాణం చేసేందుకు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ భాషల్లో ప్రమాణ పత్రాలు సిద్ధం చేశారు. తొలుత తెలుగులో ప్రమాణం చేయాలనుకున్న వారందరితో ఒకేసారి చేయిస్తారు. తర్వాత మిగతా భాషల వారీగా చేయిస్తారు. కొత్త కార్పొరేటర్లు తాము ఎంచుకునే భాషలో ప్రమాణ పత్రాన్ని ముందుగానే చదువుకొని రిహార్సల్ చేసుకుంటే తప్పులు దొర్లకుండా ఉంటుందని సూచించారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శ్వేతామహంతి, ఎన్నికల సంఘం నియమించిన అబ్జర్వర్ సందీప్ సుల్తానియా మాత్రమే వేదికపై కూర్చుంటారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. దాదాపు 500 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. నిజాం కాలేజీ, ఎమ్మెల్యే క్వార్టర్లలో పార్కింగ్ చేయాల్సిందిగా సూచించారు. అన్నీ సజావుగా సాగితే మధ్యాహ్నం రెండుగంటలకు అటూఇటూగా కార్యక్రమం పూర్తికావచ్చని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఏర్పాటయ్యాక జరగుతున్న రెండో ఎన్నిక ఇది. టీఆర్ఎస్తోపాటు ఎంఐఎం, బీజేపీలు విప్ జారీకి సభ్యులను నియమించాయి. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎంపికకు రంగం సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం 12:30 నిమిషాలకు కొత్త నగరానికి కొత్త మేయర్ ఎన్నిక కానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సీల్డ్ కవర్లో నూతన మేయర్, డిప్యూటీ మేయర్లను పంపించనున్నారు. అంతకుముందు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో కేసీఆర్ తెలంగాణ భవన్లో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు హోదాలో మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. గ్రేటర్ బరిలో ప్రధానంగా నిలిచిన అధికార టీఆర్ఎస్తో పాటు బీజేపీ, ఎంఐఎంలకు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 150 స్థానాలకు కాగా.. టీఆర్ఎస్ నుంచి 56 మంది కార్పొరేటర్లు గెలిచారు. 32 మంది ఎక్స్అఫిషియో సభ్యులు ఉన్నారు. ఎంఐఎంకు 44 మంది కార్పొరేటర్లు 10 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. ఇక బీజేపీకి 48 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఇద్దరు ఎక్స్అఫిషియో సభ్యులు కిషన్రెడ్డి, రాజాసింగ్ ఓటు హక్కును కలిగి ఉన్నారు. గ్రేటర్ మేయర్ ఎంపిక.. Updates జీహెచ్ఎంసీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి. ఐదు వందల మంది పోలీసులతో భద్రత ఉదయం 10:45 కి జిహెచ్ ఎంసి కార్యాలయానికి కార్పొరేటర్లు చేరుకోవాలి 11 గంటల నుంచి నాలుగు భాషల్లో ప్రమాణ స్వీకారం ప్రారంభం అవుతుంది 12:30 వరకు అందరి చేత ప్రమాణ స్వీకారం పూర్తి చేస్తారు 12:30 నుండి మేయర్ ఎన్నిక ప్రారంభం అవుతుంది సభలో 97 మంది సభ్యలు ఉంటే మేయర్ ఎన్నికను ప్రారంభిస్తారు హాజరైన వారిలో ఎక్కువ మంది ఎవరికి చేతులు లేపి ఆమోదాన్ని తెలియజేస్తారో వారే మేయ ఇదే పద్దతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది -
హాట్ డే.. కౌన్ బనేగా మేయర్
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లు ఎవరన్నది ఇంకా తేటతెల్లం కాలేదు. నిర్ణీత సమయంలోగా నేరుగా సీల్డ్ కవర్లో పేర్లు పంపిస్తామని స్వయానా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆ పేరు ఎవరివి అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. గురువారం మేయర్ ఎన్నిక జరుగుతుందా.. లేదా..? అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఎన్నిక సమయానికి సీల్డ్ కవర్లో పంపుతామన్నప్పటికీ, పేరే రాకుండా ఎన్నిక సమావేశానికి హాజరు కావద్దనే సంకేతాలందితే..? అన్న చర్చ సైతం జరుగుతోంది. బహిరంగంగా అంగీకరించకపోయినా.. టీఆర్ఎస్, ఎంఐఎంలు సఖ్యతతోనే వ్యవహరిస్తాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలూ హాజరు కాకపోతే మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగదు. జీహెచ్ఎంసీ నిబంధనలు.. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల విధివిధానాల మేరకు మర్నాటికి వాయిదా పడుతుంది. శుక్రవారం సైతం కోరం లేకుంటే, విషయాన్ని వివరిస్తూ, ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. అప్పుడిక ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికలు ఏ తేదీన నిర్వహించాలో ప్రకటిస్తుంది. ఎంత వ్యవధిలోగా ఎన్నిక నిర్వహించాలో మాత్రం నిబంధనల్లో లేదు. అంటే అది రోజులా.. అంతకుమించి నెలలకు వెళ్తుందా అన్న విషయంలో స్పష్టతలేదు. రోజుల వ్యవధిలోనే ఎన్నికల సంఘం తేదీ ప్రకటిస్తుందని చెబుతున్నా పరోక్షంగా టీఆర్ఎస్ అభీష్టం మేరకే ఎన్నికల తేదీ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక చూసుకోవచ్చులే అనుకుంటే, ఎక్కువ కాలం వాయిదా పడటానికి కూడా అవకాశం ఉంటుదంటున్నారు. రెండో రోజూ వాయిదా పడినా.. ఎక్కువ సమయం తీసుకోకుండానే ఎన్నికల సంఘం తేదీని వెలువరిస్తుందని అధికారులు చెబుతున్నారు. అప్పుడు కోరంతో సంబంధం లేకుండా ఎంతమంది హాజరైతే, వారి ఓట్లలోనే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే ఎన్నికవుతారు. మేయర్ గౌను.. గుర్తుకొచ్చేను! మేయర్ అనగానే ప్రత్యేకంగా ధరించే గౌను గుర్తుకొస్తుంది. ఆ గౌను మనకు ఇంగ్లండ్ నుంచి పరిచయమైంది. గతంలో రాజభోగాలనుభవించిన మేయర్లు కాలక్రమేణా కార్పొరేషన్లకు పరిమితమయ్యారు. రోమన్ మహా సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారు తమ ఎస్టేట్ వ్యవహారాలు పర్యవేక్షించేందుకు మేజర్ డోమస్ (మేయర్)లను నియమించేవారు. క్రీ.శ 6– 8 శతాబ్దాల్లో ఐరోపా దేశాలను పాలించిన మెరొవింజియన్ మహారాజులు కూడా మేయర్లను నియమించారు. వారిని ప్యాలెస్ మేయర్లనేవారు. ఆ తర్వాత వివిధ అధికారాలు చలాయించిన మేయర్లు, క్రమేణా మున్సిపల్ కార్పొరేషన్లకు పరిమితమయ్యారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాక ఫ్రాన్స్వంటి కొన్ని దేశాల్లో ఐరోపాలో మేయర్లకు ఎన్నికలు నిర్వహించారు. బ్రిటిష్వారు ఇండియాను పాలించడంతో మనకూ వారిలా గౌను.. మేయర్ పదవికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. గత పాలకమండళ్లలో కౌన్సిల్ సమావేశాల్లో తప్పనిసరిగా ధరించేవారు. దేశ, విదేశీ ప్రతినిధులకు విమానాశ్రయాల్లో స్వాగతం పలికేందుకు గౌను ధరించే వెళ్లేవారు. బొంతు రామ్మోహన్ మాత్రం ఆ సంప్రదాయానికి మినహాయింపునిచ్చారు. సాధారణ దుస్తుల్లోనే కౌన్సిల్ సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రపతి, ప్రధాని వంటివారు వచ్చినప్పుడు తప్ప మిగతా వారికి స్వాగతం పలికేందుకు సివిల్ డ్రెస్లోనే వెళ్లారు. -
