Konda Vishweshwar Reddy
-
ఏఐసీసీలో ఖర్గే ఓ బొమ్మ మాత్రమే: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: శీతాకాల సమావేశంలో వక్ఫ్ బోర్డు బిల్లు పార్లమెంట్లో పాస్ అవుతుందని అన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ముస్లిం సమాజానికి వ్యతిరేకం కాదని తెలిపారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో వక్ఫ్ మతం కిందకు రాదని చెబుతున్నాయని,. వక్ఫ్ అనేది ఇతర దేశాల్లో ప్రభుత్వం కిందనే ఉందని తెలిపారు. ఎవరడ్డుకున్నా వక్ఫ్ బోర్డు సవరణ జరుగుతుందని చెప్పారు.ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు కీలకమని.. ఎవరైనా సర్వోన్నత న్యాయస్థాన తీర్పును గౌరవించాల్సిందేనని అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. దీనికి సుప్రీంకోర్టుకు మించి అధికారలిచ్చారని విమర్శించారు. ఔరంగజేబు విధానాలు ఇప్పటికీ ప్రజలను పీడిస్తున్నాయని పేర్కొన్నారు.‘300 వందల ఏళ్ల క్రితం కింద ఔరంగా జేబు నోటి మాటతో భూములిచ్చి ఉండొచ్చు, కానీ నేడు కుప్పలువుకుప్పలుగా డాక్యుమెంట్స్తో భూములు మావని అంటున్నారు. వక్ఫ్ బోర్డు అనేది ఒక క్రూరమైన హాస్యం, నవ్వాలో, ఏడ్వాలో, బాధపడాలో తెలియని పరిస్థితి. దేవాలయం అనేది మతానికి సంధించింది. వక్ఫ్ ఆనేది సమాజానికి సంబంధించినది.ముస్లిం ఓట్ల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ దేశాన్నైనా అమ్ముకుంటాయి. ఏఐసీసీలో ఖర్గే ఒక బొమ్మ మాత్రమే. నాడు మన్మోహన్ సింగ్ను ఎలా వాడుకున్నారో నేడు ఖర్గే కూడా అలాగే వాడుకుంటున్నారు.రాహుల్ తాత నెహ్రూ హాయంలో పాలేకర్ కమిషన్ ఏర్పాటు చేశారు. 1980 మండల్ కమిషన్ ఏర్పాటు చేశారు, ఎలాంటి చర్యలు లేవు. రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ విధానాలు నచ్చక అంబేద్కర్ కేబినెట్ వదిలేసి వెళ్లిపోయారు.రాజ్యాంగాన్ని బొంద పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది’ అని మండిపడ్డారు. -
పనికిరాని ప్రాజెక్టుకు మరమ్మతులెందుకు?
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం త ప్పుదారిలో పడింది. ఈ ని ర్ణయం వల్ల కాంగ్రెస్కే నష్టం జరుగుతుంది. పనికిరాని ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడం సరికాదు’అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను తాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించేందుకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. గురువారం బీజేపీ కార్యాలయంలో విశ్వేశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా చూస్తే ఎన్నికల వరకే కొట్లాటలు ఉంటాయని, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల పరిధిలోని జంట జలాశయాల పరిరక్షణకు సంబంధించి గత ప్ర భుత్వం జీఓ 111 రద్దు చేసినా, దాని కంటే కూడా నిరర్థకమైన జీఓ 69ను కొత్తగా తీసుకొచ్చిందని విమర్శించారు. ఇక్కడ పర్యావరణ పరిరక్షణతోపాటు అభివృద్ధి కూడా జరగాలంటే ఈ ప్రాంతాన్ని ‘సస్టెయినబుల్ ఏరియా’గా ప్రకటించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముస్లింలలో విషం నింపిందని మండిపడ్డారు. బీజేపీ మతతత్వ పార్టీ కాదని, దానికి పూర్తి విరుద్ధంగా కాంగ్రెస్ మతతత్వ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. మోదీ వేవ్తోనే తాను చేవెళ్లలో పెద్ద మెజారిటీతో గెలుపొందానని చెప్పారు. కేంద్ర కేబినెట్లో మీకు పదవి ల భించనుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు విశ్వేశ్వర్రెడ్డి స్పందిస్తూ ‘కేంద్రమంత్రి అయితే నాకు రాజకీయంగా నష్టం. దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన బాధ్యతల కారణంగా చేవెళ్ల ప్రజలకు దూరం అవుతా. కానీ నాకున్న పరిజ్ఞానం దేశం మేలు కోసం ఉపయోగించాలని ఉంది’ అని అన్నారు. -
కాంగ్రెస్కు అభ్యర్థులే దొరకడం లేదు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి చాలాచోట్ల అభ్యర్థులే దొరకడంలేదని, అందుకే ఇతర పార్టీల్లో టికెట్ రాని నేతల కోసం ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ముఖ్యమంత్రిని కూడా బయటనుంచి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. గురువారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...మాజీ ఎంపీ జితేందర్రెడ్డి తనకు మంచి మిత్రుడని, ఆయనకు టికెట్ రాకపోవడం బాధాకరమన్నారు. డీకే అరుణ, జితేందర్రెడ్డి ఇద్దరూ పెద్ద లీడర్లేనని, జితేందర్రెడ్డి పార్టీ మారతారని తాను భావించడం లేదని చెప్పారు. చేవెళ్ల సీటు మోదీదేనని రాసి పెట్టు కోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణలోని 12, 13 సీట్లు గెలిచినా ఆశ్చర్యపోనవసరంలేదని చెప్పారు. బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి వస్తానన్నా తమకు అభ్యంతరం లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేననే తమ పార్టీపై దుష్ప్రచారం సాగుతోందని, మద్యం కుంభకోణం కేసులో చర్యలు తీసుకోకపోవడం వల్ల అలా అనుకుని ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా కాంగ్రెస్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. -
పొలిటికల్ వార్!
వికారాబాద్: చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ కొండా విశ్వశ్వర్రెడ్డి మధ్య నెలకొన్న వివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. ఇన్నాళ్ల పాటు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ వ్యవహారం ఇటీవల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకునే వరకూ వెళ్లింది. ఇది కాస్తా కార్యకర్తల మధ్య చిచ్చు రాజేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ఈ నేతల మధ్య వివాదం మరింత ముదిరేలా ఉందనే చర్చ సాగుతోంది. అసలేం జరిగిందంటే.. ఎంపీ వర్సెస్ మాజీ ఎంపీ ఎంపీ రంజిత్రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ఇద్దరూ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున ఎంపీలుగా గెలిచిన వారే. 2014 ఎన్నికల్లో కొండా టీఆర్ఎస్ నుంచి గెలుపొంది ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ తరఫున కొండా, టీఆర్ఎస్ నుంచి రంజిత్రెడ్డి పోటీ చేయగా రంజిత్రెడ్డి గెలుపొందారు. అనంతరం విశ్వేశ్వర్రెడ్డి కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. నాటి నుంచి వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలూ పోటీ పడే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో ఎవరి గ్రూపులను వారు బలోపేతం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ప్రత్యర్థి పార్టీ నాయకులపైనా గురిపెట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల కొండా విశ్వేశ్వర్రెడ్డి.. రంజిత్రెడ్డి అనుచరులైన కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ రంజిత్రెడ్డి నేరుగా విశ్వేశ్వర్రెడ్డికే ఫోన్ చేసి ‘నా అనుచరులతో నువ్వెలా మాట్లాడతావు’ అని నిలదీసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రంజిత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విశ్వేశ్వర్రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి.. క్లారిటీ ఇచ్చిన వివేక్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అసంతృప్త నేతలు పలువురు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో వారిలో కొందరి స్పందన తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. తాను బీఆర్ఎస్లో చేరబోతున్నట్టు కొన్ని రోజులు ప్రచారం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్లో చేరుతున్నట్టుగా చెబుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు డా.జి.వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారబోవడం లేదని చెప్పారు. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కలిశానని, మంగళవారం నిజామాబాద్ సభ అప్పుడు మాత్రం.. తమ అంబేడ్కర్ కాలేజీ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ముఖ్యఅతిథి ఖరారు కోసం ఢిల్లీలో ఉన్నానని తెలిపారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కూడా చెప్పారు. బీజేపీ నేతలను చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నామంటూ ప్రచారం చేసుకోవడం ద్వారా తమ బలహీనతలను కాంగ్రెస్ నేతలు బయట పెట్టుకుంటున్నారని విమర్శించారు. మరికొంతమంది ఈ జాబితాలో మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డితో సహా దాదాపు 20 మంది నాయకులున్నారని చెబుతున్నాయి. జిట్టా బాలకృష్ణారెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి లాంటి కొందరు నేతలు ఇప్పటికే కాంగ్రెస్లో చేరగా, బీజేపీ కుంభస్థలాన్ని కొట్టామనే భావన కలిగించే స్థాయి నేతలను సైతం పార్టీలోకి రప్పించేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. విజయశాంతి, ఏనుగు రవీందర్రెడ్డిలను ఫోన్లో సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా వారు స్పందించలేదు. తర్జనభర్జన! కాంగ్రెస్ వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఆ పార్టీలోకి వెళ్లాలా? లేక బీజేపీలోనే ఉండాలా? అన్నదానిపై అసంతృప్త నేతలు తర్జనభర్జన పడుతుండటమే వారి స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడానికి కారణంగా తెలుస్తోంది. -
‘రాష్ట్రంలో ఏ పార్టీకీ గెలిచే బలం లేదు. నేను బీజేపీలోనే ఉంటా’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో పాటు బీఆర్ఎస్, ఇతర పారీ్టలకు కూడా ఏకపక్షంగా గెలిచే బలం లేదని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అభిప్రాయపడ్డారు. కొందరు బీజేపీ చాలా బలంగా ఉందని అనుకుంటారని, అయితే ఇంకా చేయాల్సింది చేస్తేనే ఎన్నికల్లో గెలిచే బలం వస్తుందనేది తమ అభిప్రాయమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీలోనే తాను ఉంటానని, మరే ఇతర పారీ్టలోనూ చేరబోనని స్పష్టం చేశారు. బుధవారం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రెండు, మూడు రోజులుగా మీడియాలో తాను ఇతర పారీ్టల్లో చేరుతున్నట్టు, నాయకులతో భేటీలు నిర్వహిస్తున్నట్టు కథనాలు రావడంతో పార్టీ నేతలు వివరణ నివ్వాలని సూచించారని చెప్పారు. తాను ఎలాంటి రహస్య సమావేశాలు నిర్వహించలేదని, ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతానికి ఏం చేయాలనే దానిపైనే చర్చించామని చెప్పుకొచ్చారు. కేసీఆర్పై వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోకుంటే నష్టమే కేసీఆర్ సర్కార్పై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను ఉపయోగించుకుని బీజేపీ ఈ బలా న్ని పెంచుకోవాలనేదే తమ ప్రయత్నమని చెప్పారు. దీనిని సరిగా ఉపయోగించుకోలేకపోతే ఓడిపోయే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై తమకున్న కొన్ని అనుమానాలపై స్పష్టతనివ్వాల ని అధిష్టానాన్ని కోరుతున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రపార్టీ ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్తో ఆయా అంశాలపై మాట్లాడామని, త్వరలోనే కేంద్రహోం మంత్రి అమిత్షాను కూడా కలుస్తామని కొండా విశ్వేశ్వర్రెడ్డి చెప్పారు. కాగా, కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కుటుంబం డబ్బుతో కాంగ్రెస్ పార్టీని సులభంగా కొనుగోలు చేసే అవకాశం ఉందంటూ విశ్వేశ్వర్రెడ్డి ట్వీట్ చేశారు. -
‘బీజేపీలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు.. పార్టీని వీడను’
సాక్షి, హైదరాబాద్: తాను బీజేపీని వీడి ఎక్కడికి వెళ్లడం లేదని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి స్పష్టత ఇచ్చారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీజేపీని మించిన సెక్యులర్ పార్టీ మరొకటి లేదన్నారు. బీజేపీపై ప్రజలకు నమ్మకం ఉందని, అదే సమయంలో తెలంగాణలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని పేర్కొన్నారాయన. ‘‘కొంతమంది మా మీద ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్తో పొత్తు లేదని నిరూపించుకునేందుకు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయాలని అంటున్నారు. కానీ, ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు. అది దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాల పని. వాటి పని అవి చేసుకుపోతాయి. కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని మాత్రమే పార్టీ కోరగలదు. మోస్ట్ కన్ఫ్యూజ్డ్పార్టీ అదే.. బీజేపీలో కన్ఫ్యూజన్ నెలకొందని కొందరు అంటున్నారు. కానీ, అలాంటిదేం లేదు. దేశంలో బీజేపీ అంత సెక్యులర్ పార్టీ మరొకటి లేదు. అందుకే కామన్ సివిల్ కోడ్ తేవాలని బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోందని చెప్పారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. అయితే కొందరు మాత్రం పనిగట్టుకుని మతానికో కోడ్ ఉండాలని కోరుతున్నారని ఆయన మండిపడ్డారు. ఓ నాయకుడు భారత్ జోడో యాత్ర చేసి.. కశ్మీర్ కు వేరే కోడ్ ఉండాలని అంటాడు. ఇది అసలైన కన్ఫూజన్. పార్టీల్లో మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పార్టీ కాంగ్రెస్. రాజకీయ అవసరాల కోసం సిద్ధాంతాలు లేకుండా వ్యవహరించే కాంగ్రెస్సే మోస్ట్ కన్ఫ్యూజ్డ్ అని అంటారు. అలాగే బీఆర్ఎస్లో ఉన్నోళ్లంతా.. ఒకప్పటి తెలంగాణవ్యతిరేకులేనని, ఆంధ్రను అడ్డగోలుగా విమర్శించారని గుర్తుచేశారాయన. వీటిల్లో ఏ పార్టీ కూడా సవ్యంగా లేదని.. అవి రియల్ కన్ఫ్యూజ్డ్ పార్టీలనీ అన్నారు. రేవంత్కు ఆహ్వానం.. రేవంత్రెడ్డి లక్ష్యం మా లక్ష్యం ఒక్కటే. కానీ, కేసీఆర్ను కొట్టగల ఆయుధాలు మా దగ్గరే ఉన్నాయి. అందుకే రేవంత్ రెడ్డి బీజేపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నా. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మార్చాలనేది మా ప్రధాన డిమాండ్ కాదు. ఢిల్లీ పర్యటనలో వేరే వేరే ఇష్యూలను అమిత్ షాకు వివరించాం. నా మనసులో మాటల్ని ఒక టీవీ ఛానల్ ఇంటర్వూలో చెప్పాను. కానీ, కొన్ని మీడియా ఛానెల్స్ వాళ్లు నేను చెప్పింది మరోలా రాశారు. నేను పార్టీ మారడం లేదు. బీజేపీ నేతలను కొనడం అంత ఈజీ కాదు.. అందుకే ప్రజలకు బీజేపీ పై నమ్మకం ఉంటుంది. పార్టీ కోసం ప్రచారం చేసుకోకపోవడమే మా మైనస్ అని కొండా విశ్వేశ్వరరెడ్డి తన పేరిట ప్రచారం అవుతున్న వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. -
ప్రధాని మోదీతో కొండా విశ్వేశ్వర్ దంపతుల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి దంపతులు ప్రధాని నరేంద్రమోదీతో శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న తమ రెండో కుమారుడి వివాహానికి ఆహ్వానించడానికి ప్రధానిని కలిశామని కొండా దంపతులు వెల్లడించారు. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ అంశాలను ప్రధానితో చర్చించినట్లు విశ్వేశ్వర్రెడ్డి భార్య సంగీతరెడ్డి ట్వీట్లో తెలిపారు. తెలంగాణలో విద్య, వైద్యం, ఇతర విషయాల గురించి చర్చించామని విశ్వేశ్వర్రెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. తమ స్వచ్ఛ్ ట్రక్, బయోగ్యాస్ ప్రాజెక్టుల గురించి మోదీకి వివరించామన్నారు. -
మ్యాచ్ టికెట్ల విక్రయంలో అవకతవకలు జరిగాయి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
-
టార్గెట్ కాంగ్రెస్! చేవెళ్లతో మొదలై మునుగోడు మీదుగా.. నెక్ట్స్?
