illigal affair
-
కిడ్నాప్ ఎలా అవుతుంది.. అతను నా భర్త..
-
ప్రియురాలితో గదిలో.. భార్యకు దొరికిపోయిన భర్త
-
ఫోన్ లో ఫోటోలు చూసి షాక్..బయటపడ్డ సంచలన నిజాలు
-
'మిస్ వైజాగ్' నక్షత్ర ప్రేమ-పెళ్లి-లొల్లి
-
ఆమె తల్లి లాంటిది.. ఇలా ప్రచారం చేస్తారా?: ప్రభాస్ శ్రీను
ప్రభాస్ శ్రీను, టాలీవుడ్లో కేవలం నటుడిగానే కాకుండా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు అసిస్టెంట్గా, మంచి స్నేహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్ని నెలల క్రితం తనపై వచ్చిన రూమర్స్ గురించి తాజాగా స్పందించాడు. సీనియర్ నటి తులసితో ఎఫైర్ ఉందని అప్పట్లో రూమర్లు పుట్టుకొచ్చాయి. అప్పుడు చాలా బాధపడ్డానని తెలిపాడు. ఆవిడతో ఎక్కువ సినిమాలు కూడా చేయలేదు కానీ తమ మీద తప్పుగా రూమర్స్ ప్రచారం చేశారు. తనకు తులసి అంటే తల్లితో సమానం అన్నాడు. 'డార్లింగ్' సినిమా షూటింగ్ సమయంలో ఆవిడను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాం. ఆవిడ పెద్ద నటి, ఎన్నో చూసి ఈ స్థాయికి వచ్చారని ప్రభాస్ శ్రీను తెలిపాడు. (ఇదీ చదవండి: గుండెపోటుతో ప్రముఖ విలన్ కన్నుమూత!) సినిమా షూటింగ్ సమయంలో ఏదో సరదాగా డార్లింగ్ అని పిలిచిందని, దానిని కొందరు అపార్థం చేసుకున్నట్లు తెలిపాడు. తమపై రూమర్స్ వస్తున్నట్లు మొదట ఆవిడే మెసేజ్ పెట్టారని చెప్పుకొచ్చాడు. ' ఈ రూమర్స్ గురించి మీ భార్యకు చెప్పు లేదంటే తను కూడా ఆపార్థం చేసుకుంటుందేమో' అని సలహా కూడా ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. తన భార్య ఒక డాక్టర్ అని. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఇలాంటి రూమర్స్ నమ్మదంటూ.. వాటిని చూసి నవ్వుకుని వదిలేశామని చెప్పాడు. (ఇదీ చదవండి: బ్లాక్ డ్రెస్లో డోస్ పెంచిన అనుపమతో పోటీ పడుతున్న తమన్నా) -
వివాహేతర సంబంధం: ఏడేళ్ల పరిచయం.. నీ కోసం ఎంతో సొమ్ము ఖర్చు చేశా
సామర్లకోట: ఒక మహిళ చేతిలో జరిగిన అవమానాన్ని భరించలేక టిఫిన్ సెంటర్ యజమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది. మేడిశెట్టి గోపాలకృష్ణ (45) తన సెల్ఫోన్ సెల్ఫీ వీడియోలో చనిపోవడానికి కారణాలను చెప్పుతూ మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి పరిస్థితిని గమనించి అతని కుమార్తె బాలాత్రిపుర కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఆస్పత్రిలో మృతి చెందాడు. దాంతో గోపాలకృష్ణ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ వీడియో ప్రకారం సామర్లకోట మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో పోలింగ్ రింగ్ సెంటర్ వద్ద టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న సమయంలో సుమారు ఏడేళ్ల క్రితం హోటల్లో పని చేయడానికి వచ్చిన ఏసమ్మ అనే స్థానిక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి ఆమెను పోషిస్తున్నాడు. ఇటీవల ఏసమ్మ తన పుట్టింటికి వెళ్లి పోవడంతో కారణం తెలుసుకోవడానికి వెళ్లిన సమయంలో ఏసమ్మ అక్క బుజ్జమ్మ, నానమ్మ శేషారత్నం బహిరంగంగా చెప్పుతో కొట్టారు. ఆ సంఘటనను భరించలేక చనిపోతున్నానని వీడియోలో చెప్పాడు. ఏసమ్మ కోసం ఎంతో సొమ్ము ఖర్చు చేశానని వీడియోలో పేర్కొన్నాడు. ఈ మేరకు తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని ఇటువంటి సంఘటన మరొకరికి జరుగకుండా చూడాలని మృతుని కుమార్తె బాలాత్రిపుర విజ్ఞప్తి చేసింది. కాగా తండ్రికి కుమార్తె బాలాత్రిపుర తలకొరివి పెట్టింది. ఆమె ఫిర్యాదు మేరకు సీఐ కె.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో వీడియో క్లిపింగ్ను కూడా ఆధారంగా చేసుకొంటామని సీఐ తెలిపారు. -
ముద్దాయి ట్రంప్!...రిపబ్లికన్ల నుంచి మద్దతు ఎంత?
న్యూయార్క్: అమెరికా చరిత్రలో రాజకీయంగా మరో పెను సంచలనానికి తెరలేచింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందే చెప్పినట్టుగా ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయి. పోర్న్స్టార్ స్టార్మీ డేనియల్స్ (స్టెఫానీ గ్రెగరీ క్లిఫర్డ్)తో లైంగిక సంబంధాలు బయటపెట్టకుండా ఉండేందుకు ఆమెకు డబ్బులు చెల్లించి అనైతిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారన్న ఆరోపణల కేసులో డొనాల్డ్ ట్రంప్పై అభియోగాలు నమోదయ్యాయి. న్యూయార్క్లోని మన్హట్టన్ గ్రాండ్ జ్యూరీ నేరాభియోగాలు నమోదు చేసినట్టుగా ధ్రువీకరించింది. ట్రంప్ లాయర్లతో కేసు విచారణను పర్యవేక్షిస్తున్న మన్హట్టన్ అటార్నీ జనరల్ అల్విన్ బ్రాగ్ మాట్లాడారు. ట్రంప్ లొంగిపోవడానికి సహకరించాలని కూడా బ్రాగ్ సూచించారు. దీంతో ట్రంప్ క్రిమినల్ కేసు విచారణను ఎదుర్కోవడంతో పాటు ఇలాంటి నేరాభియోగాలు ఎదుర్కొన్న మొట్టమొదటి మాజీ అధ్యక్షుడిగా అపఖ్యాతిని మూటకట్టుకున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి వైట్హౌస్లోకి అడుగు పెట్టాలని కలలు కంటున్న వేళ నేరాభియోగాలు నమోదు కావడం నైతికంగా ట్రంప్కు ఎదురు దెబ్బ తగిలినట్టయింది. తనను అరెస్ట్ చేస్తారని, అదే జరిగితే రిపబ్లికన్ శ్రేణు లు, తన అభిమానులు దేశవ్యాప్తంగా ఘర్షణలకు దిగాలని కూడా గత వారం ఆయన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వేలి ముద్రలు, ఫొటో తీసుకొని... ట్రంప్ కోర్టులో లొంగిపోతే ఆయన అరెస్ట్ ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ న్యూయార్క్ అధికారులకి సహకరిస్తారని ఆయన తరఫు లాయర్ స్పష్టం చేయడంతో ఆయనపై ఎలాంటి అరెస్ట్ వారెంట్లు జారీ చేయలేదు. ప్రస్తుతం ఫ్లోరిడాలో ఉన్న ట్రంప్కి సొంతంగా విమా నం ఉంది. న్యూయార్క్లో ఏదైనా విమానాశ్రయానికి తన విమానంలో వెళ్లి అక్కడ్నుంచి మన్హట్టన్ కోర్టు హాలుకి కారులో వెళతారు. మంగళవారం నాడు ట్రంప్ కోర్టు ఎదుట లొంగిపోయే అవకాశాలున్నాయి. సర్వసాధారణంగా సామాన్య నిందితుల్ని కోర్టులో హాజరు పరచాలంటే వారికి సంకెళ్లు వేసి నడిపించుకుంటూ తీసుకువెళతారు. కానీ ట్రంప్ దేశానికి మాజీ అధ్య క్షుడు కావడంతో అలా జరిగే అవకాశాల్లేవు. మీడి యా కవరేజీకి అవకాశం లేకుండా ట్రంప్ని ప్రత్యేక ద్వారం నుంచి లోపలికి అనుమతించే అవకాశాలున్నా యి. క్రిమినల్ కేసులో అభియోగాలు నమోదు కావడంతో ట్రంప్ వేలిముద్రలు, పోలీసు రికా ర్డుల కోసం ఆయన ఫొటో తీసుకుంటారు. న్యాయమూర్తి ఎదుట హాజరు పరచడానికి ముందు ట్రంప్ని ప్రత్యేక సెల్లో ఉంచే బదులుగా వేరే ఒక గదిలో ఉంచుతారు. ఒక్కసారి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచిన తర్వాత ఈ కేసు పురోగతి ఎలా ఉండబోతుందన్నది తెలుస్తుంది. బెయిల్ లభిస్తుందా? ట్రంప్పై నేరాభియోగాలు మోపిన న్యూయార్క్ జ్యూరీ ఆ అభియోగాల పత్రాన్ని సీల్ వేసి ఉంచింది. ట్రంప్ను అరెస్ట్ చేసిన తర్వాతే సీల్ విప్పుతారు. ఈ కేసుని విచారించే న్యాయమూర్తి స్వయంగా కోర్టు హాలులో నేరాభియోగాలను చదివి వినిపిస్తారు. ఆయనపై ఏయే సెక్షన్ల కింద ఎలాంటి అభియోగాలు నమోదయ్యాయో అప్పుడే అందరికీ తెలుస్తుంది. ఆ అభియోగాలను బట్టి ఆయనకు బెయిల్ లభిస్తుందా, లేదా అన్నది స్పష్టమవుతుంది. ట్రంప్పై ప్రయాణపరమైన ఆంక్షలుంటాయా, లేదా వంటివన్నీ కూడా ఆయన న్యాయమూర్తి ఎదుట హాజరైన తర్వాతే తేలుతాయి. ఈ కేసులో దోషిగా తేలితే ట్రంప్కు నాలుగేళ్ల కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. భారీగా జరిమానా కూడా విధిస్తారని కొందరు న్యాయనిపుణులు చెబుతున్నారు. రిపబ్లికన్ల నుంచి మద్దతు ఎంత? రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ తనపై మోపిన అభియోగాలను రాజకీయంగా అనుకూలంగా మార్చుకునే వ్యూహాల్లో ఉన్నారు. అమెరికా చరిత్రలో అనూహ్యమైన ఈ పరిణామాన్ని రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ప్రచారం చేయడానికి ట్రంప్ మద్దతుదారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ట్రంప్పై అభియోగాలను ప్రాసిక్యూషన్ రుజువు చెయ్యలేకపోతే ట్రంప్ తన ఇమేజ్ మరింత పెరుగుతుందన్న భావనలో ఉన్నారు. అయితే రిపబ్లికన్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ మద్దతుదారులు ఈ కేసు వల్ల అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీకి జరిగే లాభంపై ఇప్పట్నుంచే లెక్కలు వేస్తున్నారు. ‘‘ఇది చాలా చిన్న కేసు. ట్రంప్ను వేధించడానికే ఈ కేసుని బయటకు తెచ్చారు’’అని న్యూహ్యాంప్షైర్లో రిపబ్లికన్ పార్టీ చీఫ్ గ్రెగ్ హగ్ వ్యాఖ్యానించారు. ట్రంప్ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి కావాలంటే పార్టీలో 25 నుంచి 30 శాతం కంటే ఎక్కువ మంది ఆయనకు మద్దతు పలకాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అది కష్టమని ప్రత్యర్థి శిబిరం భావిస్తోంది. నేరాభియోగాలు ఎదుర్కొన్నా, శిక్షపడి జైలుకి వెళ్లినా ఎన్నికల్లో పోటీ చేయకూడదని అమెరికన్ రాజ్యాంగంలో నిబంధనలు లేవు. కానీ అలాంటి వ్యక్తిని అధ్యక్ష అభ్యర్థిని చేస్తే అనవసరంగా పార్టీ పరువు పోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేరాభియోగాలతో ట్రంప్ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయి మరో అభ్యర్థి, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్కు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయమైతే వినిపిస్తోంది. రాజకీయ అణచివేత: ట్రంప్ రాజకీయంగా తనను అణచివేయడానికి డెమొక్రాట్లు ఈ కుట్రకు పాల్పడ్డారని ట్రంప్ ఆరోపించారు. తనపై అభియోగాలు నమోదైన విషయం తెలిసిన వెంటనే ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇదంతా రాజకీయ అణచివేత. దేశ చరిత్రలో ఎన్నికల పరంగా ఉన్నత స్థాయిలో జరుగుతున్న జోక్యం ఇది. రాజకీయ ప్రత్యర్థుల్ని శిక్షించడానికి న్యాయవ్యవస్థని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. నన్ను లొంగదీసుకోవడానికి డెమొక్రాట్లు అబద్ధాలు చెప్పారు. మోసాలు చేశారు. దొంగతనాలకు పాల్పడ్డారు. చివరికి ఇలాంటి అనూహ్యమైన చర్యకి దిగారు. ఒక అమాయకుడిపై అభియోగాలు నమోదు చేశారు. అధ్యక్షుడు జో బైడెన్ ఏం చెబితే మన్హట్టన్ జ్యూరీ అదే చేస్తోంది’’అని ట్రంప్ ఆ ప్రకటనలో విరుచుకుపడ్డారు. మరోవైపు ట్రంప్ తరఫు లాయర్లు ఆయన ఏ తప్పు చేయలేదని దీనిని న్యాయపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కేసు నేపథ్యం ఇదీ.. 2016 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తనతో ఉన్న లైంగిక సంబంధాలను బయటపెట్టకుండా ఉండేందుకు పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ను డబ్బులిచ్చి ప్రలోభ పెట్టారన్న ఆరోపణలున్నాయి. అధ్యక్షుడిగా తన పరువు తీయకుండా ఉండడానికి ట్రంప్ లక్షా 30 వేల డాలర్లను అప్పట్లో తన లాయర్ మైఖేల్ కొహెన్ ద్వారా ముట్టజెప్పినట్టు డేనియల్స్ ఆరోపించారు. ఆ ఒప్పందం చెల్లదంటూ 2018లో ఆమె కోర్టుకెక్కారు. 2006 సంవత్సరంలో తనకు 27 ఏళ్ల వయసున్నప్పుడు ఒక గోల్ఫ్కోర్టులో ట్రంప్ పరిచయమయ్యారని, తనతో గడిపితే ఆయన నిర్వహించే రియాల్టీ షో ’ది అప్రెంటీస్’లో అవకాశం ఇస్తానని ఆశ కల్పించారని కొన్ని ఇంటర్వ్యూల్లో ఆమె చెప్పారు. ఆ తర్వాత తరచూ ఫోన్లో మాట్లాడేవారని 2007లో కలిసినప్పుడు ట్రంప్తో సన్నిహితంగా గడపడానికి నిరాకరించానని, అందుకే తనకు ఆ షో లో అవకాశం ఇవ్వకుండా ముఖం చాటేశారని తెలిపారు. ఈ విషయాన్ని బయట ఎక్కడా వెల్లడించవద్దని బెదిరించేవారని డేనియెల్స్ ఆరోపించారు. అయితే ట్రంప్ ఆమె ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఇప్పుడు జ్యూరీ అభియోగాలు నమోదు చేయడంతో డేనియెల్స్ తన మద్దతుదారులందరికీ ధన్యవాదాలు చెప్పారు. తనకు ఎన్నో సందేశాలు వస్తున్నా స్పందించలేకపోతున్నానని, సంబరాలు కూడా చేసుకోలేకపోతున్నానని ట్వీట్ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
HYD: ప్రియుడితో జవాన్ భార్య రాసలీలలు.. భర్త బయటకు వెళ్లగానే..
వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాలను నాశనం చేస్తున్నారు. పెద్దలను, పిల్లలను రోడ్డున పడేస్తున్నాయి. పెళ్లి అయినప్పటికీ మరో వ్యక్తితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న ఓ మహిళ వ్యవహారం హైదరాబాద్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. నగరంలోని రహమత్నగర్లో ఆర్మీ జవాన్ ఫ్యామిలీ నివాసం ఉంటోంది. కాగా, జవాన్ భార్య.. జ్ఞానేశ్వర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఏకంగా ప్రియుడినే తన భర్త అని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని రాసలీలలు కొనసాగిస్తోంది. ఇదిలా కొనసాగుతుండగా.. అకస్మాత్తుగా ఇంటికి వచ్చిన ఆర్మీ జవాన్ ఏకాంతంగా ఉన్న భార్య, ప్రియుడు జ్ఞానేశ్వర్ను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అనంతరం షాక్ నుంచి తేరుకొని.. ఇంట్లో నుంచి బయటకు వచ్చి వారిద్దరినీ ఇంట్లోనే ఉంచి తాళం వేసి.. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో జవాన్ ఇంటికి వచ్చిన పోలీసులు.. తాళం తీసి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాగా, జవాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. తన భార్యను ప్రేమించి పెళ్లిచేసుకున్నానని జవాన్ చెప్పాడు. ఇద్దరు పిల్లలు ఉన్నా.. ఆమె మరో వ్యక్తితో ఇలా వివాహేతర సంబంధం పెట్టుకోవడమేంటని ప్రశ్నించాడు. ఆమె తనను నమ్మించి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది కూడా చదవండి: దారుణం.. బాలికపై వరుసకు సోదరుడు లైంగికదాడి -
భర్తకు నిప్పంటించి.. బండతో బాదిన భార్య.. కారణం ఏంటంటే..
సాక్షి, తుమకూరు(కర్ణాటక): భార్యభర్తల మధ్య జరిగిన గొడవ భర్త హత్యకు దారితీసింది. తుమకూరు నగరం జయనగరలో ఆదివారం మధ్యాహ్నం నారాయణ (45), భార్య అన్నపూర్ణమ్మ కొట్లాటకు దిగారు. నారాయణ నెలమంగల దగ్గరున్న మద్యం ఫ్యాక్టరీలో ఎలక్ట్రిషియన్గా పని చేసేవాడు. భార్యకు అక్రమ సంబంధం ఉందని నారాయణ అనుమానించేవాడని సమాచారం. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గొడవలో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య ఇంట్లో ఉన్న కిరోసిన్ తీసుకొని భర్త పైన పోసి నిప్పు అంటించింది. మంటలో కాలిపోతున్న భర్త కిందపడిపోగా అతని తల పైన బండరాయితో కొట్టడంతో తల ఛిద్రమైంది. చుట్టుపక్కలవారు జయనగర పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. భార్యను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. చదవండి: ఏడు రోజుల్లో పెళ్లి.. బండరాయితో కొట్టుకొని పెళ్లి కొడుకు ఆత్మహత్య -
ఒక్క తప్పు.. రెండు ప్రాణాలు బలి
యడ్లపాడు: ఆమె చేసిన పొరపాటు ఆమెతో పాటు మరొకరి ప్రాణాలను బలితీసుకుంది. భర్తను ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసింది. మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. యడ్లపాడు మండలం చెంఘీజ్ఖాన్పేటలో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మామిడాల మహేశ్వరి(21)కి ఆర్మీలో పనిచేసే అదే గ్రామానికి చెందిన మేనమామ శివశంకర్తో 11 నెలల కిందట వివాహమైంది. ఇటీవల అతడికి హైదరాబాద్ బదిలీ అవడంతో భార్యను తీసుకెళ్లేందుకు సెలవుపై గ్రామానికొచ్చాడు. అయితే భర్తతో వెళ్లడం ఇష్టం లేక.. ఈ నెల 8న ఇంట్లో చెప్పకుండా ప్రకాశం జిల్లా ఆదిపూడిలో ఉండే ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది. మహేశ్వరి కుటుంబ సభ్యులు వెళ్లి ఇంటికి రావాలని కోరినా ఆమె రాలేదు. దీంతో మనస్తాపం చెందిన మహేశ్వరి భర్త శివశంకర్ అదే రోజు గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన బంధువులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. జరిగిన విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా ఆదిపూడికి చెందిన ప్రియుడి తండ్రి చుండూరి భద్రయ్య(50).. తమ కుటుంబం పరువు పోయిందన్న అవమానంతో ఆ మరుసటి రోజే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం మహేశ్వరికి నచ్చజెప్పి కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనల నేపథ్యంలో కలత చెందిన మహేశ్వరి ఆదివారం బాత్రూంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దికాలం కిందటే శివశంకర్ తండ్రి శివయ్యకు గుండె ఆపరేషన్ చేశారు. తనకు నలుగురు కుమార్తెల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కుమారుడి జీవితం ఇలా అయిందేంటని శివయ్య, తల్లి అక్కమ్మ కుమిలిపోతున్నాడు. ఓ వైపు కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం, మరోవైపు శివశంకర్ ఆస్పత్రిలో ఉండటంతో మహేశ్వరి తల్లిదండ్రులు వెంకటనాగలక్ష్మి, సాంబశివరావులు తల్లడిల్లిపోతున్నారు. వెంకటనాగలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్ఐ పైడి రాంబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా..
సాక్షి, మైసూరు( కర్ణాటక): పర పురుషునితో సన్నిహితంగా ఉంటోందని భార్యను భర్త అంతమొందించాడు. ఈ ఘటన మైసూరు జయనగరలో జరిగింది. హతురాలు నళిని (32) కాగా, నిందితుడు ఆమె భర్త రాజేశ్ (40). రాజేష్ బైక్ మెకానిక్, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నళిని వేరే వ్యక్తితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది. ఇది తగదని రాజేశ్ పలుమార్లు భార్యను హెచ్చరించాడు. ఆఖరికి రాజేశ్ రమాబాయి నగర నుంచి జయనగరకు మకాం మార్చాడు. అయినా పరిస్థితి ఏమీ మారలేదు. బుధవారం కూడా ఇదే విషయమై గొడవపడిన రాజేశ్ తాగిన మత్తులో భార్యను కత్తితో పొడిచి చంపి పరారయ్యాడు. పోలీసులు రాజేశ్ కోసం గాలించి పట్టుకున్నారు. హత్యపై అశోకపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. -
ఇటు భర్త.. అటు భార్య మిస్సింగ్.. తలలు పట్టుకున్న పోలీసులు..