సర్వత్రా ఉత్కంఠ.. సీల్డ్ కవర్లో సీక్రెట్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త మేయర్ ఎంపికపై అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎక్స్ అఫీషియో సభ్యుల సాయంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు పార్టీ ఖాతాలో చేరనుండటంతో మేయర్ అభ్యర్థి ఎవరనే అంశంపై టీఆర్ఎస్ నేతల్లో ఆసక్తి నెలకొంది. మేయర్ అభ్యర్థి పేరును సీల్డ్ కవర్లో పంపిస్తామని స్వయంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్రావు ప్రకటించడంతో అవకాశం ఎవరికి దక్కుతుందనే అంశంపై పార్టీలో ఎడతెగని చర్చ జరుగుతోంది. సుమారు అరడజను కార్పొరేటర్ల పేర్లు మేయర్ పదవికి తెరమీదకు వస్తున్నా గ్రేటర్ పరిధిలోని మంత్రులకు కూడా ఈ విషయంలో ఎలాంటి సమాచారం లేదని వారి సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. తెరమీదకు వస్తున్న పేర్లు ఇవే.. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి (బంజారాహిల్స్), మోతె శ్రీలత (తార్నాక), సింధు ఆదర్శ్రెడ్డి (భారతీనగర్) పేర్లు ప్రధానంగా తెరమీదకు వస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెపుతున్నాయి. వీరితో పాటు చింతల విజయశాంతికి ఓ మంత్రితో పాటు పలువురు ఎమ్మెల్యేలు మద్దతు పలికినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలను పరిగణనలోకి తీసుకుని సీఎం కేసీఆర్ మేయర్ అభ్యర్థిని బుధవారం రాత్రి ఖరారు చేస్తారని సమాచారం. ఇదిలా ఉంటే డిప్యూటీ మేయర్ పదవిని మైనారిటీ మహిళలకు ఇచ్చే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పదవికి అల్లాపూర్ డివిజన్ నుంచి ఎన్నికైన రెహనా బేగంకు అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక బస్సులో ప్రమాణ స్వీకారానికి గురువారం ఉదయం తెలంగాణ భవన్లో అల్పా హారం తర్వాత కార్పొరేటర్లు, గ్రేటర్ పరిధిలోని మంత్రులు కూడా జీహెచ్ఎంసీ కార్యాలయానికి ప్రత్యేక బస్సులో తరలి వెళ్తారు. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాతే పార్టీ అధినేత కేసీఆర్ సీల్డ్ కవర్లో సూచించిన మేయర్ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశ ముందని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎక్స్అఫీషియో సభ్యుల మద్దతు కీలకం కావడంతో మేయర్ అభ్యర్థి ఎంపికలో ఎలాంటి అసంతృప్తి బయట పడకుండా ఉండేందుకు నాయ కత్వం చివరి నిమిషం వరకు గోప్యత పాటిస్తున్నట్లు పార్టీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ఆశావహుల ఇళ్ల వద్ద హడావుడి సీల్డ్ కవర్ ద్వారా మేయర్ అభ్యర్థి పేరును ప్రకటిస్తామని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించినా ఔత్సాహిక అభ్యర్థుల ఇళ్ల వద్ద బుధవారం సాయంత్రం నుంచే హడావుడి నెలకొంది. మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి, విజయారెడ్డి, మన్నె కవిత అనుచరులు కూడా తమ కార్పొరేటర్లకు అవకాశముందంటూ హడావుడి చేస్తుండ టంతో ఉత్కంఠ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇదిలా ఉంటే పార్టీ తరఫున గెలుపొందిన కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను గురువారం ఉదయం 8.30కు పార్టీ రాష్ట్ర కార్యా లయం తెలంగాణ భవన్కు చేరుకోవాల్సిందిగా పార్టీ నాయకత్వం ఆదేశించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ఉదయం 9 గంట లకు జరిగే ప్రత్యేక భేటీలో పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావుతో పాటు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాల్గొంటారు. చదవండి: (గోదారితో కాళ్లు కడుగుతా: సీఎం కేసీఆర్) -
ఐదేళ్ల పదవి.. అమావాస్య నాడు ప్రమాణం
సాక్షి, హైదరాబాద్ : ఐదేళ్లపాటు ఉండాల్సిన కార్పొరేటర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అమావాస్య రోజున పెడతారా.. అంటూ రాజకీయపార్టీల ప్రతినిధులు అధికారుల ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారు. అది ఎన్నికల కమిషనర్ నిర్ణయమని, రాజ్యాంగ విధి అయినందున చేయగలిగిందేమీ లేదని ఎన్నికల అధికారి లోకేశ్కుమార్ వివరించారు. కనీసం.. రాహుకాలం ముగిసేంత వరకైనా సమయమివ్వాలని, ఉదయం 11.30 గంటల వరకు రాహుకాలం ఉంటుందని చెప్పడంతో, ఎన్నిక నిర్వహించేది ప్రిసైడింగ్ ఆఫీసర్ అని తెలిపారు. అందరూ వచ్చి, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేంతవరకు దాదాపుగా అంతే సమయమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ నెల 11న జరగనున్న ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియ విధానాన్ని వివరించేందుకు జీహెచ్ఎంసీలో మంగళవారం రాజకీయపార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయా రాజకీయపార్టీల నుంచి ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి (టీఆర్ఎస్ ), ఎమ్మెల్సీ సయ్యద్ అమినుల్ జాఫ్రి (ఎంఐఎం), నిరంజన్ (కాంగ్రెస్ ), బీజేపీ నుంచి శంకర్ యాదవ్, దేవర కరుణాకర్లు హాజరయ్యారు. ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక సమావేశంలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరు, తదితరమైన వాటి గురించి లోకేశ్కుమార్ వారికి వివరించారు. ప్రమాణ స్వీకారం చేయనున్న సభ్యులు 11వ తేదీన 10.45 గంటల వరకు గుర్తింపు కార్డు, సమావేశ నిర్వహణపై జీహెచ్ఎంసీ జారీ చేసిన నోటీసును తీసుకొని కౌన్సిల్ హాల్కు రావాలి. సభ్యుల ప్రమాణ స్వీకారం తెలుగు, ఉర్దూ, హిందీ ఇంగ్లీష్ నాలుగు భాషల్లో ఉంటుంది. ఎవరికిష్టమైన భాషలో వారు చేయవచ్చు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికలకు ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి 97 మంది సభ్యులు హాజరైతేనే పూర్తి కోరంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరుగుతాయి. చేతులు ఎత్తడం ద్వారా మేయర్, డిప్యూటీ ఎన్నిక జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీస్తారు. వచ్చిన సభ్యులందరి వివరాలు సరిచూసి, హాలులోకి ప్రవేశించే ముందు సంతకాలు తీసుకోవడం, వారికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు 30 మంది అధికారులుంటారు. బల్దియా పాలకమండలికి నేడే చివరి రోజు సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలి గడువు బుధవారం (10వ తేదీతో)ముగిసిపోనుంది. 