Hyderabad News
-
చుక్కలు చూపిస్తున్న మెట్రో రైళ్లు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో తరచూ స్తంభిస్తున్న మెట్రో రైళ్లు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవైపు ప్రయాణికుల డిమాండ్ మేరకు కోచ్లు అందుబాటులో లేకపోవడంతో కిక్కిరిసిపోతున్నాయి. అదే సమయంలో ఉన్నపళంగా నిలిచిపోతున్న సర్వీసులతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన వారు గంటల తరబడి పడిగాపులు కాయాల్సివస్తోంది. కొద్దిరోజుల క్రితం నాగోల్– అమీర్పేట్ మార్గంలో సాంకేతిక కారణాలతో సర్వీసులు నిలిచిపోయాయి. ఉదయం 7.30 గంటల నుంచి సుమారు గంట పాటు రైళ్ల నిర్వహణకు ఆటంకాలు తలెత్తడంతో ప్రయాణికులంతా ఎక్కడిక్కడ మెట్రో స్టేషన్లలోనే పడిగాపులు కాశారు. ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. సామాజిక మాధ్యమాల్లో ఆందోళన వ్యక్తమైంది. గతేడాది నవంబర్ 4న సైతం మియాపూర్–ఎల్బీనగర్ రూట్లో అసెంబ్లీ సమీపంలో మెట్రో రైలు ఆగిపోయింది. దీంతో ఆ రూట్లో సర్వీసులను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ఇలా తరచూ మెట్రో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటం పట్ల నగరంలోని వివిధ ప్రాంతాల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ముందస్తు సమాచారం లేదు..సాధారణంగా సాంకేతికంగా తలెత్తే సమస్యలతో సిగ్నలింగ్ సేవలకు ఆటంకం కలుగుతుంది. అధికారులు ఆ సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు అరగంట నుంచి గంట వరకు సమయం పట్టవచ్చు. ఈ క్రమంలో మెట్రో రాకపోకల్లో తలెత్తిన అంతరాయంపై ప్రయాణికులకు ముందస్తుగా ఎలాంటి సమాచారం లభించడం లేదు. ఒకవైపు అప్పటికే టికెట్లు తీసుకున్న వాళ్లు మెట్రో కోసం ఎదురు చూస్తుంటారు. మరోవైపు యథావిధిగా టికెట్ విక్రయాలు కొనసాగుతూనే ఉంటాయి. దీంతో ఒక ట్రైన్కు సరిపడా ప్రయాణికులు ఎదురుచూస్తుండగా.. అంతకు రెట్టింపు సంఖ్యలో టికెట్లు ఇవ్వడం వల్ల రద్దీ అనూహ్యంగా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్లు మెట్రోస్టేషన్లలో అనౌన్స్మెంట్ ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలకు అవకాశం లభిస్తుందని పేర్కొంటున్నారు. అధికారులు ఈ మేరకు ఎలాంటి అనౌన్స్మెంట్ చర్యలు చేపట్టకపోవడం వల్ల ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదు.కోచ్ల కొరత.. తంటాలుసాంకేతిక సమస్యలతో పాటు కోచ్ల కొరత కూడా నగరంలో మెట్రో ప్రయాణానికి సవాల్గా మారింది. ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ కారిడార్లలో ప్రతి రోజు సుమారు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. రోజురోజుజూ మెట్రోల్లో రద్దీ పెరుగుతూనే ఉంది. ఒక ట్రైన్ బయలుదేరే సమయానికి మరో రెండు ట్రైన్లకు సరిపడా ప్రయాణికులు టికెట్లు తీసుకొని ఎదురుచూస్తున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం మెట్రోలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ మేరకు రైళ్లు పెంచాలనే ప్రతిపాదన ఉంది. నాగ్పూర్ నుంచి కొత్త కోచ్లను కొనుగోలు చేయనున్నట్లు ఇటీవల ఎల్అండ్టీ అధికారులు పేర్కొన్నారు. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. -
ఒత్తిడే శత్రువు!
మరికొద్ది రోజుల్లో టెన్త్, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల సమయం సమీపిస్తున్నకొద్దీ.. విద్యార్థుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. పరీక్షల్లో తప్పుతామోనని.. కొంత మంది, తల్లిదండ్రులు ఆశించిన దానికంటే తమకు తక్కువ మార్కులు వస్తాయోననే టెన్షన్తో మరికొంత మంది తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. బలహీన క్షణంలో ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. వార్షిక పరీక్షల వేళ.. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఏ ఒక్క రెసిడెన్షియల్ కాలేజీలోనూ కౌన్సిలర్ లేకపోవడం కూడా ఈ విపత్కర పరిణామాలకు మరో కారణం. అధ్యాపకులే కాదు తల్లిదండ్రులు కూడా విద్యార్థుల మానసిక స్థితిపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. బలవంతపు బోధన, అభ్యాసన కంటే.. ఇష్టంతో చదివేలా విద్యార్థులను మానసికంగా సంసిద్ధులను చేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోర్యాంకులు, గ్రేడ్లు రద్దు చేశాంవిద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే టెన్త్లో ర్యాంకులు, గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిలో మానసిక స్థైర్యాన్ని నింపి, మానసికంగా పరీక్షలకు సంసిద్ధులను చేస్తున్నాం. అర్థం కాని పాఠ్యాంశాలను మళ్లీ వివరించే ప్రయత్నం చేస్తున్నాం. వార్షిక పరీక్షలపై వారిలో ఉన్న భయాన్ని పూర్తిగా పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. మోడల్ పేపర్లను తయారు చేసి, పరీక్షలు రాయిస్తున్నాం.– సుశీందర్రావు, డీఈఓ, రంగారెడిప్రేమతో చెప్పాలిపిల్లల ఆత్మహత్యలకు కాలేజీ యాజమాన్యాలది ఎంత బాధ్యత ఉంటుందో? తల్లిదండ్రులది అంతే బాధ్యత ఉంటుంది. పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకోకుండా వారికి ఇష్టం లేని కోర్సులు, కాలేజీల్లో బలవంతంగా చేర్పిస్తుంటారు. ఈ సమయంలో కనీసం కౌన్సెలింగ్ కూడా ఇవ్వడం లేదు. ఒత్తిడికి గురై, ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నకొద్దీ.. వారిలో ఆందోళన, భయం ఎక్కువై.. ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు వారితో ప్రేమగా వ్యవహరించాలి. మానసిక స్థైర్యం చెప్పాలే గాని.. వారిని తోటి పిల్లలు, బంధువుల ముందు తిట్టకూడదు.– డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, మానసిక నిపుణుడ్డు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరంఅత్యధిక మార్కులు సాధించాలనే ఉద్దేశంతో చాలా మంది పిల్లలు నిద్రాహారాలు మాని చదువుతుంటారు. అదేపనిగా చదవడం వల్ల తలనొప్పి, మానసిక సంఘర్షణ, కంటిచూపు సమస్య వస్తుంది. తీరా పరీక్షలు మొదలయ్యే నాటకి అనారోగ్యం పాల వుతుంటారు. ఈ సమయంలో పరీక్ష సరిగా రాయలేక..ఫెయిలవుతుంటారు. పిల్లల ఆరోగ్యపై తల్లిదండ్రులు శ్రద్ద చూపించాలి. వేళకు నిద్రపుచ్చడం, వేళకు నిద్రలేపి ఓ ప్రణాళిక ప్రకారం చదివించడం చేయాలి. తేలికగా జీర్ణం అయ్యే అప్పుడే వండివార్చిన తాజా ఆహారం అందించాలి.– డాక్టర్ వెంకటి, డీఎంహెచ్ఓ, హైదరాబాద్మచ్చుకు కొన్ని ఇటీవలి ఉదంతాలు..● ప్రిన్సిపాల్ తిట్టాడనే కారణంతో షాద్నగర్లోని శాస్త్ర పాఠశాల భవనంపై నుంచి దూకి 10వ తరగతి విద్యార్థి నీరజ్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.● పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయంతో మైసమ్మగూడ మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని కళాశాల నాలుగో అంతస్తు కిటికీ నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు యత్నించగా తోటి విద్యార్థులు గమనించి అడ్డుకున్నారు.● కుంట్లూరులోని తెలంగాణ గిరిజన రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న నాగర్కర్నూలుకు చెందిన సౌమ్య (17) ఇటీవల తరగతి గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.● చదువు ఒత్తిడి తట్టుకోలేక హైదర్నగర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న షాద్నగర్కు చెందిన విద్యార్థి కౌశిక్ రాఘవ (17) హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.● పరీక్ష సరిగా రాయలేదనే కారణంతో జీడిమెట్ల పీఎస్ పరిధిలో ఇటీవల పదో తరగతి విద్యార్థిని త్రిష ఆత్మహత్యకు పాల్పడింది. -
రాచకొండలో ఆపరేషన్ స్మైల్
సాక్షి, సిటీబ్యూరో: హోటళ్లు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేస్తున్న 1,051 మంది బాల కార్మికులకు రాచకొండ పోలీసులు విముక్తి కలిగించారు. ఆపరేషన్ స్మైల్–11లో భాగంగా కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మానవ అక్రమ రవాణా, షీ టీమ్, స్పెషల్ బ్రాంచ్ విభాగాలతో పాటు ఒక సబ్ ఇన్స్పెక్టర్, నలుగురు కానిస్టేబుళ్లు (ఒక మహిళా కానిస్టేబుల్ కలిపి)లతో 9 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ కొనసాగింది. విముక్తి కలిగించిన చిన్నారుల్లో మన రాష్ట్రానికి చెందిన బాలురు 512 మంది, బాలికలు 28 మంది ఉండగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన బాలురు 473 మంది, బాలికలు 38 మంది ఉన్నారు. చిన్నారులను పనిలో పెట్టుకున్న 464 మంది యాజమానులపై ఎఫ్ఐఆర్లు, 410 మందిపై జీడీ ఎంట్రీ కేసులు నమోదు చేశారు. 1,051 మంది చిన్నారులకు విముక్తి -
మురుగు శుద్ధి దిశగా జలమండలి అడుగులు
