gurukul school
-
గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు నేడు అర్హత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించనున్న అర్హత పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులా ల్లో ఐదోతరగతి ప్రవేశాలతో పాటు 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం ఈనెల 23న ప్రవేశ పరీక్ష జరగనుంది.రాష్ట్రవ్యాప్తంగా 446 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,67,649 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఐదో తరగతిలో 51,968 సీట్లున్నాయి. మిగిలిన తరగతుల్లో సొసైటీల వారీ గా ఖాళీలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నా యి. ప్రవేశ పరీక్ష వంద మార్కులకు ఉంటుంది. రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభా కర్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. -
మీ పిల్లలకు ఇలాగే వండి పెడుతున్నారా?
లంగర్హౌస్: ఇంట్లో మీరు తినే భోజనం ఇలాగే వండుకుంటారా? మీ పిల్లలకు ఇలాగే వండి పెడుతున్నారా? ఉడకని కూరగాయలకు తోడు అధికంగా మసాలాలు వేస్తే పిల్లల ఆరోగ్యాలు దెబ్బ తినవా? నాణ్యమైన భోజనం కోసం ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచినా సరైన మెనూ అందివ్వడానికి మీకు వచ్చిన కష్టం ఏమిటి? అంటూ పాఠశాల ప్రిన్సిపాల్తో పాటు సిబ్బందిని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. పిల్లల భోజనంపై ఇంత నిర్లక్షమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం లంగర్హౌస్ ఇబ్రహీంబాగ్లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ సొసైటీ పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. దుస్తులు, పాఠ్య పుస్తకాలు, ప్లేట్లు, ఇతర వస్తువులు సరిగా అందుతున్నాయా.. లేదా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బోధనపై విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం భోజనశాలను సందర్శించి విద్యార్థులకు అన్నం వడ్డించారు. విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం సైతం భోజనం పెట్టించుకున్నారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, గోల్కొండ తహసీల్దార్ అహల్యతో పాటు ఇతర అధికారులను కూడా విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని తినాలని సూచించారు. ఈ క్రమంలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి పొన్నం.. కూరలు నాణ్యతగా లేకపోవడాన్ని గుర్తించి నిర్వాహకులపై మండిపడ్డారు. టమాటాలు ముక్కలు చేయకుండా.. కనీసం కోయకుండా అలా మసాలాలో నేరుగా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భోజనం విషయంలో నాణ్యత పాటించకపోయినా.. నిర్లక్ష్యం వహించినా అందరూ బాధ్యులే అవుతారని ఆయన హెచ్చరించారు. మంచినీళ్లూ కరువేనా..? ఈ క్రమంలోనే మంత్రి మంచినీళ్లు కావాలని అడగడంతో అక్కడ ఉన్న గ్లాసులలోని నీరు ముట్టుకోనీయకుండా సిబ్బంది కాస్త ఆలస్యంగా బాటిళ్లు తెచ్చి ఇచ్చారు. ఇదేంటని మంత్రి అడగగా.. వాటర్ ఫిల్టర్ పని చేయడంలేదని నిర్వాహకులు తెలిపారు. అదే నీరు చిన్నారులకు ఇస్తున్నారంటే వారి ఆరోగ్యం, వారి ప్రాణాలపై మీకు బాధ్యత లేదా? అంటూ మరోసారి మండిపడ్డారు. వెంటనే ఫిల్టర్కు మరమ్మతులు చేయించాలని, భోజనాలలో కూడా మార్పులు రాకపోతే ఒక్కరు తప్పు చేసినా అందరినీ బాధుల్ని చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. -
భోజనం ఎలా ఉందమ్మా?
బీబీనగర్:బోజనం ఎలా ఉందమ్మా? కొత్త మెనూ ప్రకారం అన్నీ పెడుతున్నారా? సదుపాయాలు బాగున్నాయా?..’అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యార్థులను ఆరా తీశారు. వారితో కలిసి భోజనం చేశారు. ఆదివారం ఆయన వరంగల్ వెళుతూ మధ్యలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని బీసీ బాలికల గురుకులం, ఎస్సీ బాలికల హాస్టల్ను సందర్శించారు. తొలుత బీసీ బాలికల గురుకుల పాఠశాలకు వెళ్లారు. కొత్త మెనూ అమలు, వసతిగృహంలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ అడిగారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అరగంటకు పైగా అక్కడ గడిపారు. అనంతరం అదే ఆవరణలో ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్ను సందర్శించి తనిఖీలు చేశారు. భోజనం, కిచెన్, డైనింగ్ హాల్, కూరగాయలు, కిరాణా సరుకులు, బియ్యం తదితర వంట సామాన్లను పరిశీలించారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారా అని ప్రిన్సిపాల్ను ప్రశ్నించారు. హెల్త్చెకప్ కార్డులు మెయింటెయిన్ చేయడం లేదని, రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారని ఆయన చెప్పడంతో, హెల్త్ చెకప్ కార్డులు తప్పనిసరిగా మెయింటెయిన్ చేయాలని వైద్యారోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఎస్సీ బాలికల హాస్టల్లో డిప్యూటీ సీఎం గంటన్నర పాటు ఉన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక భారం ఉన్నా డైట్ చార్జీలు పెంచాం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం కోసం డైట్ చార్జీలను 40 శాతం పెంచినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.పెంచిన చార్జీలు, మెనూ ప్రకారం హాస్టళ్లలో అన్నీ సక్రమంగా అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు మంత్రులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్లు గంధాధర్, వీరారెడ్డి ఆయన వెంట ఉన్నారు.వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా: భట్టి గీసుకొండ: భూమిలేని వ్యవసాయ కూలీలందరికీ ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’పథకం ద్వారా ఆర్థిక చేయూత అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగిలిచర్లలో కీర్తినగర్, మొగిలిచర్ల, విశ్వనాథపురం 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని మాయమాటలు చెప్పి అప్పుల కుప్పగా మార్చి ప్రజల జీవితాలను ఆగం చేసిందని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులు చేసిన నిర్వాకానికి ప్రతి నెలా రూ.6,500 కోట్ల మేరకు అసలు, వడ్డీ చెల్లిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కరెంటు సమస్య లేకుండా చేస్తామని అన్నారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణ, మురళీనాయక్, రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణ గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్
-
గురుకుల పాఠశాలలో పాముకాటుకు గురైన మరో విద్యార్థి
-
అల్లూరి జిల్లా గోమంగి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
-
నాయుడుపేట గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
-
భావి విద్యకు బాటలు
రాజ్కోట్: స్వతంత్ర భారతంలో తొలిసారిగా దేశ భావి అవసరాలను సంపూర్ణంగా తీర్చేలా సమగ్ర విద్యా విధానం అమలుకు చిత్తశుద్ధితో కృషి జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘బ్రిటిష్ పాలనలో కనుమరుగైన మన ఉజ్జ్వల పురాతన గురుకుల విద్యా విధానం తదితరాల సుగుణాలను పునరుద్ధరించేందుకు స్వాతంత్రం రాగానే పాలకులు నడుం బిగించాల్సింది. కానీ బానిస మనస్తత్వంలో నిండా కూరుకుపోయిన గత ప్రభుత్వాలు ఈ దిశగా ఏ ప్రయత్నమూ చేయలేదు పైగా చాలా అంశాల్లో తిరోగమన ధోరణితో దేశాన్ని వెనక్కు తీసుకెళ్లాయి’’ అంటూ కాంగ్రెస్పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ఇలాంటి తరుణంలో మన బాలలకు మళ్లీ గురుకుల తరహా నాణ్యమైన విద్యను అందించేందుకు ఆధ్యాత్మిక గురువులు పూనుకున్నారు. శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ ఇందుకు ఉదాహరణ’’ అన్నార. గుజరాత్లోని రాజ్కోట్లో ఉన్న సంస్థ 75వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ప్రధాని శనివారం వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. సనాతన భారతదేశం అన్ని విషయాల్లోనూ విశ్వ గురువుగా భాసిల్లిందన్నారు. ‘‘మిగతా ప్రపంచం అంధకారంలో మునిగి ఉన్న సమయంలో మన దేశం విద్యా దీపాలను సముఉజ్జ్వలంగా వెలిగించింది. నలంద, తక్షశిల వంటి మన విశ్వవిద్యాలయాలు ప్రపంచమంతటికీ నిస్వార్థంగా, వివక్షారహితంగా విద్యా దానం చేశాయి. ఆత్మ తత్వం నుంచి పరమాత్వ తత్వం దాకా, ఆయుర్వేదం నుంచి సామాజిక శాస్త్రం, గణిత, లోహ అంతరక్ష శాస్త్రాల దాకా, సున్నా నుంచి అనంతం దాకా అన్ని శాస్త్రాలూ మన దేశంలో ఉచ్ఛ స్థాయిలో విలసిల్లిన కాలమది. వాటన్నింటినీ ప్రస్తుత తరాలకు అందించేందుకు స్వామి నారాయణ్ వంటి విద్యా సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయి’’ అని ప్రశంసించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఐఐటీలు, ఐఐఎంలు, వైద్య కళాశాలల వంటి అత్యున్నత నాణ్యతతో కూడిన విద్యా సంస్థల సంఖ్య 65 శాతానికి పైగా పెరిగిందని చెప్పారు. ‘‘దేశ భవిష్యత్తు గొప్పగా ఉండాలంటే విద్యా విధానం, విద్యా సంస్థల పాత్ర చాలా కీలకం. కాబట్టే ఈ దిశగా అన్ని స్థాయిల్లోనూ శరవేగంగా మెరుగైన మార్పులు తెచ్చేందుకు మేం నడుం బిగించాం’’ అన్నారు. -
వంటపని చేస్తున్న గురుకుల విద్యార్థి.. సాంబారు పడి తీవ్రగాయాలు
పుల్కల్(అందోల్): సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి ఒంటిపై సాంబారు పడటంతో తీవ్రగాయాలపాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుల్కల్ గ్రామానికి చెందిన మైసనగారి ప్రణయ్ సింగూరు గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 15న ఉదయం క్యాంటీన్లోంచి సాంబారును డైనింగ్ హాల్లోకి తీసుకురావడానికి ప్రణయ్ సహకారాన్ని వంటమనిషి కోరాడు. సాంబరు గిన్నె తీసుకెళ్తుండగా వేడివేడి సాంబారు ప్రమాదవశాత్తు ప్రణయ్ రెండు చేతులు, కాళ్లపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రిన్సిపాల్ బాలస్వామి వెంటనే ప్రణయ్ కుటుంబసభ్యులకు సమాచారమందించి అతడిని సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వాస్తవానికి గురుకులంలో నలుగురు వంటమనుషులు ఉండాలి. కానీ, ఒక్కరే ఉండటంతో రోజూ సీనియర్ విద్యార్థులను సహాయకులుగా వాడుకుంటున్నారని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులతో పనులు చేయించుకుంటున్న సింగూరు గురుకుల ప్రిన్సిపాల్, కేర్ టేకర్పై చర్యలు తీసుకోవాలని స్వేరోస్ నాయకులు డిమాండ్ చేశారు. -
ఆదివారం.. వంట భారం.. సాయం తీసుకోమంటే ఏకంగా..