2016 ఫిబ్రవరి 11న పాలకమండలి సభ్యులు ప్రమాణం చేశారు. వారి ఐదేళ్ల గడువు పదో తేదీతో ముగిసిపోనుంది. అందువల్లే కొత్త పాలకమండలి ప్రమాణ స్వీకారం కూడా మర్నాడే ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. అప్పుడు..ఇప్పుడు కూడా కొత్త పాలకమండలి ఫిబ్రవరి నెల 11వ తేదీ..గురువారం కావడం యాధృచ్ఛికమే అయినా విశేషంగా మారింది. ప్రతిపక్షం లేకుండా.. బల్దియా చరిత్రలోనే ప్రతిపక్షం, విమర్శలు, సవాళ్లు–ప్రతిసవాళ్లు లేకుండా ఐదేళ్లు పూర్తిచేసుకున్న పాలకమండలి ఇప్పటి వరకు లేదు. అధికార టీఆర్ఎస్ నుంచే మేయర్, డిప్యూటీ మేయర్లు ఉండటం, తగినంతమంది సభ్యుల బలమున్న ఎంఐఎం మిత్రపక్షంగా వ్యవహరించడంతో ప్రతిపక్షమనేది లేకుండా పోయింది. బీజేపీ, కాంగ్రెస్లకు తగిన బలమే లేనందున ఏమీ చేయలేకపోయారు. ముందస్తుగా వచ్చిన ఎన్నికలతో కొత్త కార్పొరేటర్లు వచ్చినప్పటికీ, అధికారికంగా ప్రొటోకాల్ ప్రకారం కార్పొరేటర్ల హోదాల్లో కొనసాగారు. కొన్ని ప్రాంతాల్లో వివాదాలు చెలరేగాయి. ప్రతిపక్షం లేకుంటే పాలన ఎలా ఉంటుందో కూడా ఈ పాలకమండలి హయాంలోనే తెలిసివచ్చింది. ప్రజాసమస్యల గురించి ప్రశ్నించిన వారు లేరు.ఒకరిద్దరు సభ్యులున్న పార్టీలకు అవకాశమే రాలేదు. వారి వాదన విన్నవారే లేరు. కరోనా కారణంగా దాదాపు పదినెలలపాటు సర్వసభ్యసమావేశాలు జరగలేదు. చివరిసారిగా బడ్జెట్ సమావేశమైనా నిర్వహించాలనుకోగా, మేయర్ ఎన్నిక నోటిఫికేషన్తో కోడ్ అడ్డొచ్చింది. మేయర్ ఎన్నికలో వీరికి ఓటు లేదు సాక్షి, సిటీబ్యూరో: మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం గ్రేటర్ పరిధిలోని అన్ని పార్టీలకు సంబంధించి ఎక్స్అఫీషియో సభ్యుల లెక్క ఖరారైనప్పటికీ, ఇంకా ఎవరైనా అర్హులున్నారేమోనని అధికారులు పరిశీలించారు. వివిధ పార్టీల్లోని వారు గత సంవత్సరం జనవరిలో జరిగిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటు వేసినట్లు ఖరారు చేసుకున్నారు. దాంతో వారిక్కడ ఓటువేసేందుకు అర్హులు కాదని తేల్చారు. ఆ వివరాలిలా ఉన్నాయి. ఎవరు పార్టీ ఎక్కడ వేశారు ఎ.రేవంత్రెడ్డి కాంగ్రెస్ కొంపల్లి జి.రంజిత్రెడ్డి టీఆర్ఎస్ నార్సింగి ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు టీఆర్ఎస్ కొంపల్లి కాటేపల్లి జనార్దన్రెడ్డి స్వతంత్ర తుక్కుగూడ కసిరెడ్డి నారాయణరెడ్డి టీఆర్ఎస్ కోస్గి పల్లా రాజేశ్వర్రెడ్డి టీఆర్ఎస్ నల్గొండ మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి టీఆర్ఎస్ ఆదిభట్ల ఎన్.రామచంద్రరావు బీజేపీ మక్తల్ ఎగ్గె మల్లేశం టీఆర్ఎస్ తుక్కుగూడ కె.నవీన్కుమార్ టీఆర్ఎస్ పెద్ద అంబర్పేట దర్పల్లి రాజేశ్వరరావు టీఆర్ఎస్ నిజామాబాద్ పట్నం మహేందర్రెడ్డి టీఆర్ఎస్ పెద్ద అంబర్పేట ఫారూఖ్ హుస్సేన్ టీఆర్ఎస్ నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్రెడ్డి టీఆర్ఎస్ బొల్లారం కేపీ వివేకానంద టీఆర్ఎస్ కొంపల్లి పి.సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ తుక్కుగూడ టి.ప్రకాశ్గౌడ్ టీఆర్ఎస్ నార్సింగి -
అంతు పట్టని అధినేత అంతరంగం
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ మేయర్ పదవి ఎవరిని వరించనుందన్నది ఇప్పుడు నగరంలో హాట్టాపిక్గా మారింది. సీల్డు కవరులో మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లను గురువారం రోజున.. ఎన్నికకు కొద్దిసేపు ముందు సీల్డు కవరులో పంపుతామని టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆ అదృష్టవంతులెవరా అన్నది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న పేర్లకు మించి కొత్తపేర్లు తెరపైకి రాకపోయినప్పటికీ, వీరిలోనే ఒకరుంటారా.. లేక ఎవరి అంచనాలకు అందని విధంగా, ఊహించని రీతిలో కొత్తవారు రానున్నారా అన్న ఉత్కంఠ నెలకొంది. రాజకీయ ప్రముఖులు కేకే కుమార్తె విజయలక్ష్మి, పీజేఆర్ తనయ విజయారెడ్డి, కనకారెడ్డి కోడలు విజయశాంతిలతోపాటు కవితారెడ్డి, మోతె శ్రీలత, సింధురెడ్డి, పూజిత గౌడ్, బొంతు శ్రీదేవిల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. మేయర్ అ య్యే వారికి ఉండాల్సిన లక్షణాలు, వారి ప్రవర్తన వల్ల పార్టీ ఇరకాటంలో పడుతుందా, బల్దియా కార్యక్రమాలు సాఫీగా సాగుతాయా వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకొని, అన్ని విధాలా తగునని భావించిన వారినే ఎంపిక చేసే వీలుందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకొని బీసీలకు ఇవ్వాలనుకుంటే శ్రీదేవి, పూజిత, విజయలక్ష్మిలలో ఒకరికి అవకాశం దక్కనుందని చెబుతున్నారు. బల్దియాలో బీజేపీ బలమైన ప్రతిపక్షంగా మారడం, ఎంఐఎంను అన్ని విషయాల్లో కలుపుకొని పోవడం, సర్వసభ్య సమావేశం, స్టాండింగ్ కమిటీ సమావేశాలను సవ్యంగా నడిపించగల సామర్థ్యం ఉందా లేదా.. తదితరమైనవి పరిగణనలోకి తీసుకోనున్నారని సమాచారం. దూకుడుగా, ఇగోలతో వ్యవహరించేవారి వల్ల పార్టీ ఇరకాటంలో పడుతుందని, అన్నింటినీ పరిశీలించి తగిన అర్హతలు ఉన్నవారికే అవకాశం లభించనున్నట్లు చెబుతున్నారు. అలాంటి లక్షణాలున్నాయని నమ్మినవారికే పదవి దక్కుతుందని, లేని పక్షంలో ఇప్పటి వరకు ఊహకే అందని వారు సైతం మేయర్ కావచ్చునని టీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఆశావహులకు ఎమ్మెల్యేల బ్రేకులు.. కొందరు ఆశావహులకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లోని స్థానిక ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల అభ్యంతరాల వల్ల అవకాశం చేజారే పరిస్థితి ఉందంటున్నారు. మేయర్ కూడా ఉంటే తమ ప్రాధాన్యత తగ్గుతుందని, ప్రొటోకాల్ , తదితరమైన వాటి దృష్ట్యా