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ టార్గెట్గా బీజేపీ పావులు కదుపుతోంది. ఆ పార్టీ నేతలను తమవైపు తిప్పుకునేందుకు తెరవెనుక మంతనాలు సాగిస్తోంది. చేవెళ్లతో మొదలు పెట్టిన చేరికల గేమ్.. ఇప్పుడు మునుగోడు మీదుగా ఎక్కడివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి ఉందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా దక్షిణాదిలో బలంగా కనిపిస్తోన్న కాంగ్రెస్ను దెబ్బకొట్టి, తన విజయావకాశాలు మెరుగు పరుచుకునేలా బీజేపీ అడుగులు వేస్తోందని సీనియర్ నేతలు అంటున్నారు. మరోపక్క ఈ వలస వ్యవహారం జోరందుకుంటే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ నేతలు లేరని, ఇది పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని పార్టీ పొలిటికల్ కన్సల్టెంట్ సునీల్ కనుగోలు అధిష్టానానికి నివేదించినట్టు తెలుస్తోంది. కొండాతో షురూ.. టీఆర్ఎస్ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలిచి 2019లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కండువా వేసుకున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పరేడ్ గ్రౌండ్స్లో ఇటీవల జరిగిన సభలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. విశ్వేశ్వర్రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి ఇన్చార్జిగా పెట్టేందుకు ఆ స్థాయి ఉన్న నేత ఎవరూ లేకపోవడం ఆందోళనకరమని అధిష్టానానికి నివేదిక వెళ్లినట్టు తెలిసింది. 2019లో కాంగ్రెస్ తరఫున చేవెళ్ల ఎంపీగా పోటీచేసిన విశ్వేశ్వర్రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. రాజగోపాల్రెడ్డికి రెడ్కార్పెట్! ఇక మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రస్తుతం నియోజకవర్గ ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ పేరుతో తిరుగుతున్నారు. కోమటిరెడ్డి కుటుంబం ఎప్పట్నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆయన పార్టీని వీడితే రెండు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో ప్రభావం ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. గతంలో భువనగిరి ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన రాజగోపాల్రెడ్డి తన పరిచయాలతో నల్లగొండతో పాటు ఖమ్మంలోనూ ప్రభావం చూపిస్తారని బీజేపీ బలంగా విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో అవసరమైతే ఆయనతో మహబూబ్నగర్, ఖమ్మం, నల్లగొండల్లో పాదయాత్ర చేయించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇది తొలుత కాంగ్రెస్ పార్టీపైనే ప్రభావం చూపిస్తుందని సీనియర్ నేతలు అంటున్నారు. రాజగోపాల్రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కొంతమంది నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చినా సునీల్ కనుగోలు వద్దని వారించినట్టు తెలిసింది. మహబూబ్నగర్, ఖమ్మంపైనా దృష్టి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు భావిస్తున్న కొంతమంది నేతల పైనా బీజేపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్కు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఈటల రాజేందర్ చర్చిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి కృష్ణారావు కాంగ్రెస్లోకి వెళ్లాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే కొండా విశ్వేశ్వర్రెడ్డి చేరికతో పాటు, ఈటల రాజేందర్కు బీజేపీలో లభిస్తున్న ప్రాధాన్యత, రాజగోపాల్రెడ్డి అదే పార్టీలో చేరబోతున్నారనే వార్తలతో ఆయన సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది. ఇక ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటితోనూ గతంలో ఈటల ఒకసారి సమావేశమైనట్టు వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతానికి ఆయన కుమార్తె వివాహ వేడుకలో బిజీగా ఉన్నారని తెలిసింది. ఉమ్మడి మహబూబ్నగర్లోని నూతన జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేత సైతం బీజేపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిసింది. ప్రత్యామ్నాయం లేకపోతే ప్రమాదం కాంగ్రెస్లో సీనియర్/ప్రముఖ నేతలున్న చోట ప్రత్యామ్నాయ నేతలు లేకపోవడం ఇప్పుడు ఆ పార్టీకి గడ్డు పరిస్థితిని తెచ్చిపెట్టేలా ఉంది. రాజగోపాల్రెడ్డి పార్టీ మారి ఉప ఎన్నికలు వస్తే దీటుగా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ నేతలు లేరనే దానిపై సునీల్ కనుగోలు టీం ఇప్పటికే నివేదిక సిద్ధం చేసినట్టు తెలిసింది. అక్కడ టికెట్ ఆశిస్తున్న వారిలో బలమైన నేతలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ నేతలపై దృష్టి సారించినట్టు తెలిసింది. ఇలా నల్లగొండలోని నకిరేకల్, ఆలేరు, దేవరకొండ, మిర్యాలగూడ స్థానాల్లో నేతల కొరత కనిపిస్తున్నట్టు తెలిసింది. ఇక మహబూబ్నగర్లోని మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానంతో పాటు జడ్చర్ల, గద్వాల, మక్తల్, దేవరకద్ర, షాద్నగర్ నియోజకవర్గాల్లో బలమైన నేతలు లేకుండానే నెట్టుకొస్తున్నట్టు సునీల్ టీం నివేదించినట్టు తెలిసింది. ఈ పరిస్థితి పార్టీకి ప్రమాదకరమని, బలమైన నేతలను పార్టీలోకి తీసుకురావడంతో పాటు ఉన్న నేతలపై ఫోకస్ చేసి పార్టీ కిందిస్థాయి దాకా వెళ్లేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సునీల్ సూచించినట్టు తెలిసింది. -
బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి
సాక్షి, హైదరాబాద్: చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరారు. పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ కొండా విశ్వేశ్వరరెడ్డి చేయి పట్టుకుని కార్యకర్తలకు అభివాదం చేయించారు. కాగా, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి మనవడైన కొండా విశ్వేశ్వరరెడ్డి.. టీఆర్ఎస్ తరపున 16వ లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంటు సభ్యునిగా పనిచేస్తున్నప్పుడు యూఎస్ పేటెంట్ పొందిన ఏకైక భారత పార్లమెంటేరియన్ ఈయనే కావడం విశేషం. అంతేకాదు 2014, 2018 తెలంగాణ ఎన్నికల టైంలో.. అఫిడవిట్ ఆధారంగా రిచ్చెస్ట్ పొలిటీషియన్గా నిలిచారు కూడా. 2013లో కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్లో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి.. 2018లో టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. కిందటి ఏడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. చదవండి: (హిందువులకు మాత్రమే కాదు.. అన్ని మతాలకు చేరువకావాలి: ప్రధాని మోదీ) -
బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలోకి చేరబోతున్నట్లు సమాచారం. జులై 1వ తేదీన ఆయన, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో అధికారికంగా పార్టీలో చేరతారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమకారుడు.. మాజీ డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి మనవడైన కొండా విశ్వేశ్వరరెడ్డి.. టీఆర్ఎస్ తరపున 16వ లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంటు సభ్యునిగా పనిచేస్తున్నప్పుడు US పేటెంట్ పొందిన ఏకైక భారత పార్లమెంటేరియన్ ఈయనే కావడం విశేషం. అంతేకాదు 2014, 2018 తెలంగాణ ఎన్నికల టైంలో.. అఫిడవిట్ ఆధారంగా రిచ్చెస్ట్ పొలిటీషియన్గా నిలిచారు కూడా. 2013లో కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్లో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి.. 2018లో టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. కిందటి ఏడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి కూతురు సంగీతా రెడ్డి.. కొండా విశ్వేశ్వరరెడ్డి భార్య. -
ఇంకా డోలాయమానంలోనే.. కొండా ఏదీ జెండా!.. విశ్వేశ్వర్ దారేటు?
