grandson
-
రూ. 200కి మనుమడిని అమ్మేసిన నాన్నమ్మ
మయూర్భంజ్: ఆర్థిక పరిస్థితులు మనిషిని ఎంతవరకైనా కుంగదీస్తాయి. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలోనే విషాద ఉదంతాలు చోటుచేసుకుంటాయి. ఒడిశా(Odisha)లోని మయూర్భంజ్లో హృదయాలను ద్రవింపజేసే ఉదంతం చోటుచేసుకుంది. దీని గురించి తెలుసుకున్నవారంతా కంటతడి పెడుతున్నారు.ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా పరిధిలోని బల్డియా గ్రామానికి చెందిన వితంతువు మంద్ సోరెన్(65)కు ఉండేందుకు ఇల్లు గానీ, కాస్త స్థలం గానీ లేదు. ప్రభుత్వ పథకాల ద్వారా కూడా ఆమెకు ఎటువంటి సాయం అందడం లేదు. గతంలో ఆమె భర్త మరణించాడు. ఆమె కుమారుడు ఎటో వెళ్లిపోయాడు. కోడలు కూడా మృతి చెందింది. దీంతో ఆమె జీవితం దిక్కుతోచని విధంగా తయారయ్యింది. ఇటువంటి పరిస్థితిలో ఆమె ఏడేళ్ల మనుమడిని పెట్టుకుని, రాయ్పాల్ గ్రామంలో ఉంటున్న సోదరి ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తోంది. #Horrific Due to starvation, a Tribal woman sold her grandson for Rs 200, the incident took place in Odisha's Mayurbhanj district. pic.twitter.com/4j2vhEvetH— The Dalit Voice (@ambedkariteIND) March 19, 2025మంద్ సోరెన్ రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ(Begging) తన మనుమడిని పోషిస్తోంది. అయితే వృద్ధాప్యం కారణంగా ఇటీవలి కాలంలో మనుమడి సంరక్షణ కూడా చూసుకోలేకపోతోంది. ఇదువంటి దుర్భర పరిస్థితుల్లో ఒక అజ్ఞాత వ్యక్తికి రూ. 200కు తన మనుమడిని అమ్మేసింది. ఇకనైనా తన మనుమడికి మంచి ఆహారం దొరుకుతుందనే భావనతో ఇలా చేశానని ఆమె చెబుతోంది. స్థానిక పంచాయతీ సభ్యులకు ఈ విషయం తెలిసింది. వారు ఉన్నతాధికారులకు ఈ సమాచారం చేరవేశారు. దీంతో రాస్గోవింద్ పూర్ పోలీసులు ఆ బాలుడిని రక్షించి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు.విషయం తెలుసుకున్న చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ సభ్యులు పోలీస్ స్టేషన్కు వచ్చి, ఆ బాలునితో పాటు నాన్నమ్మను ప్రభుత్వ వసతి గృహానికి తరలించారు. ఈ సందర్భంగా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ అధికారి ఒకరు మాట్లాడుతూ ఈ విషయమై పోలీసులు తమకు సమాచారం అందించగానే, తాము వారిని ప్రభుత్వ సంరక్షణా గృహానికి తీసుకువచ్చామని తెలిపారు. ఆ బాలుడిని ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుకు ఏర్పాట్లు చేస్తామని, మంద్ సోరెన్కు ప్రభుత్వ ఫించను వచ్చేలా చూస్తామని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పాక్కు మద్దతుగా గోడలపై నినాదాలు.. ఇద్దరు యువకులు అరెస్ట్ -
ప్రమాదంలో గాయపడి బిర్సా ముండా మునిమనవడు మృతి
రాంచీ: గిరిజనుల ఆరాధ్య దైవం బిర్సా ముండా ముని మనవడు మంగళ్ ముండా కన్ను మూశారు. ఆయన వయస్సు 45 ఏళ్లు. ఈ నెల 25న ఖుంటి జిల్లాలో వాహనం పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడిన మంగళ్ తీవ్రంగా గాయపడ్డారు. ముందుగా ఖుంటిలోని సదర్ ఆస్పత్రిలో చికిత్స చేశారు. తలకు తీవ్ర గాయాలై రక్తం గడ్డకట్టడంతో రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)కు తరలించి వెంటిలేటర్పై ఉంచి చికిత్స చేస్తు న్నారు. శుక్రవారం ఆయన కార్డియో వాస్క్యులర్ ఫెయిల్యూర్తో తుదిశ్వాస విడిచారని రిమ్స్ వర్గాలు తెలిపాయి. ఆయన్ను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేశామని రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ హిరేన్ చెప్పారు. సీఎం హేమంత్ సోరెన్ రిమ్స్కు వెళ్లి మంగళ్ ముండా కుటుంబసభ్యులను ఓదా ర్చారు. మంగళ్ ముండా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. -
విలన్గా తాతయ్య... హీరోగా మనవడి ఎంట్రీ.. అది కూడా ఏకంగా టాలీవుడ్లో! (ఫొటోలు)
-
మా మనవడ్ని ఆదరించాలని కోరుకుంటున్నాం
ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మిస్టర్ సెలెబ్రిటీ’. చందిన రవికిశోర్ దర్శకత్వంలో చిన్న రెడ్డయ్య, ఎన్.పాండు రంగారావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్ను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘మమ్మల్ని ఆదరించినట్టుగానే మా మనవడు సుదర్శన్ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. రవికిశోర్ కొత్త దర్శకుడైనా సినిమాను బాగా తీశారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘నలభై ఏళ్లుగా మమ్మల్ని ఆదరిస్తూనే ఉన్నారు. రాజీపడకుండా నిర్మించిన నిర్మాతలను, అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడ్ని, తొలిసారి వెండితెరపై కనిపించనున్న మా మనవడ్ని ఆదరించి ఈ సినిమాకి విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను’’ అని పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. -
సుశీల్కుమార్ శిందే మనవడు, జాన్వీ బాయ్ఫ్రెండ్ రాజకీయాల్లోకి!
సోలాపూర్: పట్టణంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అనే ఉత్కంఠ నెలకొంది. ఇంతలో గణేశ్ ఉత్సవాల కోలాహలం వచ్చింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్న అనేకమంది ఆశావాహులు భవిష్యత్లో తమకు అందరూ అండగా ఉండాలనే అభిలాషతో పలు మండపాలలో పూజలు, దర్శనాలు చేసుకుంటూ కానుకలు విరాళాలు అందజేయడంలో మొగ్గు చూపారు. అయితే సోలాపూర్ సిటీ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గానికి గత మూడు పర్యాయాలు వరుసగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు ప్రణతీ శిందే ఎంపీగా గెలుపొందడంతో ఆ స్థానం ద్వారా శాసనసభ్యుడిగా ఎన్నిక కావాలనే తపనతో దాదాపు 19 మంది ఆశావాహులు అభ్యర్థిత్వం కోసం ఆసక్తిగా కలలు కంటున్నారు.గత కొన్ని రోజులుగా సుశీల్ కుమార్ శిందే మనవడు శిఖర్ పహారియా వార్తల్లో నిలుస్తున్నాడు. ఎందుకంటే తన పిన్ని ఎంపీ ప్రణతీ ప్రాతినిధ్యం వహిస్తున్న సోలాపూర్ సిటీ సెంట్రల్ స్థానానికి లేక పక్కనే గల సోలాపూర్ సౌత్ రూరల్ స్థానం ద్వారా రాజకీయ వారసుడిగా ముందుకు వస్తారనే వార్తలు గుప్పు మంటూ తెర మీదికి వస్తున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోని గణేశ్ ఉత్సవ మండలాలను సందర్శించడం అందరితో చనువుగా మెలగడం, తన తాత ఫామ్హౌస్లో ఏర్పాటుచేసిన గణేశ్ ఉత్సవాన్ని సందర్శించడానికి వచ్చిన వారితో ఆప్యాయంగా పలకరించి ఆహ్వానించడం మొదలైన ప్రక్రియ ఆయన్ను సుశీల్ కుమార్ శిందే కుటుంబం రాజకీయ వారసుడిగా ముందుకు తీసుకురాగలరనే భావనను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మూడు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా ఆశీర్వదించిన పట్టణ ప్రజలకు రాజకీయ వారసుడిని అందించాలని సుశీల్ కుమార్ శిందే కుటుంబంతో పాటు ఆయన్ను అభిమానించే వారు కోరుకుంటున్నట్టు చెబుతున్నారు. -
రజనీకాంత్ మనవడి బర్త్డే సెలబ్రేషన్స్.. క్రికెట్ థీమ్తో.. (ఫోటోలు)
-
4 నెలల మనవడికి రూ.240 కోట్ల బహుమతి
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తన నాలుగు నెలల మనవడు ఏకగ్రాహ్ రోహన్ మూర్తికి ఖరీదైన బహుమతిని ప్రదానం చేశారు. ఇన్ఫోసిస్కు చెందిన 15 లక్షల షేర్లను ఇచ్చారు. ప్రస్తుత మార్కెట్ ధర (రూ. 1,602) ప్రకారం వీటి విలువ రూ. 240 కోట్లుగా ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కంపెనీలో తనకుగల ఈక్విటీలో 0.04 శాతం వాటాను కుమారుడు రోహన్ పుత్రుడు ఏకగ్రాహ్కు నారాయణ మూర్తి రిజిస్టర్ చేశారు. దీంతో ఏకగ్రాహ్ రోహన్ ఇన్ఫోసిస్లో బుల్లి బిలియనీర్ వాటాదారుడయ్యారు. నారాయణ మూర్తి కుమార్తె అక్షత, అల్లుడు రిషీ (బ్రిటన్ ప్రధాని)కి ఇద్దరు కుమార్తెలుకాగా.. ఏకగ్రాహ్ మనవడు. -
సుబ్రతారాయ్ అంత్యక్రియలు: ఎవరు చేస్తున్నారో తెలుసా?
సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్ అంత్యక్రియలు ఆయన స్వస్థలం ఉత్తరప్రదేశ్, లక్నోలోని బైకుంత్ ధామ్ శ్మశానవాటికలో నిర్వహించారు. ఆయన ఇరువురు కుమారులో అందుబాటులో లేకపోవడంతో సుబ్రాతా రాయ్ మనవడు 16 ఏళ్ల హిమాంక్ రాయ్ చేతుల మీదుగా సాంప్రదాయ బద్ధంగా అంతిమ సంస్కారాలను నిర్వహించారు. గంగా నది ఒడ్డున యనవడు హిమాంక్ ఆయన చితికి నిప్పింటించారు. రాయ్ కుమారులు, సుశాంతో, శ్రీమంతోలు విదేశాల్లో ఉన్న కారణంగా అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నారని సన్నిహిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో లండన్లో చదువుకుంటున్న హిమాంక్ నేరుగా విమానాశ్రయం నుంచి కోకిలాబెన్ ఆసుపత్రికి వెళ్లి తాత భౌతిక కాయానికి నివాళులర్పించారు. సుబ్రతా రాయ్ చిన్న కుమారు శ్రీమంతో పెద్ద కుమారుడు హిమాంక్ రాయ్ లండన్లో 10వ తరగతి చదువుతున్నాడు. సుబ్రతా రాయ్ భార్య స్వప్న, అతని మేనకోడలు ప్రియాంక సర్కార్,ఇతరకుటుంబ సభ్యుల బుధవారం ప్రత్యేక విమానంలో లక్నో చేరుకుకున్నారు. అటు రాయ్ మృతదేహాన్ని కూడా కూడా చార్టర్ విమానంలో లక్నోకు తరలించారు. సహారా సుబ్రతాకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల, రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులు రాయ్కు కడసారి నివాళులర్పించారు. యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్, యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, పార్టీ సీనియర్ నేతలు అరవింద్ సింగ్ గోపే, అభిషేక్ మిశ్రా ఉన్నారు. యూపీ కాంగ్రెస్ నాయకుడు ఆరాధన మిశ్రా మోనా, అనుగ్రహ్ నారాయణ్ సింగ్, అమ్మర్ రిజ్వీ వంటి ఇతర కాంగ్రెస్ నాయకులతోపాటు, మాజీ ఎంపీ నరేష్ అగర్వాల్, యూపీ మంత్రి నితిన్ అగర్వాల్, స్మితా ఠాక్రే, బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్, సున్నీ మత గురువు మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలీ తదిరులు ఆయనను కడసారి దర్శించుకున్నారు. అలాగే కంపెనీకి చెందిన వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు ఆయన అధికారిక నివాసానికి తరలి వచ్చారు. ఆయన అంతిమయాత్రలో పాల్గొని జోహార్ సహారాజీ అంటూ నినదించారు. #WATCH | Lucknow, Uttar Pradesh: On Sahara Group Chairman Subrata Roy's demise, singer Sonu Nigam says, "Since 1997, I and Subrata Roy have had an association. I have spent a very good time with him. He is like my brother, father, and friend..." pic.twitter.com/vYYnNeICC2 — ANI (@ANI) November 16, 2023 VIDEO | Sahara group founder and chairman Subrata Roy‘s mortal remains being taken for the last rites ceremony at Sahara City in Lucknow. pic.twitter.com/QEngVKsEfS — Press Trust of India (@PTI_News) November 16, 2023 -
నిమ్స్ను సందర్శించిన నిజాం మనవడు
సాక్షి, సిటీబ్యూరో: నిజాం మనవడు నవాబ్ నజీఫ్ అలీ ఖాన్ శుక్రవారం నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. పిల్లల గుండె శస్త్ర చికిత్సల శిబిరాన్ని విజయవంతం చేసినందుకు నిమ్స్ డైరెక్టర్ బీరప్పను అభినందించారు. యూకే నుంచి వచ్చిన కార్డియోథెరపిక్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. పేద రోగులు, సమాజానికి ప్రయో జనం చేకూరేలా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగం ఇంచార్జ్, ఆర్ఎంఓ డాక్టర్ సల్మాన్ పాల్గొన్నారు. -
మహాత్మా గాంధీ మనవడు కన్నుమూత
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ(89) మంగళవారం తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో మరణించినట్లు ఆయన కుటుంబికులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న కొల్హాపూర్కు వచ్చిన అరుణ్ గాంధీ.. అక్కడే పదిరోజుల పాటు బస చేయాలని అనుకున్నారు. కానీ అక్కడి నుంచి బయలుదేరే ముందే అరుణ్ గాంధీ అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తదుపరి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి ప్రయాణాలు చేయవద్దని వైద్యులు సూచించడంతో అరుణ్ గాంధీ అక్కడ ఉండిపోయారని, ఈరోజు ఉదయమే తుదిశ్వాస విడిచినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈమేరకు ఈ విషయాన్ని అరుణ్ గాంధీ కుమారుడు తుషార్ గాంధీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. కాగా, మహాత్మా గాంధీ కొడుకు మణిలాల్ గాంధీ, సుశీ మష్రువాలా దంపతులకు అరుణ్ గాంధీ ఏప్రిల్ 14, 1934న డర్బన్లో జన్మించారు. అరుణ్ గాంధీ సామాజిక కార్యకర్తగా తన తాత అడుగుజాడల్లోనే నడిచారు. ఈమేరకు ఈ విషయాన్ని అరుణ్ గాంధీ కుమారుడు తుషార్ గాంధీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. Bereaved. Lost my father this morning🙏🏽 — Tushar बेदखल (@TusharG) May 2, 2023 (చదవండి: "న్యాయం మీ అంగీకారం కోసం వేచి ఉంది!": ప్రియాంక గాంధీ) -
సోనియాకు థ్యాంక్స్.. కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన సీనియర్ నేత
ఢిల్లీ: అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ లీడర్లు మాత్రం షాకిస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ను వీడగా.. తాజాగా మరో నేత పార్టీకి గుడ్బై చెప్పారు. స్వతంత్ర భారత మొదటి గవర్నర్ జనరల్గా పనిచేసిన సీ. రాజగోపాలచారి మనుమడు సీఆర్ కేశవన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఛారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ సీనియర్ నేత సీఆర్ కేశవన్ హస్తం పార్టీకి గుడ్బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపించారు. ఈ లేఖలో కేశవన్ కీలక విషయాలను వెల్లడించారు. తనకు 20 ఏళ్లకు పైగా పార్టీకి సేవ చేసే బాధ్యతలు ఇచ్చినందకు కాంగ్రెస్కు, సోనియా గాంధీకి కేశవన్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, పార్టీలో ప్రతీ ఒక్కరితోనూ తనకు మంచి సంబంధాలు ఉన్నాయని లేఖలో చెప్పుకొచ్చారు. ఇక, తాను 2001లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయాన్ని గుర్తుచేసిన కేశవన్.. దేశానికి సేవ చేయడానికే విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి పార్టీలో చేరినట్టు తెలిపారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం పార్టీలో ఇవ్వడం లేదని కేశవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ప్రస్తుతం విలువలు లేవని ఆరోపించారు. పార్టీని సేవ చేసినన్ని రోజులు తన ప్రయాణం సవాలుగా, ఆకర్షణీయంగా ఉందని చెప్పారు. అలాగే, తనకు.. శ్రీపెరంబుదూర్లోని రాజీవ్ గాంధీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్కు వైస్ ప్రెసిడెంట్గా, ప్రసార భారతి బోర్డు సభ్యుడిగా సేవలందించే అవకాశం లభించిందని చెప్పారు. ఇదే సమయంలో తనకు వేరే పార్టీలో చేరే ఆలోచన ప్రస్తుతంలేదని స్పష్టం చేశారు. -
మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనవడి వివాహ రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్
-
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనవడి వివాహ రిసెప్షన్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులు ఆదిత్య వర్మ, సాయి సంజనలను సీఎం జగన్ ఆశీర్వదించారు. చదవండి: ప్రతిష్ఠాత్మక కార్యక్రమం.. ఎవరూ అలక్ష్యం చేయొద్దు: సీఎం జగన్ -
తాత మందలించాడని.. మనమడు ఎంతకు బరి తెగించాడంటే..
కర్నూలు: ‘బాగుపడే లక్షణాలు లేవు.. సెల్ఫోన్ మీద ఉన్న ధ్యాస వృత్తి(పౌరోహిత్యం)పై ఉండటం లేదు. ఇలాగైతే ఎలా ’ అంటూ మందలించిన తాతను.. సొంత మనుమడే కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. స్థానిక మాధవీనగర్లో నివాసముంటున్న మేడవరం సుబ్రహ్మణ్య శర్మ (83) వ్యవసాయ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ 1996లో పదవీ విరమణ పొందాడు. సుబ్ర హ్మణ్య శర్మ భార్య శాంతమ్మ 13 ఏళ్ల క్రితం, పెద్ద కుమారుడు సతీష్ శకర్మ 14 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందడంతో కోడలు అరుణ(పెద్ద కొడుకు భార్య), మనుమడు దీపక్ శర్మ ఉంటున్నారు. దీపక్ శర్మ చదువు మధ్యలోనే ఆగిపోవడంతో కులవృత్తి పౌరోహిత్యం నేర్చుకోమని కేసీ కెనాల్ వద్ద ఉన్న వినాయక ఘాట్ దేవాలయంలో వదిలారు. అయితే పూజా కార్యక్రమాలకు డుమ్మా కొడుతుండటంతో తాత తరచూ మందలించేవాడు. రెండు రోజుల క్రితం మహానందిలో ఉన్న బంధువుల ఇంటికి స్కూటీపై వెళ్తుండగా బస్సులో వెళ్లమని చెప్పినా పెడచెవిన పెట్టాడు. తిరిగి వచ్చిన తర్వాత కూడా వృత్తిపని నేర్చుకునేందుకు వెళ్లకుండా సెల్ఫోన్లో మాట్లాడుతూ ఉండటంతో తాత మరో సారి మందలించాడు. దీంతో ఆలయానికి వెళ్లి కాసేపటికే తిరిగి ఇంటికి వచ్చాడు. ‘ఎందుకంతలోనే వచ్చావు.. వృత్తిపై ధ్యాస లేదా’ అంటూ ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఆవేశానికి లోనై కూరగాయల కత్తి తీసుకొని మంచంపై పడుకోబెట్టి గొంతు కోసి హత్య చేశాడు. దుస్తులకు రక్తం అంటడంతో బాత్రూమ్లో స్నానం చేసి వేరే దుస్తులు వేసుకుని బాబాయి రమేష్శర్మకు ఫోన్ చేసి తాతను ఎవరో హత్య చేశారంటూ సమాచారమిచ్చాడు. వారు అక్కడికి చేరుకుని రక్తపు మడుగులో పడివున్న సుబ్రహ్మణ్య శర్మను చూసి ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న మూడో పట్టణ సీఐ తబ్రేజ్, ఎస్ఐలు జయశేఖర్, శ్రీనివాసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. నేరం జరిగిన తీరును చూసి దీపక్ శర్మపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా తనకు తెలియదంటూ బుకాయించడంతో డాగ్ స్క్వాడ్ను రప్పించి ఆధారాలను సేకరించారు. స్టేషన్కు తీసుకువెళ్లి తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: థాయ్ విద్యార్థినిపై అత్యాచార యత్నం.. హిందీ నేర్పిస్తానని ఇంటికి తీసుకెళ్లి.. -
‘రూ.కోటి సిద్ధం చేసుకో లేదా..’ గ్యాంగ్స్టర్ ఫోన్.. చివర్లో అదిరే ట్విస్ట్!
