Land kabza
-
పల్లా రాజేశ్వర్ రెడ్డి కబ్జా చేశాడంటూ స్థానికుల ఆందోళన
-
Kokapet: రూ.100 కోట్ల స్థలానికి ఎసరు!
సాక్షి, హైదరాబాద్: కోకాపేట్లో సుమారు రూ.100 కోట్ల విలువైన స్థలంలో పాగా వేసేందుకు కబ్జారాయుళ్లు పన్నిన పథకా న్ని హెచ్ఎండీఏ అధికారులు అడ్డుకున్నారు. కోకాపేట్లోని సర్వే నంబర్ 117లో ఉన్న 2.5 ఎకరాల హెచ్ఎండీఏ స్థలంలో కొందరు వ్యక్తులు అక్రమంగా కంటైనర్లు, డబ్బాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్, ఎస్టేట్ అధికారులు వాటిని గుర్తించి తొలగించారు. హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ జానకీరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడు ల్లో ఎస్టేట్ విభాగం ఉద్యోగులు, ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు పాల్గొన్నారు. ఇటీవల మియాపూర్లో హెచ్ఎండీఏ స్థలాల్లో నిరి్మంచిన అక్రమ కట్టడాలపైన ఉక్కు పాదాన్ని మోపిన సంగతి తెలిసిందే. అక్కడ పెద్ద ఎత్తున రక్షణ చర్యలు చేపట్టారు. ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు అన్ని ప్రాంతాల్లో హెచ్ఎండీఏ భూములను జియోఫెన్సింగ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
సాక్షి, అమరావతి: ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారాన్ని కొనసాగించేందుకు చంద్రబాబు వదిలిన బుల్ బుల్ పిట్ట బోల్తా కొట్టింది. టీడీపీ గూటి చిలుక, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్తో సోషల్ మీడియాలో చంద్రబాబు సాగించిన దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే పచ్చ ముఠా సభ్యుడైన ఆయన చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగి అడ్డంగా దొరికిపోయారు. తన తండ్రి నుంచి వారసత్వంగా వస్తున్న భూములకు మ్యుటేషన్ చేయడంలేదని, అందుకు ల్యాండ్ టైట్లింగ్ చట్టమే కారణమనే భావన కలిగిస్తూ అసత్య ఆరోపణలు చేశారు. దీంతో నెటిజన్లు ఆయనపై విరుచుకుపడ్డారు. అసలు ఇంకా అమలులోకి రాని చట్టం దుర్వినియోగం కావడం ఏమిటంటూ మండిపడ్డారు. మరోవైపు తీగ లాగితే డొంక కదిలింది. ఆయన చెబుతున్న 11.04 ఎకరాల భూమిని పీవీ రమేశ్ కుటుంబం కబ్జా చేసిందన్న విషయం ఆధారాలతో సహా బయటç³డింది. ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు భూమలు కబ్జా చేసేసి, న్యాయస్థానం తీర్పును కూడా ధిక్కరిస్తున్న పీవీ రమేశ్ బరితెగింపు బట్టబయలైంది.పీవీ రమేశ్ కుటుంబమే భూ దొంగపీవీ రమేశ్ చేసిన దుష్ప్రచారం ఆయన కుటుంబం భూ కబ్జాను కూడా వెలుగులోకి తెచ్చింది. ఏ భూమి గురించి అయితే పీవీ రమేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారో.. ఆ భూమి ఆయన కుటుంబం కబ్జా చేసిందన్న విషయం కూడా బయటపడిపోయింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం విన్నకోటలో 25ఏళ్ల క్రితం పలువురు రైతులు తమ భూములను కలిపి దాదాపు 100 ఎకరాల్లో చెరువు తవ్వి సహకార వ్యవసాయం తరహాలో చేపల సాగు చేపట్టారు. ఈ భూముల్లో పీవీ రమేశ్ తండ్రి పెనుమాక సుబ్బారావుకు చెందినవి 11.04 ఎకరాలు ఉన్నాయి. కానీ వాటిలో 3.29 ఎకరాల అసైన్డ్ భూమి, 0.29 ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు తన భూమి కూడా ఉందని గాలంకి నాగేంద్ర అనే వ్యక్తి న్యాయస్థానంలో గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం పెనుమాక సుబ్బారావు ఆక్రమించిన భూమిని తిరిగి ఇచ్చేయాలని 2022లోనే తీర్పునిచ్చింది. పీవీ రమేశ్ పరపతికి భయపడి ఆ తీర్పును అధికారులు అమలు చేయలేకపోయారు. దాంతో బాధితుడు నాగేంద్ర కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉంది. అంటే పీవీ రమేశ్ ఆయన తండ్రి నుంచి వచ్చిన వారసత్వ భూమిగా చెబుతున్న 11.04 ఎకరాలు ఆయన కుటుంబం కబ్జా చేసిన భూమి అన్న విషయం బయటపడింది.కబ్జా భూమికి మ్యుటేషన్ సాధ్యం కాదన్న అధికారులుఅయినా సరే తమ కుటుంబం కబ్జా చేసిన భూములను తమ పేరిట మ్యుటేషన్ చేయాలని పీవీ రమేశ్ యత్నించడం గమనార్హం. ఆ మేరకు ఆయన 2023 డిసెంబర్ 16న రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. తన తండ్రి పెనుమాక సుబ్బారావు మరణించినందున ఆయన పేరిట ఉన్న భూములను తమ పేరిట మ్యుటేషన్ చేయాలని కోరారు. అప్పటికే ఆ భూములపై న్యాయ వివాదం ఉందన్న విషయం రెవెన్యూ అధికారులకు తెలుసు. కబ్జా భూములను ఖాళీ చేయాల్సింది పోయి, మ్యుటేషన్ చేయాలని కోరడంతో పీవీ రమేశ్ దరఖాస్తును తిరస్కరిస్తున్నట్టు 2023 డిసెంబర్ 30న అధికారులు ఆయనకు లిఖితపూర్వకంగా తెలిపారు.తొందరపడి అబద్ధం కూసి.. ఆపై మరోపోస్టు పెట్టివైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే చంద్రబాబు కుట్రలో పాత్రధారి అయిన పీవీ రమేశ్ సోమవారం ఉదయం సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్టు పెట్టారు. ‘తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూములను మ్యుటేషన్ చేయడానికి రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహశీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే ఆర్డీవో తిరిగి ఇచ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. ఓ ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు సేవ చేసిన ఓ అధికారి పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్య రైతుల దుస్థితి ఊహించలేం’ అంటూ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూహక్కు చట్టం (ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్)పై దుష్ప్రచారం చేయాలన్న చంద్రబాబు కుట్రను పక్కాగా అమలు చేశారు. ప్రజల్ని తప్పుదారి పట్టించాలన్న దుర్బుద్ధితో పీవీ రమేశ్.. అసలు ఆ చట్టం రాష్ట్రంలో ఇంకా అమల్లోకి రాలేదన్న అసలు విషయాన్ని విస్మరించారు. వెంటనే నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. చట్టం ఇంకా అమల్లోకి రాకముందే ఎలా దుర్వినియోగం అవుతోందని అంటారు అంటూ నిలదీశారు. దాంతో బండారం బయటపడుతుందన్న ఆందోళనతో పీవీ రమేశ్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో తన పోస్టును ఎడిట్ చేశారు. ‘చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులేకుండా చేస్తున్నారు’ అంటూ పోస్టులో మార్పు చేశారు.ఆయన తండ్రిపై వరకట్న వేధింపుల కేసు కూడాపీవీ రమేశ్ తండ్రి పెనుమాక సుబ్బారావు భూముల కబ్జాకు పాల్పడటమే కాదు.. ఆయనపై క్రిమినల్ కేసులు కూడా గతంలో నమోదు కావడం గమనార్హం. కట్నం కోసం కోడల్ని మానసికంగా, శారీరకంగా హింసించారన్న కారణంతో ఆయనపై విజయవాడ పోలీసులు 2018లో వరకట్న వేధింపుల కేసు నమోదు చేసిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. పీవీ రమేశ్ సోదరుడు రాజశేఖర్ జోషి భార్య పెనుమాక సంధ్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 1999లో తన పెళ్లి సమయంలో రూ.2 లక్షల కట్నం, నాలుగు ఎకరాల మామిడి తోట, కారు కట్నంగా ఇచ్చినప్పటికీ అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు పిల్లల తల్లినైన తనను వేధిస్తున్నారంటూ భర్త పెనుమాక రాజశేఖర్ జోషి, మామగారు పెనుమాక సుబ్బారావు, అత్తగారు పెనుమాక మణిలపై ఆమె ఫిర్యాదు చేశారు. దాంతో ఆ ముగ్గురిపై పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. భూముల రీ సర్వేకు పీవీ రమేశ్ కుటుంబం హాజరు కాలేదని, కబ్జా చేసిన భూమిని పీవీ రమేశ్ పేరిట మ్యుటేషన్ చేయటం సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు రీసర్వేకు ముఖం చాటేసిన పీవీ రమేశ్అంతేకాదు.. తమ భూకబ్జా బాగోతం బయటపడుతుందనే ఉద్దేశంతోనే పీవీ రమేశ్ రెవెన్యూ అధికారుల రీ సర్వేకు ముఖం చాటేశారు. పీవీ రమేశ్ చెబుతున్న చెరువు భూముల్లో కూడా రీసర్వే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. తద్వారా ఆ రైతుల భూములకు హద్దులను నిర్ణయించి వారి పేరిట పత్రాలు ఇవ్వాలని భావించారు. అందుకోసం ఈ ఏడాది (2024) ఫిబ్రవరి 26న కృష్ణా జిల్లా కలెక్టర్ జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీని కూడా నియమించారు. దాంతో గుడివాడ ఆర్డీవో ఆ చెరువు భూముల్లో 2024 మార్చి 5న నిర్వహించనున్న ఉమ్మడి సర్వేకు హాజరుకావాలని, ఇందుకు భూముల ఒరిజినల్ పత్రాలను తీసుకురావాలని భూ యజమానులు, రిట్ పిటిషన్లు దాఖలు చేసినవారందరికీ నోటీసులు జారీ చేశారు. పీవీ రమేశ్ కుటుంబానికి కూడా నోటీసులు జారీ చేశారు. ఆ రోజున రైతులందరూ వచ్చారు. వారి భూముల పత్రాలను చూపించి రీ సర్వేకు సహకరించారు. కానీ పీవీ రమేశ్ గానీ ఆయన కుటుంబ సభ్యులుగానీ ఆ రీ సర్వేకు హాజరు కాలేదు. రెవెన్యూ అధికారులు ఎన్ని సార్లు ఫోన్లు చేసినా, వాట్సాప్ ద్వారా సందేశాలు పంపినా వారు హాజరుకాలేదు. దాంతో అందరు రైతులు వచ్చి పత్రాలు చూపించే వరకు రీసర్వే పూర్తి చేయడం సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. అదీ పీవీ రమేశ్ కుటుంబ భూకబ్జా బాగోతం. -
రోడ్డు స్వరూపం మార్చేశారు!
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ శివార్లలోని బుద్వేల్లో దళితులకు చెందాల్సిన 26 ఎకరాల భూమి కబ్జా చేశారనే కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేత, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన కొత్తగా వేస్తున్న వెంచర్ కోసం గతంలో నిర్మించిన విల్లాల్లోని ప్రైవేటు రోడ్డు పబ్లిక్ రోడ్డుగా స్వరూపం మార్చేశారు. అలాగే ఓ నాలాపై అనుమతుల్లేకుండానే వంతెన నిర్మించారు. ఈ అక్రమాలపై రామ్దేవ్గూడలోని వెస్సెల్లా మెడోస్ నివాసితులు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదై దర్యాప్తు మొదలవడంతో దిగివచ్చిన శివానందరెడ్డి... తన తప్పులు సరిదిద్దుకొనేలా జీహెచ్ఎంసీకి మరో దరఖాస్తు చేశారు. ఈ వ్యవహారం మొత్తంలో అధికారుల ఉదాశీనత, శివానందరెడ్డి లాబీయింగ్ స్పష్టంగా కనిపిస్తోందని వెస్సెల్లా మెడోస్ నివాసితులు చెబుతున్నారు. కొత్త వెంచర్కు రోడ్డు లేక... మాండ్ర శివానందరెడ్డి సీఈఓగా ఉన్న వెస్సెల్లా గ్రూప్ రామ్దేవ్గూడ ప్రధాన మార్గంలో తారామతి–బారాదరి ఎదురుగా 38 ఎకరాల్లో వెస్సల్లా మెడోస్ పేరుతో 295 త్రీ, ఫోర్, ఫైవ్ బీహెచ్కే విల్లాలు నిర్మించడానికి 2017లో జీహెచ్ఎంసీ నుంచి అనుమతి తీసుకుంది. అప్పట్లో ఈ విల్లాస్ లోపల రెండు అంతర్గత ప్రైవేటురోడ్లు ఉండేలా రూపొందించిన ప్లాన్కే అధికారులు అనుమతి ఇచ్చారు. కొన్నాళ్ల క్రితం వెస్సెల్లా గ్రూప్ పాత వెంచర్కు వెనుక వైపు నాలా పక్కన మరో 9 ఎకరాల్లో మరో వెంచర్ మొదలుపెట్టింది. ప్రధాన రహదారి నుంచి ఈ వెంచర్కు చేరుకోవాలంటే సమీప మార్గం లేదు. ఈ నేపథ్యంలోనే శివానందరెడ్డి మరో కుట్రకు తెరలేపారు. వెస్సెల్లా మెడోస్లో ఉన్న రెండు ప్రైవేట్ రహదారుల్లో ఒకదాన్ని పబ్లిక్ రోడ్డుగా అక్రమంగా మార్చేశారు. ఈ మేరకు రివైజ్డ్ ప్లాన్తో 2022లో జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని అధికారులు ఆమోదించడంతో వెస్సెల్లా మెడోస్లోని ప్రైవేట్ రోడ్డు పబ్లిక్ రోడ్డుగా మారిపోయి వెనుక ఉన్న 9 ఎకరాల వెంచర్ను ప్రధాన రహదారికి దగ్గర చేసింది. ఈ రెండు వెంచర్ల మధ్య ఓ నాలా ఉండటంతో ఇరిగేషన్ విభాగం సహా ఎవరి అనుమతి లేకుండానే ఆయన దానిపై వంతెన నిర్మించారు. బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి.. వెస్సెల్లా మెడోస్ శాంక్షన్డ్ ప్లాన్కు విరుద్ధంగా తమ ప్రైవేటు రోడ్డును పబ్లిక్ రోడ్డుగా శివానందరెడ్డి మార్చేసినట్లు నివాసితులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలిసింది. దీంతో 6 విల్లాలకు చెందిన యజమానులు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఐపీసీలోని 420, 406 సెక్షన్ల కింద అదే నెల 8న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు నమోదు కాకుండా చూసేందుకు శతవిధాలా శివానందరెడ్డి ప్రయత్నించినప్పటికీ ఉన్నతాధికారుల జోక్యంతో కేసు నమోదై దర్యాప్తు ప్రారంభం కావడంతో ఆయన హైకోర్డును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ వేశారు. తనపై కేసు కొట్టేయాల్సిందిగా కోరారు. దీనికి అంగీకరించని న్యాయస్థానం... నిందితులకు సీఆరీ్పసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించి కేసు దర్యాప్తు కొనసాగించాలని స్పష్టం చేసింది. దీంతో గత్యంతరం లేక శివానందరెడ్డి వెస్సెల్లా మెడోస్కు సంబంధించి తాను సమర్పించిన రివైజ్డ్ ప్లాన్ను రద్దు చేయాలంటూ జీహెచ్ఎంసీకి మరో దరఖాస్తు సమర్పించినట్లు తెలిసింది. కాగా, జీహెచ్ఎంసీ అధికారులను మోసం చేసి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఈ కేసులో శివానందరెడ్డిపై పోలీసులు అదనపు సెక్షన్లు జోడించాలని వెస్సెల్లా మెడోస్ నివాసితుడు ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ కోరారు. -
