Janabheri
-
వైఎస్ఆర్ సిపి నాయకుల ప్రచారం
-
'చెప్పిన పనులే కాదు... చెప్పనవి కూడా చేస్తా '
కర్నూలు: రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం అంటూ చంద్రబాబు కపట వాగ్దానాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ విమర్శించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు అబద్దపు హామీలిస్తున్నారని అన్నారు. మన రాష్ట్ర బడ్జెట్ రూ.1.25 లక్షల కోట్లయితే.. రూ.1.50 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. కిలో రెండు రూపాయల బియ్యం పథకం, మద్యపాన నిషేధంను ఎత్తివేసింది చంద్రబాబేనని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం కర్నూలు జరిగిన రోడ్ షోలో జగన్ ప్రసంగించారు. కర్నూలు జిల్లా నుంచి మొట్టమొదటి ఎమ్మెల్సీ అభ్యర్థి అవకాశం ముస్లింకి ఇస్తానని ఆయన హామీయిచ్చారు. ఢిల్లీ మెడలు వంచే ప్రభుత్వం కావాలా, ఢిల్లీకి సాగిల పడే ప్రభుత్వం కావాలా అని ఆయన అడిగారు. చంద్రబాబు మోడీకి ఓటు వేయమంటున్నారని, తాను తెలుగుజాతి భవిష్యత్ కోసం ఓటు వేయమంటున్నానని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రం దశ-దిశ మార్చే ఆరు పనులు చేస్తానని హామీయిచ్చారు. చెప్పిన పనులే కాకుండా.. చెప్పనవి కూడా చేస్తానని జగన్ అన్నారు. -
జ(గ)న సంద్రం
-
వట్లూరు జనభేరిలో జగన్ ప్రసంగం
-
'ఆ క్షణం జగన్ను చూసి గర్వ పడ్డా'
-
వైఎస్ఆర్ జనభేరి సభలు
-
తండ్రి మాటే బాటగా.. ఆశయ సాధనే లక్ష్యంగా..
-
విశాఖ జనభేరిలో జగన్ ప్రసంగం
-
ప.గో. జిల్లాలో షర్మిల జనభేరి
-
జగన్ రాకతో జన సంద్రమైన సాగర తీరం
-
'విభజన పాపం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలదే'
-
తూ.గో. జిల్లాలో వైఎస్ జగన్ జనభేరి
-
ఎర్రటి ఎండలో.. ఆలస్యమైనా కూడా.. అంతే ఆప్యాయంగా..
-
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల ప్రభంజనం
-
'నిజాయితీ ఓ వైపు.. కుళ్లు, కుతంత్రాలు మరోవైపు'
మైలవరం: ఏ నాయకుడైతే పేదవాడి కష్టాలను తెలుసుకుంటాడో ఆ నాయకుడినే మన నేతగా ఎన్నుకుందామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా మైలవరంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్ షోలో జగన్ ప్రసంగించారు. విశ్వసనీయత, నిజాయతీ ఓ వైపు ఉంటే కుళ్లు, కుతంత్రాలు మరోవైపు ఉన్నాయని అన్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే 5 సంతకాలతో పాటు మరో 6 పనులు చేస్తానని ఆయన హామియిచ్చారు. అమ్మఒడి పథకం అమలుపై తొలి సంతకం చేస్తానని చెప్పారు. అవ్వాతాతల కోసం రెండో సంతకం చేస్తానని వెల్లడించారు. రైతన్నకు భరోసా ఇస్తూ మూడో సంతకం పెడతానని అన్నారు. వ్యవసాయరంగంలో గొప్ప మార్పులు తెస్తానని చెప్పారు. అక్కా, చెల్లెళ్ల కళ్లల్లో సంతోషం కోసం నాలుగో సంతకం చేస్తానని అన్నారు. ఇల్లు, కార్డులేని నిరుపేదల కోసం 5వ సంతకం పెడతానని హామీయిచ్చారు. ఆరోగ్యశ్రీ పథకంలో మార్పులు తెస్తానని, ఏ గ్రామంలో కూడా బెల్టుషాపు లేకుండా చేస్తానని వైఎస్ జగన్ హామీయిచ్చారు. -
'బాబు చెప్పేవన్నీ సొల్లు కబుర్లే..'
-
'బీజేపీ, టీడీపీలు ఊసరవెల్లి పార్టీలు'
-
'చెడిపోయిన రాజకీయాలు చూస్తుంటే బాధనిపిస్తోంది'
తిరువూరు : తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న జగన్ శుక్రవారం తిరువూరు నియోజకవర్గంలో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ 1999 నుంచి 2004 వరకు టీడీపీ-బీజేపీ ఇద్దరు కలిసి ఒక్కటై దేశంలో చక్రం తిప్పారని, ఆ ఐదేళ్లలో ఈ రాష్ట్రానికి వీరు చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటైనా చెప్పగలరా సూటిగా ప్రశ్నించారు. ఆరోజు మీకు పోలవరం ప్రాజెక్ట్, పులిచింతల ప్రాజెక్ట్, హంద్రీనీవా ప్రాజెక్ట్ గుర్తుకు రాలేదా? అని ప్రశ్నలు సంధించారు. మన రాష్ట్రంలో మూడున్నర కోట్ల ఇళ్లు ఉంటే.. ఇంటింటికి ఉద్యోగం ఎలా ఇస్తావు చంద్రబాబు అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు మనమే గెలుచుకుని మోడీ ప్రధాని కావాలా? మరొకరు కావాలా? అనేది మనమే నిర్ణయిద్దామని జగన్ ఓటర్లకు పిలుపునిచ్చారు. 9ఏళ్లు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క హామీనైనా అమలు చేశారని అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రూ.2 కిలో బియ్యాన్ని రూ.రూ.5.25 చేసింది చంద్రబాబేనని, ఎన్నికల ముందు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి...ఎన్నికల తర్వాత ప్రతి గ్రామంలోనూ బెల్టు షాపులు తీసుకొచ్చింది ఆయనేనని జగన్ గుర్తు చేశారు. రామరాజ్యం అయితే తాను చూడలేదని...వైఎస్ఆర్ సువర్ణయుగం చూశానని వైఎస్ జగన్ అన్నారు. రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అనే పదానికి అర్ధం లేకుండా పోయిందన్నారు. రాజకీయం అంటే చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోవాలని ఆయన పేర్కొన్నారు. మొన్నటివరకు తెలంగాణలో తిరుగుతూ తమ వల్లే రాష్ట్ర విభజన జరిగిందంటూ చెప్పుకొన్న నరేంద్ర మోడీ, చంద్రబాబు.. అక్కడ ఎన్నికలైపోయిన రాత్రికి రాత్రే మాట మార్చి విభజనకు కారణం జగనే అంటున్నారని, చెడిపోయిన ఈ రాజకీయాలు చూస్తుంటే చాలా బాధనిపిస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
మోడీ మాటలన్నీ గ్యాసే
* మన గ్యాస్లో మనకు వాటా ఇవ్వరుగానీ.. మన గ్యాస్తో దేశాన్ని అభివృద్ధి చేస్తారట * కృష్ణా జిల్లా ‘వైఎస్సార్ జనభేరి’లో జగన్ * రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి బీజేపీ నేతలు, చంద్రబాబు పూర్తిగా మద్దతిచ్చారు * రాష్ట్రాన్ని విభజించింది తామేనంటూ మొన్నటిదాకా తెలంగాణలో ఓట్లడిగారు * తెలంగాణలో ఎన్నికలైన రాత్రికి రాత్రే మాట మార్చి.. విభజన కారకుడు జగనేనంటున్నారు * వాళ్ల మాటలతో చాలా బాధ అనిపించింది * 1999 నుంచి 2004 వరకు టీడీపీ-బీజేపీ ఇద్దరు కలిసి ఒక్కటై దేశంలో చక్రం తిప్పారు * ఆ ఐదేళ్లలో మీరు ఈ రాష్ట్రానికి చేసిన ఒక్కటంటేఒక్క మేలు ఏంటో చెప్పగలరా? ‘వైఎస్సార్ జనభేరి’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: బీజేపీ నాయకులు, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి రాష్ట్ర విభజనకు పూర్తిగా మద్దతిచ్చి.. ఇప్పుడు స్వర్గాన్ని తెచ్చి సీమాంధ్రను అద్భుతంగా అభివృద్ధి చేస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. 1999 నుంచి 2004 వరకు టీడీపీ-బీజేపీ ఇద్దరు కలిసి ఒక్కటై దేశంలో చక్రం తిప్పారని, ఆ ఐదేళ్లలో ఈ రాష్ట్రానికి వీరు చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటైనా చెప్పగలరా సూటిగా ప్రశ్నించారు. మొన్నటివరకు తెలంగాణలో తిరుగుతూ తమ వల్లే రాష్ట్ర విభజన జరిగిందంటూ చెప్పుకొన్న నరేంద్ర మోడీ, చంద్రబాబు.. అక్కడ ఎన్నికలైపోయిన రాత్రికి రాత్రే మాట మార్చి విభజనకు కారణం జగనే అంటున్నారని, చెడిపోయిన ఈ రాజకీయాలు చూస్తుంటే చాలా బాధనిపిస్తోందని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘నిన్న తిరుపతి సభలో నరేంద్ర మోడీ గ్యాస్ గురించి మాట్లాడారు. మన రాష్ట్రంలో ఉన్న గ్యాస్తో దేశాన్ని అభివృద్ధి చేస్తానని మోడీ చెప్తున్నారు. మా రాష్ట్రంలో ఉన్న గ్యాస్ లో.. కనీసం మన రాష్ట్రానికి ఎంత గ్యాస్ కోటా ఇస్తారని మోడీని అడుగుతున్నా. ఆ మాట మాట్లాడరు. కానీ మన వనరులతో దేశాన్ని బాగుపర్చుతామంటున్నారు. ఇటువంటి దొంగ ప్రేమ చూపిస్తున్నారు’’ అని తూర్పారబట్టారు. కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న జగన్ గురువారం పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో రోడ్షో నిర్వహించారు. బంటుమిల్లి నుంచి మొదలైన వైఎస్సార్ జనభేరి సింగరాయపాలెం మీదుగా కైకలూరు అక్కడి నుంచి విజయవాడ వరకు సాగింది. దారిపొడవునా ఆయన వృద్ధులను, యువకులను, మహిళలను పలకరిస్తూ ముందుకు సాగారు. బంటుమిల్లి, కైకలూరులలో జరిగిన సభల్లో ప్రసంగించారు. ఆయా సభల్లో జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే.. తెలంగాణలో ఎన్నికలవగానే మాట మార్చేశారు ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి మన మధ్య నుంచి వెళ్లిపోయాక రాజకీయాలు చెడిపోయాయి. ఓట్లు, సీట్ల కోసం ఎన్ని అబద్ధాలు ఆడడానికైనా వెనుకాడడంలేదు. ఒక బంగారం లాంటి రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చడానికి కూడా వెనుకాడడంలేదు. రాష్ట్రాన్ని సోనియాగాంధీ అడ్డగోలుగా విడగొట్టారు. అలా విడగొడుతుంటే ఇదే చంద్రబాబు, ఇదే బీజేపీ వీరిద్దరూ కూడా రాష్ట్రాన్ని విడగొట్టడం అన్యాయమని చెబుతూనే.. మరోవైపు వీళ్లే పార్లమెంటులో వీళ్ల ఎంపీల చేత విభజనకు అనుకూలంగా ఓట్లు వేయించారు. తర్వాత బీజేపీ నాయకులు తెలంగాణకు వెళ్లి.. ‘పెద్దమ్మ సోనియాగాంధీ ఒకరేకాదు.. చిన్నమ్మను నన్ను కూడా గుర్తుపెట్టుకోండి.. నేను మద్దతు ఇవ్వకపోతే రాష్ట్ర విభజన జరిగేది కాదు’ అని అన్నారు. ‘మేమిచ్చిన ఆ లేఖతోనే రాష్ట్ర విభజన జరిగింది.. లేకుంటే విభజన జరిగేది కాదు’ అని తెలంగాణ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు చంద్రబాబు అన్నారు. 30వ తేదీన అక్కడ ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలు అయిపోయి గంట కూడా గడవక ముందే మోడీ, చంద్రబాబు రాత్రి ఏడుకల్లా తిరుపతిలో మీటింగ్ పెట్టారు. రాష్ట్రాన్ని విభజించింది వైఎస్ఆర్సీపీ అని నిస్సిగ్గుగా మాట్లాడారు. నాలుగేళ్లుగా కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు.. నిన్న తిరుపతిలో అవినీతి గురించి మాట్లాడారు. కేసుల గురించి చెప్పారు. వీళ్లందరినీ నేను ఒకటే అడుగుతున్నా. వైఎస్ బతికున్నంత వరకు ఆయన్ను మించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరన్నారు. వైఎస్ చనిపోయి 18 నెలలు అయ్యాక జగన్ అనే వ్యక్తి కాంగ్రెస్ నుంచి విడిపోయిన రెండు నెలల తర్వాత.. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్లతో ఇదే చంద్రబాబు కుమ్మక్కై కోర్టుల దాకా వెళ్లి కేసులు వేసింది వాస్తవం కాదా? చంద్రబాబు, కాంగ్రెస్ నాలుగేళ్లుగా కుమ్మక్కయ్యారు. సీబీఐ జగన్ మీద విచారణ చేస్తోంది. ఎమ్మార్, ఐఎంజీ కేసుల్లో చంద్రబాబును మాత్రం కనీసం పిలువలేదు. చంద్రబాబుకు ఒక న్యాయం... జగన్కు మరో న్యాయం. ఆ మూడు రాష్ట్ర్రాలకూ ఏం చేశారు? బీజేపీని నేను ఒకటి అడగదలచుకున్నా.. 1999-2000 సంవత్సరంలో మీరు చిన్న రాష్ట్రాలకు అనుకూలమని జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లను ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్లో రాయపూర్ను, జార్ఖండ్లో రాంచీని మహానగరాలుగా తీర్చిదిద్దాలని అనుకున్నారు. ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ను కూడా అలాగే మహానగరంగా తీర్చిదిద్దాలని అనుకున్నారు. ఇప్పుడు అడుగుతున్నా.. ఆ మూడు రాష్ట్రాలకు వెళ్లి చూసిరండి. ఆ మూడు రాష్ట్రాల్లో కనీసం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లేదు. ఎయిమ్స్ తరహా, నిమ్స్ తరహా సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి కూడా లేదన్న సంగతి వీళ్లకి తెలుసా? 1999లో ఈ రాష్ట్రాలను వేరు చేసినప్పుడు ఇదే ఛత్తీస్గఢ్లోని రాయపూర్ నగరానికి రూ. 