కొందరు ఎమ్మెల్యేలు తమ పరిధిలోని వారు మేయర్ కాకుండా ఉండేందుకు వారివంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పదవులు అడ్డొచ్చేనా? విజయలక్ష్మి కోసం ఆమె తండ్రి కేకే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, దాదాపుగా ఖాయమని చెబుతున్నారు. మరోవైపు, ఆయన మూడు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడు కావడం, రెండుసార్లు ఫ్లోర్లీడర్, ఆయన కుమారుడు టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ కావడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఒకే కుటుంబంలోని వారికే ఇన్ని పదవులిస్తే, మిగతా వారికి ఎలాంటి సందేశం వెళ్తుంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. డిప్యూటీ రేసులో... డిప్యూటీ మేయర్ పదవికి రేసులో ఉన్నవారి పేర్లు కూడా పెరిగిపోతున్నాయి. సిట్టింగ్ బాబా ఫసియుద్దీన్కే మరోమారు అవకాశం దక్కనుందనే ప్రచారం జరుగుతున్నా, జగదీశ్వర్గౌడ్, షేక్ హమీద్, సబీహాబేగం, ఎం.నరసింహయాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మేయర్ మహిళ కావడాన్ని కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. నేడే ‘సాగర్’ భేరి... -
క్యాంపులు నిర్వహించొద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి, ఎన్నికైన ప్రతినిధులతో ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఎలాంటి క్యాంపులు(శిబిరాలు) నిర్వహించొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) స్పష్టం చేసింది. లంచం లేదా ప్రలోభాలకు గురిచేయొద్దని, రాజకీయ పార్టీలు, మేయర్ / డిప్యూటీ మేయర్ వంటి పదవులను ఆశిస్తున్న వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అక్రమపద్ధతులు పాటించడం, ప్రోత్సహించడం చేయొద్దని పేర్కొంది. జీహెచ్ఎంసీ చట్టం, భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లలోని నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహణ ప్రారంభసమయానికి 48 గంటల ముందు నుంచి ఎలాంటి ప్రచారం లేదా ప్రచార కార్యకలాపాలు చేపట్టవద్దని, ఈ నిషేధం ఈ ఎన్నికలు పూర్తయ్యేవరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. శనివారం ఈ మేరకు ప్రత్యేక ప్రవర్తనా నియమావళిని ఎస్ఈసీ జారీ చేసింది. ప్రభావితం చేయొద్దు..: రాజకీయపార్టీలు జారీ చేసిన విప్లకు వ్యతిరేకంగా ఓటు చేసే విధంగా ఎన్నికైన సభ్యులను ప్రభావితం చేయవద్దని ఎస్ఈసీ తెలిపింది. రాజకీయ పార్టీలు, ఆ పార్టీల అభ్యర్థుల్లో ఎవరైనాగానీ పరోక్ష ఎన్నికల్లో ఓటర్లు వారి ఓటుహక్కులను వినియోగించే సందర్భంలో వారిని ప్రలోభపరచడానికి ప్రయత్నించొద్దని తెలిపింది. ఏదైనా రాజకీయపార్టీ, మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పోటీ పడుతున్నవారు ఓటర్లు, వారి ఓటింగ్ హక్కులను వినియోగించుకునే సందర్భంలో పార్టీ విప్ను ధిక్కరించేందుకుగాను ప్రోత్సాహకంగా వారికి ఎలాంటి పదవిని ఇవ్వజూపొద్దని పేర్కొంది. అధికార పార్టీ లేదా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు/అధికారులు సర్టిఫికెట్లు, లైసె న్సులు, కాంట్రాక్టు పనులు, పెండింగ్ కేసులను ఎత్తివేయడం, పెండింగ్ బిల్లులు చెల్లించడం, కాంట్రాక్టుల పునరుద్ధరణ, ఇతర ప్రోత్సాహకాలు, ఇతర పద్ధతుల్లో దుర్వినియోగానికి ప్రయత్నిం చొద్దని స్పష్టం చేసింది. ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థులపై విచారణ సం స్థల ద్వారా కేసుల నమోదు లేదా చార్జి షీట్ల దాఖలు/రూపకల్పన, అరెస్టులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు వంటి వాటి అమలులో పక్షపాతానికి పాల్పడవద్దని పేర్కొంది. -
ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ ఎన్నిక ఫిబ్రవరి 11న జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్ను జారీచేసింది. వచ్చేనెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ముందుగా మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఆ తర్వాత డిప్యూటీ మేయర్ను ఎన్నుకుంటారు. ఏవైనా అనివార్య కారణాల వల్ల 11న ఈ ఎన్నిక నిర్వహించలేని పక్షంలో మరుసటి రోజు 12న (ఒకవేళ సెలవు రోజు అయినప్పటికీ) ఈ ఎన్నిక నిర్వహిస్తారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్తో పాటు దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలను విడుదల చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా ఎన్నికైన 150 మంది కార్పొరేటర్లతో పాటు గ్రేటర్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా నమోదైన లోక్సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని 6వ తేదీకల్లా తెలియజేస్తారు. గత ఏడాది డిసెంబరు ఒకటో తేదీన జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈసారి మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు అయింది. -
ఊపిరి పీల్చుకున్న మేయర్ కుటుంబం..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు అయన కుటుంబ సభ్యులకు కరోనా నెగెటివ్గా నిర్దారణ అయినట్లు వైద్యులు తెలిపారు. తన కారు డ్రైవర్కు కరోనా సోకడంతో శుక్రవారం మేయర్ మరోసారి కరోనా పరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే. పరీక్షల్లో నెగెటివ్గా రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా ఆయనకు కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్గా తేలింది. (మరోసారి మేయర్కు పరీక్షలు) గురువారం మేయర్ పేషీలోని మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో వైద్యులు బొంతు రామ్మోహన్కు మరోసారి పరీక్షలు చేశారు. మేయర్తో పాటు ఆయన కుటుంబసభ్యులంతా హోం క్వారంటైన్లో ఉన్నారు. కాగా, మేయర్ పేషీ సహ బల్దియా ప్రధాన కార్యాలయంలో వారంలో మొత్తం 3 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో అధికారుల నుంచి దిగువస్థాయి సిబ్బంది వరకు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహించే వారిలో దాదాపు సగం మంది మాత్రమే హాజరవుతున్నారు. (పది కోట్ల మందికి కరోనా ముప్పు!) -
జీహెచ్ఎంసీ మేయర్ డ్రైవర్కు కరోనా