రామోజీరావు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు: గోనె ప్రకాశ్
-
అల్లూరయ్య అక్రమాలు.. టీడీపీ ముఖ్యనేత సతీమణికి భారీగా అవినీతి సొమ్ము
తీగలాగితే డొంక కదిలినట్లు.. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ఓ చిరుద్యోగి ఇంట్లో సోదాలు చేస్తే మాజీ మంత్రి బొజ్జల అనుచరుల అక్రమాల పర్వం వెలుగుచూసింది. రాజీవ్నగర్లో నిరుపేదలకు కేటాయించిన స్థలాలను ఇష్టారాజ్యంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్న వైనం పట్టణ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో పురపాలక ఉద్యోగి అల్లూరయ్యను అడ్డుపెట్టుకుని కొందరు టీడీపీ నాయకులు యథేచ్ఛగా ప్లాట్లు విక్రయించేశారనే విషయం తెలియడంతో లబి్ధదారులు లబోదిబోమంటున్నారు. మాయమాటలు చెప్పి తమ పట్టాలు తీసుకుని ఫోర్జరీ సంతకాలతో తెగనమ్మేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా మరికొందరు పచ్చనేతలు అందినకాడికి స్థలాలను ఆక్రమించుకున్నట్లు ఆరోపిస్తున్నారు. శ్రీకాళహస్తిలో దివంగత నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాళహస్తి– పిచ్చాటూరు మార్గంలో మంచి డిమాండ్ ఉన్న రాజీవ్ నగర్ కాలనీలోని ప్లాట్లను బొజ్జల అనుచరులు ఒక్కొక్కటిగా అమ్ముకుని సొమ్ముచేసుకున్నారు. అసలైన లబ్ధిదారుల సంతకాలను ఫోర్జరీ చేసి విక్రయించుకుంటున్నారు. మంగళవారం రాత్రి శ్రీకాళహస్తిలో అల్లూరయ్య అనే మున్సిల్ ఉద్యోగి నివాసంలో అధికారులు చేపట్టిన సోదాలో బయటపడ్డ పట్టాలే ఇందుకు నిదర్శనం. సాక్షి, తిరుపతి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాజీవ్నగర్ కాలనీ పేరుతో ఇల్లులేని పేదలకు గూడు కల్పించాలని నిర్ణయించారు. శ్రీకాళహస్తి– పిచ్చాటూరు మార్గంలో అందుకు అవసరమైన భూములను సేకరించారు. సుమారు 6వేల మంది పేదలకు రెండు సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. పక్కాగృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో రాజీవ్ నగర్ అభివృద్ధి అటకెక్కింది. తర్వాత ప్రభుత్వాలు రోడ్లు, తాగునీరు తదితర మౌలిక కలి్పంచకపోవటంతో అక్కడ ఇల్లు కట్టుకునేందుకు లబి్ధదారులు సైతం పెద్దగా ఆసక్తి చూపలేదు. అదే సమయంలో హౌసింగ్శాఖలో కాంట్రాక్టు కింద పనిచేస్తున్న అల్లూరయ్య మాయమాటలు చెప్పి లబి్ధదారుల పట్టాలను తీసిపెట్టుకున్నాడు. అరాకొర ధరలకే కొన్ని ప్లాట్లను అమ్ముకుని జేబులో వేసుకున్నాడు. ఈ విషయం అప్పట్లోనే బయటపడడంతో నాటి ప్రభుత్వం వెంటనే అల్లూరయ్యను ఉద్యోగం నుంచి తొలగించింది. టీడీపీ హయాంలో రెచ్చిపోయి.. టీడీపీ ప్రభుత్వంలో అల్లూరయ్య శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. తొలుత అటెండర్గా చేరి అవినీతి పర్వానికి తెరతీశాడు. ఆ సమయంలోనే 30 మంది మున్సిపల్ ఉద్యోగుల పీఎఫ్ సొమ్మును కాజేశాడనే ఆరోపణలతో సస్పెండయ్యాడు. అయితే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ ముఖ్య నేత సతీమణికి రూ.20లక్షలు ముట్టజెప్పి, 2018లో అదే కార్యాలయంలో జూనియర్ అసిప్టెంట్గా ఉద్యోగం పొందాడు. ఇక అప్పటి నుంచి మున్సిపల్ ఆఫీస్లో అల్లూరయ్య ఆడింది ఆట.. పాడింది పాటగా మారిపోయింది. అదే సమయంలో అల్లూరయ్య వద్ద ఉన్న ఇంటి పట్టాల విషయం తెలుసుకున్న మాజీ మంత్రి బొజ్జల అనుచరులు నలుగురు రంగంలోకి దిగారు. లబి్ధదారుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ.100 డాక్యుమెంట్లు సిద్ధం చేసుకున్నారు. దొరికిన స్థలాలను దొరికినట్లు ఇష్టారాజ్యంగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. వందలాది పట్టాలు వెలుగులోకి.. రాజీవన్నగర్లో నాడు రూ.30వేలు ఉన్న ఇంటి స్థలం.. నేడు రూ.5లక్షలకు చేరడంతో అల్లూరయ్య దగ్గర ఉన్న పట్టాలను టీడీపీ నేతలు బయటకు తీయించారు. తాము ఇది వరకే సిద్ధం చేసుకున్న రూ.100 డాక్యుమెంట్లను చూపించి కొనుగోలుదారులను బురిడీ కొట్టించడం ప్రారంభించారు. తమకు నగదు అవసరమని, అందుకే రూ.5లక్షల ప్లాటుని రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకే ఇచ్చేస్తున్నామని ప్రచారం చేపట్టారు. ఆ ప్రాంతంలో పెరిగిన డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరకే ప్లాటు వస్తుందని స్థానికులు పెద్దసంఖ్యలో కొనుగోలు చేశారు. ఇలా సుమారు వెయ్యి ప్లాట్ల వరకు విక్రయించినట్లు తెలిసింది. ఇవి కాకుండా అల్లూరయ్య ఇంట్లో అధికారులు జరిపిన సోదాల్లో మరో 2,309 పట్టాలు దొరకడం గమనార్హం. టీడీపీలోని నలుగురు నేతలు, అల్లూరయ్య చేస్తున్న అక్రమాలను తెలుసుకున్న మరికొందరు ఆ పార్టీ నాయకులు కూడా ఒక్కొక్కరు 5 నుంచి 10 ప్లాట్ల వరకు ఆక్రమించుకున్నట్లు సమాచారం. భాగోతం బట్టబయలు! రాజీవ్నగర్లో ఇంటి స్థలాలకు రేటు పలకుతుండడంతో అల్లూరయ్య దగ్గర పట్టాలు ఇచ్చిన లబి్ధదారుల్లో కదలిక వచ్చింది. తమ పట్టాలను వెంటనే ఇవ్వాలని అల్లూరయ్యను కోరారు. అయితే తన వద్ద ఎలాంటి పట్టాలు లేవని తెగేసి చెప్పడంతో ఖంగుతిన్నారు. ఈ విషయాన్ని వెంటనే ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి విచారణకు ఆదేశించడంతో బొజ్జల అనుచరుల భాగోతం బట్టబయలైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పెరిగిన డిమాండ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక శ్రీకాళహస్తి– పిచ్చాటూరు మార్గం అభివృద్ధి పథంలో పయనించింది. అక్కడ జగనన్న కాలనీ పేరుతో 2 వేల మందికి పైగా పక్కాఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. లే అవుట్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి సైతం ఆ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నవరత్నాల ఆలయాన్ని నిర్మించారు. జగన్న కాలనీకి ఎదురుగానే ఉన్న రాజీవ్నగర్కి పైన కొండచుట్టు కోసం ‘దేవుడి బాట’ పేరుతో 20 కిలోమీటర్ల రహదారి ఏర్పాటు చేశారు. కాలనీకి పకడ్బందీగా నీటి సౌకర్యం కలి్పంచారు. దీంతో రాజీవ్నగర్ కాలనీలోని ప్లాట్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. -
Sabbam Hari: లాన్ వెనక మాస్టర్ ప్లాన్?.. ఎవరీ అప్పారావు...?
సాక్షి, విశాఖపట్నం: సబ్బు బిళ్ల.. కుక్క పిల్ల కాదేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ. గెడ్డలు, పార్కు స్థలాలు.. కావేవీ ఇంటి నెంబర్లను కేటాయించేందుకు అనర్హం అన్నట్టు జీవీఎంసీ తయారైంది. పదేళ్లుగా మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి వెనక తూర్పున గల ఖాళీ స్థలంలో రెండు షెడ్లు ఉన్నట్టుగా పేర్కొని ఏకంగా ఇంటి నెంబర్లను కూడా జీవీఎంసీ కేటాయించింది. అప్పారావు పేరు మీద 355 గజాల స్థలానికి 50–1–40/18(3), 50–1–40/(4) ఇంటి నెంబర్లను ఇచ్చింది. ఈ స్థలం విలువ మార్కెట్లో రూ.5 కోట్ల పైమాటే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ స్థలాన్ని విక్రయించేందుకు కొద్ది మంది రంగంలోకి దిగినట్టు సమాచారం. కేవలం ఇంటి నెంబర్లతో పాటు 1980 ప్రాంతంలో అగ్రిమెంటు చేసుకున్న కాగితాలతోనే ఈ స్థలాన్ని విక్రయించేందుకు పావులు కదులుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో అసలు ఖాళీ స్థలంలో షెడ్లు ఉన్నట్టుగా ఇంటి నెంబర్లు ఎలా ఇచ్చారు? ప్లాన్ అనుమతి తీసుకున్నారా? తీసుకుంటే అసలు ఇళ్లు ఎక్కడకు వెళ్లాయి? అనే వివరాల లోతుల్లోకి వెళితే అసలు వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సబ్బం హరి ఇంటి ప్లాన్లో కూడా అప్పారావుకు షెడ్డు ఉన్నట్లు చూపించారు. ఎవరీ అప్పారావు...? వాస్తవానికి సీతమ్మధారలోని సబ్బం హరి ఇంటి వెనకాల తూర్పు వైపున లాన్ ఉంది. దీనికి ఆనుకుని జీవీఎంసీ పార్కు ఉంది. ఇన్ని రోజులుగా ఈ లాన్ మొత్తం సబ్బం హరి ఇంటి ఆవరణ భాగమని అందరూ అనుకున్నారు. ఈ స్థలం కాస్తా ఎం.అప్పారావు పేరు మీద ఉంది. తాజాగా సబ్బం హరి తీసుకున్న రుణంపై ఆయన ఆస్తులను అటాచ్ చేసుకుంటామంటూ న్యాయవాది ద్వారా వచ్చిన ప్రకటనలోనూ సబ్బం హరి ఇంటికి తూర్పు భాగంలో ఉన్న స్థలం అప్పారావుకు చెందిన షెడ్లుగా పేర్కొన్నారు. అయితే, ఇంతకీ ఎవరీ అప్పారావు అంటే సబ్బం హరికి శిష్యుడుగా ఉండేవారని తెలుస్తోంది. తన స్థలాన్ని ఇన్ని రోజులుగా లాన్గా ఉపయోగించుకుంటున్నా అప్పారావు ఎందుకు మిన్నకుండిపోతున్నారు? అసలు షెడ్లు లేకపోయినప్పటికీ పదేళ్లకుపైగా ఎందుకు అప్పారావు ఇంటి పన్ను చెల్లిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలంటే మొదటగా జీవీఎంసీకి ప్లాన్ ఇచ్చి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జీవీఎంసీకి చెందిన పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది ఇవేవీ లేకుండానే అప్పట్లో ఇంటి నెంబర్లను ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జీవీఎంసీ అధికారులు విచారణ చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.5 కోట్ల స్థలంపై కన్ను...! ఇన్ని రోజులు ఇంటి లాన్గా ఉపయోగించుకుంటున్న స్థలం తమదేనని సబ్బం హరి కుటుంబీకులు భావిస్తున్నారు. సబ్బం హరి మరణం తర్వాత కూడా ఇదంతా తమ స్థలమేనని భ్రమలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, తాజాగా కోర్టు నుంచి అటాచ్మెంట్ వ్యవహారంలో తమ ఇంటి సరిహద్దుల్లో తూర్పువైపు అప్పారావు షెడ్లు ఉన్నట్టు చూపించారు. తీరా చూస్తే తూర్పు వైపునకు లాన్కు ఆనుకుని జీవీఎంసీ పార్కు మాత్రమే ఉంది. దీనితో అసలు వ్యవహారాన్ని కొద్ది మంది డాక్యుమెంట్లతో సహా వెలికితీసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రూ.5 కోట్లకుపైగా విలువ చేసే ఈ 355 గజాల స్థలాన్ని తక్కువ ధరకు తమ చేతుల్లోకి తీసుకునేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సబ్బం హరి కుటుంబీకుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఈ స్థలం వ్యవహారంపై మరింత లోతుల్లోకి వెళ్లి జీవీఎంసీ రికార్డులను పరిశీలిస్తే ఇన్ని రోజులుగా లాన్గా ఉపయోగించుకుంటూ అనుభవించిన సబ్బం హరి కుటుంబీకుల పాత్ర ఉందా? ఇంకా తెరవెనుక ఎవరైనా ఉన్నారా అనే విషయం తేలనుంది. -
అర్ధరాత్రి పూట స్టేలు అవసరం ఏముంది: సన్యాసి పాత్రుడు
సాక్షి, అనకాపల్లి: వందల ఎకరాలు దానం చేశామని చెప్పుకుంటున్న అయ్యన్న రెండు సెంట్లు స్థలం కోసం ఎందుకు కక్కుర్తి పడుతున్నాడో అర్థం కావడం లేదని ఆయన సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు అన్నారు. ఈ మేరకు నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఆక్రమించిన రెండు సెంట్లు స్థలం రావనపల్లి రిజర్వాయర్ కాలువకు సంబంధించింది. అయ్యన్న ఆక్రమించిన స్థలంపై రిజర్వాయర్ కమిటీ మొదట్లోనే అభ్యంతరం తెలిపింది. అభ్యంతరం తెలిపిన వారిపై కక్షసాధింపు చర్యలకు దిగారు. వారివి కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో పెట్టారు. రెండు సెంట్లు స్థలం మీదే అయినప్పుడు ఎందుకు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి పూట స్టేలు తెచ్చుకోవలసిన అవసరం ఏముంది. కోస్తా టైగర్ అని చెప్పుకునే అయ్యన్న ఎందుకు దాక్కున్నారు. 276 సర్వేనెంబర్లో ఆక్రమించారని అధికారులు చెబుతుంటే మీరు 277 సర్వేనెంబర్ చూపిస్తున్నారు. పాలిటెక్నిక్ కాలేజీకి అయ్యన్న కుటుంబం భూములు ఇవ్వలేదు. మా తాత ముత్తాతలు ఇచ్చారు, దానిని గొప్పగా చెప్పుకుంటున్నారు. అయ్యన్న భార్య మహానటి సావిత్రిని మించి నటించింది. మేము పార్టీ మారినప్పుడు నన్ను నా కొడుకుని పంపించడానికి రౌడీలను పంపారని' చింతకాయల సన్యాసిపాత్రుడు అన్నారు. చదవండి: (పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న) -
Varadapuram Suri: అక్రమాల ‘వరద’పై ఎందుకింత ప్రేమ!