సాక్షి, సిటీబ్యూరో: వందశాతం మురుగు శుద్ధి దిశగా జలమండలి అడుగులేస్తోంది. మహా నగరంలో రోజువారీగా ఉత్పన్నమయ్యే మురుగు నీటిని పూర్తి స్థాయిలో శుద్ధి చేసేందుకు మూడేళ్ల క్రితం చేపట్టిన మురుగు శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) ప్రాజెక్టు పూర్తి కావస్తోంది. ఇప్పటికే సుమారు 663 ఎంఎల్డీల సామర్థ్యం గల 11 ఎస్టీపీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరో 443 ఎంఎల్డీ సామర్థ్యం గల తొమ్మిది ఎస్టీపీల నిర్మాణాలు తుది దశకు చేరుకుంటున్నాయి. మరోవైపు అమృత్ పథకంక కింద 972 ఎంఎల్డీ సామర్థ్యమున్న 39 ఎస్టీపీల నిర్మాణాలకు టెండర్లను ఆహ్వానించింది.1,650 ఎంఎల్డీల మురుగు ఉత్పన్నం..గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజువారీగా సుమారు 1,650 మురుగు నీరు ఉత్పన్నమవుతోందని అంచనా. అందులో సుమారు 772 ఎంఎల్డీల మురుగు నీటిని ఇప్పటికే 25 ఎస్టీపీల ద్వారా శుద్ధి చేస్తోంది. ఉత్పన్నమవుతున్న నీటిలో 46 శాతం శుద్ధి జరుగుతుండటంతో మిగిలిన 54 శాతం సైతం మురుగు నీటిని శుభ్రం చేయడానికి కొత్త ఎస్టీపీల నిర్మాణాలకు నడుం కట్టింది.31 నుంచి 20కి కుదింపుమూడేళ్ల క్రితం చేపట్టిన ఎస్టీపీల ప్రాజెక్టును మొత్తం మూడు ప్యాకేజీలుగా విభజించి రూ.3866.41 కోట్ల అంచనా వ్యయంతో 1259.50 ఎంఎల్డీల సామర్థ్యం గల 31 కొత్త మురుగు నీటి శుద్ధి కేంద్రాలకు ప్రణాళిక రూపొందించి కార్యాచరణకు దిగింది. స్థల సేకరణ వివాదాలు ఇతరత్రా అభ్యంతరాలతో ఎస్టీపీల సంఖ్యను 20కి కుదించి ఎంఎల్డీల సామర్థ్యాన్ని మాత్రం తగ్గకుండా చర్యలు చేపట్టింది. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీ వినియోగిస్తూ ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్యాకేజీ –1 కింద అల్వాల్, మల్కాజిగిరి, కాప్రా, ఉప్పల్, ప్యాకేజీ–2 కింద రాజేంద్రనగర్, ఎల్బీ నగర్ ప్యాకేజీ–3 కింద కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో ఎస్టీపీ నిర్మాణాలు చేపట్టగా.. ఇప్పటికే వీటిలో సగం అందుబాటులోకి వచ్చాయి. మిగతావి తుది దశలో ఉన్నట్లు జలమండలి వర్గాలు చెబుతున్నాయి.హ్యామ్ మోడ్లో అమృత్ ఎస్టీపీలుకేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద మంజూరైన 39 ఎస్టీపీలు హ్యామ్ మోడ్లో నిర్మించేందుకు జలమండలి ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం అవి టెండర్ దశలో ఉన్నాయి. అందులో ఒక ఎస్టీపీ పీపీపీ మోడ్లో.. మిగతా 38 ఎస్టీపీలను హైబ్రిడ్ అన్నూయిటీ మోడల్ (హ్యామ్) విధానంలో నిర్మించనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే.. 972 ఎంఎల్డీల మురుగును శుద్ధి చేయవచ్చు. వాటి నిర్మాణ పనులు రెండు ప్యాకేజీల్లో పూర్తి చేయనుంది.. ప్యాకేజీ–1లో 16 ఎస్టీపీలను, ప్యాకేజీ–2లో 22 ఎస్టీఛపీలు నిర్మిస్తారు. నిర్మాణ సంస్థ ఎస్టీపీలను నిర్మించి 15 ఏళ్ల పాటు నిర్వహణ చేపట్టాల్సి ఉంది. మొత్తం ఎస్టీపీల నిర్మాణ వ్యయం రూ.2,569.81 కోట్లు కాగా.. 15 ఏళ్ల పాటు నిర్వహణకు రూ.1,279.29 కోట్ల అంచనా వ్యయం కానుంది. ఎస్టీపీల ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో కేంద్రం 30, రాష్ట్రం 30 నిర్మాణ సంస్థ 40 శాతం చొప్పున నిధులు సమకూర్చనున్నాయి.తుది దశలో ఉన్న ఎస్టీపీలుఎస్టీపీ ఎంఎల్డీ.. సామర్థ్యంపాలపిట్ట 7శివాలయనగర్ 14ముల్లకత్వ చెరువు 25నలగండ్ల 7అత్తాపూర్–1 64అంబర్పేట 212.5రెయిన్బో విస్తా 43.5రామ చెరువు 30అత్తాపూర్–2 40 -
డ్రగ్స్ విక్రేతల అరెస్ట్
23 గ్రాముల కొకై న్, కారు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం మాదాపూర్: మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఇజ్జత్నగర్లోని అలేఖ్యహోమ్స్లో ఉంటున్న చంద్రపు ప్రసన్నకుమార్ రెడ్డి ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. అతడికి బెంగళూరుకు చెందిన డ్రగ్స్ విక్రేత కెవిన్తో పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతను గురువారం ప్రసన్నకుమార్ రెడ్డికి డ్రగ్స్ అందజేసేందుకు మాదాపూర్లోని హైటెక్స్ మెటల్ చార్మినార్ వద్దకు వచ్చాడు. దీనిపై సమాచారం అందడంతో దాడి చేసిన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 23 గ్రాముల కొకై న్ స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పాల్వంచకు చెందిన జూపల్లి విశ్వామిత్ర, మణికొండకు చెందిన శ్రీనివాస సాయిదీపక్, సికింద్రాబాద్కు చెందిన వరుణ్గౌడ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాగా కెవిన్ బెంగళూరులో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నాడని, ప్రస్తుతం హైదరాబాద్లో మొదలు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి మాదకద్రవ్యాలతో పాటు, కారు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న యువకుడి అరెస్ట్ మాదాపూర్: డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాదాపూర్లోని జేఎంజే కోలివింగ్ పీజీ హాస్టల్లో ఉంటున్న గుత్తాతేజ కృష్ణ ఆర్కిటెక్గా పనిచేస్తున్నారు. గురువారం అతను అయ్యప్ప సొసైటీ వద్ద బెంగళూరుకు చెందిన శాండీ అనే యువతి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు గుత్తా తేజకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డ్రగ్స్ విక్రేత శాండి పరారీలో ఉన్నట్లు తెలిపారు. పోలీసులు తేజ నుంచి 11.14 గ్రాముల ఎండీఎంతో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి చొరబడి..కత్తులతో పొడిచి..
చిలకలగూడ: ఓ ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు తల్లి కొడుకుపై కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం చిలకలగూడ ఠాణా పరిధిలోని మెట్టుగూడలో చోటుచేసుకుంది. . తల్లి అపస్మారకస్థితిలో ఉండగా, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఎవరు, ఎందుకు దాడికి పాల్పడ్డారో తెలియరాలేదు. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మెట్టుగూడ నల్లపోచమ్మ ఆలయ సమీపంలో రేణుక, శేఖర్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమారులు యశ్వంత్, యశ్పాల్, వినయ్ ఉన్నారు. ఏజీ కార్యాలయంలో పనిచేసే శేఖర్ మూడేళ్ల క్రితం మృతిచెందాడు. రేణుక, తన ముగ్గురు కుమారులు, మంచానికే పరిమితమైన అత్త (శేఖర్ తల్లి) అనసూయ (70) కలిసి ఉంటున్నారు. మౌలాలీలోని ఓ రైల్వే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న యశ్వత్ గత మూడు నెలలుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. యశ్పాల్, వినయ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. గురువారం ఉదయం యశ్పాల్, వినయ్ డ్యూటీకి వెళ్లగా యశ్వంత్, తల్లి రేణుక ఇంట్లోనే ఉన్నారు. ఉదయం 11.30 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు రేణుక, యశ్వంత్లపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసిన అనంతరం బయట తలుపులకు గడియపెట్టి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన వారి కేకలు విన్న స్థానికులు తలుపులు తెరిచి చూడగా ఇద్దరూ రక్తపు మడుగులో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. రేణుక కడుపుపై రెండు, యశ్వంత్ కడుపుపై మూడు కత్తిపోట్లు ఉన్నాయి. రేణుక అపస్మారకస్థితిలో ఉండగా, యశ్వంత్ పరిస్థితి విషమంగా ఉందని, వారికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. పథకం ప్రకారమే దాడి.. తాము ఇంట్లో లేని సమయం చూసి పథకం ప్రకారమే దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారని రేణుక మూడో కుమారుడు వినయ్ తెలిపాడు. తమకు ఎవరితోనూ శతృత్వం లేదన్నాడు. ఎవరు ఎందుకు దాడి చేశారో తెలియడం లేదని, ఆరుగురు వ్యక్తులు దాడిలో పాల్గొన్నారని, నలుగురు ఇంట్లోకి చొరబడి దాడి చేయగా, ఇద్దరు బయటే ఉన్నట్లు తెలిపాడు. సవాల్గా తీసుకున్న పోలీసులు... హత్యాయత్నంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈస్ట్జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ జైపాల్రెడ్డి, చిలకలగూడ ఇన్స్పెక్టర్ అనుదీప్, డీఐ రమేష్గౌడ్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్టీం, డాగ్స్వాడ్ ఆధారాలు సేకరించారు. రక్తపు మరకలతో ఉన్న పదునైన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో దుండగులను ప్రత్యక్షంగా చూసిన వారు లేకపోవడం గమనార్హం. బాధితులు నోరు విప్పితేనే... గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు కోలుకుని నోరువిప్పితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఈస్ట్జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ జైపాల్రెడ్డి తెలిపారు. దుండగులను కేవలం బాధితులు మాత్రమే చూశాన్నారు. అన్ని కోణాల్లోను దర్యాప్తు చేపట్టామని, త్వరలోనే మిస్టరీని చేధిస్తామన్నారు. తల్లీకుమారుడిపై హత్యాయత్నం తీవ్రగాయాలతో గాంధీలో చికిత్స కుమారుడు యశ్వంత్ పరిస్థితి విషమం అపస్మారకస్థితిలో తల్లి రేణుక ఎవరు, ఎందుకు దాడి చేశారో తెలియని వైనం బాధితులు కోలుకుని నోరు విప్పితేనే వాస్తవాలు వెలుగులోకి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆధారాల సేకరణ -
అంతర్రాష్ట్ర గంజాయి పెడ్లర్ అరెస్ట్