సాక్షి, వికారాబాద్ : కొండా విశ్వేశ్వర్రెడ్డి అప్పుడప్పుడూ మీడియా ముందుకు వస్తున్నా ఏ పార్టీలో చేరుతారనే విషయం దాటవేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ విధానాలను గట్టిగా వ్యతిరేకిçస్తూ వస్తున్న ఆయన కాంగ్రెస్, బీజేపీల విషయంలో సమాన దూరాన్ని పాటిస్తున్నారు. ఇటీవల బీజేపీలో చేరతారనే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఏ పార్టీలో చేరతాననే విషయం చెబుతానని ఇటీవల ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడంతో ఆయన ప్రాబల్యం, అనుచరగణం ఎక్కువగా ఉన్న జిల్లాలో మరోసారి చర్చకు దారి తీసింది.. 2021 మార్చిలో అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్రెడ్డి మూడునెలల పాటు నిరీక్షిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఆ తరువాత అనేకసార్లు ఆయన మీడియా ముందుకు వచ్చినప్పటికీ ఎలాంటి పొలిటికల్ స్పష్టత ఇవ్వకుండానే ముగించడం ఆయన క్యాడర్ను నిరాశా నిస్పృహలకు గురిచేస్తూ వస్తోంది. టీఆర్ఎస్ను ఎదుర్కొనే పార్టీతోనే.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన కొండా విశ్వేశ్వర్రెడ్డి పార్టీకి రాజీనామా చేయగానే ఆయన బీజేపీలో చేరుతారనే చర్చ జరిగింది. అనంతరం పలు మార్లు ఆయన టీఆర్ఎస్ను బీజేపీ గట్టిగా ఎదుర్కోనుందా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్లో కొందరు నాయకులు అమ్ముడు బోయిండ్రు అంటూ విమర్శిస్తూనే.. కేసీఆర్తో గట్టిగా ఫైట్ చేసే పీసీసీ నాయకుడొస్తే కాంగ్రెస్లో చేరాలా? లేక తటస్తులు పార్టీ పెడితే వారితో కలవాలా అంటూ గతంలో అస్పష్ట ప్రకటనలు చేశారు. దీంతో కొండా దారెటు అనే విషయం ఆయన క్యాడర్తో పాటు జిల్లా రాజకీయాల్లో నానుతోంది. కొండా మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ ఎలాంటి రాజకీయ దుమారం చేస్తారా? అని రాజకీయ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లోనూ ఉత్కంఠ రేపుతుండగా ఆయన మాత్రం చర్చకు ఇంకా తెరదించటంలేదు. కొండా ఇచ్చే స్పష్టత కోసం ఆయన అనుచరగణంతో పాటు రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. బీజేపీలో చేరుతారంటూ ప్రచారం ఇటీవల కొండా.. బీజేపీలో చేరుతారనే ప్రచారం ఎక్కువగా సాగుతోంది. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆ విషయంలో అధికారపార్టీతో పోరాడుతానని చెప్పారే తప్ప ఆయన స్పష్టత నివ్వలేదు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, రగులుతున్న రాజకీయ వేడితో ప్రజలు, కేడర్ కంటే ఆయా పార్టీల నేతల్లోనే కొండా పయనంపై ఉత్కంఠ ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం. ఒకవేళ బీజేపీలో చేరితే ఎవరికి పోటీగా మారతారని చర్చసాగుతోంది. పరిగి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగితే తమ పరిస్థితి ఏమిటని అక్కడి నేతలు భావిస్తుండగా చేవెళ్ల ఎంపీగా పోటీ చేస్తే మరోసారి కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టిపోటీ ఇవ్వనున్నారనే ఊహాగానాలు ఇటీవల ఊపందుకున్నాయి. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి జెండా, ఎజెండాపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. డోలాయమాన వ్యూహాన్ని వీడటంలేదు. ఏడాది కాలంగా తటస్తంగా ఉంటూ వస్తున్న ఆయన ఏ పార్టీలోచేరుతారనే విషయంలో స్పష్టతనివ్వడంలేదు. ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. కొండా దారెటో అనే విషయం జిల్లాలో చర్చ సాగుతోంది. ప్రజలు, కేడర్ మరిచిపోకుండా ఉండేందుకు అప్పుడప్పుడు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మీడియాలో తళుక్కుమంటూ మళ్లీ తెరచాటుకు వెళ్తుండటం గమనార్హం. -
జీవో111 పరిధిలో సీఎం సంబంధీకుల భూములు
సాక్షి, హైదరాబాద్: జీవో111 పరిధిలోని భూములను సీఎం సంబంధీకులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారు కొనుగోలు చేయడం వల్లే.. రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోను ఎత్తేసిందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఇప్పటికే దాదాపు 25 వేల ఎకరాలు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. 2014 తర్వాత ఈ పరిధిలో భూములు కొనుగోలు చేసిన ప్రాంతాలను గ్రీన్జోన్లుగా ప్రకటించాలని, అంతకుముందు నుంచి భూములున్న వారిని గ్రీన్జోన్ పరిధిలోకి తీసుకురావొద్దని అన్నారు. ఈ ప్రాంతాన్ని ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ జోన్’గా మార్చాలని డిమాండ్ చేశారు. జీవో 111ను ఎత్తేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణ యం నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడ సాగులో ఉన్న కూరగాయలు, వరి ఇతర పంటలకు వాడుతున్న పురుగు, కలుపు నివారణ మందులతోనే కాలుష్యం వ్యాపిస్తోందన్నారు. అందుకే అతి తక్కువ కాలుష్యాన్ని వ్యాప్తి చేసే పరిశ్రమలు పెట్టాలని తాను సూచించినట్లు గుర్తు చేశారు. హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జంట జలాశయాల్లో కాలుష్యాలు చేరకుండా ఇచ్చిన జీవో 111కు, పర్యావరణ పరిరక్షణకు పెద్దగా సంబంధం లేదని, 11కి.మీనుంచి అనేక కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. 1974లో అప్పటి కేంద్రం తెచ్చిన ‘సెంట్రల్ వాటర్యాక్ట్’ను వికారాబాద్ దాకా అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
ఏం జరిగినా హుజురాబాద్లో గెలిచేది ఆయనే: కొండా విశ్వేశ్వర్రెడ్డి
సాక్షి, రంగారెడ్డి: తాను ఏ పార్టీలో చేరాలా అనే అంశంపై కన్ఫ్యూజన్లో ఉన్నట్లు కేటీఆర్ బినామీ మీడియాలో తనపై దుష్ట్రచారం చేస్తున్నారని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. తనకంటూ ఓ స్పష్టత ఉందన్నారు. సోమవారం బంజారాహిల్స్లో సీనియర్ నాయకులు సురేష్రెడ్డి, కొండా రాందేవ్రెడ్డి, రౌతు కనకయ్య, బీమేందర్రెడ్డి, కొండా కృష్ణారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అనేక సమీకరణాలు జరుగనున్నాయని, అధికారం కోసం జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకునే అవకాశం ఉందన్నారు. టీఆర్ఎస్ ఏదో ఒక జాతీయ పారీ్టతో జతకట్టే అవకాశం ఉందని.. ఇది తేలిన తర్వాతే చేరికపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పని చేసే పారీ్టలోనే చేరనున్నట్లు ప్రకటించారు. అది బీజేపీనా.. కాంగ్రెసా అనేది ఇప్పుడే చెప్పలేనన్నారు. చదవండి: హుజూరాబాద్ ఉప ఎన్నిక: ఉత్సాహవంతులకు ఊహించని దెబ్బ అందుకే ఆ పార్టీని వీడాను.. ఉద్యమ పార్టీగా చెప్పుకొంటున్న టీఆర్ఎస్లో ప్రస్తుతం తెలంగాణ వాదులెవరూ లేరని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఒకరిద్దరు ఉన్నా వారికి ఎలాంటి అధికారం లేదని అధికారమంతా తండ్రీ కొడుకులకే పరిమితమైందని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ చేతుల్లో బందీగా మారిన తెలంగాణ తల్లికి విముక్తి కల్పించేందుకు కలిసి వచ్చే పార్టీలతో పని చేస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు నిరసనగానే ఆ పార్టీని వీడాల్సి వచి్చందన్నారు. నా మద్దతు ఈటలకే వందల కోట్లు ఖర్చు చేసినా.. భారీగా పోలీసులను మోహరించినా హుజురాబాద్లో గెలిచేది మాత్రం ఈటల రాజేందరేనని జోస్యం చెప్పారు. బీజేపీలో చేరకపోయినా తన సంపూర్ణ మద్దతు ఆయనకేనని పునరుద్ఘాటించారు. ఒకప్పుడు తనకు వ్యతిరేకంగా పని చేసినప్పటికీ.. తాను మాత్రం ఆయనకు అనుకూలంగా పని చేయనున్నట్లు వెల్లడించారు. చదవండి: ఎన్నిక వచ్చినప్పుడల్లా సవాలేనా?: ఎమ్మెల్సీ కవిత రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం కేసీఆర్ సీఎం అయ్యాక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం చేశారన్నారు. రూ.15,000 కోట్లు ఖర్చు చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టి.. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ను చేపట్టారని ఆరోపించారు. జిల్లాకు సాగునీరిస్తానని చెప్పి, ఎడారిగా మార్చేశారన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణాన్ని గాలికొదిలేసి జిల్లాలో కొత్తగా మరో మూడు ఆస్పత్రులు నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
హుజూరాబాద్లో ఈటలను గెలిపించండి
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికలో మాజీమంత్రి ఈటల రాజేందర్ను భారీ మెజార్టీతో గెలిపించడం ద్వారా తెలంగాణకు ఆ నియోజకవర్గ ప్రజలు దిక్సూచిలా నిలవాలని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కోరారు. ఈమేరకు శనివారం ఆయన నియోజకవర్గ ఓటర్లకు బహిరంగ లేఖరాశారు. స్వయంపాలనలో తెలంగాణ పేద ప్రజలు అభివృద్ధి చెందుతారని తాను, రాజేందర్ నమ్మి కలిసి పనిచేశామని, కానీ సీఎం కేసీఆర్ అందర్నీ మోసం చేస్తున్నట్లు గ్రహించామని లేఖలో తెలిపారు. -
బెదిరిస్తే.. భయపడేదే లేదు: రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తమ గురించి మాట్లాడితే రాజద్రోహం, దేశద్రోహం కేసులు పెడతామని మంత్రి కేటీఆర్ బెదిరిస్తున్నారని.. అయినా భయపడేదే లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసుల గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో, ఎలాంటి చర్చ జరుగుతోందో ముందు ఆయన తెలుసుకోవాలని సూచించారు. చట్టాలు కేటీఆర్కు చుట్టాలు కావని, కేసులు పెడితే ఏం చేయాలో తమకూ తెలుసునని చెప్పారు. శనివారం హైదరాబాద్ గాంధీభవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్కు వైట్ చాలెంజ్ విసిరారు. ‘డ్రగ్స్ వినియోగంపై నేను ఎవరిపైనా ఆరోపణలు చేయడం లేదు. యువతకు ఆదర్శంగా ఉండేందుకే ఈ చాలెంజ్ విసురుతున్నా. ఏ విషయంలోనైనా యువతకు రోల్మోడల్గా ఉండాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. అందుకే గ్రీన్ చాలెంజ్ తరహాలోనే వైట్ చాలెంజ్ కూడా స్వీకరిద్దాం. కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి ఈ చాలెంజ్ విసురుతున్నా. ఇద్దరూ స్వీకరించండి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గన్పార్కు అమరవీరుల స్తూపం వద్దకు వస్తా. మీరూ రండి. అందరం వెళ్లి ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్కు రక్త నమూనాలు, వెంట్రుకలు ఇద్దాం’ అని వ్యాఖ్యానించారు. డ్రగ్స్తో తనకేం సంబంధం లేదని మంత్రి అంటున్నారని, అలాంటప్పుడు ఈడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. ఇది తన ఆరోపణ కాదని.. ఈడీనే కోర్టుకు అఫిడవిట్ రూపంలో చెప్పిందన్నారు. ఎక్సైజ్ శాఖ విచారణను అడ్డుకున్నది ఎవరని రేవంత్ ప్రశ్నించారు. చదవండి: ఫాల్తూ మాటలు మాట్లాడితే ‘దేశద్రోహమే’ గోతికాడ నక్క బీజేపీ... తెలంగాణ ఈ దేశంలో విలీనమైన సెప్టెంబర్ 17ను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని రెండు మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ గోతికాడ నక్కలా ఎదురుచూస్తోందని రేవంత్ పేర్కొన్నారు. తప్పుడు చరిత్రను మాట్లాడుతున్న ఆ పార్టీ నేతలకు రాంజీ గోండు, కాశీంరిజ్వీ గురించి కూడా తెలియదని ఎద్దేవా చేశారు. వారిద్దరికీ కనీసం 100 సంవత్సరాల తేడా ఉందని చెప్పారు. అమిత్షా పర్యటన సందర్భంగా బీజేపీ ఇచ్చిన ప్రకటనల్లో గోండు బిడ్డ సోయం బాపూరావు ఫొటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతిపై విచారణ జరపాలని, అమిత్షా అపాయింట్మెంట్ ఇప్పించాలని తాము కోరినా బీజేపీ టైం ఇప్పించలేదని చెప్పారు. కనీసం రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై సంజయ్, అరవింద్ ఎందుకు ఫిర్యాదు చేయలేదో చెప్పాలన్నారు. కేసీఆర్, నరేంద్రమోదీ.. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, ఆ రెండు పార్టీలపై కొట్లాడేది కాంగ్రెస్ మాత్రమేనని వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బడాయి మాటలు మానుకోవాలని, వాళ్ల రిమోట్ కేసీఆర్ చేతిలో ఉందన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాతో తమకు కొత్త బలం వచ్చిందని, కేసీఆర్ ఇక శాశ్వతంగా ఫాంహౌస్కు పరిమితం అవుతారని అనిపిస్తోందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మల్లు రవి, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: Amit Shah: 2023లో మాదే అధికారం -
బీజేపీలో చేరికపై తొందరొద్దు..! ఊగిసలాటలో ఈటల...