సాక్షి, బంజారాహిల్స్: వివాహిత మోజులో పడి భార్యాపిల్లలను వదిలేసి ఆమెతో ఉడాయించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణానగర్లో నివాసం ఉంటున్న యువకుడు(31) ఆర్సీపురంలోని ఓ బైక్ షోరూమ్లో బ్రాంచి మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతడికి ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ పెళ్లయింది. భార్య(30), కూతురు(6), కొడుకు(4)తో కలిసి ఆనందంగా జీవిస్తున్నారు. కాగా అతడితో పాటు పనిచేస్తున్న వివాహిత(21)తో నెలరోజుల క్రితం పరిచయం అవడంతో పాటు చాటింగ్లు చేసుకుంటున్నారు. ఈక్రమంలో మూడురోజుల క్రితం అతడు చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. భర్త ఆచూకీ కనిపించక అన్ని ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో సోమవారం భార్య జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆరా తీయగా కాల్రికార్డ్స్, చాటింగ్స్ ఆధారంగా వివాహితతో కలిసి వెళ్లినట్లు తేలింది. ఆమె భర్త కూడా చందానగర్ పీఎస్లో భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసినట్లు తేలింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక పోలీసులు తలపట్టుకుంటున్నారు. ఉడాయించిన ఇద్దరూ మేజర్లే కావడంతో సమస్య ఎక్కడకు దారితీస్తుందో అని వారు వేచిచూస్తున్నారు. అమ్మా..! డాడీ ఎక్కడంటూ రాత్రి నుంచి కుమార్తె ఏడుస్తోందంటూ బాధిత యువతి విలపిస్తుండటం పోలీసులను సైతం కంటతడి పెట్టించింది. -
జగద్గిరిగుట్టలో వ్యభిచార గృహాలపై దాడి
జగద్గిరిగుట్ట: వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై పోలీసుల దాడులు నిర్వహించి నలుగురు విటులతో పాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న ఘటన జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గాజులరామారంలోని మహదేవపురం కాలనీలో ఓ ఇంటిలో వ్యభిచారం జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసుల శనివారం అడ్డాపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు విటులతో పాటు ఇద్దరు మహిళలు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. సెల్ఫోన్ ద్వారా విటులకు ఫోన్చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిర్వాహకులతో పాటు విటులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాలానగర్ లోని వ్యభిచార గృహంపై బాలానగర్ ఎస్వోటీ పోలీసులు దాడిచేసిన సంఘటన స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాలానగర్ ఎస్వోటి ఇన్ స్పెక్టర్ రమణారెడ్డి తెలిపిన వివరాలు.. జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని కమల ప్రసూన నగర్లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వ్యభిచార గృహం నిర్వాహకుడు హరీష్ (38), విటుడు విజేందర్ (26)లతో పాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని జగద్గిరిగుట్ట పోలీసులకు అప్పగించారు. హరీష్, విజేందర్లపై కేసు నమోదు చేసి ఇద్దరు మహిళలను రెస్క్యూహోంకు తరలించారు. చదవండి: కుటుంబ తగాదాలు.. అన్న, అక్క దారుణ హత్య -
ప్రేయసిపై కోపం.. చిన్నారి గొంతుకోసి
మేడ్చల్ : తల్లి అక్రమ సంబంధం అభంశుభం తెలియని ఓ చిన్నారిని బలి తీసుకుంది. తల్లి చేసిన తప్పిదానికి ఓ నిండు ప్రాణం బలైంది. భర్తలేని సమయంలో ప్రియుడుతో పెట్టుకున్న అక్రమ సంబంధం చివరికి తన కూతురిని తన నుంచి శాస్వతంగా దూరం చేసింది. ఆరేళ్ల చిన్నారిని ఓ కిరాతకుడు గొంతుకోసి దారుణంగా హత్యచేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో కలకలం రేపింది. ఘట్కేసర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనుషా-కళ్యాణ్ దంపతులకు ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వారిద్దరికి ఆద్య అనే ఆరేళ్ల కూతురు ఉంది. కొంతకాలం కిందట అనుషాకు కరుణాకర్ అనే మరో యువకుడితో పరిచయం ఏర్పడగా.. అది అక్రమ సంబంధానికి దారితీసింది. విషయం కాస్తా భర్తకు తెలియడంతో అనుషను తీవ్రంగా మందలించాడు. ఆ తరువాత ఆమె తన ప్రవర్తనను మార్చుకుని కరుణాకర్ను దూరం పెట్టడం ప్రారంభించింది. దీంతో ప్రియురాలిపై తీవ్ర కోపం తెచ్చుకున్న ప్రియుడు అనుషా కూతురు ఆద్యను చంపాలని కుట్ర పన్నాడు. అనుకున్నట్లుగానే గురువారం మధ్యాహ్నాం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి అనుషపై దాడికి యత్నించి వెంట తెచ్చుకున్న సర్జికల్ కత్తి ఆద్య గొంతు కోశాడు. ఆపై తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు పోలీసులకు సమచారం ఇవ్వడంతో రక్తపు మడుగులో కొట్టుకుంటున్న పాపను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికి తీవ్ర రక్తస్రావం కావడం చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలను విడిచింది. నిందితుడు కరుణాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
వివాహేతర సంబంధం.. చెన్నై వ్యక్తి ఆంధ్రలో శవం
సాక్షి, చెన్నై : తమిళనాడుకు చెందిన అనకాపుత్తూరులో అదృశ్యమైన ఎల్రక్టీషియన్ ఆంధ్రలో శవంగా కనిపించాడు. వివాహేతర సంబంధంతో అతన్ని ఆంధ్రకు రప్పించి హత్యచేసిన జంటను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మృతదేహాన్ని వెలికితీసి విచారణ జరిపేందుకు నిర్ణయించారు. పల్లావరం సమీపానగల అనకాపుత్తూరు లేబర్పల్లి ప్రాంతానికి చెందిన కార్తికేయన్ (42) ఎల్రక్టీషియన్. ఇతను గత డిసెంబర్ 18న ఇంటి నుంచి బయటికి వెళ్లి ఆ తర్వాత తిరిగిరాలేదు. కుటుంబీకులు శంకర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తూ వచ్చారు. అతని సెల్ఫోన్ నెంబరు ఆధారంగా విచారణ జరపగా ఆంధ్ర రాష్ట్రం, చిత్తూరు జిల్లా ఎస్సీ కాలనీ రెండో వీధికి చెందిన శివకుమార్ (38)తో చివరిగా ఎక్కువసార్లు మాట్లాడినట్లు తెలిసింది. శివకుమార్, అతని భార్య మాదేశ్వరిని శంకర్నగర్కు రప్పించి పోలీసులు విచారణ జరిపారు. పోలీసులతో మాట్లాడిన శివకుమార్ కార్తికేయన్ తనకు ఎవరనే విషయం తెలియదని వెల్లడించారు. అతని భార్య మాదేశ్వరిని పోలీసులు విడిగా విచారణ జరపగా పొంతన లేని సమాధానాలు తెలిపారు. అనుమానించిన పోలీసులు తమదైన శైలిలో ఆమె వద్ద విచారణ జరపగా అసలు విషయం బయటకు వచ్చింది. అనకాపుత్తూరులో కార్తికేయన్ ఇంటి సమీపాన శివకుమార్ సోదరుడు నివసిస్తున్నారు. అతని ఇంటికి మూడు నెలల క్రితం శివకుమార్, అతని భార్య మాదేశ్వరి విందుకు వచ్చారు. ఆ సమయంలో పక్కింటి వ్యక్తి అయిన కార్తికేయన్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. దీన్ని కార్తికేయన్ తన సెల్ఫోన్లో ఫొటో తీసుకున్నాడు. వారం తర్వాత శివకుమార్ దంపతులు మళ్లీ ఆంధ్రకు వెళ్లారు. ఇలావుండగా మాదేశ్వరితో ఫోన్లో సంప్రదించిన కార్తికేయన్ తరచూ అక్కడికి వచ్చి తన కోర్కె తీర్చాలని, లేకుంటే తమ అసభ్య ఫొటోను నెట్లో విడుదల చేస్తానని బెదిరించాడు. భీతి చెందిన మాదేశ్వరి ఈ విషయం తన భర్త శివకుమార్కు తెలిపింది. ఆగ్రహించిన శివకుమార్ భార్య మాదేశ్వరి ద్వారా కార్తికేయన్ను ఆంధ్రకు రప్పించి హత్యచేసి సమీపానగల ఖాళీ స్థలంలో పాతిపెట్టారు. దీంతో ఇరువురినీ అరెస్టు చేసిన పోలీసులు కార్తికేయన్ మృతదేహం వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ సంఘటన పమ్మల్ ప్రాంతంలో సంచలనం కలిగించింది. -
భర్తతో అక్రమ సంబంధం.. సూదులతో గుచ్చి గుచ్చి!
సూర్యాపేట: భర్తతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారన్న అనుమానంతో ఓ వైద్యురాలు నర్సులను కత్తులతో, సూదులతో గుచ్చి హింసించింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన.. బాధితురాలి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. డాక్టర్ విజయలక్ష్మి ఆమె భర్త రామకృష్ణ సూర్యాపేటలో ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు. భార్యాభర్తలు అదే ఆస్పత్రిలో వైద్యులుగా సేవలు అందిస్తున్నారు. అదే ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సులతో తన భర్త వివాహేతర సంబంధం నడుపుతున్నాడన్న అనుమానం భార్యకు ఏర్పడింది. ఈ నేపథ్యంలో సదరు వైద్యురాలికి, నర్సులకు ఈ విషయంలో పలుమార్లు గొడవులు కూడా జరిగినట్లు తెలిసింది. అదే అనుమానంతో కొన్ని రోజుల క్రితం మహిళా నర్సు లను విధుల నుండి తొలగించారు. ఈ క్రమంలోనే ఈనెల 6న వైద్యురాలు భర్త లేని సమయంలో నర్సులు సునీత, ప్రమీలను పిలిపించి చైర్లో కూర్చోపెట్టి బంధించింది. యాసిడ్, పినాయిల్తో బెదిరించి సూదులతో గుచ్చి, గుచ్చి ఆపరేషన్ చేసే కత్తులతో గొంతుపై పెట్టి హింసించింది. తన భర్తతో లైంగిక సంబంధం ఉందా లేదా? అని ప్రశ్నిస్తూ సునీతపై బీభత్సం సృష్టించింది. అక్రమ సంబంధం ఉంటే మానుకోవాలని భయబ్రాంతులకు గురి చేసింది. కొన్ని గంటల పాటు వైద్యురాలు సునీతపై దాడి చేస్తూ ఉండడంతో ఏమీ చేయలేక అక్కడే ఉన్న తోటి నర్సు ప్రమీల, ఆండాళ్ అలాగే ఉండిపోయారు. సుమారు ఆరు గంటల తరువాత సునీత తోటి నర్సుల సహాయంతో తప్పించుకొని వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఇంట్లో భర్త.. వీధిలో ప్రియుడు
భువనేశ్వర్: ఓ ఇల్లాలి వివాహేతర సంబంధం గట్టురట్టయింది. ప్రియుడితో ఉడాయిస్తుండగా పట్టుబడింది. తాళి కట్టిన భర్తను మోసం చేసి ప్రియుడితో పారిపోతుండగా పట్టుబడడంతో మెట్టినింటి గ్రామస్తులు ఆ ఇల్లాలిని అదుపులోకి తీసుకుని తగిన శాస్తి చేశారు. సామాజిక, వైవాహిక విలువల్ని కాలరాసి పారిపోవడం పట్ల గ్రామస్తులంతా ఉమ్మడిగా వ్యతిరేకించారు. ప్రియుడితో చిక్కిన ఇల్లాలిని అదుపులోకి తీసుకుని కాళ్లు, చేతులు కట్టి పడేశారు. ప్రియుడి కుటుంబికుల్ని రప్పించి వ్యవహారం బట్టబయలు చేశారు. ఒడిశాలోని సుందర్గడ్ జిల్లా రౌర్కెలా బ్రాహ్మణి తరంగ్ పోలీసు స్టేషన్ పరిధి మండియాకుదర్ గ్రామంలో ఈ సంఘటన సోమవారం జరిగింది. జిల్లాలోని లఠికొటా పంచాయతీ ముండాఝొరొ గ్రామస్తురాలితో మండియాకుదర్ గ్రామస్తుడికి ఈ ఏడాది మే నెలలో వివాహం జరిగింది. పెళ్లికి ముందు బిర్సా స్టేషన్ పరిధిలోని చిరుబెడా గ్రామస్తుడు పురాణ్ సింగ్తో ఆమెకి ప్రేమ వ్యవహారం సాగింది. తాళి కట్టిన భర్తతో కాపురం చేస్తూ ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగించడంతో భర్తకు అనుమానం కలగడంతో వారి దాంపత్యంలో అలజడి రేగింది. మెట్టినింటిలో వేధింపులు తాళలేని పరిస్థితి తారసపడడంతో ప్రియుడితో వెళ్లిపోయేందుకు ఆ ఇల్లాలు నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ప్రియుడు పురాణ్ సింగ్తో ఇల్లాలు లేచిపోతుండగా ఓరాం గ్రామస్తులకు పట్టుబడింది. బస్టాండ్లో వారిద్దరినీ గ్రామస్తులు పట్టుకున్నారు. ఆమెను తీసుకుపోతున్న ప్రియుడు పురాణ్ సింగ్ను అదుపులోకి తీసుకుని ప్రేమికుల్ని బంధించారు. వారి కాళ్లూచేతులు కట్టి పడేశారు. ప్రియుడు పురాణ్ సింగ్ కుటుంబీకులకు కబురు చేశారు. ఘటనా స్థలానికి కుటుంబీకులు చేరడంతో గ్రామస్తులంతా కలిసి చర్చించి ఓ తీర్మానం ఖరారు చేశారు. పెళ్లి ఖర్చుల్ని పరిహారంగా చెల్లించి వివాహితను పురాణ్ సింగ్తో తీసుకుపొమ్మని తీర్మానించారు. పెళ్లి ఖర్చుల కింద రూ.1 లక్ష 50 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్పట్ల ప్రియుడి కుటుంబీకులు అంగీకరించారు. తక్షణమే రూ.50 వేలు చెల్లించి మిగిలిన సొమ్ము త్వరలో చెల్లిస్తామని అభ్యర్థించడంతో ప్రేమికుల్ని గ్రామస్తులు విడుదల చేశారు. ప్రాణ భయం ఈ వ్యవహారం అంతటినీ గ్రామస్తులు రికార్డు చేసి సోషల్ మీడియాలో ప్రసారం చేశారు. తాళి కట్టిన భర్త కుటుంబీకులకు ఒప్పందం మేరకు పెళ్లి ఖర్చుల బకాయి చెల్లించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో తమకు ప్రాణ భయం ఉందన్న ఆందోళనతో ప్రియుడు, ఇల్లాలు రౌర్కెలా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ను ఆశ్రయించారు. -