సికింద్రాబాద్: ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న పెడ్లర్ను జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం జీఆర్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లాకు చెందిన అబల్(23)వ్యవసాయ కూలీగా పని చేసేవాడు. సులువుగా డబ్బులు సంపాదించాలని భావించిన అతను కొద్ది రోజుల క్రితం అడవ పట్టణానికి వెళ్లి రైనో అనే వ్యక్తిని కలిశాడు. మహారాష్ట్రలో గంజాయికి చాలా డిమాండ్ ఉందని, తనకు 8 కిలోల గంజాయి కావాలని చెప్పిన రైనో పూణేకు గంజాయి తరలిస్తే ప్యాకెట్కు రూ. 1000 ఇస్తానని చెప్పడంతో అబల్ అందుకు అంగీకరించారు. దీంతో అతను మాసియా అనే వ్యక్తి నుంచి కిలో రూ. 800 చొప్పున గంజాయి కొనుగోలు చేసి అబల్కు అప్పగించాడు. ఈ నెల 4న అతను గంజాయి ప్యాకెట్లతో ఇచ్చాపురం నుంచి కోణార్క్ ఎక్స్ప్రెస్లో బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానస్పదంగా కనిపించిన అబల్ బ్యాగ్ను సోదా చేయగా రూ.1.96 లక్షల విలువైన 7.8 కిలోల గంజాయిని గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్ఐ మాజీద్, హెచ్సీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.7.84 కిలోల గంజాయి స్వాధీనం -
రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ రహదారి భద్రతా మాసం–2025 నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కమిషనరేట్ పరిసర ప్రాంతాల్లో గురువారం 1494 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. లా అండ్ ఆర్డర్ విభాగం 708, ట్రాఫిక్ విభాగం 378, ట్రాఫిక్ ట్రయినింగ్ ఇనిస్టిట్యూట్ (టీటీఐ) 408 అవగాహన సెషన్లు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు కమిషనర్ జీ సుధీర్ బాబు తెలిపారు. డ్రైవర్లు, పాదచారులు, విద్యార్థులు, ఆర్టీసీ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, ఆటోడ్రైవర్లను అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములను చేశారు. రోడ్డు భద్రతా నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వివిధ విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. -
బండిలో బాటిల్స్
గచ్చిబౌలి: రోడ్డుపై వ్యాపారం చేస్తున్న ఓ మహిళకు చెందిన తోపుడు బండిలో 92 విస్కీ క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్న సంఘటన గురువారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జేవీజీహిల్స్లో ఫుట్పాత్పై ఉన్న డబ్బాలో మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు స్థానికులు శేరిలింగంపల్లి సర్కిల్ ఉప వైద్యాధికారి శ్రీకాంత్కు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి వెళ్లిన ఆయన తనిఖీలు చేయగా 10 క్వార్టర్ బాటిల్స్ లభించాయి. వాటిని ధ్వంసం చేసి డబ్బాను తొలగించారు. రాజరాజేశ్వరీ కాలనీలోనూ ఇదే తరహాలో ఉదయం నుంచి మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో అక్కడికి వెళ్లిన ఆయన సోదా చేయగా, తోపుడు బండిలో ఏకంగా వివిధ కంపెనీలకు చెందిన 92 క్వార్టర్ బాటిళ్లు గుర్తించి నివ్వెరపోయారు. అంతే కాకుండా పక్కనే ఉన్న గుడిసెలో పలువురు మద్యం సేవిస్తున్నట్లు గుర్తించి డయల్ 100, గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. మద్యం విక్రయిస్తున్న మహిళతో పాటు మద్యం బాటిళ్లను పోలీసులకు అప్పగించారు. బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మహిళపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపారు. గత కొన్ని నెలలుగా ఉదయం 6 గంటల నుంచే మద్యం అమ్మకాలు జరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు పేర్కొన్నారు. తోపుడు బండిలో 92 విస్కీ క్వార్టర్ బాటిల్స్ ● కంగుతిన్న జీహెచ్సీ అధికారులు ● గచ్చిబౌలి పోలీసులకు అప్పగింత -
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
సైదాబాద్: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కర్నేల్గంజ్కు చెందిన మహ్మద్ సాదాబ్, మహ్మద్ దిల్షాద్ (21) సోదరులు నగరానికి వలస వచ్చి సైదాబాద్ రెడ్డిబస్తీలో ఉంటూ టైలరింగ్ పని చేస్తున్నారు. దిల్షాద్ యూపీలోని తమ గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునే వారు. అయితే కొన్ని రోజులుగా వారు ఫోన్లో గొడవ పడుతున్నారు. మంగళవారం రాత్రి సాదాబ్ ఇంటికి తిరిగి వచ్చేసరికి దిల్షాద్ ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు. అతడి సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దిల్షాద్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రేమ విఫలమై తన సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని సాదాబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి దారుణ హత్య చాంద్రాయణగుట్ట: క్షణికావేశంలో ముగ్గురు స్నేహితులు ఓ యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేసిన సంఘటన గురువారం బండ్లగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బండ్లగూడ, ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన షేక్ షాబాజ్ (23) డీసీఎం డ్రైవర్, లేబర్గా పని చేసేవాడు. అదే ప్రాంతానికి చెందిన ఆజం, ఆయూబ్, అమీర్ అతడి స్నేహితులు. వీరు నలుగురు ఇందిరానగర్లోని శ్మశాన వాటికలో కూర్చుని మద్యం తాగేవారు. గురువారం మధ్యాహ్నం మద్యం సేవిస్తుండగా ఆజం, షాబాజ్ల మధ్య గొడవ జరిగింది. దీంతో షాజాబ్ ఆజమ్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని ఆజమ్ తన స్నేహితులు ఆయూబ్, అమీర్లకు చెప్పాడు. వీరు ముగ్గురు కలిసి మరోసారి మద్యం తాగి ఇందిరానగర్ శ్మశాన వాటిక నుంచి వెళుతుండగా చిన్న సందులో నుంచి షాబాజ్ వస్తూ కనిపించడంతో ఆజం తన వద్ద ఉన్న కత్తితో షాబాజ్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన షాబాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ పాటిల్, చాంద్రాయణగుట్ట ఏసీపీ కె.మనోజ్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బైకులు దగ్ధం మణికొండ: షాపు ఎదుట నిలిపిన ఎలక్ట్రిక్ బైక్లు దగ్ధమైన సంఘటన మణికొండ మున్సిపాలిటీ అలకాపూర్ టౌన్షిప్లో గురువారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అలకాపూర్ రోడ్డు నెంబర్ 23లో డామినోస్ పిజ్జా షాప్ కొనసాగుతుంది. అందులో నుంచి పిజ్జాలు సరఫరా చేసే స్కూటీలను బుధవారం రాత్రి ఎప్పటి లాగే షాప్ ఎదుట పార్క్ చేశారు. గురువారం తెల్లవారు జామున ఓ బైక్కు నిప్పంటుకోవడంతో పక్కనే ఉన్న మరో నాలుగు వాహనాలకు వ్యాపించాయి. దీనిని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే అవి కాలి బూడిదయ్యాయి. -
ఇద్దరు సైబర్ నేరగాళ్లకు ఆరు నెలల జైలు
సాక్షి, సిటీబ్యూరో: ఓ మహిళ డీమ్యాట్ ఖాతాలోని షేర్లను తమ ఖాతాల్లోకి మార్చుకుని మోసం చేసిన ఇద్దరు సైబర్ నేరగాళ్లపై నేరం నిరూపణ అయింది. వీరికి న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విఽధించినట్లు డీసీపీ దార కవిత గురువారం వెల్లడించారు. నగరానికి చెందిన ఓ మహిళకు డీ మ్యాట్ ఖాతాతో పాటు వివిధ కంపెనీల షేర్లు ఉన్నాయి. 2014లో ఆమెకు వారాసిగూడకు చెందని ఏఎల్ దీపక్ పరిచయం ఏర్పడింది. ఆమె తండ్రి పేరుతో ఉన్న షేర్లను ఆమె ఖాతాలోకి బదిలీ చేయిస్తానంటూ నమ్మబలికాడు. ఆమెతో ఆదిత్య బిర్లా మనీ లిమిటెడ్ సంస్థలో ట్రేడింగ్ ఖాతా తెరిపించారు. బాధితురాలికి తెలియకుండా ఆమె పేరుతో ఈ–మెయిల్ ఐడీ సృష్టించాడు. దీని ఆధారంగా ఆమె డీమ్యాట్ ఖాతాలో ఉన్న షేర్లను కాజేసి, విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. 2018లో ఈ విషయాన్ని గుర్తించిన బాధితురాలు నగర సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ దందాలో దీపక్కు తార్నాక వాసి ఆర్ శ్రవణ్కుమార్ సహకరించినట్లు తేలింది. దీంతో అధికారులు వారిని అరెస్టు చేసి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం ఇరువురు నిందితులను దోషులుగా తేల్చింది. ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. స్నేహితుడి భార్యను నిండా ముంచాడు... తన స్నేహితుడి భార్యను టార్గెట్గా చేసుకున్న ఓ కేటుగాడు మరో వ్యక్తితో కలిసి రూ.8.13 లక్షలు కాజేశాడు. దీనికోసం సోలార్ ప్రాజెక్ట్ కోసం 100 శాతం రణం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. బాధితురాలి ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుజరాత్ రాష్ట్ర ఆర్థిక శాఖలోని ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో (పీఎంఈజీపీ) పని చేసి, కన్నుమూసిన అధికారి భార్య నగరంలో స్థిరపడ్డారు. పదవీ విరమణ చేసిన ఆమె తన భర్త ఫోన్ నెంబర్నే వినియోగిస్తున్నారు. పీఎంఈజీపీలో అతడితో కలిసి పని చేసిన ఓ వ్యక్తి దీనిని ఆసరాగా చేసుకున్నాడు. కొన్నాళ్ల క్రితం ఆమెకు ఫోన్ చేసి మాట్లాడిన అతగాడు క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ (సీజీటీఎంఎస్ఈ) పథకం కింద సోలార్ ప్రాజెక్టులకు 100 శాతం రుణం ఇప్పిస్తానని చెప్పాడు. ఆమె ఆసక్తి చూపడంతో మరో వ్యక్తిని పరిచయం చేసిన అతగాడు దరఖాస్తు చేసుకునే విధానాన్ని వివరించడంతో పాటు సహకరిస్తాడని చెప్పాడు. ఆపై పత్రాల తయారీ, ఇతర ఖర్చుల పేరుతో కొంత, రిఫండబుల్ డిపాజిట్ అంటూ మరికొంత మొత్తం... ఇలా రూ.8.13 లక్షలు బదిలీ చేయించుకున్నారు. ఆపై రుణం మంజూరైందని, త్వరలోనే మీ ఖాతాలోకి వస్తుందని చెప్పారు. అయితే రోజులు గడుస్తున్నా తన ఖాతాలోకి నగదు రాకపోవడంతో తాను చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వాలని వారిని కోరింది. అయితే రుణం మంజూరుకు మరికొంత మొత్తం డిమాండ్ చేయడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.10 వేల చొప్పున జరిమానా -
అనైతిక వైద్యం!