చండీగఢ్: అపరిచితులు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసే సంఘటనలు చాలా సినిమాల్లో కనిపిస్తుంటాయి. అదే విధంగా ఓ గ్యాంగ్స్టర్ ఓ వ్యక్తికి ఫోన్ చేసి రూ.1 కోటి సిద్ధం చేసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని బెదిరించాడు. చిరు వ్యాపారం చేసుకునే ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించటంతో అసలు విషయం బయటపడింది. ఆ వ్యక్తికి కాల్ చేసింది అతడి మనవడే. ఈ సంఘటన పంజాబ్లోని పటాన్కోట్లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఫిర్యాదు దారు తన దుకాణం నుంచి ఇంటికి తిరిగి వచ్చి రాత్రి 8.50 గంటల ప్రాంతంలో టీవీ చూస్తుండగా ఫోన్ కాల్ వచ్చింది. తాను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నానని, తనకు ‘ఖోఖా’ (రూ.1కోటి) ఇవ్వాలని లేదా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని బెదిరించాడు. ఆ మాట విని ఆందోళన చెందిన పెద్దాయన వెంటనే ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేశాడు. దీంతో భయాందోళన చెందిన ఆ వృద్ధుడు కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారి ప్రోత్సాహంతో షాపుర్ కండీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘నేను ఆశ్చర్యపోయా, నేను పెద్ద వ్యాపారవేత్తను కాదు. నాకు భూములు, ఇతర ఆస్తులు లేవు. గ్యాంగ్ స్టర్ నాకేందుకు ఫోన్ చేశాడని ఆశ్చర్యమేసింది.’ అని బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్ నంబర్ ఆధారంగా గ్యాంగ్స్టర్ను గుర్తించి అరెస్ట్ చేశారు. అతడు బాధితుడి మనవడే అని తేలింది. తన తాతను బెదిరించేందుకు కొత్త సిమ్ కొనుగోలు చేసినట్లు గుర్తించామని డిప్యూటీ సబ్ ఇన్స్పెక్టర్ రాజిందర్ మంహాస్ తెలిపారు. నిందితుడిపై పలువు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఇదీ చదవండి: పెళ్లింట విషాదం: రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి.. వరుడి పరిస్థితి విషమం -
మద్యం త్రాగేందుకు డబ్బులు ఇవ్వాలని నానమ్మపై మనువడి దాడి
-
తాత అంతిమయాత్రను అడ్డుకున్న మనవడు.. ‘లెక్క తేలేవరకు శవాన్ని ఎత్తనిచ్చేది లేదు’
లేపాక్షి (సత్యసాయి జిల్లా): ఆస్తి పంపకాలు పూర్తయ్యాకే తాత శవాన్నెత్తాలంటూ ఓ మనవడు రగడకు దిగాడు. రెండో భార్య కుమార్తెకు రాసిచ్చిన ఎకరాను కూడా తనకే ఇవ్వాలంటూ నానా హంగామా చేశాడు. ఈ ఘటన మండలంలోని కొత్తపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన మేరకు.. కొత్తపల్లికి చెందిన కార్పెంటర్ చిన్నహనుమయ్యకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు ఒక కుమారుడు, చిన్న భార్యకు ఒక కుమార్తె సంతానం. పెద్దభార్య, కుమారుడు, చిన్న భార్య గతంలోనే మృతి చెందారు. దీంతో కుమార్తె వద్ద కొన్ని రోజులుగా ఉంటున్న చిన్నహనుమయ్య శుక్రవారం రాత్రి మృతి చెందాడు. (చదవండి: గుండెకోతను భరించి...) ఈ క్రమంలోనే శనివారం మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన మనవడు (పెద్దభార్య కుమారుడి కొడుకు) నాగభూషణ ఆస్తి పంపకాలు పూర్తయ్యేదాకా శవాన్ని ఎత్తనిచ్చేది లేదని భీష్మించాడు. మూడున్నర ఎకరాల్లో ఓ ఎకరాను కుమార్తెకు లిఖిత పూర్వకంగా తాత రాసిచ్చాడని, అది కూడా తనకే చెందాలని రగడకు దిగాడు. బంధువులు ఎంత నచ్చజెప్పినా వినలేదు. చేసేది లేక వారంతా వెనుదిరిగారు. అంతిమ సంస్కారాల తర్వాత ఏమైనా ఉంటే చూసుకోండని, గ్రామస్తులు చెప్పినా లెక్కచేయకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మనవడికి నచ్చజెప్పారు. బంధువులు ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులే తలా చెయ్యి వేసి చిన్న భార్య కుమార్తె, అల్లుడితో కలిసి దహనసంస్కారాలు పూర్తి చేశారు. (చదవండి: బ్యాగులో లక్షల రూపాయలు.. మర్చిపోయి రైలెక్కి సొంతూరుకు.. మళ్లీ తిరిగొచ్చి..!) -
వజ్రోత్సవాల వేళ ఆంటిలియాకు కొత్త కళ: మనవడితో అంబానీ సందడి
సాక్షి, ముంబై: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగు తున్నాయి. దేశవ్యాప్తంగా పిల్లా పెద్దా అంతా త్రివర్ణ పతాకాలు చేబూని, మాతృదేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కూడా ఈ సంబరాల్లో పాలు పంచుకున్నారు. భార్య నీతా అంబానీ, మనవడు పృథ్వీ అంబానీతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వాతంత్య్ర అమృత్ మహోత్సవ్ను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా దేశంలోని చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలు త్రివర్ణ కాంతులతో దేదీప్యమానంగా ఆకర్ణణీయంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేశ్ అబానీ ఇల్లు ఆంటిలియా కూడా త్రివర్ణ పతాక కాంతులతో వెలిగిపోతోంది. యాంటిలియా వెలుపల ఉన్న రహదారి మొత్తం త్రివర్ణ వెలుగులతో అందంగా ముస్తాబు చేశారు. దీంతో జనం తమ కార్లను ఆపి మరీ సెల్ఫీలు తీసుకోవడం విశేషం. అంతేకాదు ఆంటిలియా ఇంటి బయట శీతల పానీయాలు, చాక్లెట్లు అందిస్తున్నారు. దీంతో అటు సెల్ఫీలు, ఇటు కూల్ డ్రింక్స్, చాక్లెట్లతో జనం ఎంజాయ్ చేస్తున్నారు. #WATCH | Reliance Industries chairman Mukesh Ambani along with his wife Nita Ambani and grandson Prithvi Ambani celebrates Independence Day pic.twitter.com/QNC8LmtoHL — ANI (@ANI) August 15, 2022 -
‘లోన్ యాప్’ ఒత్తిడికి తాతా మనవళ్ల ఆత్మహత్య
నరసాపురం రూరల్(పశ్చిమ గోదావరి): రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మణేశ్వరం గ్రామం పరసావారి మెరకకు చెందిన తాతా మనవళ్లు ఆన్లైన్ లోన్ యాప్ ఒత్తిడి తట్టుకోలేక బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రూరల్ ఎస్సై ప్రియకుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భోగిరెడ్డి రాఘవరావు (73) వ్యవసాయం చేస్తూ, ఆయన మనవడు భోగిరెడ్డి గిరి ప్రసాద్ (26) ప్రైవేటు జాబ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక అవసరాల నేపథ్యంలో ఆన్లైన్ లోన్ యాప్ నుంచి కొంత మొత్తం రుణం తీసుకుని కొంతకాలం సక్రమంగానే చెల్లించారు. చదవండి: కుమారుడిని ఇంట్లో వదిలేసి.. వివాహిత అదృశ్యం అనంతరం ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో రుణం చెల్లించడం ఆలస్యమైంది. ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకులు వీరిని ఒత్తిడి చేసి బ్లాక్మెయిల్కు పాల్పడటంతో వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని రాఘవరావు కుమారుడు, గిరిప్రసాద్కు తండ్రి అయిన భోగిరెడ్డి నాగరాజు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించామని ఎస్సై తెలిపారు. తాతా మనవళ్లు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
ఓవైపు కేసులు.. మరోవైపు మనవడికి 40 కోట్ల కానుక