వివాహిత కోసం ఇద్దరి మధ్య ఘర్షణ
సాక్షి, చెన్నై: వివాహమై ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఉపాధ్యాయురాలి కోసం ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. తమిళనాడులోని అరియలూరు జిల్లా తిరుమళంపాడి మారియమ్మన్ ఆలయ వీధికి చెందిన నటరాజన్ కుమారుడు రాజరాజన్ (28)అవివాహితుడు. అతనికి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. అనంతరం అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్ని రోజుల పాటు వారి బంధం అలాగే కొనసాగింది. ఈ క్రమంలోనే ఆమెకు అదే పాఠశాలలో పని చేస్తున్న హెన్రి (40) అనే ఉపాధ్యాయుడితో స్నేహం ఏర్పడి.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ సంగతి రాజరాజన్కు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే హెన్రీ, రాజరాజన్ల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. హెన్రీ మద్దతుదారులు రాజరాజన్పై కట్టెలతో దాడి చేసి కత్తులతో పొడిచి గాయపరిచారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హెన్రీని అరెస్టు చేశారు. ఘటనపై మరింత విచారణ జరుపుతున్నారు. ఉపాధ్యయురాలిని విచారిస్తున్నారు. -
స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. హత్య
బెంగళూరు: స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాక.. ఈ విషయం గురించి ప్రశ్నించినందుకు స్నేహితుడిని తుపాకీతో కాల్చి మరి చంపాడో వ్యక్తి. వివరాలు.. బెంగళూరు పరిసర గ్రామానికి చెందిన మునియప్ప, రమేష్ బాల్య స్నేహితులు. రమేష్ ట్రక్ తొలుతూ జీవినం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మునియప్ప, రమేష్ భార్య కళావతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాక వీరిద్దరు గతేడాది ఇంటి నుంచి వెళ్లి పోయారు. కొన్ని నెలలు గడిచిన తర్వాత మునియప్ప గ్రామానికి వచ్చాడు.. కానీ కళావతి, తన భర్త రమేష్ దగ్గరకు రాలేదు. దాంతో గ్రామ పెద్దలతో పంచాయతి పెట్టించిన రమేష్.. కళావతిని ఇంటికి రావాల్సిందిగా కోరాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. అంతేకాక విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో భార్యతో సంబంధం పెట్టుకోవడమే కాక.. విడాకులు కోరేలా చేశాడనే కోపంతో మంగళవారం రమేష్, మునియప్పతో గొడవకు దిగాడు. ఈ వివాదం కాస్త పెద్దది కావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన మునియప్ప.. తండ్రి తుపాకీతో రమేష్ మీద కాల్పులు జరిపాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి రమేష్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మునియప్ప, అతడి తండ్రి, సోదరుడు, రమేష్ భార్య కళావతిల మీద కేసు నమోదు చేశారు. -
పాఠశాలలో టీచర్ రాసలీలలు.. దేహశుద్ధి
సాక్షి, చెన్నై: పాఠశాల మరుగుదొడ్డిలో మహిళతో రాసలీలలు చేస్తున్న ఉపాధ్యాయుడిని గ్రామస్తులు మంగళవారం చితకబాది దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని నామక్కల్ జిల్లా పుదుచత్రం సమీపంలోని ఎస్ ఉడుంబం అనే గ్రామం ఉంది. ఇక్కడ ఎలిమింటరీ పాఠశాలకు హెడ్మాస్టర్గా జయరాజ్, ఉపాధ్యాయుడు శరవణన్ ఉ న్నారు. ఇక్కడికి పక్కనే ఉన్న అంగన్వాడి పాఠశాలలో పనిచేస్తున్న మహిళకు శరవణన్కు అక్రమ సంబంధం ఉన్నట్టు సమాచారం. వీరు గత కొన్ని నెలలుగా పాఠశాల మరుగుదొడ్డిలో కలుసుకుని రాసలీలలు నెరపుతున్నట్టు తెలుస్తోంది. దీన్ని గమనించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చెప్పినట్టు సమాచారం. ఈ స్థితిలో మంగళవారం ఉదయం అకస్మాత్తుగా విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాలకు వచ్చారు. తర్వాత వారు ఉపాధ్యాయుడు శరవణన్ను పట్టుకుని పాఠశాలలో మహిళతో ఉన్న విషయంగా నిలదీశారు. తర్వాత మహిళలు చెప్పులు, చీపురలతో శరవణన్ను చితకబాదారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ విషయంగా పాఠశాల హెడ్మాస్టర్ జయరాజ్ మాట్లాడుతూ.. గత రెండు నెలల క్రితం ఇదే విధంగా శరవణన్ ఒక మహిళతో పాఠశాల మరుగుదొడ్డిలో ఉన్నట్టు తనకు సమాచారం అందిందన్నారు. అయితే తాను అక్కడికి వెళ్లే సరికి మరుగుదొడ్డికి తాళాలు వేసి ఉన్నాయని, అయినప్పటికీ తాము ఆ తాళాలు తీసి లోపలికి వెళ్లి చూడగా మహిళ ఉన్నట్టు తాము చూశామన్నారు. అయితే అప్పుడు శరవణన్ను తాము హెచ్చరించి పంపించేశామని, తర్వాత అప్పటి నుంచి ఎలాంటి అకృత్యాలు పాఠశాలలో జరగలేదని తెలిపారు. పోలీసులు శరవణన్ వద్ద విచారణ జరుపుతున్నారు. . -
పెళ్లి చేసుకుంటానని మోసం
సాక్షి, మల్యాల(చొప్పదండి) : ప్రేమించానని వెంటపడి.. కన్నవారికి.. కడుపున పుట్టిన వారికి దూరమై.. ప్రేమించిన వాడి సరసన చేరిన మహిళ రోడ్డున పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ.. ఇంట్లో సమస్యలు పరిష్కారం కాగానే ఇంటికి తీసుకెళ్తానంటూ పన్నెండేళ్లుగా సహజీవనం చేశాడు. ప్రియురాలితో నిత్యం ఫోన్లో మాట్లాడుతూ.. మరో మహిళ మెడలో తాళి కట్టిన ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం చేయాలంటూ మీడియా ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ అదే గ్రామానికి చెందిన మ్యాకల అనిల్తో పన్నెండేళ్ల క్రితం స్నేహం కుదిరింది. అప్పటికే మహిళకు వివాహమై, ముగ్గురు పిల్లలున్నారు. నిన్ను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానంటూ అనిల్ నమ్మబలికాడు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం వ్యవహారం మహిళ భర్తకు తెలియడంతో పలుమార్లు పంచాయతీ కాగా, చివరికి వీరిద్దరి వివాహేతర సంబంధం కారణంతోనే విడాకులు తీసుకుని, భర్త దగ్గరనే పిల్లలను వదిలిపెట్టి అనిల్ చెంతకు చేరింది. పన్నెండేళ్లుగా సహజీవనం పెళ్లిచేసుకుంటానంటూ నమ్మిస్తూ.. పన్నెండేళ్లుగా సంసారం చేస్తున్నాడు. మా చెల్లి భర్త చనిపోతే కూడా వెళ్తానన్నా వెళ్లనివ్వలేదు. బయట ప్రపంచంతో సంబంధం ఉండకూదడని, ఎవరితో మాట్లాడవద్దంటూ హింసించాడు. వివిధ ప్రాంతాల్లో అద్దెకు ఉంచుతూ, ఇంట్లో సమస్యలు తీరిపోగానే ఇంటికి తీసుకెళ్తానంటూ నమ్మించాడు. చివరికి చెల్లి పెళ్లి అయిన తర్వాత అంటూ ఏ రోజుకారోజు ఏదో ఒక సమస్య చెబుతూ దాట వేశాడు. అన్ని సమస్యలు తీరిపోగానే పన్నెండేళ్లు సంసారం చేసిన విషయం మరిచి, మరో మహిళను మూడు రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈనెల 25న కూడా ఫోన్లో మాట్లాడాడు. నా పుట్టింటికి దూరమై..అందరికి నన్ను దూరం చేశాడు. పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేసి, మరో మహిళను వివాహం చేసుకున్నాడని మహిళ బోరున విలపించింది. పోలీస్స్టేషన్కు చేరిన బాధిత మహిళ తక్కళ్లపల్లిలో నమ్మించి మోసం చేసిన వ్యక్తి ఇంటి ఎదుట బుధవారం మహిళ బైఠాయించింది. సమాచారం మేరకు ఎస్సై ఉపేంద్రచారి అక్కడికి చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. తనను అనిల్ ఏవిధంగా వంచించాడో వివరించింది. తనకు న్యాయం చేసేదాకా ఇక్కడి నుండి కదలనని, పోలీస్స్టేషన్కు వస్తే అనిల్ తన ధనబలంతో న్యాయం జరగదంటూ తేల్చి చెప్పింది. దీంతో అక్కడినుంచే ఎస్సై ఉపేంద్రచారి అనిల్తో ఫోన్లో మాట్లాడి, పోలీస్స్టేషన్కు రావాల్సిందిగా హుకుం జారీ చేశారు. చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని, ఎవరి పైరవీలకు లొంగమంటూ మహిళకు నచ్చజెప్పడంతో పోలీసులతోపాటు బాధిత మహిళ మల్యాల పోలీసు స్టేషన్కు చేరింది. -
పట్టపగలే నడిరోడ్డుపై హత్య
సాక్షి, వేములవాడ : పట్టణంలోని సుబ్రమణ్యంనగర్లో పట్టపగలే నడిరోడ్డుపై దుండగులు దారుణహత్యకు తెగబడ్డారు. నాగుల రవి (30) అనే యువకుడిని కత్తులతో విచాక్షణరహితంగా దాడి చేసి హత్య చేసిన ఘటన శుక్రవారం జరిగింది. కుటుంబసభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం..ఇంటి పనులపై బయటికి వెళ్లిన రవి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత బైక్పై అద్దెకుంటున్న ఇంటికి చేరుకున్నాడు. అక్కడే మాటు వేసి ఉన్న ముగ్గురు బైక్పై వచ్చి కత్తులతో దాడి చేసి హత్య చేసి బైక్పై పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రవి మృతదేహాన్ని, ఒంటిపై కత్తులతో దాడి చేసిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. రవికి తల్లి దేవమ్మ, సోదరుడు సరిల్, సోదరి జ్యోతి ఉన్నారు. పట్టపగలే నడిరోడ్డుపై హత్య జరగడంతో వేములవాడలో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటనా స్థలాన్ని ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్సైలు పరిశీలించారు. సీసీ కెమెరాల్లో నిందితుల ఆచూకీ మిట్ట మధ్యాహ్నం సుబ్రమణ్యంనగర్లో నాగుల రవిని బైక్పై వచ్చిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేసిన చిత్రాలు సీసీ కెమెరా పుటేజీల్లో పోలీసులకు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఇప్పటికే పోలీసుబృందాలు గాలింపు చేపట్టినట్లు తెలిపారు. గతంలోనూ గొడవలు.. ‘ఆడదాని వల్లే నా కొడును పొట్టన పెట్టుకున్నారని’ తల్లి దేవమ్మ రోదిస్తూ పోలీసులకు తెలిపింది. గతంలో వివాహేతర సంబంధం కారణంగా గొడవలు జరిగాయని, అయినా తాము ఇతర ప్రాంతానికి వెళ్లి ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నా తన కుమారుడిని వీడలేదని వాపోయింది. ఆరునెలలుగా తన కొడుకు రవి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, తన పని తాను చేసుకుంటూ బతుకుతున్నాడని చెప్పింది. నిందితులను పట్టుకుని శిక్షించాలని డీఎస్పీ వెంకటరమణను వేడుకుంది. కాగా మాకు ప్రాణభయం ఉందని పోలీసులు రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తేనే తమ్ముడు నాగుల రవి శవాన్ని తీస్తామని అతడి సోదరుడు సరిల్ డీఎస్పీ వెంకటరమణ ముందు కన్నీటి పర్యంతమయ్యాడు.నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, మీ కుటుంబానికి రక్షణ కల్పిస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. మున్సిపల్ సిబ్బంది సహాయంతో శవాన్ని జీపులో ఎక్కించి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ముగ్గురిని గుర్తించాం నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, పీడీయాక్ట్ నమోదు అయ్యేలా చూస్తామని డీఎస్పీ వెంకటరమణ శుక్ర వారం రాత్రి విలేకరులకు తెలిపారు. జావేద్, అక్రం, అహ్మద్ అనే ముగ్గురు అన్నదమ్ములను సీసీ కెమెరాలో గుర్తించినట్లు తెలిపారు. ఆయన వెంట సీఐ వెంకటస్వామి ఉన్నారు. -
వద్దమ్మా..కాల్చొద్దమ్మా.. ప్లీజ్ అమ్మా..