కోరుట్ల: రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ బీసీ గురుకుల పాఠశాలల నిర్వహణ గాడి తప్పుతోంది. గురుకులాల్లో ప్రతి ఆదివారం అల్పాహారం తయారు చేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపైనే పడుతోంది. వంట మనుషుల్లేక ఒక్కోవారం ఒక్కో తరగతి విద్యార్థులు ప్రణాళిక వేసుకొని కావాల్సినవి తయారు చేసుకోవాల్సి వస్తోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఆదివారం విద్యార్థులే చపాతీలు చేసుకోవడం వెలుగులోకి వచ్చింది. 67 గురుకులాలు.. 2,200 మంది విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ బీసీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు 67 వరకు ఉన్నాయి. ఇందులో 5 నుంచి పదో తరగతి వరకు చదువు చెబుతుంటారు. ప్రస్తుతం వీటిలో సుమారు 2,200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గురుకుల పాఠశాలల్లో రోజూ విద్యార్థులకు టిఫిన్ అందజేస్తారు. ప్రతి 80 మంది విద్యార్థులకు ఓ వంటమనిషి ఉంటారు. ఈ లెక్కన ఒక్కో గురుకులంలో సుమారు ఆరుగురు వంట మనుషులు ఉండాలి. కానీ చాలా స్కూళ్లలో ఈ లెక్కన వంట మనుషుల్లేరు. సగానికి మించి గురుకులాల్లో ఉదయం విద్యార్థులకు ఇవ్వాల్సిన టిఫిన్ కేటరింగ్ ద్వారా తెప్పిస్తున్నారు. లేదంటే విద్యార్థులతోనే తయారు చేయిస్తారు. దాదాపు మూడేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. సాయం తీసుకోమన్నందుకు.. వారంలో 6 రోజుల పాటు కిచిడీ, ఇడ్లీ, అటుకులు వంటి టిఫిన్లు వంట మనిషులు లేదా కేటరింగ్ ద్వారా తెప్పిస్తున్నారు. అయితే ఆదివారం గురుకులాల్లో తప్పనిసరిగా చపాతీ లేదా పూరీ టిఫిన్గా పెట్టాలి. ఒక్కో గురుకులంలో ప్రతి ఆదివారం ఒక్కో విద్యార్థికి రెండు చపాతీలు లేదా పూరీల చొప్పున దాదాపు వెయ్యి వరకు కావాలి. ఇంత పెద్దమొత్తంలో చపాతీలు, పూరీలు తయారుచేయడం వంట మనుషులకు తలకు మించిన భారమవుతోందని చాలాచోట్ల ఉన్నతాధికారులకు ప్రిన్సిపాళ్లు నివేదించినట్లు సమాచారం. దీంతో ఆదివారం పిల్లల సాయం తీసుకుని చపాతీ లేదా పూరీలు తయారు చేసుకోవాలని అధికారులు మౌఖికంగా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఇదే ఆసరాగా కొన్నిచోట్ల గురుకులాల ప్రిన్సిపాళ్లు ప్రతి ఆదివారం ఓ క్లాసు చొప్పున విద్యార్థులే చపాతీలు, పూరీలు చేసేలా ప్రణాళిక వేసి వంటపనులు చేయిస్తున్నారు. మౌఖిక ఆదేశాలున్నాయి ఆదివారం పెద్దసంఖ్యలో చపాతీలు, పూరీలు తయారుచేయడం వంట మనుషులకు సాధ్యం కావట్లేదు. దీంతో పిల్లల సాయం తీసుకోవాలని అధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారు. ప్రతి ఆదివారం ఓ క్లాసు చొప్పున పిల్లల సాయంతో చపాతీలు చేయిస్తున్నాం. మిగిలిన రోజుల్లో పిల్లలకు సమస్య ఉండదు. – బాబు, ప్రిన్సిపాల్, కోరుట్ల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల -
ప్రిన్సిపల్ సంతకం ఫోర్జరీ
పశ్చిమగోదావరి,చింతలపూడి: గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి పాఠశాల నిధుల నుంచి రూ. 7.40 లక్షల నగదును కాజేసిన ఘటన చింతలపూడి మండలం, నాగిరెడ్డిగూడెం బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎస్.దుర్గాభవాని సోమవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. నాగిరెడ్డిగూడెం గురుకుల పాఠశాలలో దినసరి భత్యంపై పని చేస్తున్న కె.హరీష్బాబు, రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ జీవీఆర్ మోహన్రావు కలిసి ఈ సొమ్మును కాజేశారని, వారిపై చర్యలు తీసుకుని గురుకుల పాఠశాల సొమ్మును రికవరీ చేయాలని ప్రిన్సిపల్ ఫిర్యాదులో కోరారు. గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో స్కూల్ ఖాతా నుంచి సొమ్మును డ్రా చేశారని తెలిపారు. బ్యాంక్ స్టేట్మెంట్లో వివిధ దఫాలుగా సొమ్ములు డ్రా చేసినట్లు ఉందని, డ్రా అయిన సొమ్ముల వివరాలు తమ క్యాష్ బుక్లో లేక పోవడంతో బ్యాంకుకు వెళ్లి విచారించగా గత ఏడాది జూలై 6వ తేదీన రూ.1.40 లక్షలు, అదే నెల 15వ తేదీన రూ.2.50 లక్షలు, ఆగస్టు 9న రూ.3.50 లక్షలు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి డ్రా చేసినట్లు ఉందని వెల్లడించారు. గురుకుల పాఠశాల నిధులను ఫోర్జరీ చేసి స్వాహా చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ దుర్గా భవాని కోరారు. -
మెదక్లో ఉద్రిక్తత; విద్యార్థిని మృతదేహంతో నిరసన
సాక్షి, మెదక్ : మెదక్ పట్టణంలోని గురుకుల పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కావ్య అనే విద్యార్థి డెంగ్యూ జ్వరంతో బుధవారం రాత్రి మృతి చెందింది. ఈ నేపథ్యంలో కావ్య కుటుంబసభ్యులు మృతదేహంతో పాఠశాలకు ఎదురుగా ఉన్న రోడ్డుపై బైటాయించి తమ నిరసన తెలిపారు. దీంతో ఈ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. గత నెల రోజులుగా కావ్య డెంగ్యూ జ్వరంతో భాదపడుతున్నరెసిడెన్షియల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించలేదని పేర్కొన్నారు. దీనికి పాఠశాల ప్రిన్సిపాల్ భాద్యత వహించాలని, ఆమె నిర్లక్ష్యం కారణంగానే కావ్య మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. -
వరదలో విద్యార్థులు..
సాక్షి, కర్నూలు: ఆళ్లగడ్డ గురుకుల పాఠశాలను వరద నీరు చుట్టు ముట్టింది. భారీ వర్షాలు కారణంగా పాఠశాల పక్కనే ఉన్న ఏరు పొంగి ప్రవహిస్తోంది. రాత్రి కురిసిన వర్షానికి ఒకసారిగా వరద చుట్టుముట్టింది. వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులను స్థానికులు కాపాడారు. అధికారులు అప్రమత్తమై.. బాలయోగి గురుకుల పాఠశాల విద్యార్థినులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గండికోట జలాశయానికి భారీగా వరదనీరు.. కడప జిల్లా: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గండికోట జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. 30 వేల క్యూసెక్కుల నీరు గండికోటకు చేరింది. మైలవరం నుండి 20 వేల క్యూసెక్కుల నీటిని పెన్నానదికి విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వరద ఉధృతిపై కలెక్టర్ హరికిరణ్ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. వరదను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. -
తల్లిదండ్రులూ ఇంగ్లిష్ నేర్చుకోవాలి
మణికొండ: రాబోయే రోజుల్లో ఆంగ్లభాష ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం అవుతుందని, దాన్ని నేర్చుకునేందుకు ప్రతి గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలని రాష్ట్ర మార్కెటింగ్ డైరెక్టర్ జి.లక్ష్మీబాయి పేర్కొన్నారు. గండిపేట మండలం నార్సింగి గురుకుల బాలకల పాఠశాలలో ఆరు రోజులుగా తల్లిదండ్రులకు బోలో ఇంగ్లీష్ ధనాధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి డెవలప్మెంట్ ఆఫ్ అలుమి రిలేషన్స్ ప్రత్యేక అధికారి కొరివి వినయకళ అధ్యక్షత వహించగా ఆమె ముఖ్యఅథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచభాషగా పిలుస్తున్న ఆంగ్లభాషను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. విద్యార్థులకు తాము పాఠశాలల్లో ఆంగ్లంలో బోధిస్తున్నా తల్లిదండ్రులు వారితో మాట్లాడలేక పోవటంతో పూర్తి స్థాయి ఫలితం రావడం లేదన్నారు. అందుకే తల్లిదండ్రులకు సైతం ఆగ్లభాష నేర్చించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా కొందరు తల్లిదండ్రులు మాట్లాడుతూ తమకు ఆంగ్లభాష నేర్చుకోవాల్సిన అవసరాన్ని సమగ్రంగా వివరించారని, రాబోయే రోజుల్లో ప్రయత్నిస్తామన్నారు. గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ తల్లితండ్రులు ఆంగ్లం నేర్చుకుని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించే దిశగా వారితోనే పోటీ పడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఓలు, ప్రిన్సిపాల్లు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
గురుకులంలో ఫుడ్ పాయిజన్!
మెదక్ రూరల్: మెదక్ జిల్లాలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హవేళిఘణాపూర్ మండల కేంద్రంలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. హవేళిఘణాపూర్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినులు ఆదివారం రాత్రి అన్నం, చారు, బెండకాయతో భోజనం చేసి నిద్రపోయారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 30 మంది విద్యార్థినులు తీవ్ర కడుపునొప్పి, విరేచనాలు, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వారి బాగోగులు చూసే నర్సు అందుబాటులో లేకపోవడంతో అస్వస్థతకు గురైన పిల్లలను సిబ్బంది మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో 7, 8 వ తరగతికి చెందిన చంద్రిక, నాగవర్ష, శిరీష, మౌనిక, సంధ్య, లతిక అనే ఆరుగురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజులుగా నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదని పలువురు విద్యార్థినులు వాపోతున్నారు. పిల్లలు అస్వస్థతకు గురైన విషయాన్ని తమకు తెలియజేయకపోవడంపై కొందరు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ శోభాదేవి మాట్లాడుతూ.. పాఠశాలలో మొత్తం 298 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారని, గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదని అన్నారు. పరీక్షించిన డీఎంహెచ్వో.. చికిత్స పొందుతున్న విద్యార్థినుల నుంచి డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యు లను ఆదేశించారు. ఫుడ్ పాయిజన్కు గల కారణాలపై విచారిస్తామన్నారు. అనంతరం పాఠశాలను సందర్శించి పరిసరాలు, విద్యార్థులుండే ప్రాంతా న్ని శుభ్రంగా ఉంచాలని సూచించారు. మండల వైద్యుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు పరీక్షలు చేసి మందులను అందజేశారు. -
రక్షాబంధన్ వేళ.. ఎందుకీ శిక్ష
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముల మధ్య ప్రేమానురాగాలకు చిహ్నంగా నిర్వహించేది రక్షాబంధన్. అనిర్వచనీయమైన ఆనందాన్ని ఇచ్చే ఈ పండుగ జరపుకొనేందుకు, తాము ఎక్కడున్నా ఎప్పటికీ నీకు రక్షణగా ఉంటామని మళ్లీమళ్లీ సోదరిలకు భరోసా కల్పించేందుకు అన్నదమ్ములు ఎంతో సంతోషంగా ఎదురు చూస్తారు. అయితే ఓ ప్రిన్సిపాల్ వారికి ఆ ఆనందం లేకుండా అడ్డుకున్నారు. కనీసం తమ చెలెళ్లు, అక్కలను చూడడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడంతో పలువురు యువకులు, వారి తల్లిదండ్రులు పండగ వేళ తీవ్ర క్షోభకు గురయ్యారు. విశాఖపట్నం, డుంబ్రిగుడ(అరకులోయ): మండలంలో యండపల్లివలస గురుకుల పాఠశాల(ఏపీఆర్) ప్రిన్సిపాల్ నిర్వాకంతో రక్షాబంధన్ పండుగ వేళ గిరిజన విద్యార్థినులు, వారి అన్నదమ్ములు తీవ్ర క్షోభకు గురయ్యారు. మాకెందుకీ శిక్ష అంటూ ఆవేదన చెందారు. చివరకు గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఆదేశాల మేరకు రాఖీ కట్టేందుకు ప్రిన్సిపాల్ అంగీకరించడంతో కొంతమందికి మాత్రమే ఆ ఆనందం దక్కింది. వివరాలు ఇలా ఉన్నాయి. పాఠశాలలో చదువుతున్న తమ అక్క,చెల్లెళ్లతో రాఖీలు కట్టించుకునేందుకు చింతపల్లి, కొయ్యూరు, జీకే వీధి,ముంచంగిపుటు,పెదబయలు,హుకుంపేట,జి.మాగుడుల, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి మండలాల నుంచి సుమారు 150 మంది గిరిజన యువకులు, వారి తల్లిదండ్రులు ఆదివారం ఉదయం యండపల్లివలస గురుకుల పాఠశాల(ఏపీఆర్)కు వచ్చారు. అక్కడి ప్రిన్సిపాల్ అరుణజ్యోతి విద్యార్థినులను బయటకు పంపేందుకు నిరాకరించారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను చూసేందుకు దూరప్రాంతాల నుంచి ఎంతో ఆశగా వస్తే ఇలా అడ్డుకోవడమేమిటని గొడవకు దిగారు. అయినా ప్రిన్సిపాల్ ససేమిరా అనడంతో వారు గిరిజన సంక్షేశాఖ డిప్యూటీడైరెక్టర్ విజయ్కుమార్కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు సాయంత్రం నాలుగు గంటలకు కొంత మంది విద్యార్థినుల తల్లిదండ్రులను పాఠశాల లోపలికి వెళ్లేందుకు ప్రిన్సిపాల్ అనుమతించారు. వర్షం పడుతుండడంతో తడుస్తూ ఉండలేక చాలా మంది యువకులు, వారి తల్లిదండ్రులు అప్పటికే నిరాశతో వెళ్లిపోయారు. దీంతో తమ అన్నదమ్ములకు రాఖీ కట్టలేకపోయామని పలువురు విద్యార్థినులు తీవ్ర వేదనకు గురయ్యారు. ప్రిన్సిపాల్ తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. పడిగాపులు కాశాం... దూరం ప్రాంతం నుంచి కుమార్తెను చూసేందుకు, తమ్ముడితో రాఖీ కట్టించేందు ఉదయం 10 గంట లకు పాఠశాలకు వచ్చాం. అయితే ప్రిన్సిపాల్ అనుమతించలేదు. ఎంతో వేడుకున్నాం. మధ్యాహ్నం వరకు పడిగాపులు కాశాం. అయినా ప్రిన్సిపాల్ కనికరించలేదు. తమ పిల్లలను కలుసుకునే అవకాశం ఇవ్వని ప్రిన్సిపాల్పై చర్య తీసుకోవాలి. – కొండబాబు,విద్యార్థిని తండ్రి, జి.మాడుగుల మండలం -