బిందు రాణా కపూర్.. యస్ బ్యాంక్ ఫౌండర్, మాజీ ఎండీ రానా కపూర్ భార్య. అక్రమ ధనార్జన కేసు విచారణలో భర్తతోపాటు బిందూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటోంది. రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులు భారీ ముడుపులు తీసుకుని పలు సంస్థలకు యస్బ్యాంక్ ద్వారా పెద్ద ఎత్తున అక్రమంగా రుణాలు ఇప్పించారని సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేయగా, ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో ఆమె తన తొమ్మిదేళ్ల మనవడికి పుట్టినరోజు కానుకగా 40 కోట్ల విలువైన ఆస్తుల్ని అందించడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని పోష్ ఏరియా జోర్బాగ్లో తన పేరిట ఉన్న ఆస్తిని.. మనవడు ఆశివ్ ఖన్నా పేరిట రాసింది బిందు రాణా కపూర్. ఈ డబుల్ బెడ్రూమ్ ప్లాట్ విలువ 40 నుంచి 44 కోట్ల రూపాయల విలువ ఉండొచ్చని చెబుతున్నారు. ఈ ఆస్తి.. ఆమె తన తండ్రి నుంచి 2004 లో పొందినట్లు డాక్యుమెంట్లలో ఉంది. జప్కీ డాట్కామ్ ద్వారా డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలన్నీ బయటకు వచ్చాయి. జులై 31న ఆస్తి ట్రాన్స్ఫర్కు సంబంధించిన 36 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు జరిగిందని.. ఆ ఆస్తికి బిందూ కూతురు, ఆశివ్ ఖన్నా తల్లి రాధా కపూర్ గార్డియన్గా నియమించినట్లు ఆ చెల్లింపుల్లో ఉంది. ఇది చదవండి: యస్ బ్యాంక్ నష్టం, ఎన్ని కోట్లంటే.. గతేడాది జులైలో యస్ బ్యాంక్ మోసాలు.. మనీలాండరింగ్ కేసులో రెండు వేల కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ ఎటాచ్ చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్లో లండన్లోని రాణా కపూర్కు చెందిన 127 కోట్ల విలువైన ఫ్లాట్ను కూడా ఈ మధ్యే ఎటాచ్ చేసింది. ఇక పోయినవారం రానా కపూర్ను వారం కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ యాంటీ కరప్షన్ బ్యూరో కోర్టును కోరిన విషయం తెలిసిందే. కపూర్, ఆయన భార్య బిందు, అవంత రియాలిటీ లిమిటెడ్ గౌతమ్ థారప్లు.. 685 కోట్ల ఆస్తుల్ని కేవలం 375 కోట్ల ఆస్తుల ట్రాన్జాక్షన్ చూపించడాన్ని ఇల్లీగల్గా పేర్కొంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. రాణా కపూర్తో పాటుఆయన భార్య, ముగ్గురు కుమార్తెలపై ప్రస్తుతం మనీలాండరింగ్ కేసు నడుస్తోంది. -
మనవడితో బామ్మ నాగిని డాన్స్ .. ఇరగదీసింది అంటున్న నెటిజన్స్
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఫోటో, వీడియో వైరల్ అవుతూనే ఉంటాయి. మన కంటెంట్లు నెటిజన్లను ఆకట్టుకుంటే చాలు విపరీతంగా లైకులు, కామెంట్లు .. అంతెందుకు ఒక్కో సారి మిని సెలబ్రిటీ కూడా అయిపోవచ్చు. తాజాగా తన మనవడితో ఓ బామ్మ సరదాగా వేసిన స్టెప్పులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా పిల్లలకి వాళ్ల తాతయ్య, అమ్మమతో ఉండే చనువు, ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కంటెంట్ క్రియేటర్ అయిన అంకిత్ జాంగిద్ కొన్ని రోజుల క్రితం తన బామ్మతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. అందులో ఓ వృద్ధురాలు తనదైన స్టైల్లో చిందులు వేసింది. మనవడు తన టైని ఫ్లూట్లా పట్టుకుని ఊదుతుంటే.. బామ్మ నేనెందుకు సైలెంట్గా ఉండాలనుకుందో ఏమో తన అరచేతిని నాగుపాము పడగలా పెట్టి నాగిని స్టెప్పులతో అదరగొట్టింది. ప్రస్తుతం సోషల్మీడియాలో ఈ వీడియో వైరల్గా మారి హల్చల్ చేస్తోంది. ఆ వీడియోకి.. ‘మా దాదీలో నా సోల్మేట్ కనపడుతోంది’ క్యాప్షన్ ఇచ్చాడు.పోస్ట్ చేసిన తక్కువ వ్యవధిలోనే ఈ వీడియో లైకులు, కామెంట్లతో నెట్టింట దూసుకుపోతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు బామ్మ డాన్స్ భలే అంటూ కామెంట్ చేయగా, మరి కొందరు హార్ట్ ఈమోజీ పెడుతున్నారు. View this post on Instagram A post shared by ◻️▪️Ankit Jangid▪️◻️ (@ankitjangidd) -
అమ్మమ్మే కడతేర్చింది..!
సంగారెడ్డి అర్బన్: కూతురుకు రెండో వివాహం చేయడం కోసం ఏడాదిన్నర వయసున్న మనవడిని చెరువులోకి తోసి హత్య చేసింది ఓ అమ్మమ్మ. ఈ ఘటన సంగారెడ్డి పట్టణంలో శుక్రవారం కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. సంగారెడ్డిలోని రాజంపేటకాలనీకి చెందిన నాగమణి తన కూతురు సుజాత మనవళ్లు మహేష్, జశ్వంత్లతో నివాసముంటోంది. సుజాత భర్త రెండేళ్ల క్రితం మృతి చెందడంతో తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో పుల్కల్ మండలం బద్రిగూడెంకు చెందిన జనార్దన్తో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. చెరువులో తోసి ఏమీ తెలియనట్లు.. తనను పెళ్లి చేసుకోవాలని సుజాత.. జనార్దన్పై ఒత్తిడి తెచ్చింది. అయితే పెద్ద కుమారుడిని ఎవరైనా దత్తత తీసుకుంటారని, ఏడాదిన్నర ఉన్న చిన్న కుమారుడిని ఎలాగైనా వదిలించుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కూతురు పెళ్లికి చిన్నారిని అడ్డు తొలగించాలని నాగమణి నిర్ణయించుకుంది. చిన్నారిని వెంట తీసుకుని వెళ్లి బొబ్బలికుంట చెరువులో తోసేసింది. బాలుడు ఊపిరి ఆడక మృతిచెందాడు. బాలుడు అదృశ్యమయ్యాడని ఈ నెల 29న పోలీస్లకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో అమ్మమ్మే నింది తురాలని తేలింది. నాగమణితోపాటు సుజాతను, జనార్ధన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు -
విషాదం: మనవడిని కాపాడబోయి..
సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో మనవడు పడిపోగా కాపాడబోయి తాత కూడా మృతి చెందిన ఘటన మహా ముత్తరాం మండలం బోర్లగూడెం నర్సింగాపూర్ శివారులో జరిగింది. స్థానికుల కథనం.. ప్రకారం మృతులు భీముని భూమయ్య (58), భీముని రిషీ (10) నర్సింగాపూర్ కు వెళ్లి వస్తుండగా చెరువు వెనుక ఉన్న వారి పొలానికి వెళ్తూ నీటిలో నుంచి చెరువు దాటే ప్రయత్నం లో మనువడు ఒక్కసారిగా నీట మునిగిపోయాడు. దీంతో అతన్ని కాపాడే ప్రయత్నంలో భూమయ్య కూడా నీటమునిగి మృత్యువాత పడ్డాడు. చెరువు మరమ్మతులో భాగంగా గత నెలలో జేసీబీలతో మట్టిని తవ్వడం వల్ల లోతైన గుంటలు ఏర్పడంతో నే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. నిత్యం అదే చెరువులో చేపలు పడుతూ గత 25 సంవత్సరాలుగా చెరువు కట్టపైనే మంచెవేసుకుని ఉండే భూమయ్య కు ఆ చెరువులో ఎక్కడ లోతు ఉందో ఎక్కడ ఏముందో తెలిసిన అతను నీటిలో మునిగి మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భూమయ్య కొడుకు రవి గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుని కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. చదవండి: 16 ఏళ్ల నిర్లక్ష్యం.. పోయిన ప్రాణం -
దారుణం: మనవడిని రోకలిబండతో కొట్టి..
బేస్తవారిపేట (ప్రకాశం జిల్లా): వ్యసనాలకు బానిసైన మనవడిని తాత హత్య చేశాడు. ఈ సంఘటన బేస్తవారిపేట మండలంలోని ఖాజీపురంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. పూనూరు చిన్న వెంకటరెడ్డి, వరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రాఘవేంద్రరెడ్డి(20) గత మూడేళ్లుగా హైదరాబాద్లోని ఓ ప్రెవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో ఆరు నెలల క్రితం సొంత గ్రామానికి వచ్చాడు. అయితే తరుచూ మద్యం సేవిస్తూ, పేకాటాడుతూ నిత్యం డబ్బుల కోసం కుటుంబసభ్యులను వేధిస్తున్నాడు. (చదవండి: నన్ను కాపాడి నువ్వెళ్లిపోయావా..) ఈ క్రమంలో డబ్బులు ఇవ్వాలని కుటుంబసభ్యులపై ఒత్తిడి ఎక్కువ చేశాడు. నా ఆస్తి వాటా పంచి ఇస్తే కారు కొనుక్కోని బాడుగకు తిప్పుకుంటానని, ఇవ్వకపోతే చంపుతానని బెదిరింపులకు దిగాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో పడుకుని ఉన్న సమయంలో రాఘవేంద్రరెడ్డి జేజీనాయన పూనూరు పెద్ద ఓసూరారెడ్డి రోకలిబండతో కొట్టి హతమార్చాడు. హత్య చేసిన అనంతరం ఇంట్లో నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న గిద్దలూరు సీఐ యు సుధాకరరావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సీఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: విషాదం: వివాహమైన 28 రోజులకే..) అవాక్కైన గ్రామస్తులు.. ప్రతి కుటుంబంలో పిల్లలతో గొడవలు ఉంటాయి. అంతమాత్రానికే మనువడిని హత్య చేయడంపై గ్రామస్తులు విస్మయం చెందుతున్నారు. హత్య చేయడానికి వేరే కారణాలు ఏమైనా ఉండవచ్చునని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
విషాదం: నాయనమ్మ వెంటే మనవడు..