వద్దమ్మా..కాల్చొద్దమ్మా.. ప్లీజ్ అమ్మా..కొట్టకే..నొప్పెడుతోందమ్మా అంటూ ఆ బిడ్డలు ఎంత తల్లడిల్లారో ఎంతగా..వెక్కివెక్కి ఏడ్చారో పాపం వీపంతా వాతల మయంచెంపలు, మోచేతులు చర్మం ఊడి..గాయాలైన ఆ చిన్నారులు..ఆ పసికూనలు బిక్కుబిక్కు మంటున్నారు. కన్నతల్లి అనైతిక చేష్టలతో రోజూ నరకం చూసి కదిలిస్తే..బోరున విలపిస్తున్నారు. కొత్తగూడెంఅర్బన్: నవ మాసాలు మోసిన కన్న తల్లే కూతుళ్ల పట్ల కాసాయిలా మారింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే సాకుతో చిన్నారులను చిత్రహింలకు గురి చేసింది. ఈ విషయం ఆమె సోదరుడికి(పిల్లల మేనమామ) తెలియడంతో నిర్వాకం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి కొత్తగూడెం టూటౌన్ ఎస్సై కుమారస్వామి తెలిపిన వివరాలిలా..కొత్తగూడెం పట్టణంలోని బొగ్గు గని ప్రాంతమైన రుద్రంపూర్కు చెందిన గౌడ్స్ ఓం ప్రకాశ్ మూడు నెలల క్రితం మృతి చెందాడు. అతడి భార్య రూప, కూతుళ్లయిన 8 సంవత్సరాల హేమశ్రీ, ఐదేళ్ల శ్రీప్రియ ఉన్నారు. రూపకు అప్పటికే గౌతంపూర్కు చెందిన ఆటో డ్రైవర్ రాజేష్తో వివాహేతర సంబంధం ఉంది. అయితే భర్త చనిపోయిన తర్వాత వీరిరువురి బంధం బలపడింది. ఈ క్రమంలో కూతుళ్లు హేమశ్రీ, శ్రీప్రియ అడ్డుగా ఉన్నారనే కారణంతో రూప వారిని ప్రతిరోజూ చిత్రహింసలకు గురి చేస్తోంది. ఒళ్లంతా వాతలు పెట్టింది. ముఖంపైనా తీవ్రంగా గాయపర్చింది. చిన్నారుల ఒళ్లంతా గాయాలే కనిపించడంతో ఈ విషయం రూప సోదరుడు ఉర్సు కుమార్కు తెలిసింది. కుమార్ బుధవారం రూప ఇంటికి వెళ్లి పిల్లలను ఆరా తీయగా నిజం బయటపడింది. చిన్నారులు జరిగిన విషయమంతా వివరించారు. దీంతో కుమార్ ఇద్దరు పిల్లలను తీసుకుని టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై కుమారస్వామి రూపను స్టేషన్కు పిలిపించి విచారించగా తన కూతుళ్లను గాయపర్చింది, చిత్రహింసల పాలు చేసింది నిజమేనని అంగీకరించింది. ఆమెపై ఎస్సై కేసు నమోదు చేశారు. -
భర్తను హతమార్చిన భార్య, ప్రియుడు?
టేకులపల్లి: మండలంలోని తావుర్యాతండాలో మద్యం మత్తులో నిద్రిస్తున్న వ్యక్తిని గొంతు నులిమి హత్య చేసిన ఘటన జరిగింది. వివాహేతర సంబంధం వల్లనే హత్య జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తావుర్యా తండాకు చెందిన దారావత్ నందు (25)కి అదే గ్రామానికి చెందిన సుప్రియతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సిద్దు (3), అజయ్ (ఒకటిన్నర) ఉన్నారు. నందు కొత్తగూడెంలోని ఓ షాపులో పనిచేస్తూ కుటుం బాన్ని పోషిస్తున్నాడు. సుప్రియ కొత్తగూడెంలో టైలరింగ్ నేర్చుకునేందుకు వెళ్తోంది. ఈ క్రమంలో టేకులపల్లి మండలం కోక్యాతండాకు చెందిన గుగులోత్ కృష్ణతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నదని అనుమానించిన భర్త నందు భార్యను మందలించాడు. ఈ విషయంలో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. రెండు వారాల క్రితమే ఇంట్లో భర్తతో గొడవపెట్టుకుని సుప్రియ పుట్టింటికి వెళ్లింది. మృతుడి తల్లి లక్ష్మి, అన్న దేవా సుప్రియ పుట్టింటికి వెళ్లి నచ్చజెప్పి భర్త దగ్గరకు పంపించారు. గురువారం ఉదయం కొత్తగూడేనికి పనికి వెళ్లిన నందు రాత్రి 9 గంటల తరువాత ఇంటికొచ్చాడు. భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం సేవించి నందు నిద్రపోయాడు. శుక్రవారం ఉదయం సుప్రియ అన్న సుమన్ మృతుడి అన్న దేవాకు ఫోన్ చేసి మీ తమ్ముడు ఇంట్లో స్పృహ కోల్పోయి ఉన్నాడని చెప్పడంతో మృతుడి కుటుంబ సభ్యులు వచ్చి చూడగా తొంతుకు తీగతో నులిమి చనిపోయి ఉన్నాడు. గురువారం రాత్రి సుప్రియ ప్రియుడు కృష్ణ మరికొందరితో వచ్చి నిద్రిస్తున్న నందు గొంతు నులిమి హత్య చేసినట్లు చర్చించుకుంటున్నారు. తన కుమారుడిని సుప్రియ, ప్రియుడు కృష్ణ, మరి కొందరు కలిసి హత్య చేశారని తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ మడిపల్లి నాగరాజు, ఎస్ఐ గడ్డం ప్రవీణ్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్ప గించారు. మృతుడి భార్య సుప్రియ, ప్రియుడు కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
వ్యక్తి దారుణహత్య..!
అనుమానం పెనుభూతమైంది.. తన భార్యతో స్నేహితుడు సఖ్యతగా మెలుగుతున్నాడని అనుమానం పెంచుకున్నాడు. అదునుకోసం వేచి చూసి మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతనితో సన్నిహితంగా మెలుగుతూనే హత్యకు పథకం రచించాడు. అనారోగ్యంతో బాధపడుతున్నానని.. వైద్యుడితో చూపించుకోవాలని వెంట రమ్మని కోరాడు.. పథకం ప్రకారం స్నేహితుడికి పూటుగా మద్యం తాపించి ఆపై ఘాతుకానికి ఒడిగట్టాడు. మోటకొండూర్ మండలంలో మంగళవారం వెలుగుచూసిన హత్యోదంతం వివరాలు.. మోటకొండూర్ (ఆలేరు) : జగద్గిరిగుట్టకు చెందిన నెహ్రూ(45) పాబ్రికేషన్ వర్క్ చేస్తుంటాడు. సమీపంలో నివసించే వేముల పరుశరాములుతో కలిసి రియల్ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తుంటాడు. రెండు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా స త్సంబంధాలు కొనసాగుతున్నాయి. అయితే నెహ్రూ తన భార్యతో సఖ్యతగా మెలుగుతున్నాడని ఇటీవల పరశరాములు అనుమానం పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నానని.. హత్యకు పథకం రచించిన పరుశరాములు స్నేహితుడైన నెహ్రూతో సఖ్యతగానే మెలుగుతున్నాడు. తనకు ఏమీ తెలియనట్టుగా అతడిని నమ్మిం చా డు. ఈ నేపథ్యంలోనే తనకు ఆరోగ్యం బాగాలేద ని పసిరికలు (కామెర్లు) అయ్యాయని చెట్ల మందులు తీసుకోవాలని, వైద్యుడి వద్దకు తీసుకెళ్లాల ని స్నేహితుడిని కోరాడు. దీనిలో భాగంగా నెహ్రూ సోమవారం సాయంత్రం స్నేహితుడు పరశరాములతో కలిసి జనగామ వైపు బయలుదేరాడు. రాయగిరిలో మద్యం సేవించి.. షిఫ్ట్ డైజైర్ కారులు బయలుదేరిన స్నేహితులు భువనగిరి మండలం రాయగిరిలో మద్యం సేవించారు. అనంతరం పరుశరాములు స్వగ్రామం అ యిన మోటకొండూర్ మండలం తేర్యాల గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో మార్గ మధ్యలోని చందేపల్లి గ్రామసమీపంలో వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే దారితోకి కొంతదూరం వెళ్లి రాత్రి 9గంటల సమయంలో మళ్లీ మద్యం సేవించారు. ఈ క్రమంలో పాత కక్షలను మనసులో ఉంచుకున్న పరుశరాములు నెహ్రూకు మద్యం అతిగా తాగించి స్పృహ కోల్పోయేలా చేశాడు. అనంతరం అప్పటికే కారులో ఉన్న కర్రను తీసుకొచ్చి నెహ్రూ తలపై బలంగా మోదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కిడ్నాప్ కేసు నమోదు నెహ్రూ, పరశరాములు ఇద్దరు కలిసి వెళ్లి రాత్రైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో నెహ్రూ భార్య సోమవారం రాత్రే జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యా దుచేసింది. తన భర్తను కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బావమరిదికి ఫోన్ చేసి.. హత్య అనంతరం పరశరాములు జరిగిన విషయాన్ని తన బావమరిదికి ఫోన్ చేసి చెప్పాడు. అతను పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం పరశరాములు మోటకొండూర్ మండల కేంద్రానికి వచ్చి మద్యం సేవించాడు. తెల్లవారుజామున మోటకొండూర్ పోలీసులకు లొంగిపోయాడు. అనంతరం ఎస్ఐ వెంకన్న, శ్రీరాములు, ప్రభాకర్లు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు జగద్గీరిగుట్ట పీఎస్లో నమోదు అవ్వటంతో ఎసీపీ గోవర్ధన్, ఎస్ఐ శ్రీనివాస్ , క్లూస్ టీమ్తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
ఏడేళ్లుగా సహజీవనం చేశారు.. చివరికి
వీరఘట్టం: వారిద్దరూ ఏడేళ్ల పాటు సహజీవనం చేశారు. నిత్యం మద్యం సేవించి వచ్చి ఇష్టం వచ్చి ఆమెను నిత్యం చిత్ర హింసలు పెట్టేవాడు. చివరకు ఆమెపై అనుమానం పెరిగి శుక్రవారం హతమార్చాడు. వివరాల్లోకి వెళితే వీరఘట్టం మేజరు పంచాయతీలోని కొట్టుగుమ్మడ రోడ్డు నక్కలపేటలో నివాసముంటున్న చెరుకుబిల్లి బాలరాజు, సరోజిని(45) ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి తాము నివాసముంటున్న మేడపై నిద్రించేందుకు వెళ్లారు. మేడపైకి వెళ్లిన కొద్ది సేపటికే ఇద్దరి మధ్య తగాదా ప్రారంభమైంది. సరోజినిని విచక్షణా రహితంగా కొట్టడంతో ఆమె స్పహకోల్పోయింది. వెంటనే ఆమెను మేడపై నుంచి కిందకు తోసేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కింద పడిన సరోజిని తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. 108లో పాలకొండ ఏరియా ఆస్పత్రి తరలించారు. రక్తం అధికంగా పోవడంతో సరోజిని వైద్య చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే శుక్రవారం అర్ధ రాత్రి మృతి చెందింది. ఏడేళ్ల కిందట పరిచయం.. బాలరాజుకు 15 ఏళ్ల క్రితం అమదాలవసకు చెందిన యువతితో వివాహం అయింది. 8 ఏళ్ల క్రితం వీరిద్దరు విడిపోయారు. సరోజినికి 9 ఏళ్ల క్రితం వీరఘట్టం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. పెళ్లి అయిన రెండేళ్లకే విడిపోయారు. ఏడేళ్ల క్రితం బాలరాజు, సరోజినిల మధ్య పరిచయం ఏర్పడింది. కేసు నమోదు మృతురాలి అన్న గొలుసు తవుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ జి.అప్పారావు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ షయం తెలియడంతో శనివారం సాయంత్రం పాలకొండ డీఎస్పీ జి.ప్రేమకాజల్, సీఐ జి.శ్రీనివాసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిసరాలు పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తలిపారు. -
వివాహేతర సంబంధం.. యువకుడు దారుణ హత్య
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఏపూరు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోకబత్తిని వంశీ (23) ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కల్లేపల్లి చంద్రమోహన్ భార్యతో వంశీ కొంతకాలంగా సఖ్యతగా ఉంటున్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన చంద్రమోహన్ యువకుడిని పలుమార్లు మందలించాడు. అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో శుక్రవారం రాత్రి తన ఇంట్లోనే నిద్రిస్తున్న వంశీపై చంద్రమోహన్ కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. తల, ఛాతిపై దాడిచేశాడు. వంశీ అరుపులు విన్న తల్లి ప్రమీల అడ్డుకోబోగా ఆమెకు కూడా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే తీవ్రంగా గాయపడ్డ వంశీని చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి నిందితుడు చంద్రమోహన్ను అరెస్టు చేసినట్టు ఏఎస్సై సత్యనారాయణ తెలిపారు. -
ప్రియుడి కోసం.. బాబును, భర్తను చంపేసింది