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ బొంతురామ్మోహన్ డ్రైవర్కు గురువారం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా సోకిన వారి సంఖ్య మూడుకు చేరింది. ప్రతినిత్యం వందల మంది సంచరించే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పాజిటివ్ కేసులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుం డటంతో సిబ్బంది బెంబేలెత్తుతున్నారు. కొద్దిరోజుల క్రితం మేయర్ బొంతు రామ్మోహన్ రాంనగర్గుండు వద్ద హోటల్లో టీ తాగడం..ఆ హోటల్కు చెందిన కార్మికుడికొకరికి కరోనా సోకినట్లు వెల్లడైన నేపథ్యంలో అనుమాన నివృత్తికి మేయర్ కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో నెగెటివ్గా వచ్చిన విషయం తెలిసిందే. అయితే మేయర్ కార్యాలయానికి చెందిన అటెండర్కు బుధవారం పాజిటివ్గా నిర్ధారణ కాగా, గురువారం డ్రైవర్కు నిర్ధారణ అయింది. అంతకుముందు ఘనవ్యర్థాల నిర్వహణ విభాగంలో ఒకరికి పాజిటివ్ రావడం తెలిసిందే. మేయర్ డ్రైవర్ గురువారం సైతం సాయంత్రం వరకు విధులు నిర్వహించారు. అతనిలో జ్వరం, జలుబు వంటి ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. మేయర్తోపాటు వివిధ ప్రాంతాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో మేయర్ కుటుంబ సభ్యులు హోమ్ క్వారంటైన్గా ఉన్నారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. మేయర్కు కూడా మరోసారి కరోనా పరీక్షలు చేయనున్నారు. డ్రైవర్ను ఎవరెవరు కలిశారనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జీహెచ్ఎంసీలోని పలువురు ఉద్యోగులు కొన్ని రోజులపాటు కార్యాలయానికి వెళ్లొద్దని భావిస్తున్నారు. సిబ్బంది భయాందోళనలతో అధికారులు పాజిటివ్ వివరాలు వెల్లడించేందుకు వెనుకాడుతున్నారు. -
జీహెచ్ఎంసీ మేయర్ డ్రైవర్కు కరోనా
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కారు డ్రైవర్ కరోనా బారిన పడ్డాడు. గురువారం నిర్వహించిన పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. విధుల్లో భాగంగా ఈరోజు ఉదయం నుంచి మేయర్తో పాటే ఆ వ్యక్తి ఉన్నాడు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం అతడు ఎవరెవరిని కలిశాడన్న దానిపై ఆరా తీస్తున్నారు. డ్రైవర్కు కరోనా అని తేలడంతో మేయర్ కుంటుంబం హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయింది. రేపు మేయర్తో పాటు అతడి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. (వధువు తండ్రి, చెల్లికి వైరస్.. పెళ్లికి బ్రేక్) కాగా, నాలుగు రోజుల క్రితమే బొంతు రామ్మోహన్కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్ అని తేలిన విషయం తెలిసిందే. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో మేయర్ టీ తాగారు. అయితే అంతకుముందే ఆ టీ దుకాణంలో పనిచేసే మాస్టర్కు కరోనా సోకినట్లు తేలింది. విషయం తెలుసుకున్న అధికారులు.. వైద్యులకు సమాచారం ఇవ్వడంతో ముందస్తు జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నెగటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
కుండపోత వర్షం.. జీహెచ్ఎంసీ భారీ చర్యలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా జీహెచ్ఎంసీ భారీ స్థాయిలో చర్యలు చేపట్టింది. సహాయక చర్యలకోసం ఏకంగా 384 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఇందులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందిన 13 ప్రత్యేక డిజాస్టర్ రెస్క్యూ బృందాలు కూడా ఉన్నాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా వర్ష ప్రభావాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్లు మంగళవారం రాత్రి నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సిబ్బందికి సూచనలిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ నెంబర్ 040- 21111111 ఫోన్ చేయాలని ప్రజలకు విజ్జప్తి చేశారు. మరోవైపు జోనల్ కమిషనర్లతో కమిషనర్ లోకేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారిని అప్రమత్తం చేశారు. (చదవండి : హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం) భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ చేపట్టిన చర్యలు మినీ మొబైల్ ఎమర్జెన్సీ బృందాలు (120): టాటాఏస్, లేదా ఓమ్నీ వ్యాన్, జీప్తో నలుగురు లేబర్లు ట్రీ కట్టర్, పంప్, గొడ్డళ్లు, క్రోబార్స్ తదితర పరికరాలతో ఉంటారు. మొబైల్ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు(38): ప్రతి ఇంజనీరింగ్ డివిజన్కు ఒక మొబైల్ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాన్ని కేటాయించారు. దీనిలో డి.సి.ఎం వ్యాన్లో ఐదుగురు లేబర్లు, ఒక జనరేటర్, నీటిని తొలగించే పంపులు, చెట్లను కట్చేసే మిషన్లు ఇతర పరికరాలతో సిద్దంగా ఉంటారు. సెంట్రల్ ఎమర్జెన్సీ బృందాలు (15): సెంట్రల్ కంట్రోల్ రూంలో 15 ఎమర్జెన్సీ బృందాలను అందుబాటులో ఉంచారు. ప్రతి బృందంలో డి.సి.ఎం వ్యాన్, ఐదుగురు లేబర్లు, ఒక జనరేటర్, నీటిని తొలగించే పంపులు, చెట్లను కట్చేసే మిషన్లు ఇతర పరికరాలతో సిద్దంగా ఉంటారు. స్థానిక ఎమర్జెన్సీ బృందాలు (132): నగరంలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ బృందాలను స్థానికంగా నియమించారు. నలుగురు కార్మికులు, పలు పరికరాలతో ఉండి నాలాల్లో నీటి ప్రవాహాన్ని నిలువరించే ప్లాస్టిక్ కవర్లను తొలగించడం చేపడుతారు. వీటితో పాటు నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించడానికి 255 పంపులను సిద్దంగా ఉంచారు. -
దోమల నివారణకు డ్రోన్ టెక్నాలజీ
సాక్షి, హైద్రాబాద్ : నగరంలో ఆధునాతన టెక్నాలజీ ఉపయోగించి చెరువులు, నాలాల సుందరీకరణ పనులు చేపడుతున్నామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. శుక్రవారం మియాపూర్ గుర్నాధం చెరువులో దోమల నివారణకు డ్రోన్ టెక్నాలజీతో యాంటీ లార్వా మందు పిచికారీ పనులను జీహెచ్ఎంసీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి మేయర్తోపాటు ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు మేక రమేష్, నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. మేయర్ మాట్లాడుతూ సిబ్బందికి వీలుకాని చోట డ్రోన్లతో మందుల పిచికారీ, గుర్రపు డెక్క తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నామని, రానున్న రోజుల్లో నగరమంతా ఇదే టెక్నాలజీ ఉపయోగిస్తామని తెలిపారు. -