ఎస్.కోట రూరల్: ఎస్.కోట పట్టణంలోని గౌరీశంకర్ కాలనీలో ఓ ఇంట విషాదం నెలకొంది. శుక్రవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో కాలనీకి చెందిన వెదురుపల్లి కాసులమ్మ (90) అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతిచెందింది. ఆమె మనుమడు దివ్యాంగుడైన వెదురుపర్తి వీరాచారి (45) శుక్రవారం ఉదయం నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నాడు. శనివారం ఉదయం 6 గంటలకు ఆయన నిద్ర లేచేసరికి మీ నాయనమ్మ మృతిచెందిందని భార్య కామాక్షి తెలిపింది. అంతే.. ఆయన గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచారు. గంటల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. కరోనా భయంతో వీరిద్దరి మృతదేహాలను శ్మశానానికి తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పోలీసులకు సమాచారమిస్తే.. పంచాయతీ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందికి తెలియజేయాలని, పంచాయతీ వారికి తెలియజేస్తే కాంట్రాక్టు పారిశుద్ధ్య సిబ్బంది సమ్మెలో ఉన్నారని, పర్మినెంట్ సిబ్బందిలో ఏడుగురు మహిళలేనంటూ జవాబిచ్చినట్టు మృతుల కుటుంబ సభ్యులు వాపోయారు. చివరకు మృతుని బంధువుల్లో వైద్యశాఖలో పనిచేసే ఒక వ్యక్తి రెండు పీపీఈ కిట్లు తెప్పించి మృతదేహాలను బయటకు తీయించారు. ఇదే సమయంలో సమాచారం అందుకున్న తహసీల్దార్ ఎల్.రామారావు కాలనీకి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతదేహాలను తోపుడు రిక్షాలపై శ్మశాన వాటికకు తరలించారు. దగ్గరుండి దహనసంస్కారాలు పూర్తిచేయించారు. మృతుల కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని సచివాలయ ఏఎన్ఎంను ఆదేశించారు. రోడ్డున పడిన కుటుంబం పుట్టుకతో మూగ, చెముడుతో బాధపడుతున్న వీరాచారి టైలర్ వృత్తిలో కొనసాగుతున్నాడు. ఆయనకు భార్య కామాక్షి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటి వద్దనే మహిళలకు ఫ్యాషన్ డ్రెస్సులు కుడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తల్లి సంవత్సరం కిందటే మరణించింది. తండ్రి, తమ్ముడు ఆనంద్, వీరాచారి కుటుంబాలు ఒక ఇంట్లోనే నివసిస్తున్నాయి. వీరాచారి మరణంతో కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోయామంటూ మృతుని భార్య కామాక్షి బోరున విలపిస్తోంది. -
తాతా–మనవడు
తాతకు మనవడు దగ్గులు నేర్పించకూడదు కానీ జిమ్లో వర్కవుట్ ఎలా చేయాలో నేర్పించవచ్చు. ఇక్కడ ఫొటోలో ఉన్నది అదే. 77 ఏళ్ల అమితాబ్ బచ్చన్ ఈ వయసులో కూడా ఆరోగ్యానికి ముఖ్య ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇంట్లో ఉన్న జిమ్లో వ్యాయామాలు తప్పక చేస్తారు. లాక్డౌన్ వేళ అందరూ బద్దకంగా ఉండకుండా వ్యాయామాలు చేయమని పిలుపు ఇచ్చారాయన. ఇప్పుడు తన మనవడు అగస్త్య నందాతో వ్యాయామం చేస్తూ అద్దంలో తామిద్దరి ప్రతిబింబాన్ని చూస్తూ సెల్ఫీ తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అంతేకాదు ‘ఫిట్నెస్ కోసం ఫైట్ చేద్దాం... ఫైట్ చేసి ఫిట్నెస్ సాధిద్దాం’ అని క్యాప్షన్ రాశారు. తాత స్లీవ్లెస్ టీ షర్ట్ ధరించి ఉంటే మనవడు తన టీ షర్ట్ను తాతకు సమానంగా భుజాల దగ్గర మడిచాడు. శ్వేతాబచ్చన్ నందా– నిఖిల్ నందాల కుమారుడు అగస్త్య. శేతా బచ్చన్కు నవ్య అనే కుమార్తె కూడా ఉంది. ఇక కొడుకు అభిషేక్– కోడలు ఐశ్వర్యల ద్వారా అమితాబ్కు మనవరాలు ఆరాధ్య ఉన్న సంగతి తెలిసిందే. -
బీజేపీ ఎమ్మెల్యే మనవడు కారుతో బీభత్సం
సాక్షి, బళ్లారి: దావణగెరె ఉత్తర అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఏ.రవీంద్రనాథ్ మనుమడి కారు దూసుకెళ్లడంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆ తర్వాత ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన ఆదివారం రాత్రి దావణగెరె శివారులోని శామనూరులో చోటు చేసుకుంది. అరుణ్కుమార్ కారును వేగంగా నడుపుకుంటు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహాని వాటిల్లలేదు. కాగా ప్రమాదంపై ప్రశ్నించిన వారిపై అరుణ్కుమార్ దాడికి ప్రయత్నించారని చెబుతున్నారు. స్థానికులు ఆగ్రహించడంతో కారును వదిలి అరుణ్కుమార్ పరారయ్యాడు. స్థానికులు అరుణ్కుమార్ ఇక్కడకు రావాల్సిందేనని కొద్దిసేపు పట్టుపట్టారు. కారును తొలగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న వేళ కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఘటనపై విద్యానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
బామ్మ ఇంటికే కన్నం .. నిందితుడి అరెస్ట్
మల్కాజిగిరి: అనారోగ్యంతో ఉన్న వృద్ధురాలికి తోడుగా ఉంటాడని దూరపు బంధువుని ఇంట్లో ఉంచితే (వరుసకు మనువడు) ఆ ఇంటికే కన్నం వేసాడో యువకుడు. మల్కాజిగిరి డివిజన్ డీసీసీ రక్షితా మూర్తి, ఏసీపీ నర్సింహారెడ్డి తెలిపిన మేరకు.. ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడ జయేంద్రనగర్కు చెందిన ఈగలపాటి ప్రవీణ్ కుమార్ అలియాస్ పండు(30) తండ్రితో కలిసి రైస్మిల్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మౌలాలి ఎస్పీనగర్కు చెందిన బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగి దొరైస్వామి వృద్ధురాలైన తన పిన్ని సరస్వతికి ఆరోగ్యం బాగాలేపోవడంతో బంధువైన ప్రవీణ్కుమార్ను తీసుకొని వచ్చి కేర్కేటర్గా ఏర్పాటు చేశాడు. దొరైస్వామి కుమారుడి వివాహం వచ్చే నెల 7వ తేదీ ఉండడంతో పెండ్లి పత్రికలు పంచేసమయంలో ఆయన భార్య విజయలక్ష్మి తన బంగారు నగలను సరస్వతి వద్ద ఉంచింది. వ్యవనాలకు అలవాటైన ప్రవీణ్కుమార్ వృద్ధురాలి ఇంట్లో బంగారు ఉండడాన్ని గమనించాడు. సుమారు 14 తులాలు కాజేసి ఊరికి వెళ్లి తిరిగి వచ్చి ఏమి తెలియనట్లు పనిచేస్తున్నాడు. ఈ నెల 16న సరస్వతి వద్దకు వెళ్లి నగలు తీసుకోవాలని బీరువాలో చూస్తే నగలు కనిపించలేదు. ఈ సంఘటన పై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు గురువారం ఎస్పీనగర్లో ప్రవీణ్కుమార్ను అరెస్ట్ చేసి అతని వద్ద 10.7 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఆభరాణాల గురించి దర్యాప్తు చేస్తున్నామని డీసీసీ, ఏసీపీలు తెలిపారు. కేసు తొందరగా ఛేదించిన ఇన్స్పెక్టర్ మన్మోహన్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జగదీశ్వర్, పోలీస్కానిస్టేబుల్స్ రాఘవేంద్ర, శ్రీధర్,కుమారస్వామిలను డీసీసీ,ఏసీపీలు అభినందించారు. -
మనవడి పాట...బామ్మ ఆట
టిక్టాక్... టాక్ ఆఫ్ ది జనం అయిపోయింది. అందులో వీడియోలు చేస్తూ.. చూస్తూ యూత్ ఎంత వినోదాన్ని ఆస్వాదిస్తున్నారో సీనియర్ సిటిజన్సూ అంతే ఆనందిస్తున్నారు. ఇప్పటిదాకా యూట్యూబ్ వంటల చానల్స్ నిర్వహించే అమ్మలు, బామ్మలతోపాటు గ్రాండ్పాస్నూ చూశాం. ఇప్పుడు టిక్టాక్లో కూడా వాళ్ల ఎంట్రీ మొదలైంది. తమిళనాడుకు చెందిన 75 ఏళ్ల ‘చెళ్లాం’ వాళ్లకు ప్రతినిధి. మనవడు అక్షయ్ పార్థతో కలిసి హిందీ, తమిళం, ఇంగ్లిష్, మలయాళం మొదలైన భాషలన్నిట్లో పాటలతో టిక్టాక్ వీడియోలు చేస్తోంది ఈ మామ్మ. నిజానికి నటన అనేది మనవడైన అక్షయ్ పార్థ హాబీ. మామ్మకూ ఆట, పాట మీదున్న ఆసక్తి చూసి టిక్టాక్ వీడియోలకు ఆమెను ఒప్పించాడట. ఏ భాషలో ఏ పాటకైనా మనవడితో పోటీపడి మరీ నటిస్తోంది మామ్మ. వీళ్లకు పదిహేను లక్షల పైచిలుకు అభిమానులున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు వీళ్ల యాక్టింగ్ పట్ల టిక్టాక్ వీక్షకులకున్న క్రేజ్.. వీళ్ల వీడియోలకున్న డిమాండ్ను! ‘‘ఇంతమంది చూస్తున్నారంటే సంతోషంగా అనిపిస్తుంది. ఇంట్లో ఏ కొంచెం బోర్ కొట్టినా పది నిమిషాలు వీడియో చేసేసి మళ్లీ నా పనిలో పడిపోతా. దీన్ని నా మనవడు పరిచయం చేసినప్పటి నుంచి నాకు భలే టైమ్పాస్ అవుతోంది. చిన్నప్పుడు డ్యాన్స్ చేసిన రోజులు గుర్తొస్తున్నాయి. మా వీడియోలను చిన్నాపెద్దా అందరూ చూసి ఆనందిస్తున్నారంటే అంతకన్నా సంతోషం ఇంకేం ఉంటుంది. అయితే పిల్లలూ.. జాగ్రత్త. కేవలం ఎంటర్టైన్మెంట్కే అయితే టిక్టాక్ కాని యూట్యూబ్ కాని.. ఇంకే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా ఓకే. కాలక్షేపానికి చూడండి.. వదిలేయండి. అక్కడితో దాన్ని మరిచిపోండి. అంతేకాని దాన్నో వ్యసనంలా మార్చుకోవద్దు. మీది చదువుకొని.. మంచి విషయాలు.. నేర్చుకోవాల్సిన సమయం. మీ దృష్టిని వాటిమీదే పెట్టండి. ఇలాంటివన్నీ టైమ్పాస్కే. ఆడుకోండి.. ఆటల్లో భాగంగానే కాసేపు ఇలాంటివి చూడండి అంతే’’ అని పిల్లలకు సందేశం ఇస్తుంది చెళ్లాం మామ్మ. -