వేలూరు : ప్రేమించి వివాహం చేసుకున్నారు. రెండేళ్లు వారి కాపురం సాఫీగా సాగిపోయింది. ఏడాది క్రితం కుమారుడు జన్మించడంతో సంబరపడ్డారు. అయితే వివాహేతర సంబంధం వారి మధ్య చిచ్చుపెట్టింది. రెండు ప్రాణాలను బలి తీసుకుంది. వివరాలు.. వేలూరు జిల్లా ఆర్కాడు సమీపంలోని తాజ్పుర మందవేలి గ్రామానికి చెందిన సుబ్రమణి కుమారుడు రాజా(25) ఎలక్ట్రిషియన్. రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన దీపిక (20)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు ప్రనీష్(1) ఉన్నాడు. ఈ నెల 13వ తేదీ నుంచి తన భర్త, కుమారుడు కనిపించడం లేదని దీపిక ఆర్కాడు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త సెల్ నంబర్ చెబితే వెంటనే కనిపెడతామని పోలీసులు ఆమెకు తెలిపారు. అయితే తన భర్త సెల్ఫోన్ను ఇంట్లోనే పెట్టి వెళ్లిపోయాడని చెప్పింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో తడబడడంతో అనుమానించిన పోలీసులు ఆమెను విచారణ చేశారు. ఆ సమయంలో దీపిక తన భర్త రాజా, కుమారుడు ప్రనీష్లను హత్య చేసి ఇంటి సమీపంలోని భూమిలో పూడ్చి పెట్టినట్లు ఒప్పుకుంది. అవాక్కైన పోలీసులు గురువారం రాత్రి మృతదేహాలు పూడ్చిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. రాత్రి 11 గంటల సమయం కావడంతో దీపికను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి శుక్రవారం ఉదయం మృతదేహాలను బయటకు తీయాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం తహసీల్దార్ వత్సల, డీఎస్పీ కలైసెల్వన్, వేలి ముద్ర నిపుణులను రప్పించి మృతదేహాలను పూడ్చిన ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో రాజా బంధువులు దీపికపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు దీపికను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. అనంతరం పాతి పెట్టిన మృతదేహాలను బయటకు తీశారు. వారిని చూసి రాజా బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాలను అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ప్రాథమిక విచారణలో దీపిక భర్త రాజా తలపై రాతితో కొట్టి హత్య చేసి అనంతరం కుమారుడిని హత్య చేసినట్లు తెలిసింది. దీపికకు భర్త రాజా స్నేహితుడు ఒకరితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
భార్యపై అనుమానంతోనే హత్య
సుల్తానాబాద్(పెద్దపల్లి): అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను చంపినట్లు పోలీసుల వద్ద నిందితుడు హరీశ్ అంగీకరించినట్లు పెద్దపల్లి డీసీపీ తాళ్లపల్లి సుదర్శన్గౌడ్ తెలిపారు. శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 24న గట్టెపల్లిలో గన్నిసంచిలో వివాహిత మృతదేహం లభ్యమైంది. కరీంనగర్లో ఫ్యాషన్ డిజైనర్గా రమ పని చేసిన సమయంలో శ్రీరాం చిట్స్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్న రేవెళ్లి హరీశ్తో పరిచయమై ప్రేమగా మారింది. ఇద్దరు వివాహం చేసుకున్నారు. కరీంనగర్లోని హజ్మత్పురాలో ఆరీఫ్ ఇంట్లో అద్దెకు జాడి రమ అలియాస్ లక్కీఅలియాస్ సిరివెన్నెలతో కలిసి ఉంటున్నారు. కొద్దిరోజులు బాగానే ఉన్నప్పటికీ రమ తరచూ ఫొన్లో మాట్లాడడాన్ని హరీష్ గమనించి తప్పుబట్టాడు. ఏప్రిల్ 7వ తేదీన తన భర్త వేధిస్తున్నాడని 100కి ఫోన్చేసి రమ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపించారు. దీన్ని మనుసులో పెట్టుకొని హత్య చేసినట్లు హరీశ్ ఒప్పుకున్నాడని డీసీపీ వివరించారు. అక్రమ సంబంధం పెట్టుకుందని భావించి ఈనెల 21న అద్దెకుంటున్న ఇంట్లో గొంతు నులిమి హత్య చేసి తన ద్విచక్ర వాహనంపై గట్టెపల్లిలో గన్నిసంచిలో పడేసినట్లు అంగీకరించాడని వివరించారు. సోషల్ మీడియాలో, పలు దినపత్రికల్లో వచ్చిన కథనాలు మృతురాలి కుటుంబసభ్యులు అక్క రాధా, అన్న భానేశ్, ఇంటి యజమాని ఆరీఫ్ సుల్తానాబాద్ పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రెండురోజుల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు. రమది మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నార్వ స్వగ్రామం. నిందితుడు పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామ నివాసి అని తెలిపారు. సమావేశంలో ఏసీపీ వెంకటరమణారెడ్డి, సీఐ మహేందర్రెడ్డి, ఎస్సై రాజేశ్, పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు. -
వివాహేతర బంధమే ప్రాణం తీసింది
సాక్షి, చిత్తూరు రూరల్ : వివాహేతర సంబంధం దారుణ హత్యకు దారితీసింది. చేసిన తప్పును తెలుసుకుని భర్త వద్దకు తిరిగి చేరుకోవాలన్న మహిళ చివరకు ప్రియుడి చేతిలో హత్యకు గురైంది. ప్రియుడు అతి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటన చిత్తూరు నగరం చెన్నమ్మగుడిపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు నగరం చెన్నమ్మగుడిపల్లికి చెందిన హరికృష్ణ, కనకదుర్గ(36)లకు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరి కాపురం కొంతకాలం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఇటీవల అదే గ్రామానికి చెందిన త్యాగరాజు అనే వ్యక్తితో కనకదుర్గకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో భర్త హరికృష్ణ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ కారణంతో ఇద్దరూ విడిపోయారు. కనకదుర్గ పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలు ఇద్దరు హరికృష్ణ దగ్గరే ఉంటున్నారు. కాగా, చివరకు చేసిన తప్పును తెలుసుకున్న కనకదుర్గ భర్తకు దగ్గర కావాలనుకుంది. గత మూడు రోజులుగా తన పిల్లలతో పాటు భర్తను కలుసుకుని కాపురం కాపురం చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు త్యాగరాజు జీర్ణించుకోలేకపోయాడు. శనివారం కనకదుర్గ పుట్టింట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై దాడి చేశాడు. ఈ విషయాన్ని స్థానికులు 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని త్యాగరాజుని మందలించారు. దీంతో కనకదుర్గపై కక్ష పెంచుకున్న త్యాగరాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై మరోమారు దాడికి దిగాడు. చీరతో గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. స్థానికులు సమాచారంతో డీఎస్పీ రామాంజనేయులు, సీఐ శ్రీధర్, ఎస్ఐ పురుషోత్తంరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదివారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమవారం పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. -
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని
తలకొండపల్లి(కల్వకుర్తి): బావిలో పడి వృద్ధురాలు మరణించిన కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని వృద్ధురాలిని బావిలోకి తోసి చంపేశారని సీఐ నర్సింహారెడ్డి చెప్పారు. తలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నర్సింహారెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని పడకల్ గ్రామానికి చెందిన చెవిటి మైసమ్మ (66) వృద్ధురాలు జనవరి 14న గ్రామ శివారు ప్రాంతంలోని బావిలో పడి మృతి చెందింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విచారణలో హత్య చేసినట్లుగా వెల్లడైంది. పడకల్ గ్రామానికి చెందిన బురిగళ్ల దుర్గయ్య, బురిగళ్ల సంతోష వరుసకు వదిన, మర్దిలు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతుంది. మైసమ్మ ఇంటి సమీపంలోనే సంతోష ఇల్లు ఉంది. దీంతో దుర్గయ్య తరచూ సంతోష ఇంటికి వస్తుండేవాడు. విషయం గమనించిన మైసమ్మ మంచి పద్ధతి కాదని ఇరువురిని మందలించింది. వీరి మధ్య తరచుగా వాగ్వాదం కొనసాగుతుండేది. మృతురాలు మైసమ్మ అడ్డు తొలగించుకోవాలని దుర్గయ్య, సంతోషలు పథకం పన్నారు. ఇదిలా ఉండగా సంతోష బంగారు నగలు కొనివ్వమని తన ప్రియుడైన దుర్గయ్యను అడుగుతుండేది. దీంతో దుర్గయ్యకు ఒంటరిగా ఉన్న మైసమ్మ వద్ద ఉన్న బంగారు ఆభరణాలపై కన్నుపడింది. మైసమ్మను చంపి ఆభరణాలను తస్కరించి మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీంతో మైసమ్మ అడ్డుతో పాటు, బంగారు ఆభరణాలు సొంతం అవుతాయని, ఈ విషయాన్ని సంతోషకు చెప్పాగా ఆమె హత్యచేసేందుకు అంగీకరించింది. నగలు వస్తాయి.. అడ్డు తొలగుతుందని.. పక్కా వ్యూహంతో ముందుకు పోవాలని నిర్ణయించారు. జనవరి 9వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో దుర్గయ్య, సంతోష ఇద్దరూ కలిసి మైసమ్మ ఇంటికి వెళ్లారు. ఒంటరిగా ఉన్న మైసమ్మ గొంతు నులిమి చంపేశారు. మైసమ్మ ఒంటిపైన ఉన్న బంగారు ఆభరణాలతో పాటు, సెల్ఫోన్ను దొంగలించారు. సాక్ష్యం దొరక్కుండా మృతదేహాన్ని గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న పాడుబడిన బావిలో పడేశారు. 14వ తేదీన గ్రామస్తులు బావిలో తేలాడుతున్న మైసమ్మ మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పదస్థితి మృతి కింద కేసు నమోదు చేశారు. గ్రామస్తుల సమాచారం మేరకు దుర్గయ్య, సంతోషలను అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసుల సహకారంతో విచారణ చేయగా నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు నిందితులు దుర్గయ్య, సంతోషలను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ సురేష్యాదవ్, తదితరులు ఉన్నారు. -
వివాహిత హత్య.. భర్తే నిందితుడు
ధన్వాడ(నారాయణపేట): మండలంలోని కిష్టాపూర్ పంచాయతీలోని మూలతండాలో మంగళవారం ఉదయం అనిత(23) హత్యకు గురైంది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాలు... మూలతండాకు చెందిన బాల్యనాయక్కు అనితతో ఆరేళ్ల కిత్రం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలను నానమ్మ వద్ద ఉంచి వీరు బతుకుదెరువు కోసం పూణె వెళ్లి అక్కడే నివసిస్తున్నారు. పిల్లలను చూసేందుకు నాలుగు రోజుల క్రితం తండాకు వచ్చారు. మంగళవారం ఉదయం 7గంటల సమయంలో అనిత తన మేనల్లుడి(4)ని తీసుకొని పక్కనే ఉన్న తమ పొలంలో కంది కట్టెల కోసం వెళ్లింది. కొద్దిసేపటికే మేనల్లుడు తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం 9గంటలైనా ఇంకా అనిత ఇంటికి రాకపోవడతో మరదలు వరసైన చిట్టెమ్మ పొలానికి వెళ్లింది. అప్పటికే అనిత మృతిచెందింది. స్థానికులకు తెలియజేయడంతో వారు పోలీసులకు సమచారం అందించారు. భార్యను కడతేర్చిన భర్త మృతదేహం వద్దకు చేరుకున్న ధన్వాడ ఇన్చార్జ్ ఎస్ఐ జానకిరాంరెడ్డి, అనిత మృతి విషయమై ఆమె భర్త బాల్యనాయక్ను అడిగారు. పొంతన లేకుండా మాట్లాడడంతో అనుమానం వచ్చి, విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తన భార్య పూణెలో మరోవ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, గ్రామానికి వచ్చిన తర్వాత కూడా ఫోన్లో మాట్లాడుతోందని తెలిపాడు. అందుకే చంపానని విచారణలో వెల్లడించాడు. కర్చిఫ్ గొంతుకు బిగించి హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా తండాకు వెళ్లిపోయాడని ఎస్ఐ జానకిరాంరెడ్డి తెలిపారు. -
వివాహేతర సంబంధం.. తల, మొండెం...