ఆయనో ‘భూ’చోడు. ఫోర్జరీలు చేయడం, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం వెన్నతో పెట్టిన విద్య. వాటి ఆధారంగా భూదందాలకు పాల్పడి రూ.కోట్లకు పడగలెత్తాడు. ఆయన అక్రమాలు అధికారిక విచారణల్లోనూ వెల్లడయ్యాయి. అయినా చర్యలు మాత్రం తీసుకోవడంలేదు. ఆయన పట్ల అధికారులు ఎందుకింత ప్రేమ కనబరుస్తున్నారో ఎవరికీ అంతుపట్టని విషయం. సాక్షి, పుట్టపర్తి: అనంతపురం కలెక్టర్ కార్యాలయం నుంచి జేఎన్టీయూకు వెళ్లే దారిలో నవోదయ కాలనీ 80 అడుగుల రోడ్డు పక్కనే ఉన్న 6.35 ఎకరాల భూమిని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత వరదాపురం సూరి కాజేశారు. సుమారు రూ.129 కోట్ల విలువ చేసే ఈ భూమిని నకిలీ డాక్యుమెంట్లతో అత్యంత చాకచక్యంగా తన ఖాతాలో వేసుకున్నారు. అక్రమ పద్ధతుల్లో భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తేలినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ మినహా క్రిమినల్ చర్యలు చేపట్టకుండా రిజిస్ట్రేషన్ అధికారులు తాత్సారం చేస్తుండగా...కలెక్టర్ నియమించిన ఉన్నతాధికారుల కమిటీ కూడా నివేదిక సమర్పణలో జాప్యం చేస్తోంది. మోసం చేశారిలా.. రాళ్లపల్లి నారాయణప్ప అనే వ్యక్తి 1929లో అప్పటికే పింఛన్ తీసుకుంటున్న గుండూరావు నుంచి జేఎన్టీయూకు వెళ్లే దారిలోని సర్వే నంబర్ 301లో 7.77 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. నారాయణప్ప పెద్ద మనవడు పెద్ద ఉలిగప్పకు 1933లో హక్కు విడుదల చేశారు. ఆయన 1935లో బ్యాంకులో మార్ట్గేజ్ చేసి రుణం కూడా పొందారు. రాళ్లపల్లి నారాయణప్ప నుంచి తర్వాత నాలుగు తరాల వారికి భూమి మారుతూ వచ్చింది. అయితే, దొడ్డమనేని మాలతేష్ అనే వ్యక్తి గుండూరావు తన చిన్నాన్న అని పేర్కొంటూ నవంబర్ 19, 1985 తారీఖుతో అన్ రిజిస్టర్డ్ వీలునామా పేరిట నకిలీ పత్రాలు సృష్టించారు. వీటి ఆధారంగా 2018లో రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై 301–3 సర్వే నంబరులో 6.35 ఎకరాల భూమిని వెబ్ల్యాండ్లో నమోదు చేశారు. చదవండి: (శ్రీరస్తు.. కల్యాణమస్తు: 23 దాటితే డిసెంబర్ వరకు ఆగాల్సిందే!) అనంతరం డిసెంబర్ 23, 2021లో మాలతేష్ నుంచి 6.35 ఎకరాలను వరదాపురం సూరి కుమారుడు నితిన్ సాయి, ధర్మవరానికి చెందిన యంగలశెట్టిరాజు (సూరి అనుచరుడు) కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాస్తవానికి గుండూరావు 1929 నాటికే ప్రభుత్వ పింఛన్ తీసుకుంటున్నారు. అంటే అప్పటికే ఆయనకు 60 ఏళ్లు పూర్తయి ఉంటాయి. దీన్నిబట్టి 1985 నాటికి గుండూరావు వయసు 116 ఏళ్లు! అంతటి వయస్సు ఉన్న వ్యక్తి అన్రిజిస్టర్డ్ వీలునామా ఎలా రాయిస్తారో అర్థం కాని విషయం. ఈ అన్ రిజిస్టర్డ్ వీలునామా ఫోర్జరీ అని ఆర్డీఓ కోర్టు సైతం నిర్ధారించింది. అయినప్పటికీ వరదాపురం సూరి తన గ్రామానికే చెందిన సబ్రిజి్రస్టార్ను లోబర్చుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయించారు. సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్తో సరి.. బాధితుల ఫిర్యాదు మేరకు మూడు నెలల క్రితం విచారణ చేపట్టిన జిల్లా ఉన్నతాధికారులు ఫోర్టరీ డాక్యుమెంట్లతో రిజి్రస్టేషన్ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యవహారంపై అనంతపురం సబ్ రిజిస్ట్రార్ హరికృష్ణను సస్పెండ్ చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్న నితిన్ సాయి, యంగలశెట్టి రాజు మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ..జిల్లా రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పటిదాకా నితిన్ సాయి, యంగలశెట్టి రాజా, అక్రమాల సూత్రధారి అయిన వరదాపురం సూరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు. వారి మీద కేసులు నమోదు చేయకుండా భారీ ఎత్తున ముడుపులు స్వీకరించారా? లేదా తప్పుదోవ పట్టించే ఎత్తుగడ వేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చదవండి: (హిందూపురం వాసుల చిరకాల వాంఛ.. సాకారం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం) నివేదిక సమర్పించడంలోనూ జాప్యమే.. సూరి చేసిన అక్రమ వ్యవహారంపై విచారణకు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) ఆధ్వర్యంలో హంద్రీ–నీవా సుజల స్రవంతి సబ్ కలెక్టర్, అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సభ్యులుగా కలెక్టర్ నాగలక్ష్మి అప్పట్లోనే విచారణ కమిటీని నియమించారు. ఇందులో ఒక సభ్యుడు నివేదిక సమర్పించినా, మరొక సభ్యుడు మాత్రం కాలయాపన చేస్తున్నారు. ఇంతటి భారీ అక్రమ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సి ఉన్నా.. మరొక అధికారి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామంటూ కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారు. ‘భూచోళ్ల’పై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా చేయడానికే అధికారులందరూ కలిసి కొత్త నాటకాలకు తెరతీసినట్లు తెలుస్తోంది. క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరాం అన్రిజిస్టర్డ్ వీలునామా ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయడం అనైతికమని పలువురు ఫిర్యాదు చేశారు. రిజి్రస్టేషన్ను రద్దు చేయాలని కోరారు. ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్ను సస్పెండ్ చేశాం. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా రిజి్రస్టార్కు ఉత్తర్వులు జారీ చేశాం. – మాధవి, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ -
ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిపోతున్న భూ కబ్జాలు
-
భూ బకాసురుడు 'వరదాపురం'
సాక్షి, అనంతపురం: ఆయనో మాజీ ప్రజాప్రతినిధి. వందల ఎకరాల ప్రభుత్వ భూములను చెరబట్టాడు. అమాయక రైతు లను బెదిరించి కనిపించిన పొలాన్నల్లా లాక్కున్నాడు. అంతేకాదు.. అసైన్డ్ భూముల చట్టానికి తూట్లు పొడిచి అధికారం లో ఉండగా అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నాడు. వాగులు, వంకలను కలిపేసుకున్నాడు. చుట్టు పక్కల పొలాలకు దారి వదలకుండా రైతులను వేధిస్తున్నాడు. ఎవరైనా సరే తనకు మాత్రమే విక్రయించాలని లేదంటే గ్రామం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నాడు. ఈ అరాచకాలను భరించలేక ఏకం గా ఒక గ్రామమే ఖాళీ కావటాన్ని బట్టి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడో వేరే చెప్పాలా? అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి అలియాస్ గోనుగుంట్ల సూర్యనారాయణ భూ దందాలు, దౌర్జన్యాలివీ.. టీడీపీ అధికారంలో ఉండగా.. ముదిగుబ్బ మండలం ముక్తాపురం రెవెన్యూ పరిధిలో చిన్న, సన్నకారు రైతులే అధికం. 2014లో టీడీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్యేగా ఉన్న సూరి గ్రామంలో పొలాల ఆక్రమణల పర్వాన్ని ప్రారంభించాడు. నితిన్సాయి ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 332.45 ఎకరాలను రైతుల నుంచి కారుచౌకగా కాజేశాడు. ఇందులో 155.88 ఎకరాలు ప్రభుత్వ, అనాదీన, చుక్కల భూములే కావడం గమనార్హం. నిరుపేద రైతులు సాగు చేసుకుంటున్న భూములను వరదాపురం బలవంతంగా సొంతం చేసుకున్నాడు. సూరి కుమారుడు నితిన్సాయి, సతీమణి నిర్మలాదేవి కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారు. చండ్రాయునిపల్లి ఖాళీ ముక్తాపురం రెవెన్యూ పరిధిలో వందల ఎకరాలను కొనుగోలు చేయడంతో పాటు ఇతర రైతులు పొలాలకు వెళ్లేందుకు దారి ఇవ్వకుండా సూరి వేధించాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే రైతుల పొలాల్లో నీళ్ల మోటార్లు, స్టార్టర్ పెట్టెలు రాత్రికి రాత్రే మాయమయ్యేవి. దీంతో దిక్కుతోచక అయినకాడికి అమ్ముకుని వలస వెళ్లిపోయారు. ఇలా చండ్రాయునిపల్లి అనే గ్రామం మొత్తం ఖాళీ అయ్యింది. ప్రస్తుతం అక్కడ మొండిగోడలు, కూలిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి. అసైన్మెంట్ చట్టానికి తూట్లు 1977 అసైన్మెంట్ చట్టం ప్రకారం ప్రభుత్వ భూములను కొనడం, అమ్మడం చట్టరీత్యా నేరం. దీన్ని బేఖాతర్ చేస్తూ నితిన్సాయి ఆగ్రోటెక్ కంపెనీ పేరిట ఏకంగా 155.88 ఎకరాల ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. ఇందుకు అప్పట్లో రెవెన్యూ అధికారులు సహకరించారు. పాసుపుస్తకాలు సైతం మంజూరు చేసేశారు. ఆధారాలు ఇవిగో.. నితిన్సాయి ఆగ్రోటెక్ కంపెనీ పేరిట వరదాపురం సూరి పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములను ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ముదిగుబ్బ మండలం ముక్తాపురం పరిధిలో 48–2, 50, 52–3, 53–2, 54–1, 57–1, 57–2, 63–1, 63–2, 63–3, 84, 85–1, 85–2, 86, 87–1ఎ, 87–1బి, 87–2, 88, 96–1, 96–2, 97, 106–2,106–3, 113, 119, 134, 199, 203, 378 సర్వే నంబర్లలో ప్రభుత్వ, అనాదీన, అసైన్డ్, గయాలు లాంటి నిషేధిత జాబితాలోని భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పొలానికి వెళ్లనివ్వడం లేదు.. ముక్తాపురం, చండ్రాయునిపల్లి మధ్యలో 330 ఎకరాలకు పైగా కొనుగోలు చేసిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి మేం పొలానికి వెళ్లేందుకు దారి ఇవ్వడం లేదు. అక్కడ మాకు మధ్యలో పది ఎకరాల భూమి ఉంది. వ్యవసాయ పనులకు ఆటంకం కల్పిస్తుండంతో దిక్కు తోచడం లేదు. ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నిస్తే మాపై దౌర్జన్యం చేస్తున్నారు. – వెంకటేశ్ నాయక్, ముక్తాపురం తండా మా గ్రామాన్ని కాపాడండి.. వరదాపురం సూరి ఇక్కడ భూములు కొన్నప్పటి నుంచి మాకు ఇబ్బందులు మొదలయ్యాయి. మా పొలాల వద్దకు వెళ్లాలంటే సూరి భూములను దాటుకుని వెళ్లాలి. ఆయన మా పొలాల్లోకి వెళ్లనివ్వడం లేదు. ఈ దౌర్జన్యాలను తట్టుకోలేక ఇప్పటికే చండ్రాయునిపల్లి ఖాళీ అయ్యింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మేం కూడా ముక్తాపురం వదిలి వెళ్లక తప్పదు. ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలి. – కేశవ, ముక్తాపురం -
Hyderabad: అమ్ముతావా.. చస్తావా!
సాక్షి, బంజారాహిల్స్: తక్కువ ధరకే ఖరీదైన భూమిని విక్రయించాలని కొంత కాలంగా బెదిరించినా తమ మాట వినలేదనే కోపంతో నగరంలోని బంజారాహిల్స్ పరిధిలో దుండగులు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశారు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజక వర్గం కౌడిపల్లికి చెందిన కొత్త హరీష్కుమార్ (36)కు తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కొంత కాలంగా ఈ భూమిపై కన్నేసిన కౌడిపల్లి టీఆర్ఎస్ మండల యూత్ ప్రెసిడెంట్ కృష్ణగౌడ్, కౌడిపల్లి సర్పంచ్ ఎ.సుధీర్రెడ్డి, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్రెడ్డి, బుర్దరం పేట సర్పంచ్ శ్రీనివాస్గౌడ్, నాయికోటి రాజు, టి.సంతోష్రావు, ఎస్కే ఆసిఫ్, లింగం తదితరులతో పాటు మొత్తం 18 మంది మూడు కార్లలో ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్కు వచ్చారు. ►యూసుఫ్గూడ సమీపంలోని శ్రీకృష్ణదేవరాయ నగర్ భవానీ అపార్ట్మెంట్స్లో అద్దెకుంటున్న హరీష్ కుమార్ ఇంట్లోకి చొరబడ్డారు. ఆయన కాలర్ పట్టుకొని కారులోకి ఈడ్చుకొచ్చారు. అడ్డుగా వచ్చిన హరీష్ తమ్ముడు మహేష్ను కొట్టుకుంటూ కారులోకి ఎక్కిస్తుండగా ఆయన తప్పించుకొని సమీపంలో దాక్కున్నాడు. హరీష్ను కిడ్నాప్ చేసి మూడు కార్లలో నర్సాపూర్ అడవుల వైపు వెళ్లారు. ►తప్పించుకున్న మహేష్ డయల్ 100కు ఫోన్ చేసి తన సోదరుడు హరీష్ కిడ్నాప్ అయిన విషయాన్ని చెప్పాడు. హుటాహుటిన బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కిడ్నాప్ చేసిన కృష్ణగౌడ్ నంబర్ తీసుకొని వెంటనే హరీష్ను తీసుకొని రావాల్సిందిగా పోలీసులు హెచ్చరించారు. దీంతో భయపడ్డ కృష్ణగౌడ్, సుధీర్రెడ్డి తదితరులు బాధిత హరీష్ను కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. ►తన దుస్తులు విప్పేసి దారి పొడవునా తీవ్రంగా కొట్టారని, తొమ్మిది ఎకరాల స్థలాన్ని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలంటూ హెచ్చరించారని, లేకపోతే నర్సాపూర్ అడవుల్లో పెట్రోల్ పోసి చంపేస్తామంటూ బెదిరించినట్లు బాధితుడు తెలిపారు. సోమవారం సాయంత్రం బాధితుడు నగర పోలీస్ కమిషనర్ను కలిశారు. తనను కిడ్నాప్ చేశారంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. ►తనకు ప్రాణహాని ఉందంటూ సెప్టెంబర్ 17న కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశానని బాధితుడు ఆరోపించారు. ఆ రోజు తన ఫిర్యాదుపై పోలీసులు స్పందించి ఉంటే తనను కిడ్నాప్ చేసి ఉండేవారు కాదని ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడి పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని ఆరోపించారు. కాగా.. కిడ్నాపర్లు విదేశాలకు వెళ్తున్న ఓ ఎమ్మెల్యేకు వీడ్కోలు పలికేందుకు ఎయిర్పోర్టుకు వచ్చి తిరిగి వెళ్తూ ఈ పని చేశారని సమాచారం. -
చదలవాడ చెర వీడుతోంది.. ఆస్తులు పెంచుకోవడమే అజెండా