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్ రోజుకో మలుపు తిరుగుతోంది. దీనితో ఆయన తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెల కొంది. బీజేపీలో చేరడం దాదాపు ఖాయమనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో గురు వారం జరిగిన రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఈటలను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమంటూ గురువారం బీజేపీ శిబిరం స్పష్టమైన సంకే తాలు ఇచ్చింది. అదే సమయంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు విశాల రాజ కీయ వేదిక నిర్మాణం కోసం కలసి పనిచేద్దా మంటూ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే బీజేపీలో చేరడంపై మాజీ మంత్రి ఈటల ఇప్పటికే తన సన్నిహితులకు చూచాయగా వెల్లడించారు. రాజకీయంగా తనను అణగదొక్కడంతో పాటు భూకబ్జా కేసుల్లో కుటుంబసభ్యులను కూడా వేధింపులకు గురి చేస్తుండటంతో బీజేపీలో చేరేందుకే ఈటల మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఆయన ఆ పార్టీ జాతీయ నాయకులతోనూ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఆయన చేరికకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని సమాచారం. బీజేపీలో చేరికపై తొందరొద్దు! ఈటల బీజేపీలో చేరతారంటూ రెండు రోజులుగా వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో కోదండరాం, కొండా విశ్వేశ్వర్రెడ్డి గురువారం షామీర్పేటలోని ఈటల నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేసీఆర్ రాజకీయ వేధింపులతో ఇబ్బంది పడుతున్న ఈటలకు నైతిక మద్దతునిచ్చేందుకే వచ్చినట్లు కోదండరాం, కొండా విశ్వేశ్వర్రెడ్డి వెల్లడించారు. అయితే ఈటలతో జరిగిన అంతర్గత భేటీలో మాత్రం బీజేపీలో చేరిక, విశాల రాజకీయ వేదిక వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. బీజేపీలో చేరికపై తొందర పాటు నిర్ణయం వద్దని వివరించినట్లు తెలిసింది. బీజేపీలో చేరితే ఈటల రాజకీయ భవిష్యత్తుకు జరిగే నష్టం, ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మించడంలో ఈటల పాత్ర, కలసి వచ్చే వారితో సమన్వయం చేసుకోవాల్సిన తీరుపై ఈ భేటీలో చర్చించినట్లు తెలిసింది. బీజేపీ పచ్చజెండా? కొద్ది రోజులుగా ఈటల రాజేందర్తో వరుస మంతనాలు జరుపుతున్న బీజేపీ కీలక నేతలు ఆయన చేరికకు సంబంధించి పార్టీలో అంతర్గతంగా అభిప్రాయ సేకరణ జరిపినట్లు సమాచారం. ఈటల చేరికపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని రాష్ట్ర ముఖ్య నేతలు అధిష్టానానికి సంకేతాలు పంపారు. ఇదిలా ఉంటే గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జరిగిన వర్చువల్ భేటీలోనూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తావించారు. ఈటల కూడా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ఛుగ్, మాజీ ఎంపీ వివేక్ తదితరులతో నిరంతరం ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఈటల చేరిక ముహూర్తం ఒకట్రెండు రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉండగా, ఢిల్లీలోనే ఈటల చేరిక కార్యక్రమం ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, అవినీతి ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటలను పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి బీజేపీపై ధిక్కార స్వరం వినిపించారు. అంతర్గత అభిప్రాయ సేకరణ చేసిన పార్టీ తనను పరిగణనలోకి తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఊగిసలాటలో ఈటల తమ పార్టీలో ఈటల చేరడం ఖరారైందని బీజేపీ శిబిరం నుంచి స్పష్టమైన సంకేతాలు వస్తున్నా ఈటల మాత్రం చేరికకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయట్లేదు. భూ వివాదాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వెళ్తుండటంతో బీజేపీలో చేరాలనే ఒత్తిడి కూడా ఈటలపై పెరుగుతున్నట్లు సమాచారం. బీజేపీలో చేరితో తనకు ఎవరు దూరం అవుతారానే కోణంలో ఈటల విశ్లేషించుకుంటున్నారు. బీజేపీలో చేరికపై బహిరంగ ప్రకటన చేయడానికి ముందు హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన తన అనుచరులతో మరోమారు భేటీ కావాలనే యోచనలోనూ ఈటల ఉన్నారు. రాష్ట్ర అవతరణ దినం జూన్ 2లోగా ఈటల భవిష్యత్ రాజకీయ ప్రస్తానంపై పూర్తి స్పష్టత వస్తుందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. -
ఆక్సిజన్ కొరత.. కొండా విశ్వేశ్వర్రెడ్డి గుడ్న్యూస్
సాక్షి, హైదరబాద్: కరోనా సెకండ్ వేవ్ దేశంలో అల్లకల్లోలం సృస్టిస్తోంది. లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ కొరత కారణంగానే ఎక్కువమంది మృత్యువాతపడుతున్నారు. అయితే కరోనా సోకిన వీరిలో చాలా వరకు ఆక్సిజన్ స్థాయిలు తగ్గడంతోనే ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఆక్సిజన్ నిరంతర సరఫరా కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాయి. కోవిడ్ కష్ట కాలంలో ఆక్సిజన్ కొరత నెలకొన్న తరుణంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ఓ శుభవార్త అందించారు. ఈ మేరకు ట్విటర్లో ఓ వీడియో విడుదల చేశారు. చైనీస్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ సరిగా చేయడం లేదన్నారు. అదే తను చెప్పబోయే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ గాలి నుంచి వాయువులను పీల్చుకొని ఫిల్టర్ ద్వారా నైట్రోజన్, 98శాతం కచ్చితమైన ఆక్సిజన్ను వేరు చేసి నైట్రోజన్ను బయటకు పంపి ఆక్సిజన్ను పైపు ద్వారా అందించనున్నట్లు తెలిపారు. ఇటీవల సిలీండర్లు దొరకడం లేదని, ఒకవేళ దొరికినా తొందరగా అయిపోతుందన్నారు. జపాన్లో రూపొందించిన ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కరెంట్తో నడుస్తుందని పేర్కొన్నారు. దీనిని కరెంట్ పెడితే 30 రోజులు ఏకధాటిగా వాడుకోవచ్చని తెలిపారు. ఇప్పుడే రీఫిల్లింగ్ అవసరం లేదని, ఏడాది.. రెండేళ్ల తరువాత మార్చుకోవచ్చన్నారు. వీటిలో ఒకటి యజ్ఞ ఫౌండేషన్కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తన కజిన్ అనిత మరో రెండు విరాళంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక వికారాబాద్, చేవెళ్లలో 15, 20 బెడ్స్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: టీఆర్ఎస్ వ్యతిరేకులతో త్వరలో కొత్త పార్టీ Chinese oxygen concentrators don't work well. The specs say the oxygen flow is 5 liters/min at 97% purity, but they barely deliver barely 3 liters of oxygen at 80% purity. So my cousin Anitha and I are donating 3 German made Oxygen Concentrators to Yagyna Foundation in Vikarabad. pic.twitter.com/egPLZXGkiO — Konda Vishweshwar Reddy (@KVishReddy) May 8, 2021 -
టీఆర్ఎస్ వ్యతిరేకులతో త్వరలో కొత్త పార్టీ
సాక్షి, తాండూరు టౌన్: టీఆర్ఎస్ వ్యతిరేకులతో కలిసి రాష్ట్రంలో కొత్త పార్టీ పెడతానని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రకటించారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ వ్యతిరేకులను కలుస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం తాండూరుకు వచ్చిన కొండా పలువురు స్థానిక నేతలను కలిశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను దారుణంగా దోచుకుంటోందని ఆరోపించారు. తాను టీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచినప్పటికీ పార్టీ తీరు నచ్చక కాంగ్రెస్లో చేరానని తెలిపారు. అయితే కాంగ్రెస్ పోరాడే తత్వాన్ని మరిచిపోయిందని, అందుకే ఆ పార్టీని వీడానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ చేస్తున్న అరాచకాలను ప్రజల్లో ఎండగట్టేందుకు సిద్ధమయ్యానని, టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి తగిన బుద్ధి చెబుతానని హెచ్చరించారు. వీరందరూ కలిసొస్తే కొత్త పార్టీకి రెడీ అని, తానొక్కడిని మాత్రం పార్టీ పెట్టేది లేదని వెల్లడించారు. టీఆర్ఎస్ వ్యతిరేకులంతా ఏకం కాని పక్షంలో బీజేపీలో చేరుతానని తెలిపారు. ఇప్పటికే తాను కోదండరాం, తీన్మార్ మల్లన్న, చెరుకు సుధాకర్, మహబూబ్ఖాన్, దాసోజు శ్రావణ్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులను కలిశానని, త్వరలోనే రేవంత్రెడ్డిని కలుస్తానని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు. ఒకప్పటి కాంగ్రెస్ నేతలు సబితారెడ్డి, సుధీర్రెడ్డి, రోహిత్రెడ్డి వలె అమ్ముడుపోయే నేతలను కలుపుకొనిపోయే పరిస్థితి ఉండదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్లో అనేకమంది కోవర్టులు ఉన్నారని కొండా ఆరోపించారు. ఆయనతో పాటు టీజేఎస్ తాండూరు నేత సోమశేఖర్, కాంగ్రెస్ నేత రఘునందన్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
కొండా బర్త్డే: కాంగ్రెస్లో ‘కేకు’ రగడ..
తాండూరు టౌన్: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ నేతల మధ్య శుక్రవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. కొండా జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేయాలని నాయకులు ముందుగా భావించారు. అయితే కార్యకర్తలు, నేతలు అందరూ రాకముందే పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రమేష్మహరాజ్ కేక్ కట్ చేశారు. దీంతో ఆగ్రహించిన పార్టీ నేత ఖయ్యూం రమేష్మహరాజ్తో వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలందరి సమక్షంలో వేడుకలు నిర్వహిస్తే బాగుండేదని, కొందరి సమక్షంలో తూతూ మంత్రంగా జరపడం సరికాదన్నారు. తాను అత్యవసర పనిమీద వెళ్లాల్సి ఉందని, ఉందని, మరో పెద్ద కేకు తీసుకొస్తారని, దానిని కట్ చేసి వేడుకలు నిర్వహించుకోవాలని రమేష్ మహరాజ్ చెప్పడంతో వాగ్వాదం మరింత ముదిరింది. ఎవరికి వారే నిర్ణయాలు తీసుకోవడంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని పలువురు నేతలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో రమేష్ మహరాజ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం మరో కేక్ తీసుకొచ్చి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో నేతలు అలీం, బస్వరాజ్, మల్లికార్జున్, ప్రభాకర్గౌడ్, వరాల శ్రీనివాస్రెడ్డి, లింగదల్లి రవి, షుకూర్ పాల్గొన్నారు. చదవండి: ముగ్గురు మంత్రులు.. 3 జిల్లాలు అందమైన యువతుల ఫొటోలతో ఎర, గొంతులు మార్చి.. -
‘మంత్రి స్పందించడం ఆనందంగా ఉంది’
హైదరాబాద్ : కరోనా వైరస్తో పోరాడుతున్న జర్నలిస్టు సిద్ధిరెడ్డి శ్రీనివాస్ ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ మారిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. కరోనాతో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ తన ఆరోగ్య పరిస్థితిపై ఓ వీడియోను షేర్ చేశారు. అందులో తన ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదని.. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని కన్నీరు పెట్టారు. దయచేసి తనను అపోలో ఆస్పత్రిలో చేర్పించాలని మంత్రి హరీశ్రావును కోరారు. కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటున్నారని.. అపోలో ఆస్పత్రిలో చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు. చికిత్సకు తానే డబ్బులు భరిస్తానని చెప్పారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి.. అతని సమస్యపై హరీశ్రావు స్పందించడం ఆనందంగా ఉందన్నారు. ‘ఈ వీడియోను నాకు ఒక జర్నలిస్టు మిత్రుడు పంపించాడు. కానీ అప్పటికే మంత్రి హరీశ్రావు అతన్ని యశోద ఆస్పత్రిలో చేర్పించారని తెలిసింది. ఈ వీడియో అతనికి సాయం అందేలా చేసింది. మంత్రి స్పందించడం నాకు ఆనందం కలిగించింది. శ్రీనివాస్ త్వరలో కోలుకోవాలి’ అని విశ్వేశ్వరరెడ్డి ఆకాంక్షించారు. శాపాల నుంచి ఎవరు కాపాడలేరు.. మరోవైపు, సచివాలయం కూల్చివేతకు సంబంధించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై విశ్వేశ్వర్రెడ్డి విమర్శలు గుప్పించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా బాధితుడి శరీరాన్ని కుక్కలు తింటున్నాయని.. ఇంతకంటే సిగ్గుపడే అంశం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. ఇదేనా మీ బంగారు తెలంగాణ అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. చనిపోతున్న ప్రజల శాపాల నుంచి వాస్తు, యాగాలు, జ్యోతిష్యులు వారిని కాపాడలేరని వ్యాఖ్యానించారు. A journalist friend sent me this video. But got to know Minister Harish Rao got him admitted in Yashodha Hospital. The video helped get attention and glad the minister could respond. I wish the Siddhireddy Srinivas speedy recovery. pic.twitter.com/NaiPdd0BZx — Konda Vishweshwar Reddy (@KVishReddy) July 8, 2020 -