దేవెగౌడ మనవడిపై హత్యాయత్నం కేసు
బెంగళూరు: కర్ణాటకలో గురువారం 15 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో జేడీఎస్కు షాక్ తగిలింది. నలుగురు బీజేపీ కార్యకర్తల మీద హత్యాయత్నం చేశారంటూ మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు సూరజ్ రేవన్నపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. హసన్ జిల్లాలోని చన్నరాయపట్న పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. జేడీఎస్ నుంచి బీజేపీలోకి మారిన కార్యకర్తల ఇళ్లపై దాదాపు 150–200 మంది వచ్చి దాడి చేశారని, ఆస్తులను ధ్వంసం చేశారని బీజేపీ ఆరోపించింది. గాయపడిన తమ కార్యకర్తలను ఆస్పత్రికి తరలించామని చెప్పారు. సరైన సమయానికి పోలీసులు రాకపోయి ఉంటే పరిస్థితి మరింత చేజారేదని అన్నారు. దీంతో సూరజ్ సహా ఆరు మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఆరోపణలను జేడీఎస్ ఖండించింది. -
నిజాం వారసత్వాన్ని కాపాడండి
సాక్షి, హైదరాబాద్ : నిజాం చారిత్రక కట్టడం గౌలిగూడ బస్ స్టేషన్ ఒక్క సారిగా కుప్పకూలడంపై న్యాయ విచారణ జరిపించాలని ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు నజాఫ్ అలీఖాన్ సీఎం కేసీఆర్ను కోరారు. బస్ స్టేషన్ కూలిపోవడంపై పలు అనూమానాలు వ్యక్త మవుతున్నాయి, దానిపై విచారణ జరిపించాలని కేసీఆర్కు ఆదివారం లేఖ రాశారు. హైదరాబాద్లోని నిజాం అస్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పలు ఆస్తులు నగరం నుంచి అదృశ్యమవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర గల ఉస్మానియా ఆసుపత్రి, ఛాతీ ఆసుపత్రిను కూల్చీ వేయాలని ప్రభుత్వం భావిస్తోందని, చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లేఖలో తెలిపారు. హైదరాబాద్ సందర్శనకు వచ్చిన వారికి హైటెక్ సిటీ లాంటివి కాదని, తెలంగాణ సంస్కృతి, చారిత్రక కట్టడాలే చూపించాలని పేర్కొన్నారు. గౌలిగూడ బస్ స్టేషన్ కూలీపోవడంపై పలు అనూమానాలు వ్యక్తమవుతున్నా విషయం తెలిసిందే. 90 ఏళ్ల క్రితం మూసీ నది ఒడ్డున నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గౌలిగూడ బస్ స్టేషన్ నిర్మించారు. 1994లో మహాత్మ గాంధీ బస్టాండ్ నిర్మించడంతో ప్రస్తుతం దానిని సిటీ బస్ స్టేషన్ (సీబీఎస్)గా ఉపయోగిస్తున్నారు. నిజాం స్మారక చిహ్నాలను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్ఐఎమ్ ఛీప్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేసీఆర్ను కోరిన విషయం తెలిసిందే. -
తరలి వచ్చిన అతిరథ మహారధులు
-
గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం
-
కరుణ బౌలింగ్.. మునిమనవడి బ్యాటింగ్!
సాక్షి, చెన్నై: అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన డీఎంకే అధినేత కరుణానిధి కోలుకుంటున్నారు. మునిమనవడితో క్రికెట్ ఆడుతున్న వీడియో గురువారం వెలుగులోకి వచ్చింది. ఇందులో కరుణానిధి బౌలర్ అవతారం ఎత్తారు. రెండు రోజుల క్రితం కరుణానిధి కొడుకులో ఒకరైన ముక్కా తమిళరసు తన మనవడు ముగిలన్(2)తో గోపాలపురం వచ్చారు. దీంతో కుటుంబసభ్యులంతా కలసి కరుణానిధితో ఆనందాన్ని పంచుకుంటూ క్రికెట్ ఆడారు. -
నగరానికి వచ్చిన నిజాం వారసుడు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సంస్థానాన్ని 224 ఏళ్లు పాలించిన ఆసిఫ్జాహీల చివరి పాలకుడు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు ప్రిన్స్ ముఖఫంజా బహదూర్ లండన్ నుంచి నగరానికి వచ్చారు. ఇటీవల జరిగిన ప్రిన్సెస్ ఈసెన్ స్కూల్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలతో పాటు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తాజ్ బంజారాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. పేద అమ్మాయిల కార్పొరేట్ స్థాయి విద్య కోసం పాతబస్తీలో ప్రిన్సెస్ ఈసెన్ గ్రూప్ ఆఫ్ స్కూల్ విద్యా సంస్థలను నడిపిస్తున్నారు. దీనికి ఆయన చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఏటా రూ. 28 లక్షల స్కాలర్షిప్లు ఇచ్చి పేద అమ్మాయిలను చదివిస్తున్నారు. -
తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్లో విషాదం
ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మనవడు (కుమార్తె చరిత కొడుకు) సాకేత్ రామ్ వెల్లంకి(19) మంగళవారం అమెరికాలో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు అమెరికాలోని వర్జీనియా, మనస్సాస్లో జూలై 5న నిర్వహించనున్నారు. సాకేత్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. వెల్లంకి కుటుంబానికి ప్రవాసులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేపు వర్జీనియాలో నిర్వహించనున్న కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగు వారు హాజరు కానున్నారు. -
బ్రహ్మీకి ప్రమోషన్ వచ్చిందోచ్
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు, హాస్యబ్రహ్మ బ్రహ్మానందానికి ప్రమోషన్ లభించింది. అనేక సినిమాల్లో తనదైన హావభావాలు, నటనతో హాస్యం పడించి, అటు ప్రేక్షకులను అభిమానాన్ని, ఇటు అనేక రివార్డులు, అవార్డులను సొంతం చేసుకున్న బ్రహ్మీ వ్యక్తిగత జీవితంలో మరో కీలకమైన మెట్టు ఎక్కారు. అదే.. తాతయ్య అయ్యారు. దీంతో బ్రహ్మానందం కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. బ్రహ్మానందం కుమారుడు గౌతమ్- జ్యోత్స్న దంపతులకు మంగళవారం మగబిడ్డ జన్మించాడు. హనుమాన్ జయంతి కావడంతో పండగ రోజు ఇంట్లో సంతోషం వెల్లివిరిసిందని.. మనవడి రాకతో ఇల్లు కళకళలాడుతోందని బ్రహ్మానందం తన ఆనందాన్ని కుటుంబసభ్యులు, బంధువులతో పంచుకున్నారు. పండుగ రోజున, ఆనందం తమ సంతోషం రెండింతలు అయిందనీ, ప్రతి ఒక్కరితో ఈ సంతోష వార్తను పంచుకునేందుకు ఆనందంగా ఉందన్నారు. జ్యోత్స్న , బాబు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని బ్రహ్మానందం తెలిపారు. అలాగే గౌతమ్ తండ్రిగా మారడం ఆనందంగా ఉందన్నారు. అన్నట్టు మనవడికి అన్నీ తాత పోలికలేనట. కాగా పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో హీరోగా టాలీవుడ్లో తెరంగేట్రం చేసిన గౌతమ్ అంతగా ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ప్రస్తుతం మను అనే ఫిల్మ్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
తాతను నరికేసిన మనవడు..!
కోటా(రాజస్థాన్): ఓ చిన్నపాటి వివాదం కారణంగా ఓ వృద్ధుడిని అతడి కొడుకు, కోడలు, మనవడు కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన గుమాన్పురా పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. కోటారి - గోవర్దన్పూర్ ప్రాంతానికి చెందిన దేవీలాల్ ప్రజాపత్(70), అతని కుమారులు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. పెద్ద కొడుకు తన పోర్షనులోకి నీటి పైపు వేయాల్సి వచ్చింది. తన పోర్షన్ నుంచి దానిని వేసేందుకు దేవీలాల్ అభ్యంతరం చెప్పాడు. దీనిపై సోమవారం సాయంత్రం పెద్ద కుమారుడితో గొడవ జరిగింది. ఆయనకి భార్య, కుమారుడు తోడయ్యారు. అంతా కలిసి వృద్ధుడిని ఇంటి బయటకు లాగేశారు. అనంతరం కుమారుడు, కోడలు ప్రజాపత్ చేతులను పట్టుకోగా మనవడు కత్తితో అతని మెడపై నరికాడు. ఘటన అనంతరం ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న ప్రజాపత్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. ప్రజాపత్ మరో కుమారుడు చేసిన ఫిర్యాదు మేరకు నిందితుల కోసం గాలింపు చేపట్టామని గుమాన్పురా ఎస్సై హన్స్రాజ్ తెలిపారు. -
శుభకార్యానికి వెళ్లి వస్తూ తిరిగి రాని లోకాలకు..