కేవీబీపురం: యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. దిగువపూడి గ్రామానికి చెందిన వంశీ(19) దారుణ హత్యకు గురవడం విదితమే. అతడి తల, మొండెం, చేయి, కాలు నరికి వేసి, తలను మరొక చోట పూడ్చి పెట్టడం పాఠకులకు తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు నాగేశ్వరరావు అలియాస్ నాగేష్ను గురువారం పుత్తూరు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. పుత్తూరు రూరల్ సీఐ దైవప్రసాద్ కేవీబీపురం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు వెల్లడించిన వివరాలు...మండలంలోని దిగువపూడికి చెందిన వంశీ(19) అదే గ్రామానికి చెందిన నాగేశ్వర్రావు(నాగేష్) స్నేహితులు. నాగేష్ తిరుమలలో టీ అమ్ముకుంటూ, వారానికోసారి భార్యాపిల్లల వద్దకు వచ్చివెళ్లేవాడు. ఈ నేపథ్యంలో తన భార్యతో వంశీ చనువుగా ఉండడాన్ని గమనించాడు. భార్యను మందలించినా ప్రయోజనం లేకపోవడంతో ఎలాగైనా వంశీని అంతమొందించాలని నాగేష్ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం స్కెచ్ వేశాడు. గత గురువారం కట్టెల కోసమని అడవికి వెళుతున్న వంశీకి తోడుగా వస్తానని నమ్మబలికాడు. అడవికి వెళ్లిన తరువాత వంశీని నాగేష్ ప్రశ్నించాడు. తన భార్యతో చనువుగా ఉండటంపై నిలదీశాడు. మాటామాటా పెరగడంతో ఇద్దరూ కలియబడ్డారు. వంశీ కింద పడిపోవడంతో అతడు కట్టెలను నరికేందుకు తెచ్చుకున్న కత్తిని తీసుకుని నాగేష్ వంశీ మెడను నరికాడు. ఆపై వంశీ తలను మొండెం నుంచి వేరు చేశాడు. అలాగే కుడి చెయ్యి భుజం వరకూ, ఎడమకాలును వేరుచేసాడు. మొండాన్ని పొదలచాటున పడేసి, తలను మొండెం ఉన్నచోటుకు 20 మీటర్ల దూరంలో గుంత తవ్వి పూడ్చిపెట్టాడు. హత్యకు ఉపయోగించిన మచ్చుకత్తిని రాళ్ల నడుమ ఆకులతో కప్పెట్టి, యథావిధిగా ఇంటికి తిరిగి వచ్చాడు. భార్యను విజయపురం మండలం ఎస్ఆర్ కండ్రిగలోని అత్తగారి ఇంటికి పంపించి నాగేష్ పరారయ్యాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో దొరికిన కొన్ని వస్తువులు కేసు దర్యాప్తుకు కీలక ఆధారమయ్యాయి. వాటి ఆధారంగా వంశీని నాగేష్ హత్య చేసినట్లు తేల్చారు. నిందితుడిని పుత్తూరు వద్ద అరెస్ట్ చేశారు. శుక్రవారం కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు చెప్పారు. కేసును ఛేదించిన కేవీబీపురం ఎస్ఐ గోపి, సిబ్బంది ప్రభాకర్, రాజా, బాలాజి ,రాధాకృష్ణను సీఐ అభినందించారు. -
న్యాయం కోసం... భర్త ఇంటి ఎదుట ధర్నా
జూబ్లీహిల్స్: ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..వారికి ఇద్దరు సంతానం. కొన్నేళ్ల తర్వాత భర్త మరో మహిళ మోజులో పడి భార్యను వదిలేశాడు. పిల్లలను తీసుకొని ఇంటికి తాళం వేసి వెళ్లడంతో దిక్కుతోచని బాధితురాలు భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగిన సంఘటన మధురానగర్లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గ్రామానికి చెం దిన తోట లక్ష్మి, కృష్ణశంకర్ 2008లో ప్రేమ వివా హం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నా రు. రెండేళ్ల క్రితం నగరానికి వలసవచ్చిన లక్ష్మి, కృష్ణ శంకర్ దంపతులు మధురానగర్లోని సీ 83బ్లాక్లోని దివ్య రెసిడెన్సీలో అద్దెకు ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం శంకర్కు ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆమెతో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిసిన లక్ష్మి భర్తతో గొడవకు దిగింది. గత జనవరిలో ఎర్రుపాలెంలో భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో కృష్ణశంకర్ తన ఇంటికి తాళం వేసుకొని పిల్లలను తీసుకొని వెళ్లిపోయాడు. తన పిల్లలను అపహరించాడ ని ఆమె ఎస్సార్నగర్లో ఫిర్యాదు చేయగా, తమ పరిధి కాదని, మహిళా పోలీస్స్టేషన్లో కేసు పెట్టా లని వారు సూచించడంతో అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకురన్న పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. చేతిలో చిల్లిగవ్వా లేదు... చేతిలో చిల్లిగవ్వా లేదు. తిండి లేదు. బట్టలు కూడా లేవు. తాళం పగలగొట్టి లోపలికి వెళదామంటే ఇరుగుపొరుగు అడ్డుకుంటున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నాకు న్యాయం చేయాలి. బాధితురాలు లక్ష్మి -
వివాహేతర సంబంధం.. ప్రియురాలు దారణ హత్య
చంద్రగిరి: తనతో కాకుండా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ప్రియుడు ప్రియురాలిని హత్య చేశాడు. ఈ విషయం ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వీఆర్వో ఎందుట లొంగిపోయాడు. స్థానికుల కథనం మేరకు..మండలంలోని మల్లయ్యపల్లికి చెందిన చెంచు మునికి మండపంపల్లికి చెందిన గిరిజ(33)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గిరిజ అదే గ్రామానికి చెందిన మునస్వామి కుమారుడు గిరి(38)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. గిరిజ అదే గ్రామానికి చెందిన మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని గిరి అనుమానించాడు. ఈ విషయంపై గిరిజతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 13వ తేదీన గిరిజ, గిరి వ్యవసాయ బావి వద్ద కలుసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన గిరి పక్కనే ఉన్న కర్రతో ఆమె తలపై మోదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో గిరిజ అక్కడికక్కడే మృతిచెందింది. గిరి తన ఇంటి నుంచి సంచులు తీసుకెళ్లి మృతదేహాన్ని మూటకట్టి బావిలో పడేసి వెళ్లిపోయాడు. భర్త ఫిర్యాదుతో సంఘటన వెలుగులోకి.. 10 రోజులుగా తన భార్య కనిపించడంలేదని గిరిజ భర్త చెంచు ముని శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి చెందిన గిరిపై తనకు అనుమానం ఉందని పేర్కొన్నాడు. తన భార్య సెల్ఫోన్ కూడా అతని వద్దే ఉన్నట్టు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున నిందితుడు గిరి చంద్రగిరి వీఆర్వో మునస్వామి ఎదుట లొంగిపోయాడు. గిరిజను తానే హత్య చేసి బావిలో పడేసినట్లు అంగీకరించాడు. అతన్ని వీఆర్వో పోలీసులకు అప్పగించారు. నిందితుడు చెప్పిన వివరాల మేరకు పోలీసులు మల్లయ్యపల్లి బావి వద్దకు వెళ్లి గిరిజ మృతదేహాన్ని వెలికి తీశారు. శరీరం కుళ్లిపోయి ఎముకలు మాత్రమే ఉండడంతో పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. సీఐ ఈశ్వరయ్య ఆదేశాల మేరకు ఎస్ఐ చిరంజీవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చేతులు నరికి.. మెడపై కోసి
హనుమాన్ జంక్షన్ రూరల్ (గన్నవరం): కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో ఓ వివాహితపై అత్యంత దారుణంగా హత్యాయత్నం జరిగింది. ఒంటిపై దుస్తులు తొలగించి.. కాళ్లు కట్టేసి, చేతులు నరికి, మెడపై కోసి పాశవికంగా హింసించారు. తీవ్ర గాయాలతో ఇంట్లో పడి ఉన్న ఆమెను భర్త గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. రాజమహేంద్రవరానికి చెందిన పల్లె పద్మ హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ బ్యూటీ పార్లర్లో పనిచేస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త సూర్యనారాయణతో విభేదించి వేరుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఏలూరుకు చెందిన బత్తుల నూతన్కుమార్ విక్టర్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ స్థానిక తారకరామ కాలనీ సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. రెండు రోజుల కిందట పద్మ, నూతన్కుమార్ల మధ్య గొడవ జరిగింది. ఈ తర్వాత పద్మ ఫోన్ స్విచాఫ్ రావటంతో అనుమానం వచ్చిన ఆమె కుమార్తె.. తండ్రి సూర్యనారాయణకు ఈ విషయం చెప్పింది. దీంతో శనివారం ఉదయం సూర్యనారాయణ ఆమె ఇంటికి వెళ్లాడు. బయట నుంచి పిలవగా ఎవరూ పలకపోవడం, తలుపులు తీసి ఉండటంతో ఇంటి లోపలికి వెళ్లిన సూర్యనారాయణ అక్కడి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయాడు. కాళ్లు కట్టేసి, రెండు చేతులు తెగిపోయి, ఒంటిపై బట్టలు లేకుండా పద్మ పడి ఉండటాన్ని గుర్తించి.. వెంటనే హనుమాన్ జంక్షన్ పోలీసులకు సమాచారం అందజేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పద్మను 108లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఐ వై.వి.వి.ఎల్.నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనస్పర్థలు, గొడవల నేపథ్యంలో ప్రియుడు నూతన్కుమార్ ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
‘అక్రమ సంతానంలో భారతీయులు కూడా ఉన్నారు’
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, తెహ్రికె ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్పై ఆయన మాజీ భార్య రేహమ్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇమ్రాన్ డ్రగ్స్ తీసుకుంటాడని, చేతబడులు వంటి వాటిని నమ్ముతాడని, అతనికి ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారని, వారిలో భారత్కు చెందిన వారు కూడా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ గురించి అతని మాజీ భార్య రేహమ్ ఖాన్ రచించిన పుస్తకం గురువారం విడుదలయ్యింది. ఈ పుస్తకంలో ఆమె వారి పది నెలల వైవాహికి జీవితానికి సంబంధించిన అంశాలనే కాక ఇమ్రాన్ ఖాన్ రాజకీయ, వ్యక్తిగత అంశాలను తెలియజేసారు. కొన్నాళ్లుగా ఈ బుక్లోని కీలక అంశాలను లీక్ చేస్తూ వచ్చిన ఆమె.. మొత్తానికి ఇవాళ బుక్ రిలీజ్ చేసింది. ఇందులో ఇమ్రాన్ గురించి కొన్ని సంచలన విషయాలను వెల్లడించింది. గురువారం విడుదలైన ఈ పుస్తకంలో ఇమ్రాన్కు భారత ప్రధాని మోదీలాగా ప్రధాన మంత్రి కావాలనే కోరిక ఉందని తెలియజేసారు. అంతేకాక ఇమ్రాన్ ఖాన్ స్వలింగ సంపర్కం కూడా చేసేవారని వెల్లడించింది. ఆయన క్లోజ్ ఫ్రెండ్ మోబీతో ఇమ్రాన్కు శారీరక సంబంధం ఉందని చెప్పింది. మోబీకి అప్పటికే పెళ్లి అయినట్లు తెలిపింది. ఇక ఇమ్రాన్ఖాన్కు చాలా మందితో అక్రమ సంతానం ఉన్నారని కూడా ఆ పుస్తకంలో రేహమ్ వెల్లడించింది. ఇమ్రాన్కు మొత్తం ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారని, వారిలో భారత్కు చెందిన వారు కూడా ఉన్నారని ఆమె చెప్పింది. తనకు కాకుండా ఇమ్రాన్ తొలి భార్య జెమీమా గోల్డ్స్మిత్కు మాత్రమే ఆయన అక్రమ సంతానం గురించి తెలుసని రేహమ్ తెలిపింది. ఇమ్రాన్తో సంతానం పొందిన భారత మహిళల గురించి ‘వాళ్లంతా తమ వైవాహిక జీవితంలో పిల్లలను కనలేకపోవడంతో తనతో సంతానం పొందినట్లు ఇమ్రాన్ చెప్పేవార’ని రేహమ్ వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్కు డ్రగ్స్ తీసుకొనే అలవాటు కూడా ఉన్నట్లు ఆ పుస్తకంలో ఆయన మాజీ భార్య స్పష్టంచేసింది. ఆయన బాత్రూమ్లో కొకైన్ తీసుకుంటుండగా తాను చాలాసార్లు చూసినట్లు చెప్పింది. ఇక చేతబడుల్లాంటి వాటిని కూడా ఇమ్రాన్ నమ్ముతాడని వెల్లడించింది. తనకున్న దోషం పోవడానికి నల్లటి కందులతో ఇమ్రాన్ తన శరీరమంతా రుద్దుకోవడాన్ని తాను చూసినట్లు రేహమ్ ఆ బుక్లో తెలిపింది. పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ పుస్తకం విడుదల కావడంతో ఇమ్రాన్ఖాన్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. -
పెళ్లైన కొద్ది రోజులకే భర్త వివాహేతర..