ఆ వార్తలు అబద్ధం: మేయర్ రామ్మోహన్
సాక్షి, హైదరాబాద్ : తన రాజీనామా వార్తను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్రావు ఖండించారు. తాను రాజీనామా చేశానంటూ కొన్ని సోషల్ మీడియా సైట్లలో వచ్చిన తప్పుడు వార్తలపై కఠిన చర్యలను తీసుకోవాలని ఆయన మంగళవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెట్రో రైల్ ప్రారంభోత్సవం సందర్భంగా అవమానం జరిగిందని ఈ విషయం లో తీవ్ర మనస్తాపానికి లోనై మేయర్ పదవికి రాజీనామా చేశానని మంగళవారం పలు సోషల్ మీడియాల్లో తప్పుడు వార్తలు తనపై వస్తున్నాయని, ఈ తప్పుడు వార్తలను పోస్ట్ చేసిన వారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ సైబర్ నేర విభాగం అడిషనల్ డీసీపీ రఘువీర్ కు ఫిర్యాదు చేసినట్టు మేయర్ రామ్మోహన్ తెలిపారు. బీసీకి చెందిన వ్యక్తిని కాబట్టే తన పేరు వేయలేదంటూ తాను పేర్కొన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. తెలంగాణతో పాటు హైదరాబాద్ పురోభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్, యువమంత్రి కేటీఆర్ నేతృత్వంలో చిత్తశుద్ధితో పనిచేయనున్నట్టు మేయర్ స్పష్టం చేశారు. -
రోడ్ల పనులను పరిశీలించిన మేయర్
-
‘హుస్సేన్ సాగర్’ను పరిశీలించిన కేటీఆర్
హైదరాబాద్: ప్రమాదస్థాయికి చేరిన హుస్సేన్ సాగర్ను మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ శుక్రవారం పరిశీలించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదకు నగరం నడిబొడ్డులో ఉన్న హుస్సేన్ సాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి ఆయన అక్కడ పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్లో పూర్తిస్థాయి నీటిమట్టం(513 అడుగులు) కొనసాగుతుందని గుర్తించిన మంత్రి ఇన్ఫ్లో, ఔట్ఫ్లోల గురించి అడిగి తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కేటీఆర్ సూచించారు. ప్రస్తుతం జలాశయానికి ఇన్ఫ్లో 5,700 క్యూసెక్కులుగా ఉండగా.. కాలువల ద్వారా 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా గత మూడు రోజులుగా నగరాన్ని వాన ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. -
నగరవాసులు అప్రమత్తంగా ఉండాలి
-
నిమజ్జన రోజు ప్రజలు సహకరించాలి
-
నగరంలో కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ సోమవారం నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనగర్ కాలనీలో రోడ్ల దుస్థితిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతులు చేయాలని కేటీఆర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రోడ్ల పనుల వేగం పెంచాలని ఆదేశించారు. నగరంలో రోడ్ల పరిస్థితిపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, ఇతర విభాగాల సమన్వయం చేసుకోవడానికి పరిణితి అవసరమని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలో గతుకులు లేని రోడ్లు ఉండాలని సీఎం ఆదేశించారని చెప్పారు. సిటీలో రోడ్ల తీరుపై సంతృప్తిగా తాను లేనని, సమూల మార్పులు రావాలని ఆదేశించారు. ఈనెల 16వ తేదీన అన్ని శాఖలతో సమన్వయం చేయడానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. అవసరమైతే నిబంధనలు కఠినతరం చేస్తామని తెలిపారు. విద్యుత్, వాటర్, రోడ్లు అన్ని శాఖలతో సమన్వయం అవసరమని, శ్రీనగర్ కాలనీలో సమస్యకు సమన్వయ లోపమే కారణమని ఆయన చెప్పారు. ఆరు మాసాలుగా నత్తనడకన రోడ్డు పనులు సాగుతున్నాయని మంత్రికి స్థానికులు విన్నవించుకున్నారు. మంత్రి వెంట మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, స్థానిక కార్పొరేటర్ కవిత ఉన్నారు. అలాగే స్తంభాలపై అడ్డదిడ్డంగా ఉన్న కేబుల్ వైర్లను తొలగించాలని ఆయన సూచించారు. -
హైకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన మేయర్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.భోంస్లేను కలిశారు. బంజారాహిల్స్లోని దిలీప్ బి.భోసలే నివాసంలో ఆయనను...మేయర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గ్రేటర్ మేయర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బొంతు రామ్మోహన్ ...పలువురు ప్రముఖుల్ని కలుస్తున్న విషయం తెలిసిందే. శనివారం ఆయన ...రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. -
‘దిల్కుషా’లో మేయర్ క్యాంప్ ఆఫీస్?
బంజారాహిల్స్ : గ్రేటర్ హైదరాబాద్ మేయర్ క్యాంపు ఆఫీస్ కోసం జీహెచ్ఎంసీ అధికారులు స్థలాన్వేషణ మొదలుపెట్టారు. ఇందుకోసం రాజ్భవన్ పక్కన ఉన్న దిల్కుషా గెస్ట్హౌస్, గ్రీన్ల్యాండ్స్లో ఉన్న గ్రీన్ల్యాండ్స్ గెస్ట్హౌస్ను శనివారం గ్రేటర్ మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, సెంట్రల్ జోన్ కమిషనర్ గౌరవ్ ఉప్పల పరిశీలించారు. వీటిలో దిల్కుషా గెస్ట్హౌజ్ వైపు మేయర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ రెండు గెస్ట్హౌస్లలో ఒకదాన్ని రెండు రోజుల్లో ఎంపిక చేసి అందులో మౌలిక సదుపాయాలు కల్పించాలని తలపెట్టారు. మేయర్ కోసం క్యాంపు ఆఫీస్ అందుబాటులోకి తీసుకురావడం ఇదే మొదటిసారి. మేయర్ను కలవడానికి వచ్చేవారు ఇప్పుడున్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇరుకైన సౌకర్యాలతో ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుసుకున్న అధికారులు ప్రత్యేకంగా క్యాంపు ఆఫీస్ అందుబాటులోకి తేవాలని యోచించి ఆ మేరకు రెండు గెస్ట్హౌస్లను పరిశీలించారు. గ్రీన్ల్యాండ్స్ గెస్ట్హౌస్ ముందు జరుగుతున్న మెట్రోపనులు వల్ల కొంత వరకు ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులతోపాటు మేయర్ కూడా భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం గెస్ట్హౌస్ను క్యాంపు ఆఫీస్ కోసం తీసుకోవాలా? కొన్ని గదులు మాత్రమే సరిపోతాయా అన్నదానిపై కూడా ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. మొత్తానికి రెండు మూడు రోజుల్లో మేయర్క్యాంపు ఆఫీస్పై తుది నిర్ణయం వెలువడనుంది. -
ప్రజానేతల మహాభిషేకం..