అల్లోపతి డాక్టర్లుగా చలామణి అవుతున్న ఆయుర్వేద వైద్యులుసాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు, రోగనిర్ధారణ కేంద్రాలు అడ్డదారులు తొక్కుతున్నాయి. గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు కనీస అనుభవం, అర్హత లేని వారితో చికిత్సలు చేయిస్తున్నాయి. ఆయుర్వేద వైద్యులు అల్లోపతి వైద్యులుగా చలామణి అవుతూ రోగులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. వనస్థలిపురం, హస్తినాపురం, తుర్కయాంజాల్, మీర్పేట్, బాలాపూర్, తుక్కుగూడ, శంషాబాద్, షాద్నగర్, చేవెళ్ల, ఆమనగల్లు కేంద్రంగా యథేచ్ఛగా ఈ దందా కొనసాగిస్తున్నాయి. ఇందుకోసం మార్కెటింగ్ ఏజెంట్లను నియమించుకోవడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే ఆర్ఎంపీలకు కమీషన్లు ఆశ చూపి అనైతిక వైద్యానికి పాల్పడుతున్నాయి. 2024 జులైలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి తొమ్మిది పడకల(జనరల్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాలు) ఆస్పత్రి కోసం అనుమతి పొందిన కొత్తపేట అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి యాజమాన్యం ఏకంగా కిడ్నీ మార్పిడి చికిత్సలు చేయడం వివాదాస్పదమైంది. మాస్క్లు ధరించి, చికిత్సలు.. జిల్లాలో స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, జనరల్ నర్సింగ్హోంలు, సాధారణ క్లినిక్లు, డయాగ్నోస్టిక్స్ కలిపి సుమారు 2,300 వరకు ఉన్నట్లు అంచనా. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి గుర్తింపు పొందినట్లు చెప్పుకొంటున్న మెజార్టీ ఆస్పత్రులకు ఫైర్ సేఫ్టీ లేదు. ఒకరి పేరుతో అనుమతి పొంది.. మరొకరితో చికిత్సలు చేయిస్తున్నారు. బోర్డుపై పేర్లు కనిపించే వైద్యులెవరూ ఇక్కడ అందుబాటులో ఉండటం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఆస్పత్రికి వస్తే కాంపౌండర్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులే సీనియర్ వైద్యులుగా చలామణి అవుతున్నారు. రోగులు, వారి బంధువులు గుర్తించకుండా ముఖానికి మాస్క్లు ధరించి, సీనియర్ వైద్యుల ప్రిస్కిప్షన్ లెటర్లపై టెస్టులు, మందులు, ఇంజక్షన్లు రాస్తున్నారు. వనస్థలిపురం కాంప్లెక్స్ కేంద్రంగా పని చేస్తున్న ఓ ఆస్పత్రి ఏకంగా డిఫార్మసీ పూర్తి చేసిన ఇద్దరు వ్యక్తులతో పని చేస్తుండటం గమనార్హం. తుక్కుగూడ కేంద్రంగా పని చేస్తున్న ఓ డయాగ్నోస్టిక్ కేంద్రం ఏకంగా కడుపులో ఉన్నది ఆడ బిడ్డా.. మగ శిశువా చెప్పేస్తోంది. ఆర్ఎంపీలు, ఆశ వర్కర్లకు డబ్బుల ఆశచూపి, పెద్ద మొత్తంలో దోచుచుకోవడంతో పాటు చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారు. తనిఖీల పేరుతో వసూళ్లు.. పారదర్శకంగా పని చేయాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఆస్పత్రి గుర్తింపు కోసం రూ.లక్ష కుపైగా, అదే రెన్యూవల్ కోసం రూ.50 వేలకుపైగా వసూలు చేస్తున్నారు. అడిగినంత ఇస్తే సరి ఫైర్ సేఫ్టీ, భవన నిర్మాణ అనుమతి, డాక్టర్ సర్టిఫికెట్లతో పని లేకుండానే అనుమతులు ఇచ్చేస్తున్నారు. నిరాకరించిన వాళ్లకు చుక్కలు చూపిస్తున్నట్ల ఆరోపణలు ఉన్నాయి. తరచూ సర్జరీలు వికటిస్తున్నా.. అనేక రోగులు మృత్యువాతపడుతున్నా.. పట్టించుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు జిల్లాలోని పలు క్లినిక్లలో తనిఖీలు చేశారు. అర్హత లేని వైద్యులను గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఆయా ఆస్పత్రులను సీజ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా కొత్తపేట అలకనంద ఆస్పత్రి ఘటనతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. అనుమతులు లేకుండా అడ్డగోలుగా క్లినిక్ల ఏర్పాటు యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు మీర్పేట్, బడంగ్పేట్, తుర్కయాంజాల్, తుక్కుగూడ కేంద్రంగా దందా అలకనంద ఆస్పత్రి ఉదంతంతోజిల్లా వైద్యశాఖ అప్రమత్తం -
మొదటికే మోక్షం లేదు!
సాక్షి, సిటీబ్యూరో: ‘చెప్పేవారికి వినేవారు లోకువ’ అనే నానుడి కొన్ని సందర్భాల్లో నిజమేననిపిస్తుంది. ఈ అంశం అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ప్రధాన రహదారుల మార్గాల్లో సమగ్ర రోడ్డు నిర్వహణ పథకం (సీఆర్ఎంపీ) కాంట్రాక్టు ఏజెన్సీల గడువు ముగిసిపోవడంతో తదుపరి చర్యల కోసం జీహెచ్ఎంసీ రోజుకో ఆలోచన చేస్తోంది. రోడ్లన్నీ బాగున్నందున ఇప్పటికిప్పుడు సీఆర్ఎంపీ అవసరం లేదని తొలుత భావించారు. జీహెచ్ఎంసీయే సాధారణ నిర్వహణ, గుంతల పూడ్చివేతల వంటి పనులు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీఆర్ఎంపీ కింద చేపట్టిన పనులన్నీ పూర్తి కానిదే బిల్లులు చెల్లించవద్దని, అన్ని పనులూ పూర్తయిందీ లేనిదీ నివేదిక పంపాలని ఆదేశించినా పూర్తి చేయని పనులను పట్టించుకోలేదు. ఒప్పందం మేరకు ఫుట్పాత్లు, స్వీపింగ్, గ్రీనరీ తదితర పనులన్నీ చేయాల్సి ఉన్నా అవి పూర్తి కాలేదు. రీకార్పెటింగ్ తప్ప మిగతా పనులు నూరు శాతం పూర్తయిన దాఖలాల్లేవు. నిర్ణీత వ్యవధిలో పనులు చేయనందుకు ఏమేర పెనాల్టీలు విధించారో తెలియదు. గడువు ముగియ వస్తుండగా మార్కింగ్లు వంటివి చేపట్టారు. పూర్తి చేయని పనులేవో వెల్లడించి, పూర్తి చేయించాల్సి ఉండగా, వాటిని పట్టించుకోకుండా ఆర్నెల్ల నిర్వహణకు అని కొత్త టెండర్లు పిలిచారు. రెండు ప్రతిపాదనలు.. తాజాగా స్టాండింగ్ కమిటీ ఆమోదం కోసమంటూ మరో అయిదేళ్లు సీఆర్ఎంపీ రెండో దశకు అంటూ రెండు రకాల ప్రతిపాదనలు ఉంచారు. అందులో ఒకటి దాదాపుగా పాత రోడ్లనే తిరిగి మళ్లీ నిర్వహణకు ఇవ్వడం. రెండోది వాటితో పాటు కొత్త రోడ్లను అదనంగా చేర్చడం. పాత రోడ్లకే అయితే 744 కి.మీ. నిర్వహణకు అంచనా వ్యయం రూ.2491 కోట్లు కాగా, కొత్త రోడ్లు కూడా కలిపి 1142 కి.మీ. నిర్వహణకు రూ.అంచనా వ్యయం రూ.3825 కోట్లు. డీసిల్టింగ్ కూడా.. మొదటి దశలో స్వీపింగ్, ఫుట్ఫాత్లు, గ్రీనరీ పనులే చేయకపోగా రెండో దశ కింద అవసరమైన ప్రాంతాల్లో వరద కాల్వల నిర్మాణం, ఆధునికీకరణ పనులతో పాటు వాటి నిర్వహణ కూడా చేస్తాయని పేర్కొన్నారు. అంతేకాదు.. ఇప్పటికే ఉన్న వరద కాల్వల నిర్వహణతో పాటు పూడికతీత పనులు కూడా చేస్తాయన్నారు. ప్రత్యేంగా పూడికతీత టెండర్లు పొందిన ఏజెన్సీలే ఆ పనులు సవ్యంగా చేయడం లేదు. గడచిన అయిదేళ్లుగా సీఆర్ఎంపీ ఏజెన్సీలు స్వీపింగ్, ఫుట్ఫాత్ల పనులే చేయకపోగా కొత్తగా ఎంపికయ్యే ఏజెన్సీలు డీసిల్టింగ్ కూడా చేస్తాయనడం కేవలం అంచనా వ్యయం పెంచేందుకే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు ప్రతిపాదనల్లో ఏదో ఒకటి ఖరారు చేసి అవసరమైన నిధులకు పరిపాలన అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదించాల్సిందిగా గురువారం జరగనున్న స్టాండింగ్ కమిటీ ముందుంచనున్నారు. సీఆర్ఎంపీ మార్గాల్లో పూడిక కూడా తీస్తారట!! ఇప్పటికి గ్రీనరీ, స్వీపింగ్లకే దిక్కూ దివాణంలేదు గడువు ముగిసినవాటి నిర్వహణకు ఆర్నెల్లకు టెండర్లు -
వాహనాలు మారుస్తూ పరారీ...
నగదు సర్దుకోవడం పూర్తయిన తర్వాత ట్రాలీ బ్యాగుల్ని అక్కడే వదిలేసి కొంత దూరం వెళ్లిన దుండగులు చెట్ల చాటున తమ దుస్తులు సైతం మార్చుకున్నారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి మీదుగా బోయిన్పల్లి వైపు వచ్చి... అక్కడ ఆటో మాట్లాడుకుని శామీర్పేట వెళ్లారు. అక్కడి నుంచి షేరింగ్ ఆటోలో గజ్వేల్కు, ఆపై లారీలో ఆదిలాబాద్కు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ నుంచి రాష్ట్ర సరిహద్దులు దాటి మహారాష్ట్ర లేదా మధ్యప్రదేశ్ మీదుగా బీహార్కు వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. తమ ఆచూకీ కనిపెట్టడం కష్టసాధ్యం చేయడానికి దుండగులు వాహనాలు మారినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే నగరంతో పాటు బీదర్కు చెందిన పోలీసులు మహారాష్ట్ర, బీహార్లకు చేరుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. -
అక్కడికక్కడే వాహనాన్ని తిప్పేయడంతో...
సాధారణంగా సదరు ఎస్సైని తీసుకురావడానికి, దింపడానికి అధికారిక వాహనాన్ని డ్రైవర్ తీసుకువెళ్తుంటారు. ఆయన ఇంటి వద్దకు చేరుకున్న ప్రతిసారీ డ్రైవర్ కాస్తా ముందుకు వెళ్లి రోడ్డు డెడ్ ఎండ్ వద్ద రివర్స్ చేసుకుని మళ్లీ వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లేవారు. అఫ్జల్గంజ్లో ఫైరింగ్ జరిగిన గత గురువారం రాత్రి కూడా ఇలానే చేసి ఉంటే... ట్రాలీల్లో ఉన్న డబ్బును బ్యాగుల్లోకి మారుస్తున్న దుండగులపై ఆ వాహనం లైట్లు పడేవి. దీంతో వారు అక్కడే చిక్కే అవకాశం ఉండేది. అయితే ఆ రోజు ఎస్సై కంగారులో ఉండటంతో తాను లోపలకు వెళ్లి ఆయుధం తెచ్చుకునే లోపే... వాహనం వెనక్కు తిప్పి ఉంచాల్సిందిగా డ్రైవర్ను ఆదేశించారు. దీంతో సదరు డ్రైవర్ అపార్ట్మెంట్ పక్కన ఉన్న చిన్న సందును ఆధారంగా చేసుకుని, అక్కడే రివర్స్ చేసి సిద్ధంగా ఉంచారు. ఈ కారణంగా ఆ సమీపంలోనే ఉన్న దుండగులపై వీరి దృష్టి పడలేదు. -
పద్మారావును పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు
బన్సీలాల్పేట్: సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సహా పలువురు నేతలు పరామర్శించారు. ఈ నెల 18న డెహ్రాడూన్ వెళ్లిన పద్మారావు మరుసటి రోజు గుండెపోటుకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయన గుండెకు స్టెంట్ వేశారు. చికిత్స అనంతరం ఆయన మంగళవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. మోండా మార్కెట్ డివిజన్ టకారబస్తీలోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పద్మారావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నాయకులు దానోజు శ్రావణ్, సలీమ్తో పాటు పలువురు కార్పొరేటర్లు పరామర్శించారు. -
కటకట.. ఎక్కడెక్కడ?