ఓడినా నైతిక విజయం నాదే: కొండా
సాక్షి, హైదరాబాద్: చేవెళ్ల నుంచి ఎంపీగా ఓడినా నైతిక విజయం తనదేనని కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. చేవెళ్లలో చివరి వరకు గెలుపు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినప్పటికీ, పట్టణ ఓటర్లను ప్రత్యర్థులు కొనుగోలు చేయడంతో తాను ఓడిపోయానని వివరించారు. శక్రవారం ఆయన గాంధీభవన్లో ఎమ్మెల్యే పైల ట్ రోహిత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ పోలీసులు, అధికారులను తన స్వలాభం కోసం వాడుకుందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి నానా ఇబ్బందుల కు గురిచేసిందని ఆరోపించారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ నేతలని లక్ష్యంగా చేసుకున్నారని, సమావేశాలకు అనుమతులివ్వకుండా అడ్డుకున్నారన్నారు. రాజకీయంగా తనను పూర్తిగా అణగదొక్కేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకుందని, నేతలు, కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని విశ్వేశ్వర్రెడ్డి సూచించారు. -
కొండా విశ్వేశ్వర్రెడ్డికి ముందస్తు బెయిల్
సాక్షి, హైదరాబాద్: పోలీసులను నిర్బంధించి ఇబ్బందులకు గురి చేశారంటూ నమోదైన కేసులో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ, రూ. 25 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విశ్వేశ్వర్రెడ్డిని విచారించాలనుకుంటే, ఆయనకు నోటీసు జారీచేసి విచారణకు హాజరు కావాలని కోరవచ్చునని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశ్వేశ్వర్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపిస్తూ, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పిటిషనర్పై ఈ కేసు నమోదైందని తెలిపారు. పోలీసులే మొదట పిటిషనర్ పట్ల దురుసుగా ప్రవర్తించారని, దీనిపై ఆయన ఫిర్యా దు చేసినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. ఆ తరువాత గచ్చిబౌలి సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుపై మాత్రం స్పందించి, పిటిషనర్పై కేసు నమోదు చేశారన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, దీనిలో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.ప్రతాప్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ పిటిషన్ను కొట్టేయాలని కోరారు. పిటిషనర్ తీవ్రమైన నేరానికి పాల్పడ్డారన్నారు. విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన పోలీసులనే నిర్భంధించి హిం సించారని తెలిపారు. ఈ కేసులో తాము అరెస్ట్ చేస్తామని ఎప్పుడూ చెప్పలేదన్నారు. కేవలం ఆందోళనతోనే పిటిషనర్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, విశ్వేశ్వర్రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. -
కొండా విశ్వేశ్వరరెడ్డికి స్వల్ప ఊరట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట కలిగింది. పోలీసులను నిర్బధించిన కేసులో ముందస్తు బెయిల్ కోసం విశ్వేశ్వరరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా రూ. 25వేలతో కూడిన రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. 41ఏ సీఆర్పీసీ ప్రకారం నోటీసులు అందుకున్న తరువాత పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి సన్నిహితుడు సందీప్ రెడ్డి వద్ద పది లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు బంజారాహిల్స్లోని విశ్వేశ్వరరెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో కొండా అనుచరులు ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ను నిర్భందించారు. దీంతో వారు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కారణంగా పలు సెక్షన్ల కింద విశ్వేశ్వరరెడ్డిపై కేసు నమోదైంది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విశ్వేశ్వరరెడ్డి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. అయితే నాంపల్లి కోర్టు ఆ పిటిషన్ను తిరిస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నందుకే పోలీసులు తనపై కావాలనే తప్పుడు కేసు నమోదు చేశారని విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. -
చేవెళ్ల పార్లమెంట్ సీటుపై హేమాహేమీల గురి
చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరనేది దాదాపుగా ఖరారైంది. టీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి, కాంగ్రెస్ తరఫున కొండా విశ్వేశ్వర్రెడ్డి, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గంగాపురం కిషన్రెడ్డి పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. ఇక అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంపై అన్ని పార్టీలు గురిపెట్టాయి. ఈ స్థానం నుంచి పోటీచేసేందుకు అర్థబలం, అంగబలం ఉన్న అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తిచేశాయి. ప్రధానంగా అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో హేమాహేమీలు ఈసారి బరిలోకి దిగనుండడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. గ్రామీణ, పట్టణ ప్రాంత సమ్మిళితమైన ఈ గడ్డపై పాగా వేసేందుకు ఆయా పార్టీలు రంగం సిద్ధంచేసుకుంటున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల పేర్లను దాదాపుగా ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక అధికార ప్రకటనే తరువాయి. ‘పట్నా’నికి లైన్ క్లియర్ అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున పట్నం మహేందర్రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈ స్థానానికి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ సైతం పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఆయనకు మల్కాజిగిరి టికెట్ ఇచ్చేందుకు పార్టీ సుముఖంగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని స్వామిగౌడ్కు ఇప్పటికే సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. చేవెళ్ల మీద ఆశలు పెట్టుకున్నప్పటికీ.. పార్టీ ఆదేశాల మేరకు ఎక్కడి నుంచైనా పోటీచేస్తానని స్వామిగౌడ్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలకుతోడు టికెట్పై మహేందర్రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పట్నంకు టికెట్ దాదాపు ఖరారైందనడానికి బలం చేకూరుతోంది. కాంగ్రెస్ నుంచి ‘కొండా’నే.. ఇక కాంగ్రెస్ నుంచి ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పేరు ఫైనల్ అయింది. మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈయన అప్పటి మంత్రి మహేందర్రెడ్డితో విభేదాలు తలెత్తడం, ఆధిపత్యం పోరు తదితర కారణాల వల్ల కాంగ్రెస్లో చేరారని ప్రచారం జరిగింది. అయితే కారణం ఏదైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేవెళ్ల టికెట్ ఆయనకు ఖరారు చేసిన తర్వాతే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సమక్షంలో విశ్వేశ్వర్రెడ్డి కాంగ్రెస్లో చేరారని వినికిడి. ఈ నేపథ్యంలో ఆయనకు కాకుండా మరొకరిని బరిలోకి దించే అవకాశం లేదు. పైగా జిల్లాలో విస్తృత క్యాడర్ ఉన్న మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డిని ఢీకొట్టాలంటే సమఉజ్జీ కావాలి. ఆర్థికంగా బలంగా ఉండటమేగాక పార్టీ శ్రేణుల్లోనూ కొండాకు మంచి పేరుంది. దీంతో విశ్వేశ్వర్ రెడ్డి వైపు కాంగ్రెస్ మొగ్గుచూపిందని సమాచారం. మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నప్పటికీ కొండా పేరే ఖరారు కానుంది. ఇప్పటికే పీసీసీ కూడా కొండా విశ్వేశ్వర్రెడ్డి పేరును కాంగ్రెస్ ఎన్నికల కమిటీకి సూచించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ నుంచి కిషన్రెడ్డి బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గంగాపురం కిషన్రెడ్డికి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఈయన సికింద్రాబాద్ టికెట్ను ఆశిస్తున్నా.. పార్టీ ఆదేశాల మేరకు చేవెళ్ల నుంచి బరిలో దిగుతారని తాజా పరిణామాలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. ఈయన ఆశలు పెట్టుకున్న సికింద్రాబాద్ స్థానంపై కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వెనక్కి తగ్గడం లేదు. ఈ స్థానం నుంచి వీరిద్దరిలో ఒకరికి ఫైనల్ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఈ క్రమంలో కిషన్రెడ్డికి ప్రత్యామ్నాయం చేవెళ్ల స్థానమే. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేగా గెలవడం, రాష్ట్ర పార్టీ బాధ్యతలు నిర్వహించడం ఈయనకు కలిసివచ్చే అంశాలు. పైగా పార్టీ శ్రేణుల్లోనూ మాస్ లీడర్గా పేరు సంపాదించారు. దీనికితోడు కిషన్రెడ్డి సొంతూరు ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకే వస్తోంది. ఈ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి బెక్కరి జనార్దన్రెడ్డి కూడా టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. అయితే పలు సమీకరణనల నేపథ్యంలో కిషన్రెడ్డి వైపే పార్టీ మొగ్గుచూపుతోందని తెలుస్తోంది. -
పొత్తుల్లేకుండా ఎన్నికలకు వెళ్తేనే మంచిది
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పొత్తుల్లేకుండా పోటీ చేస్తేనే బాగుంటుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అభిప్రాయపడ్డారు. 16వ లోక్సభ చివరి పార్లమెంటు సమావేశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. టీఆర్ఎస్ను వీడాక సంతోషంగా ఉన్నానని, టీఆర్ఎస్కు పడే ప్రతి ఓటు బీజేపీకే వెళుతుందని వ్యాఖ్యానించారు. ‘లోక్సభలో 100 కన్నా ఎక్కువ సార్లు మాట్లాడాను. వివిధ అంశాలపై లేవనెత్తిన అంశాలు ప్రభుత్వ విధానాలుగా రూపాంతరం చెందాయి. కేవలం ఎంపీ కార్యాలయంలో ఒక వినూత్న ఆవిష్కరణపై పేటెంట్ను పొందిన ఎంపీ కూడా నేనే. ’అని పేర్కొన్నారు. పలు ప్రశ్నలకు బదులిస్తూ ‘మోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు నచ్చలేదు. నోట్ల రద్దు, జీఎస్టీ సరిగా అమలు చేయలేదు. ఏ నిర్ణయమైనా అందరితో చర్చించి తీసుకోవాలి’అని తెలిపారు. ‘పార్టీ మారినందుకు బాధ లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలు ఏం కోరితే అది చేయాలి. టీఆర్ఎస్ ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరా. తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, నా నియోజకవర్గానికి న్యాయం జరుగుతుందని అనుకున్నాను. కానీ నేను నా నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు అమలు కాలేదు. పార్టీ మారాక సంతోషంగా ఉన్నాను’ అని సమాధానం ఇచ్చారు. -
టీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలు అవాస్తవం
-
పిచ్చి పిచ్చి ఆరోపణలు మానుకోవాలి: విశ్వేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తనపై టీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలు అవాస్తవమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. కూటమి గెలుస్తుందనే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డే తనకు ఫోన్ చేశారన్నారు. మర్రి జనార్ధన్ రెడ్డి పిచ్చి పిచ్చి ఆరోపణలు మానుకోవాలని విశ్వేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఒక్క ఫోన్ కాల్తో అమ్ముడుపోయే వ్యక్తిత్వమా మర్రిజనార్థన్ రెడ్డిది అని ప్రశ్నించారు. మర్రి జనార్ధన్ రెడ్డి గెలిచే అవకాశం లేదు. ఆ టెన్షన్లోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తనకు సుమారు 50 మంది టీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఓడిపోతామనే భయంతోనే ఆరోపణలు చేసినట్టుగా ఉందన్నారు. తాను మాట్లాడినట్టు చెబుతున్న ఫోన్ రికార్డులను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈసారి వదిలేస్తున్నా.. మరోసారి ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని విశ్వేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు టెన్షన్లో ఉన్నారన్నారు. ఓడిపోతామనే భయంలో పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
కాంగ్రెస్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
-
విశ్వేశ్వర్రెడ్డి మతితప్పి మాట్లాడుతున్నారు!