-
ఎన్నిక లాంఛనమే!
సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలను లాంఛనప్రాయంగానే రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. వివిధ పార్టీలకు ఉన్న కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యుల సంఖ్య దృష్ట్యా టీఆర్ఎస్ అభ్యర్థులే మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికవుతారని అం చనా వేశాయి. దీంతో అసలు పోటీయే లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. టీఆర్ఎస్ తప్ప మిగతా పార్టీలేవీ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారికి విప్కు సంబంధించిన సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. మేయ ర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకునేందుకు కార్పొరేటర్లతో పాటు ఎక్స్అఫీషియో సభ్యులు అర్హులు. ప్రస్తుతం పార్టీల బలాబలాలను బట్టి టీఆర్ఎస్ సభ్యు లు.. దానికి మద్దతిచ్చే సభ్యులను పరిగణనలోకి తీసుకుంటే ఎన్నికలు లాంఛనమే అం టున్నారు. మొన్నటి వరకు టీఆర్ఎస్కు 133 మంది, ఎంఐఎంకు 54, కాం గ్రెస్కు 10, టీడీపీకి 9, బీజేపీకి 11 మంది సభ్యుల (ఓటర్ల) బలం ఉంది. అప్పటికే టీఆర్ఎస్కు కావాల్సినంత బలం ఉంది. ఎక్స్అఫీషియోలుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలలో ఇద్దరు టీఆర్ఎస్లో చేరారు. దీంతో సంఖ్య పెరిగింది. ప్రస్తుత బలాబలాలు... -
నగర ప్రథమ పౌరుడెవరో...
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారు. ఇప్పుడు అందరి నోళ్లలో దీనిపైనే చర్చ. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ మెజారిటీతో విజయం సాధించిన టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిని మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. దీనిపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు సాగుతున్నా... టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మదిలో ఏముందో ఎవరికీ అంతుబట్టడం లేదు. నగర ప్రథమ పౌరుడు ఎవరవుతారన్న విషయం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 11 వ తేదీన మేయర్ ఎన్నిక నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరోజున మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ ఎన్నికను కూడా పూర్తి చేయనున్నారు. ఎన్నికల ఫలితాలు రావడానికి ముందు నుంచే గ్రేటర్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి టీఆర్ఎస్ ప్రణాళికా బద్ధంగా, పకడ్బందీ వ్యూహంతో పనిచేసింది. టీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో ఎంఐఎం మద్దతుతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న ఆలోచన చేసినట్టు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతోనే స్పష్టమైంది. అదీ సాధ్యం కాని పరిస్థితి ఉంటే హైదరాబాద్ మున్సిపల్ (స్థానిక సంస్థ) లో ఎక్స్ అఫిషియే సభ్యుల ద్వారా మేయర్ పీఠం దక్కించుకోవాలని భావించింది. అయితే అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ టీఆర్ఎస్ కు భారీ మెజారిటీ దక్కడంతో ఇప్పుడు ఆ పార్టీ ఎవరి మద్దతు లేకుండానే మేయర్ సీటును దక్కించుకోనుంది. ఎంఐఎంను మిత్రపక్షం చేసుకుని మేయర్ స్థానాన్ని గెలుచుకునే పరిస్థితి తలెత్తి ఉంటే మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఒకరకమైన వ్యూహం, ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు కూడా అవసరమైన పరిస్థితి ఏర్పడి ఉంటే మరో రకమైన వ్యూహంతో ముందుకెళ్లాలని టీఆర్ఎస్ నాయకత్వం ప్రణాళిక రచించింది. ఇప్పుడు ఇతరుల మద్దతు అవసరం లేకుండానే స్వతంత్రంగా అభ్యర్థిని ఎంపిక చేసుకునే బలం సమకూరడంతో ఆ పార్టీ నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. మేయర్ అభ్యర్థి ఎవరన్న విషయం ఆ ఎన్నిక రోజు వరకు సస్పెన్స్ కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో పూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు వెళ్లే రోజున ఉన్న పరిస్థితి ఇప్పుడు లేనందున మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎంపిక పూర్తిగా కేసీఆర్ ఆలోచనను బట్టే ఉంటుంది. మేయర్గా రామ్మోహన్ మేయర్ పదవికి చర్లపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికైన బొంతు రామ్మోహన్ పేరు బలంగా వినిపిస్తోంది. రామ్మోహన్ కార్పొరేటర్ గా పోటీ పెట్టిన సందర్భంగానే ఆయన పేరు మేయర్ పదవి ఇస్తామని సూత్రప్రాయంగా పార్టీ నాయకత్వం తెలిపిందని పార్టీ నేతలు చెబుతున్నారు. మేయర్ పదవి ఎంపిక కోసం ఎంఐఎం మద్దతు తీసుకోవలసిన అవసరం ఏర్పడి ఉంటే డిప్యూటీ మేయర్ పదవిని ఎంఐఎం కు ఇచ్చే పరిస్థితి తలెత్తేది. ఇప్పుడా పరిస్థితి లేనందున డిప్యూటీ మేయర్ పదవి కూడా టీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం ఎన్నికైన కార్పొరేటర్లలో ముస్లిం మైనారిటీకి చెందిన వ్యక్తికి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తారని తెలుస్తోంది. ఏ లెక్క చూసినా... మేయర్ పీఠం దక్కించుకోవడానికి గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో ఎక్స్ అఫీషియో సభ్యులను పరిగణలోకి తీసుకోకుంటే... 