ఇసుక ట్రాక్టర్ ఢీకొని అమ్మమ్మ, మనుమడు మృతి బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తూ మరికొద్ది సేపట్లో ఇంటికి చేరిపోతామని అనుకుంటున్న తరుణంలో వారిని మృత్యువు కబళించింది. అప్పటి వరకూ తమతో సంతోషంగా గడపిన వారు ఇక లేరని తెలిసి ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. అందివచ్చిన కొడుకు మృత్యువాత పడడంతో ఆ తల్లి కన్నీరుమురువుతోంది. ఆమెను ఆపడం ఎవరితరం కావడం లేదు. - కిర్లంపూడి (జగ్గంపేట) ఇసుక ట్రాక్టర్ ఢీకొని అమ్మమ్మ, మనుమడు మృతి చెందిన సంఘటన కిర్లంపూడి మండలం గెద్దనాపల్లి గ్రామ శివారున శుక్రవారం జరిగింది. దీనికి సంబంధించి కిర్లంపూడి ఎస్సై ఎ.బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని శృంగరాయునిపాలెం గ్రామానికి చెందిన కర్రి చిట్టమ్మ(70), మనుమడు ఉల్లి మణి(25)తో కలిసి ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి గృహప్రవేశానికి వెళ్లి మధ్యాహ్నం తిరిగి వస్తుండగా గెద్దనాపల్లి శివారుకు వచ్చేప్పటికి గెద్దనాపల్లి నుంచి కిర్లంపూడి వైపు వెళుతున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో చిట్టెమ్మ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మనుమడు ఉల్లి మణిని ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జగ్గంపేట ఎస్సై ఆలీఖాన్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. గ్రామంలో విషాదఛాయలు ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో అమ్మమ్మ, మనుమడు మృతి చెందడంతో శృంగరాయునిపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని చలించిపోయారు. మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. సర్పంచ్ వనపర్తి విశాలాక్ష్మి, ఎంపీటీసీలు బొజ్జపు నాగేశ్వరరావు, గూడెపు ఆదినారాయణ, గ్రామ పెద్దలు గొడే బాల, పి.సత్యానందం మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతురాలి సోదరుడు ముక్కా జగదీశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కిర్లంపూడి ఎస్సై ఎ.బాలాజీ చెప్పారు. -
బీహార్ మాజీ సీఎం మనవడు అరెస్ట్
-
వివాహ వైభవం
-
అక్కడ వితంతువులే ఉండరు!
బెహంగాః ప్రాంతాన్నిబట్టి గిరిజన తెగల్లో ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగుతుంటాయి. అయితే మధ్యప్రదేశ్ లోని గోండ్ల లో కనిపించే సంప్రదాయం మాత్రం విభిన్నంగా కనిపిస్తుంది. కుటుంబంలోని మహిళకు భర్త చనిపోతే ఆమె జీవితాంతం వితంతువుగా ఉండాల్సిన అవసరం వారి తెగల్లో ఉండదు. భర్త చనిపోయిన పదోరోజు కుటుంబంలోని పెళ్ళికాని ఏ యువకుడైనా తిరిగి ఆమెను పెళ్ళి చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు వారి సంప్రదాయం ప్రకారం భర్త కావడానికి మనుమడుకి కూడ అర్హత ఉంటుంది. మధ్యప్రదేశ్ మండ్లా జిల్లాలోని గోండ్లలో కనిపించే ప్రత్యేక సంప్రదాయంతో, వారి తెగల్లో మహిళలు వితంతువులుగా మిగిలిపోయే అవకాశం ఉండదు. భర్త చనిపోయిన పది రోజుల్లోగా ఆ మహిళను వారి కుటుంబంలోని పెళ్ళికాని ఏ యువకుడైనా తిరిగి వివాహమాడొచ్చు. కనీసం ఆమెకు మనుమడు వరుస అయ్యే వాడు కూడ నాయనమ్మను, లేదా అమ్మమ్మను పెళ్ళి చేసుకునేందుకు అర్హత ఉంటుంది. ఒకవేళ కుటుంబ సభ్యుల్లో ఎవ్వరూ లేనప్పుడు, లేదా అలా చేసుకునేందుకు ఇష్టపడని పక్షంలో, భర్త చనిపోయిన పది రోజులకు.. ఆమెకు సంఘంలోని పెద్దలు ప్రత్యేకంగా వెండి గాలులు చేయిస్తారు. పదో రోజు అనంతరం ఆ గాజులను ఆమెకు ఎవరు అందిస్తే వారిని పెళ్ళి చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ సంప్రదాయాన్ని 'పోటో' గా పిలుస్తారు. ఇదే నేపథ్యంలో 'పటిరం వర్కేడ్' పెళ్ళి కూడ జరిగింది. అతడికి ఆరేళ్ళ వయసున్నపుడు అతడి తాత మరణించడంతో తొమ్మిదవరోజున పటిరం.. 'నాటి పాటో' సంప్రదాయంలో భాగంగా తన నాయనమ్మ చమ్రీబాయ్ ని పెళ్ళి చేసుకున్నాడు. అలా సంప్రదాయ బద్ధంగా ఆ వితంతు మహిళకు పెళ్ళి అయితే... తిరిగి ఆ దంపతులు... భార్యాభర్తలుగా సంఘంలో జరిగే అన్ని కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. నేను ఇతర అమ్మాయినే పెళ్ళి చేసుకుందాం అనుకున్నానని, అయితే తమ సంప్రదాయంలో భాగంగా, కుల పెద్దల నిర్ణయంతో మైనర్లు పెద్ద వారిని చేసుకునే అవకాశం ఉండటంతో తన నాయనమ్మను పెళ్ళి చేసుకొన్నానని బెహంగా గ్రామంలో నివసించే 42 రెండేళ్ళ పటిరం చెప్తున్నాడు. అయితే ఐదేళ్ళ క్రితం తన నాయనమ్మ మరణించే వరకూ తన భార్య రెండో భార్య హోదాలో కొనసాగేదని వివరించాడు. గోండ్ల ప్రత్యేక సంప్రదాయంలో జీవిత భాగస్వాముల మధ్య తీవ్ర వయోబేధం ఉన్నపుడు ఎటువంటి భౌతిక సంబంధాలు ఉండవు. అయితే సంఘంలో వారు గౌరవ మర్యాదలను పొందేందుకు, సాన్నిహిత్యంతో ఉండేందుకు ఈ ప్రత్యేక సంస్రదాయం సహకరిస్తుంది. 75 ఏళ్ళ సుందరో బాయి కుర్వాతి కూడ పెళ్ళయిన రెండేళ్ళకే తన భర్త చనిపోవడంతో 'దేవర్ పాటో' సంప్రదాయంలో భాగంగా అప్పట్లో ప్రస్తుతం 65 ఏళ్ళున్న తన మరిదిని వివాహమాడింది. భర్త చనిపోయిన సమయంలో అతడు తనను పెళ్ళాడేందుకు ఇష్టాన్ని చూపించలేదని, దాంతో తనను సంఘ పెద్దలు శుభకార్యాలకు అనుమతించే వారు కాదని, అనంతరం రెండేళ్ళ తర్వాత అతడు నన్ను పెళ్ళాడటంతో పెద్దలు తిరిగి అన్నికార్యాలకూ హాజరయ్యేందుకు అంగీకరించారని, అప్పట్నుంచీ దశాబ్దాల కాలంగా తాము ఎంతో సంతోషంగా ఉన్నామని సుందరో బాయి చెప్తోంది. అలాగే తనకంటే ఐదేళ్ళు పెద్దదైన వదినగారిని పెళ్ళాడానని 55 ఏళ్ళ కృపాల్ సింగ్ చెప్తున్నారు. అయితే కొందరు మహిళలు భర్త చనిపోయినప్పటికీ, తిరిగి వివాహం చేసుకోకుండానే వితంతువుగా కాక వివాహితగా కొనసాగేందుకు పెద్దలనుంచి అనుమతి తీసుకుంటారు. అటువంటి వారిలో 28ఏళ్ళ భాగ్వతి ఒకరు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త చనిపోవడంతో ఆమె తిరిగి వివాహం చేసుకునేందుకు అంగీకరించలేదు. పాంచ్ పటో సంప్రదాయంలో భాగంగా ఆమె వివాహితగా కొనసాగేందుకు సంఘ పెద్దలనుంచి అనుమతి తీసుకుంది. ఎంత పెద్ద చదువులు చదువుకున్నా గోండ్లు తమ సంప్రదాయాలు పాటిస్తారని, ఒక్క తమ గ్రామంలోనే కాక, భోపాల్ లోని భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేస్తున్నఇద్దరు ఇంజనీర్లు సైతం తమ దేవర్ పాటో సంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకున్నారని ట్రైబల్ లీడర్ గుల్జార్ సింగ్ మర్కమ్ తెలిపారు. ఈ వివాహ వ్యవస్థ మా సంస్కృతిలో భాగమని, నాటీ పాటో వివాహంలో నాయనమ్మను పెళ్ళి చేసుకున్న పిల్లలు ఆమెతో ఆడుకోవడం కనిపించడం సాధారణమని గుల్జార్ తెలిపారు. అయితే నాటి పాటోలో నాయనమ్మను పెళ్ళాడిన మనుమడే కుటుంబ పెద్దగా ఉంటాడని వివరించాడు. -
సచివాలయంలో సీఎం మనవడు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మనవడు, మంత్రి కె.తారకరామారావు కుమారుడు హిమాన్షు రాష్ట్ర సచివాలయంలో అడుగు పెట్టాడు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో కాన్వాయ్ కారులో సమత బ్లాక్కు వచ్చాడు. హిమాన్షు వెంట మరో ఇద్దరు తన మిత్రులున్నారు. సీ బ్లాక్లోకి వెళ్లి సీఎం చాంబర్తో పాటు అందులో ఉన్న ఉన్నతాధికారుల ఆఫీసులను చూసి వెనుదిరిగాడు. ముఖ్యమంత్రి, మంత్రి సచివాలయంలో లేని సమయంలో హిమాన్షు రావటం విశేషం. -
'ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి'
-
బామ్మను చంపిన మనవడు
గరివిడి (విజయనగరం జిల్లా) : కుటుంబకలహాల నేపథ్యంలో బామ్మను మనవడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన శనివారం సాయంత్రం విజయనగరం జిల్లా గరివిడి మండలం కాపుచంభాం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కాపుచంభాం గ్రామానికి చెందిన యడ్ల గొల్లబాబు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా తన బామ్మ యడ్ల నర్సమ్మ(63)తో శనివారం గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో గొల్లబాబు బామ్మను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం మండల పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