10 వేల కోట్లు ఇస్తామన్నారు. కొత్త రాజధానిని నిర్మించుకోవడానికి, కొత్త మహానగరాన్ని నిర్మించుకోవడానికి ఇస్తామన్నారు. విడదీశాక బీజేపీ నాలుగేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా వీరు ఇచ్చిన డబ్బు ఎంతో తెలుసా... ముష్టివేసినట్లు రూ. 400 కోట్లు మాత్రమే. ఇప్పుడు మాత్రం చిన్న రాష్ట్రాలు గొప్పగా ఉంటాయని, అది చేస్తాం.. ఇది చేస్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.’’ కొల్లేరుపై తొలి అసెంబ్లీ భేటీల్లోనే బిల్లు ‘‘2008లో వైఎస్ఆర్ ఇంతకుముందు ఎవరూ చేయని సాహసం చేశారు. అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు. కొల్లేరును కాంటూరు +5 నుంచి కాంటూరు +3కు తగ్గిస్తూ తీర్మానం చేసి పంపారు. కానీ ఆ తర్వాత ఆయన చనిపోయారు. నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా నా మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఇది పెడతాను. కొల్లేరు కాంటూరును మరోసారి +5 నుంచి +3 కి తగ్గిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపిస్తా. మనకు 25 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో మనమే ప్రధానిని నిర్ణయిస్తే ఈ సమస్యను రెండేళ్లలో పరిష్కరిస్తా. పార్టీ నాయకుడు దూలం నాగేశ్వరరావుకు నా గుండెల్లో స్థానం ఉంది. ఈ జిల్లా నుంచి మొదటి ఎమ్మెల్సీగా ఆయన్ను తీసుకెళ్తాను.’’ ‘‘ బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్.. వీళ్లెవరికి మన మీద ప్రేమ లేదు. వీళ్లకు కావాల్సిందల్లా ఓట్లు, సీట్లు మాత్రమే. ఓట్లు, సీట్ల కోసం వీరు ఏ అబద్ధమైనా ఆడతారు.. ఏ గడ్డి అయినా తింటారు. కాబట్టి వీళ్లనెవరినీ నమ్మొద్దు. రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలున్నాయి. ఒక్క సీటు కూడా పక్కకు పోకుండా 25 సీట్లను మనమే తెచ్చుకుందాం. ప్రధానిగా ఎవరిని కూర్చోబెట్టాలో మనమే నిర్ణయిద్దాం. బీజేపీనా.. ఇంకొకరా అనేది ఆ రోజు 25 మంది ఎంపీలతో దగ్గరుండి మనమే నిర్ణయిద్దాం. మన రాష్ట్ర అభివృద్ధిని మనమే నడుపుదాం.’’ టీడీపీ-బీజేపీ ఆ ఐదేళ్లలో చేయలేదేం? అదే తిరుపతి వేదిక మీద ఆ పెద్ద మనుషులు బీజేపీ-చంద్రబాబు కలిస్తే అలాఅలా స్వర్గాన్ని కిందకు తీసుకొస్తామని కూడా చెప్పారు. నేను చంద్రబాబును, బీజేపీని అడగదలచుకున్నా. 1999 నుంచి 2004 వరకు టీడీపీ-బీజేపీ ఇద్దరు కలిసి ఒక్కటై దేశంలో చక్రం తిప్పారు. ఆ ఐదేళ్లలో మీరు ఈ రాష్ట్రానికి చేసిన ఒక్కటంటేఒక్క మేలు ఏంటో చెప్పగలరా? రాష్ట్రం అంతా వెయ్యి కిలోమీటర్ల తీరం ఉందని, చంద్రబాబుకు ఓటెయ్యాలని, ఆయన గొప్పగా బాగు పరుస్తారని మోడీ చెబుతున్నారు. 1999 నుంచి 2004 వరకు మీరు కలిసి ఉన్నపుడు అప్పుడు మీకు ఈ వెయ్యి కిలోమీటర్ల తీరం కనిపించలేదా? ఆ రోజు తీరం ఉంది... ఈరోజు తీరం ఉంది. ఆ రోజు చేయలేని అభివృద్ధి ఈ రోజు చేస్తామని ఓట్ల కోసం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుగాని, గాలేరు-నగరి లాంటి రాయలసీమ ప్రాజెక్టులుగాని పూర్తి చేయాలని ఆ ఐదేళ్లలో మీకెందుకు అనిపించలేదు? - వైఎస్ జగన్మోహన్రెడ్డి -
'వైఎస్ఆర్ పథకాలన్నీ అద్భుతంగా చేసి చూపిస్తాం'
గుంటూరు: వైఎస్ఆర్ పాలనలో ఏ ఛార్జీ పెరగలేదని వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా పెదకాకానిలో నిర్వహించిన రోడ్ షోలో షర్మిల ప్రసంగించారు. చంద్రబాబు పాలనలో 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు. వైఎస్ పాలనలో కరెంట్ ఛార్జీలు పెరిగాయని ఏ ప్రతిపక్షపార్టీ కూడా ఆరోపించలేదని తెలిపారు. వైఎస్ఆర్ పథకాలకు తూట్లు పొడవటమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన సాగిందని విమర్శించారు. సర్ఛార్జీల పేరుతో రూ.32 వేల కోట్ల కరెంట్ భారాన్ని ప్రజలపై మోపారన్నారు. ఐదేళ్లూ జగనన్న ప్రజల పక్షానే పోరాడారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే విప్ జారీ చేసి కాంగ్రెస్ సర్కార్ను చంద్రబాబు కాపాడారని చెప్పారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించే ధైర్యం చేసిదంటే చంద్రబాబు లేఖే కారణమన్నారు. మామనే వెన్నుపోటు పొడిచిన ఘనడు చంద్రబాబు అన్నారు. 10 ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబుకు ప్రజల పక్షాన పోరాడానని చెప్పుకునే ధైర్యం లేదన్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ పథకాలన్నీ అద్భుతంగా చేసి చూపిస్తామన్నారు. వైఎస్ పథకాలనే అమలు చేస్తానంటూ సిగ్గులేకుండా చంద్రబాబు తిరుగుతున్నాడని షర్మిల ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలు తనవి అనుకున్నది జగనన్నే అని చెప్పారు. రోజుల తరబడి నిరాహారదీక్షలు చేసింది జగనన్నే అని షర్మిల తెలిపారు. -
శ్రీకాకుళం జిల్లాలో విజయమ్మ జనభేరి
-
జనం మెచ్చిన నేత కోసం.. ఎండైనా, వానైనా..
-
విజయనగరం జిల్లాలో విజయమ్మ జనభేరి
-
ఆ 48 గంటలు
-
తలరాతను మార్చే ఎన్నికలివి
* జనమంతా ఏకం కావాలి.. మనసు తెలుసుకునే నాయకుడినే ఎన్నుకోవాలి * కృష్ణా జిల్లా ప్రచారంలో వైఎస్ జగన్ * అధికారం కోసం చంద్రబాబు అన్నీ ఫ్రీగా ఇస్తానని అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతున్నాడు * తొమ్మిదేళ్లు సీఎంగా ఉండీ ఒక్కటీ ఎందుకు చేయలేకపోయావని ఆయనను నిలదీయండి * ఎన్నికల తర్వాత బాబు ఉండడు, ఆయన పార్టీ ఉండదు.. అందుకే గడ్డి తినడానికీ వెనుకాడట్లేదు * ఒకవైపు విశ్వసనీయత, నిజాయితీ.. మరొకవైపు కుళ్లు, కుతంత్రాలు ఉన్నాయి.. వాటి మధ్య పోటీ * ఇప్పుడు మీరంతా ఏకం కావాలి... వైఎస్ కలలుకన్న సువర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందాం * చల్లపల్లి, పామర్రు, ఉయ్యూరు వైఎస్సాఆర్ జనభేరి సభల్లో జగన్మోహన్రెడ్డి పిలుపు వైఎస్సార్ జనభేరి సభ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఇవి మన తలరాతను మార్చబోయే ఎన్నికలు. అందువల్ల ఓటు వేసే ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎటువంటి నాయకుడు మనకు కావాలి? ఎటువంటి ముఖ్యమంత్రి కావాలి? అనేది మనం ప్రశ్నించుకోవా లి. ఏ ముఖ్యమంత్రి అయితే ప్రతి పేదవాడి గుండెచప్పుడు వింటాడో, వాళ్ల మనస్సు తెలుసుకుంటాడో.. ఏ నాయకుడైతే చనిపోయిన తరువాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో ఉండేందుకు ఆరాటపడతాడో.. అటువంటి వ్యక్తిని మనం మన నాయకుడిగా ఎన్నుకోవాలి. అటువంటి వ్యక్తిని మనం మన సీఎంగా ఎన్నుకోవాలి. అప్పుడే మన తలరాతలు మంచిగా మారతాయి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘ఈ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు వేసే ఓటుతో మన తలరాతను మార్చుకోబోతున్నాం. వై.ఎస్.రాజశేఖరరెడ్డి కంటే ముందు అనేక మంది ముఖ్యమంత్రులను చూశాం... ఆయన తరువాత కూడా చాలా మంది ముఖ్యమంత్రులను చూశాం... కానీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి మాత్రం ఇప్పటికీ ప్రతి పేదవారి గుండెల్లో ఉండిపోయారు. రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతీ పేదవాడికి కూడా మంచి చేసిన మహానుభావుడు వైఎస్సార్. ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు. వైఎస్సార్ పరిపాలనకు ముందు.. ఇప్పుడు జరుగుతున్న పాలనను ఒకసారి బేరీజు వేసుకోవాలి’’ అని ఆయన సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ బుధవారం కృష్ణా జిల్లాలో రోడ్షో నిర్వహించారు. ముందుగా ఉదయం చల్లపల్లిలో రోడ్షో నిర్వహించి అనంతరం అక్కడ జరిగిన వైఎస్సార్ జనభేరి సభలో మాట్లాడారు. సాయంత్రం ఏడున్నర గంటలకు పామర్రులో, రాత్రి ఉయ్యూరులో జరిగిన సభల్లోనూ మాట్లాడారు. జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... చంద్రబాబును నిలదీయండి... చంద్రబాబూ..! తొమ్మిదేళ్లు సీఎంగా పరిపాలన చేశావు... ఇవాళ అన్నీ ఫ్రీగా ఇస్తానని చెప్తున్నావు... మరి తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి ఒక్కటంటే ఒక్కటి ఎందుకు చేయలేకపోయావు? అని గట్టిగా నిలదీయండి. ఎందుకయ్యా ఇలా అబద్ధాలు ఆడతావు? అని ప్రశ్నించండి. ఎప్పుడైనా కాలేజీలకు వె ళ్లావా? వారెలా చదువుతున్నారో తెలుసుకున్నావా? అని అడగండి. తొమ్మిదేళ్లు సీఎంగా వుం టూ పేదోడి పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకున్నావా? ఇంజనీరింగ్ చదవాలంటే సంవత్సరానికి రూ. 30 వేలు ఖర్చవుతుంది. ఆ రూ. 30 వేలు కట్టాలంటే పొలమో ఇల్లో అమ్ముకుంటే తప్ప చదివించలేని పరిస్థితి. ఈ పరిస్థితిని నీవు ఎప్పుడైనా తెలుసుకున్నావా చంద్రబాబూ? అంటూ ప్రశ్నించండి. చంద్రబాబునాయుడు హయాంలో ఏ పేదవాడికైనా గుండెపోటు వచ్చినా, యాక్సిడెంట్ అయినా, క్యాన్సర్ వచ్చినా ఆ పేదవాడు డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి వుండేది. డాక్టర్ దగ్గరకు వెళితే రూ. 2 లక్షలో... రూ. 3 లక్షలో అవుతుందని డాక్టర్ చెప్పినప్పుడు రెండు రూపాయలో.. మూడు రూపాయలో.. నాలుగు రూపాయలో వడ్డీలకు తెచ్చినప్పుడు నీవు ఏమి చేశావు చంద్రబాబూ? అని నిలదీయండి. ఎన్నికలకు వెళ్లేముందు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తానని చెప్పావు... ఎన్నికలు అయిపోయాక ఇదే రెండు రూపాయల బియ్యాన్ని ఐదుంపావలా చేయలేదా చంద్రబాబునాయుడూ? అని ప్రశ్నించండి. ఏ రోజైనా ఆయన గ్రామాల్లోకి వెళ్లాడా అని అడగండి. ఎన్నికలకు వెళ్లేముందు మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పా వు.. ఎన్నికలు అయిపోయాక చెల్లెమ్మలతో తనకేం పని ఉందని చెప్పి.. మద్యపానం నిషేధిస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని ‘ఈనాడు’ దినపత్రికలో పెద్దపెద్ద అక్షరాలతో రాయించావు. ఆ రాయించిన మూడు రోజుల్లోనే ప్రతి గ్రామంలో బెల్టుషాపులు తెచ్చింది నీవు కాదా? అని చంద్రబాబును నిలదీయండి. ఒకవైపు సోనియాగాంధీ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజిస్తుంటే.. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉండి సోనియాను నిలదీయాల్సింది పోయి.. ఒకవైపు అన్యాయం జరుగుతుందని చెప్తూ మరోవైపు ఆయన తన ఎంపీల చేత పార్లమెంటులో సోనియాకు అనుకూలంగా విభజనకు అనుకూలంగా ఎందుకు చంద్రబాబు ఓటేయించాడని నిలదీయండి. విశ్వసనీయత లేని రాజకీయాలు చేయలేను... చంద్రబాబునాయుడు అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతున్నాడు. విశ్వసనీయత లేని మాటలు మాట్లాడుతున్నాడు. నిజాయితీ లేని తన మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్నీ ఫ్రీగా ఇస్తానంటున్నాడు. ఒక రోజు సెల్ఫోన్లు ఫ్రీగా ఇస్తానని చెప్తాడు. రెండో రోజు టీవీలు ఫ్రీగా ఇస్తానంటాడు. మూడో రోజు సాధ్యంకాని రూ. 1.27 లక్షల కోట్ల రైతు రుణాలు మాఫీ అంటాడు. మరో రోజు మీరెవరూ ఇంటినుంచి బయటకు రావొద్దు.. మీ ఇంటికే అన్నీ ఫ్రీగా ఇస్తానని చంద్రబాబునాయుడు చెప్తున్నాడు. చంద్రబాబునాయుడు సాధ్యంకానివి, చేయలేనివి చెప్తూ అబద్ధాలు చెప్తూ రాజకీయాలు చేస్తున్నాడు. దీంతో కొందరు నా వద్దకు వచ్చి.. ‘అన్నా... చంద్రబాబు అన్నీ ఫ్రీగా ఇస్తానని చెప్తున్నాడు.. ఇంటికో ఉద్యోగం ఇస్తానని అంటున్నాడు.. మనం కూడా ఇంటికి రెండు ఉద్యోగాలు ఇస్తామని ప్రజలకు చెప్దాం...’ అని చాలా మంది సలహా ఇచ్చారు. కానీ ఒక్కటైతే నేను చెప్తా... చంద్రబాబులా నేను అబద్ధాలు ఆడలేను. ఆయనలా విశ్వసనీయత లేని రాజకీయాలు చేయలేను. నేను ఒక మాట చెప్తే ఆ మాట కోసం నిలబడతాను. నాకు వైఎస్ నుంచి వచ్చిన వారసత్వం విశ్వసనీయత... చంద్రబాబు ఎందుకు విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తున్నాడంటే.. ఆయనకు 65 ఏళ్లు. ఈ ఎన్నికలు అయిపోయాక ఆయనుండడు.. ఆయన పార్టీ ఉండదు.. ఆ విషయం చంద్రబాబుకు తెలుసు. అందుకే అడ్డగోలుగా అధికారం కోసం ఏ గడ్డైనా తినడానికి వెనకాడటం లేదు. ఆయనలా నేను విశ్వసనీయతలేని, నిజాయితీ లేని రాజకీయాలు చేయలేను. ఎందుకంటే చంద్రబాబునాయుడు కంటే పాతిక సంవత్సరాల చిన్నోడిని. మరో ముప్పై సంవత్సరాలు రాజకీయాలు చేయాలి. విశ్వసనీయత అన్న పదం మీద రాజకీయాలు చేయాలి కాబట్టి అబద్ధాలు చెప్పలేను. దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి నుంచి నాకు వచ్చిన వారసత్వం ఏదైనా ఉందంటే అది విశ్వసనీయత. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున అదే వేదికపైన ఐదు సంతకాలు పెట్టబోతున్నాను. దీంతో పాటు అదనంగా ఆరు పనులు చేపట్టబోతున్నాను. ఈ పదకొండు పనులతో ఈ రాష్ట్ర దశ, దిశ మార్చుతాను. ఆ దేవుడు అనుగ్రహిస్తాడు.. చెప్పినవే కాదు చెప్పనివి కూడా చేస్తాను.’’ దిగజారిపోయిన వ్యవస్థ.. దివంగత నేత ఎప్పుడూ అంటూ ఉండేవాడు. రాజకీయం అన్నది ప్రతీ పేదవాడి గుండె చప్పుడు వినడం అని ఆయన అనేవారు. రాజకీయం అన్నది చనిపోయిన తర్వాత కూడా ప్రతీ పేదవాడి గుండెల్లో బతికే ఉండటం కోసం ఆరాటపడడమే రాజకీయమని ఆయన అంటూ ఉండేవారు. కానీ ఈరోజు రాజకీయం అన్నది ఒక చదరంగంలా తయారుచేశారు. ఓట్ల కోసం సీట్ల కోసం ఏ గడ్డి అయినా తినడానికి వెనకాడడంలేదు. ఎన్ని అబద్ధాలు ఆడడానికైనా వెనకాడడంలేదు. ఓట్ల కోసం సీట్ల కోసం ఒక మనిషిని ఎలా తప్పించాలి అని ఆలోచన చేస్తున్నారు. ఒక మనిషి లేకుండా ఒక పార్టీ లేకుండా ఎలా చేయాలని ఆలోచన చేస్తున్నారు. అన్యాయంగా కేసులు పెట్టి ఒక మనిషిని జైలు పాలు చేయడానికైనా వెనుకాడడంలేదు. బంగారు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభ జించడానికి వెనుకాడడంలేదు. దిగజారిపోయిన వ్యవస్థ కనిపిస్తోంది. ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు. వైఎస్ పరిపాలనకు ముందు.. ఇప్పుడు జరుగుతున్న పాలనను ఒకసారి బేరీజు వేసుకోవాలి. రైతులతో బాబు ఆడుకుంటున్నాడు.. చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ చేస్తానంటున్నాడు. మరి తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసి రుణాల మాఫీ దేవుడెరుగు.. వడ్డీల మాఫీ అయినా చేయలేదేం? అది సాధ్యంకాదు కాబట్టి చేయలేదు. రైతు రుణాలు మాఫీ అంటాడు.. డ్వాక్రా రుణాల మాఫీ అంటాడు. మొత్తం రూ. 1.5 లక్షల కోట్ల రుణాలు మా ఫీ అంటాడు. మన బడ్జెట్లో మనకొచ్చే ఆదాయాలు కేవలం రూ. 1.25 లక్షల కోట్లుంటే చంద్రబాబు 1.5 లక్షల కోట్ల రుణా లు మాఫీ చేస్తానంటున్నాడు. ఇలా పట్టపగలు అబద్ధాలు ఆడుతున్నాడు. ఇటువంటి దొంగ వాగ్దానం చేస్తే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తే.. ఆ తర్వాత రైతన్నలు బ్యాంకుల వద్దకు రుణాల కోసం వెళ్తారు. మీరు కట్టాల్సి రుణాలు ఇంకా ప్రభుత్వం కట్టలేదు కాబట్టి మీకు కొత్త రుణాలు ఇవ్వబోమని బ్యాంకుల వారు చెప్తారు. అప్పుడు ఆ రైతన్న పరిస్థితి ఎంత అన్యాయంగా ఉంటుందో ఆలోచించాలి. ఎన్ని ఇళ్లు ఉన్నాయో తెలుసా..? చంద్రబాబు ఇంటింటికీ ఒక ఉద్యోగం ఇస్తానంటున్నాడు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి 65 ప్రభుత్వ సంస్థలను మూసివేయించి 26 వేల మందిని నడిరోడ్డు మీదకు నెట్టాడు. రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉంటాయో చంద్రబాబుకు తెలుసా? రాష్ట్రంలో మూడున్నర కోట్ల ఇళ్లున్నాయి. అంటే మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్తున్నాడు. స్వాతంత్య్రం వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో ఆయనకు తెలుసా? రాష్ట్రంలో అన్ని ఉద్యోగాలు కలిపి 20 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అలాంటిది మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తానని పట్టపగలు అబద్ధాలు ఆడుతున్నాడు.’’ వైఎస్ కలలుగన్న సువర్ణయుగాన్ని తెచ్చుకుందాం చంద్రబాబు పాలనను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. అలాగే దివంగత నేత వైఎస్ సువర్ణయుగాన్ని గుర్తుకు తెచ్చుకోండి. కృష్ణా జిల్లాలో వ్యవసాయం అన్నది కీలకమైంది. చంద్రబాబు హయాంలో మన కళ్ల ఎదుటే ఆల్మట్టి నిర్మాణం మొదలుపెట్టింది. మన కళ్ల ఎదుటే కృష్ణా ప్రాంతానికి సంబంధించి ఒక పంట వేయడానికి కూడా రైతన్నలు ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. దివంగత నేత వైఎస్ సువర్ణయుగంలో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన వ్యక్తి. చంద్రబాబునాయుడిలా అబద్ధాలు చెప్తూ నిజాయితీ లేని విధంగా వ్యవహరించలేను. మాట కోసం ఎందాకైనా పోయే విశ్వసనీయత పాలన కావాలా లేదా ఆలోచన చేయండి. ఈ రోజు ఎన్నికల్లో ఒకవైపున విశ్వసనీయత, నిజాయితీ ఉన్నాయి. మరో వైపు కుళ్లు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య పోటీ జరుగుతోంది. ఈ పరిస్థితిలో మీరంతా ఒకటి కావాలి. దివంగత నేత కలలుగన్న సువర్ణయుగాన్ని తెచ్చుకుందాం. -
గుంటూరు జిల్లా గురజాలలో షర్మిల జనభేరి
-
ఒక్క అవకాశం ఇవ్వండి..వైఎస్ షర్మిల
‘చంద్రబాబు హయాంలో ఎంత కష్టపడ్డారో ఒక్కసారి ఆలోచించండి... వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ఎలా ఉన్నారో గుర్తుకు తెచ్చుకోండి...మీ కష్టాలన్నీ తెలిసిన వాడు.. వాటిని తీర్చేవాడు జగనన్న. ఓటేసేముందు గుండెలపై చేయి వేసుకుని రాజన్నను గుర్తుకు తెచ్చుకోండి.. ‘ఫ్యాన్’ గుర్తుపై ఓటేసి రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాథరెడ్డిని గెలిపించి జగనన్నను సీఎం చేయండి. ఒక్క అవకాశం ఇవ్వండి.. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. - వైఎస్ షర్మిల జగనన్న గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు .. రాజంపేట, సుండుపల్లి జనభేరిలో వైఎస్ షర్మిల షర్మిలను చూసేందుకు పోటెత్తిన జనం టీడీపీ, కాంగ్రెస్లపై నిప్పులు చెరిగిన షర్మిల రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నకు అండగా నిలవాలని పిలుపు మిథున్రెడ్డి, అమర్నాథరెడ్డిని గెలిపించాలని వినతి షర్మిల రాకతో సుండుపల్లిలో పండుగ వాతావరణం సాయంత్రం నుంచి డప్పులు, డ్యాన్స్లతో వైఎస్సార్సీపీ శ్రేణుల సందడి సాక్షి, కడప: వైఎస్సార్కాంగ్రెస్పార్టీ జనభేరిలో భాగంగా వైఎస్ షర్మిల రాజంపేట, సుండుపల్లిలో సోమవారం పర్యటించారు. సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా పర్యటనను ముగించుకుని రైల్వేకోడూరు మీదుగా సాయంత్రం 5.06 గంటలకు రాజంపేటకు చేరుకున్నారు. షర్మిలరాకకోసం 3గంటల నుంచి రాజంపేట నాలుగురోడ్లకూడలిలో జనాలు వేచిఉన్నారు. షర్మిలరాగానే ఈలలు, కేకలతో సందడి చేశారు. మహిళలు భారీగా తరలివచ్చారు. మిద్దెలపైకి నిల్చుని షర్మిల ప్రసంగాన్ని ఆలకించారు. యువకులు మిద్దెలు, హోర్డింగులపై నిల్చున్నారు. చంద్రబాబు హయాంలో ప్రజలు ఎలా కష్టపడ్డారో...ఎంత నరకం అనుభవించారో...ప్రజలను చంద్రబాబు ఎంత చులకనగా చూశారో షర్మిల ఉదాహరణలతో వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రజలు ఎంత సంతోషంగా ఉండేవారో గుర్తు చేశారు. ప్రజలపై ఎలాంటి భారం పడకూడదని ఐదేళ్లలో చక్కెర నుంచి గ్యాస్ దాకా....ఆర్టీసీ చార్జీల నుంచి కరెంటు చార్జీల వరకూ ఒక్కసారి కూడా పెంచకుండా ప్రజారంజక పాలనను అందించిన ఘనత వైఎస్సార్కే దక్కిందని కొనియాడారు. ప్రజలపై భారం లేకుండానే సంక్షేమపాలన అందించి రికార్డు సీఎంగా కీర్తిగ డించారన్నారు. వైఎస్లాగే జగన్ కూడా ప్రజలను కంటికిరెప్పలా చూసుకుంటారని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయితే అమలు చేసే కార్యక్రమాలను వివరించారు. డ్వాక్రా రుణాలమాఫీ, రైతులకోసం 3వేలకోట్లతో ధరలస్థిరీకరణ నిధి, కరువునివారణకోసం 2వేల కోట్లతో ప్రత్యేకనిధి, అమ్మ ఒడి ద్వారా ప్రతి నెలా ఒక్కోబిడ్డకు నెలకు 500రూపాయల చొప్పున తల్లిఖాతాలో డబ్బులు జమచేయడం వంటి పలు కార్యక్రమాలను వివరించారు. చంద్రబాబు, వైఎస్ పాలన మధ్య వ్యత్యాసాలను చెబుతున్నపుడు సావధానంగా విన్న జనాలు..జగన్ సీఎం అయితే చేయబోయే కార్యక్రమాల వివరించినప్పుడు ఈలలు, కేకలతో హోరెత్తించారు. వైఎస్ ప్రవేశపెట్టిన 108 గురించి చెబుతూ ‘కుయ్...కుయ్..కుయ్’ అని షర్మిల అన్నపుడు వైఎస్ను గుర్తుకు తెచ్చుకున్నారు. ‘ అభివాదం చేసేసమయంలో చెయ్యితిప్పడం, మాట్లాడటం చూసి అచ్చం వాళ్లనాయనలాగే ఉంది’అని మహిళలు చర్చించుకున్నారు. రాజంపేటలో ప్రచారం ముగించుకుని షర్మిల 5.37గంటలకు సుండుపల్లికి బయలుదేరారు. రాజంపేటలో రాయచోటిరోడ్డులోని వీధుల్లో షర్మిలను చూసేందుకు జనం ఎగబడ్డారు. సుండుపల్లిలో పండుగవాతావరణం షర్మిలరాకతో సుండుపల్లిలో పండుగవాతావరణం నెలకొంది. సాయంత్రం 5గంటల నుంచే సుండుపల్లిరోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. డప్పుల వాయిద్యాలు, అభిమానుల నృత్యాలు, విన్యాసాలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు సందడి చేశారు. షర్మిల సుండుపల్లికి చేరుకోగానే ఈలలు, కేకలతో హోరెత్తించారు. తనకు అపూర్వస్వాగతం పలికి, అభిమానం చూపించిన సుండుపల్లి వాసులకు షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. సుండుపల్లి నుంచి అనుంపల్లి, శిబ్యాల, చలంపల్లి, రాయచోటి మీదుగా కడపకు వెళ్లారు. అక్కడి నుంచి పోరుమామిళ్లకు చేరుకుని కొమ్మరోలు సమీపంలో రాత్రి బస చేశారు. మంగళవారం ఉదయం అక్కడి నుంచి ప్రకాశం జిల్లా పర్యటనకు వెళతారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఆకేపాటి అమర్నాథరె డ్డితో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. -
మూడు వారాల్లో వైఎస్ సంక్షేమ రాజ్యం