చౌటుప్పల్ గురుకులానికి మిస్ వరల్డ్ అమెరికా
చౌటుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని బాలికల గురుకుల పాఠశాలను సోమవారం మిస్ వరల్డ్ అమెరికా–2017 క్లారిసా బోవర్ సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా అనారోగ్యంతో బాధపడే చిన్నారుల కోసం విరాళాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా ఆమె హైదరాబాద్కు వచ్చారు. అందులో భాగంగా చౌటుప్పల్ గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థినులతో కలసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా చిన్నారులకు సేవ చేస్తానని తెలిపారు. అలాగే యుద్ధాల్లో గాయపడ్డ సైనికులకు సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. -
గురుకులాల్లో కాస్మొటిక్ కిట్లపై అయోమయం
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో విద్యార్థినులకు అందిస్తున్న కాస్మొటిక్ కిట్లపై అయోమయం నెలకొంది. కిట్లలోని వస్తువుల ధరలు భారీగా పెరగడంతో వాటిని కొనుగోలు చేసి పంపిణీ చేయడం సొసైటీలకు తలకు మించిన భారంగా మారుతోంది. దీనిపై తర్జనభర్జన నెలకొనడంతో ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా కిట్ల పంపిణీ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. వాస్తవానికి ప్రతి మూడు నెలలకోసారి చొప్పున ఏడాదిలో నాలుగుసార్లు వాటిని విద్యార్థినులకు అందించాల్సి ఉంది. ఈసారి ఇంకా అందించకపోవడంతో పలువురు విద్యార్థినులు వ్యక్తిగతంగా కొనుగోలు చేసుకోవల్సి వస్తోంది. కిట్లకు ధరాభారం.. గత విద్యాసంవత్సరం చివర్లో గురుకుల సొసైటీలు విద్యార్థినుల కోసం ప్రయోగాత్మకంగా కాస్మొటిక్ కిట్లను పంపిణీ చేశాయి. కాస్మొటిక్ కేటగిరీలో ఉండే వస్తువులను వేర్వేరుగా కొనుగోలు చేసిన సొసైటీలు... కిట్లుగా మార్చి విద్యార్థినులకు అందించాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల్లోని సగానికిపైగా గురుకులాలకు ఈ కిట్లను సరఫరా చేశారు. అయితే సరుకుల కొనుగోలుకు, ప్రభుత్వం ఇచ్చే చార్జీలకు భారీ వ్యత్యాసం ఉండటంతో కిట్లను పంపిణీ చేయడం గురుకుల సొసైటీలకు భారంగా మారింది. మరోవైపు మైనారిటీ గురుకులాల్లో ఇస్తున్న చార్జీలు... ఇతర గురుకుల సొసైటీల్లో ఖర్చు చేసే మొత్తంలో కూడా భారీ తేడా ఉంటోంది. మైనారిటీ గురుకుల పాఠశాలలో ఒక్కో విద్యార్థినికి ఇచ్చే కిట్ను రూ. 300 పెట్టి కొనుగోలు చేస్తుండగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల సొసైటీలు ఇందుకోసం రూ. 160 చొప్పున మాత్రమే ఖర్చు చేస్తున్నాయి. దీంతో మైనారిటీ గురుకులాల్లో అత్యుత్తమ కిట్లు అందుతుండగా మిగతా గురుకులాల్లో కిట్ల నాణ్యత అంతంత మాత్రంగానే ఉంటోంది. ఫలితంగా వాటిని విద్యార్థినులు పెద్దగా ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థినులకు ఇచ్చే కాస్మొటిక్ కిట్లను ఒకే సంస్థ ద్వారా పంపిణీ చేయించాలని గురుకుల సొసైటీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా కిట్ల పంపిణీని కేంద్రీకరించాలని కోరుతూ ప్రతిపాదనలు తయారు చేశాయి. కిట్లో ఉండే వస్తువుల జాబితాను పేర్కొంటూ వాటిని నేరుగా గురుకులాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీ, బీసీ గురుకుల సొసైటీలు ప్రభుత్వాన్ని కోరాయి. దీని అమలు సాధ్యాసాధ్యాలపై వచ్చిన ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది . వాటికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాక గురుకులాలకు కిట్లను పంపిణీ చేయనున్నట్లు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. -
ఇక్కడ కష్టం ‘గురు’
ఉత్తమ విద్యనందించేందుకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పుకుంటోంది. అయితే వాటిలో సౌకర్యాల విషయాన్ని ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. దాంతో విద్యార్థులకు కష్టాలతో సహజీవనం తప్పడం లేదు. నరేంద్రపురం గురుకుల పాఠశాల దానికి ఓ ఉదాహరణగా నిలుస్తోంది. పి.గన్నవరం: విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు చెప్పుకొనే ప్రభుత్వం, విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమవుతోంది. పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అన్న చందంగా నరేంద్రపురం ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల తయారైంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది. నరేంద్రపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను రూ. 13 కోట్లతో నిర్మించారు. రెండేళ్ల క్రితం ఈపాఠశాల ప్రారంభోత్సవ సభలో అప్పటి సాంఘికసంక్షేమ శాఖ మంత్రి ఇందులో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్టు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ గాలిలో కలిసిపోయింది. దాంతో ఆది నుంచి ఇక్కడ సమస్యలతో విద్యార్థులు సమతమవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ పాఠశాలలో ప్రస్తుతం ఐదో తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకూ సుమారు 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. తరగతి గదుల్లో బెంచీలు లేవు. అలాగే పడక గదుల్లో మంచాలు, పరుపులు లేవు. దాంతో వారు కిందనే నిద్రిస్తున్నారు. జనరేటర్ సౌకర్యం లేకపోవడంతో రాత్రి వేళల్లో కరెంటు పోతే చీకటి రాజ్యమేలుతోంది. పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించలేదు. దీంతో పాఠశాల ఆవరణలో విష సర్పాలు సంచరిస్తున్నాయి. గతంలో ఒక విద్యార్థి స్కూలు బ్యాగ్లో కట్లపాము దూరి అతడిని కాటేసింది. అదృష్టవశాత్తూ అతను ప్రాణాపాయం నుంచి గట్టెక్కాడు. పాఠశాల ఆవరణను మెరక చేయకపోవడంతో ఆటస్థలం లేక తుప్పల్లోనే విద్యార్థులు ఆటలు ఆడుకుంటున్నారు. పాఠశాల ఆవరణలో సీసీ రోడ్లు లేకపోవడంతో వర్షం వస్తే విద్యార్థుల రాకపోకలతో తరగతి గదులు బురదమయం అవుతున్నాయి. మూడు నెలలుగా ఆర్వో ప్లాంటు పనిచేయడం లేదు. దీంతో మంచినీటి టిన్నులను కొనుగోలు చేస్తున్నారు. నరేంద్రపురం– అవిడి రోడ్డు నుంచి ఈ పాఠశాల వరకూ కిలోమీటరు మేర గ్రావెల్ రోడ్డు వేశారు. అది పాడై పోవడంతో వర్షం వస్తే రహదారి బురదమయం అవుతోంది. ఆ సమయంలో పాఠశాలకు మంచినీరు కూడా సరఫరా కావడం లేదు. స్నానాలు చేసేందుకూ ఇబ్బందులే.. పాఠశాలలో బోరు సక్రమంగా లేక త్రీ ఫేజ్ వాటర్ మోటారు పనిచేయడం లేదు. దీంతో సింగిల్ ఫేజ్ మోటారుపైనే నీటికోసం ఆధార పడ్డారు. నరేంద్రపురంలో విద్యుత్ కోత ఎక్కువగా ఉంటోంది. దీంతో స్నానాలకు నీరులేక నానా పాట్లు పడుతున్నారు. కొందరు విద్యార్థులు రెండు రోజులకొకసారి స్నానాలు చేస్తున్నారు. బయట ఉన్న చేతిపంపుల వద్ద పలువురు విద్యార్థులు స్నానాలు చేస్తున్నారు. విద్యార్థులు ఎక్కువగా ఉండటంతో చేతిపంపుల వద్ద ఆలస్యమవుతుండటంతో పక్కనే ఉన్న పంట బోదెల్లో స్నానాలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరుగుదొడ్లలో నీరు లేకపోవడంతో బహిర్భూమికి పొలంగట్లకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ఇన్ని సమస్యలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నా, సంబంధిత ఉన్నతాధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఏకకాలంలో 5 వేల పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకుంది. టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీ కోసం ఏర్పాటు చేసిన టీఆర్ఈఐఆర్బీ(తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు) నోటిఫికేషన్ జారీకి కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు గురువారం బోర్డు సభ్యులు భేటీ అయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన సొసైటీ కార్యదర్శులు నోటిఫికే షన్ ఎలా ఇవ్వాలనే అంశంపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యా శాఖ గురుకులాల్లో బోధన, బోధనేతర కేటగిరీల్లో 5 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 80 శాతం పోస్టులు నేరుగా భర్తీ చేయాలని బోర్డు భావిస్తోంది. వీటికి ఏకకాలంలో నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు రోస్టర్ రూపొందించాలని బోర్డు నిర్ణయించినట్లు తెలిసింది. జూన్ 15 కల్లా నోటిఫికేషన్! గురుకులాల్లో ఖాళీలపై సొసైటీలు ఇప్పటికే స్పష్టత ఇచ్చాయి. ఈ నేపథ్యంలో వీటిలో వేజ్ ఇండెంట్పై వారంలోగా స్పష్టత రానుంది. సొసైటీల వారీగా రోస్టర్ జాబితా సిద్ధమైతే నోటిఫికేషన్కు మార్గం సుగమమవుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 15 నాటికి నోటిఫికేషన్ ఇచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. నోటిఫికేషన్ వెలువడ్డాక పరీక్షల నిర్వహణ, ఫలితాలు, పోస్టుల భర్తీకి కనీసం 3 నెలల సమయం పడుతుందని సమాచారం. ఈ నెలాఖరులోగా తాజా నియామకాలపై స్పష్టత రానుంది. కాగా, గతేడాది టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టిన భర్తీ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. -
గురుకుల విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సు
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థుల లక్ష్యాన్ని సాకారం చేసేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఇప్పటివరకు ఇంటర్మీడియెట్ వరకు వసతితోపాటు ఉచిత విద్య అందిస్తుండగా.. తాజాగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, దేశంలోని ప్రఖ్యాత కాలేజీల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తోంది. ఆ కాలేజీల్లో సీటు వచ్చేందుకు ప్రత్యేక శిక్షణ ఇప్పించనుంది. ఇందుకోసం ప్రముఖ శిక్షణ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ అందజేసింది. నెలాఖరులోగా ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉంది. ప్రముఖ సంస్థలతో ఒప్పందం ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్తోపాటు ఇతర రంగాలపైనా విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు రాష్ట్ర విద్యాసంస్థల వరకే పరిమితం అవుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో కోర్సు చదవాలంటే వ్యక్తిగతంగా ఫీజులు చెల్లించాలి. అంతేకాకుండా ప్రఖ్యాత యూనివర్సిటీలు, కాలేజీల్లో సీట్లు సాధించాలంటే ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. ఆర్థికంగా వెనుకబడ్డ గురుకుల విద్యార్థులకు ఇవి రెండూ కష్టం. ఈ నేపథ్యంలో ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది. పట్టుదల, భారీ లక్ష్యాలున్న విద్యార్థుల అభిప్రాయాలు తీసుకుని వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించనుంది. దీనికి సంబంధించిన శిక్షణ కోసం ప్రముఖ ఇన్స్టిట్యూట్లతో అవగాహన కుదుర్చుకోవాలని నిర్ణయించింది. ఉచితంగా మెటీరియల్ కూడా అందజేయనుంది. అలాగే ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకుతో సీటు సాధించిన వారి కోర్సు ఫీజును కూడా ఎస్సీ అభివృద్ధి శాఖ భరించనుంది. పాఠశాల స్థాయి నుంచే శిక్షణ లక్ష్యాల్ని నిర్దేశించుకునే విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే పలు దఫాలుగా శిక్షణ ఇప్పించేలా ఎస్సీ గురుకుల సొసైటీ ప్రణాళికను రూపొందించింది. ఇంటర్మీడియెట్ నుంచి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వనుంది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం అందుబాటులోకి రానుంది. తొలుత జూనియర్ కాలేజీ స్థాయి ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలన్నింట్లోనూ ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. వచ్చే ఏడాది ఎస్సీ గురుకులాల్లోనూ దీనిని అందుబాటులోకి తేనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. -