చదలవాడ కృష్ణమూర్తి.. ఆస్తులు పెంచుకోవడమే అజెండాగా రాజకీయాలు చేస్తుంటారు. ప్రభుత్వ భూములను అవలీలగా ఆరగించేస్తుంటారు. తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎకరాలకు ఎకరాలను కబ్జా చేసేశారు.. ఆ పార్టీ హయాంలో టీటీడీ చైర్మన్ పదవి వెలగబెట్టినప్పుడూ వ్యాపార సామ్రాజ్య విస్తరణకే ప్రాధాన్యమిచ్చారు. ఘనత వహించిన చదలవాడ వారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పారు.. తర్వాత టీడీపీలో కుర్చీలాట ఆడారు.. ప్రస్తుతం జనసేనతో అంటకాగుతున్నారు.. దశాబ్దాలుగా పాలి‘ట్రిక్స్’ సాగిస్తున్నా.. తిరుపతి నగరాన్ని భూకబ్జాలు, దందాలతో చెరబట్టిన ప్రబుద్ధుడిగానే ఆయన పేరు గడించారు.. ఇంతకీ విషయమేమిటంటే ప్రభుత్వ భూములకు చదలవాడ ‘చెర’ వదిలించడంపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. విద్యాసంస్థ పేరిట సర్కారు భూములను అందిన కాడికి మింగేయడంంపై చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం తిరుపతి రూరల్ పరిధిలోని దామినేడు గ్రామం సర్వే నంబర్ 131లో ఉన్న నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కలిపేసుకుంటూ అక్రమంగా నిర్మించిన గోడను కూల్చివేశారు. ఇక్కడితో ఆగకుండా మొత్తం చదలవాడ భూ ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తునకు శ్రీకారం చుట్టారు. సాక్షి, తిరుపతి: తిరుపతి రూరల్ మండలం దామినేడు సర్వే నంబర్ 112/1, 2, 3లో సుమారు 13 ఎకరాలు, సర్వే నంబర్ 115లో 12.5 ఎకరాలు, సర్వే నంబర్ 131లో 39.25 ఎకరాలు, 135లో 7.3 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకుడు చదలవాడ కృష్ణమూర్తి కన్నుపడింది. ఆ భూములకు ఆనుకుని ఉన్న ఓ మోపెడ్ కంపెనీని చదలవాడ కొనుగోలు చేశారు. అంతే.. ఆ తర్వాత మోపెడ్ పరిశ్రమ పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ, కాలువ, చెరువు పోరంబోకు భూములు అన్నింటినీ క్రమక్రమంగా ఆక్రమిస్తూ వచ్చారు. గతంలో ఆ భూములు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే ఉండేవి. సరిగ్గా అప్పట్లోనే ఎమ్మెల్యేగా వెలగబెట్టిన ఈయన.. పదవిని అడ్డు పెట్టుకుని పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వ భూములన్నింటినీ తన ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. చదవండి: (వైద్య, ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్కు సీఎం జగన్ గ్రీన్సిగ్నల్) కళాశాలల పేరుతో కబ్జా మోపెడ్ కంపెనీ ఆస్తులను కొనుగోలు చేసిన చదలవాడ ఆ భవనాలకు మరమ్మతులు చేపట్టారు. పక్కనే ఉన్న భూముల్లో పలు కళాశాలలను స్థాపించారు. చదలవాడ కృష్ణతేజ డెంటల్ కాలేజీ, చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కళాశాల, ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ స్టడీస్, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఇంకా ఎంసీఏ వంటి వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సులు అందిస్తున్నట్లు ప్రకటించారు. పెద్ద ఎత్తున కళాశాలలను ఏర్పాటు చేయటంతో అధికారులు, నాయకులు ఎవ్వరూ అటువైపు వెళ్లేందుకు సాహసం చేయలేదు. అదే అదనుగా చదలవాడ కళాశాలల ముసుగులో కాలువ, చెరువు పోరంబోకు భూములను పూడ్చివేశారు. ప్రభుత్వ భూములను కూడా పూర్తి స్థాయిలో ఆక్రమించేశారు. అడ్డగోలుగా గోడ నిర్మాణం ఇదిలా ఉండగా, కళాశాల వెనుక ఉన్న భూముల్లోని నాలుగు ఎకరాలు తమవేనంటూ పీకే నాగరాజు పిళ్లై, నాగేంద్ర అనే వ్యక్తులు ఈమధ్య తెరపైకి వచ్చారు. తాము 1970 నుంచి సదరు భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. రికార్డుల్లో అది ప్రభుత్వ భూమిగానే చూపిస్తున్నా... తాము మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. అయితే మూడు వారాల క్రితం చదలవాడ కృష్ణమూర్తి తన అనుచరులతో కలిసి అక్కడ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారు. విషయం తెలుసుకున్న నాగరాజు పిళ్లై, నాగేంద్ర దీనిపై తిరుపతి రెవెన్యూ, నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక అధికారుల నుంచి స్పందన లేకపోవటంతో వారు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఈ విషయం కలెక్టర్ హరినారాయణన్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే తిరుపతి ఆర్డీవో, రూరల్ తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం రెవెన్యూ అధికారులు పోలీసు సిబ్బందితో కలిసి ఆక్రమిత స్థలంలో నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేశారు. మిగిలిన కబ్జా భూములపై సమగ్రంగా విచారించి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. చదవండి: (సీఎం జగన్ సంక్షేమ పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం: సజ్జల) సమగ్ర సర్వే దామినేడు రెవెన్యూ గ్రామ పరిధిలో ఆక్రమిత భూములను కచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం. కలెక్టర్ హరినారాయణన్ ఆదేశాల మేరకు సమగ్రంగా సర్వే చేయిస్తాం కబ్జాలను అడ్డుకుంటాం. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే ఉండదు. – కనక నరసారెడ్డి, ఆర్డీవో, తిరుపతి అవి ప్రభుత్వ భూములే దామినేడులో ఆక్రమణకు గురైన 73.5 ఎకరాలు ప్రభుత్వ భూములే. సిద్ధార్థజైన్ కలెక్టర్గా ఉన్నప్పుడు వీటిపై సర్వే చేయించి సర్కారు భూములుగా నిర్ధారించారు. ప్రస్తుతం ఆ భూముల్లోని అన్ని ఆక్రమణలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పూర్తిగా తొలగిస్తాం. – లోకేశ్వరి, తహసీల్దార్, తిరుపతి రూరల్ -
భూ కబ్జాలు బట్టబయలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చారిత్రాత్మక సర్వేతో కబ్జా కోరల్లో ఉన్న భూముల బండారం బట్టబయలు కానుంది. భవిష్యత్లో భూ ఆక్రమణలకు శాశ్వతంగా చెక్ పడనుంది. జిల్లాలో ఒకటిన్నర దశాబ్ద కాలంలో భూముల విలువలు అపారంగా పెరిగాయి. ఈ పరిణామాలతో రాజకీయ అండతో రెవెన్యూ అధికారులను లోబర్చుకుని బడాబాబులు భూకబ్జాలకు పాల్పడ్డారు. గతంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు జిల్లాలో వేలాది ఎకరాలను కబ్జా చేశారు. రీ సర్వేతో ఆక్రమణదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికారం అండతో టీడీపీ హయాంలో తెలుగుతమ్ముళ్లు అడ్డగోలుగా భూ కబ్జాలకు తెరతీశారు. గ్రామ స్థాయి నేత నుంచి ప్రజా ప్రతినిధుల వరకు అందరూ భూములు ఆక్రమించారు. ప్రతి నియోజకవర్గంలోనూ వందల ఎకరాల భూములు అప్పటి అధికార పార్టీ నేతల కోరల్లోకి వెళ్లాయి. సముద్ర తీర ప్రాంతం మొదలుకుని పెన్నా నది పొరంబోకు వరకు దేన్నీ వదలకుండా శక్తి మేరకు భూములను ఆక్రమించారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూములను కలిపి రియల్ వెంచర్లుగా మార్చి విక్రయాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో వందేళ్ల చరిత్రకు నాంది పలుకుతూ భూ హక్కులను పదిలం చేస్తూ వైఎస్సార్, జగనన్న శాశ్వత భూహక్కు– భూ రక్ష పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ప్రతి సెంటు భూమిని సమగ్రంగా రీ సర్వే చేసి శాశ్వత హక్కులు కల్పించనున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతో కబ్జాదారుల్లో టెన్షన్ మొదలైంది. ► జిల్లాలో అపారంగా ల్యాండ్ బ్యాంక్ ఉంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన పూర్తి మౌలిక సదుపాయాలు ఉండడంతో పాటు జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. ► గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజా ప్రతినిధులు కొందరు, తెలుగు తమ్ముళ్లు పట్టణాలు, నగరం మినహా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో భూములను చెరపట్టారు. ► ఐదేళ్ల కాలంలో ప్రతి నియోజకవర్గంలో సగటున వెయ్యి ఎకరాలకు పైగా భూములు కబ్జాకు గురైనట్లు సమాచారం. ► కొన్ని చోట్ల సాగు చేయడంతో పాటు మరికొన్ని చోట్ల రొయ్యల గుంతలు ఏర్పాటు చేశారు. ఇంకొన్ని చోట్ల విక్రయాలు చేశారు. ► జిల్లాలో భూ వివాదాలకు సంబంధించి వేల సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 400 గ్రామాల్లో సర్వే ప్రారంభం జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్లలో 400 గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. మూడు దశల్లో సర్వే పూర్తి చేయనునున్నారు. నెల్లూరు డివిజన్లో 104, కావలి డివిజన్లో 56, గూడూరు డివిజన్లో 113, ఆత్మకూరు డివిజన్లో 61, నాయుడుపేట డివిజన్లో 66 గ్రామాల్లో తొలి విడతగా ఈ నెల 23న గూడూరు రూరల్ మండలంలోని రెడ్డిగుంట నుంచి కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు ప్రారంభించారు. అన్ని రకాల భూములను రీ సర్వే చేసి యజమానులకు శాశ్వత హక్కు కల్పించడమే పథకం ప్రధాన ఉద్దేశం. ప్రతి భూమిని డ్రోన్ కెమెరాల ద్వారా ఫొటోలు తీసి వాటిని కంప్యూటర్లో చెక్ చేసి రైతుల సమక్షంలో సర్వే నిర్వహించి కచ్చితమైన కొలతలు వేసి ఉచితంగా హద్దు రాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి భూ కమతానికి ప్రత్యేక మ్యాప్ ఆధార్ తరహాలో యూనిక్ నంబర్ ఇచ్చి వివరాలు నమోదు చేయనున్నారు. భూ యజమానికి యూనిక్ నంబర్, క్యూఆర్ కోడ్ను కేటాయించనున్నారు. భవిష్యత్లో భూ ఆక్రమణలకు చెక్ పడనుంది. సాగర తీరం నుంచి సాగుభూమి వరకు.. జిల్లాలో సముద్ర తీరం నుంచి సాగు భూమి వరకు కబ్జా కోరల్లో ఉంది. ప్రధానంగా అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్ భూములను గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు ఆక్రమించి పట్టాలు కూడా సృష్టించుకోవడం గమనార్హం. ► కావలి నియోజకవర్గంలో బోగోలు మండలం, దగదర్తి మండలంలో సగటున 150 ఎకరాలకు పైగా భూములు టీడీపీ నేతల అధీనంలో ఉన్నాయి. కావలి పట్టణానికి సమీపంలోని సుమారు 50 ఎకరాలకు పైగా భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ► ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండలం రాగిపాడులో 70 ఎకరాల భూమి టీడీపీ నేత ఆక్రమించగా కొంత స్వాధీనం చేసుకున్నారు. వరికుంటపాడు మండలం బొంగరాలపాడులో 50 ఎకరాల వరకు స్థానిక టీడీపీ నేతలు భూమిని ఆక్రమించారు. ► గూడూరు నియోజకవర్గంలో చిల్లకూరు మండలం కడివేడులో 150 ఎకరాలు, కోట మండలం కేశవరం, రాఘవవారిపాళెంలో 25 ఎకరాలు ఆక్రమణల పర్వంలో ఉంది. ఆత్మకూరు నియోజక వర్గంలోని మర్రిపాడు, చేజర్లలోనూ ఇదే తరహాలో ఆక్రమణలు ఉన్నాయి. ► కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలంలో సుమారు 500 ఎకరాలకు పైగా సముద్ర తీర ప్రాంతం ఆక్రమణలకు గురైంది. ఈ మండలంలోని కొరటూరు, మైపాడులో దాదాపు 11 సర్వే నంబర్లలో 150 ఎకరాలు, రామడుగుపాళెంలో 5 సర్వే నంబర్లలో 318 ఎకరాలు, కొరుటూరు ఒకే సర్వే నంబర్లో 23.50 ఎకరాలు, జగదేవిపేటలో 6 సర్వే నంబర్లలో 60 ఎకరాలు ఆక్రమణలో ఉంది. వీటిలో మైపాడు, కొరుటూరులో ఆక్రమిత స్థలాల్లోనే హేచరీలు ఉండడం గమనార్హం. ఇవి మచ్చుకు మాత్రమే. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఈ తరహా భూ ఆక్రమణలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. భూ రక్ష పథకంతో ఇవన్నీ పూర్తి స్థాయిలో వెలుగులోకి రానున్నాయి. -
గీతం అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్శిటీ భూకబ్జాలపై విచారణ జరపాలని సోమవారం ప్రజాసంఘాల జేఏసీ సీబీఐకి ఫిర్యాదు చేసింది. 'గత 40 ఏళ్లుగా గీతం యూనివర్సిటీ భూకబ్జాలకు పాల్పడింది. వారు ఆక్రమించిన భూముల్లో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారు. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజు అధికంగా వసూలు చేసింది. భూకబ్జాలు, అవినీతికి పాల్పడిన గీతం యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలి. చేసిన మోసాలను రాజకీయ పలుకుబడితో గీతం యూనివర్సిటీ పెద్దలు తప్పించుకుంటున్నారు. గీతం ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. గీతం యూనివర్సిటీ అక్రమాలకు చంద్రబాబు మద్దతు తెలపడాన్ని ఖండిస్తున్నాం' అని ప్రజాసంఘాల జేఏసీ సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. (ఆక్రమణలకు చరమ‘గీతం’) -
'రౌడీషీట్ పెట్టండి.. వాడి అంతు చూస్తా'
సాక్షి, హైదరాబాద్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డితో తనకు ప్రాణహాని ఉందని ఓ యువకుడు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకెళ్తే.. కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 71, 72, 73 ప్లాట్ నంబర్ 35, 36 పార్ట్ స్థలంలో తన బంధవులు ఇల్లు నిర్మాణం చేసుకుంటే మేయర్ అనుచరులు ఆ ఇంటిని జేసీబీతో నేలమట్టం చేశారని శివకిషోర్ అనే యువకుడు ఆరోపించాడు. ఈ క్రమంలోనే శివకిషోర్.. ఎందుకు ఇల్లు కూలగొడుతున్నారని మేయర్ను ప్రశ్నించగా నువ్వెవడు రా..? అని పరుష పదజాలంతో దూషించి, ఏడుగురు వ్యక్తులు రాళ్ల దాడికి దిగినట్లు బాధితుడు వివరించారు. విషయంపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్తే వీడిపై రౌడీషీట్ పెట్టండి. తర్వాత వాడి అంతుచూస్తానని మేయర్ సామల బుచ్చిరెడ్డి బెదిరించినట్లు బాధితుడు పేర్కొన్నారు. (కస్టమర్ కేర్ కాదు.. ఖాతా కొల్లగొట్టుడే!) -
గీతం ఆక్రమణలకు చెక్
గత సర్కారు అండతో రుషికొండ, ఎండాడలో 40.51 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వివిధ స్థలాల్ని గీతం విశ్వవిద్యాలయ యాజమాన్యం ఆక్రమించినట్లు జిల్లా రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఎండాడలోని సర్వే నం. 15,16,17,18,19,20, రుషికొండలోని సర్వే నం. 55,61లో ఆక్రమించిన 22.21 ఎకరాల చుట్టూ రక్షణ గోడ నిర్మాణం, సర్వే నం. 34,35,37,38లో 18.30 ఎకరాల విస్తీర్ణంలో గీతం యూనివర్సిటీ గార్డెనింగ్ నిర్మాణంతో పాటు గ్రావెల్ బండ్ని ఏర్పాటు చేసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేటతెల్లమైంది. ఈ ఆక్రమణలపై విశాఖ ఆర్డీవో పెంచల్ కిశోర్ ఇచ్చిన నివేదికతో పాటు సిట్ కూడా తమకు వచ్చిన ఫిర్యాదు నంబర్.2670 ప్రకారం విచారణ చేపట్టింది. సాక్షి, విశాఖపట్నం: 1981లో గీతం విద్యా సంస్థ ఏర్పాటు చేసేందుకు రుషికొండ, ఎండాడలో సర్వే నంబర్లు 17/1, 5, 17/7 నుంచి 28 వరకూ 71.15 ఎకరాల భూమిని ఇవ్వాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరింది. ఇదంతా అప్పట్లో భూమిలేని నిరుపేదలకు ఇచ్చిన భూమి కావడం, దాన్ని అప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా.. కోర్టు కేసులు పెండింగ్లో ఉండడంతో ప్రభుత్వం ఆ స్థల హక్కుల్ని గీతంకి బదిలీ చేయలేదు. కానీ ఆధీన పత్రాలు దక్కించుకునే వరకూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని నిబంధన విధిస్తూ స్థలాన్ని విద్యాసంస్థకు అప్పగించింది. ఈ నిబంధనల్ని పాటించకపోతే ప్రభుత్వం తిరిగి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. లేదంటే.. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చెయ్యాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ నిబంధనల్ని తుంగలో తొక్కి.. 14 ఎకరాల్లో నిర్మాణం చేపట్టి.. మిగిలిన 57.15 ఎకరాల్ని 15 ఏళ్లుగా ఖాళీగా ఉంచింది. 1996లో అప్పటి జేసీ ఈ స్థలాన్ని పరిశీలించి.. ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు కేవలం 14 ఎకరాలు మాత్రమే నిర్మాణాలు చేపట్టి.. మిగిలిందంతా నిరుపయోగంగా ఉంచేశారంటూ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. దీనిపై స్పందించిన అప్పటి భూ పరిపాలన చీఫ్ కమిషనర్ గీతంని పరిశీలించి.. కేవలం 49 ఎకరాలు మాత్రమే సరిపోతాయనీ.. మిగిలిన భూముల్ని ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు 1998 మే 27న ప్రభుత్వం ఈ భూమిని స్వాధీనం చేసుకుంది. (విశాఖ భూ కుంభకోణం: సిట్ విచారణ ప్రారంభం) ప్రభుత్వానికి నివేదిక పంపించాం.. ఎండాడ, రుషికొండ పరిసరాల్లో మొత్తం 40.51 ఎకరాల భూముల్ని గీతం సంస్థ ఆక్రమించినట్లు గుర్తించాం. ఏయే ప్రాంతాల్లో ఎంత భూములు ఆక్రమించుకున్నారు... హైకోర్టు విచారణలో ఉన్న కేసులు సంబంధించి ఎంత మేర భూములున్నాయి.. మొదలైన అంశాలతో కూడిన 7 పేజీల నివేదికను ప్రభుత్వానికి పంపించాం. – పెంచల్ కిశోర్, ఆర్డీవో, విశాఖపట్నం ఇలా తీసుకొని.. అలా ఇచ్చేసిన టీడీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రెండు వారాల తరువాత అదే ఏడాది జూన్ 12న ఎకరా రూ.18వేలుగా ధర నిర్ణయించి గీతంకి అప్పగించేందుకు ప్రభుత్వం స్కెచ్ వేసింది. స్థలాన్ని అప్పగించిన 1981 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ 10 శాతం వడ్డీ కట్టాలని కూడా ఆదేశించింది. మొత్తంగా రూ.34,94,200 చెల్లించి స్థలాన్ని గీతంకి అప్పటి టీడీపీ ప్రభుత్వం కట్టబెట్టింది. క్రమంగా.. ఆక్రమణలు ఇక అప్పటి నుంచి గీతం ఆ భూములకు పక్కన ఉన్న స్థలాల ఆక్రమణల పర్వానికి తెరతీసింది. సర్వే నం.20(పీ)లో 6.09 ఎకరాలు, నం.19లో 0.62 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం ఆక్రమించింది. దీనిపై విశాఖ రూరల్ ఎమ్మార్వో గీతం విశ్వవిద్యాలయానికి నోటీసులు జారీ చేయగా.. యాజమాన్యం ఆ స్థలాల్లో ఉన్న కట్టడాలు కూల్చొద్దంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. గీతం వివరణ తీసుకొని సమస్యను సానుకూలంగా పరిష్కరించాలంటూ 2004 డిసెంబర్ 28న ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రిట్ పిటిషన్ దాఖలైన తర్వాత కూడా ఆక్రమణలు కొనసాగించినట్లు 2005 ఫిబ్రవరిలో గుర్తించారు. సర్వే నం.19లో 0.98 ఎకరాలు, 20లో 6.16 ఎకరాలు, 16లో 0.16 ఎకరాలు చొప్పున మొత్తం 7.30 ఎకరాలు ఆక్రమించినట్లు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఆ నిర్మాణాల తొలగించాలని నిర్ణయించారు. మొత్తం 7.30 ఎకరాల్లో ఉన్న నిర్మాణాల్ని తొలిగించి 2005 ఫిబ్రవరి 19న ఆ భూముల్ని స్వాధీనం చేసుకున్నట్లు బోర్డులు ఏర్పాటు చేశారు. ఒత్తిళ్లతో.. కట్టబెట్టారు ఆ తర్వాత మరోసారి కోర్టుకి వెళ్లి గీతం యాజమాన్యం రిట్ పిటిషన్ దాఖలు చేయగా 4 వారాల్లో స్థలాన్ని గీతంకి స్వాధీనం చేయాలంటూ 2005 ఫిబ్రవరిలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత రకరకాల ఒత్తిళ్లతో 2010లో స్థలాన్ని ప్రభుత్వం గీతం దూర విద్య కోర్సుల భవనానికి ఇవ్వాలని నిర్ణయించింది. ఆ తర్వాత అక్రమంగా తమ ఆ«దీనంలో ఉంచుకున్న సర్వే నం. 15, 37, 38(పీ), 15(పీ)లోని 35 ఎకరాల భూమిని వీఎంఆర్డీఏ వీసీ, ఇగ్నో రీజనల్ డైరెక్టర్, సోషల్ వెల్ఫేర్ డీడీ, ఐటీడీఏ పీఓ, స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ పీడీ, ఆదాయపు పన్ను డిప్యూటీ కమిషనర్ మొదలైన వివిధ ప్రభుత్వ సంస్థల అధికారుల కార్యాలయాల కోసం కేటాయిస్తూ 2014 ఫిబ్రవరి 26న సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపైనా మరోసారి గీతం కోర్టుకి వెళ్లగా.. 2014 మార్చి 10న హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రస్తుతం ఆ స్టే కొనసాగుతూ ఉంది. దీన్ని మార్కెట్ ధర ప్రకారం ఎకరం రూ.8.26 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించినా గీతం యాజమాన్యం మాత్రం స్పందించలేదు. ఇలా.. మొత్తం 40.51 ఎకరాల భూమి గీతం చెరలో ఉందని ప్రభుత్వం నిర్ధారించింది. ఆర్డీవో ఇచ్చిన నివేదిక మేరకు దీనిపై చర్యలకు ఉపక్రమించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. -
పరిటాల అనుచరుడి భూదందా.. అజ్ఞాత వ్యక్తి లేఖతో
మాజీ మంత్రి పరిటాల రవీంద్ర అనుచరుడైన రామగిరి టీడీపీ మాజీ ఎంపీపీ బడిమెద్దుల రంగయ్య ధర్మవరంలో చేసిన భూ దందా కలకలం సృష్టించింది. అత్యంత ఖరీదైన మున్సిపల్ రిజర్వ్డ్ స్థలాన్ని నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించి ఏకంగా కోట్లాది రూపాయలు రుణంగా తీసుకునేందుకు పెద్ద ప్రణాళికను రచించాడు. అయితే మున్సిపల్ అధికారుల విచారణలో కబ్జా వ్యవహారం బట్టబయలు కావడంతో కథ అడ్డం తిరిగింది. సాక్షి, ధర్మవరం టౌన్: ధర్మవరం పట్టణంలోని ఎస్బీఐ కాలనీ అత్యంత ఖరీదైన ప్రాంతం. ఇక్కడ సర్వే నంబర్ 483–1లో 7.84 సెంట్ల స్థలాన్ని రిజర్వ్డ్ సైట్గా అధికారులు కేటాయించారు. దీంతో ఈ స్థలంపై పరిటాల అనుచరుడు, రామగిరి మాజీ ఎంపీపీ బడిమెద్దుల రంగయ్య కన్నుపడింది. పరిటాల హవా సాగుతున్న సమయంలో అంటే 2004లో ఈ స్థలాన్ని చారుగుండ్ల రామలక్ష్మమ్మ అనే మహిళ పేరిట నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలు సృష్టించాడు. ఆ తర్వాత అదే సంవత్సరంలో సదరు మహిళతో ఆ స్థలాన్ని కొన్నట్టు బడిమెద్దుల రంగయ్య రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి స్థలాన్ని తన అధీనంలో ఉంచుకున్నాడు. ఈ స్థలం విలువ రూ.3 కోట్లకు పైగానే పలుకుతుంది. (జేసీ కుటుంబానికి మైనింగ్ శాఖ నోటీసులు) దస్తావేజులో రంగయ్య ఫొటో అజ్ఞాత వ్యక్తి లేఖతో బట్టబయలు ఎస్బీఐ కాలనీలో నకిలీ ధ్రువపత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్న సర్వే నంబర్ 483–1లోని 7.84సెంట్ల స్థలాన్ని ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో తాకట్టు పెట్టి రూ.2 కోట్ల రుణం పొందేందుకు బాలాజీ హౌసింగ్ డెవలపర్స్ అనే కంపెనీ తరఫున దరఖాస్తు చేసుకున్నాడు. రుణం ఇచ్చే ప్రక్రియ మొదలు కావడంతో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థలానికి సంబంధించిన విచారణ మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేసింది. ఇదే తరుణంలో పది రోజుల కిందట ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునకు ఈ వ్యవహారాన్ని ఓ అజ్ఞాత వ్యక్తి లేఖ ద్వారా తెలిపాడు. దీంతో కమిషనర్ ఆ డాక్యుమెంట్లను పరిశీలించి నకిలీ రిజి్రస్టేషన్గా గుర్తించారు. మున్సిపల్ రిజర్వ్డ్ సైట్ను తాకట్టు పెట్టి రుణం పొందాలనుకున్న విషయాన్ని ధ్రువీకరించారు. కబ్జాదారుపై పోలీసులకు ఫిర్యాదు మున్సిపల్ రిజర్వ్డ్ స్థలానికి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి రుణం పొందాలని చూసిన బడిమెద్దుల రంగయ్య, రామలక్ష్మిలతో పాటు, అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపైన మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. మున్సిపల్ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. -
వెలుగులోకి టీడీపీ అక్రమాలు..
టెక్కలి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలోని అక్రమాలు, అవినీతి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పట్లో రాజకీయ పరపతితో చేసిన భూకబ్జాలు ఇప్పుడిప్పుడే బయట పడుతుండటంతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా డివిజన్ కేంద్రమైన టెక్కలిలో ఇటువంటి భూ బాగోతం బట్టబయలైంది. దీంతో ఏం చేయాలో తెలియక అన్ని కోణాల్లో తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని పక్కాగా కబ్జా చేసిన వ్యవహారం బయట పడటంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. అధికారులు హెచ్చరించినప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణాలు చేస్తున్న దృశ్యం సర్వే నంబర్ 477లో పోరంబోకు స్థలం కబ్జా... డివిజన్ కేంద్రమైన టెక్కలిలో అయ్యప్పనగర్, జాతీయ రహదారికి మధ్యలో సర్వే నంబరు 477లో 70 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. ఇదే స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలో ఆక్రమించేశారు. అప్పట్లో ఓ బడా నేత రాజకీయ పెత్తనానికి భయపడి అధికారులు అటు వైపు దృష్టి సారించలేదు. తాజాగా ఇటీవల సర్వేయర్ అధికారులు ఆ ప్రాంతంలో ఈటీఎస్ మెషిన్తో సర్వే చేశారు. దీంతో పోరంబోకు స్థలం కబ్జాకు గురైందని గుర్తించారు. ఇంతలో కబ్జాదారులు ఆ స్థలంలో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. వెంటనే అధికారులు అప్రమత్తమై ఆ స్థలాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. అయినప్పటికీ ఆయా స్థలంలో కొంత మంది వ్యక్తులు నిర్మాణాలకు తెగబడ్డారు. దీంతో అధికారులు ఆయా నిర్మాణాలను నిలుపుదల చేశారు. అయితే కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా చేసేంత వరకు అధికారులు ఏం చేస్తున్నారంటూ స్థానికంగా గత పాలకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఈ స్థలంలో ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం చేపడితే స్థలాన్ని రక్షించుకోవచ్చునని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. -
ప్రభుత్వ భూమికి ఎసరు..!
చౌటుప్పల్ (మునుగోడు) : మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీపార్క్ స్థలంపై అక్రమార్కుల కన్నుపడింది. పట్టణ నడిబొడ్డున అత్యంత విలువైన ఈ భూమిని ఆక్రమించేందుకు కుట్రలు ప్రారంభమయ్యాయి. గ్రామానికి చెందిన దొరవారు పంతంగి శ్రీనివాస్రావు ఈ భూమిని అప్పట్లో గ్రామ పంచాయతీకి దానంగా ఇచ్చారు. సుమారు 0–35 ఎకరాల వరకు ఉన్న ఈ స్థలం మొన్నటి వరకు కంపచెట్లు, చెత్తాచెదరంతో ఉన్నప్పటికీ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గాంధీపార్క్ను పూర్తిగా శుభ్రం చేశారు. ఫిబ్రవరి 27 నుంచి 29వ తేదీ వరకు పనులు జరిగాయి. పదేళ్ల క్రితం వరకు ఆక్రమణలు జరిగినప్పటికీ అప్పటి నుండి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. హద్దురాళ్లు నాటిన గుర్తు తెలియని వ్యక్తులు కానీ, సోమవారం తెల్లవారే వరకు గాంధీపార్క్ స్థలంలో హద్దురాళ్లు వెలిశాయి. ఊర కృష్ణమూర్తి ఇంటి పక్క నుంచి ప్రధాన మురికి కాల్వ వైపునకు రూ.3కోట్లకు పైనే విలువ చేసే 500 గజాల స్థలానికి రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు నాటారు. ఉదయం చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ మందడి రామదుర్గారెడ్డిని సంప్రదించగా హద్దు రాళ్లు నాటిన విషయం తమ దృష్టికి వచ్చిందని, తొలగిస్తామని తెలిపారు. హద్దురాళ్లు నాటిన వ్యక్తుల వివరాలు తెలియలేదన్నారు. -
బయటపడ్డ భూ కుంభకోణం
-
కృష్ణా జిల్లాలో తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యాలు
-
పచ్చ అక్రమాలకు సర్కార్ చెక్
-
పార్టీ ఆఫీస్ నిర్మాణమూ అక్రమమే
-
అవును.. అవి దొంగ పట్టాలే!
సాక్షి, ఒంగోలు: స్వార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు అడ్డదారిలో పట్టాలు పొందేందుకు యత్నించారన్న వాదన ఇప్పుడు నిజమేనని రుజువైంది. నాడు అధికార టీడీపీ ఒత్తిడికి తలొగ్గి పోలీసు అధికారులు సైతం ఆక్రమణలను అడ్డుకున్న మహిళలపై తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కేసులు కూడా నమోదు చేశారు. నాడు వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అండగా నిలిచి నిలదీయడంతో బాధితులు కాస్త ఊపిరి పీల్చుకోగలిగారు. నేడు ఎన్ఎస్పీ అధికారులు ఆ భూమి తమదేనని, ఆ భూమిని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించాలంటూ ఒంగోలు తహసీల్దారుకు విజ్ఞప్తి చేయడం, ఈమేరకు 20 మందిని ఆక్రమణదారులుగా పేర్కొంటూ తహసీల్దారు చిరంజీవి నోటీసులు జారీ చేయడంతో నాడు చూపించిన పట్టాలన్నీ దొంగ పట్టాలే అన్నది స్పష్టమైంది. అడ్డదారిలో ఆక్రమణకు యత్నం.. ఇళ్ల పట్టాలు అంటే నివాసం ఉండేందుకు జాగాలేని వారికి ఇచ్చేవి. ఇందుకు వారికి తెల్లరేషన్ కార్డు తప్పనిసరి. కానీ, సొంత కారు ఉన్న వారు, మెడలో బంగారు కాసులతో దిగినవారు భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లారు. ఒంగోలు సౌత్ బైపాస్లోని ఎన్ఎస్పి స్థలంతోపాటు సమీపంలోని రైతుల పొలాలను సైతం దున్నేయడం ప్రారంభించారు. తమ భూమిలోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించిన వారిని తెలుగు మహిళలు దురుసుగా ప్రవర్తించారు. తమ భూమిని ఆక్రమించుకోవడం ఏమిటన్న ఓ ముస్లిం కుటుంబాన్ని అయితే కేశవరాజుకుంట రోడ్డెక్కే వరకు తరిమి తరిమి కొట్టారు. తాము గతంలోనే కొనుగోలు చేశామంటూ వారు వేడుకున్నా మాకు నాటి ఎమ్మెల్యే ఇచ్చారంటూ హెచ్చరికలు చేశారు. వీరికి మద్దతు పలికిన ఓ పోలీసు అధికారి తన సిబ్బందిని పంపించి జనాన్ని బలవంతంగా అక్కడి నుంచి పంపేందుకు యత్నించడంతో వివాదం మరింత జఠిలంగా మారింది. సంతకాలు కూడా లేకుండానే పట్టాలు జారీ ఇదిలా ఉంటే పట్టాలు చూపించాలంటూ కొందరు అడ్డం తిరగడంతో కొందరు తెలుగు మహిళలు పట్టాలు చూపించారు. తీరా వాటిలో కొన్ని పట్టాలలో తహసీల్దారు స్టాంపు ఉన్నచోట సంతకాలు ఉంటే, మరికొన్ని పట్టాలలో కనీసం తహసీల్దారు సంతకం కూడా లేకపోవడం గమనార్హం. దీంతో అసలు పట్టాలు రెవెన్యూ అధికారులే ఇచ్చారా లేదా అంటే అప్పటి తహసీల్దారు విచారణ చేస్తున్నా...పరిశీలిస్తున్నా అంటూ చెప్పడమే తప్ప తేల్చలేకపోయారు. ఇదే సమయంలో అసలు విషయం బహిర్గతమైంది. భూమి వృథాగా ఉందని, దానిని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ ఎన్ఎస్పి ఈఈ రవి అప్పట్లో తహసీల్దారు కార్యాలయానికి లేఖ రాశారు. కానీ ఆ భూమి కన్వర్షన్ కాలేదు. దీంతో ఆ భూమి తమ ఆధీనంలో ఉన్నట్లుగా ఎన్ఎస్పి అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఎన్ఎస్పి స్థలానికి రెవెన్యూ అధికారులు పట్టాలు ఎలా జారీ చేశారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై పలువురు తాలూకా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఆ భూమిలోకి ఎవరూ వెళ్లరాదంటూ పోలీసులు ఆదేశించినా పోలీసులు అక్కడ ఉండగానే కొందరు భూమిలో నిర్మాణాలు ప్రారంభించారు. నిర్మాణాలను అడ్డుకోబోయిన స్థానిక మహిళలపై ఏకంగా పోలీసులు తమ విధులను అడ్డుకున్నారంటూ కేసులు నమోదు చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. రంగంలోకి దిగిన బాలినేని విషయం రచ్చరచ్చగా మారుతుండడం, చివరకు మహిళలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నామంటూ ప్రకటించడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగారు. అప్పటి వరకు అధికారులే సమస్యను పరిష్కరిస్తారని భావించిన ఆయన పరిస్థితి శ్రుతిమించుతుందని భావించి నేరుగా కాలనీకి వెళ్లారు. ఎన్ఎస్పి స్థలంలో అధికార పార్టీ నేతలకు పట్టాలు ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. ఎన్ఎస్పి భూమిలో ప్రైవేటు వ్యక్తులు వచ్చి ప్లాట్లుగా మార్చి పొజిషన్ చూపిస్తే వాటికి మీరు సహకరిస్తారా అంటూ నిలదీయడంతో పోలీసులు ఒకడుగు వెనక్కు తగ్గారు. దీంతో పోలీసులు ఆ భూమిలోకి ఎవరూ వెళ్లడానికి వీల్లేదంటూ హెచ్చరికలు జారీచేయడం, మరో వైపు అప్పటి జిల్లా కలెక్టర్ వినయ్చంద్ భూమికి సంబంధించి విచారణ చేయిస్తున్నట్లు ప్రకటించడం, ఎన్నికలు ముగిసి ప్రభుత్వం కూడా మారడంతో వివాదం కొంతమేర సద్దుమణిగింది. 20మందికి నోటీసులు జారీ అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ పూర్తి చేసిన ఎన్ఎస్పి అధికారులు మొత్తం 4.37 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిందని, ఆ భూమి తమదే అని గుర్తించారు. ఆ భూమిలోని ఆక్రమణలు తొలగించి తమ భూమికి రక్షణ కల్పించాలంటూ ఎన్ఎస్పి అధికారులు తాజాగా ఒంగోలు మండల తహసీల్దారుకు లేఖ రాశారు. తమ విచారణలో తమ భూమిలో 20మంది పట్టాలు వేసుకున్నట్లుగా గుర్తించామని పేర్కొంటూ వారి పేర్లు జత చేశారు. దీంతో వారందరికీ ఒంగోలు మండల తహసీల్దారు చిరంజీవి మంగళవారం నోటీసులు జారీ చేశారు. అక్టోబరు 1వ తేదీలోగా ఆక్రమణలను ఎందుకు తొలగించరాదో సమాధానం చెప్పాలంటూ నోటీసులలో పేర్కొన్నారు. దీంతో వారి నుంచి వచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు. -
టీడీపీ నేత కుటుంబరావు భూ కబ్జా
-
ఆక్రమణల పై ఉక్కుపాదం
-
రూ.300 కోట్ల విలువజేసే భూములు కబ్జా..!