పాడేరు, అరకు, కొత్తవలస బహిరంగ సభల్లో వైఎస్ విజయమ్మ సాక్షి, విశాఖపట్నం/శృంగవరపుకోట, న్యూస్లైన్: ‘‘మరో మూడు వారాలు ఆగండి. కష్టాలు పడుతున్న మీ అందరికి మీ మనవడు పింఛన్లు అందిస్తారు. వృద్ధులకు రూ.700, వికలాంగులకు రూ.1,000 చొప్పున ఇస్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణయుగాన్ని తీసుకువస్తారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు. జగన్ కూడా రాజన్న రాజ్యాన్ని తీసుకువస్తారు. జగన్ వైఎస్లా మంచి నాయకుడు. మనసున్న నేత. జగన్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి హోదాలో అయిదు సంతకాలు చేస్తారు. అవి రాష్ట్ర చరిత్రనే తిరగరాస్తాయి. కష్టాల్లో ఉన్న మా కుటుంబానికి మీరంతా వెన్నుదన్నుగా నిలబడ్డారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. చంద్రబాబు మీ అందరినీ నమ్మించడానికి కల్లబొల్లి హామీలు ఇస్తున్నారు. వాటిని నమ్మకండి. విశ్వసనీయత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన చంద్రబాబే. ఆయన ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు ఇవ్వబట్టే ఈరోజు రాష్ట్రం ముక్కలైంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. ఆదివారం విశాఖ జిల్లాలోని ఏజెన్సీలో ఎన్నికల ప్రచారంలో విజయమ్మ పాల్గొన్నారు. పాడేరు, అరకు, కొత్త వలస బహిరంగ సభల్లో ప్రసంగించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో, విజయనగరం జిల్లా కొత్తవలసలో జరిగిన రోడ్షోలలోనూ ప్రసంగించారు. భారీ వర్షంలోనూ విజయమ్మకు గిరిజనం బ్రహ్మరథం వైఎస్ విజయమ్మ తొలిసారిగా విశాఖజిల్లా ఏజెన్సీ ప్రాంతానికి రావడం తో ప్రజలు సంతోషంలో మునిగిపోయారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చలవతో ఎన్నో సంక్షేమ పథకాలను అందుకున్న తమకు ఆయన భార్యను తొలిసారిగా చూసే భాగ్యం దక్కడంతో గిరిజనం పండుగ చేసుకున్నారు. పాడేరు, అరకు బహిరంగ సభలకు వేలాదిగా తరలివచ్చారు. విజయమ్మ ప్రసంగాలకు జై కొట్టారు. విజయమ్మ పాడేరుకు చేరుకోగానే సభా వేదికకు కిలో మీటరున్నర ముందు నుంచే వేలాది జనం ర్యాలీగా ఆమె కాన్వాయ్ వెంట నడిచారు. అరకులోనూ విజయమ్మకు విశేష ఆదరణ లభించింది. జోరున వర్షం కురుస్తున్నా, ఆమెను చూసేందుకు ప్రజలు గంటల తరబడి అక్కడి నుంచి కదల్లేదు. వర్షంలోనే తడుస్తూ విజయమ్మ ప్రసంగాన్ని ఆసాంతం విన్నారు. ప్రచార రథానికి తప్పిన ప్రమాదం విశాఖ ఏజెన్సీలో విజయమ్మ కాన్వాయ్లో ముందు వెళ్తున్న ప్రచార రథానికి ప్రమాదం తప్పింది. ఆ సమయంలో వాహనంలో విజయమ్మ లేరు. ఆదివారం సాయంత్రం ఆమె అరకులో ప్రచారరథంపై నుంచి ప్రసంగించి అనంతరం తన వాహనంలో ఘాట్రోడ్డులో తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో కాన్వాయ్లో ముందుగా వెళ్తున్న ప్రచారరథానికి అనంతగిరి మండలం డముకు సమీపంలో 5వ నంబరు మలుపు వద్ద బ్రేకులు ఫెయిలయ్యాయి. గమనించిన డ్రైవరు సమయస్ఫూర్తితో రోడ్డు పక్కన కొండ అంచును ఢీకొట్టించి ఆగేలా చేశారు. నెమ్మదిగా వస్తుండటం వల్ల ప్రమాదం జరగలేదు. ఆ తర్వాత కాన్వాయ్లోని వాహనాలు ముందుకు సాగిపోయాయి. మరమ్మతులు చేసిన అనంతరం ప్రచార రథాన్ని విశాఖకు తీసుకెళ్లారు. -
వి.కోటలో షర్మిళ జనభేరీ
-
తంబళ్ళపల్లిలో షర్మిల జనభేరి
-
ఖమ్మం జిల్లా సత్తు పల్లిలో జగన్ జనభేరి
-
ఖమ్మం కొత్తగూడెంలో జగన్ జనభేరి
-
'వైఎస్ లేని లోటు జగన్ తీరుస్తాడు'
-
'రైతుల గురించి బాబు ఎప్పుడూ పట్టించుకోలేదు'
-
హుజూర్నగర్ జనభేరిలో జగన్ ప్రసంగం
-
నల్లగొండ జిల్లా కోదాడలో జగన్ జనభేరి
-
రాజమండ్రి జనభేరిలో విజయమ్మ ప్రసంగం
-
నంద్యాల జనభేరిలో షర్మిల ప్రసంగం
-
'వైఎస్సార్ సువర్ణ యుగాన్ని తెచ్చుకుందాం'
-
సికింద్రాబాద్లో షర్మిళ జనభేరీ
-
'మంజూరైన ఇళ్లకు బిల్లులు చెల్లించలేదు'
-
ఓటేసేముందు ఒక్కసారి ఆలోచించండి: షర్మిల
-
ఓటేసేముందు ఒక్కసారి ఆలోచించండి: షర్మిల
హైదరాబాద్: పన్నులు, ఛార్జీలు పెంచుతూ ప్రజల నడ్డి విరిచింది కిరణ్ సర్కారేనని వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జీడిమెట్లలోని షాపూర్లో నిర్వహించిన రోడ్ షోలో ఆమె ప్రసంగించారు. అధికారపక్షాన్ని కాలర్ పట్టుకుని ప్రశ్నించాల్సిన చంద్రబాబు తనకేమీ పట్టనట్టు వ్యవహరించారని విమర్శించారు. ఈ ఐదేళ్ల దుర్మార్గ కాంగ్రెస్ పాలనపై ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై పోరాడింది జగనన్న మాత్రమేనని గుర్తు చేశారు. ప్రజాసమస్యల పరిష్కారమే జగనన్న ముఖ్యమనుకున్నాడని, పదవులను సైతం లెక్కచేయలేదని అన్నారు. చివరికి జైలుకు కూడా వెళ్లాడని గుర్తు చేశారు. ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఓటేసేముందు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. వైఎస్ఆర్ సీపీకి ఓటేసి రాజన్న రాజ్యం తెచ్చుకోవాలని ఓటర్లకు షర్మిల విజ్ఞప్తి చేశారు. -
పటాన్చెరువులో షర్మిళ జనభేరీ
-
కందుకూరులో జనసునామీ
-
'సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు'
కందుకూరు: ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో చేపట్టిన ‘ వైఎస్సార్ జనభేరి’లో మేకపాటి ప్రసంగించారు. సీమాంధ్రలోని అన్నిస్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ తమ పార్టీ సత్తా చాటుతుందని చెప్పారు. మహబుబాబాద్, ఖమ్మం, మల్కాజ్ గిరి ఎంపీ స్థానాలను వైఎస్ఆర్ సీపీ గెల్చుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోనూ వైఎస్ జగన్ ముఖ్య భూమిక పోషించబోతున్నారని మేకపాటి అన్నారు. -
కందుకూరులో జనసునామీ
కందూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారయాత్ర ‘ వైఎస్సార్ జనభేరి’కి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా రాజన్న తనయుడికి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ప్రకాశం జిల్లా కందూరులో సోమవారం మధ్యాహ్నం వైఎస్ జగన్ నిర్వహించిన రోడ్ షోకు అపూర్వ స్సందన లభించింది. కనీవినీ ఎరగని రీతిలో జనం హాజరయ్యారు. యువనేత చూసేందుకు వచ్చిన జనంతో కందూరు కిక్కిరిసింది. ఎటు చూసినా జనమే కనిపించారు. భారీ ఎత్తున తరలివచ్చిన జనంతో కందుకూరులో జనసునామీ వచ్చిందా అనిపించింది. జగన్ కాన్వాయ్ వెంట వేలాది సంఖ్యలో జనం తరలివచ్చారు. తన కోసం ఎండను సైతం లెక్కచేయకుండా వచ్చిన ప్రజలకు వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. తనపట్ల చూపుతున్న ప్రేమాదరణకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్టు చెప్పారు. -
శేరిలింగంపల్లి జనభేరీలో షర్మిళ ప్రసంగం
-
కెపిహెచ్బి వైఎస్సాఆర్ జనభేరీలో షర్మిళ ప్రసంగం
-
మేకపాటిని కేంద్ర మంత్రిని చేస్తా: జగన్
-
'జీహెచ్ఎంసీ జీవోను రద్దు చేసింది బాబే'
-
రేపటి నుంచి షర్మిల జనభేరి
28న జగన్.. సాక్షి, సిటీబ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం వేడెక్కబోతోంది. ఆది, మంగళ వారాల్లో వైఎస్ షర్మిల నగరంలో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం పదిగంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్గూడ చెక్పోస్ట్ నుంచి షర్మిల జనభేరి ప్రారంభమై ఖైరతాబాద్, సనత్నగర్, కూకట్పల్లి హౌసింగ్బోర్డు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో సాగుతుంది. మంగళవారం ఉదయం కుత్బుల్లాపూర్ నుంచి ప్రారంభమయ్యే జనభేరి కంటోన్మెంట్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో సాగుతుంది. ఈ నెల 27 లేదా 28 తేదీల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం నగరంలో విస్తృత పర్యటన చేసే అవకాశముంది. -
'ప్రజలే మా ధైర్యం.. ప్రజలే మా దైవం'
-
ఉప్పొంగిన అభిమానం
రాజన్న బిడ్డను అక్కున చేర్చుకున్న గిరిజన తండాలు రెండో రోజు జనభేరి విజయవంతం ఐదు నియోజకవర్గాల్లో 150 కిలోమీటర్ల పర్యటన ఉదయం నుంచి రాత్రి వరకు అలుపెరగని ప్రచారయాత్ర పాల్వంచలో పోటెత్తిన జనం వనమాకు మద్దతుగా భారీ మోటార్ సైకిల్ ర్యాలీ సాక్షి, ఖమ్మం: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలను చూసేందుకు, ఆమె ప్రసంగాన్ని వినేందుకు పట్టణాలకు దీటుగా పల్లెలు.. గిరిజన తండాలు కదిలాయి. దారిపొడవునా మహిళలు, కూలీలు ఎదురేగి పూలవర్షం కురిపిస్తూ ఆప్యాయంగా రాజన్నబిడ్డకు స్వాగతం పలికారు. షర్మిల యాత్రకు వస్తున్న జనాభిమానాన్ని చూస్తూ నూతనోత్సాహంతో వైఎస్ఆర్ సీపీ, సీపీఎం శ్రేణులు కదం తొక్కాయి.. జిల్లాలో సోమవారం షర్మిల ఎన్నికల ప్రచారం జనభేరి సాగిన తీరిది. రెండోరోజు ఎన్నికల ప్రచారయాత్ర ఖమ్మం, వైరా, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల్లో సాగింది. ఉదయం 9.49 గంటలకు షర్మిల ప్రచార యాత్ర ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి ఆమె పార్టీ జిల్లాకార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ అంబే ద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్, వైఎస్ఆర్ కు నివాళులర్పించారు. అక్కడి నుంచి రోటరీనగర్, ఇల్లెందు క్రాస్రోడ్, మంచుకొండ మీదుగా బూడిదంపాడుకు ప్రచారయాత్ర చేరుకుంది. బూడిదంపాడులో గిరిజన మహిళలు షర్మిలతో చేయి కలిపేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ప్రచార రథానికి అడ్డుగా వచ్చి.. రహదారిపై నీళ్లు చల్లి.. పూలబాట వేసి సాదరంగా ఆహ్వానించి వారి ఆప్యాయతను చాటుకున్నారు. అనంతరం కామేపల్లి మండలంలోకి యాత్ర ప్రవేశించగా... గోవింద్రాల, పొన్నెకల్లు గ్రామాల్లో గిరిజనులు బారులు తీరి షర్మిలకు స్వాగతం పలికారు, మధ్యాహ్నం 12 గంటలకు ప్రచార యాత్ర గార్లకు చేరుకుంది. వైఎస్ఆర్ సీపీ, సీపీఎం శ్రేణులు కలిసికట్టుగా షర్మిలకు స్వాగతం పలికి ఆమెతోపాటు ప్రచారంలో పాల్గొన్నారు. కారేపల్లిలో కూడా షర్మిల ప్రచారయాత్రకు విశేష స్పందన లభించింది. డప్పు వాయిద్యాలతో పార్టీ కార్యకర్తలు ఆమెను ఆహ్వానించారు. ఇక్కడి సభకు వైరా నియోజకవర్గంలోని పలు మండలాల కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 4.30 గంటలకు షర్మిల ప్రచారయాత్ర ఇల్లెందు చేరుకుంది. అక్కడ భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం షర్మిల టేకులపల్లి మీదుగా పాల్వంచ చేరుకున్నారు. పాల్వంచలో జనజాతర... పాల్వంచలో జనభేరికి జనాభిమానం పోటెత్తింది. ఎటుచూసినా వైఎస్ఆర్ సీపీ శ్రేణులతో జనజాతర గా కనిపించింది. కొత్తగూడెం అసెంబ్లీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు మద్దతుగా ఇల్లెందు క్రాస్రోడ్ నుంచి పాల్వంచ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మోటార్ సైకిళ్లతో వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించడంతో పార్టీలో నూతనోత్తేజం కనిపించింది. దమ్మపేట సెంటర్ జన జాతరగా మారింది. షర్మిలను చూసేందుకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. ఆ తర్వాత దమ్మపేట సెంటర్లో భారీగా హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగిస్తుండగా జై జగన్ నినాదాలు మిన్నంటాయి. ఫ్యాను గుర్తుకే ఓటేయాలని ఆమె పదేపదే చెబుతుండటంతో అదే రీతిలో ప్రజలు కూడా స్పందించారు. పాల్వంచ మండల శివారు వరకు ఇదే రీతిలో జనప్రవాహం కొనసాగింది. అనంతరం ప్రచారయాత్ర రాత్రి 8.30 గంటలకు మోరంపల్లి బంజర మీదుగా మణుగూరు చేరుకుంది. ఇక్కడ కూడా గిరిజనులు షర్మిలపై ఆప్యాయత చూపించారు. అభిమానులు భారీగా తరలిరావడంతో మణుగూరు జనప్రవాహాన్ని తలపించింది. ఓటేసే ముందు మదినిండా వైఎస్ను తలుచుకోండి... ‘గిరిజనులంటే వైఎస్ రాజశేఖరరెడ్డికి అమిత ప్రేమ...దేశ చరిత్రలోనే రాష్ట్రంలో గిరిజనులకు 13 లక్షల ఎకరాల పోడు భూములపై హక్కు కల్పించిన ఘనత ఆయనదే’ అని షర్మిల అన్నారు. మణుగూరులో సోమవారం రాత్రి ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగిస్తూ... ఓటేసే సమయంలో ఒక్కసారి వైఎస్ను గుండెలనిండా గుర్తు తెచ్చుకుని ఆయన పాలన తిరిగి తెచ్చేందుకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ తెల్లం వెంకటరావు, ఖమ్మం, వైరా, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు కూరాకుల నాగభూషణం, బాణోతు మదన్లాల్, డాక్టర్ రవిబాబునాయక్, వనమా వెంకటేశ్వరరావు, పాయం వెంకటేశ్వర్లు, పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర నాయకులు ఎన్వీ రెడ్డి. వైఎస్ఆర్ సీపీ యువజన విభాగం మూడు జిల్లాల కోఆర్డినేటర్ సాధు రమేష్రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఎండీ ముస్తఫా, సీపీఎం నాయకులు కాసాని ఐలయ్య, బొంతు రాంబాబు, దేవులపల్లి యాకయ్య, అన్నవరపు కనకయ్య, వైఎస్ఆర్ సీపీ కొత్తగూడెం నియోజకవర్గ పరిశీలకులు ఆకుల మూర్తి, నాయకులు వనమా రాఘవ, భీమా శ్రీదర్, పాయం ప్రమీల తదితరులు పాల్గొన్నారు. పరుగు పరుగున మిర్చి కూలీలు... షర్మిల జనభేరి మంచుకొండ. పొన్నెకల్, భీక్లీ తండా గ్రామశివారుకు చేరుకోగానే... గ్రామ సమీపంలో మిర్చి తోటల్లో మిరపకాయలు కోస్తున్న కూలీలు రహదారిపైకి వచ్చేందుకు పరుగులు తీశారు. ఇది గమనించిన షర్మిల కాన్వాయ్ని వారు వచ్చేదాక ఆపారు. ‘ఏంటమ్మా.. బాగున్నారా.. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి’ అని వారిని పలకరించిన తర్వాత ప్రచార రథం ముందుకు కదిలింది. భీక్లీతండాలో బాణోతు రాజేష్ అనే బాలుడు మిర్చి కోత పనుల నుంచి షర్మిల వద్దకు వచ్చాడు. ఏం నాన్నా.. పనికి వెళుతున్నావా.. బాగా చదువుకోవాలి.. జగనన్న అధికారంలోకి రాగానే మీ జీవితాలు బాగుపడుతాయి.. నువ్వు మంచిగా చదువుకోవాలంటూ ధైర్యం చెప్పారు. షర్మిల నేటి పర్యటన షెడ్యూల్ ఖమ్మం హవేలి, న్యూస్లైన్: జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాజన్న బిడ్డ, జగనన్న సోదరి, వైఎస్ఆర్సీపీ నాయకురాలు వైఎస్ షర్మిల మూడోరోజు మంగళవారం నాటి పర్యటన షెడ్యూల్ను ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పాయం వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటించారు. ఉదయం 10 గంటలకు అశ్వాపురం, 11 గంటలకు సారపాక, 12 గంటలకు భద్రాచలం, 4 గంటలకు మోరంపల్లిబంజర, 5 గంటలకు ములకలపల్లి, రాత్రి 7 గంటలకు దమ్మపేట రోడ్షోల్లో పాల్గొంటారని వివరించారు. ఈ పర్యటనలో షర్మిలతో పాటు ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావ్తో పాటు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ, సీపీఎం అభ్యర్థులు పాల్గొంటారని పేర్కొన్నారు. పర్యటనను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. -