తరలిపోతున్న గురుకులాలు
మోర్తాడ్(బాల్కొండ): వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనను ఉచితంగా అందించడానికి ప్రభుత్వం గతేడాది ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలను ఇప్పుడు ఉన్న చోటు నుంచి పొరుగు మండలాలకు తరలించాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా అధికారులు ప్రభుత్వానికి పంపించారు. నియోజకవర్గానికి ఒక బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 2017–18కు గాను బా ల్కొండ నియోజకవర్గానికి సంబంధించి మోర్తాడ్, ఆ ర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి ఖుద్వాన్పూర్ లో, బోధన్ నియోజకవర్గం పాఠశాలను ఎడపల్లిలో, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పాఠశాలను చీమన్పల్లిలో, నిజామాబాద్ అర్బన్ పాఠశాలను నిజామాబాద్లోనే ఏర్పాటు చేశారు. చీమన్పల్లి పాఠశాలకు అద్దె భవనం ఆలస్యంగా దొరకగా సౌకర్యాలను కల్పించడానికి అర్బన్లోనే కొనసాగించారు. గడచిన విద్యా సంవత్సరానికి గాను 5, 6, 7 తరగతులకే విద్యా బోధన అందించారు. 2018–19 విద్యా సంవత్సరానికి గాను ఎనిమిదో తరగతి ఆరంభం కానుంది. కొత్త విద్యార్థులు వస్తున్నప్పటికీ.. అలాగే తాజాగా ప్రవేశ పరీక్షలను నిర్వహించగా కొత్తగా ఐదో తరగతిలోకి విద్యార్థులు అడ్మిషన్లను పొందనున్నారు. నిన్న మొన్నటి వరకు మూడు తరగతులు రెండే సెక్షన్ల చొప్పున ఉండగా మొత్తం 240 మంది విద్యార్థులకు విద్యతో పాటు వసతిని కల్పించారు. అయితే కొత్త విద్యార్థులకు సరిపడే వసతి లేని కారణంగా ఐదు పాఠశాలల్లో మూడింటిని తరలించాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. ప్రధానంగా మోర్తాడ్లోని గురుకుల పాఠశాలను బాల్కొండకు, ఎడపల్లిలోని పాఠశాలను బోధన్కు, అర్బన్లో కొనసాగుతున్న రూరల్ నియోజకవర్గం పాఠశాలను చీమన్పల్లికి తరలించాలని ప్రతిపాదనలు చేశారు. మోర్తాడ్ గురుకులాన్ని బాల్కొండకు, ఎడపల్లి గురుకులాన్ని బోధన్ హెడ్క్వార్టర్కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అభ్యంతరాలు వ్యక్తం కావడంతో తరలిస్తారా లేదా అనే విషయం ఇంకా తేలడం లేదు. గురుకుల పాఠశాలలను తరలించడానికి బదులు అద్దెభవనమా, ప్రభుత్వ భవనాన్ని పరిశీలించి ఎక్కడి పాఠశాలలను అక్కడే కొనసాగించాలని పలువురు కోరుతున్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేశాం బీసీ గురుకుల పాఠశాలలను తరలించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. తొందరలోనే వీటిని తరలిస్తాం. పాఠశాలలు ఆరంభం కాకముందే పొరుగు మండలాలకు వీటిని తరలించి విద్యార్థులకు అనువైన వాతావరణం కలిగేలా చూస్తాం. కొత్త తరగతు లు కూడా ప్రారంభం కాబోతున్నాయి.– తిరుపతి,బీసీ గురుకులాల రీజినల్ కో ఆర్డినేటర్ -
ఉచిత శిక్షణ ... భవితకు రక్షణ
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంసెట్ కోచింగ్ అనేది తల్లిదండ్రులకు భారంగా మారింది. వేల రూపాయిల ఫీజుల కట్టలేక పేద విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఆర్థిక భారంతో ప్రతిభ ఉండి కూడా పలువురు సాధారణ డిగ్రీలతో సరిపెట్టుకుంటున్నారు. చదువుకు పేదరికం అడ్డుకారాదన్న ధ్యేయంతో ప్రభుత్వం ముందుకొచ్చి శిక్షణ కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని ఏపీ సాంఘిక సంక్షేమ బాలయోగి బాలికల గురుకులం ఉచిత ఎంసెట్ శిక్షణ కేంద్రంగా ఎంపికైంది. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలల్లో ప్రతిభ చూపిన విద్యార్థినుల్ని ఎంపిక చేసి ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. సత్తెనపల్లి: ఆటపాటలకు, నాణ్యమైన విద్యా బోధనకు నెలవైన సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని ఏపీ సాంఘిక సంక్షేమ బాలయోగి బాలికల గురుకులం ఎంసెట్ శిక్షణ కేంద్రంగా ఎంపికైంది. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలల్లో ప్రతిభ చూపిన విద్యార్థినుల్ని ఎంపిక చేసి ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. వేలాది రూపాయలు ఫీజులు చెల్లించి కార్పొరేట్ సంస్థల్లో శిక్షణ పొందలేని గురుకుల విద్యార్థినులకు ప్రభుత్వం ఉచితంగా అత్యున్నత నాణ్యత, ప్రమాణాలతో తరగతుల్ని నిర్వహిస్తోంది. ప్రతిభ ఆధారంగా ఎంపిక జిల్లాలోని పలు ప్రాంతాల్లోని గురుకుల కళాశాలలకు చెందిన 91 మంది విద్యార్థినుల్ని(ఎంపీసీ, బైపీసీ) ఇంటర్ ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కుల ప్రాతిపదికన ఎంపిక చేశారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఐఐటీ అ«ధ్యాపకులు వీరికి వర్చువల్ తరగతులు (ఆన్లైన్, ప్రత్యక్ష ప్రసారాలు) ద్వారా నలభై రోజుల పాటు శిక్షణ ఇస్తారు. గత నెల 20 నుంచి రామకృష్ణాపురంలో శిక్షణ ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సబ్జెక్టుల వారీగా ఇస్తున్నారు. మెటీరియల్ను సైతం ఉచితంగా అందించారు. వారానికి గ్రాంట్ టెస్ట్ 160 మార్కులతో నిర్వహిస్తున్నారు. డైలీ పరీక్షలు నిర్వహిస్తూ సామర్థ్యాల్ని అంచనా వేస్తున్నారు. ప్రతి ఆదివారం గురుకులాల కార్యదర్శి కల్నల్ రాములు విద్యార్థినులతో ఆన్లైన్లో ఇంట్రాక్ట్ అవుతూ సలహాలు ఇస్తున్నారు. శిక్షణా కేంద్రాన్ని సాక్షి సందర్శించింది. విద్యార్థుల అభిప్రాయాలు.. -
బంగారు భవితకు గురుకుల బాట
ఒత్తిడి లేని ఉత్తమ విద్యకు గురుకులాలు మార్గదర్శకాలవుతున్నాయి. కార్పొరేట్ పాఠశాలల్లో కూడా లేని వసతులు కల్పించి పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యాబుద్దులు నేర్పించి వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. డిజిటల్ విద్యాబోధనలందిస్తూ పిల్లల బంగారు భవిష్యత్కు పునాది వేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ప్రచార లోపం, సమాచారం తెలియక అనేక మంది ఈ పాఠశాలల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నారు. జిల్లాలోని మూడు పాఠశాలల్లో ఈనెల 8న అయిదో తరగతి ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తున్నారు. నాగులుప్పలపాడు: ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు జిల్లాలో త్రిపురాంతకం మండలం గణపవరం, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామాల్లో మొత్తం 3 ఉన్నాయి. వీటిలో గణపవరం, సంతనూతలపాడులో బాలురకు అవకాశం కల్సిస్తే, అమ్మనబ్రోలు మాత్రం బాలికల కోసం ఏర్పాటు చేశారు. వీటిలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని సదుపాయాలతో ఉచితంగా విద్యనందిస్తారు. ఈ గురుకులాల్లో 5వ తరగతిలో చేరడానికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఈనెల 8వ తేదీన జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్లో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లా మొత్తం మీద సుమారు 1500 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 3 గురుకులాల్లో ఒక్కో పాఠశాలలకు 80 మంది విద్యార్థుల చొప్పున ప్రవేశాలు నిర్వహిస్తారు. వాటిని రోస్టర్ పద్ధతిలో కౌన్సెలింగ్ ద్వారా జనరల్ కేటగిరి –33, బీసీ ఏ–6, బీసీ బి–8, బీసీ సీ–1, బీసీ డి–6, మైనార్టీలకు–3, ఎస్సీ–12, ఎస్టీ–5, పీహెచ్సీ –2, అనాథ పిల్లలకు–2, ఎక్స్ సర్వీస్మెన్–2 పద్ధతిలో సీట్లు కేటాయిస్తారు. అంతే కాకుండా తాడికొండలోని ఎక్స్లెన్సీ స్కూల్కి గుంటూరు, నెల్లూరు జిల్లాలో ఉన్న మైనార్టీ బాలురతో పాటుగా విజయవాడ మైనార్టీ బాలికల గురుకులాల్లో మన జిల్లా కోటాకు సంబంధించి జిల్లాలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. గురుకులాల్లో విద్యార్థులకు మెయింటెనెన్స్ చార్జీలకు, కాస్మోటిక్ ఛార్జి–75 రూపాయలు, వాషింగ్ అలవెన్స్–10, విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నోట్ పుస్తకాలు–12 తో పాటుగా దుప్పట్లు, టవల్స్, 2 జతల యూనిఫామ్, గ్లాసు, ప్లేటు, ఇనుప పెట్టె, ఉచితంగా అందిస్తారు. అంతే కాకుండా ప్రతి పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం, స్టాఫ్ నర్స్, వ్యాయామ సంబంధమైన వాటి కోసం పీఈటీ, డ్రాయింగ్ టీచర్ తప్పకుండా ఉంటారు. అమ్మనబ్రోలు గురుకులంలో జిల్లాలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసే క్రమంలో బాలికల కోసం అమ్మనబ్రోలు గ్రామంలో 1983 సంవత్సరంలో గురుకులాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులతో పాటు మంచి ఉద్యోగాలు, వ్యాపారాల్లో దేశ, విదేశాలలో స్థిరపడ్డారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గురుకులంలో విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, డిజిటల్ క్లాస్ రూం, కంప్యూటర్ తరగతులు, మినరల్ వాటర్ ప్లాంట్ వంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా ప్రత్యేకంగా విద్యుత్ కోసం 10 కేవీ పవర్ కలిగిన 11 లక్షల రూపాలయలతో సోలార్ ప్లేట్లు కూడా ఏర్పాటు చేశారు. -
విద్యార్థినిని చితకబాదారు!
అమ్రాబాద్ (అచ్చంపేట): గిరిజన మినీ గురుకులంలో చదువుతున్న ఓ చిన్నారిని సిబ్బంది చితకబాదారు. ఈ సంఘటన మండలంలోని ఎల్మపల్లి గిరిజన మినీ గురుకులంలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా.. మండలంలోని ఉప్పునుంతల(బీకే) గ్రామానికి చెందిన సింధు మినీ గురుకులంలో రెండో తరగతి చదువుతుంది. శనివారం తల్లి బుజ్జి తన కూతుర్ని పండగ కోసం తీసుకువెళ్లడానికి గురుకుల పాఠశాలకు వచ్చింది. అయితే విద్యార్థిని వీపుపై గాయాలు కనిపించడంతో ఈ విషయం బయటపడింది. ఈ విషయమై చిన్నారి అర్ధరాత్రి మూత్రం చేసేందుకు వెళ్లగా సిబ్బంది కొట్టారని పేర్కొంది. ఎవరికైనా చెబితే మళ్లీ కొడతారేమోనని చెప్పలేదని వాపోయింది. చిన్నారి బాలిక అని చూడకుండా ఇలా చితకబాదడం ఏమిటని విద్యార్థిని తల్లి వాపోయింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. అయితే సింధు వీపుపై చితకబాదిన గాయాలు ఉన్నమాట వాస్తవమేనని ఎవరు.. ఎందుకు కొట్టారో తెలియదని హెచ్ఎం శోభ పేర్కొంది. ఈ విషయమై సీఐ రమేష్కొత్వాల్ స్పందిస్తూ ఈ విషయమై ఫిర్యాదు రాలేదని, విచారణ చేయాలని ఎస్ఐ రాంబాబుకు సూచించారు. అయితే ప్రేమికుల దినోత్సవం రోజున మన్ననూర్ బాలికల గురుకుల పాఠశాలలోకి ఓ యువకుడు ప్రవేశించిన ఘటన మరవక ముందే గురుకులంలో చిన్నారిని చితకబాదడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. -
ఏమంటాం..ఇష్ట‘పడక’!