చెన్నై – కోల్కత్తా జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సూళ్లూరుపేటకు ఒక వైపు అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్, మరోవైపు ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో పేరొందిన పరిశ్రమలున్నాయి. ఒక్కసారిగా ఇక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అంతే భూ బకాసురులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలను కాజేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.300 కోట్ల విలువజేసే ప్రభుత్వ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గడిచిన ఐదేళ్ల కాలంలో పచ్చదండు దోపిడీకి అంతేలేకుండా పోయింది. సాక్షి, సూళ్లూరుపేట: సూళ్లూరుపేట పట్టణంలో టీడీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు బరితెగించారు. ప్రభుత్వ భూముల్ని స్వాహా చేసేశారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు యథేచ్చగా ఆక్రమించేస్తున్నా రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు తమకేం పట్టనట్టుగా వ్యవహరించారు. అర్హత లేని చాలామంది గత ప్రభుత్వ హయాంలో దర్జాగా పట్టాలు తీసుకున్న ఘనులున్నారు. సూళ్లూరుపేట పరిసర ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో ఇక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చిన విషయం తెలిసిందే. దీంతో పట్టణంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు దందాకు అంతేలేకుండా పోయింది. చాలామంది కొంతమేర పొలం కొనుగోలుచేసి భారీగా అసైన్మెంట్ భూములను కలుపుకుని ప్లాట్లు వేసిన దర్జాగా విక్రయించేశారు. 125 ఎకరాలు అధికారుల అంచనా మేరకు సూళ్లూరుపేట మున్సిపల్ పరిధిలో సుమారు రూ.300 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే రెండు చెరువులు, మూడు గుంటలు కలిపి సుమారుగా 125 ఎకరాలు కబ్జాకోరల్లో ఉన్నాయి. టీడీపీ పరిపాలనలో ఉన్నప్పుడే కబ్జాకు గురయ్యాయి. ప్రస్తుతం పట్టణం నడిబొడ్డున ఉన్న ఎర్రబాళెం చెరువు 90 శాతానికి పైగా అంటే సుమారు 30 నుంచి 40 ఎకరాలు వరకు కబ్జాకు గురైం ది. మున్సి పాలిటీ పరిధి లోని 69.50 ఎకరాల పడమటికండ్రిగ చెరువు కూడా పూర్తిగా అన్యాక్రాంతమైంది. దీనికి క్రయ, విక్రయాలు కూడా జరిగిపోతున్నాయి. అదే విధంగా పట్టణంలోని దశబృందం గుంత, స్వతంత్రపురంలో ఒక గుంత, కోళ్లమిట్టలో మరో గుంతతోపాటు మంచినీటి గుంతలన్నీ కబ్జాకోరుల్లో చిక్కుకున్నాయి. పట్టణ పరిధిలో సుమారు 29 లేఅవుట్లు వేశారు. దీనికి పదిశాతం భూమి మున్సిపాలిటీకి వదలకపోగా ఆ వెంచర్కు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమినే మింగేసిన ఘనులున్నారు. పందలగుంట ప్రాంతంలో సుమారు 25 ఎకరాలకు పైగా అసైన్భూములు భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయి. ముడుపులు తీసుకుని.. గత ప్రభుత్వంలో వందలాది ఎకరాలు కబ్జా అయినా రెవెన్యూ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ముడుపులు తీసుకుని వదిలేసిన సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. మున్సిపాలిటీ లెక్కల ప్రకారం 17.74 ఎకరాల రిజర్వ్సైట్స్ అధికారికంగా ఉన్నాయి. బందిలదొడ్డి, కళాక్షేత్రం, మన్నారుపోలూరు మిట్టలు లాంటి పొలాలను సెక్యూర్ చేశారు. పడమటకండ్రిగ, ఎరబాళెం చెరువుల ఆక్రమణలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పడమటికండ్రిగ చెరువును డంపింగ్యార్డుకు ఎంపిక చేసేందుకు మాజీ చైర్పర్సన్ నూలేటి విజయలక్ష్మి ప్రయత్నించగా అప్పటి టీడీపీ నాయకుల నుంచి ఒత్తిడి రావడంతో ఈ ప్రయత్నాన్ని మానుకున్నారు. ఆక్రమణల చెరలో ఉన్న భూములను వెలికితీసి స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చర్యలు తీసుకుంటాం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయమై రెవెన్యూ అధికారులతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటాం. ఆక్రమణల విషయం మా దృష్టిలో ఉంది. ఎక్కడెక్కడ ఎంత ఆక్రమణలకు గురైందో నివేదిక తయారుచేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. ముఖ్యంగా పడమటకండ్రిగ, ఎరబాళెం చెరువు ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. –నరేంద్రకుమార్, కమిషనర్, సూళ్లూరుపేట -
కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవు
-
ముచ్చటగా మూడోసారి..!
సర్కారు జాగా కనిపిస్తే దర్జాగా కబ్జాచేయడం టీడీపీ నాయకులకు రివాజుగా మారింది. ప్రభుత్వం మారినా.. వారి ఆక్రమణలు, ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. బడిభూమి, గుడిమాన్యం, చెరువులు, కాలువలు, వంకలు, వాగులు అన్న భేదం లేకుండా.. ఖాళీగా ఉంటే కబ్జా చేసేస్తున్నారు. ఆక్రమించడం, పునాది రాళ్లు వేయడం.. ప్రశ్నిస్తే.. భూమి తనదేనని బెదిరించడం.. సంబంధిత పత్రాలు చూపమంటే.. బెదిరింపులకు దిగడం అలవాటైపోయింది. రెవెన్యూ అధికారులు కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. సాక్షి, తిరుపతి, మంగళం : ఆధ్యాత్మిక నగరంలో టీడీపీ నాయకుల ఆగడాలు రోజు రోజుకీ శృతిమించిపోతున్నాయి. చెరువు భూములే లక్ష్యంగా ఆక్రమణలకు తెగబడుతున్నారు. తిరుపతి అర్బన్ మండలం కొంకచెన్నయ్గుంట లెక్కదాఖలా సర్వే నెం.173లో చెరువు స్థలం ఆక్రమణకు గురైంది. సుమారు ఎకరం స్థలంలో పదిహేను ఇళ్లు యథేచ్ఛగా నిర్మించుకున్నారు. గతంలో రెండుసార్లు ఇళ్లు నిర్మించగా.. రెవెన్యూ అధికారులు అతికష్టం మీద ఆక్రమణలను తొలగించారు. మాజీ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ ఒత్తిడి మేరకు కొంతకాలం రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించినా, సార్వత్రిక ఎన్నికల కోడ్ సమయంలో రెండుసార్లు ఆక్రమణలు తొలగించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. రాష్ట్రంలో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైనప్పటికీ టీటీడీకి చెందిన ఓ మహిళా నాయకురాలి ఆధ్వర్యంలో ముచ్చటగా మూడోసారి ఆక్రమించి ఇళ్లు నిర్మించడం వీరి దౌర్జన్యాలకు నిదర్శనం. రెవెన్యూ సిబ్బందిని నిర్బంధించి... సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తరుణంలో అక్కారంపల్లి వీఆర్వో పురుషోత్తం, రామచంద్ర ఆక్రమణపై ఉక్కుపాదం మోపారు. తిరుపతి అర్బన్ తహసీల్దార్ ఎం.చంద్రమోహన్ ఆదేశాల మేరకు కొంక చెన్నయ్గుంట చెరువు స్థలంలో జేసీబీలతో ఆక్రమణలు తొలగించేందుకు వచ్చారు. ఆక్రమణలు తొలగించారన్న నెపంతో టీడీపీ నాయకులు రాత్రంతా రెవెన్యూ సిబ్బందిని ఓ రూమ్లో నిర్బంధించి, నానా చిత్రహింసలకు గురిచేసి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆరోజు రాత్రి అలిపిరి పోలీసులు అతి కష్టంమీద రెవెన్యూ సిబ్బందిని టీటీడీ నాయకుల కబంధ హస్తాల నుంచి విడిపించినట్లు సమాచారం. దీన్ని బట్టి సమస్య ఏ స్థాయిలో ఉందో అవగతమవుతోంది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
‘కళా’పోషకులు
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్ (శ్రీకాకుళం): ఐదేళ్ల టీడీపీ పాలనలో పేదవాడికి ఇళ్ల పట్టా ఇవ్వాలంటే అనేక నిబంధనలు పెట్టిన ప్రభుత్వం పరిశ్రమలకు మాత్రం అడ్డగోలుగా భూములు కేటాయించింది. దీనిలో భాగంగానే రాష్ట్ర ఇంధన వనరుల శాఖ మంత్రి కిమిడి కళా వెంకటరావు కుమారుడు పరిశ్రమ ఏర్పాటు చేస్తానని చెప్పడంతో అతని కోసం మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమై భూ కేటాయింపులు జరిపారు. అయితే భూ కేటాయింపులు జరిగి మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పరిశ్రమ నెలకొల్పకపోవడం గమనార్హం. మంత్రి కుమాడు రామ్మల్లిక్ నాయుడుకి 2015 సెప్టెంబర్ 6న నారువలో 9.96 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించారు. సప్తగిరి పవర్ ప్రాజక్ట్ ప్రైవేట్ లిమిటెడ్కు ఈ కేటాయింపులు జరిపారు. ఎకరాకు రూ.4.30 లక్షలకు చొప్పున 10 ఎకరాలు రూ.43 లక్షలకు భూములను అందజేశారు. ప్రస్తుతం ఈ భూమి ధర సుమారు రూ.3 కోట్లు ఉంటుంది. అయితే పరిశ్రమ కోసం భూమి కేటాయించి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఎటువంటి పరిశ్రమ నెలకొల్పలేదు. నిబంధనలు ప్రకారం పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే భూమిని మరలా వెనుకకు తీసుకోవలసి ఉన్నా అధికారుల్లో మాత్రం చలనం లేదు. ఫలితంగా ఈ భూమిని వాణిజ్య అవసరాలకు వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ విధానాలపై పలువురు మండిపడుతున్నారు. టీడీపీ నాయకులకు అడ్డగోలుగా భూములను కేటాయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
ప్రభుత్వ భూములపై పచ్చ నేతల పంజా..!
సాక్షి, మర్రిపూడి (ప్రకాశం): మండలంలోని ప్రభుత్వ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు ఇష్టానుసారంగా ఆక్రమించుకున్నారు. తాడితోపు, డొంక, కుంట పొరంబోకు భూములను సైతం వదలకుండా యథేచ్ఛగా ఆక్రమించుకున్నారు. మండలంలో దాదాపు రెండు వేల ఎకరాలు పశువులమేత పోరంబోకు భూములు ఉన్నాయి. టీడీపీకి చెందిన కొందరు స్వార్థపరులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆక్రమించుకుంటున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం భూములు అన్యాక్రాంతం అవుతున్న విషయం అధికారులకు తెలిసినా అధికారులు పట్టించుకోలేదు. అడిగేదెవరు..ఆక్రమించేద్దాం.. మండలంలోని కూచిపూడి గ్రామానికి పడమర వైపున సర్వే నంబర్ 637–1లో 381.33 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో గత కొన్నేళ్లుగా మండలంలోని చెంచిరెడ్డిపల్లి, తిప్పలదేవిపల్లి, అంకేపల్లి, మర్రిపూడి, వైకుంఠాపురం, గంగపాలెం తదితర గ్రామాలకు చెందిన పశుపోషకులు గేదెలు, మేకలు, గొర్రెలు, ఆవులను మేపుకుంటున్నారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక తెలుగు తమ్ముళ్ల కన్ను కొండప్రాంతంలో ఉన్న ప్రభుత్వభూమిపై పడింది. కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లుగా రాత్రికి రాత్రి ప్రాక్లైన్ సహాయంతో చెట్లు తొలగించి దాదాపు 180 ఎకరాల భూమిని దున్నేసి ఆక్రమించుకొని పంటలు సాగు చేసుకుంటున్నారు. ర్అలాగే మండలంలో 2500 ఎకరాలకు పైగా తాడితోపు, వాగు, కుంట, దోవ పోరంబోకు భూములు ఉన్నాయి. కొందరు స్వార్ధపరులు ఎక్కడ పడితే అక్కడకు ఆక్రమించుకుంటూ పోతున్నారు. దీంతో పంట పొలాలకు వెళ్లే మార్గం లేకపోవడంతో రైతులు, పశుపోషకులు ఆందోళనకు గురౌతున్నారు. టీడీపీ నేతల కబంధ హస్తాల్లో.. మర్రిపూడి మండలంలో గుండ్లసముద్రం పంచాయతీ ఎస్టీ రాజుపాలెం, మర్రిపూడి పంచాయతీ గంగపాలెం, వేమవరం రెవెన్యూ పరిధి గ్రామాల్లో, గార్లపేట రెవెన్యూ పరిధిలోని నర్సాపురం, కూచిపూడి పంచాయతీ తిప్పలదేవిపల్లి గ్రామాల్లో అత్యధికంగా పోరంబోకు భూములు ఉండటంతో ఆ భూములపై అక్రమార్కుల కన్ను పడింది. ఎక్కడపడితే అక్కడికి భూములు దున్నుకుని యథేచ్ఛగా సాగు చేసుకుంటున్నారు. మండలంలోని తిప్పలదేవిపల్లి రెవెన్యూ పరిధిలో దాదాపు 600 ఎకరాలు, గంగపాలెం గ్రామానికి పడమర కొండవైపున దాదాపు 105 ఎకరాలు పోరంబోకు భూమి, ఎస్టీ రాజుపాలెంలో 300 ఎకరాలు పశువుమేత పోరంబోకు భూములు ఉన్నాయి. ఈ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకొని దున్నుకొని సాగు చేయడంతో ఆయా గ్రామాల్లో ఉన్న గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు మేపుకునేందుకు గడ్డి లేక ఇబ్బందులు పడుతున్నాయి. కనీసం ఈ పొలాల్లోకి వెళ్లేందుకు మార్గంలేక పోషకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ఎస్టీ రాజుపాలెం గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మండలంలోని గంగపాలెం పశుపోషకులు తమ పశువులు మేపు కోసం కొండ ప్రాంతానికి వెళ్లే మార్గంలేక ఇబ్బంది పడుతున్నామని, న్యాయం చేయాలని రహదారికి అడ్డుగా కంచె వేసి ఆర్అండ్బీ రహదారిపై పశువులతో ధర్నాకు సైతం దిగారు. ఇష్టానుసారంగా ఆక్రమించుకున్నారు టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారంగా పోరంబోకు భూములను దోచుకుంటున్నారు. ఎక్కడపడితే అక్కడ కట్టలుపోసుకోవడం, రాత్రికి రాత్రి చెట్లు తొలగించడం, చదును చేసి ఆక్రమించుకుంటున్నారు. అయినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. - డి.మాధవరెడ్డి పశువులు తిరగడానికి కూడా స్థలంలేదు పశువులమేత, కుంటు, దారి, తాడితోపు తదితర పోరంబోకు భూములు ఆక్రమణలు జరుగుతున్న నేపథ్యంలో మూగజీవాలను పొలాల్లో తిప్పే స్థలంలేక పశుపోషకులు అల్లాడిపోతున్నారు. ఆక్రమణ లోఉన్న పోరంబోకు భూములకు విముక్తి కల్పించాలి. - పి.శ్రీనివాసరెడ్డి సెంటుభూమి కూడా పంపిణీ చేయలేదు టీడీపీ ప్రభుత్వంలో దళితులకు సెంటుభూమి కూడా పంపిణీ చేయలేదు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో 7 విడతల్లో దాదాపు 500 ఎకరాల భూమిని దళితులకు పంపిణీ చేశారు. భూ పంపిణీ చేయకపోగా ఉన్న భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. - కొండ్రు శ్యాంబాబు, ఎమ్మార్పీస్ మండల అధ్యక్షుడు -
కోట లేని మా‘రాజు’ కోట్లు కొల్లగొట్టారు