తాగునీటి కొరతపై జలమండలి క్షేత్రస్థాయి సర్వే సాక్షి, సిటీబ్యూరో: వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు జలమండలి సిద్ధమవుతోంది. గత వేసవి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పదిహేను రోజులుగా ముందస్తు ప్రణాళికల కోసం క్షేత్రస్థాయి సర్వే నిర్వహించింది. కోర్సిటీతో పాటు శివారులోని సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు పర్యటించి పరిస్థితులను అంచనా వేశారు. ఎక్కడ.. ఏ మేరకు నీటి ఎద్దడి ఉంటుందో.. లోప్రెషర్తో పాటు ట్యాంకర్ల తాకిడి అధికంగా అవకాశాలుండే ప్రాంతాలను గుర్తించారు. సెక్షన్కు ఒక యూనిట్గా తీసుకొని సర్వే నివేదికల ఆధారంగా వేసవి కంటే ముందే ఫిబ్రవరి 15 వరకు సమస్య పరిష్కారం దిశగా చర్యలకు ఉపక్రమించేందుకు జలమండలి సిద్ధమవుతోంది. ఆరు డివిజన్ల నుంచి ట్యాంకర్లకు డిమాండ్ నగరంలోని సుమారు ఆరు డివిజన్లలోనే ట్యాంకర్ల డిమాండ్ అధికంగా ఉంటుందని క్షేత్ర స్థాయి సర్వేలో వెల్లడైంది. మొత్తమ్మీద ఇప్పటికే 20 నుంచి 30 సెక్షన్లలో పరిధిలో భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో వేసవిలో ట్యాంకర్ల తాకిడి అధికంగా ఉంటుందని జలమండలి గుర్తించింది. సాధారణంగా మాదాపూర్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, మణికొండ, హయత్నగర్, సరూర్నగర్, అత్తాపూర్ బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కేపీహెచ్బీ, ప్రగతినగర్, నిజాంపేట తదితర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల సరఫరాకు డిమాండ్ అధికంగా ఉండే అవకాశం ఉంటుందని సర్వేలో బహిర్గతమైంది. ఇప్పటికే ప్రగతి నగర్, వైశాలి నగర్, కొండాపూర్ తదితర ప్రాంతాలో ట్యాంకర్ల తాకిడి పెరిగింది. వేసవిలో భారీ స్థాయిలోనే.. ● సాధారణంగా వేసవిలో ట్యాంకర్ల డిమాండ్ భారీ స్థాయిలో ఉంటుంది. సగటున నెలవారీగా బుకింగ్ల సంఖ్య 1.50 లక్షల నుంచి 2.45 లక్షల వరకు చేరుతున్నాయి. ఈసారి కూడా అలాంటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందని జలమండలి భావిస్తోంది. అవసరమైతే ఫిల్లింగ్ స్టేషన్లను పెంచడంతో పాటు ట్యాంకర్ల డెలివరీల్లో పెండెన్సీ లేకుండా సత్వర సరఫరా జరిగేలా తగిన ఏర్పాట్లకు చేయనుంది. ముఖ్యంగా వెయిటింగ్ పీరియడ్, పెండెన్సీ తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. గతేడాది భూగర్భ జలాలు అడుగంటడంతో ఫిబ్రవరిలో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. ఏప్రిల్లో డిమాండ్ తారస్థాయికి చేరింది. దీంతో బుకింగ్.. సరఫరాకు మధ్య తీవ్ర కాలయాపన జరిగింది. ఈ సారి ఆ సమస్య తలెత్తకుండా.. తగిన ఏర్పాట్లు చేసేందుకు సంసిద్ధమవుతోంది. మరోవైపు గతంలో అధికంగా ట్యాంకర్లు బుక్ చేసిన వినియోగ దారులపై సర్వే నిర్వహించగా.. వారి ప్రాంగణాల్లో బోర్లు, భూగర్భ జలాలు ఎండిపోవడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్లు గుర్తించింది. ● ఉదాహరణకు ప్రస్తుతం తట్టిఖానా సెక్షన్లో 20 ట్యాంకర్లతో దాదాపు 150 ట్రిప్పుల వరకు ట్యాంకర్ల డెలివరీ జరుగుతోంది. ఇదే డిమాండ్ కొనసాగితే ఏప్రిల్ నాటికి రోజూ 400 ట్రిప్పులు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఫిల్లింగ్ స్టేషన్లోని ఫిల్లింగ్ పాయింట్స్ నిర్మాణ పద్ధతి వల్ల ఒక ట్యాంకర్ నింపడానికి 15 నిమిషాలు పడుతుంది. ఫిల్లింగ్ సమయాన్ని 5 నిమిషాలకు తగ్గించుకుంటే అనుకున్నదాని కంటే రెట్టింపు ట్రిప్పులు సరఫరా చేయవచ్చని జలమండలి భావిస్తోంది.. దీంతో వెయిటింగ్ పీరియడ్, పెండెన్సీ తగ్గడంతో పాటు నగరవాసులకు సకాలంలో నీరు సరఫరా చేయవచ్చనే భావన జలమండలిలో వ్యక్తమవుతోంది. ఎద్దడి ఉన్న బస్తీల గుర్తింపు లోప్రెషర్ సరఫరాపై స్పష్టత ట్యాంకర్ల తాకిడిపై దృష్టి ముందస్తు ప్రణాళికతో వేసవి నీటి ఎద్దడికి చెక్ -
నాంపల్లి చుట్టూ నరకమే!
ఈ పరిసర ప్రాంతాల్లోనే భారీగా ట్రాఫిక్ జాంలు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలు అందరికీ విదితమే. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. రోజుకు 1,500 చొప్పున కొత్తగా వచ్చి చేరుతున్న వాహనాలు, గణనీయంగా పెరిగిపోయిన సెకండ్ హ్యాండ్ మార్కెట్, ఆక్రమణలకు గురవుతున్న రోడ్లు.. వెరసీ.. ‘జాం’జాటాలు తప్పట్లేదు. సిటీలోని ఇతర ప్రాంతాల కంటే నాంపల్లి చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లోనే ట్రాఫిక్ జాంలు ఎక్కువగా ఉన్నాయని టామ్ టామ్ సంస్థ తేల్చింది. నెదర్లాండ్స్కు చెందిన ఈ టెక్నాలజీ సంస్థ 2024కు సంబంధించి స్లో మూవింగ్ ట్రాఫిక్ ఇండెక్స్ (14వ ఎడిషన్) పేరుతో ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 500 నగరాల్లో సర్వే చేయగా..ట్రాఫిక్ జాంలకు సంబంధించి హైదరాబాద్ ప్రపంచంలో 18వ స్థానం, జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది. 2023 కంటే 2024లో రెండు గంటలు అదనం హైదరాబాద్లో రద్దీ వేళల్లో 10 కిమీ ప్రయాణించడానికి 32 నిమిషాల సమయం పడుతోంది. సగటున ఒక్కో హైదరాబాదీ ఏడాదికి 85 గంటల చొప్పున బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్లో ఉంటున్నాడు. పోలీసులు తీసుకుంటున్న చర్యలతో ఎప్పటికప్పుడు పరిస్థితి మెరుగుపడాల్సి ఉంది. అయితే నగరవాసి మాత్రం 2023లో కంటే 2024 లో రెండు గంటల ఎక్కువ సేపు ట్రాఫిక్ జామ్లో గడిపాడని టామ్ టామ్ నిర్ధారించింది. హైటెక్ సిటీ, సాఫ్ట్వేర్ హబ్లు ఉన్న వెస్ట్రన్ హైదరాబాద్ కంటే సికింద్రాబాద్, పంజగుట్ట, లక్డీకాపూల్, అమీర్పేట, ఖైరతాబాద్ల్లోనే ఎక్కువ ట్రాఫి క్ జామ్స్ ఉన్నట్లు తేల్చింది. వీటితో పాటు నాంపల్లి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించే వాహనాలకే ట్రావెల్ టైమ్ ఎక్కువ పడుతోందని గుర్తించింది. నాంపల్లి, కోఠి, అబిడ్స్తో పాటు అంబర్పేట (ఫ్లైఓవర్ నిర్మాణ పనుల వల్ల), చాదర్ఘాట్ల్లో ఇది ఎక్కువని టామ్ టామ్ స్పష్టం చేసింది. ‘రోప్’ చుట్టూ రాజకీయ నేతల క్రీనీడలు.. నగరంలో ఈ పరిస్థితులు మార్చడానికి పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి వాటి లో ‘ఆపరేషన్ రోప్’ ఒకటి. దీనిపై ఓట్ బ్యాంక్ రా జకీయాల ప్రభావం, రాజకీయ క్రీనీడలు పడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో రహదారి, ఫుట్పాత్ ఆక్రమణల్ని తొలగించకుండా స్థానిక నేతలు, ప్రజా ప్రతినిధులు అనునిత్యం అడ్డు తగులుతున్నారు. 10 కి.మీ ప్రయాణానికి ఏకంగా 32 నిమిషాలు నగరంలో సరాసరి వేగం గంటకు 19 కి.మీ టామ్ టామ్ సంస్థ– 2024 సర్వేలో వెల్లడి ఆక్రమణల తొలగింపులో రాజకీయ జోక్యాలు ‘రోప్’తో అయినా రూపుమారుతుందనే ఆశ టామ్ టామ్ నివేదిక ప్రకారం.. నగరంలోని వాహనాల యావరేజ్ స్పీడ్: పీక్ అవర్స్లో గంటలకు 17.8 కి.మీ, సాధారణ వేళ ల్లో 19 కి.మీ., సాయంత్రం వేళల్లో 15.6 కి.మీ. పది కి.మీ ప్రయాణించడానికి పట్టే సమయం: పీక్ అవర్స్లో 31 నిమిషాల 30 సెకన్లు, రద్దీ వేళ్లలో 33 నిమిషాల 41 సెకన్లు, సాయంత్రం వేళల్లో 33 నిమిషాల 24 సెకన్లు 2024లో మిగిలిన రోజుల కంటే సెప్టెంబర్ 21న వచ్చిన శనివారం రోజు నగర వాసి తీవ్ర ట్రాఫిక్ నరకం చవి చూశాడు. ఆ నెల మొత్తం ట్రాఫిక్ రద్దీ కొనసాగింది. తీవ్రమైన ట్రాఫిక్ జామ్స్ ఉండే ప్రాంతాలు: బేగంపేట, సోమాజిగూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట, బంజారాహిల్స్, హిమాయత్నగర్, మెహిదీపట్నం. -
మ్యాన్హోల్.. క్లీనింగ్ రోబో