ఖమ్మం, నేలకొండపల్లి: గురుకుల పాఠశాలల్లో రాత్రివేళ కటిక నేలపై అటూఇటూ బొర్లుతూ నిద్రపట్టక అవస్థ పడుతున్న విద్యార్థులు ఇక హాయిగా..మెత్తటి పరుపుల(స్లిమ్బెడ్స్)పై పడుకోనున్నారు. చాప లేదా పల్చటి దుప్పటి గచ్చుపై వేసుకొని..ఇంతకాలం కష్టంగా నిద్దరోయిన పిల్లలు ఆ అవస్థకు దూరమై చక్కటి స్లిమ్బెడ్లపై పడుకుంటున్నారు. ఈ ఏడాది కొత్తగా ప్రారంభించిన దానవాయిగూడెం, ఎర్రుపాలెం, కూసుమంచి, ముదిగొండ, మధిర, సత్తుపల్లి, తిరుమలాయపాలెం, దానవాయిగూడెం(డిగ్రీ)గురుకులాల్లో మెత్తటి పరుపులను అందజేశారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న విద్యాలయాలకు తగిన సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో..జిల్లా వ్యాప్తంగా 8విద్యాలయాల్లోని 2,752 మందికి పరుపులు పంపిణీ చేశారు. అద్దె భవనాలు విశాలంగా లేకపోవడం, అందరికీ సరిపడా మంచాలు వేసే వీలు ఉండకపోవడంతో ఒక రకమైన పడక (స్లిమ్బెడ్స్)ను రూపొందించి అందజేశారు. అవసరమైనప్పు డు వేసుకుని, తర్వాత మలుచుకుని దా చుకునే విధంగా ఉన్నాయి. నేలపై చాప పరుచుకుని, ఆపైన పరుపు వేసుకుంటే బెడ్(పడక)పై నిద్రపోతున్న భావన కలిగేలా రూపొందించారు. రూ.15.14 లక్షలతో కొనుగోలు.. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు పరుపుల కోసం రూ.15.14 లక్షలు ఖర్చు చేసింది. జిల్లాలో 8 గురుకుల పాఠశాలలు నూతనంగా ఏర్పాటు అయ్యాయి. ఒక్క పరుపు ఖరీదు దాదాపు రూ.550 విలువ చేస్తుంది. మొత్తం 2,752 మంది విద్యార్థులకు రూ.15.14 లక్షలతో గురుకులాల సంస్థ హైదరాబాద్లో కొనుగోలు చేసి..ఇక్కడికి పంపించింది. విద్యార్థులు రాత్రివేళ ఈ పరుపులపై నిద్రించి, ఉదయం లేచాక ఎంచక్కా మలిచి పెట్టెల్లో భద్ర పరుచుకుంటున్నారు. కార్పొరేట్ స్థాయిలో అందించాం.. కార్పొరేట్ హాస్టళ్లల్లో మాదిరి..విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు సంస్థ కృషి చేస్తోంది. అందులో భాగంగానే పరుపులు (స్లిమ్బెడ్స్)ను అందించాం. గురుకుల విద్యాలయాల బలోపేతానికి గురుకులాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ ఎంతో శ్రద్ధ పెడుతున్నారు. – పుల్లయ్య, ఆర్సీఓ చాలా సంతోషంగా ఉంది.. మొన్నటి దాకా కింద పడుకున్నాం. ఇప్పుడు పరుపులు వచ్చాక వాటిని వేసుకుని నిద్ర పోతున్నాం. చాలా హాయిగా నిద్ర పడుతోంది. పెట్టెలో దాచుకుంటున్నాం. – వివేక్, గురుకుల విద్యార్థి, ముదిగొండ ప్రవీణ్కుమార్ సార్కు థాంక్స్.. గురుకుల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ సార్కు రుణపడి ఉంటాం. ఇంట్లో లెక్కనే..మంచిగా పరుపులు అందజేశారు. స్టూడెంట్స్ అంతా హ్యాపీగా ఉన్నారు. – యశ్వంత్, గురుకుల విద్యార్థి, ముదిగొండ -
అమ్మానాన్నా.. క్షమించండి
ఆ చిట్టి తల్లికి ఎంతటి కష్టం వచ్చిందో.. ఎంతగా మథన పడిందో.. తెలియదు. అమ్మా.. నాన్నా నన్ను ఇంతకాలం సాకారు. నేను ఇలా చేస్తున్నందుకు క్షమించండి.. నాన్నా నాకు చదువంటే చాలా ఇష్టం.. కానీ.. చదవకుండానే చనిపోతున్నాను. అని సూసైడ్ నోట్ రాసి ఓ విద్యార్థిని విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బుధవారం వాల్మీకిపురం ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో జరిగింది. రెండు నెలల్లో పదో తరగతి పరీక్షలు రాయాల్సిన కుమార్తె బలవన్మరణం చెందడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మదనపల్లె క్రైం/వాల్మీకిపురం: అమ్మా.. నాన్నా .. క్షమించండి.. నాకు చదువంటే చాలా ఇష్టం. కానీ.. చదవకుండానే నేను చని పోతున్నా అని సూసైడ్ నోట్ రాసి వాల్మీకిపురం ప్రభుత్వ బాలి కల గురుకుల పాఠశాలలో బుధవారం ఓ విద్యార్థిని విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఉపాధ్యాయుల వేధింపులవల్లే బలవన్మరణానికి పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. తొట్టంబేడు మండలం పిల్లమేడుకు చెందిన మెరిమి వెంకటసుబ్బయ్య కుమార్తె సుమలత(15) వాల్మీకిపురంలోని ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. సంక్రాంతి సెలవుల్లో ఇంటికి వెళ్లిన ఆమెను అన్న సురేష్ మంగళవారం పాఠశాలలో వదిలి వెళ్లాడు. అదే రోజు అర్ధరాత్రి ఆమె నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను తోటి విద్యార్థులు గుర్తించి టీచర్లకు సమాచారం ఇచ్చారు. సిబ్బంది బాలికను కారులో వాల్మీకిపురం ఆస్పత్రికి, అక్కడి నుంచి మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేయని ప్రైవేట్ డాక్టర్లు మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో వెంటిలేటర్ సౌకర్యం లేకపోవడంతో డాక్టర్లు తిరుపతికి రెఫర్చేశారు. సిబ్బంది స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంటూ డాక్టర్లు ఆస్పత్రుల్లో చేర్చుకోలేదు. దీంతో తిరిగి ప్రభుత్వాస్పత్రికే తలించారు. అక్కడ సుమలత బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో మరణించింది. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ కన్యాకుమారి ఏపీఎస్డబ్ల్యూఆర్ స్కూళ్ల జిల్లా కోఆర్డినేటర్ రవీంద్రనాథ్కు, మృతురాలి తల్లిదండ్రులకు, వాల్మీకిపురం పోలీసులకు చేరవేశారు. ఉపాధ్యాయుల వేధింపులతోనే.. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె చావు కు ఉపాధ్యాయులే కారణమని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమలత మృతిపై న్యాయ విచారణకు డిమాండ్చేశారు. సూసైడ్ నోట్పై అనుమానాలు విద్యార్థిని సుమలత రాసినట్టు చెబుతున్న సూసైడ్ నోట్లోని అక్షరాల్లో వ్యత్యాసం ఉండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వాల్మీకిపురం ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. -
హౌస్కీపర్ ఆత్మహత్యాయత్నం
హుజూర్నగర్ : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో హౌస్ కీపర్గా పని చేస్తున్న ఎండీ.ఆయేషా ఆదివారం ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన ఆయేషా పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో హౌస్ కీపర్గా పనిచేస్తోంది. ఇటీవల పాఠశాల ప్రిన్సిపాల్ సలీం అక్తర్ ఆమెపై దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె స్థానికంగా నివాసం ఉంటున్న అద్దె గదిలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. డ్యూటీకి రాకపోవడంతో తోటి సిబ్బం ది ఆమెకు ఫోన్ చేసినా స్పందించలేదు. వెంటనే ఆ మె గదికి వెళ్లి చూడడంతో అపస్మారక స్థితిలో పడిఉంది. మంచం పక్కనే గల నిద్రమాత్రలను గుర్తిం చిన సిబ్బంది వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రిన్సిపాల్ పాఠశాలలో సిబ్బందిపై ప్రవర్తిస్తున్న తీరు వల్ల మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆమె రోధిస్తూ తెలిపింది. ప్రిన్సిపాల్ వివరణ .. ఈ విషయమై ప్రిన్సిపాల్ సలీం అక్తర్ మాట్లాడుతూ విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో ఆయేషాను మందలించామే తప్ప దురుసుగా ప్రవర్తించామని ఆరోపించడం సరికాదన్నారు. ఆయేషా తరుచూ నిద్ర మాత్రలు వేసుకునే అలవాటు ఉందని అదే క్రమంలో ఏదైనా జరిగి ఉంటుందే తప్ప తనకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు. -
మంత్రి లోకేష్ కోసం ‘దురాయి’
కావలి: కావలి రూరల్లోని తుమ్మలపెంట బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం జరగనున్న జన్మభూమి కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి టీడీపీ నాయకులు ఆపసోపాలు పడుతున్నారు. ఈ క్రమంలో మండలంలోని మత్స్యకార గ్రామాల్లో ‘దురాయి’ విధించారు. దురాయి అంటే ‘మత్స్యకార గ్రామంలోని కాపులుగా ఉన్న వారు ఒక మాట చెబితే ఆ మాట మీదనే గ్రామస్తులందరూ కట్టుబడి ఉండాలి. దానిని ఉల్లంఘిస్తే నగదు జరిమానాలతో పాటు ఇతరత్రా చర్యలు ఉంటాయి.’ మండలంలోని మత్స్యకార గ్రామాలకు తుమ్మలపెంట జంక్షన్ పాయింట్. అక్కడ జరిగే జన్మభూమిలో వేలాది మంది మత్స్యకారులను పాల్గొనేలా చేసి, మంత్రి లోకేష్ వద్ద మార్కులు కొట్టేయాలనేది నేతల వ్యూహం. ఇందుకు మత్స్యకారుల్లో ఉన్న దురాయి అనే సాంఘిక దురాచార అస్త్రాన్ని నేతలు ఉపయోగించారు. మండలంలోని తుమ్మలపెంట, అన్నగారిపాలెం, పెద్దపట్టపుపాలెం గ్రామ పంచాయతీల పరిధిలో 25 మత్స్యకార గ్రామాలున్నాయి. వీటిలో 15 గ్రామాల్లో దురాయి వేయించారు. కచ్చితంగా పాల్గొనాల్సిందే... కావలి పట్టణంలోని మద్దూరుపాడు వద్ద ఉన్న పారిశ్రామికవాడలో నిర్మిస్తున్న అపార్ట్మెంట్ల మంత్రి లోకేష్ కార్యక్రమంలో లబ్ధిదారులను హాజరుకావాల్సిందేనని టీడీపీ నాయకులు హుకుం జారీ చేశారు. హాజరు కాకపోతే లబ్ధిదారుల జాబితాలో పేర్లు తొలిగిస్తామని బాహాటంగానే చెబుతున్నారు. అలాగే రెండో విడతలోని అపార్ట్మెంట్ల నిర్మాణంలో లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఉండాలంటే మంత్రి కార్యక్రమంలో పాల్గొనాల్సిందే అంటున్నారు. ఇక పొదుపు గ్రూపు మహిళలు పాల్గొంటేనే వారికి ప్రభుత్వం ద్వారా అన్ని అందేలా చేస్తామని, ప్రత్యేక రుణాలు మంజూరు చేయిస్తామని టీడీపీ నాయకులు చెబుతున్నారు. రాకపోతే ఆ సంఘాలను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా ఏవీ రాకుండా ఆపేస్తామని హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులను ఎస్టీలో చేర్చుతామని హామీ ఇచ్చీ.. నేటికీ అమలు చేయలేదని వైజాగ్లో మత్స్యకారులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారు చంద్రబాబును కలిస్తే ‘ఆందోళనలు చేస్తే మీ మత్స్యకారుల ఊర్లకు రోడ్లు వేయను’ అంటూ హెచ్చరించారు. ఈ వ్యవహారంతో మత్స్యకారుల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది -
గురుకులాలకు ‘కేసీఆర్ కాస్మెటిక్ కిట్లు’
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు శుభవార్త. ఏళ్లుగా ఇబ్బందులు పెడుతున్న కాస్మొటిక్ చార్జీల సమస్యకు ప్రభుత్వం పరిష్కారాన్నిచ్చింది. ఇప్పటివరకు ఇస్తున్న కాస్మొటిక్ చార్జీలకు బదులుగా వస్తువులు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో సాంఘిక సంక్షేమ గురుకులాలతో పాటు గిరిజన సంక్షేమం, వెనుకబడిన తరగతులు, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాల్లో ఒకే తరహా కాస్మొటిక్ వస్తువులను సరఫరా చేయనున్నారు. ఈ వస్తువులన్నింటినీ ఒక కిట్టు రూపంలోకి తీసుకొచ్చిన అధికారులు ‘కేసీఆర్ కిట్స్’ పేరిట విద్యార్థులకు ఇచ్చేందుకు చర్యలు వేగవంతం చేశారు. ప్రయోగాత్మకంగా ఒకట్రెండు గురుకులాల్లో పంపిణీ కూడా చేశారు. నెలాఖరులోగా అన్ని గురుకులాలకు ఈ కిట్లను పూర్తిస్థాయిలో పంపిణీ చేయనున్నారు. ఏళ్లుగా నలుగుతున్న సమస్య ప్రస్తుతం రాష్ట్రంలో 487 గురుకుల పాఠశాలలున్నాయి. ఇందులో 134 సాంఘిక సంక్షేమ, 51 గిరిజన సంక్షేమ, 160 మైనారిటీ సంక్షేమ, 142 బీసీ సంక్షేమ గురుకులాలు ఉన్నాయి. వీటిల్లో సుమారు రెండు లక్షల మంది విద్యార్థులున్నారు. వీరికి ప్రతి నెలా రూ.75 చొప్పున కాస్మొటిక్ చార్జీల కింద చెల్లిస్తున్నారు. ఈ మొత్తంతో విద్యార్థులు తమకు అవసరమైన సబ్బులు, టాల్కం పౌడర్, టూత్ పేస్ట్, శాంపూల వంటి వస్తువులను బయటినుంచి కొనుగోలు చేస్తున్నారు. కాగా, ఈ మొత్తాన్ని పెంచాలని గత పదేళ్లుగా పలుమార్లు నిరసనలు వ్యక్తమైనప్పటికీ ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కాగా, 2017–18 బడ్జెట్ సమావేశాల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్మొటిక్ చార్జీల విషయంలో కేబినెట్ సబ్కమిటీ ఏర్పాటు చేశారు. మంత్రుల కమిటీ సూచనల మేరకు కిట్ల రూపంలో వస్తువులు ఇవ్వాలని సంక్షేమ శాఖలు ప్రతిపాదించాయి. ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో విద్యా ర్థులకు సరికొత్తగా కిట్లు ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటి వరకు చెల్లిస్తున్న చార్జీలతో పోలిస్తే ఒక్కో కిట్టుపై నాలుగు రెట్లు అధికంగా ఖర్చు చేయనున్నారు. మూణ్ణెళ్లకోసారి పంపిణీ ఈ కిట్లు నెలవారీగా పంపిణీ చేయడం యంత్రాంగానికి భారం కానుండడంతో మూడు నెలలకు సరిపడా ఒకేసారి పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించారు. విద్యార్థికి పంపిణీ చేసిన తేదీ నుంచి మూడు నెలలు నిండిన వెంటనే వీటిని అందిస్తారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా కొంతమేర అదనపు కోటాను గురుకులంలో సైతం అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
కిటికీలు లేక.. కీటకాల దాడి