వైఎస్ విజయమ్మకుజననీరాజనం
పశ్చిమ కృష్ణా జనసంద్రంగా మారింది. అడుగడుగునా ఆత్మీయ స్వాగతాలు.. దారిపొడవునా ప్రజల నీరాజనాలు నడుమ మండుటెండను సైతం లెక్కచేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జిల్లాలో వైఎస్సార్ జనభేరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన కోసం నిరీక్షించిన ప్రజలను ఉద్దేశించి పలుచోట్ల ప్రసంగిస్తూ జిల్లాలో రోడ్షో నిర్వహించారు. కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల శంఖారావం పూరించారు. సోమవారం జిల్లాలోని జగ్గయ్యపేట నియోజవర్గంలో ప్రారంభమైన యాత్ర మైలవరం నియోజకవర్గంలో ముగిసింది. -
ఆస్పరి వైఎస్ఆర్ జనభేరీలో జగన్ ప్రసంగం
-
ఖమ్మంజిల్లా కారేపల్లిలో షర్మిళ జనభేరీ
-
'సీమాంధ్రకు నవనూతన రాజధానిని నిర్మిస్తాం'
-
వైఎస్సార్సీపీ మానిఫెస్టోపై విశ్లేషణ కార్యక్రమం
-
'రాష్ట్రానికి జగన్ లాంటి సమర్థ నాయకుడు కావాలి'
-
'తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్ది పదిల స్థానం'
-
'బాబు హయాంలో పాలన బ్రష్టు పట్టింది'
-
వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో హైలైట్స్
-
కాకుమానులో విజయమ్మ జనభేరీ
-
మోదుకూరులో విజయమ్మ జనభేరీ
-
రేపు జగన్ జనభేరి
ఆస్పరి, పత్తికొండలో పర్యటన సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జనభేరి కార్యక్రమం సోమవారం జిల్లాలో ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జననేత సోమవారం సాయంత్రం ఆలూరు, పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం ప్రకటించారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆస్పరిలో సోమవారం సాయంత్రం మూడు గంటలకు బహిరంగ సభ ఉంటుందన్నారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు పత్తికొండకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారని వారు వెల్లడించారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొని జనభేరిని విజయవంతం చేయాలని కోరారు. -
'జగన్ నాయకత్వంలో సుస్థిర పాలనను సాధిద్దాం'
-
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
-
గ్రేటర్లో రేపటి నుంచి షర్మిల జనభేరి
12, 13, 14 తేదీల్లో విస్తృత ప్రచారం పన్నెండు నియోజకవర్గాల్లో భారీ సభలు సాక్షి, సిటీబ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకురాలు వైఎస్ షర్మిల మూడు రోజుల నగర పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 12, 13, 14 తేదీల్లో సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్సభ స్థానాల పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ‘జనభేరి’ పేరిట షర్మిల విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు శివకుమార్ గురువారం రాత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని, వైఎస్ కుటుంబసభ్యుల రాక కోసం ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇదీ షెడ్యూల్.. 12వ తేదీ (శనివారం): ఉదయం 11కి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి జనభేరి ప్రారంభం. ఖైరతాబాద్, సనత్నగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో రోడ్డు షోలు, బహిరంగసభలు. 13వ తేదీ (ఆదివారం): ఉదయం కుత్బుల్లాపూర్ నుంచి ప్రచార యాత్ర ప్రారంభమై మేడ్చల్, కంటోన్మెంట్, మల్కాజిగిరి నియోజకవర్గాల మీదుగా సాగుతుంది. 14వ తేదీ (సోమవారం): మల్కాజిగిరి నుంచి యాత్ర ప్రారంభమై సికింద్రాబాద్, ఉప్పల్, అంబర్పేట మీదుగా ఎల్బీనగర్ నియోజకవర్గానికి చేరుతుంది. -
14న జననేత జగన్ జనభేరి
సాక్షి ప్రతినిధి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 14న జిల్లాలో పర్యటించనున్నారు. అనంతపురం లోక్సభ పరిధిలోని గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో 14న జనభేరి నిర్వహిస్తారు. 15న హిందూపురం లోక్సభ పరిధిలోని మడకశిర, పెనుకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఖరారు కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. 2012లో అనంతపురం, రాయదుర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ జిల్లాకు వచ్చారు. దాదాపు రెండేళ్ల తర్వాత జననేత జిల్లాకు రానుండటం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపనుంది. -
12న జగన్ జనభేరి
కోడుమూరు, ఆలూరు, పత్తికొండలో పర్యటన రోడ్షో.. జనంతో మాటామంతీ సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 12న జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన జనభేరి.. రెండో విడత ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో ఒక్క రోజు వాయిదా పడిందన్నారు. 12న ఉదయం 10 గంటలకు కోడుమూరుకు చేరుకోనున్న జననేత రోడ్షో అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. అక్కడి నుంచి నేరుగా ఆలూరుకు పయనమవుతారని.. మార్గమధ్యలో స్థానికులను కలుసుకుంటారన్నారు. సాయంత్రం 3.30 గంటలకు ఆలూరులో రోడ్షో నిర్వహించి బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారన్నారు. అనంతరం నేరుగా పత్తికొండకు చేరుకుని రోడ్షో చేపడతారని.. ఆ తర్వాత జనభేరిలో ప్రసంగిస్తారని వెల్లడించారు. చాలా కాలం తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు వస్తుండటంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయన పర్యటనల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఆ చిరునవ్వు కోసం.. ఆ చేతి స్పర్శ కోసం యువత ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కుటుంబ పెద్దగా బాగోగులు చూసుకున్న మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాక రైతులు, వృద్ధులు, అక్కాచెల్లెళ్లు.. అన్నాతమ్ముళ్లకు కుటుంబ సభ్యుడు వస్తున్న అనుభూతిని కలిగిస్తోంది. -
'గ్రామాల్లో బెల్టు షాపులను నిషేధిస్తా'
-
చదువుకున్న ప్రతీ ఒక్కరికీ 'ఉద్యోగ భరోసా'
-
'కరెంట్ కోతల్లేని రాష్ట్రాన్ని నిర్మిస్తా'
-
"పేదవాడి ఆరోగ్య భరోసా 'ఆరోగ్యశ్రీ'ని పునర్నిర్మిస్తా"
-
అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు
-
'డ్వాక్రా రుణాలను రద్దు చేస్తాం'
-
'ప్రజా సేవలన్నీ ప్రజల ముందుకే'
-
పేదరికం చదువులకు అడ్డు కాకుడదనేదే 'అమ్మఒడి' లక్ష్యం
-
రైతన్నలకు ప్రభుత్వ భరోసా
-
'వృద్ధాప్య పెన్షన్ను రూ. 700లకు పెంచుతా'
-
శ్రీకాకుళంలో జగన్కు జన నీరాజనం
-
కురుపాంలో జగన్కు ఘనస్వాగతం
-
బొబ్బిలి కోట సాక్షిగా జగన్ నినాదాలు
బొబ్బిలి : బొబ్బిలి కోట సాక్షిగా జగన్ నినాదాలు మారుమోగాయి. వేలాది మంది వైఎస్ఆర్ అభిమానులు జగన్ అడుగులో అడుగేయడానికి కదిలారు. ప్రజల కోసం పని చేసే నాయకుడి వెంటే ఉంటామంటూ నినదించారు. తల్లులు బిడ్డలను చంకన వేసుకుని వచ్చి జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. నీకు మేమున్నాం అన్నా అని జగన్ను కలిసిన యువత చెప్పడం కనిపించింది. వైఎస్ఆర్ జనభేరి ప్రచారంలో భాగంగా తన కోసం వచ్చిన ప్రతి ఒక్కర్ని పలకరిస్తూ..ధైర్యం చెబుతూ జగన్ ముందుకు కదిలారు. కాసేపటి క్రితం గుల్లాసీతారామపురం, పారాదిలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాయంత్రం సాలూరులో వైఎస్ఆర్ జనభేరి జరగనుంది. ఈ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. -
విజయనగరం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
విజయనగరం : విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన మంగళవారం ప్రారంభమైంది. 'వైఎస్ఆర్ జనభేరి' యాత్రంలో భాగంగా ఆయన బొబ్బిలి, సాలూరు నియోజక వర్గాల్లో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం బొబ్బిలి నుండి వైఎస్ జగన్ రోడ్ షో ప్రారంభమైంది. అక్కడ నుండి గ్రోత్ సెంటర్, మెట్టవలస క్రాస్ రోడ్డు, సీతారాంపురం క్రాస్ రోడ్డు, పారాది మీదగా రామభద్రపురం చేరుకుంటుంది. అక్కడ నుండి తారాపురం, కొట్టక్కి మీదుగా సాలూరు చేరుకోనుంది. సాలూరులో జరిగే వైఎస్ఆర్ జనభేరి సభలో ఆయన ప్రసంగించనున్నారు. -
జయహో జగన్
జయజయధ్వానాలు మిన్నంటుతున్నాయి...ఎక్కడికి వెళ్లినా, ఎవరిని పలకరించినా ఆ ధ్వానాలే ప్రతిధ్వనిస్తున్నాయి....పల్లె,పట్నం అన్న తారతమ్యం లేదు. నిరక్షరాస్యులు, విద్యార్థులు అన్న భేదం లేదు. స్త్రీ,పురుషులు అన్న తేడా అంతకన్నా లేదు. దేవుని గుడిలో హారతిలాంటి ఏ పాపమూ ఎరుగని ముత్యాల్లాంటి చిన్నారులు సైతం జయహో జగన్ అని నినదిస్తున్నారు. తమ ఆకాంక్షలు ఈ జయనామ సంవత్సరంలో మీ విజయానికి చిరునామా కావాలని ఆశిస్తున్నారు. ఆ అభిమాన జడిలో తడుస్తూ... పేరుపేరునా పలకరిస్తూ... సమస్యలను అడిగి తెలుసుకుంటూ... చెంపలపై జారుతున్న కన్నీటిని ఆప్యాయంగా తుడుస్తూ భావోద్వేగాల నడుమ వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జనభేరి యాత్ర జిల్లాలో సాగుతోంది. ప్రజలతో జగన్మోహన్ రెడ్డి మమేకమవుతున్న తీరు జిల్లా వాసులకు భవిష్యత్పై నమ్మకం పెరిగేలా చేస్తోంది. కష్టాలను అడిగి తెలుసుకుంటూ ‘నేనున్నాను..’ అంటూ ఆయన భరోసా ఇస్తున్న విధానం ఇన్నాళ్లకు సరైన నాయకుడు వచ్చాడన్న ఆనందం కలిగిస్తోంది. నిశీధిలో వెలుగు రేఖలా... వెన్నుపోటు నాయకుల మధ్యలో ఆశాకిరణంలా జనం కళ్లలో ఇంద్రధనుస్సులు పూయిస్తూ జగన్మోహన్ రెడ్డి ముందుకుసాగుతున్నారు. ఆదివారం ఆయన చీపురుపల్లి నుంచి బయలుదేరి గరివిడి, గుర్ల, మెరకముడిదాం, దత్తిరాజేరు మండలాల మీదుగా గజపతినగరం చేరుకుని అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. -
తిరువూరు జనభేరీలో షర్మిళ ప్రసంగం
-
ప్రేమ వెల్లువల్లె.. మమత కొండమల్లె