సాక్షి, మహబూబ్ నగర్ : ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి.. టీఆర్ఎస్పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి తీరుపై టీఆర్ఎస్ సీనియర్ ఎంపీ జితేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వేశ్వర్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన జితేందర్రెడ్డి.. కేకే సహా తనతోపాటు సీనియర్ ఎంపీలు టీఆర్ఎస్ను వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్న విశ్వేశ్వర్రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన టీఆర్ఎస్ను వీడటానికి రియల్ ఎస్టెట్ వ్యాపారాలే కారణమని అన్నారు. రాజీనామాపత్రంలో కేసీఆర్ను కీర్తించిన విశ్వేశ్వర్రెడ్డి.. ఇప్పుడెందుకు విమర్శిస్తున్నారని, ఆయన తీరు దారుణమని మండిపడ్డారు. తాను, కేకే అసంతృప్తిగా ఉన్నామనటం అవాస్తవమని, పార్టీలో కేసీఆర్ తమకు సముచిత స్థానం ఇచ్చారని అన్నారు. ఇక, ఏ ఎంపీ కూడా టీఆర్ఎస్ను వీడబోరని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని చెప్పారు. -
గాడిదలను కొన్నట్టుగా కొన్నారు
సాక్షి,హైదరాబాద్: టీఆర్ఎస్ పొలిటికల్ పార్టీ కాదు..అది ఒక ప్రొప్రయిటర్ కంపెనీఅని సాక్షాత్తు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారని కాంగ్రెస్ నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగులకు హక్కులు, వాయిస్ ఉంటుందని, కానీ, ప్రొప్రయిటర్ కంపెనీలో మాత్రం ఇవేం ఉండవన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్, కేటీఆర్ తీరు, పార్టీ విధానాలతో ఎంపీలు జితేందర్రెడ్డి, కేశవరావులతోపాటు పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. ఆదివారం గాంధీభవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హామీలు, వాగ్దానాలు నిలబెట్టుకోలేక పోవడంతో ప్రజాప్రతినిధులకు కనీసం ఆత్మగౌరవం లేకుండా పోయిందన్నారు. ఆర్థిక మంత్రి ఈటలకు బడ్జెట్ ఎలా ఉంటుం దో అసెంబ్లీలో ప్రవేశపెట్టే వరకు తెలియదని, పోలీసుల బదిలీల ఆర్డర్ బయటికి వెళ్లేవరకు హోంమం త్రికి తెలియదని విమర్శించారు. ముందస్తు ఎన్నికలు ఎందుకో టీఆర్ఎస్ ఎంపీలకే తెలియదని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో పనిచేసిన వారికి టీఆర్ఎస్లో గౌరవం లేదని, కొత్తగా చేరిన వారికి అధిక ప్రాధాన్యతనిచ్చి అందలం ఎక్కించారని ఆరోపించా రు. జై తెలంగాణ అన్న వారు జై కేసీఆర్, జై కేటీఆర్ అనాల్సి వస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీలో చర్చకు అవకాశమే ఉండదని, నిజాం రాజు కూడా కేసీఆర్లాగా నియంతృత్వ పాలన చేయలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ తీరుతో పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు నవ్వులపాలయ్యారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ హోదాపై పార్లమెంట్లో పోరాడమని కేసీఆర్ సూచించారని, కానీ ఆయన మాత్రం జాతీయ హోదాకోసం కేంద్రానికి దరఖాస్తు చేయలేదన్నారు. కేసీఆర్ తీరుతో కేంద్రమంత్రి వద్ద తమ పరువు పోయిందని, ముస్లింల ట్రిపుల్ తలాక్పై ఒక స్టాండ్ లేక ముఖం చాటేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు. అప్పులతో, వేల కోట్లు దోచిన డబ్బులనుంచి వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తే సరిపోతుందా? అని దుయ్యబట్టారు. టీఆర్ఎస్లో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు.. టీఆర్ఎస్లో వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారని, తన డ్రెస్ గురించి కూడా కామెంట్స్ చేయడం బాధనిపించిందని కొండా ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభలో గైర్హాజరు లేకుండా రోల్మోడల్గా ఉండేందుకు ప్రయత్నించడాన్ని కూడా అడ్డుకున్నారన్నారు. ఏకంగా పార్లమెంట్ సమీపంలోకి కూడా వెళ్ళొద్దని ఆర్డర్ వేశారన్నారు. కేటీఆర్, కేసీఆర్ మాటలనే పల్లా రాజేశ్వరరెడ్డి, సుమన్ చిలకలాగ పలుకుతారని విమర్శించారు. మంత్రి మహేందర్రెడ్డి ఫీల్ అవుతారని తాండూర్, చేవెళ్లకు వెళ్లొద్దని కేటీఆర్ ఒత్తిడి తెచ్చారన్నారు. మహేందర్రెడ్డి బ్రదర్స్కు భూ కబ్జా బ్రదర్స్గా పేరున్నప్పటికి పార్టీలో చేర్చుకుని అందలం ఎక్కించారన్నారు. గుర్రాలను, గాడిదలను కొన్నట్టు కొందరు ఎమ్మెల్యే, ఎంపీలను కొని జీ హుజూరుగా మార్చుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్లో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు, అందుకే గుడ్ బై చెప్పానని ఆయన వివరించారు. -
కొండా విశ్వేశ్వర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ను విభేదించి ఇటీవల కాంగ్రెస్లో చేరిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి టీఆర్ఎస్పై సంచలన ఆరోపణలకు తెరలేపారు. ఆ పార్టీలో చాలా మంది నేతలు అసంతృప్తితో ఉన్నారని.. జితేందర్ రెడ్డి, కేశవరావు వంటి నేతలు కూడా పార్టీని వీడే అలోచనలో ఉన్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెట్ కంపెనీ అని వారంతా మాట్లాడుకుంటూ ఉంటారని.. ఇదివరకు జై తెలంగాణ అన్న నేతలంతా ఇప్పుడు జై కేసీఆర్, జై కేటీఆర్ అంటున్నారని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్లో ఆత్మగౌరవం దెబ్బతినడం వల్లనే ఆ పార్టీకి రాజీనామా చేశానని వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్ శాసనసభకు వచ్చేవరకు అది ఎలా ఉంటుందో కూడా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్కు తెలియదన్నారు. ఉద్యమ సమయంలో పనిచేసిన వారికి టీఆర్ఎస్లో గౌరవం లేదని, కొత్తగా చేరిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. కారణం తెలపకుండా పైలెట్ రోహిత్ రెడ్డిని సస్పెండ్ చేశారని, ఇప్పుడు ఆయనే మంత్రి మహేందర్ రెడ్డికి ముచ్చెమటలు పట్టిస్తున్నారని తెలిపారు. మహేందర్ రెడ్డి తన మనుషులను కొట్టించారని, ఎంపీగా ఉండి కూడా అతనిపై కేసు పెట్టలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎక్కడికి వెళ్తానన్నా కేసీఆర్ వద్దనేవారని, నియోజకవర్గంలో కూడా తనని పర్యటించకుండా కట్టడిచేసేవారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ హోదాపై పార్లమెంట్లో పోరాడమని కేసీఆర్ సూచించారని, కానీ ఆయన మాత్రం జాతీయ హోదా కోసం కేంద్రానికి దరఖాస్తు చేయలేదన్నారు. కేసీఆర్ తీరుతో కేంద్రమంత్రి వద్ద తమ పరువుపోయిందని, తన డ్రెస్పై కూడా కేసీఆర్ కామెంట్ చేసేవాడని వ్యాఖ్యానించారు. -
సోనియా సమక్షంలో కాంగ్రెస్లోకి కొండా విశ్వేశ్వర్రెడ్డి
-
రాహుల్తో ఎంపీ కొండా భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న సిద్ధాం తంతోపాటు సెక్యులరిజం నుంచీ టీఆర్ఎస్ దూరం గా వెళ్లిపోయిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ప్రజల, ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక క్రమంగా వారికి దూర మవుతూ వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ను విశ్వేశ్వర్రెడ్డి ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, హరియాణాకు చెందిన ఎంపీ దీపేందర్సింగ్ హుడా పాల్గొన్నారు. 15 నిమిషాలు జరిగిన భేటీలో రాష్ట్రంలో టీఆర్ఎస్ హామీ ఇచ్చి నెరవేర్చని ప్రాజెక్టులు, చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని సమస్యలను రాహుల్కు ఆయన వివరించారు. కొండా రాకతో పార్టీ బలోపేతం... అనంతరం మీడియాతో కుంతియా మాట్లాడుతూ.. మతతత్వ పార్టీ బీజేపీతో జట్టుకట్టడం లాంటి అనేక అంశాలపై టీఆర్ఎస్తో విభేదిస్తూ కొండా ఆ పార్టీని వీడారన్నారు. ఈ నెల 23న సోనియా, రాహుల్ సమక్షంలో సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్లో చేరతారని వెల్లడించారు. చేవెళ్ల లోక్సభ అభ్యర్థిత్వంపై ప్రస్తుతానికి రాహుల్ హామీ ఇవ్వలేదని, పార్లమెంట్ ఎన్నికల సమయంలో అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. విశ్వేశ్వర్రెడ్డి రాకతో కాంగ్రెస్ బలోపేతం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే మరికొందరు ఎంపీలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరనున్నట్లు చెప్పారు. కేసీఆర్ వద్ద ఉన్న అనేకమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వారేనని, వారంతా తమతో టచ్లో ఉన్నట్లు వివరించారు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నంత మాత్రానా టీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ కాబోదని, ఎంఐఎం కూడా బీజేపీ వంటి మతతత్వ పార్టీయేనని మీడియా ప్రశ్నకు బదులిచ్చారు. ముస్లిం ఓటు ఎంఐఎంకు వెళ్లాలి.. హిందూ ఓటు బీజేపీకి వెళ్లాలి.. అన్నది వారి అవగాహన అని అన్నారు. కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకమైతే.. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల సమయంలో, పార్లమెంట్ తీర్మానాల సమయంలో ప్రతి విషయంలోనూ మద్దతెలా ఇచ్చారని ప్రశ్నించా రు. తెలంగాణలో 9 నెలల ముందుగానే ఎన్నికలు జరపాలన్నది ఓ పథకం ప్రకారం చేశారని, తద్వారా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎన్డీయేలో చేరా లన్నది టీఆర్ఎస్ వ్యూహమని అన్నారు. ప్రజలకు దూరమైన టీఆర్ఎస్... టీఆర్ఎస్ సైద్ధాంతిక మార్పులకు లోనైందని. అం దుకే ఆ పార్టీకి రాజీనామా చేశానని విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలన్న అసలు సిద్ధాంతాన్ని, సెక్యులరిజాన్ని పక్కకు పెట్టిందన్నా రు. చేవెళ్ల నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం రాహుల్ని కలిశానని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. వికారాబాద్ను శాటిలైట్ సిటీ చేస్తామని, తాండూరు సమస్యలను పరిష్కరిస్తామని గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని వీటన్నింటినీ నెరవేర్చాలని కోరా నన్నారు. రాష్ట్రంలోని సాగునీరు, పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రాజెక్టులు, టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వంటి అంశాలపై భేటీలో చర్చించామన్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువత టీఆర్ఎస్ ప్రాథమిక ఓటర్లని, ప్రస్తుతం వీరంతా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. పార్టీ పూర్తిగా సైద్ధాంతిక మార్పు కు లోనైందని, దీన్ని సహించలేకే పార్టీ వీడినట్లు పేర్కొన్నారు. ఈనెల 23న కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ చేయని వాటిని కాంగ్రెస్ ద్వారా సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీ పదవికి రాజీనామాపై స్పందిస్తూ స్పీకర్ను వ్యక్తిగతంగా కలిసి రాజీనామా ఇస్తానని పేర్కొన్నారు. మహేందర్రెడ్డితో నాలుగేళ్లుగా విభేదాలు.. మంత్రి మహేందర్రెడ్డితో వ్యక్తిగత విభేదాలు పార్టీలో చేరినప్పటి నుంచి ఉన్నాయని విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. దాని కోసమే అయితే ఇప్పుడు పార్టీ వీడాల్సిన అవసరం లేదని, ఆ పని నాలుగేళ్ల ముందే చేసేవాడినని తెలిపారు. చిన్నచిన్న వ్యక్తిగత కారణాలతో పార్టీ వీడేవాడి ని కాదన్నారు. అధికారం చేపట్టిన తొలినాళ్లలో సీఎం మంచిగా ఉండేవారని, అందుకే పలు ప్రాజెక్టులు చేపట్టారని అన్నారు. ప్రాంతీయ పార్టీలో ప్రజాస్వామ్యం చాలా తక్కువని, అదే కాంగ్రెస్లో ఆ వీలు ఉంటుందన్నారు. కాంగ్రెస్లోనే ఎందుకు చేరుతున్నారని ప్రశ్నించగా, గురువారం నిర్వహించబోయే విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వివరిస్తానని చెప్పారు. -
మజ్లిస్పై కృష్ణసాగర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ 25 లక్షల రూపాయలు ఇవ్వాలని చూసిందన్న అసదుద్దీన్.. టీఆర్ఎస్ నుంచి ఎంత ప్యాకేజ్ తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్తో కాపురం చేసేందుకు మజ్లీస్ సిద్ధమయిందని, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే.. ఒవైసీ వాళ్ల వద్దకు వెళ్తాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ ఓ రాజకీయ వ్యభిచారి అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. మద్యం అమ్మకాల్లో, నేరాల పెరుగుదలలో, దేశ ద్రోహులను పెంచడంలో, మీడియా మీద అంక్షలు పెట్టడంలో, అవినీతిలో, అబద్దాలు చెప్పడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నంబర్ 1 స్థానంలో నిలిచిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు తిరస్కరించారని.. ఈ ఎన్నికల తర్వాత సమీకరణాలు మారుతాయని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇచ్చిన 500 కోట్లతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు.. అలాగే మంగళవారం టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. తన రాజీనామా లేఖలో ప్రస్తావించిన అంశాలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అమరుల కోసం రాజీనామా చేశానని చెప్పిన విశ్వేశ్వర్రెడ్డి.. వారి కుటుంబాలకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినప్పుడు ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నించారు. కారుకు పంక్చర్ కాబోతుందనే పార్టీ మారుతున్న విశ్వేశ్వరరెడ్డి.. పెనం మీద నుంచి పొయ్యిలో పడుతున్నాడని వ్యాఖ్యానించారు. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాక పార్టీ పరిస్థితి మరింత బ్రష్టు పట్టిందని విమర్శించారు. -
రాహుల్ గాంధీతో విశ్వేశ్వర్ రెడ్డి భేటీ
-
వ్యక్తిగత కారణాలు మొదటినుంచి ఉన్నాయి!