రాయపోలు(దుబ్బాక)/మోపాల్(నిజామాబాద్ రూరల్): ఊరికి దూరంగా ఉన్న గురుకుల పాఠశాల విద్యార్థినులపై కీటకాలు దాడి చేస్తున్నాయి. సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లోని గురుకుల విద్యార్థినులపై కీటకాలు దాడి చేయటంతో పలువురు విద్యార్థినులు గాయపడ్డారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మొండిచింత సమీపంలోని ఓ ప్రైవేటు భవనంలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇందులో 215 మంది వరకు విద్యార్థినులు ఉన్నారు. బుధవారం రాత్రి విద్యార్థులు నిద్రిస్తుండగా.. ఓ రకమైన పురుగులు వారిపై దాడి చేశాయి. 90 మంది విద్యార్థినులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. ముఖం, చేతులు, వీపు ప్రాంతాలలో పురుగులు తాకిన ప్రాంతంలో బొబ్బలు వచ్చి గాయాలయ్యాయి. దౌల్తాబాద్ పీహెచ్సీ ఇన్చార్జి వైద్యాధికారి డా.రమాదేవి శుక్రవారం పాఠశాలలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి విద్యార్థినులకు వైద్యం అందించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. పాఠశాల భవనానికి కిటికీలు సరిగా లేకపోవడంతో పురుగులు దాడిచేశాయని విద్యార్థులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి 15 మంది విద్యార్థులను పురుగులు కుట్టడంతో వారి ముఖాలపై దద్దుర్లు ఏర్పడ్డాయి. స్టాఫ్నర్సు మాధురి విద్యార్థినులకు ప్రథమ చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి సంజీవ్కుమార్, ఓఎస్డీ ముస్తాఫా శుక్రవారం ఉదయం గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థినులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
గిరిజన గురుకుల పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం ఎడ్యుకేషన్ : నగరంలోని నవోదయకాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 3వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ సుధారాణి ఓ ప్రకటనలో తెలిపారు. టీసీ, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డు, రెండు ఫొటోలతో నేరుగా తనను కలవాలని సూచించారు. -
పనితీరు మారకపోతే చర్యలు
కలెక్టర్ ముత్యాలరాజు కోట: పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని సాంఘిక సంక్షేమ ఎస్సీ గురకుల పాఠశాల, కళాశాల సిబ్బందిపై కలెక్టర్ ముత్యాలరాజు మండిపడ్డారు. కలెక్టర్తోపాటు, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ బుధవారం రాత్రి స్థానిక గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులంలోని వసతులు, భోజన నాణ్యతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని మరుగుదొడ్లను, వంటగదులను, డార్మింగ్ రూమ్లను పరిశీలించి అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం భోజనం రుచి చూశారు. పాఠశాలలోని విద్యార్థులకు సరైన వసతులు కల్పించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడంపై పలు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీనిని సరిదిద్దుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్తీర్ణతా శాతం పెంచాలన్నారు. పాఠశాలలో విద్యార్ధుల సంఖ్యతోపాటు జిల్లా అధికారుల చిరునామాలను గోడలకు అంటించాలన్నారు. విద్యార్థులు, సిబ్బందితో వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవని అందుకు మరో 20 మరుగుదొడ్లును మంజూరు చేస్తున్నామన్నారు. వారి వెంట సోషల్ వేల్ఫేర్ డీడీ మధుసూదన్రావు, గూడూరు ఇన్చార్జ్ ఆర్డీ వెంకటసుబ్బయ్య, ప్రిన్సిపల్ సూర్యనారాయణ ఉన్నారు. -
గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్
ఆత్మకూరురూరల్ : గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆత్మకూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కె.మురళీకష్ణను సస్పెండ్ చేశారు. ఈ మేరకు గురుకుల పాఠశాలల విద్యాలయాల సంస్థ సెక్రటరీ నుంచి బుధవారం ఉత్తర్వులు అందాయి. గత నెల 24వ తేదీన గురుకుల పాఠశాలలో చదువుతున్న కోటకు చెందిన ఓ విద్యార్థినిని ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తల్లిదండ్రులకు తెలపడంతో వారు పాఠశాలకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలుత ఐటీడీఏ పీఓ కమలకుమారి, ఆత్మకూరు ఆర్డీఓ ఎంవీ రమణ, ఎస్ఐ ఎం.పూర్ణచంద్రరావు విచారణ నిర్వహించారు. గురుకుల పాఠశాలల విద్యాలయాల సంస్థ డిప్యూటీ కార్యదర్శి విచారణ నిర్వహించారు. ఈ నివేదికల ఆధారంగా ఉన్నతాధికారులు ప్రిన్సిపల్ కె.మురళీకష్ణను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు పంపారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ప్రిన్సిపల్ అందుబాటులో లేకపోవడంతో సస్పెన్షన్ ఉత్తర్వులను అతని ఇంటి తలుపులకు అంటించారు. నాలుగేళ్లుగా ఆ ప్రిన్సిపల్ గురుకుల పాఠశాలలో పని చేస్తున్నాడు. -
ఫుడ్పాయిజన్తో విద్యార్థులకు అస్వస్థత
బద్వేల్: వైఎస్సార్ జిల్లా గురుకుల పాఠశాలలో సోమవారం ఫుడ్పాయిజన్ జరిగింది. బద్వేల్ గురుకుల పాఠశాలలో ఆహారం తిన్న 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. దీంతో వెంటనే విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గురుకుల పాఠశాలలో విద్యార్థిని మృతి
త్రిపురాంతకం (ప్రకాశం) : ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని గురుకుల పాఠశాలలో శుక్రవారం ఓ విద్యార్థిని అనారోగ్యంతో మృతిచెందింది. మండలంలోని సంగం తండాకు చెందిన శ్రావణి బాయి(12) స్థానిక గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గురుకులాల ఏర్పాటుకు సహకారం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గురుకుల పాఠశాలల ఏర్పాటు పథకానికి సహకారం అందించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గానికి 10 చొప్పున.. 1,190 గురుకులాలను ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటి ద్వారా కేజీ నుంచి పీజీ వరకు ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడానికి ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. బుధవారమిక్కడ కొత్త విద్యావిధానం అమలు తీరుతెన్నులపై కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ నిర్వహించిన సమావేశంలో కడియం మాట్లాడారు. బాలికా విద్య కోసం కేంద్రం చర్యలు చేపట్టాలని కోరారు. కొత్త విద్యా విధానం ద్వారా ్రైపైవేటు, ప్రభుత్వ పాఠశాలల మధ్య అంతరం మరింత పెరిగే ప్రమాదం ఉందని, దీనిపై ప్రాథమిక, ఉన్నత పాఠశాల, సాంకేతిక విద్యాసంస్థల విభాగంలో ఉప కమిటీలు ఏర్పాటు చేసి సంప్రదింపులు చేస్తే బాగుంటుందని సూచించారు. తాము సంప్రదింపుల ప్రక్రియను వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో మొదలుపెడతామని చెప్పారు. విద్యాహక్కు చట్టం ద్వారా లాభనష్టాలున్నాయని, వాటిని సమీక్షించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాల నుంచి 25 శాతం పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివించి, వారి ఖర్చులను ప్రభుత్వమే తిరిగి చెల్లించే ప్రక్రియలో అవినీతికి ఆస్కారముంటుందని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు బడులకు చెల్లించే డబ్బును ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, ఉపాధ్యాయుల భర్తీ, అత్యున్నత శిక్షణకు వినియోగిస్తే సర్కారు బడుల్లో ప్రమాణాలు మెరుగుపర్చుకోవచ్చని సూచించారు. తెలంగాణలోని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఆ విషయం తెలియదు నాయకులు, అధికారుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని అలహాబాదు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాజ్యాంగపరంగా అమలు చేయవచ్చో.. లేదో..? న్యాయపరంగా ఎలా ఉంటుందో తనకు తెలియదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో అలహాబాదు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అడిగిన ప్రశ్నకు కడియం బదులిచ్చారు. దీనివల్ల సమస్యకు పరిష్కారం లభించదని అభిప్రాయపడ్డారు. ప్రైవేటుతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాల్లో యోగ్యులైన టీచర్లున్నారని, సరైన పర్యవేక్షణ లేకపోవడం, ఇతర కారణాల వల్ల ఆశించిన ఫలితాలు రావడంలేదన్నారు. -
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్పై వేటు
మారేడుపల్లి (హైదరాబాద్) : హైదరాబాద్ మహేంద్రహిల్స్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్పై వేటుపడింది. కొన్ని రోజుల క్రితం ఈ హాస్టల్లో కలుషిత ఆహారం తిని 67 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ ప్రిన్సిపాల్ వై.సత్యనారాయణను శుక్రవారం ఆ బాధ్యతల నుంచి తప్పించారు. సత్యనారాయణ గత సంవత్సరం నుంచి ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా కొనసాగుతున్నారు. -
గురుకుల పాఠశాలలను తీర్చిదిద్దుతా..
124 గురుకుల పాఠశాలలు, 39 కస్తూర్బాగాంధీ విద్యాలయాలను పర్యవేక్షిస్తూ.. 4500మంది ఉపాధ్యాయులను సమన్వయం చేస్తూ.. 72వేల మంది విద్యార్థి, విద్యార్థినులకు విద్యాబుద్ధులు చెప్పిస్తున్నారు. ఎలాంటి లోటుపాట్లు రాకుండా వసతులు కల్పిస్తున్నారు. చదువు‘కొన’ లేని ఆ పేదపిల్లలకు ఇంగ్లిష్ చదువులు చెప్పించాలని కృషిచేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా గడిపే అధికారుల్లో ఒకరు. ఆయనే జిల్లావాసి, సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్. ఆయన కాస్త తీరిక చేసుకుని కమ్మదనం బాలికల గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. ‘సాక్షి’ రిపోర్టర్గా విద్యార్థినుల బాగోగులు తెలుసుకున్నారు. గురుకులాలను తీర్చిదిద్దుతానని చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్: నీ.. పేరేంటమ్మా, గురుకుల లో చదువుతున్నావ్ కదా? ఎలా ఉంది.. ఎలా చదువుతున్నాం. మీ ఊరు వదిలి ఇక్కడికి వచ్చావు కదా.. నీకేమీ అనిపించడం లేదా? స్కూళ్లో బోర్ కొట్టడం లేదా? అంజలి(10వ తరగతి): సార్..! మాది వంగూరు. నేను ఐదో తరగతిలో ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగు ఒక్కటే వచ్చేది. మ్యాథమెటిక్స్ అంటే మస్తు భయం. పరీక్ష ఉంది అనగానే జ్వరం వచ్చేది. ఎప్పుడైతే ఇక్కడకు వచ్చానో నాకు గణితం పట్ల పూర్తిగా భయం పోయింది. ఇంతమంది అక్కవాళ్లు, ఫ్రెండ్స్ ఉండగా ఇంట్లోనే ఉన్నట్టుంది. ఉపాధ్యాయులు మమ్మల్ని వారి పిల్లల్లా చూసుకుంటున్నారు. నా లక్ష్యం ఇంజినీర్ కావడమే సార్.. మంచి ఇంజినీర్ అయి మా నాన్నకు పేరు తేస్తాను. మీ ఆశయాన్ని కూడా నెరవేరుస్తా. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్: నీపేరేంటి. స్కూలుకు నీవెలా వచ్చావు. మీ స్కూల్లో ఏమేం జరుగుతున్నాయి. పాఠాలు అర్థమవుతున్నాయా? సిలబస్ మారింది కదా.. ఎలా చదువుతున్నారు. పాఠాలు అర్థమవుతున్నాయా? స్వర్ణమంజలి(కర్నూలు): సార్.. నేను ఐదో తరగతిలో జాయిన్ అయ్యాను. నేను దూరంగా ఉంటానని మా డాడీ ఎప్పుడు బాధపడుతుంటారు. సోషల్వెల్ఫేర్ స్కూల్లో చదువుకుంటే ఎంతగ్రేటో తెలుసా..! అని నాన్నకు చెప్పేదాన్ని. మారిన సిలబస్కు అనుగుణంగా మా టీచర్లు ప్రిపేర్ చేస్తున్నారు. ప్రశ్నలను మేమే తయారుచేసుకునే విధంగా మమ్మల్ని సిద్ధం చేస్తున్నారు. మాకు తెలియని కొత్తకొత్త విషయాలు చెప్పి పరీక్షలకు బాగా ప్రిపేర్ చేస్తున్నారు. మా బయాలజీ మేడం క్లాస్రూమ్లోకి వస్తే చాలు. ప్రపంచమంతా ఇక్కడే చూసినట్లు ఉంటుంది. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్: మీ షర్టు మీద ‘వాయిస్’ అని ఉంది కదా? అంటే ఏమిటి? సఖీ అంటే ఏంటో చెబుతావా? స్వర్ణ: వాయిస్ అంటే క్యాంపు సార్..! మేము వేసవి సెలవుల్లో క్యాంప్నకు వెళ్తుంటాం. అక్కడ సఖీ క్వాలిఫికేషన్ గురించి చెబుతారు. సఖీ అంటే పక్కవారి ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవడం. మారి సమస్యలు తీర్చడం. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్: క్యాంపునుంచి వచ్చిన తర్వాత ఎంతమంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశావు. ఏయే ప్రాబ్లమ్స్ వచ్చాయి? సరే... హాస్టల్లో భోజనం ఎలా ఉంది. స్వర్ణ: ఫుడ్ బాగుంది. సన్నబియ్యం వచ్చినప్పటి నుంచి కడుపునిండా తింటున్నాం. క్యాంపులో నేర్చుకున్న అంశాలను స్కూళ్లో నేర్పిస్తాం. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్: ఇక్కడ క్యాంపునకు వెళ్లినవాళ్లు ఎవరైనా ఉన్నారా? శాంతి(9వ తరగతి): నేను డార్జిలింగ్ క్యాంప్నకు వెళ్లాను. అక్కడ చలి తీవ్ర త ఎక్కువగా ఉంటుంది. చలి వేయకుండా స్లీపింగ్ బ్యాగ్లో పడుకునేదాణ్ని. చేతులు, కాళ్లకు సాక్స్లు, గ్లౌజ్లు వేసుకుని పడుకునేవాళ్లం. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్: అంత చలిలో నీరు అక్కడ గడ్డకట్టదా.. ఎలా ఉండగలిగారు..? శాంతి: తాగడానికి వేడినీళ్ల బాటిళ్లను స్లీపింగ్ బ్యాగ్లో వేసుకుని పడుకోవాలి. మొత్తం 9రోజుల పాటు బేస్క్యాంప్లో ఉన్నాం. నాలుగు కిలోల బరువు ఉన్న షూ వేసుకున్నా. చలికి కప్పుకునే దుప్పటి 20కిలోలు ఉంటుంది. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్: నీ పేరేంటమ్మా.. ఇక్కడ విద్యాబోధన ఎలా ఉంది. పాఠాలు అర్థమవుతున్నాయా? మహేశ్వరి(10వ తరగతి) : ఇక్కడ విద్యాబోధన చాలాబాగుంది. ఎగ్జాం అంటే భయంలేద్సార్..! మాకు మేమే క్వశ్చన్స్ తయారుచేసుకుని చదువుతున్నాం. వీటికంటే ఎక్కువ పరీక్షల్లో ఏమీ రావని మా నమ్మకం. మేమంతా గ్రూప్ డిస్కర్షన్ చేసుకుంటూ చదువుకుంటున్నాం. మా ఆలోచనలు, చదువుకునే పద్ధతిని ఒకరికొకరు పంచుకుంటాం. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్: గేమ్స్లో పాల్గొన్నవాళ్లు ఎవరైనా.. ఉన్నారా? చైతన్య(ఇంటర్ ఫస్టియర్ బైపీసీ): సార్.. నేను ఐదో తరగతిలో ఇక్కడికి వచ్చా. ఆరేళ్లుగా ఇక్కడే చదువుకుంటున్నాను. గురుకుల పాఠశాలను వదిలివెళ్లను. నేను చాలా గేమ్స్లో పాల్గొన్నాను. నాకు మొన్న కొత్తగడిలో జరిగిన జోన్స్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి వచ్చింది. అవర్ టాపిక్స్ జీఎం ఫుడ్.. మేము ఎక్స్ఫోర్ ఈవెంట్కు వెళ్లాం సార్..! ఆర్ఎస్ ప్రవీణ్కుమార్: అక్కడ ఎలా అనిపించింది? ఏయే ప్రాంతాలు చూశారు.? చైతన్య: ఎక్స్ఫోర్ అనే ప్లేస్ను చూడలేనేమో అనుకున్నా. క్లాస్మెంట్ ఫ్రెండ్స్తో కలిసి అలాంటి ప్లేస్కు వెళ్లాలి అనుకునేదాన్ని. అదికూడా మీవల్లే తీరింది. ఎల్బీ స్టేడియాన్ని నేను టీవీలోనే చూసేదాన్ని. కానీ మొన్న ప్రత్యక్షంగా చూశాను. సీసీఎంబీ, ఎంజీఆర్ఐ, ఎల్బీ స్టేడియం, ప్లానిటోరియం, ఉస్మానియా యూనివర్సిటీ వంటి ఎన్నో ప్లేస్లు చూశాం. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్: ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లావు కదా? ఫ్యూచర్లో అక్కడ చదువుకునేందుకు వెళ్తావా? చైతన్య: అక్కడికి కచ్చితంగా వెళ్లి చదువుకుంటా. భవిష్యత్లో గొప్ప శాస్త్రవేత్తను కావాలని ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్: గేమ్స్లో పాల్గొన్నవారు ఇంకెవరైనా ఉన్నారా? జ్యోతిక(10వ తరగతి): కబడ్డీ అంటే నాకు చాలాఇష్టం. ఇరవైరోజుల క్రితం ఎల్బీ స్టేడియంలో జరిగిన స్వేరో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్నాను. 1500 మీటర్ల పరుగుపందెంలో పాల్గొన్నా. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించినా.. విజయం దక్కలేదు. ఒడిపోయినా సరే.. మీరు ప్రోత్సహించిన తీరు నాలో స్ఫూర్తినింపింది. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హామీలు ఒకప్పుడు గురుకుల పాఠశాలలు సవాలక్ష సమస్యలతో సతమతమవుతుండేవి. ఎస్సీ సబ్ప్లాన్, అదనపు నిధులతో పాఠశాలలను మరింత అభివృద్ధి చేస్తాం. ఇక్కడున్న పిల్లలు ఎక్కువగా పేదకుటుంబం నుంచి వచ్చినవారే. కొంతమందికి తల్లిలేదు. మరికొంత మందికి తండ్రిలేడు. అలాంటి వారికి ఉపాధ్యాయులు తగినంత ప్రోత్సాహాన్ని అందిస్తూ మంచి విద్యను బోధిస్తున్నారు. పిల్లలకోసం సమ్మర్క్యాంప్, కోచింగ్ క్యాంప్లు ఏర్పాటు చేస్తున్నాం. ‘ఈ+ క్లబ్’ ద్వారా ప్రతి విద్యార్థిలో ఇంగ్లిస్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ అభివృద్ధి చేస్తున్నాం. వేర్వేరు ఫౌండేషన్లతో కలిసి ఉత్తమర్యాంకులు సాధించిన పాఠశాల ఉపాధ్యాయులకు అమెరికాలో శిక్షణ ఇప్పించేవిధంగా ఏర్పాట్లు చేశాం. మంచి ఉత్తీర్ణత సాధించే విద్యార్థులను కూడా అమెరికా పంపిస్తాం. దేశంలో ఏ విద్యాసంస్థ చేయని సాహసోపేతమైన క్రోడింగ్ క్యాంప్ను సమ్మర్లో ప్రవేశపెట్టబోతున్నాం. ప్రభుత్వపరంగా ఏ చిన్న అవకాశమొచ్చినా సద్వినియోగం చేసుకుని పేద విద్యార్థుల అభివృద్ధి కోసం పాటుపడతాం. -
వైఎస్సార్ హయాంలో..
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖ రరెడ్డి హయాంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనించింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలో ఉన్న ఏకైక చక్కెర ఫ్యాక్టరీ వేమూరు మండలం జంపనిలో ఉంది. 2004 ముందు ప్రైవేట్ సంస్థ ఆధీనంలో ఉండటంతో వందలాది మంది రైతులు, కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా తయారైంది. మూతబడిన ఫ్యాక్టరీని వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెరిపించి సుమారు 2.5 కోట్లు రూపాయలు మంజూరు చేశారు. వైఎస్సార్ మరణాంతరం ఫ్యాక్టరీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఫ్యాక్టరీ మూతపడింది. జంపనిలో రేపల్లె మెయిన్ డ్రెయిన్పై కొత్త వంతెన నిర్మాణానికి వైఎస్ రూ.1.35కోట్లు మంజూరు చేశారు. చుండూరు మండలంలో నూతనంగా నిర్మించిన గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి రూ.9.6 కోట్లు మంజూరు చేశారు. వైఎస్సార్ మరణం తర్వాత... పేదోడికి సొంతింటి కల ‘కల్ల’గానే మిగిలిపోయింది. అధికార పార్టీ సిఫార్సులున్నవారికే ఇందిరమ్మ ఇళ్లు దక్కుతున్నాయి. తూతూ మంత్రంగా కొంత మంది అర్హులు దక్కించుకున్నా వారుకూడా బిల్లుల కోసం నెలల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మహానేత వైఎస్సార్ మరణం తర్వాత పేదలను పట్టించుకునే వారే కరువయ్యారు. -
విద్యార్థినుల తాగునీటి కష్టాలకు తెర
నందిగాం, న్యూస్లైన్: ఖమ్మం నగరానికి చెందిన వైద్యుడు జి.రఘుకిషోర్ దాతృత్వంతో నందిగాంలోని బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినుల తాగునీటి కష్టాలు తీరాయి. తన మాతృమూర్తి తోటకూర రజని స్మారకార్థం ఏర్పాటు చేసిన ‘నేను సైతం’ ఫౌండేషన్ ద్వారా సుమారు రూ.1.75 లక్షల వ్యయంతో పాఠశాలలో తాగునీటి పథకం నిర్మించారు. ఆదివారం ఈ పథకాన్ని స్వయంగా ఆయన ప్రారంభించారు. ఈ సత్కార్యానికి ఫిబ్రవరి 4న సాక్షి ప్రధాన సంచికలో ‘నీటి కోసం కోటి కష్టాలు’ శీర్షికన వచ్చిన కథనం కారణమవటం విశేషం. విద్యార్థినులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఈ కథనం ద్వారా తెలుసుకున్న రఘుకిషోర్ చలించిపోయారు. వెంటనే స్పందించి పాఠశాల ఆవరణలో రెండు బోర్లు, మోటారు, పైపులైను, ట్యాంకు నిర్మింపజేశారు. సాయం చేయడంలో ఎంతో ఆనందం.. పాఠశాలలో నిర్మించిన తాగునీటి పథకాన్ని భగత్సింగ్ వర్థంతి సందర్భంగా ఆదివారం డాక్టర్ రఘుకిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘సమాజం మనకేమిచ్చిందనేది ముఖ్యం కాదు.. సమాజానికి మనమేం చేశామన్నదే ముఖ్యం. ఉన్నంతలో ఇతరులకు సాయం చేయడంలో ఎంతో ఆనందం ఉంది’ అని చెప్పారు. మనం బాగుండాలి.. ఇతరులు బాగుండాలని తలచిననాడే ఎదుటివారికి సాయం చేయగలమన్నారు. సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం చదివాక విద్యార్థినుల సమస్య తీర్చాలని సంకల్పించానని వివరించారు. అందుకే ఇంతదూరం వచ్చి పథకాన్ని ప్రారంభించానని తెలిపారు. విద్య, వైద్యం, పరిశుభ్రత కార్యక్రమాలకు సహాయమందిస్తుంటానని, ఏడాది కాలంగా విశాఖ, ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచే సేవాగుణం అలవర్చుకోవాలని కోరారు. టెక్కలి ఆర్డీవో ఎ.శ్యామ్ప్రసాద్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా పాల్వంచలో తను పనిచేసినపుడు డాక్టర్ రఘుకిషోర్తో పరిచయముందని, ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఆనందం కలిగిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాలల ఉపకార్యదర్శి(విశాఖ) టి.సరోజ, జిల్లా గురుకుల పాఠశాలల కన్వీనర్ బి.చంద్రావతి, ప్రిన్సిపాల్ కె.శ్రీదేవి, వైస్ప్రిన్సిపాల్ కె.వైకుంఠరావు పాల్గొన్నారు. -
209 సీట్లు ఖాళీ
నిజామాబాద్ రూరల్, న్యూస్లైన్ : కంజర గ్రామంలోని బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో సీట్లు మిగిలిపోతున్నాయి. సైన్స్ గ్రూప్లు లేకపోవడమే ఇందుకు కారణం. కంజరలో రూ. 9 కోట్లతో గురుకుల పాఠశాల, కళాశాల భవనాన్ని నిర్మించారు. అప్పటివరకు నిజామాబాద్లోని కోటగల్లిలో కొనసాగుతున్న ఈ పాఠశాలను 2013లో నూతన భవనంలోకి మార్చారు. 1,300 మంది విద్యార్థినులు చదువుకోవడానికి వీలుగా వసతులు కల్పించారు. అయితే ఈ పాఠశాల, కళాశాలకు 640 సీట్లను మాత్రమే కేటాయించారు. ఈ ఏడాది 431 మంది మాత్రమే విద్యనభ్యసిస్తున్నారు. దీంతో 209 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఐదో తరగతినుంచి పదో తరగతి వరకు 315 మంది విద్యార్థులున్నారు. ఆయా తరగతులన్నింటిలో కలిపి 165 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ గురుకులంలో సీఈసీ, హెచ్ఈసీ మాత్రమే ఉన్నాయి. సైన్స్ గ్రూప్లు లేవు. దీంతో ఈ పాఠశాలలో చేర్చేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదని, అందువల్లే సీట్లు మిగిలిపోతున్నాయని తెలుస్తోంది. సీఈసీ ప్రథమ సంవత్సరంలో 40 సీట్లకుగాను 31 మంది విద్యార్థినులే ఉన్నారు. ద్వితీయ సంవత్సరంలో 40 సీట్లకు గాను 37 మంది విద్యార్థినులు చదువుతున్నారు. హెచ్ఈసీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రథమ సంవత్సరంలో 19 మంది, ద్వితీయ సంవత్సరంలో 29 మంది విద్యార్థులే ఉన్నారు. ప్రథమ సంవత్సరంలో 21, ద్వితీయ సంవత్సరంలో 11 సీట్లు మిగిలిపోయాయి. సైన్స్ గ్రూప్లు ఉండి ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. గురుకులంలో సైన్స్ గ్రూప్లను ప్రారంభించాలని వారు కోరుతున్నారు. సైన్స్ గ్రూప్లు లేకే.. గురుకుల పాఠశాలలో ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నాం. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోనూ ఆంగ్ల మాధ్యమంలోనే బోధన సాగుతోంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే తెలుగు మాధ్యమంలో చెబుతున్నాం. సైన్స్ గ్రూపులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఈ గురుకులంలో చేరడం లేదు. -సింధు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ -
మీ బిడ్డలకైతే ఈ ఆహారం పెడతారా?
నాయుడుపేట, న్యూస్లైన్: గురుకుల పాఠశాలల విద్యార్థులపై అక్కడి అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. పురుగులతో కూడిన అన్నం, ఉడికీఉడకని పొంగలి వడ్డిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. కడుపు కాలుతుండటంతో నాసిరకమైన ఆహారాన్నే తిని విద్యార్థులు అర్ధాకలితో గడుపుతున్నారు. ఎవరికైనా చెబితే దండన తప్పదనే భయంతో బాధను మౌనంగా భరిస్తున్నారు. నాయుడుపేట మండలం పుదూరు బాలికల గురుకులంలో పరిస్థితి ఇది. ఈ గురుకులంలో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 706 మంది విద్యార్థినులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరికి నాసిరకమైన ఆహారం వడ్డిస్తున్నారన్న సమాచారం అందుకున్న ‘న్యూస్లైన్’ శనివారం గురుకులాన్ని సందర్శించింది. ఆ సమయంలో విద్యార్థులకు వడ్డించిన అన్నంలో వడ్ల గింజలు దర్శనమిచ్చాయి. పుచ్చు వంకాయలతో చేసిన కూరనే వడ్డించారు. ఉదయం అల్పాహారంగా వడ్డించిన పొంగలి ఉడికీఉడకక నాసిరకంగా ఉండటంతో విద్యార్థులు తినలేకపోయారు. ‘న్యూస్లైన్’ రావడంతో అక్కడే ఉన్న ఆ పొంగలిని హడావుడిగా దాచేందుకు ప్రయత్నించారు. వంట గదిలోని పురుగులు పట్టిన బియ్యాన్ని కూడా హడావుడిగా ప్రహరీ అవతల పోసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ క్రమంలో ఆ బియ్యం చెల్లాచెదురుగా పడిపోయాయి. కాంట్రాక్టర్ సరఫరా చేసిన టమోటాలు, చింతపండు తదితర వస్తువులను కొందరు సిబ్బంది ఇళ్లకు ఎత్తుకెళ్లేందుకు దాచుకోవడం కనిపించింది. మరోవైపు విద్యార్థులు భోజనం చేసే సమయంలో తాగునీరు లేక తీవ్ర అవస్థ పడుతున్నారు. జగ్గుతో నీళ్లు తెచ్చుకుని పదుల సంఖ్యలో విద్యార్థులు పంచుకుని తాగుతున్నారు. వీరు ఇన్ని కష్టాలు పడుతున్నా గురుకులం అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. సరుకుల కాంట్రాక్టర్, వంట ఏజెన్సీల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లను తీసుకుని అక్రమాలు జరుగుతున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని గురుకులంలోని కొందరు సిబ్బందే ఆరోపిస్తున్నారు. నక్సల్స్ ఏరియాలో పనిచేశా.. ఎవ రికీ భయపడ ను విద్యార్థులకు ఏజెన్సీలు ఇచ్చిందే వండిపెడుతాం. బాగానే వండి పెడుతున్నాం. అప్పడప్పుడూ జరిగేవి మామూలే కదా. పిలల్లతో చెప్పిచ్చమంటారా. నక్సల్స్ ఏరియాలో పనిచేసి వచ్చా. ఎవరికీ భయపడను. - ఎల్ కిరణ్మయి, గురుకుల కళాశాల ప్రిన్సిపల్ -
బిడ్డా..వెళ్లిపోయావా..!