సాక్షి, ఏలేశ్వరం : కల్మషం లేని ఆ మనుషుల మనసులు ఆ మహానేత తనయుని చూడాలని తహతహలాడాయి. కుట్రకుతంత్రాలు తెలియని; కల్లాకపటం లేని వారి ప్రేమానురాగాలు అయస్కాంతాల్లా ఆకట్టుకుంటుండగా.. జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మెల్లమెల్లగా ముందుకు సాగారు. మైదానప్రాంతాల్లోనే కాదు.. గిరిజన ప్రాంతంలో కూడా ఆయనపై అదే ఆదరాభిమానాలు ఏలేరు వరదలా ఉప్పొంగాయి. జిల్లాలో సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ఎనిమిదో రోజైన సోమవారం ఉపప్రణాళికా ప్రాంతంలోని ఏలేశ్వరంలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం తునిలో జరిగిన జనభేరి సభలో పాల్గొన్నారు. ఉదయం 10.15 గంటలకు ఏలేశ్వరం లింగవరం కాలనీలోని మండల యూత్ కన్వీనర్ జువ్విన వీర్రాజు ఇంటి నుంచి ప్రారంభమైన రోడ్ షో నగర పంచాయతీ పరిధిలోని వీధులలో సాగింది. సుమారు మూడున్నర కిలోమీటర్ల మేర సాగిన రోడ్ షోకు..అడుగడుగునా వెల్లువెత్తిన ప్రజా స్పందనతో ఏడున్నర గంటలకు పైగా పట్టింది. రోడ్ షోలో జగన్ వెంట కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఉన్నారు. రోడ్ షో లింగవరం కాలనీ నుంచి ఎమ్మార్వో కార్యాలయం, ప్రభుత్వాసత్రి, నంది వీధి, పల్లపు వీధి, మార్కెట్ వీధి, హనుమాన్ జంక్షన్, దిబ్బలపాలెం, కాలేజ్ రోడ్ మీదుగా బాలాజీ చౌక్ వరకు సాగింది. పేరుకు ఎన్నికల ప్రచారమే అయినా.. పర్యటన ఆద్యంతం జననేత ప్రజా సమస్యలకేప్రాధాన్యమిచ్చారు. ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటూ, వారిలో భరోసా నింపారు. గతంలో ఏనాడూ ఏలేశ్వరంలో ఒక పార్టీ అధినాయకుడు ఇలా పర్యటించలేదు. జగన్ను చూసి, ఆ ప్రాంత గిరిజనుల మోముల్లో సంభ్రమాశ్చర్యానందాలు నిండాయి. జగన్ పలుచోట్ల నడవలేని వృద్ధులు, వికలాంగుల వద్దకు తానే వెళ్లి బాగోగులు తెలుసుకోవడం వారిని అమితంగా ఆకట్టుకుంది. ఏజెన్సీ ముఖద్వారం కావడంతో జగన్ పర్యటనకు భారీ ఎత్తున పోలీసులను, యాంటీనక్సల్ స్క్వాడ్ సిబ్బందిని మోహరించారు. అయితే జననేత ఇవేమీ పట్టించుకోకుండా మామూలు మనిషిలా ప్రజలతో మమేకమయ్యారు. నడినెత్తిన నిప్పులు చెరుగుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా.. రోడ్షో సాగిన దారి పొడవునా జనం రోడ్లకిరువైపులా బారులు తీరారు. గర్భిణులు, బాలింతలు కూడా జగనన్నను చూడాలని మండే ఎండలో నిరీక్షించారు. ఇక చిన్నారులు, యువకులు ‘జె జగన్..జైజై జగన్’ అంటూ నినదించారు. చిన్నారికి సునీల్గా నామకరణం ఏలేశ్వరం పల్లపు వీధికి చెందిన కర్రోతు గణేష్, సాయిపద్మినిల మూడవ సంతానమైన 22 రోజుల శిశువుకు జననేత ‘సునీల్’ అని నామకరణం చేశారు. అనారోగ్యంతో ఉన్న ఆ శిశువు ైవె ద్యానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని చలమలశెట్టి సునీల్కు సూచించారు. దిబ్బలపాలెం కాలేజీ రోడ్లో నడవలేకున్నప్పటికీ జగన్ను చూడాలని రోడ్డుపై కుర్చీలో కూర్చొని ఎదురు చూస్తున్న రిటైర్డ్ టీచర్ పులపకూర ఆశీర్వాదం దగ్గరకు ఆయనే నడుచుకుంటూ వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వినతుల వెల్లువ ఏలేశ్వరం రోడ్ షోలో పలు సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను జగన్కు విన్నవించారు. బీఈడీ చేసిన వారందరికీ ఎస్జీటీలుగా అవకాశం కల్పించాలంటూ బీఈడీ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ అర్హత పరీక్షలు రద్దు చేయాలని, గ్రామాల్లో డిగ్రీ, ఇంటర్, పదవతరగతి చదివిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని నిరుద్యోగులు వినతిపపత్రాలు సమర్పించారు. ఏళ్ల తరబడి కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్న తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కాంట్రాక్టు లెక్చరర్లు కోరారు. వారి సమస్యలన్నీ సావధానంగా విన్న జననేత మరో రెండు నెలల్లో వచ్చే మన ప్రభుత్వంలో మీ సమస్యలు పరిష్కరిస్తాను’ అని హామీ ఇచ్చారు. పింఛన్లు, ఇళ్లు కావాలని, రేషన్ కార్డులు, రుణాలు అందించి ఆదుకోవాలని పలువురు విజ్ఞప్తి చేయగా ‘కొంచెం ఓపిక పట్టండి. తప్పకుండా మన ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ ఇళ్లు, పింఛన్లు అందేలా చూస్తాను’ అని భరోసానిచ్చారు. -
పిడుగురాళ్ల జనభేరీలో షర్మిళ ప్రసంగం
-
సత్తెనపల్లి జనభేరీలో షర్మిళ ప్రసంగం
-
వైఎస్సార్ సీపీ విజయానికి కృషిచేస్తా
నరసరావుపేట వెస్ట్, న్యూస్లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థుల విజయం కోసం క్రియాశీలకంగా కృషిచేస్తానని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎన్సీవీ అధినేత నల్లపాటి రామచంద్రప్రసాదు (రాము) చెప్పారు. ఈనెల 27న హైదరాబాద్లో జననేత వైఎస్జగన్మోహనరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఆదివారం రామిరెడ్డిపేటలోని పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి గృహంలో రాము విలేకరులతో మాట్లాడారు. జనభేరి సమయంలో తన కుటుంబంపై గౌరవంతో వైఎస్ జగన్మోహనరెడ్డిని తమ ఇంటికి తీసుకొచ్చినందుకు మర్రి రాజశేఖర్, డాక్టర్ శ్రీనివాసరెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. జగన్ మాట ఇస్తే తప్పడనే విశ్వాసం తనకు ఉందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ నల్లపాటి రామచంద్రప్రసాదు చేరికతో పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం ఖాయమని, రాముతోపాటు అందరినీ మనస్పూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నల్లపాటి కుటుంబానికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ నాయకులు డాక్టర గజ్జల బ్రహ్మారెడ్డి, కపలవాయి విజయకుమార్, లాం కోటేశ్వరరావు, మేడికొండ నరసింహారావుచౌదరి తదితరులు పాల్గొన్నారు. -
గొల్లప్రోలు జనభేరీలో జగన్ ప్రసంగం
-
అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు
-
'అన్ని వర్గాలనూ ఒకేలా చూసిన వైఎస్స్'
-
నేడు తూ.గో. జిల్లాలో జగన్ పర్యటన
-
'మాట మీద నిలబడలేని వ్యక్తి చంద్రబాబు'
-
'చంద్రబాబు ఏనాడూ ప్రజల కోసం కష్టపడింది లేదు'
-
'చదువులకు పేదరికం అడ్డు కాకూడదు'
-
'జగన్ నాయకత్వంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం'
-
'జగన్తోనే సుపరిపాలన సాధ్యం'
-
'అన్ని రంగాలనూ అభివృద్ధి పరిచిన ఘనత ఒక్క వైఎస్సార్దే'
-
విశ్వసనీయతకే మాఓటు: మండపేట ప్రజలు
-
వైఎస్ జగన్ రోడ్ షోకు జననీరాజనం
-
'ప్రజలకి భరోసా ఇచ్చే నాయకుడు కావాలి'
-
ప్రేమ పొందుతూ.. ధీమా నింపుతూ..
‘చెట్టంత కొడుకు’ అన్న మాట తెలుగు వారికి సుపరిచితమే. కోనసీమవాసులైతే తమకు కల్పతరువులాంటి కొబ్బరి చెట్టును కొడుకుతో సమానంగా పరిగణిస్తారు. ఒక కొబ్బరి చెట్టుంటే ‘ఒక కొడుకు పెట్టు’ అన్నంత ధీమాగా ఉంటారు. అలాంటి వారికి.. మహానేత రాజన్న ఆశయాలకు వారసుడు, తమ బతుకుల్లో నవోదయానికి భరోసానిచ్చే సూర్యుడి లాంటి జగన్ను చూడగానే ఓ ‘కొబ్బరి తోటే’ తమకు ఉంది’ అన్నంత నిబ్బరం కలిగింది. కొబ్బరి నీటితో పోటీ పడే వారి స్వచ్ఛమైన అభిమానం వాడవాడలా.. అడుగడుగునా.. మండుటెండలో తొలకరి జల్లులా తనపై కురుస్తుంటే.. పులకించిపోతూ, ప్రతిగా వారిలో కొండంత ధైర్యాన్ని నింపుతూ ఆ హరితసీమలో పర్యటించారు జననేత. సాక్షి, అమలాపురం : మలినం లేని ప్రేమకు మారుపేరు కోనసీమ. ఆ గడ్డవాసులు మేలు చేసిన వారిని గుండెల్లో దాచుకుంటారు. దైవంలా కొలుస్తారు. ఆత్మబంధువులా ఆదరిస్తారు. అవసరమైతే ప్రాణం పెడతారు. ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాల్ని చవి చూపిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఇక్కడి వారికి ఇలపై వెలసిన దైవమే. అదే అభిమానం ఆయన కుటుంబంపైనా చూపుతూ వస్తున్నారు. ‘వైఎస్సార్ జనభేరి’ పేరిట సాగిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజన్న తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కోనసీమలో పర్యటించారు. గతంలోనూ ఆయన ఈ గడ్డకు వచ్చినా.. తమ ఆత్మబంధువు ఎప్పుడు వచ్చినా తమకు పండగే అన్నట్టు కోనసీమ వాసులు మురిసిపోయారు. ఆయనకు బ్రహ్మరథం పట్టారు. కోనసీమ కేంద్రమైన అమలాపురంతో పాటు ముమ్మిడివరం నియోజకవర్గంగా మీదుగాసాగిన జగన్ రోడ్ షోకు అపూర్వస్పందన లభించింది. కోనసీమ వాసులు గుండెలోతుల్లోంచి ఎగసే అభిమానంతో జననేతను ఉక్కిరిబిక్కిరి చేశారు. జననేత తొలుత అమలాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి నివాసం వద్ద వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి రోడ్ షోకు శ్రీకారం చుట్టారు. ఆయన పర్యటన సాగినంత మేరా మండుటెండను సైతం లెక్కచేయకుండా రోడ్లకిరువైపులా జనం బారులు తీరారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. ఊరూవాడా జగన్ నినాదాలతో మార్మోగాయి. పలుచోట్ల జనం తమ అభిమాన నేతపై పూలవర్షం కురిపించారు. హైస్కూల్ విద్యార్థులు తరగతులను వదిలి, జై జగన్ కేరింతలు కొట్టారు. జగన్ వారికి అభివాదం చేస్తూ ఉత్సాహం నింపారు. ైఅమలాపురం హెస్కూల్ సెంటర్, గోఖలే సెంటర్, కూచిమంచి అగ్రహారం, చిన్న వంతెన, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్, మున్సిపల్ కాలనీ, ముమ్మిడివరం గేటు, అశోక్నగర్, మద్దాలవారిపేట, పుల్లయ్య రామాలయం, అమెరికన్ ఆస్పత్రి, ఎర్రవంతెన తదితర ప్రాంతాలన్నీ జనసంద్రాలను తలపించాయి. పలుచోట్ల మహిళలు, వృద్ధులు, వికలాంగులు, ముస్లింలు, చిన్నారులు తమ అభిమాననేతను చూసేందుకు కాన్వాయ్కు అడ్డుపడ్డారు. తమ కష్టనష్టాలను ఆయన వద్ద ఏకరవు పెట్టారు. పింఛన్లు రావడం లేదని వృద్ధులు, ఉపకార వేతనాలు అందడం లేదని హైస్కూల్ విద్యార్థులు, ఫీజు రీ యింబర్స్మెంట్ లేదని కళాశాల విద్యార్థులు, ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదని మహిళలు మొర పెట్టారు.అందరి సమస్యలనూ ఓపిగ్గా వింటూ ముందుకు సాగిన జగన్ ‘మరో రెండు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా’ అంటూ ధైర్యం నింపారు. మీ నాన్న దయే మా ఆయువు.. అమలాపురం మహీపాల వీధిలోని అబ్బిరెడ్డి వీర్రాజు అనే వికలాంగుడు నడవలేకున్నా తనను చూసేందుకు వస్తుండడాన్ని చూసి చలించిన జగన్ స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. వైఎస్సార్కు వీరాభిమాని అయిన వీర్రాజు మహానేత హయాంలో గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. ‘మీ నాన్న గారి వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నా’నంటూ వీర్రాజు ఉద్వేగంగా జగన్కు చెప్పారు. పుల్లయ్య రామాలయం వీధికి చెందిన మానుకోట రమణమ్మ జగన్ను చూసి విచలితురాలైంది. ‘మీ నాన్న హయాంలో గుండె ఆపరేషన్ చేయించుకున్నాను. నిన్ను ఎన్నో కష్టాలు పెట్టారు. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు తప్పక అధికారంలోకి వస్తా’ వంటూ ఆయనను పట్టుకొని కన్నీటిపర్యంతమైంది. సీమాంధ్రకు అవసరం మీ నాయకత్వం.. ‘సమైక్యాంధ్ర కోసం మీరు ఎంతో పోరాటం చేశారు. అసలు సిసలైన సమైక్య హీరో మీరే’ అంటూ కోనసీమ జేఏసీ నాయకులు బండారు రామ్మోహనరావు అన్నారు. అమలాపురం అమెరికన్ ఆస్పత్రి వద్ద జేఏసీ నాయకులు జగన్ను కలిసి అభినందించారు. ‘సీమాంధ్ర అభివృద్ధి కావాలంటే మీలాంటి యువ నాయకత్వం అవసర’మన్నారు. మీరే మా సీఎం.. భోజన విరామం కోసం జగన్ కిమ్స్ ఆస్పత్రి గెస్ట్హౌస్లో కొద్దిసేపు ఆగారు. అనంతరం ఆరోగ్యశ్రీ వార్డుతో పాటు ఇతర వార్డుల్లో రోగులను పరామర్శించారు. ‘మా నాన్న శంకరనారాయణ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మిమ్మల్ని చూడాలంటున్నాడు’ అని ఆయన కుమార్తెలు జగన్ అభ్యర్థించారు. ఆయన వెంటనే ఐసీయూకు వెళ్లి శంకరనారాయణను పరామర్శించారు. ‘త్వరలోనే కోలుకుంటారు. మీకు అండగా నేనుంటా’నని ధైర్యం చెప్పారు. అనంతరం బయటకొస్తున్న జగన్ను చూసి మెడికోలు ‘జై జగన్’, ‘మీరే మా కాబోయే సీఎం..’ అంటూ నినదించారు. కరచాలనం కోసం, ఆటోగ్రాఫ్ల కోసం పోటీ పడ్డారు. జగన్ ఏ ఒక్కరీ నిరుత్సాహపర్చకుండా అందరినీ పలకరిస్తూ ‘బాగా చదువుకుని దేశానికి సేవ చేయండి’ అంటూ హితవు పలికారు. హోరెత్తిన బైకు ర్యాలీ ఎర్రవంతెన నుంచి ముమ్మిడివరం వరకు పార్టీ శ్రేణులు, యువకులు వందలాది బైకులపై జగన్ వెంట కదం తొక్కారు. భట్నవిల్లి, అనాతవరం, మాపాల చెరువు, కొండాలమ్మ చింతల మీదుగా ముమ్మిడివరం వరకు సాగిన రోడ్ షోలో 216 జాతీయ రహదారి జనసంద్రాన్ని తలపించింది. 10 కిలోమీటర్లు ప్రయాణించేందుకు మూడున్నరగంటలకు పైగా పట్టింది. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభించింది. ముమ్మి డివ రంలో జరిగిన జనభేరి సభకు హాజరైన అశేష జనాన్ని ఉద్దే శించి జగన్ ప్రసంగించారు. త్వరలో రాజన్న రాజ్యం తథ్య మంటూ వారి ఆకాంక్షను ఉద్దీపింపజేశారు. ఆయన వెంట జిల్లా పార్టీ అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ర్ట మహిళా విభాగం కన్వీనర్ కొల్లి నిర్మలకుమారి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, అమలాపురం అసెంబ్లీ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు, ఎస్సీ విభాగం జిల్లా కన్వీనర్ శెట్టిబత్తుల రాజబాబు, పార్టీ కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, గుత్తుల సాయి, స్టేట్ యూత్ కమిటీ సభ్యుడు తాడి విజయభాస్కరరెడ్డి, రైతు విభాగం రాష్ర్ట కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ, జిల్లా నాయకులు విప్పర్తి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబు ఏ వర్గాన్నీ అభివృద్ధి చేయలేదు'
-
అమలాపురంలో జగన్ ఎన్నికల ప్రచారం
-
గోదారికి ఆ దరి.. అభిమాన ఝరి
‘పశ్చిమ’లో జగన్పై వెల్లువెత్తిన జనాదరణ ‘తూర్పు’ పర్యటనలో అనివార్యమైన జాప్యం సాక్షి, కాకినాడ : పురపోరు సందర్భంగా ‘జనభేరి’ మోగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజల అభిమానం వరద గోదారిలా వెల్లువెత్తుతోంది. ఆయనకు అడుగడుగునా నీరాజనాలు పడుతుండడంతో పర్యటనలో తీవ్ర జాప్యం అనివార్యమవుతోంది. ముందు నిర్ణయించిన ప్రకారం జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకొని, ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కొవ్వూరు మీదుగా రాజమండ్రి చేరుకోవాల్సి ఉంది. అయితే పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ నిర్వహిస్తున్న రోడ్ షోలకు అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రతి చోటా ప్రజలు తమ అభిమాన నేతను చూసేందుకు పరవళ్లు తొక్కుతున్నారు. దీంతో పర్యటన ముందు నిర్ణయించినట్టు కాక.. గంటల కొద్దీ ఆలస్యంగా సాగుతోంది. శనివారం నాటి పర్యటన ముందు రూపొందించిన షెడ్యూల్ ప్రకారం కాక ఆరుగంటలకు పైగా ఆలస్యంగా జరిగింది. దాంతో ఆదివారం కూడా జగన్ పర్యటన పూర్తిగా పశ్చిమ గోదావరి జిల్లాలోనే జరపక తప్పడం లేదు. తూర్పు గోదావరి జిల్లాకు ఆయన రాక ఒకరోజు ఆలస్యం కానున్నా.. పర్యటన మాత్రం ముందు నిర్ణయించిన ప్రాంతాల్లోనే మూడురోజుల పాటు జరగనుంది. -
'విశ్వసనీయత, నిజాయితీ కలిగినివాడే నిజమైన నాయకుడు'
-
చంద్రబాబులా అబద్ధాలు చెప్పను: జగన్
-
పేదల గుండె చప్పుడు.. వైఎస్ఆర్: మాచర్ల వైఎస్ఆర్ జనభేరిలో జగన్
మాచర్ల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా మాచర్లలో నిర్వహించిన వైఎస్ఆర్ జనభేరికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. సభ ఆలస్యంగా ప్రారంభమైనా జగన్ రాక కోసం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. జగన్ రాక సందర్భంగా మాచర్ల రోడ్లు జనసంద్రమయ్యాయి. జగన్ ప్రసంగం ఆరంభించగానే ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తనను ఓ కుటంబ సభ్యుడిగా ఆదరిస్తూ, ఎనలేని అభిమానం చూపిస్తున్న ప్రజలకు జగన్ ధన్యవాదాలు చెప్పారు. దివంగత నేత వైఎస్ఆర్ ఎక్కడున్నారంటే.. జనం తమ గుండెల మీదు చేయిపెట్టుకుని గుండెల్లో ఉన్నారని చెబుతారని జగన్ అన్నారు. ప్రతి గుండె చప్పుడు వైఎస్ఆర్ను కోరుకుంటుందని చెప్పారు. 'వైఎస్ఆర్ పాలనకు ముందు చంద్రబాబు నాయుడనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండేవారు. అవి భయానక రోజులు. అప్పట్లో గ్రామాలకు వెళ్లేవాడిని. అవ్వా తాతలు నా దగ్గరకు వచ్చి కాస్త పెన్షన్ ఇప్పించు నాయనా అని అడిగేవారు. పేదలకు ముష్టి వేసినట్టు ఫించన్ ఇచ్చేవారు. అధికారులకు చెబితే గ్రామానికి కొంతమందికి ఇస్తున్నామని, కొత్తవారికి ఇవ్వాలంటే లబ్దిదారులు ఎవరైనా చనిపోవాలని చెప్పేవారు. చదువుకునే పిల్లలు వచ్చి తమ కష్టాలు చెప్పుకునేవారు. చంద్రబాబు ఏ రోజునైనా విద్యార్థులు, పేదల కష్టాల గురించి తెలుసుకున్నారా? ప్రజలు అనారోగ్యంతో, పేదరికంతో కష్టాలు పడ్డ ఆ రోజులు ఇంకా నాకు గుర్తున్నాయి' అని జగన్ అన్నారు. 'చంద్రబాబు నాయుడు పదవీ కాంక్ష కోసం ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారు. కొంతమంది నన్ను కూడా అలాంటి హామీలు ఇవ్వాలని చెప్పారు. తానెప్పటికీ ప్రజలను మభ్యపెట్టను. చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పను. వయసులో ఆయన కంటే నేను 25 ఏళ్ళు చిన్నవాడిని. ఎన్నికల తర్వాత చంద్రబాబు పార్టీ ఉండదు. ఎన్ని రోజులు బతికామన్నది కాదు ఎలా బతికామన్నదే ముఖ్యం. విశ్వసనీయత పాలన అందించడమే నా లక్ష్యం. అధికారంలోకి రాగానే ప్రజల సంక్షేమం కోసం నాలుగు సంతకాలు పెట్టబోతున్నా' అని జగన్ అన్నారు. -
‘జనభేరి’ని అడ్డుకుంటే కఠిన చర్యలు: ఎస్పీ
ఖమ్మం, న్యూస్లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 5న ఖమ్మంలో నిర్వహించే ‘జనభేరి’ బహిరంగసభకు అన్ని అనుమతులు ఉన్నాయని, ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఖమ్మం ఎస్పీ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన హక్కులుంటాయని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పార్టీలు వ్యవహరించాలని సూచించారు. సోమవారం ఆయన వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, జేఏసీ నేతలతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనకు అనుమతి కోసం ఆ పార్టీ నేతలు దరఖాస్తు చేసుకున్నారని, ఇందుకు పోలీసు శాఖ కూడా అనుమతి ఇచ్చిందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు త్వరలో జిల్లాలో జరిగే మునిసిపల్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు సహకరించాలని ఎస్పీ కోరారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకే ఎన్నికలు జరుగుతున్నప్పటికీ జిల్లా మొత్తం ఎన్నికల కోడ్ వర్తిస్తుందని వెల్లడించారు. -
జగన్కు నీరా‘జనం’
దారిపోడవునా పూల వర్షం వెల్లువెత్తిన అభిమానం పార్టీలో చేరిన పలువురు సాక్షి, విజయవాడ : జననేత, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న జనభేరికి వెళ్తూ గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయనకు దారిపొడవునా అభిమానులు పూల వర్షం కురిపించారు. పెదవుటపల్లి సెంటరులో జగన్కు పూలతో స్వాగతించారు. తేలప్రోలులో కరచాలనం చేయడానికి పోటీపడ్డారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థినులు జగన్ను కలిసి కర చాలనం చేసి సంతోషపడిపోయారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళుతూ హనుమాన్జంక్షన్లోని ఆ పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు నివాసంలో కొద్దిసేపు ఆగారు. జై జగన్, జోహర్ వైఎస్సార్ నినాదాలతో జంక్షన్ హోరెత్తిపోయింది. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ, వారితో మాట్లాడారు. నెల్లూరు జిల్లాకు చెందిన సికిందర్రెడ్డి గన్నవరం విమానాశ్రయం బయట జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సమయంలో ఆ పార్టీనేత కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరుకు చెందిన వైట్ల సత్యనారాయణమూర్తితో పాటు పలువురు నాయకులు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, వైద్య విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గోసుల శివభరత్ రెడ్డి, రాష్ట్ర ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, మచిలీపట్నం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు కుక్కల విద్యాసాగర్, తోట చంద్రశేఖర్, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, తెల్లం బాలరాజు, విజయవాడ నగర అధ్యక్షుడు జలీల్ఖాన్, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), పేర్ని వెంకట్రామయ్య(నాని), వంగవీటి రాధాకృష్ణ, ఆళ్ల కాళీ కృష్ణా శ్రీనివాస్(నాని), ముదునూరి ప్రసాదరాజు, జోగి రమేష్, జ్యేష్ఠ రమేష్బాబు, మేకా ప్రతాప అప్పారావు, నియోజకవర్గ సమన్వయకర్తలు పి .గౌతంరెడ్డి, ఉప్పులేటి కల్పన, సి.హెచ్.ఆశోక్ గౌడ్, దూలం నాగేశ్వరరావు, సింహాద్రి రమేష్, పటమట సురేష్బాబు, ఉప్పాల రాంప్రసాద్, రక్షణనిధి, పార్టీ నాయకులు తాతినేని పద్మావతి, తాడి శకుంతల, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి,అప్పన కనకదుర్గా ప్రసాద్ తదితరులు జగన్ వెంట ఉన్నారు. భారీ వలసలు.... హనుమాన్జంక్షన్ : గన్నవరం నియోజకవర్గంలోని 25 మంది మాజీ సర్పంచులు, జడ్పీటీసీలతో సహా కాంగ్రెస్, టీడీపీలకు చెందిన దాదాపు వెయ్యిమంది కార్యకర్తలు ఆ పార్టీలకు గుడ్ బై చెప్పి పార్టీ నేత దుట్టా రామచద్రరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహనరెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ముఖ్యనేతలకు జగన్పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. మల్లవల్లి గారపాడు సర్పంచులు చాకిరి కొండలరావు, కాటూరి విజయలక్ష్మీ, తిప్పనగుంట, దంటగుంట్ల మాజీ సర్పంచులు మొవ్వా రాజారావు, యజ్జవరపు సింహాచలం, వెంకటేశ్వరరావు దంపతులు, బొబ్బా యలమందారెడ్డి, వీరంకి వెంకటేశ్వరరావు, మూదు సాంబశివరావు, కాగితాల శివరాం, బొగ్గవరపు రాజేంద్రప్రసాద్, కొలుపూరి శ్రీనివాసరావు, గూడపాటి బసవయ్య, కాటూరి సూరిబాబు, పొల్లిమెట్ల మోషే, పైడిముక్కల చార్లిస్, అనియాల మురళి తదితర ముఖ్య నేతలూ వైఎస్సార్సీపీలో చేరారు. సూరపనేని రాధాకృష్ణామూర్తి నేతృత్వంతో కాకులపాడు మాజీ ఉప సర్పంచి చిటికినేని ప్రసాద్, ఇల్లూరి విజయ్, కొండిశెట్టి వీరబాబు సహా మరో వంద మంది పార్టీలో చేరారు. అభయాంజనేయునికి ప్రత్యేక పూజలు... ప్రసిద్ధ శ్రీ అభయాంజనేయ స్వామికి జగన్మోహనరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు శాస్త్రోస్తకంగా సాదర స్వాగతం పలికారు. అధికసంఖ్యలో తరలివచ్చిన కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో జంక్షన్ సెంటర్ నిండిపోయింది. దేవస్ధానంలో పూజల అనంతరం బయటకు వస్తూ తరలివచ్చిన పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. -
జగన్కోసం...