సాక్షి, న్యూఢిల్లీ : తాజాగా టీఆర్ఎస్ పార్టీకి గుడ్బై చెప్పిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఢిల్లీలో రాహుల్ నివాసంలో ఆయనతో సమావేశమైన కొండా.. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ కుంతియాతో కలిసి కొండా రాహుల్ వద్దకు వెళ్లారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల టికెట్ ఇస్తానని తనకు హామీ ఇవ్వాలని, రాజకీయంగా తన వర్గానికి అవకాశాలు ఇవ్వాలని కొండా విశ్వేశ్వర్రెడ్డి రాహుల్ను కోరుతున్నట్టు తెలుస్తోంది. రాహుల్తో భేటీ అనంతరం విశ్వేశ్వర్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ తెలంగాణ సిద్ధాంతాలకు దూరమైందని, దానిని జీర్ణించుకోలేకనే పార్టీని వీడానని ఆయన తెలిపారు. మంత్రి మహేందర్ రెడ్డితో వ్యక్తిగత విభేదాల వల్లే పార్టీని వీడాలనే ప్రచారంలో నిజంలేదన్నారు. వ్యక్తిగత కారణాలు మొదటినుంచి ఉన్నాయని, కానీ, అందుకు మహేందర్రెడ్డితో విభేదాలు కారణం కాదన్నారు. ఈ నెల 23వ తేదీన సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతానని, కాంగ్రెస్లో చేరిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన వెల్లడించారు. ‘చేవెళ్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదు. నా నియోజకవర్గ సమస్యలు కాంగ్రెస్ పార్టీతో పరిష్కారమవుతాయని భావిస్తున్నా.రాహుల్ గాంధీతో సమావేశం మంచిగా జరిగింది. నియోజకవర్గ అంశాలు, రాష్ట్రంలోని అంశాలపై ఆయనతో మాట్లాడాను. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది’ అని తెలిపారు. కుంతియా మాట్లాడుతూ.. ఈ నెల 23న సోనియా, రాహుల్ సమక్షంలో విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని, ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని, ఆయన కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్రెడ్డి ఈనెల 23న సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో మేడ్చల్లో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. చాలా రోజులుగా కొండా టీఆర్ఎస్కు దూరమవుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే కొండా సరైన సమయం కోసం వేచిచూశారని, అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. తాను పార్టీని వీడేందుకు దారితీసిన కారణాలను తెలియజేస్తూ మూడు పేజీల లేఖ రాసిన కొండా.. రాజకీయాల్లోకి రావడం తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేనప్పటికీ అప్పటి అవసరానికి అనుగుణంగా తాను టీఆర్ఎస్లో చేరానని, క్రమంగా పార్టీలోని పరిస్థితులు తనను ఇబ్బందు లకు గురిచేశాయని, మరీ ముఖ్యంగా గత రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాలు తనను మనస్తాపానికి గురిచేశాయని తెలిపారు. తెలంగాణ వ్యతిరేకులను కేబినెట్లో చేర్చుకుని వారికే అన్ని అధికారాలు ఇచ్చారని, పార్టీలో తాను బలహీనుడిని అయిపోయానని, కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నా మాట్లాడలేని పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం సమ్మతి కాదని వెల్లడించారు. సమస్య పరిష్కారానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని, సంప్రదాయ రాజకీయ నాయకుడిలా కార్యాచరణ–సిద్ధాంతాలను, భావాలు–సెంటిమెంట్ను వేరుచేసి తాను పనిచేయలేనని, అందుకే తీవ్ర బాధాకరం అయినప్పటికీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు. క్రమంగా టీఆర్ఎస్ ప్రజలకు దూరమవుతోందని, ప్రభుత్వపరంగా ప్రజలకు అందుబాటులో లేకుండా పోతోందని కూడా ఆరోపించారు. -
టీఆర్ఎస్కు విశ్వేశ్వర్ రెడ్డి గుడ్బై
-
పార్టీలో ఏమీ మాట్లాడలేనంత బలహీనుణ్ని చేశారు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ టీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చేవెళ్ల లోక్సభ సభ్యుడు కొండా విశ్వేశ్వర్రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్కు పంపారు. తాను పార్టీని వీడేందుకు దారితీసిన కారణాలను తెలియజేస్తూ కేసీఆర్కు మూడు పేజీల లేఖ రాశారు. రాజకీయాల్లోకి రావడం తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేనప్పటికీ అప్పటి అవసరానికి అనుగుణంగా తానుటీఆర్ఎస్లో చేరానని, క్రమంగా పార్టీలోని పరిస్థితులు తనను ఇబ్బందు లకు గురిచేశాయని, మరీ ముఖ్యంగా గత రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాలు తనను మనస్తాపానికి గురిచేశాయని తెలిపారు. తెలంగాణ వ్యతిరేకులను కేబినెట్లో చేర్చుకుని వారికే అన్ని అధికారాలు ఇచ్చారని, పార్టీలో తాను బలహీనుడిని అయిపోయానని, కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నా మాట్లాడలేని పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం సమ్మతి కాదని వెల్లడించారు. సమస్య పరిష్కారానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని, సంప్రదాయ రాజకీయ నాయకుడిలా కార్యాచరణ–సిద్ధాంతాలను, భావాలు–సెంటిమెంట్ను వేరుచేసి తాను పనిచేయలేనని, అందుకే తీవ్ర బాధాకరం అయినప్పటికీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు. క్రమంగా టీఆర్ఎస్ ప్రజలకు దూరమవుతోందని, ప్రభుత్వపరంగా ప్రజలకు అందుబాటులో లేకుండా పోతోందని కూడా ఆరోపించారు. రాజీనామా లేఖలోని ముఖ్యాంశాలు... ‘తెలంగాణలోని అన్ని వర్గాలతో కలసి ప్రత్యేక రాష్ట్రం కోసం ముందుండి టీఆర్ఎస్ ఉద్యమాన్ని నడిపించింది. నన్ను టీఆర్ఎస్లో చేరాలని 2013లో మీరు (కేసీఆర్) కోరారు. కేటీఆర్ కూడా చాలాసార్లు నన్ను కలసి పార్టీ ఆశయాలు, ప్రజల ఆకాంక్షల గురించి చెప్పారు. ఆ ఆశ, ఉత్సాహంతోనే నేను పార్టీలో చేరా. మీరు నన్ను చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి పోటీచేయాలని కోరారు. ఆ సమయంలో టీఆర్ఎస్ చేవెళ్లలో ఓడిపోయే స్థితిలో ఉంది. చాలా మంది తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేదు. పట్టణ జనాభా ఉండటమే ఇందుకు కారణం. అయినా, సవాల్గా తీసుకుని విజయం సాధించా. నా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని దాదాపు అన్ని గ్రామాలు, డివిజన్లు తిరిగా. ఎంపీగా చాలా మంచి ప్రాజెక్టులు నా నియోజకవర్గానికి తీసుకువచ్చా. పార్లమెంట్లో నాలుగున్నరేళ్లలో 90 సార్లు మాట్లాడా. నాలుగు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యునిగా ఉన్నా. చాలా ఘటనల తర్వాత (ముఖ్యంగా రెండేళ్ల నుంచి) పార్టీ ప్రజల నుంచి దూరమవుతుందేమో అని అనిపిస్తోంది. ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదేమో అనే భావన కలుగుతోంది. నా అసంతృప్తికి కారణమైన ఘటనలను విశ్లేషించుకున్నా. టీఆర్ఎస్ పట్ల అన్ని వర్గాల్లో మంచి అభిప్రాయమే ఉన్నప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లోకి ఆ ఘటనలు నన్ను నెట్టేశాయి. నా రాజీనామాకు ఐదు కారణాలున్నాయి. అందులో రాష్ట్రం కోసం పోరాడిన కార్యకర్తలకు అన్యాయం జరగడంతో పాటు నా వ్యక్తిగత, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి, పార్టీలోని కారణాలున్నాయి. పార్టీకి 2014లో అవసరమైనప్పుడు నేను పోరాటం చేశా. కానీ, తెలంగాణ వ్యతిరేకులు, టీఆర్ఎస్ సైద్ధాంతిక విరోధులను కేబినెట్లో చేర్చుకుని వారికి ఎక్కువ అధికారాలు, ప్రాధాన్యత ఇచ్చారు. నాతో సహా తెలంగాణ కోసం పోరాడినవాళ్లు, పార్టీ సిద్ధాంతాలకు మేరకు పనిచేసే చాలా మంది టీఆర్ఎస్లో ఉండే అవకాశం కనిపించడం లేదు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా నేను నిస్వార్థంగా, నిజాయితీతో నిలబడ్డా. పార్టీలో బలహీనుడిని అయిపోయా. కార్యకర్తలకు నష్టం జరుగుతున్నా మాట్లాడలేని పరిస్థితి. సమస్యను పరిష్కరించుకోవాలని చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యా. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం నాకు సమ్మతి కానందున రాజీనామా చేయడమే సరైందని నిర్ణయించుకున్నా. నా లోక్సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తా. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి మీరు సాధించిన విజయాలను నేను ఎప్పటికీ గౌరవిస్తా. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన, సాధించిన నాయకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రజలు, చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ నాయకుడిగా గుర్తుంచుకుంటాయని చెప్పడానికి సంతోషిస్తున్నా. చాలా బాధాకరస్థితిలో నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. సంపద్రాయ రాజకీయ నాయకుల్లాగా నేను సిద్ధాంతం–కార్యాచరణ, భావాలు–సెంటిమెంట్ను వేరుచేసి పనిచేయలేను. ఎప్పటికీ మీతో స్నేహపూర్వక, హృదయపూర్వక సంబంధాలు కొనసాగుతాయని ఆశిస్తున్నా.’ ఈనెల 23న కాంగ్రెస్లోకి.. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్రెడ్డి ఈనెల 23న సోనియాగాంధీ సమక్షంలో మేడ్చల్లో జరిగే బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. చాలా రోజులుగా కొండా టీఆర్ఎస్కు దూరమవుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే కొండా సరైన సమయం కోసం వేచిచూశారని, అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
టీఆర్ఎస్కు విశ్వేశ్వర్ రెడ్డి గుడ్బై
-
‘టీఆర్ఎస్ను వీడటం లేదు’
సాక్షి, హైదారాబాద్ : తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో సీతారాం నాయక్ మీడియాతో మాట్లాడారు. ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు పార్టీ మారుతున్నారని రేవంత్ చెప్పడం.. పేపర్లలో రావడం.. ఓ మైండ్గేమ్లా ఉందని ఎంపీ పేర్కొన్నారు. రేవంత్కు దమ్ము, ధైర్యం ఉంటే పార్టీ మారుతున్న ఆ ఇద్దరు ఎంపీలేవరో వెల్లడించాలని సీతారాం నాయక్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి దుర్మార్గపు పనులు చేస్తున్నారని.. అవి ఆయన ఎదుగుదలకు పని చేయవు అని అన్నారు. రేవంత్ ప్రవర్తన గురించి అందరికీ తెలుసన్నారు. టీఆర్ఎస్ వీడుతున్నట్లు వస్తున్న వార్తల్ని ఆ పార్టీ మరో ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా ఖండించారు. రేవంత్ రెడ్డి కావాలనే తనపై దుష్ప్రచారాన్ని చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్తో భేటీ అనంతరం కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా విషయాన్ని ఖండించినట్లు తెలుస్తోంది. -
విద్యాభివృద్ధికి కృషి
మహేశ్వరం: విద్యాభివృద్దికి తమ వంతు కృషి చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో ఎంపీ నిధులు రూ.2.50 లక్షల నిధులతో మినరల్ వాటర్ ఫిల్టర్లను ఆయన స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ఎంపీ నిధులను వెచ్చించి పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడతానని విశ్వేశ్వర్రెడ్డి చెప్పారు. నేడు ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా మధ్యాహ్న భోజనం, రోజూ గుడ్డు, ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఉచితంగా రెండు జతల యూనిఫామ్స్, పుస్తకాలు, నోట్ బుక్స్ అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వాటి బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అంతకు ముందు ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి శారద ఒకేషనల్ కాలేజీలో స్పోకేన్ ఇంగ్లీష్ క్లాసులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు నేనావత్ ఈశ్వర్ నాయక్, వైస్ ఎంపీపీ మునగపాటి స్వప్ననవీన్, సర్పంచ్ ఆనందం, ఉప సర్పంచ్ రాములు, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
రాష్ట్రాభివృద్ధే ఆయనకు నిజమైన నివాళి
చేవెళ్ల: అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి సాధించడమే కొండా వెంకట రంగారెడ్డికి నిజమైన నివాళి అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పోరాట యోధుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి 125 వ జయంతి సందర్భంగా శనివారం చేవెళ్లలోని ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించిన అనంతరం ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో కలిపేటప్పుడే కేవీ రంగారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. అనంతరం తెలంగాణను సాధించుకోవడానికి ఆరు దశాబ్దాలు పోరాడాల్సి వచ్చిందన్నారు. -
ఎంపీకి బ్లాక్ మెయిల్: రూ.25 కోట్లు డిమాండ్
హైదరాబాద్ : ‘నామినేషన్లో ఎలక్షన్ కమిషన్కు మీరు తప్పుడు ఆస్తులు చూపించారు. మా వద్ద సాక్ష్యాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే రూ.25 కోట్లు ఇవ్వండి’ అని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి కొద్ది రోజుల క్రితం ఈమెయిల్ బెదిరింపు వచ్చింది. ఈ మేరకు సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు డెకాయి ఆపరేషన్ నిర్వహించి ముగ్గురిని రిమాండ్ చేశారు. నిందితుల్లో ఓ మాజీ ఎంపీ బంధువు ఉండడం గమనార్హం. సైబరాబాద్ క్రైమ్ ఏసీపీ జయరాం కథనం ప్రకారం..జూబ్లీహిల్స్కు చెందిన వెకంటరమణారెడ్డి, బెంగుళూరుకు చెందిన రాజేష్, కుమార్ కలిసి ఎంపీ కుమారుడు కొండా అనిధిత్రెడ్డికి డిసెంబర్ 8వ తేదీన మెయిల్ చేశారు. మీ ఆస్తుల వివరాలపై ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే రూ. 25 కోట్లు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఈ మెయిల్ను అతడు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి చూపించాడు. రెండు రోజులకు మరో మెయిల్ పెట్టారు. వరుసగా సెల్ఫోన్లో కూడా వేధించడం ప్రారంభించారు. దీంతో ఎంపీ జనవరి 8వ తేదీన సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ను కలిసి ఫిర్యాదు చేశారు. సైబర్క్రైమ్ ఇన్స్పెక్టర్ రియాజుద్దీన్ కేసు నమోదు చేసుకుని ఎస్ఐలు కె.శ్రీనివాస్, కె.విజయవర్ధన్లతో కలిసి నిందితులతో డెకాయి ఆపరేషన్ నిర్వహించారు. రూ.25 కోట్లు ఇస్తామని ముగ్గురు నిందితులను గచ్చిబౌలికి పిలిపించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
నెరవేరని ఎయిమ్స్!