76 డివిజన్లు ఉంటే సరిపోతుంది. అయితే టీఆర్ఎస్ అనూహ్యంగా 99 డివిజన్లతో తిరుగులేని మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. 150 మంది డివిజన్ల కార్పొరేటర్లతో పాటు ఎక్స్అఫీషియో సభ్యులుగా మరో 67 మంది సభ్యులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. వారికి పరిగణలోకి తీసుకున్న తర్వాత కూడా టీఆర్ఎస్ కు బంపర్ మెజారిటీ ఉంది. లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మొత్తం కలిపి ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 67 మంది ఎక్స్అఫీషియో సభ్యులు ఉండగా, వారిలో టీఆర్ఎస్ కు 35, ఎంఐఎంకు 10, టీడీపీకి 7, కాంగ్రెస్ కు 8, బీజేపీకి 7 ఓట్లున్నాయి. ఇంతకాలం టీఆర్ఎస్ కు 34 మంది సభ్యులు మాత్రమే ఉన్నప్పటికీ తాజాగా మంగళవారం టీడీపీకి చెందిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ కూడా టీఆర్ఎస్ లో చేరడంతో ఆ పార్టీ బలం 35 కు పెరిగింది. మొత్తం 150 డివిజన్లతో పాటు 67 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 217 మంది ఓటర్లలో 134 ఓట్లు టీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. ఈ లెక్క తీసుకున్నా టీఆర్ఎస్ ఎవరి మద్దతు లేకుండా మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను దక్కించుకోగలదు. లోక్ సభ సభ్యులు 1. కొత్త ప్రభాకర్ రెడ్డి (టీఆర్ఎస్) 2. సీహెచ్ మల్లారెడ్డి (టీడీపీ) 3. బండారు దత్తాత్రేయ (బీజేపీ) 4. అసదుద్దీన్ ఓవైసీ (ఏఐఎంఐఎం) రాజ్యసభ సభ్యులు 5. కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్) 6. వి. హనుమంతరావు (కాంగ్రెస్) 7. రాపోలు ఆనంద భాస్కర్ (కాంగ్రెస్) 8. సీఎం రమేష్ (టీడీపీ) 9. గరికపాటి మోహన్ రావు (టీడీపీ) 10. కే కేశవరావు (టీఆర్ఎస్) 11. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి (కాంగ్రెస్) 12. జైరాం రమేష్ (కాంగ్రెస్) 13. ఎం.ఏ. ఖాన్ (కాంగ్రెస్) 14. కె. చిరంజీవి (కాంగ్రెస్) ఎమ్మెల్సీలు 15. పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్) 16. కే. యాదవ రెడ్డి (టీఆర్ఎస్) 17. ఎస్. రాములు నాయక్ (టీఆర్ఎస్) 18. కె. స్వామిగౌడ్ (టీఆర్ఎస్) 19. మహమ్మద్ సలీమ్ (టీఆర్ఎస్) 20. నాయిని నర్సింహారెడ్డి (టీఆర్ఎస్) 21. మహ్మద్ మహమూద్ అలీ (టీఆర్ఎస్) 22. పాతూరి సుధాకర్ రెడ్డి (టీఆర్ఎస్) 23. వి.భూపాల్ రెడ్డి (టీఆర్ఎస్) 24. సుంకరి రాజు (టీఆర్ఎస్) 25. కె.జనార్థన్ రెడ్డి (టీఆర్ఎస్) 26. ఆర్ భూపతి రెడ్డి (టీఆర్ఎస్) 27. పి.సతీష్ కుమార్ (టీఆర్ఎస్) 28. కర్నె ప్రభాకర్ (టీఆర్ఎస్) 29. వి.గంగాధర్ గౌడ్ (టీఆర్ఎస్) 30. డి.రాజేశ్వరరావు (టీఆర్ఎస్) 31. పి.రవీందర్ (టీఆర్ఎస్) 32. కసిరెడ్డి నారాయణరెడ్డి (టీఆర్ఎస్) 33. బి.వెంకటేశ్వర్లు (టీఆర్ఎస్) 34. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి (టీఆర్ఎస్) 35. నేతి విద్యాసాగర్ (టీఆర్ఎస్) 36. పట్నం నరేందర్ రెడ్డి (టీఆర్ఎస్) 37. టి.భాను ప్రసాద్ (టీఆర్ఎస్) 38. నారదాసు లక్ష్మణరావు (టీఆర్ఎస్) 39. ఎంఎస్ ప్రభాకర్ (కాంగ్రెస్ - టీఆర్ఎస్ లో చేరారు) 40. మహ్మద్ అలీ షబ్బీర్ (కాంగ్రెస్) 41. సయ్యద్ అల్తాఫిదర్ రజ్వీ (ఏఐఎంఐఎం) 42. సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ (ఏఐఎంఐఎం) 43. ఎన్. రామచందర్ రావు (బీజేపీ) ఎమ్మెల్యేలు 44. కె. లక్ష్మణ్ (బీజేపీ) 45. జి. కిషన్ రెడ్డి (బీజేపీ) 46. చింతల రామచంద్రారెడ్డి (బీజేపీ) 47. టి. రాజాసింగ్ (బీజేపీ) 48. ఎన్వీఎస్సెస్ ప్రభాకర్ (బీజేపీ) 49. మాగంటి గోపీనాధ్ (టీడీపీ) 50. కేపీ వివేకానంద (టీడీపీ - టీఆర్ఎస్ లో చేరారు) 51. ఆర్ కృష్ణయ్య (టీడీపీ) 52. టి. ప్రకాశ్ గౌడ్ (టీడీపీ) 53. అరికెపూడి గాంధీ (టీడీపీ) 54. జాఫర్ హుస్సేన్ (ఏఐఎంఐఎం) 55. కౌసర్ మొయినుద్దీన్ (ఏఐఎంఐఎం) 56. అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల (ఏఐఎంఐఎం) 57. సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (ఏఐఎంఐఎం) 58. అక్బరుద్దీన్ ఓవైసీ (ఏఐఎంఐఎం) 59. ముంతాజ్ అహ్మద్ ఖాన్ (ఏఐఎంఐఎం) 60. మహ్మద్ మౌజం ఖాన్ (ఏఐఎంఐఎం) 61. టి.పద్మారావు (టీఆర్ఎస్) 62. జి.మహిపాల్ రెడ్డి (టీఆర్ఎస్) 63. చింతల కనకా రెడ్డి (టీఆర్ఎస్) 64. తలసాని శ్రీనివాస యాదవ్ (టీడీపీ- టీఆర్ఎస్ లో చేరారు) 65. జి. సాయన్న (టీడీపీ - టీఆర్ఎస్ లో చేరారు) 66. ఎం. కృష్ణారావు (టీడీపీ - టీఆర్ఎస్ లో చేరారు) 67. ఎల్విస్ స్టీఫెన్ సన్ (టీఆర్ఎస్ - నామినేటెడ్ మెంబర్) పార్టీ కార్పొరేటర్లు ఎక్స్-అఫీషియో సభ్యులు మొత్తం టీఆర్ఎస్ 99 35 134 ఎంఐఎం 44 10 54 కాంగ్రెస్ 02 08 10 టీడీపీ 01 07 08 బీజేపీ 04 07 11 మొత్తం 150 67 217 మేయర్ ఎన్నిక బహిష్కరిద్దామా గ్రేటర్ మేయర్ పదవి టీఆర్ఎస్ ను వరించడం ఖాయమైన నేపథ్యంలో ఆ ఎన్నికలో పాల్గొనాలా లేదా అన్న మీమాంసలో టీడీపీ నేతలున్నారు. ఈ విషయంలో బీజేపీ వాదన భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సైతం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనాలా లేదా ఇంకా తేల్చుకోలేదని తెలిసింది.