మద్రాస్ ఐఐటీ రూపొందించిన ‘హోమ్సెప్ సీవర్’ కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఇకపై మ్యాన్హోళ్ల క్లీనింగ్ను రోబో సాయంతోనే చేయనున్నారు. ఐఐటీ మద్రాస్ సౌజన్యంతో రూపొందించిన ‘హోమ్సెప్ సీవర్’ రోబో ద్వారా మ్యాన్హోల్స్ క్లీనింగ్కు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఐఐటీ మద్రాస్కు చెందిన సోలినాస్ ఇంటెగ్రిటీ ప్రైవేట్ లిమిటెడ్, వెల్స్ ఫార్గో సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద రూ.60 లక్షల విలువైన ఈ రోబోను సికింద్రాబాద్ కంటోన్మెంట్కు ఉచితంగా అందజేశారు. కంటోన్మెంట్ అధ్యక్షుడు బ్రిగేడియర్ ఎన్వీ నంజుండేశ్వర.. సీఈఓ మధుకర్ నాయక్, బోర్డు సభ్యుడు రామకృష్ణలతో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం సోలినాస్ సంస్థ ప్రతినిధులు ఈ రోబో పని తీరును కంటోన్మెంట్ సిబ్బందికి వివరించారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ సూపరింటెండెంట్లు రాజ్కుమార్, దేవేందర్, మహేందర్, ఇంజినీర్లు పి. సావన్ కుమార్, సోలినాస్ సంస్థకు చెందిన నితీష్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకతలు ఇవీ.. ● వీల్స్, టైర్లతో కూడిన ఈ రోబోను సీవరేజీ వాహనాలకు అనుసంధానం చేసి మ్యాన్హోల్స్ ఉన్న ప్రాంతాలకు సులభంగా తీసుకెళ్లవచ్చు. ● బ్లేడ్, బకెట్ సక్షన్లతో కూడిన ఈ రోబో తానే స్వయంగా మ్యాన్హోల్ మూతలను తొలగించి అందులోకి ప్రవేశిస్తుంది. ● క్విక్ బ్లేడ్ బకెట్ సిస్టమ్, రొటేటింగ్ మోటార్లు, స్లయిడింగ్ యాక్చువేటర్స్ ద్వారా మ్యాన్హోల్ లోపల సులభంగా ప్రయాణిస్తుంది. ● జీపీఎస్ ఎనేబుల్డ్ సిస్టమ్ ద్వారా మ్యాన్హోల్ లోపల ఎంత లోతుకు, దూరం వెళ్లింది తెలుసుకోవచ్చు. ● ఈ రోబోలో మ్తొతం 4 ఇన్ఫ్రారెడ్ కెమెరాలు ఉన్నాయి. ఇందులో మూడు నైట్ విజన్తో పనిచేస్తాయి. 170 డిగ్రీల కోణంలో ఫొటోలు, వీడియోలు తీస్తాయి. మరొకటి అండర్ వాటర్ కెమెరా. ● రోబో కెమెరాల్లో నిక్షిప్తం చేసిన ఫొటోలు, వీడియోలను హై రిజల్యూషన్ కలిగిన డిస్ప్లే ద్వారా గమనించవచ్చు. ఆయా కెమెరాల్లో నిక్షిప్తమైన ఫుటేజీని నెల రోజుల వరకు స్టోర్ చేసుకునే వెసులుబాటు ఉంది. ● రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేసే రోబో మ్యాన్హోల్లోని చెత్తను సేకరించి, దానికి అనుసంధానం చేసిన స్టోరేజ్ బిన్లలోకి మారుస్తుంది. ● ఈ రోబోలో మరో ప్రత్యేకత ఏమిటంటే మ్యాన్హోల్ లోపల ఉన్న విషవాయువులను గుర్తిస్తుంది. మిథేన్, కార్బన్ మోనాకై ్సడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, అమోనియా, నైట్రోజన్ డయాకై ్సడ్, ఈథెన్ వంటి వాయువుల గుర్తించడంతో పాటు గాఢతను సైతం బయట ఉన్న ఎల్సీడీ డిస్ప్లేలో చూపిస్తుంది. ● పెట్రోల్తో నడిచే ఈ రోబో నిరంతరాయంగా 8 గంటల పాటు పనిచేస్తుంది. సీఎస్ఆర్ కింద కంటోన్మెంట్కు అందజేత ప్రారంభించిన బోర్డు అధికారులు రాష్ట్రంలోనే ఇది తొలి రోబో.. దీని విలువ రూ.60 లక్షలు -
ఆ సర్జన్ ఎవరు?
కిడ్నీ దాతలది తమిళనాడు.. స్వీకర్తలది కర్ణాటక సాక్షి, సిటీబ్యూరో: కొత్తపేటలోని అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్సల్లో కీలకంగా వ్యవహరించిన నెఫ్రాలజిస్ట్, అనస్థీషియన్ ఎవరు? అనే కోణంలో వైద్యారోగ్యశాఖ విచారణ ప్రారంభించింది. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ఉస్మానియా ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ నేతృత్వంలో ఏర్పడిన త్రిసభ్య కమిటీ బుధవారం అలకనంద ఆస్పత్రిని పరిశీలించింది. అనంతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడుకు చెందిన కిడ్నీ దాతలు నసీ్త్రన్బేగం (35), ఫిర్దోస్బేగం (40) సహా కర్ణాటకకు చెందిన స్వీకర్తలు న్యాయవాది రాజశేఖర్ (68), సివిల్ ఇంజినీర్ భార్య, మాజీ స్టాఫ్నర్సు కృపాలత (45) ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎవరి ద్వారా ఇక్కడికి వచ్చారు? ఎలా వచ్చారు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ డాక్టర్ను సంప్రదించారు? ఎక్కడ వైద్య పరీక్షలు చేయించారు? సర్జరీ కోసం ఎంత చెల్లించారు? వంటి అంశాలపై ఆరా తీశారు. అయితే.. ఇప్పటికే సరూర్నగర్ పోలీసుల అదుపులో ఉన్న ఆస్పత్రి నిర్వాహకుడు సుమంత్ ఇప్పటికీ నోరు మెదపనట్లు తెలిసింది. ఆయన నోరు తెరిస్తే కానీ అసలు విషయం బయటికి వచ్చే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే.. కిడ్నీ రాకెట్కు పాల్పడిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు ప్రజా సంఘాలు అలకనంద ఆస్పత్రి ఎదుట బుధవారం ఆందోళనకు దిగాయి. దాతలు, స్వీకర్తల కేస్ షీట్లు మాయం.. ● వైద్యులు ఏదైనా సర్జరీ చేసే ముందు రోగి ఊరు, పేరు, ఫోన్ నంబర్తో పాటు బీపీ, షుగర్ ఇతర ఆరోగ్య వివరాలు కేస్ షీట్లో నమోదు చేస్తారు. ప్రతి ఆరు గంటలకోసారి బీపీ, పల్స్రేట్ను మానిటరింగ్ చేస్తుంటారు. సర్జరీ చేసే వైద్యుడి పేరుతో పాటు మత్తుమందు ఇచ్చే వైద్యుడు సహా స్టాఫ్నర్సులు, ఇతర సిబ్బంది వివరాలను కూడా ఇందులో నమోదు చేస్తారు. కానీ.. అలకనంద ఆస్పత్రి యాజమాన్యం ఇవేవీ పట్టించుకోలేదు. ఎవరికీ అనుమానం రాకుండా దాతలు, స్వీకర్తలను ఇక్కడికి తీసుకురావడంతో పాటు సర్జరీ చేసిన వైద్య సిబ్బంది వివరాలను కేషీట్లో నమోదు చేయకుండా గోప్యంగా వ్యవహరించింది. ● సర్జరీలో పాల్గొన్న వైద్య సిబ్బంది ఆ సమయంలో తమ ముఖాన్ని రోగులు, వారివెంట వచ్చిన బంధువులు గుర్తించకుండా మాస్క్లు ధరించి, జాగ్రత్త పడినట్లు తెలిసింది. తనిఖీలకు వెళ్లిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు కేస్ షీట్ కూడా దొరకకుండా జాగ్రత్తపడింది. నిజానికి ఎవరైనా రోగులు సర్జరీ చేయించుకునే ముందు ఆస్పత్రి ఎక్కడ ఉంది? చికిత్స చేసే డాక్టర్ ఎవరు? ఆయనకున్న అనుభవం ఏమిటీ? ఇప్పటి వరకు ఆయన ఎన్ని సర్జరీలు చేశారు? సక్సెస్ రేటు ఎంత? వంటి అంశాలపై ఆరా తీస్తారు. ఆ తర్వాతే సర్జరీకి అంగీకరిస్తారు. కానీ.. ఇక్కడ స్వీకర్తలిద్దరూ ఇవేవీ పట్టించుకోలేదు. వారిద్దరూ ఉన్నత విద్యావంతులే అయినప్పటికీ.. కేవలం మధ్యవర్తులు చెప్పిన మాటలు నమ్మి, చికిత్స కోసం వచ్చినట్లు తెలిసింది. వేర్వేరు రాష్ట్రాలు.. వేర్వేరు మధ్యవర్తులు.. ● తమిళనాడులోని పేద కుటుంబాలకు చెందిన నసీ్త్రన్బేగం (35), ఫిర్దోస్బేగం (40)లు గత కొంత కాలంగా తీవ్రమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పైళ్లెన తర్వాత భర్తలు వదిలేయడంతో వీరు ఒంటరయ్యారు. రోజువారీ జీవనం దుర్భరంగా మారింది. వీరి బలహీనతను స్థానికంగా ఉన్న మధ్యవర్తి పూర్ణిమ అవకాశంగా తీసుకుంది. కిడ్నీ అమ్మకం ద్వారా సులభంగా డబ్బు సంపాదించ వచ్చని ఆశ చూపింది. ఆ మేరకు గతంలో తాను కూడా ఒక కిడ్నీ అమ్ముకున్నట్లు నమ్మబలికింది. ఆ మేరకు ఇద్దరు మహిళలను కిడ్నీ అమ్మకానికి ప్రేరేపించింది. అప్పటికే అలకనంద ఆస్పత్రి యజమానితో ఆమెకు పరిచయం ఉండటం, ఇదే అంశాన్ని ఆయన దృష్టికి తీసుకురావడంతో వారికి వైద్య పరీక్షలు చేయించారు. ● ఇదే సమయంలో కర్ణాటకకు చెందిన న్యాయవాది రాజశేఖర్, స్టాఫ్నర్సు కృపాలత కిడ్నీల పని తీరు దెబ్బతిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కిడ్నీ దాతల కోసం ఎదురు చూస్తున్న సమయంలో వారికి మధ్యవర్తి పవన్ పరిచయమయ్యాడు. ఆయన ద్వారా వీరు నగరంలోని అలకనంద ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే దాతలు, స్వీకర్తల నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు. ఇరువురి బ్లడ్ గ్రూప్లు మ్యాచ్ అయ్యాయి. సర్జరీకి రూ.55 లక్షల వరకు ఖర్చు అవుతుందని స్పష్టం చేయడం, చెల్లించేందుకు వారు అంగీకరించడంతో గుట్టుగా వారిని నగరానికి తరలించారు. సర్జరీ సమయంలో వైద్యులు తమ ముఖాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్లు ధరించి జాగ్రత్త పడటం విశేషం. ఇదే బృందం గతంలో విజయవాడ కేంద్రంగానూ పలువురికి కిడ్నీ మార్పిడి చికిత్సలు చేసినట్లు తెలిసింది. సరూర్నగర్ పోలీసులు ఆ మేరకు ఓ బృందాన్ని విజయవాడకు పంపినట్లు సమాచారం. అలకనంద ఆస్పత్రి ఎదుట ప్రజాసంఘాల ఆందోళననిందితులను కఠినంగా శిక్షించాలి: ఐఎంఏ సుల్తాన్బజార్: అమాయకుల కిడ్నీలను మార్పిడీ చేసే ముఠాలను కఠినంగా శిక్షించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ దువ్వూరు ద్వారకానాథరెడ్డి, కార్యదర్శి వి.అశోక్ డిమాండ్ చేశారు. బుధవారం కోఠిలోని ఐఎంఏ రాష్ట్ర కార్యాలయంలో వారు మాట్లాడారు. భవిష్యత్లో ఇలాంటి ఘ టనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్ణిమ, పవన్ ఏజెంట్ల ద్వారా నగరానికి రాక భర్త లేని పేద మహిళలకు డబ్బు ఆశ చూపిన వైనం స్వీకర్తల్లో ఒకరు న్యాయవాది, మరొకరు సివిల్ ఇంజినీర్ భార్య గాంధీలో చికిత్స పొందుతున్న దాత, స్వీకర్తలను కలిసిన త్రిసభ్య కమిటీ కొత్తపేట అలకనంద ఆస్పత్రి ఎదుట ప్రజాసంఘాల ఆందోళన -