* ఎంపీ కొండా ప్రయత్నం వృథా ప్రయాసే * బీబీనగర్లో ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటన సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్రెడ్డి ఒంటరి పోరు వృథా ప్రయాసగా మారింది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అఖిల భారత వైద్య, విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను జిల్లాలో స్థాపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పటికీ, పక్క జిల్లాకు తరలిపోవడం నిరాశే మిగిల్చింది. రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్ర సర్కారు తెలంగాణకు ఎయిమ్స్ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. స్వతహాగా వైద్యసంస్థలపై పట్టున్న కొండా.. ఎయిమ్స్ వస్తే మెడికల్ కాలేజీ కూడా దానంతట అదే మంజూరవుతుందని ఆశించి ఎలాగైనా ఈ సంస్థను జిల్లాలో నెలకొల్పాలనే పట్టుదల ప్రదర్శించారు. కేంద్రంతో సంప్రదింపులు.. స్థలం కేటాయిస్తే ఎయిమ్స్ను నిర్మిస్తామని పార్లమెంటులో తాను అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్రం స్పష్టం చేయడమే తరువాయి ప్రభుత్వ స్థలాల వేట కొనసాగించారు. రాజధానికి సమీపంలో శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండేలా ముచ్చర్ల, చేవెళ్ల, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించిన ఆయన ఈ అంశంపై అప్పటి కలెక్టర్ ఎన్.శ్రీధర్తో కూడా పలుమార్లు చర్చించారు. ఎంపీ ప్రతిపాదనలతో పాటు పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న జవహర్నగర్లో కూడా ఎయిమ్స్ నిర్మాణాన్ని పరిశీలించాలంటూ శ్రీధర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ క్రమంలోనే తెలంగాణకు కేటాయించిన ఎయిమ్స్ జిల్లాకు రావడం ఖాయమనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా ముచ్చర్ల భూములను ఫార్మాసిటీకి కేటాయించడం, శేరిలింగంపల్లిలోని ప్రతిపాదిత స్థలాలను వేలం వేయాలని నిర్ణయించడం ఎంపీ ఆశలపై నీళ్లుచల్లినట్లయింది. ఆఖరికి జవహర్నగర్ను కూడా పరిగణనలోకి తీసుకోని ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎయిమ్స్ను నల్గొండ జిల్లా బీబీనగర్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఆయన వర్గీయులకు తీవ్ర అసంతృప్తి కలిగించింది. కొత్త ప్రాజెక్టుల ఎంపికకు రంగారెడ్డి జిల్లాను పరిగణనలోకి తీసుకోవడం ఒక ఎత్తయితే.. కనీసం ఈ వ్యవహారంలో జిల్లా ప్రతినిధులు కలిసిరాలేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. మరోవైపు ముచ్చర్లలో ప్రతిపాదించిన ఫార్మాసిటీపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. 13వేల ఎకరాల విస్తీర్ణంలో ఔషధనగరి నిర్మిస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించినా.. ఇప్పటివరకు కనీసం 2వేల ఎకరాలను కూడా సమీకరించకపోవడం, ఫార్మా కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు తటాపటాయిస్తున్నట్లు తెలుస్తుండడంతో ప్రభుత్వంలో మునుపటి ఉత్సాహం కనిపించడంలేదు. ఈ క్రమంలోనే సర్వే పనులను కూడా నెమ్మదిగా కొనసాగిస్తోంది. -
పదవులు రాకుంటే అలిగి కూర్చోను..
తాండూరు: జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీలో తన ముద్ర ఉంటుందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. తాండూరుకు ఎంపీడీఓ అతిథిగృహంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కీలకపాత్ర పోషించిన టీఆర్ఎస్ నాయకులతోపాటు ఉద్యమకారులకు నామినేటెడ్ పదవుల పంపకంలో తెలంగాణ సర్కారు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జిల్లాలో నామినేటెడ్ పదువుల పంపకంలో ఉద్యమంలో పనిచేసిన నాయకులు అవకాశాలు దక్కేలా తన వంతు కృషిచేస్తానన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్లతో కూడా మాట్లాడతానన్నారు. జిల్లాలో నామినేటెడ్ ‘పదవుల భర్తీలో నా ముద్ర లేకపోతే.. అలిగి కూర్చోను’ అని ఆయన స్పష్టం చేశారు. జిల్లా మంత్రి మహేందర్రెడ్డికి ఎంపీగా తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. తనకూ మంత్రి సహకారం ఉండాలన్నారు. మంత్రి, తాను కలిసి జిల్లాలో ఇప్పటివరకు అభివృద్ధి కార్యక్రమాలను మొదలుపెట్టలేదని చెప్పారు. కొంతవరకు సమన్వయ ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఎంపీగా గెలిచిన తరువాత పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున జిల్లాలో ఎక్కువగా పర్యటించలేదన్నారు. పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలకు సమస్యలపై ప్రస్తావించేందుకు బీజేపీ ప్రభుత్వం అవకాశం బాగానే ఇస్తుందన్నారు. టీడీపీతో సన్నిహితంగా ఉన్నప్పటికీ మోడీ సర్కారు టీఆర్ఎస్ ఎంపీలనుపక్షపాత ధోరణితో చూడటం లేదన్నారు. పార్లమెంటరీ వ్యవహారాలు, నిధుల మంజూరు తదితర పాలసీ రీసెర్చ్ కోసం 546 మంది ఎంపీల్లో కేవలం 49 మంది ఎంపీలకు పీఆర్ఎస్ (పార్లమెంట్ రీసెర్చ్ స్టడీస్) ప్రత్యేకంగా స్టూడెంట్లను కేంద్ర సర్కారు అటాచ్ చేసిందన్నారు. కోట్పల్లి ప్రాజెక్టు నుంచి తాండూరు పట్టణానికి సు మారు రూ.80 కోట్ల నిధుల మంజూరు, కాగ్నాలో చెక్డ్యాం నిర్మాణం, పాత తాండూరులో రైల్వే ఓవర్/అండర్ బ్రిడ్జి నిర్మాణం తదితర అభివృద్ధి పనుల పూర్తి చేయించడానికి పార్లమెంట్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తానన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నేతలు నాగేందర్, కనకయ్య, బైండ్ల విజయ్, పుల్లా బిచ్చిరెడ్డి, రాంలింగారెడ్డి, సిరిగిరిపేట్ శేఖర్, వీరమణి, మహేందర్, దత్తు, నబీ, చావూస్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీని పలువురు నాయకులు సన్మానించారు. -
కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పండి
చేవెళ్ల లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి షాబాద్, న్యూస్లైన్: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని చేవెళ్ల పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని నాగరగూడ, షాబాద్, కక్కులూర్, హైతాబాద్, మద్దూర్ తదితర గ్రామాల్లో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్న హోంమంత్రి స్థానంలో ఉండి కూడా సబితారెడ్డి పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు తన కుమారుడు కార్తీక్రెడ్డిని ఎంపీగా గెలిపించడంటూ ప్రజల వద్దకు ఆమె వస్తున్నారని ఎద్దేవ చేశారు. బీజేపీకి ఓటేస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నించిన చంద్రబాబుకు వేసినట్లేనని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 111జీఓను ఎత్తివేస్తామని, ఫిరంగి నాలాను పునరుద్ధరించి ఇబ్రహీంపట్నం వరకు తాగు, సాగు నీరు అందజేస్తామని చెప్పారు. జూరాల నుంచి జిల్లాకు నీటిని తీసుకువస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కడ్మూర్ ఆనందం, మద్దూర్ మల్లేశ్, శ్రీనివాస్గౌడ్, రాజేందర్గౌడ్, ఈదుల నర్సింలుగౌడ్, మహేందర్గౌడ్, వెంకటయ్య, జీవన్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, సుధాకర్రెడ్డి, శ్రీరాంరెడ్డి, మధుసూదన్రెడ్డి, దర్శన్, గోపాల్రెడ్డి, రాఘవరెడ్డి, కుమ్మరి దర్శన్, మల్లిఖార్జున్ తదితరులున్నారు. నాగరగూడలో పోటాపోటీ ప్రచారం మండల పరిధిలోని నాగరగూడలో శనివారం ఉదయం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి, చేవెళ్ల ఇండిపెండెంట్ అభ్యర్థి దేశమళ్ల ఆంజనేయులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ముందుగా అక్కడికి చేరుకున్న విశ్వేశ్వర్రెడ్డి ప్రచారం సాగిస్తుండగానే ఆంజనేయులు కూడా వచ్చి ప్రచారం చేశారు. -
నేడు చేవెళ్లలో కేసీఆర్ సభ
చేవెళ్ల, న్యూస్లైన్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు చేవెళ్లలో నిర్వహించే ఎన్నికల సభలో పాల్గొననున్నారు. శనివారం సాయంత్రం 5గంటలకు సభ ప్రారంభం కానుంది. సభ ఏర్పాట్లను చేవెళ్ల లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి కేఎస్ రత్నం పరిశీలించారు. కేసీఆర్ నగరం నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా చేవెళ్లకు చేరుకుంటారు. స్థానిక ఇంద్రారెడ్డి స్మారక ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో నిర్వహించే బహిరంగసభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సభాస్థలికి కొద్ది దూరంలోని కొండా వెంకటరంగారెడ్డి మైదానంలో హెలిపాడ్ నిర్మాణపనులు చేపట్టారు. కేసీఆర్ జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నందున భద్రతా ఏర్పాట్లను, సభ ప్రాంగణం, హెలిపాడ్ నిర్మాణ పనులను అడిషనల్ ఎస్పీ పీ. వెంకటస్వామి, చేవెళ్ల డీఎస్పీ సీహెచ్ శ్రీదర్, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ లక్ష్మీరెడ్డి పరిశీలించారు. -
పునర్నిర్మాణం టీఆర్ఎస్తోనే సాధ్యం
మర్పల్లి, న్యూస్లైన్: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కె.చంద్రశేఖర్రావు స్థాపించిన టీఆర్ఎస్ దశాబ్దానికి పైగా సాగించిన ఉద్యమం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని ఆ పార్టీ చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం మర్పల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాలులో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వికారాబాద్ శాసనసభ స్థానం నుంచి పార్టీ తరఫున పోటీ చేస్తున్న బి.సంజీవరావు, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డిలతో కలిసి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఉద్యమం తీవ్రమవడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు. ఏర్పాటైన ప్రత్యేక రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని, ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్కే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అన్ని రంగాల అభివృద్ధికి కేసీఆర్ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారని చెప్పారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కు అండగా నిలవాలని, అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులను ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిపించి టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకు రావాలని కోరారు. వికారాబాద్ అసెంబ్లీ పార్టీ అభ్యర్థి సంజీవరావు మాట్లాడుతూ ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో పార్లమెంటుకు, శాసనసభకు పోటీచేస్తున్న తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ నరేందర్రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కనకయ్య, పార్టీ మండల అధ్యక్షుడు మల్లయ్య, ప్రధాన కార్యదర్శి బాల్రెడ్డి, నాయకులు అబ్రహం, చంద్రయ్య, పలు గ్రామాల సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకు ముందు పలువురు ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.