రాయచోటి, న్యూస్లైన్ : రాయచోటి మండలం సుండుపల్లె మార్గంలోని కస్తూర్బాగాంధీ బాలికుల గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న టి.రెడ్డికుమారి(12) గురువారం అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. గురుకులం ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే విద్యార్థినికి నూరేళ్లు నిండాయంటూ మృతదేహంతో వారు ధర్నాకు దిగారు. రెడ్డికుమారి మృతదేహంపై పడి ఆమె తల్లి ‘అయ్యో బిడ్డా.. ఏమైందే నీకు. ఎవరేం చేశారే’ అంటూ గుండెలపై పడి రోదించడం అందరికీ కన్నీళ్లు తెప్పించింది. రాయచోటిలోని మేదర వీధికి చెందిన గోవిందమ్మ, సుబ్బయ్య ద ంపతులకు ఐదుగురు సంతానం. కొన్నేళ్ల కిందటే సుబ్బయ్య కాలం చెందగా గోవిందమ్మ కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. వచ్చే ఆదాయం కుటుంబ పోషణకే సరిపోయేది కాదు. మూడో కుమార్తె రెడ్డికుమారితో పాటు మరో కుమార్తెను రాయచోటిలోని కస్తూర్బా పాఠశాలలో చేర్పించింది. గురువారం తెల్లవారుజామున నిద్రలేచిన రెడ్డికుమారి బాత్రూమ్కని వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తోటి విద్యార్థినులు, సిబ్బంది విషయాన్ని ప్రిన్సిపాల్ విజయలక్ష్మి ఫోన్లో తెలిపారు. తరువాత బాలికను హాస్టల్లో ఉంటున్న ఉపాధ్యాయినిలే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధరించారు. మృతదేహంతో ఆందోళన సంఘటన అనంతరం విద్యార్థిని మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నేతలు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. బీఎస్యూ నేత లక్ష్మీనారాయణ, ఏఐఎస్ఎఫ్ నేత శ్రీనివాసులు, ఎస్ఎఫ్ఐ నాయకుడు ఫయాజ్, సీపీఐ నాయకులు అంకన్న, శంకరయ్య ధర్నానుద్దేశించి మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన జరిగిందని ఆరోపించారు. జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. లేకపోతే ఇక్కడి నుంచి కదలమని భీష్మించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అర్బన్ సీఐ శ్రీరాములు తమ సిబ్బందితో వచ్చి ఆందోళనకారులతో చర్చించారు. మృతురాలి సంబంధీకులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు. దీంతో విద్యార్థిని సోదరుడు రెడ్డిసుబ్బయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. తరలివచ్చిన అధికారులు సంఘటన జరిగిన వెంటనే ఆర్వీఎం పీఓ డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, ప్రభుత్వ గురుకుల పాఠశాలల జోనల్ అధికారిణి గీతావాణి ఇక్కడికి చేరుకున్నారు. జరిగిన సంఘటనపై ఆరా తీశారు. మృతురాలి తల్లితో మాట్లాడారు. తమ కుమార్తె అనారోగ్యంతోనే మరణించినట్లు ఆమె అధికారులకు తెలిపారు. అయితే విద్యార్థి సంఘాల నేతలు ఈ విషయాన్ని ఖండించారు. రూ.10 వేలు నగదుతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని పీఓ ప్రలోభపెట్టి విద్యార్థిని తల్లితో ఇలా చెప్పించారని ఆగ్రహించారు. దీన్ని పీఓ తోసిపుచ్చారు. జరిగిన సంఘటనపై తమకు అనుమానముందని బాలిక తల్లి చెబితే విచారణ జరిపిస్తామని పీఓ అన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నందున వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఒకవేళ మరే కారణంతోనైనా విద్యార్థిని చనిపోయి ఉన్నట్లైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పీఓ ప్రకటించారు. నిర్లక్యమే ప్రాణం తీసింది కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే విద్యార్థిని రెడ్డికుమారి ప్రాణం తీసిందని ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(ఓపీడీఆర్) రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.ఈశ్వర్ ఆరోపించారు. విద్యార్థినుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా నర్సును నియమించినా ప్రిన్సిపల్ సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని నిప్పులు చెరిగారు. విద్యార్థిని మృతికి కారకులై ప్రిన్సిపాల్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. -
‘గురుకులం’పై గద్దలు!
ఘట్కేసర్, న్యూస్లైన్: నిరుపేదలకు ఉచితంగా విద్యనందించాలనే సదుద్దేశంతో ఘట్కేసర్లో నిర్మించిన గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల మనుగడకు ముప్పు వాటిల్లింది. దశాబ్ధాల క్రితం దాతలు అందజేసిన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో ప్రముఖ విద్యాసంస్థగా పేరుగాంచిన ఇక్కడి విద్యాసంస్థ నేడు దయనీయ స్థితికి చేరింది. ప్రముఖ ఆర్యసమాజ నాయకుడు, సంఘ సేవకుడు బన్సీలాల్ వ్యాస్జీ 1938 సంవత్సరంలో నగరంలోని రాంబాగ్లో నిరుపేదలకు తెలుగు, సంస్కృతం మాధ్యమంలో విద్యను అంద జేయాలని పాఠశాలను ప్రారంభించారు. అనంతరం కొన్ని కారణాల వల్ల 1942లో ఆ పాఠశాలను ఘట్కేసర్కు తరలించారు. ఇక్కడ సుమారు 24ఎకరాల స్థలంలో గురుకుల జూనియర్ కళాశాల, పాఠశాలను ఏర్పాటు చేశారు. తన అల్లుడు చేస్తున్న సమాజసేవకు ముగ్దుడైన బన్సీలాల్ వ్యాస్జీ మామ వైద్యనాథ్.. శేరిలింగంపల్లి సమీపంలోని మాదారం, వెంకటాపూర్లో ఉన్న 627ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. దానిని వ్యాస్జీ తన పేరుమీద కాకుండా గురుకులం పేరు మీదకు మార్చారు. దాని ద్వారా లభించే ఆదాయాన్ని పూర్తిగా గురుకులాల నిర్వహణకే ఖర్చుచేశారు. వ్యాస్జీ చేస్తున్న కృషిని చూసిన పలువురు ప్రముఖులు సైతం విరాళాలు అందజేశారు. అయితే నిర్వహణ సరిగా లేక ఆదాయం క్షీణించి గురుకులాల మనుగడ కష్టంగా మారినట్టు తెలుస్తోంది. ఘట్కేసర్ స్థలంలో అనేక నిర్మాణాలు ఘట్కేసర్లో కేటాయించిన స్థలంలో కొన్ని కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించారు. నిరుపేద, సామాజికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం వసతి గృహాన్ని సైతం ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందించారు. యజ్ఞయాగాలు నిర్వహించటానికి పెద్దయజ్ఞశాలను నిర్మించారు. పిల్లలకు ధ్యానంపై శిక్షణ ఇప్పించటానికి ధ్యాన మందిరం నిర్మించారు. కబ్జాదారుల కన్ను.. గురుకులం భుములపై ఇప్పుడు కబ్జాదారుల కన్ను పడింది. సుమారు ఐదెకరాలు ఇప్పుడు అన్యాక్రాంతమైంది. దీని విలువ రూ.ఐదు కోట్ల వరకు ఉంటుందని అంచనా. ట్రస్టు నుంచి ప్రశ్నించేవారు లేకపోవడం, నిర్వహణను గాలికొదలడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఇటీవల ఒకటిన్నర ఎరకం కబ్జాకు గురికావడంతో స్థానికులు స్పందించి అడ్డుకున్నారు. మిగిలిన భూమికూడా అక్రమార్కుల పరం కాకముందే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా బన్సీలాల్ వ్యాస్జీ 1956లో జడ్చర్ల వద్ద జరిగిన రైలు ప్రమాదంలో చనిపోయారు. ఆయన స్మృతి చిహ్నంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ 2న గురుకులంలో 24గంటలు అఖండ గాయత్రీ మంత్రం పఠించి అన్నదానం చేస్తారు. బన్సీలాల్ వ్యాస్జీ చనిపోయిన కొన్నాళ్లకు గురుకుల విద్యాసంస్థ నిర్వహణ ట్రస్టు మారింది. దానికి చైర్మన్గా కొంతకాలం వందేమాతరం రామచంద్రరావు కొనసాగారు. ట్రస్టు సభ్యుల మ ద్య విభేదాలు తలెత్తడంతో ఆలనాపాలన చూ సుకునేవారు లేకపోయారు. ఆ తర్వాత మారి న ట్రస్టు సభ్యులు గురుకుల అభివృద్ధిని విస్మరించారు. ప్రస్తుతం గురుకుల భూములు కబ్జా కు గురవుతున్నా సంస్థ తరఫున ప్రశ్నించేవా రు లేరు. ఇటీవల ఓ వ్యాపారవేత్త ఒకటిన్నర ఎకరం భూమి చుట్టూ కడీలు పాతి కబ్జాకు పాల్పడగా దానిని స్థానికులు అడ్డుకున్నారు. దయనీయం.. నేటి పరిస్థితి దేవాదాయశాఖసహకారంతో ప్రస్తుతం గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల పనిచేస్తున్నాయి. ఉపాధ్యాయుల నియామకాలు లేవు. దాంతో తక్కువ మంది ఉపాధ్యాయులు, ప్రైవేట్ టీచర్ల సహాయంతో విద్యా సంవత్సరాన్ని నెట్టుకొస్తున్నారు. ఉపాధ్యాయులు తక్కువ గా ఉండటంతో విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం తగ్గుతోంది. కొన్ని గదులు శిథిలావస్థకు చేరుకోగా మిగిలిన గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. దాతలు, పూర్వ విద్యార్థులు కొన్ని తరగతి గదులను నిర్మించారు. కబ్జాదారులపై కేసులు పెడతాం: ఎమ్మెల్యే గురుకుల స్థలాలను కబ్జాచేస్తే కేసులు పెడతామని స్థానిక ఎమ్మెల్యే కేఎల్లార్ ఇటీవల జరిగిన వ్యాస్జీ వర్ధంతి సభలో హెచ్చరించారు. కబ్జా చేసినవారితోపాటు అందుకు సహకరించిన వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు. కబ్జాలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. -
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి: గీతారెడ్డి
జహీరాబాద్, న్యూస్లైన్: విద్యార్థినులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జే గీతారెడ్డి సూచించారు. శనివారం మండలంలోని రంజోల్ గ్రామ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 9వ జోనల్ స్థాయి గురుకుల పాఠశాలల క్రీడలు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ప్రారంభ వేడుకల్లో కలెక్టర్ దినకర్బాబు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్కుమార్, డీసీసీబీ చైర్మన్ ఎం జైపాల్రెడ్డి, అదనపు జేసీ మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమన్నారు. ఈ పోటీల్లో మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇలాం టి వేదికల్లో విద్యార్థులు వారి సత్తాను చాటుకోవాలన్నారు. వ్యక్తిగత ప్రతిభ చూపేందుకు కృషి చేయాలన్నారు. గురుకుల పాఠశాలల్లో ఉత్తమ బోధన అందుతోందన్నారు. అందుకే మంచి ఫలితాలను వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఉన్నత చదువులు చదువుకుని కుటుంబానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినులకు సూచించారు. విదేశాల్లో ఉన్నత చదువులు కొనసాగించుకోవాలనుకునే గురుకుల పాఠశాలల విద్యార్థులను ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందన్నారు. అనంతరం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్కుమార్ మాట్లాడారు. గురుకులాల్లో నాణ్యమైన విద్య, క్రీడలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆపరేషన్ మౌంట్ ఎవరెస్ట్ అనే కార్యక్రమం తీసుకున్నట్లు తెలిపారు. ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కేందుకు వీలుగా ఒక బృందాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. కలెక్టర్ దినకర్బాబు మాట్లాడుతూ కష్టపడితేనే ఆశించిన ఫలితం పొందవచ్చని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యం చాటుకోవాలన్నారు. డీసీసీబీ చైర్మన్ ఎం జైపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సురేష్కుమార్, గురుకుల పాఠశాలల కన్వీనర్ సుదర్శన్, పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, గ్రామ సర్పంచ్ అనసూజమ్మ, విద్యార్థులు, ఉపాధ్యాయులు నాయకులు పాల్గొన్నారు.