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్కు సర్వం సిద్ధం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ వేదికగా ఈ నెల 24 నుంచి 26 వరకు జరగనున్న ప్రతిష్టాత్మక ‘హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్’కు సర్వం సిద్ధమైంది. నగరంలోని టీ–హాబ్ (సత్వ నాలెడ్జ్ సిటీ)లో నిర్వహిస్తున్న ఈ సాహితీ పండుగకు భారత్తో పాటు విదేశాల నుంచి సాహితీ ప్రియులు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ ఫెస్టివల్లో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్లీనరీలు ఉంటాయని., మొదటి రోజు ప్లీనరీలో భాగంగా ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్తో ఆయన రాసిన 2024: ‘ది ఎలక్షన్ దట్ సర్ప్రైజ్ ఇండియా’ పుస్తకంపై సాహితీ ప్రముఖులు సునీతా రెడ్డి చర్చించనున్నారు. ఈ 15వ ఎడిషన్ ఫెస్టివల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణపై చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, అంతరించిపోతున్న భారతీయ భాషలపై ప్రత్యేక సదస్సులు, కవిత్వానికి సంబంధించి ప్రత్యేకంగా కావ్యధార కార్యక్రమం ఉంటాయన్నారు. మీట్ మై బుక్ పేరుతో పుస్తక ఆవిష్కరణలు, మూవింగ్ ఇమేజెస్ టాకీస్ సినిమా ప్రదర్శనలు, సైన్స్ అండ్ సిటీ సెషన్స్, స్టేజ్ టాక్లు, స్టోరీ టెల్లింగ్, వర్క్షాప్స్, యంగిస్తాన్ యూత్ ఈవెంట్స్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సారి ఫెస్టివల్ ఆతిథ్య దేశంగా లూథియానా, దృష్టి సారించిన భాషగా సింధీ భాషను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు షబానా అజ్మీ, అరుణా రాయ్, నందితా భవానీ,రీతా కొఠారీ,సునీతా కృష్ణన్, హుమా ఖురేషి, సినీనటుడు సిద్దార్థ్, దర్శకులు విద్యారావ్, సాహిత్య ప్రముఖులు రాజ్ మోహన్ గాంధీ, కల్పన కన్నబిరాన్ తదితరులు పాల్గొననున్నారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృతి
జగద్గిరిగుట్ట: కోనేరులో ఈతకు వెళ్లి గుర్తు తెలియని బాలుడు మృతి చెందిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహాదేవపురం గుట్టపై ఉన్న శివాలయం కోనేరులో ఓ బాలుడు పడినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డీఆర్ఎఫ్ బృందంతో కలిసి గాలింపు చేపట్టారు. బుధవారం కోనేరులో నుంచి బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. మిగతా ఇద్దరు ఎవరు?ఎక్కడ? పోలీసులు సంఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా సదరు బాలుడితో పాటు మరో ఇద్దరు బాలలు కోనేరు వరకు వచ్చినట్లు గుర్తించారు. అనంతరం ముగ్గురూ ఈత కొట్టేందుకు కొలనులోకి దిగారని, ఈ తర్వాత ఓబాలుడు మునిగిపోతుండగా మిగతా ఇద్దరూ కేకలు వేశారని, స్థానికులు అక్కడికి చేరుకునేలోగా వారు ఇద్దరూ అక్కడినుంచి పారిపోయినట్లు ఆలయంలో పనిచేసే సబిత అనే మహిళ తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రోడ్డును మింగేశారు..
బంజారాహిల్స్: ఇంటి ముందు ఖాళీ స్థలం కనిపిస్తే కాస్తా ముందుకు జరగడం పరిపాటి. అయితే తమ ఇళ్ల ముందు ఉన్న రోడ్డునే దిగమింగేసి ఎన్నో ఏళ్లుగా ఏమీ జరగనట్లు నటిస్తున్న వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం కృషి చేయాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు తమ కళ్ల ముందే ఆక్రమణలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–36 పోలీస్ స్టేషన్ వెనుక రెండు రోజుల క్రితం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ స్వయంగా వెళ్లి సుమారు 1300 గజాల జీహెచ్ఎంసీ స్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేపట్టాలని మేయర్ ఆదేశాలతో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్ సొసైటీకి చెందిన లేఅవుట్లో రోడ్డునెంబర్–19 నుంచి 21 వైపు ఎల్ ఆకారంలో సుమారు 40 అడుగుల వెడల్పుతో సుమారు 550 అడుగుల పొడవు గల లింక్ రోడ్డు ఉన్నట్లు స్పష్టంగా మ్యాపుల్లో కనిపిస్తుంది. దీనిలో కొంతభాగం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెనుక ఖాళీగా ఉంది. సదరు ఖాళీ స్థలంలో పోలీస్ స్టేషన్ పరిదిలో సీజ్ చేసిన వాహనాలను పార్క్ చేస్తున్నారు. దీంతో పాటు ప్లాట్నెంబర్ 457, 456, 455, 454,, 453 ప్లాట్ల వెనుక నుంచి రూట్స్ కాలేజ్ పక్క వరకూ లింక్ రోడ్డు ఉండేది. కాగా ప్లాట్ నెంబర్ 457 వెనుక ఉన్న సుమారు 1250 గజాల స్థలాన్ని సదరు ఇంటి యజమాని దర్జాగా ఆక్రమించుకుని భారీ ప్రహరీ నిర్మించాడు. తన ఇంటికి చెందిన ప్రహరీ నుంచి రోడ్డు స్థలాన్ని మొత్తం కూరగాయల తోటగా మార్చేశారు. ఇది బయట నుంచి పార్కు స్థలంగా కనిపించేలా కొన్నాళ్ల పాటు జీహెచ్ఎంసీ బోర్డు సైతం పెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా రెండేళ్లుగా ఈ స్థలాన్ని ఆక్రమించడంతో పాటు ఏకంగా కూరగాయల తోటనే ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ స్థలం పక్క నుంచి ఉన్న రోడ్డు స్థలాన్ని సైతం మరి కొందరు భవన నిర్మాణ దారులు దర్జాగా ఆక్రమించుకున్నట్లు తాజాగా వెల్లడైంది. ప్లాట్ నెంబర్ 471, 472, 473, 474లతో పాటు 453 ప్లాట్ల యజమానులు సుమారు 1500 గజాల రోడ్డు స్థలాన్ని కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో ఈ స్థలం విలువ సుమారు రూ.60 కోట్లు పైగానే ఉంటుందని తెలుస్తోంది. మేయర్ పర్యటన అనంతరం ప్లాట్నెంబర్ 457 వెనుక కబ్జాకు గురైన 1250 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకుని ప్రహరీలను కూల్చివేసిన జీహెచ్ఎంసీ అధికారులు మిగిలిన 1500 గజాల స్థలాన్ని కూడా ఆక్రమణల భారీ నుంచి కాపాడేందుకు చర్యలు చేపట్టారు. కదులుతున్న ఆక్రమణల డొంక.. మేయర్ పర్యటనతో మరిన్ని కబ్జాలు వెలుగులోకి అధికారులపాత్రపై అనుమానాలు.. అధికారుల తీరుపై అనుమానాలు..? ఇదిలా ఉండగా నగర మేయర్ వచ్చి చూసే దాకా ఇంత ఖరీదైన స్థలాలు ఆక్రమణకు గురవుతుంటే స్థానిక టౌన్ప్లానింగ్, యూబీడీ, జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలుతలెత్తుతున్నాయి. పేదలు బతుకుదెరువు కోసం రోడ్డు పక్కన చిన్న డబ్బా పెట్టుకున్నా గద్దల్లా వాలిపోయే టౌన్ప్లానింగ్, హైడ్రా సిబ్బంది నగరలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఏకంగా రూ.100 కోట్ల విలువైన రోడ్డు స్థలాన్ని బడాబాబులు దర్జాగా ఆక్రమించుకుంటే ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలోనే ఈ ఆక్రమణలపై సొసైటీ పెద్దలు సైతం జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినా స్థానిక టౌన్ప్లానింగ్ అధికారులు పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ స్థలాన్ని ఇప్పటికై నా కాపాడి ప్రజలకు ఉపయోగపడేలా వినియోగించాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
సరి చేయకుంటే.. సమస్యలెన్నో!