గుంటూరు వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా పర్యటన ఖరారు కావడంతో పార్టీ నేతల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. జైలునుంచి విడుదలయ్యాక తొలిసారిగా జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సమాయత్తం అవుతున్నారు. ఈ నెల ఆరో తేదీన నరసరావుపేటలో నిర్వహించే జనభేరి సభలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, వారి అనుచరులతోపాటు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరానున్నారు. 7, 8 తేదీల్లో మాచర్ల నియోజకవర్గంలో ఓదార్పు యాత్ర నిర్వహించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి మృతిని తట్టుకోలేక అశువులు బాసినవారి కుటుంబాలను జగన్ ఓదార్చుతారు. జైలునుంచి విడుదలయ్యాక తొలిసారిగా... 2012 మే 24వ తేదీన మాచర్ల నియోజకవర్గం కారంపూడి బహిరంగ సభలో ప్రసంగించి ఠమొదటిపేజీ తరువాయి సీబీఐ విచారణకు జగన్ హాజరయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ కుటిల యత్నాల కారణంగా 16 నెలలు జైలు జీవితం గడపడంతో ప్రజలకు, పార్టీ కేడర్కు దూరయ్యారు. ఆ లోటును భర్తీ చేసేందుకు పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, జననేత సోదరి షర్మిల పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అందరికీ అండగా ఉన్నామనే భరోసా అటు ప్రజలకు, పార్టీ కేడర్కు కలిగించారు. మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశయాలు, జననేత జగన్మోహన్రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రాష్ట్ర ప్రజలసంక్షేమం కోసం ‘సమరదీక్ష’ను చేపట్టారు. సమైక్యాంధ్రకు వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని గత ఏడాది ఆగస్టులో ఈ దీక్షను చేపట్టారు. ఆ తరువాత డిసెంబరులో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకుండానే హడావుడిగా ప్రారంభించిందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నిరసనగా ఒక రోజు దీక్ష చేపట్టారు. అంతకు ముందు(గత ఏడాది ఫిబ్రవరిలో) జగన్ వదిలిన బాణం షర్మిల జిల్లాలో 33 రోజులపాటు మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్రను నిర్వహించి ప్రజలకు బాసటగా నిలిచారు. సరైన ఆధారాలను సీబీఐ చూపించలేకపోవడంతో ప్రత్యేక కోర్టు జగన్కు బెయిల్ మంజూరు చేసింది. ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచే జగన్మోహన్రెడ్డి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్వహించారు. రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకున్న తరువాత పార్టీ పటిష్టతపై దృష్టి సారించి రానున్న ఎన్నికలకు శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలవారీగా జనభేరిని నిర్వహిస్తున్నారు. జనభేరి పోస్టర్ విడుదల జిల్లాలోని నరసరావుపేటలో ఈ నెల ఆరున జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న జనభేరికి సంబంధించిన పోస్టర్ను చిలకలూరిపేటలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్బంగా వారిద్దరూ మాట్లాడుతూ జగన్పాలనలోనే పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ అందగలవని తెలిపారు. జిల్లాలోని నాయకులంతా ఆ నాటి సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
'వైఎస్సాఆర్ సీపీ జనభేరిని అడ్డుకోవద్దు'
-
నేడే జనభేరి
ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న జగన్ లక్ష్మీపురం సర్కిల్ నుంచి నగరంలో రోడ్షో తిరుపతిలో రెండు కుటుంబాలకు ఓదార్పు లీలామహల్ సర్కిల్లో భారీ బహిరంగ సభ సాక్షి, తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తిరుపతి నగరం నుంచి సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్ జనభేరి పేరిట నిర్వహించనున్న ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, నాయకులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రానికే నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లు, వీధుల్లో స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈ సభకు జిల్లా నలుమూలల నుంచి నాయకులు, అభిమానులు తరలిరానున్నారు. లీలామహల్ సర్కిల్లో వేదిక నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో- ఆర్డినేటర్ తలశిల రఘురాం, తిరుపతి నగర వైఎస్సార్ సీపీ అధ్యక్షులు పాలగిరి ప్రతాప్రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి తదితరులు పరిశీలించారు. సభాస్థలిలో చేయాల్సిన మార్పులు, చేర్పులు గురించి చర్చిం చారు. శ్రీకృష్ణదేవరాయ విగ్రహం దక్షిణం వైపున వేదిక నిర్మించనున్నారు. వైఎస్ జగన్ ఒక్కడే సమైక్యనాయకుడు : పెద్దిరెడ్డి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కడే సమైక్య నాయకుడని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రం ఐక్యంగా ఉండాలని ఆయన అనేక విధాలుగా పోరాడారని గుర్తుచేశారు. సమైక్యనాయకుడిగా తిరుపతిలో ఎన్నికల ప్రచారభేరి మోగించేందుకు వస్తున్నారని తెలిపారు. ఆయనకు ప్రజలు అపూర్వ స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కుప్పం, మదనపల్లె సభలను తలదన్నే విధంగా తిరుపతి వైఎస్సార్ జనభేరి సభ నిర్వహిస్తామన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ, ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో ఆదరణ ఇంకా పెరిగిందన్నారు. తెలంగాణలోనూ తమ పార్టీ రానున్న ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తుందని తెలిపారు. జగన్ సీఎం అయితేనే సీమాంధ్ర అభివృద్ధి : భూమన వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే సీమాంధ్ర సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఆయన సభాస్థలి వద్ద మీడియాతో మాట్లాడుతూ జగనన్న సీఎం అయితేనే పేదలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతాయన్నారు. విభజన వల్ల కోల్పోయిన విద్య, ఉపాధి అవకాశాలు తిరిగి నిలబెట్టుకోవాలన్నా, అభివృద్ధి చేసుకోవాలన్నా, యువత భవిష్యత్ బాగుపడాలన్నా జగన్మోహన్రెడ్డి సీఎం కావాలన్నారు. ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాడిన యోధుడిగా, ప్రజా పక్షపాతిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుపతి నుంచి ఎన్నికల భేరిని మోగించేందుకు వస్తున్నారన్నారు. చంద్రబాబు ఎన్నికల ప్రచార సభకన్నా, వైఎస్సార్ జనభేరి మూడింతల జనంతో పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో జనం తరలివచ్చి సభను జయప్రదం చేయనున్నారన్నారు. రాజన్న రాజ్యం కోసం జగనన్నను సీఎంను చేసేందుకు ప్రతిఒక్కరూ చేయుతనివ్వాలన్నారు. పట్టభద్రులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా, సీమాంధ్రలోనే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జగన్మోహన్రెడ్డి నిబద్ధతతో, పట్టుదలతో ఉన్నారని ఆయన వివరించారు. వార్డుల్లో విస్తృత ప్రచారం తిరుపతి నగరంలోని అన్ని వార్డుల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, మహిళలు, అభిమానులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటున్న వైఎస్సార్ జనభేరి సభకు హాజరుకావాలని ఆహ్వానించారు. దొడ్డాపురం వీధిలో పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. -
మార్చి 3,4 తేదీల్లో ప.గో. జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
-
రేపు తిరుపతిలో వైఎస్సార్సీపీ జనభేరి
-
రేపు తిరుపతిలో వైఎస్ఆర్ జనభేరి
స్వాగత సన్నాహాలు చేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులు లక్ష్మీపురం సర్కిల్ నుంచి తిరుపతి నగరంలో రోడ్షో ఏర్పాట్లపై సమీక్షించిన వైవీ.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమన నగరమంతా వెలసిన స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్లు లీలామహల్ సర్కిల్లో సభ సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. మార్చి ఒకటిన తిరుపతిలోని లీలామహల్ సర్కిల్లో ఏర్పాటు చేసే ‘వైఎస్ఆర్ జనభేరి’ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి హాజరు కానున్నారు. ఆ రోజు నగరంలోని పలు ప్రాంతాల్లో జననేత రోడ్షో నిర్వహిస్తారు. నగరంలో రెండు కుటుంబాలను ఓదారుస్తారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు రోడ్షో ప్రారంభమవుతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో ని యోజకవర్గ ముఖ్యనాయకులు, కార్యకర్తలు రెండు రోజుల నుంచి జననేత పర్యటనను జయప్రదం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను గురువారం సాయంత్రం పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు వైవీ.సుబ్బారెడ్డి సమీక్షించారు. వైఎస్.జగన్ మార్చి 1వ తేదీ ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. రోడ్డు మార్గంలో తిరుపతి నగరంలోని లక్ష్మీపురం సర్కిల చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుపతి నగరంలోని ప్రధానమార్గాల మీదుగా రోడ్షో నిర్వహిస్తారు. వైఎస్ మరణానంతరం మృతి చెందిన అభిమానుల కుటుంబాలను మధ్యాహ్నం ఓదారుస్తా రు. సాయంత్రం లీలామహల్ సర్కిల్లో నిర్వహించే వైఎస్ఆర్ జనభేరి సభలో ప్రసంగిస్తారు. రాత్రికి తిరుమలలో బస చేసి, మార్చి 2వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అదే రోజు బయలుదేరి హైదరాబాద్ వెళ్తారు. ఏర్పాట్లు సమీక్షించిన ఎమ్మెల్యే భూమన తిరుపతిలో నిర్వహించనున్న వైఎస్ఆర్ జనభేరి ఏర్పాట్లను ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్రెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో గురువారం సమీక్షించారు. ఇప్పటి వరకు నగరంలో జననేతకు స్వాగతం పలికేందుకు ఎక్కడెక్కడ సన్నాహాలు చేస్తున్నారనే విషయాలను ఆరా తీశారు. నగరంలో రోడ్షో నిర్వహించాల్సిన మార్గాలను ఖరారు చేశారు. జనభేరి ఏర్పాట్లను శుక్రవారం మధ్యాహ్నానికి పూర్తి చేయాలని నాయకులకు సూచించారు. పేదల సమస్యలు పరిష్కారం కావాలంటే జగనన్న సీఎం కావాలని అందుకోసం రానున్న ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు గట్టిగా పని చేయాలని అన్నారు. శనివారం వైఎస్.జగన్మోహన్రెడ్డి హాజరయ్యే వైఎస్ఆర్ జనభేరి సభకు జనం పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. నగరమంతా వెలసిన స్వాగత ఫ్లెక్సీలు తిరుపతి నగరంలో నిర్వహించే వైఎస్ఆర్ జనభేరికి హాజరయ్యే వైఎస్.జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలుకుతూ వార్డు వార్డునా ఫ్లెక్సీలు వెలిశాయి. నగరంలో జగన్ రోడ్షో నిర్వహించే అన్ని మార్గాలతో పాటు, ప్రధాన కూడళ్లలో అభిమాన నాయకుడికి ఘనస్వాగతం అంటూ రాసిన ఫ్లెక్సీలు, ఫ్యాను గుర్తుకే ఓటు వేయండి జగనన్నను సీఎం చేయండి, భూమన కరుణాకరరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించండి అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం నుంచే అన్ని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీల ఏర్పాట్లు మొదలయ్యాయి. లీలామహల్ సర్కిల్లో వేదిక నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. లక్ష్మీపురం సర్కిల్, టీవీఎస్ కూడలి, డీఆర్.మహల్ సర్కిల్, గ్రూప్ థియేటర్స్, బండ్లవీధి, గాంధీరోడ్డు, క్రిష్ణాపురం ఠాణా, జ్యోతిథియేటర్ సర్కిల్, భవానీనగర్ జంక్షన్, మున్సిపల్ ఆఫీసు కూడలి ఇలా దాదాపు అన్ని ప్రధాన మార్గాల్లో జననేత వైఎస్.జగన్కు స్వాగతం పలుకుతూ బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రతి కూడలిలోనూ పెద్ద ఎత్తున మహిళలు, యువకులు స్వాగతం పలికేందుకు ఆయా వార్డుల్లో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వైవీ సుబ్బారెడ్డి పరిశీలన వైఎస్ఆర్ జనభేరి కార్యక్రమ నిర్వహణ గురించి చర్చించేందుకు గురువారం రాత్రి తిరుపతికి పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు వైవీ. సుబ్బారెడ్డి వచ్చారు. ఆయన ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా జనభేరి జరిగే ప్రాంతమైన లీలామహల్ సర్కిల్కు చేరుకున్నారు. అక్కడ సభాస్థలిని పరిశీలించారు. అనంతరం పీఎల్ఆర్ గ్రాండ్ హోటల్లో ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. కార్యక్రమా న్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అ ధ్యక్షులు కే.నారాయణస్వామి, రాజం పేట పార్లమెంట్ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, సమన్వయకర్తలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, బియ్యపు మధుసూధన్రెడ్డి, ఆదిమూలం, తిరుపతి నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్రెడ్డి, నెల్లూరు జి ల్లాకు చెందిన నాయకులు సంజీవయ్య, సునీల్, పార్టీ కార్యనిర్వాహక మండలి సభ్యుడు గోపాల్రెడ్డి పాల్గొన్నారు. -
మార్చి 1 నుంచి జగన్ జనభేరి
తిరుపతి: మార్చి 1న తిరుపతి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి జనభేరి ప్రారంభిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. భగవంతుడి సన్నిధి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంన్నారు. రాజన్నరాజ్యం జగన్ ద్వారానే సాధ్యం అని ఆయన చెప్పారు. జగన్ రాక కోసం ప్రజలు వేచి చూస్తున్నారన్నారు. మార్చి 1న సాయంత్రం లీలామహల్ సెంటర్లో బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. అదే రోజు తిరుపతిలో రెండు కుటుంబాలను జగన్ ఓదారుస్తారన్నారు. బహిరంగ సభ జరిగే ప్రదేశాన్ని, అక్కడ ఏర్పాట్లను పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి పరిశీలించారు.