బంజారాహిల్స్ : భర్త వివాహేతర సంబంధం ఓ నవ వధువు ఉసురు తీసింది. వివాహమై రెండున్నర నెలలు గడవకముందే భర్త వేధింపులు భరించలేక చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే తన కూతురిది ఆత్మహత్య కాదని అల్లుడే ఉరేసి చంపాడంటూ మృతురాలి తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా కూరేళ్లగూడెం అంబర్పేటకు చెందిన సుజాత వివాహం యూసుఫ్గూడ చెక్పోస్టులోని తిరుమల అపార్ట్మెంట్స్లో నివసించే సత్యనారాయణతో ఈ ఏడాది మార్చి 2వ తేదీన జరిగింది. సత్యనారాయణకు వివాహానికి ముందే సత్యవతి అనే మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో పెళ్లి జరిగిన కొద్ది రోజుల నుంచే సుజాతను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలు పెట్టాడు. సత్యవతిని నేరుగా ఇంటికే తీసుకొచ్చి భార్య ముందే ఆమెతో పరాచకాలాడుతూ గడిపేవాడు. ఇదేమిటని నిలదీస్తే సుజాతను తీవ్రంగా కొట్టేవాడు. హింసించేవాడు. ఈ నెల 24వ తేదీన తన తల్లికి ఫోన్ చేసి సత్యవతి ముందే తనను తీవ్రంగా కొట్టాడని సమస్యను పరిష్కరించాలని రోధిస్తూ చెప్పింది. తల్లి ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే శుక్రవారం సాయంత్రం తల్లి కుమారికి శివకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసి మీ అమ్మాయి ఉరేసుకుందని, స్టార్ ఆస్పత్రిలో చేర్పించారని చెప్పారు. దీంతో కుమారి అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చింది. విచారించగా తన కూతురు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉరేసుకోలేదని అల్లుడు సత్యనారాయణ హత్య చేసి ఉంటాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కొంత కాలంగా కూతురిని బాగా కొడుతున్నాడని వివాహేతర సంబంధం ఇందుకు కారణమని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు సత్యనారాయణపై ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహితపై కన్నేసి.. భారీ స్కెచ్
బంజారాహిల్స్ : ఇబ్బందుల్లో ఉన్న ఓ వివాహిత అవసరాలను ఆసరాగా చేసుకొని ఆమెపై కన్నేసిన ఓ కామాంధుడు ఆమె భర్తను హతమార్చేందుకు సైతం కుట్రపన్ని పోలీసులకు చిక్కిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 14 వెంకటేశ్వరనగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంతానికి చెందిన మాల్యాద్రి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో స్పెషల్ క్వాలిటీ మెయింటెనెన్స్ విభాగంలో పని చేస్తున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు. గత ఏడాది సెప్టెంబర్ 2న శ్రీకృష్ణానగర్కు చెందిన ఓ వివాహిత, తన భర్త జారిపడటంతో కాలు విరిగిపోగా అంబులెన్స్ కోసం అపోలో ఆస్పత్రికి ఫోన్ చేసింది. ఆ సమయంలో ఫోన్ లిఫ్ట్ చేసిన మాల్యాద్రి అంబులెన్స్తో పాటు అక్కడికి వచ్చాడు. అప్పటినుంచి ఆమెతో పరిచయం పెంచుకున్న అతను ప్రతి రోజూ ఫిజియోథెరపిస్ట్ను తీసుకొచ్చి సదరు యువతి భర్తకు మసాజ్లు చేయిస్తూ అక్కడే ఎక్కువసేపు గడిపేవాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఎమ్మెస్సీ నర్సింగ్తో పాటు మూడు పీజీలు చేసిన మీ భార్యకు అపోలో ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె భర్తకు చెప్పాడు. వివరాలు నమోదు పేరుతో ఆమె ఫోన్ తీసుకొని భార్య, భర్తలకు తెలియకుండా ఓ యాప్ను క్రియేట్ చేశాడు. దీని ద్వారా భార్య, భర్తలు ఏం మాట్లాడుకునేది, ఆమె ఎక్కడికి వెళ్లేది తెలుసుకునేవాడు. ఆమెకు అపోలో ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పించిన మాల్యాద్రి ఆమెను లోబరచుకునేందుకు భర్తకు ఆమెపై అనుమానాలు కలిగేలా ప్రవర్తించడమేగాక, భర్త పేరుతో ఆస్పత్రికి లేఖలు రాశాడు. నాలుగు రోజుల క్రితం తన భార్యా, పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని మనిద్దరి మధ్య వివాహేతర సంబంధం తెలిసిపోయిందని వివాహితకు చెప్పడంతో ఆమె భయంతో పుట్టింటికి వెళ్లిపోయింది. శాశ్వతంగా ఆమె భర్త అడ్డు తొలగించుకోవాలనుకున్న అతను నందినగర్కు చెందిన రామారావు అనే వ్యక్తిని కలిసి గత శుక్రవారం ఆమె భర్తను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చాడు. అయితే సదరు వ్యక్తి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో దీనిపై ఆరా తీసిన పోలీసులు గడిచిన ఎనిమిది నెలలుగా సదరు దంపతుల మానసిక వేదనను తెలుసుకున్నారు. నిందితుడు మాల్యాద్రిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె భర్తను హత్య చేసి ఆమెను శాశ్వతంగా తన వద్దే ఉంచుకోవాలని పథకం వేసినట్లు చెప్పాడు. ఇందులో భాగంగా పది రోజుల ముందే ఆమె భర్తకు స్లో పాయిజన్ ఇచ్చినట్లు అంగీకరించాడు. ఒకవేళ హత్యాపథకం పారకపోతే అతడిని మంచానికే పరిమితం చేసి ఆమెను శాశ్వతంగా తనతో పాటు ఉంచుకోవాలనుకున్నట్లు తెలిపాడు. అతని పాచిక పారకపోవడంతో పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354, 354(ఏ), 469, 506, 509 కింద కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ కోసం స్నేహితుడి హత్య
డోన్ టౌన్ : చెడు వ్యసనాలే అతడి ప్రాణం తీశాయి. పర స్త్రీ వ్యామోహంలో పడిన అతడు చివరకు స్నేహితుడి చేతిలోనే హతమయ్యాడు. బేతంచర్ల మండలం ఆర్ ఎస్ రంగాపురంలో ఆరు నెలల క్రితం జరిగిన హత్యకేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. డీఎస్పీ బాబాఫకృద్దీన్ బుధవారం తన కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. గ్రామానికి చెందిన డేగల శేషు ప్రవర్తన సరిగా లేకపోవడంతో భార్య వదిలేసింది. దీంతో అతడు తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. అదే గ్రామానికి చెందిన బోయసుదేపల్లె మధుతో స్నేహంగా మెలిగేవాడు. ఇద్దరు తాగుడుతోపాటు చెడు తిరుగుళ్లు తిరిగేవారు. ఈ క్రమంలో ఓ మహిళ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో మధు శేషును ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తన బంధువులు వెంకటేశ్వర్లు, సాంబశివుడుతో కలిసి హత్యకు ప్రణాళిక రూపొందించాడు. గతేడాది ఆగస్టు 17న శేషు తన ఇంటి సమీపంలోని ప్రభుత్వ పాఠశాల భవనంపై నిద్రిస్తుండగా ముగ్గురూ గొంతునులిమి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో మధునే హత్య చేసినట్లు తేలింది. ఈ మేరకు నిందితులను మంగళవారం సాయంత్రం రంగాపురం పొలిమేరల్లో అరెస్లు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ కంబగిరిరాముడు, ఎస్ఐ తిరుపాల్ పాల్గొన్నారు. -
అడ్డుగా ఉన్నాడనే భర్త హత్య
♦ ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య ♦ మహిళను అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు చిత్తూరు అర్బన్ : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే భార్య భర్తను హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. చిత్తూరులో ఇటీవల జరిగిన కె.శ్రీనివాసులు హత్య కేసులో అతని భార్య లక్ష్మి(45)ని పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం డీఎస్పీ సుబ్బారావు, సీఐ వెంకటప్ప విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఈ నెల 11న నగరంలోని అంబేడ్కర్ నగర్కు చెందిన లారీ యజమాని శ్రీనివాసులును తానే సుత్తితో కొట్టి చంపేశానని భార్య లక్ష్మి పోలీసుల కు లొంగిపోయింది. విచారణలో మరో వ్యక్తి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రొంపిచెర్ల మండలం మొరవపల్లెకు చెందిన ఎస్.బాబూలాల్ శ్రీనివాసులు లారీలో క్లీనర్గా పనిచేస్తూ తరచూ చిత్తూరులోని అతని ఇంటికి వెళ్లేవాడు. లక్ష్మితో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. దీనిపై శ్రీనివాసులు పలుమార్లు ఇద్దరినీ హెచ్చరించాడు. దీంతో శ్రీనివాసులును హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 11న తెల్లవారుజామున శ్రీనివాసులు నిద్రిస్తుండగా అప్పటికే పథకం ప్రకారం వచ్చిన బాబూలాల్, లక్ష్మితో కలిసి సుత్తితో కొట్టి చంపేశారు. బాబూలాల్ను ఊరికి పంపేసి తానే హత్య చేసినట్లు లక్ష్మి పోలీసులకు లొంగిపోయింది. అసలు విషయం గుర్తించిన పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. బాబూలాల్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. -
అక్రమ సంబంధంతోనే ఆ హత్య
హైదరాబాద్సిటీ: కేపీహెచ్బీ పోలీసు స్టేషన్ పరిధిలోని సమతానగర్లో రెండు రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. ఊబూతి శంకర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురికాగా.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రెండు రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు. ఈ హత్యకు సంబంధించి టేకు మల్లేశం, భూషి మహిపాల్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. అక్రమ సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. శంకర్ భార్యతో మల్లేశం కొంతకాలంగా వివాహేతరం సంబంధం పెట్టుకున్నాడు. శంకర్ను అడ్డు తొలగిస్తే తన కార్యకలాపాలకు అడ్డు ఉండదని భావించి మల్లేశం ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఇందుకు మహిపాల్ సహకారం తీసుకున్నాడని తెలిపారు. -
భర్తకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది
హిమాయత్నగర్: ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్యను భర్తే రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టించాడు. ఈ ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గాంధీనగర్కు చెందిన ఓ మహిళను సంతోష్కుమార్ అనే వ్యక్తి 2009లో వివాహం చేసుకున్నాడు. అయితే, ఆమె పెళ్లికి ముందు ఎంబీఏ చదువుతున్న సమయంలో తన కళాశాల స్నేహితుడు విజయశేఖర్రెడ్డిని ప్రేమించింది. ప్రియుడ్ని కాదని, తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేశారని ఆమె అత్తారింటికి వెళ్లకుండా పుట్టింట్లోనే భర్తతో కాపురం పెట్టింది. మరోవైపు ప్రియుడితో రహస్య సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలుసుకున్న భర్త సంతోష్ నిఘా వేసి, శనివారం నారాయణగూడలోని ఓ ఇంట్లో తన భార్య ఆమె ప్రియుడితో సన్నిహితంగా ఉండగా పోలీసులకు పట్టించాడు. పోలీసులు శేఖర్రెడ్డిపై కేసు నమోదు చేసి, అతడ్ని రిమాండ్కు తరలించారు.