రేషన్ కార్డుల సర్వేలో పారదర్శకత పాటించాలి సాక్షి, సిటీబ్యూరో: రేషన్ కార్డుల జారీ కోసం ఇంటింటి సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మెహిదీపట్నం మండలం విజయనగర్ కాలనీ, హుమాయున్ నగర్ కాలనీలో ఇంటింటి సర్వేను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వేలో తప్పులు లేకుండా బాధ్యతతో నిర్వహించాలని సూచించారు. అర్హులను ఎవరినీ మిస్ చేయవద్దని, రిమార్కులు సరిగా రాయాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి రమేష్ ఉన్నారు. సాక్షి, సిటీబ్యూరో: అఫ్జల్గంజ్లోని రోషన్ ట్రావెల్స్ వద్ద గురువారం రాత్రి చోటుచేసుకున్న కాల్పుల ఉదంతం పోలీసు విభాగంలో ఉన్న కొన్ని లోపాలు ఎత్తి చూపింది. వీటిని సరి చేయకుంటే భవిష్యత్లో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తోంది. మొదటి సమస్య సీసీ కెమెరాలది కాగా... రెండోది ‘ఫ్రెండ్లీ’ పేరుతో ఆయుధాలకు దూరమైన పోలీసులకు సంబంధించింది. నేరగాళ్లు నానాటికీ అప్గ్రేడ్ అవుతూ, ఆధునిక ఆయుధాలను సమకూర్చుకుంటున్న ప్రస్తుత రోజుల్లో పోలీసు విభాగంలో ఉన్న లోపాలు సరి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ‘నేత్రాల’తో ఫలితం అంతంతే.. ఏ వేదికపై అవకాశం దొరికినా అధికారుల నుంచి నేతల వరకు అంతా రాజధానిలో ఉన్న సీసీ కెమెరాల అంశాన్ని ఊదరగొడతారు. లక్షల్లో కెమెరాలు ఉన్నాయని, ప్రపంచంలో ఆ స్థానం ఆక్రమించాం... దేశంలో ఈ స్థానంలో ఉన్నాం అంటూ గొప్పలు చెబుతుంటారు. వాస్తవ పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయి. 2015 నుంచి రాష్ట్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ జోరందుకుంది. వివిధ స్కీంల కింద కొన్నేళ్ల క్రితం నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ప్రస్తుతం అనేకం పని చేయట్లేదు. మరోపక్క పని చేస్తున్న కెమెరాలు సైతం నాసిరకంగా ఉన్నాయి. ఈ కారణంగానే రాత్రి వేళల్లో, లైట్ల వెలుతురులో వాహనాల నంబర్లను ఇవి గుర్తించలేకపోతున్నాయి. ఈ కారణంగానే అఫ్జల్గంజ్ నుంచి సికింద్రాబాద్కు దుండగుల్ని తీసుకువెళ్లిన ఆటోను గుర్తించడానికి పోలీసులు దాదాపు పది గంటలు శ్రమించాల్సి వచ్చింది. ఈలోపు దుండగులు నగరం నుంచి ఉడాయించారు. ఆ సాంకేతికత ఉన్నట్లా.. లేనట్టా? బంజారాహిల్స్ రోడ్ నెం.12 రూ.వందల కోట్ల ప్రజాధనం వెచ్చించి తెలంగాణ స్టేట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారు. ఈ అద్దాల భవనం ప్రతిపాదన, శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సమయంలో అత్యాధునిక టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్ అంటూ ప్రచారం చేశారు. నగరంలోకి అడుగుపెట్టిన నేరగాళ్లు నేరం చేయకముందే చిక్కుతారని, ఓ వాహనం ఏ సమయంలో, ఏ ప్రాంతంలో, ఎన్నిసార్లు తిరిగిందో కేవలం కొన్ని నిమిషాల్లోనే కనిపెట్టేస్తామని.. ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. సీన్ కట్ చేస్తే.. ‘అఫ్జల్గంజ్ ఆటో’ను కనిపెట్టడానికి దాదాపు పది గంటల సమయం పట్టింది. ఈ ఏడాది సీసీ కెమెరాలకు మరమ్మతులు, కొత్త కెమెరాల ఏర్పాటు, అనుసంధానానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు గతంలో ప్రకటించారు. దీంతో పాటు టెక్నాలజీ అంశాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయుధం ఉంటే ‘ఫ్రెండ్’ కాదా? నగర పోలీసులే కాదు... రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని విభాగాలు కొన్నేళ్లుగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ముసుగు వేసుకుని పని చేస్తున్నారు. ఓపక్క జరగాల్సిన దారుణాలన్నీ జరిగిపోతున్నా... తాము మాత్రం ప్రజలతో సత్సంబంధాల కోసం స్నేహపూర్వక పోలీసింగ్ చేస్తున్నామని అంటున్నారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే పోలీసులు ఎవరూ తమ వద్ద తుపాకులు ఉంచుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. అందరి వద్దా ఉన్న ఆయుధాలను హఠాత్తుగా దాచేశారు. ఇప్పుడు శాంతిభద్రతల విభాగం మాట అటుంచితే.. చివరకు టాస్క్ఫోర్స్ బృందాల వద్దా అవసరమైన ఆధాయుధాలు ఉండట్లేదు. ఓపక్క సిటీలో గన్ కల్చర్ పెరుగుతుండటం, మరోపక్క గతంలో ‘సూర్యాపేట’, తాజాగా ‘అఫ్జల్గంజ్’ ఉదంతాల నేపథ్యంలో కనీసం ప్రత్యేక బలగాలైనా ఆయుధాలు ధరించకపోతే ప్రజల మాట అటుంచి పోలీసులకే రక్షణ లేకుండాపోయే ప్రమాదం కనిపిస్తోంది. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉన్న వాటిలోనూ నాణ్యత లేని ఫీడ్ రికార్డు ‘ఫ్రెండ్లీ’ పేరుతో తుపాకులకూ దూరంగా.. మారకపోతే భవిష్యత్లో పెను సవాళ్లే ఎంజీబీఎస్ మార్గం దుండగులు ఈ మార్గం నుంచే ఆటోలో రోషన్ ట్రావెల్స్ వద్దకు వచ్చారుహక్కులకు విలువ ఇచ్చే దేశాల్లోనూ.. ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులతో స్నేహపూర్వకంగా ఉండటానికి, మానవ హక్కులకు భంగం కలగకూడదనే ఆయుధాలను దూరంగా ఉంచుతున్నామని కొందరు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇక్కడ వీళ్లు గమనించాల్సిన కీలకాంశం ఏమిటంటే... అనేక పాశ్చాత్య దేశాల్లో మానవ హక్కులు, నిబంధనలు, మానవ జీవితాలకు ఎంతో విలువ ఇస్తారు. అలాంటి చోట్ల కూడా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే పోలీసులు తమ వెంట కచ్చితంగా ఆయుధాలు ఉంచుకుంటారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులతో పాటు స్వీయరక్షణ కోసమూ తుపాకులు వినియోగిస్తుంటారు. ఆయా దేశాల్లో సత్వర న్యాయం, కఠిన చట్టాలు అమలులో ఉన్నా పోలీసులు తుపాకులతో తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు దూరంగా ఉంచారన్నది అంతుచిక్కని విషయమే. ఈ లోపాలను ఉన్నతాధికారులు వీలైనంత త్వరగా సరి చేసుకోకుంటే భవిష్యత్లో పెను సవాళ్లు ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
కొత్త రేషన్ కార్డులు కొందరికే!
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి పంపిణీ చేయనున్న కొత్త రేషన్ కార్డులు కొందరికే అందనున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే కోసం ఇటీవల నిర్వహించిన ఇంటింటి (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల) సర్వే వివరాల ఆధారంగా రేషన్ కార్డుల్లేని కుటుంబాలు గ్రేటర్ పరిధిలో 83,285 మాత్రమే ఉన్నట్లు అధికారులు లెక్కలు తీశారు. ఆ లెక్క మేరకే క్షేత్రస్థాయి సర్వే జరుపుతున్నారు. క్షేత్రస్థాయిలోనూ అర్హులుగా గుర్తించిన వారికే కొత్త రేషన్ కార్డులివ్వనున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించేది 83 వేల దరఖాస్తులే.. పాతబస్తీలో ఎక్కువ ఇంటింటి సర్వే మేరకు పాతబస్తీలోనే రేషన్కార్డుల్లేని కుటుంబాలు అధికంగా ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్లలో చార్మినార్ జోన్లో, 30 సర్కిళ్లలో కార్వాన్ సర్కిల్లో అత్యధికంగా ఉన్నాయి. సమగ్ర కుటుంబ సర్వే వివరాలతోనే.. ‘ప్రజాపాలన’లో అర్జీ పెట్టుకున్న 5.43 లక్షల కుటుంబాలకు నిరాశేనా? ఇదీ షెడ్యూలు.. ఈ నెల 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయి సర్వే 21 నుంచి 24 వరకు వార్డు సభల్లో లబ్ధిదారుల వివరాల వెల్లడి 21 నుంచి 25 వరకు అర్హుల డేటా ఎంట్రీ 26 (రిపబ్లిక్ డే) నుంచి రేషన్ కార్డుల జారీ జోన్ల వారీగా ఇలా.. జోన్ సర్వే జరగనున్న కుటుంబాలు ఎల్బీనగర్ 11,528 చార్మినార్ 21,257 ఖైరతాబాద్ 14,967 శేరిలింగంపల్లి 8,520 కూకట్పల్లి 12,580 సికింద్రాబాద్ 12,959 కంటోన్మెంట్ 1,474 మొత్తం 83,285 సర్కిళ్ల వారీగా అత్యధికంగా కార్వాన్ సర్కిల్లో 7,254 కుటుంబాలు, ఆ తర్వాత చాంద్రాయణగుట్టలో 6,275 కుటుంబాలున్నాయి. అత్యల్పంగా అల్వాల్ సర్కిల్లో 1,047 కుటుంబాలున్నాయి. ఎదురు చూస్తున్న వారెందరో? నిజానికి గ్రేటర్ పరిధిలోని నాలుగు జిల్లాల పరిధిలో దాదాపు పది లక్షల మంది రేషన్ కార్డుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. గత సంవత్సరం ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణకు నిర్వహించిన ‘ప్రజాపాలన’ కార్యక్రమాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా దాదాపు 5.43 లక్షలున్నారు. మిగతావారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేదు. ఇంటింటి సర్వే సైతం నూరు శాతం జరగలేదు. కొందరు సర్వేను వ్యతిరేకించారు. వారిలో రేషన్కార్డుల్లేని వారికి సైతం ఇప్పుడు అవి అందే పరిస్థితి లేకుండాపోయింది. కుటుంబ సర్వే మేరకు రేషన్కార్డుల్లేని కుటుంబాలను పరిశీలించి వారికి మాత్రమే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పాత మార్గదర్శకాలే 2014లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రేషన్కార్డులు లేనివారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, వాటిని కూడా పరిశీలించి కార్డులు జారీ చేస్తామన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కానీ.. ప్రజాపాలనలో అందిన దరఖాస్తులను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో అంతుచిక్కడంలేదు. – క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హుల జాబితాను వార్డుసభలో వెల్లడించి చర్చించాకే ఆమోదిస్తారని ప్రభుత్వం పేర్కొంది. అలా ఎంపికై న వారి జాబితాను జీహెచ్ఎంసీ పరిధిలో కమిషనర్ లాగిన్కు పంపుతారు. వాటిని పరిశీలించి కమిషనర్ పౌరసరఫాల శాఖ కమిషనర్ లాగిన్కు పంపుతారు. పరిశీలించి కొత్త కార్డులు జారీ చేస్తారు. అర్హత కలిగిన వ్యక్తి పేరు ఒక్క రేషన్కార్డులో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఒకే వ్యక్తి పేరు ఒకటికి మించి కార్డుల్లో ఉండటానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సభ్యుల చేర్పులు, తొలగింపులు సైతం చేయనున్నట్లు పేర్కొంది.