బంగారం కోసం అమ్మమ్మను నరికేశాడు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తాండూరులోని గాంధీనగర్లో శనివారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. బంగారం కోసం సొంత అమ్మమ్మను మనుమడు నరికి చంపాడు. అనంతరం నిందితుడు ధనరాజ్ పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు ధన్రాజ్పై కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కథనం ప్రకారం... ధనరాజ్ తల్లిదండ్రులను విడిచి అమ్మమ్మతో కలిసి తాండూరులో నివసిస్తున్నాడు. వ్యసనాలకు బానిస అయిన ధనరాజ్ తరచు నగదు కావాలని అమ్మమ్మను వేధించేవాడు. ఆ క్రమంలో నగలు కావాలని అమ్మమ్మను అడిగాడు. అందుకు ఆమె నిరకరించింది. దాంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో తాగిన మైకంలో ఉన్న ధన్రాజ్... అక్కడే ఉన్న గొడ్డలితో ఆమెపై దాడి చేసి... నరికాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. -
హత్య కేసులో మనవడే నిందితుడు
రంగారెడ్డి(పరిగి): ఈనెల 16న పరిగి మండలం గడిసింగాపూర్ రెవెన్యూ పరిధిలో వెలుగుచూసిన రామచంద్రయ్య(70) అనే వృద్ధుడి హత్య కేసును పరిగి పోలీసులు రెండురోజుల్లో ఛేదించారు. సొంత మనవడే తన తాతను హత్యచేశాడని పోలీసులు బట్టబయలు చేశారు. రాంచంద్రయ్యను హత్య చేసే అవసరం ఎవరికుందనే కోణంలో ఆరాతీశారు. ఇటీవల పలుసార్లు ఆయన తన మనవడు ఆంజనేయులతో గొడవపడ్డాడని తెలుసుకున్నారు. దీంతో ఆంజనేయులును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరుపగా హత్యానేరం అంగీకరించాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి శనివారం రిమాండుకు తరలించారు. -
హీరోగా చిత్తూరు నాగయ్య మనుమడు
తెలుగు తెర తొలి సూపర్స్టార్ చిత్తూరు వి. నాగయ్య సోదరుని మనుమడు దృహిణ్ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నారు. దృహిణ్, సుమ జంటగా శ్రీభక్త మార్కండేయ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రవీణ్ గోయల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. టి. రాము దర్శకుడు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. ఈ చిత్రం ముహూర్తపు షాట్కు సి.హెచ్. సంజీవయ్య కెమెరా స్విచాన్ చేయగా, సి.చిన్నారెడ్డి క్లాప్ కొట్టారు. చిత్తూరు నాగయ్య మనుమడిని హీరోగా పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ . -
సుబ్బిరామిరెడ్డి మనవడి నిశ్చితార్ధం
-
ఎస్ఎం కృష్ణ మనవడు అంటూ హల్చల్
రోడ్డుపై వాయువేగంతో వాహనాలు నడిపిన యువకులు వెంటాడిన పోలీసులు మూడు కార్లు స్వాధీనం పోలీసుల అదుపులో ఐదుగురు నా మనవడు కాదు : ఎస్ఎం కృష్ణ బెంగళూరు : కార్ల సెలైన్సర్ సౌండ్ పెంచి రోడ్లపై వాయు వేగంతో ప్రయాణిస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసిన ఐదుగురు యువకులను ఇక్కడి హైగ్రౌండ్స్ ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వీరిలో ఓ యువకుడు తాను మాజీ కేంద్ర మంత్రి ఎస్ఎం కృష్ణ మనవడూ అంటూ హల్చల్ చేశాడు. వివరాలు... ఆదివారం సాయంత్రం 5.30 గంటలు ఇక్కడి రేస్కోర్సు రోడ్డులో జాగ్వర్ కారు (కేఏ08-జెడ్ 99) సహా మూడు కార్లు వాయు వేగంతో ప్రయాణించాయి. వాటికి ఉన్న సెలైన్సర్ల సౌండ్ పెంచి భారీ శబ్ధం చేస్తూ వస్తున్న కార్లను చూసి వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో గుర్రపు రేసులకు వచ్చిన వారు రోడ్డుపైకి వచ్చారు. స్పందించిన ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఆపాలని సూచనలు చేశారు. అయితే అవి వాయువేగంతో వస్తుండటంతో వారు కూడా వెనకడుగు వేశారు. దీంతో పోలీసులు ఆ కార్లను వెంబడించారు. మూడు కార్లు రేస్కోర్సు రోడ్డులోని తాజ్ హోటల్లోకి ప్రవేశించాయి. పోలీసులు అక్కడికి చేరుకుని కౌసిక్, ఆదిత్యా రెడ్డి, విజయ్కుమార్తో సహ ఐదుగురిని గుర్తించారు. ఆ సమయంలో కౌసిక్ అనే అనే యువకుడు తాను కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ తనయుడని పోలీసులను బెదిరించాడు. వారితో గంటపాటు వాగ్వాదానికి దిగాడు. చివరికి పోలీసులు ఐదుగురు యువకులను హైగ్రౌండ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తీసుకు వ చ్చారు. అక్కడా వారు ఎవరెవరికికో ఫోన్లు చేసి పోలీసులకు ఇవ్వడానికి ప్రయత్నించారు. పోలీసు అధికారులు పూర్తి వివరాలు రాబట్టడానికి యత్నిస్తున్నారు. కౌసిక్ ఎవరో తెలియదు : ఎస్.ఎం. కృష్ణ కౌసిక్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని, తన మనవడు లండన్లో ఉన్నాడని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎమ్. కృష్ణ స్పష్టం చేశారు. తన పేరును దుర్వినియోగం చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అపరాధ రుసుం వసూలు ఈ కేసులో ట్రాఫిక్కు తీవ్ర ఆటంకం కలిగించిన ఒక్కొ వాహనానికి రూ. 900, పోలీసులతో దురుసు ప్రవర్తనకు ఒక్కొక్కరి నుంచి రూ. 2900 చొప్పును పోలీసులు అపరాధ రుసుం వసూలు చేశారు. -
సావిత్రి మనవడు హీరోగా ఎంట్రీ
-
మనవల కోసం ‘ఫండు’
ఆయనో రైతు. షేర్లు, మార్కెట్ల గురించి పెద్దగా తెలియదు. అందుకని నేరుగా షేర్లలో పెట్టుబడి పెట్టకపోయినా... ఆ షేర్లలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకున్నాడు. ఓ అడ్వయిజర్ను విశ్వసించాడు. 18 ఏళ్ల కిందట రూ. 5వేలతో మొదలుపెట్టి... ఇప్పటికీ ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఆ మొత్తం ఎన్నో రెట్లు పెరిగింది. తక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెడుతూ... దాన్ని వెనక్కి తీయకుండా మనవలకు ఆస్తిగా ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన చెబుతున్న ఇన్వెస్ట్మెంట్ స్టోరీ ఇది... నా పేరు ఎ.డి.రావు. మాది మహబూబ్నగర్ జిల్లా. రైతు కుటుంబం. నేనూ వ్యవసాయమే చేస్తుంటా. నాకు స్టాక్ మార్కెట్పై అంతగా అవగాహన లేదు. కాని మా బావమరిది వాళ్లంతా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. రైతును కావడంతో స్థిరమైన ఆదాయం లేదు. పంట ఎప్పుడు పండుతుందో... ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు. పెపైచ్చు భారీ మొత్తాలు ఇన్వెస్ట్ చేసే ఓపిక కూడా లేదు. డబ్బులున్నప్పుడు మాత్రమే ఎంతోకొంత వెనకేసుకోవాలి. ఇలా ఆలోచిస్తున్న తరుణంలో మ్యూచువల్ ఫండ్స్ గురించి నాకు తెలిసింది. వీటికైతే షేర్లలాగా అంతగా ఆలోచించాల్సిన పనిలేదు. పెపైచ్చు చిన్న మొత్తాలు ఇన్వెస్ట్ చేయడానికి అనువుగా ఉంటాయి. అందుకే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. తొలిసారి నేను 1995లో బిర్లాసన్లైఫ్-95 ఫండ్లో రూ.5,000 ఇన్వెస్ట్ చేశాను. ఆ మొత్తం ఇప్పటికీ వెనక్కి తీసుకోలేదు. ఈ 18 ఏళ్ళలో నేను ఇన్వెస్ట్ చేసిన రూ.5,000 కాస్త రూ.1,56,443కి చేరింది. ఆ ఫండ్పై వచ్చిన డివిడెండ్ను కూడా దాన్లోనే ఇన్వెస్ట్ చేయటం వల్ల ఆ మొత్తం లక్షన్నర దాటింది. 2008లో మార్కెట్లు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు ఈ విలువ రూ.1.80 లక్షలు దాటింది. అప్పుడు వెనక్కి తీసుకోలేదు. అలా తీసుకోనందుకు, ఇప్పుడు విలువ తగ్గినందుకు నాకేమీ బాధ లేదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు సహజం. కానీ ఈ మధ్య మార్కెట్లో నెలకొంటున్న తీవ్ర ఒడిదుడుకులు చూస్తుంటే కొంచెం ఆందోళనగానే ఉంది. అయినా ఇప్పటికీ ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. చేతిలో వెయ్యి లేదా రెండు వేలు ఉంటే చాలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాను. పదేళ్లుగా హైదరాబాద్లోని మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ పి.సతీష్ సూచనలు తీసుకుంటున్నాను. కేవలం ఈక్విటీ ఫండ్స్పైనే దృష్టిపెట్టాను. వివిధ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తగినంత పోర్ట్ఫోలియోను రూపొందించుకున్నాను. ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేయడమే తప్ప ఒక్క పైసా కూడా వెనక్కి తీసుకోలేదు. ఈ మొత్తాన్ని నా మనవళ్లకి ఆస్తిగా అందించాలన్నదే నా ఆశ. దీర్ఘకాలం వేచి చూస్తే ఈక్విటీలను మించి లాభాలను అందించే పథకం ఇంకోటి లేదని బలంగా నమ్మే వాళ్ళలో నేను ముందుంటాను. అలాగే ఈక్విటీలు, షేర్లలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ డబ్బులు ఉండాలని చాలామంది అపోహ పడతారు. చిన్న మొత్తాలతో కూడా సంపదను పోగేసుకోవచ్చనేది నా అభిప్రాయం. ఇన్వెస్టర్ స్టోరీ మీరు ఇన్వెస్టరా? మీరు మార్కెట్లో ఊహించని లాభాలు సంపాదించారా? లేక భారీ నష్టాలతో కుదేలయ్యారా? మంచో, చెడో... మీ కథ అందరికీ చెప్పాలనుకుంటున్నారా? మీ ఇన్వెస్ట్మెంట్ వివరాలను... ఫోటో, చిరునామాలతో మాకు పంపండి. చిరునామా: ప్రాఫిట్, సాక్షి తెలుగు దినపత్రిక 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నంబర్1, బంజారా హిల్స్ హైదరాబాద్-34 ఈ-మెయిల్: business@sakshi.com