సాక్షి టాస్క్ఫోర్స్(తూర్పు గోదావరి) : కొన్ని వందల ఏళ్ల క్రితం మనం రాజరిక పాలన చూశాం. అక్కడ రాజు చెప్పిందే శాసనం. ఆయన కోటరీలో ఉండే వారి కనుసన్నల్లోనే పాలన సాగుతుంది. యుగాలు.. తరాలు మారినా నియోజకవర్గంలో మాత్రం పరోక్షంగా ఇంకా రాచరిక వ్యవస్థ మాదిరిగా పాలన సాగుతోంది. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఓ ప్రభువులా, ఆయన ఆదేశాలతో పనిచేసే కోటరీ కనుసన్నల్లోనే నియోజకవర్గ పాలన సాగుతోంది. ఆ కోటరీలోని నేతలు అంటే నియోజకవర్గ అధికారులకు వణుకు. వారు ఏ పనికైనా ఆర్డరేస్తే నిబంధనలతో పని లేకుండా ఆ పని పూర్తి కావాల్సిందే. ప్రజలు కూడా ఈ కోటరీ ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకోవాలి. కాదంటే పోలీసు కేసులు ఉంటాయి. దారికి రాకపోతే బెదిరింపులతో కూడిన దండన ఉంటుంది. ఒక రాజు.. కొంతమంది ప్రధాన అనుచరులతో నియోజకవర్గంలో సాగే అరాచక పాలన పైకి రాజుల ప్రజా రంజక పాలనలా కనిపిస్తుంది. లోలోపల మాత్రం ప్రజా వంచక పాలన సాగుతోంది. రూ.50 కోట్లకు పైగా ఇసుక దోపిడీ తాళ్లరేవు మండలం పిల్లంకలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక సహజ వనరులను దోచుకోవడమే లక్ష్యంగా టీడీపీ నేతలు పనిచేస్తున్నారు. వారికి ఎమ్మెల్యే బుచ్చిబాబు అండగా నిలుస్తున్నారు. ఎమ్మెల్యే సోదరుడు పృథ్వీ ఆశీస్సులతో గౌతమి, వృద్ధ గౌతమీ నదీపాయలను గుల్ల చేసేస్తున్నారు. రోజుకు వేలాది ట్రాక్టర్ల ఇసుకను తరలించేస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా రూ.50 కోట్లకు పైగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. అనధికారిక ర్యాంపుల ద్వారా ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తూ ఇసుకాసురులు కోట్లాది రూపాయల ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. వీరికి ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉండడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. బహిరంగంగానే గోదావరి పాయల నుంచి ఇసుకను అక్రమంగా తరలించుకు పోతున్నారు. అనునిత్యం నిరంతరాయంగా ఇసుక అక్రమ దందా కొనసాగుతున్నా పట్టించుకొనే అధికారులు లేకపోవడంతో ఇసుకాసురులకు కాసుల పంట పండింది. ముమ్మిడివరం నియోజకవర్గంలో పిల్లంక, పల్లవారిపాలెం, అన్నంపల్లి, ఎదుర్లంక, కేశనకుర్రు పశువుల్లంక ఇసుక ర్యాంపుల్లో అనధికార రవాణా కొనసాగుతోంది. నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న పాండిచేరి యానాం అక్రమార్కులకు అడ్డాగా నిలుస్తోంది. యానాంలో అధికారులకు ఇసుక రవాణాపై ఎటువంటి ఆంక్షలు లేకపోవడంతో ఇక్కడ ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. యానాం పరిసర ప్రాంతాల్లోని గోదావరి పాయల్లో ఇసుకను సేకరించి విక్రయిస్తున్నారు. నియోజకవర్గంలో ముమ్మిడివరం, ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాల్లో పది అనధికార రీచ్ల ద్వారా కోట్లాది రూపాయల ఇసుకను అక్రమంగా తరలించుకు పోయారు. ట్రాక్టర్ ఇసుకకు రూ.150లు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇలా రోజుకు 1500 నుంచి 2000 ట్రాక్టర్ల వరకు ఇసుకను తరలిస్తూ లక్షలాది రూపాయలు తెలుగు తమ్ముళ్ల తమ జేబులు నింపుకొంటున్నారు. ఇలా నెలకు కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకునేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. పరిసర గ్రామాల్లో ఉన్న తెలుగు తమ్ముళ్లలకు రోజుకు కొంత మొత్తంలో సొమ్ములు ముట్టచెప్తూ తమ అక్రమార్జనకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఇసుక ర్యాంపును తెలుగు తమ్ముళ్లు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఇసుక ఉచితమంటూ ట్రాక్టర్కు రూ.175లు జట్టుకూలీ గాను, మరో రూ.75లు బాట చదును చేయడానికి వసూలు చేయాలని ప్రభుత్వం అనుమతులిచ్చింది. అది అనధికార వ్యక్తుల ప్రమేయం లేకుండా రెవెన్యూ, పోలీసుల పర్యవేక్షణలో ఇసుక తరలించాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. అయితే ఇక్కడ జరుగుతున్నదంతా తెలుగు తమ్ముళ్ల పర్యవేక్షణలోనే. మండల స్థాయి నాయకుడికి చెందిన కార్యకర్తలే ర్యాంపు నిర్వహణ బాధ్యతను తీసుకున్నారు. జట్టుకూలీ రూ.175లు ర్యాంపు బాట నిర్వహణకు కేటాయించిన రూ.175తో పాటు అదనంగా రూ.650 అంటే ట్రాక్టర్కు రూ.1000 వసూలు చేస్తున్నారు. జట్టు కూలీ రూ.175 ఎగుమతి కూలీలకు పోగా మిగిలిన రూ.825లు ఇలా రోజుకు 1500 నుంచి 2000 ట్రాక్టర్ల వరకు ఇసుక తరలిస్తూ నెలకు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. అలాగే నియోజకవర్గంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. రైతుల భూముల్లోను, ప్రభుత్వ పట్టా భూముల్లో, మట్టి అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎమ్మెల్యే అండదండలతో తెలుగు తమ్ముళ్లు అక్రమ మట్టి తవ్వకాలతో కోట్లాది రూపాయలు దోచేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో పెరుగు లంకలను ప్రభుత్వం పేద వర్గాలు సాగు చేసుకుని జీవనోపాధి పొందేలా ఆయా గ్రామాల వారికి డీ ఫారం పట్టాలు ఇచ్చారు. అయితే రియల్టర్లు, కాంట్రాక్టర్ల కన్ను ఈ భూములపై పడింది. ఈ భూముల్లో తువ్వ ఇసుకను తరలించి లే అవుట్లు చదును చేయడానికి ఉపయోగిస్తున్నారు. లంకాఫ్ ఠానేల్లంక, కర్రివానిరేవు, గేదిల్లంక, పశువుల్లంక, పిల్లంక, గాడిలంక, కొత్తలంక, నదీ పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్నారు. భారీ యంత్రాలు, వాహనాలు వినియోగిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు రియల్టర్ల అవతారమెత్తి లంక భూములను కొల్లగొడుతున్నారు. విలువైన భూములను గుల్ల చేస్తున్నారు. ఎటువంటి సీనరేజీ లేకుండానే సుమారు రూ.10 కోట్ల వరకు అక్రమ మట్టిని కొల్లగొట్టినట్లు సమాచారం. ఇసుక దోచేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు తెలుగుదేశం నాయకులు ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇసుక సీనరేజ్తో పంచాయతీలకు ఆదాయం సమకూరేది. ఇప్పుడు ఆ సొమ్ములు దేశం నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా సహజ వనరులను ఇష్టమొచ్చినట్లు దోచుకుంటున్నారు. - గుదే వెంకటేశ్వర్లు, అన్నంపల్లి, ముమ్మిడివరం మండలం 13 ఎకరాల సత్రం భూముల్లో పాగా ముమ్మిడివరం మండలం కొమానపల్లిలో ఉన్న వారణాసి సుబ్బారాయుడు సత్రం అధికారం అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు భూ ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతూ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పోరంబోకు భూములతో పాటు దేవదాయ శాఖ భూములు, సత్రం భూములు స్వాధీనం చేసుకుని పక్కా భవనాలు నిర్మించుకుంటున్నారు. నామ మాత్రపు లీజు కడుతూ కోట్లాది రూపాయల విలువైన సత్రం భూములు కబ్జా చేస్తున్నారు. బాటసారులు సేదతీరేందుకు, అన్న దానం చేసేందుకు దాతలు సత్రాలు నిర్మించి వాటి నిర్వహణకు భూములను దానంగా ఇచ్చారు. అయితే వాటిని అధికార పార్టీ నాయకుల అండదండలతో నామమాత్రపు లీజు పేరుతో స్వాధీనం చేసుకొని పక్కా భవనాలు నిర్మించుకున్నారు. దీంతో రూ.10కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమై దాతల ఆశయం నెరవేరకుండా పోతోంది. పూర్వీకులు తమకున్న ఆస్తిలో కొంత ధనాన్ని వెచ్చించి అన్నదాన సత్రాలను నిర్మించేవారు. ఆకలిగా ఉన్న వారిని ఆదుకోవడమే కాకుండా బాటసారులకు ఉపశమనం కల్పించేందుకు కట్టడాలు నిర్మించి వాటి నిర్వాహణకు కొంత భూమిని కేటాయించేవారు. కాలానుగుణంగా వాటి నిర్వహణ బాధ్యత అధికారుల చేతుల్లోకి వచ్చింది. తెలుగుతమ్ముళ్ల స్వార్థంతో అవి అవినీతికి ఆలవాలంగా మారాయి. దాతల ఆశయాలు నీరు గారిపోయాయి. ముమ్మిడివరం మండలం కొమానపల్లిలో వారణాశి సుబ్బారాయుడు సత్రం 1911లో నిర్మించారు. కొమానపల్లి గ్రామానికి చెందిన వారణాశి సుబ్బారాయుడు ముత్యాలు, పగడాల వ్యాపారం చేసేవారు. అప్పట్లో ఫ్రాన్స్ దేశస్తులు సమీపంలోని ఫ్రెంచి యానాంలో వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు. కోనసీమ నలుమూలల నుంచి వ్యాపారులు, ప్రజలు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు వెళ్తూ ఈ ప్రాంతంలో కొంత సేపు సేదతీరేవారు. వారి ఉపయోగార్థం సుబ్బారాయుడు ప్రధాన రహదారిని ఆనుకుని కొమానపల్లిలో 30 సెంట్లు విస్తీర్ణంలో సత్రం నిర్మించారు. దీని నిర్వహణకు చిన కొత్తలంక గ్రామంలో 13.75 ఎకరాల భూమిని కేటాయించారు. బాటసారులు సేద తీరేందుకు సువిశాల గదులతో భవనం నిర్మించారు. మంచినీటి స్నానాలు చేసేందుకు పెద్ద బావిని నిర్మించారు. 1985 వరకు ఈ సత్రం నిర్వహణ సక్రమంగా జరిగింది. తదనంతరం భూములను ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గుత్తుల పాటేశ్వరరావు, వరప్రసాద్లకు చెందిన కుటుంబ సభ్యుల పేరున నామమాత్రపు లీజు చెల్లిస్తూ తమ స్వాధీనంలో ఉంచుకున్నారు. ఆదే గ్రామానికి చెందిన నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకుడి అండదండలతో దాదాపు గత 30 ఏళ్లుగా వారి స్వాధీనంలో ఉంచుకుని ఆ భూముల్లో పక్కా భవనాలు నిర్మించుకున్నారు. ఆక్రమణదారులకు ఆ టీడీపీ నాయకుడు వత్తాసు పలకడంతో దేవదాయ శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో ఆ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. అక్రమణ దారుల చేతుల్లోకి వెళ్లడంతో సత్రానికి లీజు ఇవ్వకుండా రివెన్యూ అధికారులకు పన్నులు చెల్లించకుండా సత్రం సొమ్మును దర్జాగా దోచేసుకుంటున్నారు. ప్రజా సంక్షేమంలా కోడి పందేలు కోర్టులు, పోలీసులు కోడి పందేలు వద్దంటూ హెచ్చరిస్తున్నా ఇక్కడ పాలించే రాజుకు చెవికెక్కవు. పేకాట, కోడి పందేలతో కూడిన వినోదం సంప్రదాయ హక్కులా మాట్లాడారు. కోర్టులు, పోలీసులు ఏమనుకున్నా.. ఎన్ని ఆంక్షలు పెట్టినా నియోజకవర్గంలో సంక్రాంతికి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా క్రికెట్ మైదానాన్ని గ్యాలరీని తలపించేలా కోడి పందేల బరులు, ఎల్ఈడీ తెరలతో ప్రసారం... పందేల రూపంలో రూ.కోట్లు చేతులు మారతాయి. వందలాది పందెం కోళ్లు కాళ్లకు కట్టిన కత్తుల వేటులకు బలై నేల కూలతాయి. కోడి పందేలకు అదనపు వినోదంగా పేకాటలు, గుండాటలు ఇలా అసాంఘిక కార్యకలాపాలకు నియోజకవర్గం సంక్రాంతి మూడు రోజులు వేదిక అయిపోతుంది. పోలీసుల నోళ్లను మామూళ్లతో మూయిస్తారు. నాలుగేళ్లు నుంచి ఏటా సంక్రాంతికి భారీ పందేలకు ఆ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే జరుగుతాయి. నాలుగేళ్లుగా కోడి పందాల నిర్వహణతో రూ.5 కోట్ల వరకు దండుకున్నారు. ఆ ప్రజాప్రతినిధి సోదరుడే ఇసుకాసురులకు బాస్ కావడం గమనార్హం. తాళ్లరేవు, ఐ.పోలవరం, ముమ్మిడివరం మండలాల్లో ఇప్పటికీ ఇసుక దందా కొనసాగుతోంది. వివిధ కార్పొరేషన్ల నుంచి మంజూరయ్యే రుణాలు పొందినవారెవరూ ఇక్కడ పేదలు కాదు. టీడీపీ కార్యకర్త అయితే చాలు అదే అర్హత. ఇక గృహ నిర్మాణ రుణాల మంజూరు కోటరీ కనుసన్నల్లోనే ఉంటోంది. ఒక్కో ఇంటి రుణ లబ్ధిదారుడి నుంచి రూ.10 వేల నుంచి రూ.20 వేలు తీసుకుని మంజూరు చేయిస్తున్నారు. ప్రజలు తమకు ఏదైనా అవసరం, ఇబ్బంది అనివార్యమైనప్పుడు ఆ ప్రజాప్రతినిధి వద్దకు నేరుగా వెళ్లి చెప్పుకునే పరిస్థితి ఉండదు. కోటరీలోని చిన్న బాస్లను ప్రసన్నం చేసుకుంటేనే వారు ఏ పని కోసం వచ్చారో ఆ పని పూర్తవుతుంది. తమ తోవకు అడ్డువచ్చే వారిని.. తమకు ఎదురు తిరుగుతున్న వారిని కోటరీ ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. అలాంటి వారిపై తమకున్న అధికార బలంతో పోలీసులతో బైండోవర్ కేసులు లేదా ఇతర పోలీసు కేసుల్లో అక్రమంగా ఇరికించేస్తారు. ఇందులో బాధితులు ఎక్కువ మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు కావడం గమనార్హం. అభివృద్ధి ఆమడదూరం గ్రామాల్లోని శివారు ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి జరుగలేదు. కనీసం తాగునీరు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలు కూడా లేక జనం ఇబ్బంది పడుతున్నారు. టీడీపీ నాయకులు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకోవడం దారుణం. నిరుపేదలకు సంక్షేమ పథకాలు సైతం పూర్తిగా అందడంలేదు. – వడ్డి ఏడుకొండలు, విశ్వజన కళామండలి జిల్లా అధ్యక్షుడు, సుంకరపాలెం, తాళ్లరేవు మండలం ‘మరుగు’లోనూ రూ.8కోట్లు మెక్కేశారు పూర్తిగా సొమ్ములు తీసుకున్నా నిర్మాణం పూర్తి కాని మరుగుదొడ్డి బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చి దిద్దాలన్న లక్ష్యంతో పట్టణాలు, గ్రామాల్లో చేపడుతున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణపనుల్లో అంతులేని అవినీతి జరిగింది. పాత వాటికి రంగులు పూసి కొన్ని, నిర్మాణం కాకుండానే మరికొన్ని వాటికి పూర్తిస్థాయిలో బిల్లులు తీసుకుని సుమారు రూ.8 కోట్లు వరకు సొమ్ములు కాజేశారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిసరాల పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎస్) గ్రామాలు ఎంపిక చేసి నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకున్నారు. చాలాచోట్ల ఈ నిర్మాణ పనులు పూర్తి కాకుండానే బిల్లులు దండుకుంటూ లబ్ధిదారులకు టోపీ పెడుతున్నారు. అధికారులు సైతం చూసీ చూడనట్లుగా వ్యవహరించడంతో అవకతవకలు చోటుకున్నాయి. గత జూలై చివరి నాటికి ఓడీఎఫ్ గ్రామాలుగా ప్రకటించాలని లక్ష్యంతో నిర్మాణాలు వేగవంతం చేశారు. లక్ష్యం పూర్తికావాలనే ఉన్నతాధికారుల వత్తిడి మేరకు చాలాచోట్ల నిర్మాణం పూర్తికాకుండానే రికార్డుల్లో పూర్తి అయినట్లు నమోదు చేసేశారు. ఉన్నవాటికి మెరుగులు దిద్ది.. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ విషయంలో కొన్నిచోట్ల ఉన్న వాటినే కొత్తగా నిర్మించినట్లు చూపి బిల్లులు తీసుకున్న వైనం తేటతెల్లమవుతోంది. స్థానికంగా నాయకుల ప్రోద్బలంతో అధికారులు వాటికి పచ్చ జెండా ఊపడంతో అక్రమాలు జోరుగా జరిగాయి. ఒక్కొక్క మరుగుదొడ్డికి ప్రభుత్వ సాయం రూ.15వేలు ఇస్తుండగా పాతవాటికి బిల్లులు చేయించడానికి ముందుగానే లబ్ధిదారులతో మాట్లాడుకుని బిల్లులు తీసుకున్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ఉన్నతాధికారుల లక్ష్యాన్ని నిర్దేశించడంతో వాటిని పూర్తిచేసినట్లుగా కూడా ఉంటుందని చాలాచోట్ల రికార్డులకే పరిమితం చేశారు. పట్టణాల్లో వ్యక్తిగత మరుగుదొడ్డిని నేరుగా నిర్మించుకోలేని లబ్ధిదారులకు ఎస్ఎల్ఎఫ్ ద్వారా నిర్మించి ఇచ్చే ప్రక్రియ ఉంది. మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలు వీటిని ఓ కాంట్రాక్టర్కు నిర్మాణ బాధ్యతలు అప్పగించి అక్కడ కొనసాగుతున్న పని ఆధారంగా విడతల వారీగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. వీటిలోనూ ఆక్రమాలు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల మరుగుదొడ్లు నిర్మించుకుండానే బిల్లులు తీసుకోగా కొన్ని చోట్ల మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు చెల్లించేశారు. ముమ్మిడివరం నగర పంచాయతీలో ఇటీవల మరుగుదొడ్ల నిర్మాణంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగర పంచాయతీలో 2 వేలు పైచిలుకు మరుగుదొడ్లు మంజూరయ్యాయి. నిర్మాణ పనులు వేగవంతం చేయాలనే లక్ష్యంతో ఈ పనులను చాలావరకు నిర్మాణ బాధ్యతలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ప్రభుత్వం నుంచి రూ.15 వేలుతో అధికారులు అప్పగించిన కొలతల ఆధారంగా సిమెంటు ఇటుకలతో నిర్మించాలి. అధికారులు ఇచ్చిన కొలతలతో నిర్మించిన మరుగుదొడ్లు విశాలంగా లేకపోవడంతో లబ్ధిదారులు సంతృప్తి చెందలేకపోతున్నారు. దీంతో వారి కోరిక మేరకు కొలతల ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతో పాటు అదనంగా రూ.5 వేల నుంచి 10 వేల వరకు లబ్ధిదారుల నుంచి సొమ్ములు వసూలు చే శారు. అంతేకాకుండా పలు వార్డుల్లో ముందుగా నిర్మించుకున్న మరుగుదొడ్లు ఎస్ఎల్ఎఫ్లో పెట్టి ఒక్కొక్క లబ్ధిదారుడికి రూ.5వేలు ఇచ్చి మిగిలిన సొమ్ము స్థానిక నాయకులు, కాంట్రాక్టర్ నొక్కేశారు. జియో ట్యాగింగ్లో మతలబు నిర్మాణం పారదర్శకత కోసం జియో ట్యాగింగ్ చేపట్టారు. పనుల ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకు ఫొటోలు తీసి జియో ట్యాగింగ్ చేయాలి, ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగకపోవడం వల్ల అక్రమాలు చోటు చేసుకున్నాయి. బిల్లులు చెల్చించే ప్రక్రియలో ఈ ఫొటోలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయకుండానే యూనిట్లకు పూర్తి స్థాయి బిల్లులు చెల్లించినట్లు కనిపిస్తోంది. ఉదాహరణకు నగర పంచాయతీ పరిధి 13వ వార్డులో పెయ్యల ధనలక్ష్మి పేరున మంజూరైన మరుగుదొడ్డిని ఎస్ఎల్ఎఫ్ ద్వారా ఓ కాంట్రాక్టర్కు నిర్మాణ బాధ్యత అప్పగించారు. అయితే నిర్మాణం పూర్తికాకుండానే తన పేరున రూ.15 వేలు తీసుకున్నారని నిర్మాణం పూర్తి చేయాలని అడుగుతున్నా పూర్తి చేయడం లేదని ఆమె తెలిపింది. అలాగే వాకపల్లి నాగలక్ష్మి పేరు మీద మరుగుదొడ్డి నిర్మాణం పూర్తి చేసినట్లు ఎస్ఎల్ఎఫ్ ద్వారా రూ.15వేలు తీసుకున్నారు. అయినా మరుగుదొడ్డి నిర్మాణం పూర్తి చేయలేదని ఆమె తెలిపారు. అవినీతిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులకు ఫిర్యాదు చేయగా అవినీతి తేటతెల్లమైంది. అలాగే నియోజకవర్గంలో 14,253 యూనిట్లు మంజూరు కాగా రూ.13.60 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో కోట్ల రూపాయల అవినీతి జరిగింది. బాధితులు పలు పర్యాయాలు అధికారులకు ఫిర్యాదు చేసినా అవినీతి బయటపడకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారు. తమ్ముళ్లే నీరు–చెట్టు కాంట్రాక్టర్లు నియోజకవర్గంలో నీరూ–చెట్టు పథకం పనులు అవినీతికి ఆనవాళ్లుగా దర్శనమిస్తున్నాయి. నియోజకవర్గంలో నీరు–చెట్టూ పథకంలోరూ. రూ7.72 కోట్లతో పంటకాలువల రిటైనింగ్ గోడలు, పూడిక తీత పనులు చేపట్టారు. గత ఏడాది చేపట్టిన పంటకాలువల రిటైనింగ్ గోడలు అక్కడక్కడా కూలిపోయి అవినీతికి అద్దం పడుతున్నాయి. నియోజక వర్గంలో ముమ్మిడివరం, ఐ.పోలవరంలలో 2017–18 ఏడాదిలో మాత్రమే నీరు–చెట్టు పథకం పనులు చేపట్టారు. కాట్రేనికోనలో 2016–17లో తెలుగు తమ్ముళ్లు కాంట్రాక్టర్ల అవతారమెత్తి అయినకాడికి దండుకున్నారు. 2017–18 సంవత్సరంలో మాత్రమే 78 పనులకు రూ.2.69 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటిలో అధికశాతం పనులు పంట కాలువలకు రిటైనింగ్ గోడలు నిర్మించారు. మిగిలిన పనులు కాలువ టీపీల నిర్మాణం చేశారు. ఈ పనుల్లో అధికశాతం రూ.10 లక్షల లోపు పనులుగా కేటాయించి నామినేటెడ్ ప్రాతిపదికన తెలుగు తమ్ముళ్లకే కట్టబెట్టారు. మిగిలిన పనులకు టెండర్లు పిలిచినా నీటి సంఘం పర్యవేక్షణలో అధికార పార్టీకి చెందిన నీటి సంఘాలే పనులు చేపట్టాయి. నియోజకవర్గంలో జరిగిన నీరు చెట్టూ పనులన్నీ కాంక్రీటు పనులే కావడం గమనార్హం. దాదాపు అన్ని పనుల్లోనూ నాణ్యత లేదనే ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ కార్యక్రమాల నిర్వహణకు కాంట్రాక్టర్లు, నీటి సంఘాల నాయకులు డబ్బులు ఇవ్వాల్సి రావడంతో పలు చోట్ల నాణ్యత లోపించిందనే ఆరోపణలు వినిపిస్తునాయి. ముమ్మిడివరం మండలంలో రూ.60 లక్షలతో 11 పనులు చేపట్టారు. మాగాం–అయినాపురం, అయినాపురం–ఉప్పలగుప్తం, అయినాపురం–కాట్రేనికోన, కాలువ గట్లకు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టారు. పూర్తైన రిటైనింగ్ గోడలు పలు చోట్ల నాణ్యత లోపించి అనతికాలంలోనే శిథిలమయ్యే ప్రమాదముందని రైతులు అంటున్నారు. వాటి నిర్మాణం జరిగిన చోట మట్టి పనులు అసంపూర్తిగా వదిలేశారు. ఇష్టానుసారంగా పనులు పనులను తెలుగుదేశం కార్యకర్తలకు అప్పగించడంతో ఇష్టానుసారంగా చేపట్టారు. కాలువల్లో పూడిక తీత పనులు తూతూ మంత్రంగా చేశారు. నాసిరకం మెటీరియల్తో నాణ్యత లేకుండా రిటైనింగ్ వాల్స్ నిర్మించారు. అవి అక్కడక్కడా శిథిలమై కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తి కాకుండానే బిల్లులు తీసుకున్నారు. అయినాపురం–ఉప్పలగుప్తం కాలువలో పూడికలు తీయకుండా వదిలి వేయడంతో సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనులు అస్తవ్యస్తంగా చేస్తున్నారు. – ఏఎస్వీ సుబ్బారావు, రెతు, అయినాపురం -
ఇందిరమ్మ జాగా.. వేసెయ్ పాగా
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఇందిరమ్మ ఇంటి పథకం ఎంతోమందికి నీడనిచ్చింది. పేదోడికి గూడు దరిచేరింది. అయితే రామగుండం ఎన్టీపీసీ ప్రాంతంలో పేదలకు చెందాల్సిన నివాస స్థలాలు ధనవంతుల, ఆక్రమణదారుల చేతుల్లో చేరిపోతున్నాయి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మూడో డివిజన్లో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా అవుతోంది. ఆక్రమణపై రెండేళ్ల క్రితం అధికారులకు ఫిర్యాదులు అందడంతో అధికారులు ఇందిరమ్మకాలనీలో ఇంటింటా సర్వే చేపట్టారు. అయితే ఈ సర్వే తూతూ మంత్రంగా నిర్వహించడంతో దళారులు ఇష్టారాజ్యంగా ఆక్రమణల పర్యవ కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో భూమి కొనాలన్నా, అమ్మాలన్నా వీరి ప్రమేయం తప్పనిసరి. ఇందిరమ్మకాలనీలోని స్థలాలను విక్రయించరాదని నిబంధనలు ఉన్నా యథేచ్చగా విక్రయాలు కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జ్యోతినగర్(రామగుండం): రామగుండం కార్పొరేషన్ మూడో డివిజన్లో పేదల కోసం కేటాయించిన ఇందిరమ్మ నివాస స్థలాలు ధనికుల చేతుల్లోకి వెళ్లి ఖరీదైన భవంతులు వెలుస్తున్నాయి. ప్రభుత్వం పేదలు నివసించడానికి ఏర్పాటు చేసిన ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం ఉన్న వాళ్ల చేతిలోకి వెళ్లడంతో పేదలకు అన్యాయం జరుగుతోంది. ఇందిరమ్మ కాలనీలో 2008 నుంచి ఇప్పటి వరకు అధికారికంగా 6,365 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు సమాచారం. మంజూరైన ఇళ్లలో సుమారు 500 మంది లబ్ధిదారులు మాత్రమే నిర్మించుకుని నివాసముంటున్నారు. మిగతా నిర్మాణాలు వివిధ దశల్లో నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలో ఉన్న కొందరు ప్లాట్లను తమ అజమాయిషీలో తెచ్చుకుని వ్యాపార కేంద్రంగా మలుచుకున్నారు. గతంలో పేదవారుగా ఇక్కడికి వచ్చి ఇప్పుడు ధనవంతులుగా మారిపోయారు. ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి ఒక్కోప్లాటు రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు విక్రయిస్తున్నారు. అమ్మకాలు, కొనుగోలు అంతా సాదా పత్రాలలోనే మారుతూ ఉంది. సొంతంగా పట్టా ఉన్నవారి ప్లాట్లను ఆక్రమించిన సంఘటనలు ఇక్కడ సర్వసాధారణంగా మారాయి. అసలైన ఇందిరమ్మ లబ్ధిదారులు తమకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు, తాము పోగుచేసుకున్న డబ్బులతో అరకొరగా నిర్మించుకుని నివసిస్తున్నారు. దళారుల నుంచి కొనుగోలు చేసిన కొందరు ఖరీదైన భవంతులు నిర్మిస్తున్నారు. ఇందిరమ్మకాలనీలో ఇంత ఖరీదైనా ఇళ్లు ఉంటుందా.. వీరు కూడా పేదవారేనా అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొనసాగుతున్న చదును పనులు ఇందిరమ్మకాలనీలో కొందరు ఒక టీంగా ఏర్పడి పేదలకు భూములు ఇస్తాం అంటూ ఖాళీ స్థలాల చదును ప్రారంభించారు. చదును చేపట్టడంతోపాటు స్థలాలు కావాల్సినవారి నుంచి ముందస్తుగా చదును పనుల కోసం రూ.1,000 ఇవ్వాలని వసూళ్లు చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు సుమారు 70 మంది వద్ద వసూలు చేసినట్లు సమాచారం. 100 ఫీట్ల రోడ్డు కబ్జా.. ఇందిరమ్మ కాలనీలో 100 ఫీట్ల రోడ్డు నిర్మించేందుకు వీలుగా ప్లాట్లను ఏర్పాటు చేసి గతంలో అందించారు. అయితే వంద ఫీట్ల రోడ్డు నిర్మాణం కాకపోవడంతో 30 ఫీట్లు రోడ్డు వదిలి ఇరువైపులా మిగిలిన 35 ఫీట్ల చొప్పన ఉన్న భూమిని కూడా కాజేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ విషయంపై ఇటీవల మేయర్ పర్యటించిన క్రమంలో స్థానిక కార్పొరేటర్ ఫిర్యాదు కూడా చేశారు. అర్హులైన పేదలకు అన్యాయం జరిగిందని సమాచారం మేరకు రామగుండం రెవెన్యూ అధికారులు రెండేళ్ల క్రితం ఇందిరమ్మకాలనీలో ఎవరు నివిసిస్తున్నారు. స్థలాలు ఎవరి పేరుమీద ఉన్నాయనే సమాచారాన్ని సేకరించేందుకు సర్వే చేశారు. సర్వే పూర్తి చేయకపోవడమే దళారులకు వరంగా మారింది. పూర్తిస్థాయిలో కాలనీలోని మొత్తం నివాసాలు సర్వే చేసి అసలైన లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారు అనే విషయాలను సేకరించి మిగతా స్థలాలను పేదలకు ఇవ్వాల్సిన అవసరం అధికారులపై ఉంది. సర్వే అనంతరమే బినామీగా ఉన్నవారు ఎందరు, అసలు మంజూరు ఉన్నవారు ఎవరు.. అనే విషయాలు వెలుగులోకి రానున్నాయి. అక్రమంగా చదును చేస్తే చర్యలు కార్పొరేషన్ మూడో డివిజన్ ఇందిరమ్మకాలనీలోని ఖాళీ స్థలాలను కొందరు చదును చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. సమాచారం మేరకు రెవెన్యూ అధికారులను సంఘటన స్థలానికి పంపించి విచారణ చేపట్టాం. అసిస్టెంట్ సిటీ ప్లానర్కు కూడా సమాచారం ఇచ్చాం. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. - హనుమంతరావు, రామగుండం తహసీల్దార్ -
‘క్రీడా’క్రమణ
ఒంగోలు టౌన్: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను ఎంచక్కా అనుసరిస్తున్నారు అధికార పార్టీ నేతలు. జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలో కోట్లాది రూపాయల విలువైన స్థలంపై కన్నేసిన టీడీపీ నాయకుడు అధికారం ఉండగానే దానిని సొంతం చేసుకోవాలకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా దానికొక క్రీడా శిక్షణ పేరు పెట్టారు. క్రీడల కోసం ఆ స్థలాన్ని కేటాయించాలంటూ నగర పాలక సంస్థకు ‘అధికార’పార్టీ హోదాలో దరఖాస్తు చేసుకున్నాడు. దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ రాకమునుపే ఏకంగా ‘క్రీడా’క్రమణకు పాల్పడ్డాడు. నగరంలో విలువైన స్థలాన్ని క్రీడా శిక్షణ పేరుతో తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. మునిసిపల్ స్థలం చుట్టూ సరిహద్దులు ఏర్పాటు చేశాడు. మట్టిని తరలించి చదును చేసుకొనే పనిలో నిమగ్నమయ్యాడు. నగరపాలక సంస్థ నుంచి అనుమతి రాకపోయినప్పటికీ అధికార పార్టీ అండతో ఆ స్థలంలో తాను అనుకున్న క్రీడా శిక్షణకు తుదిరూపు ఇచ్చాడు. ఇక్కడ శిక్షణ ఇస్తామంటూ ఏకంగా బోర్డు కూడా పెట్టేసుకున్నాడు. దానిని నియంత్రించాల్సిన నగర పాలక సంస్థ అధికారులు ‘జీ హుజూర్’ అన్నట్టు వ్యవహరిçస్తుండటంతో ఆ క్రీడా శిక్షకుడు హద్దులు గీసుకొని కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని తన ఆధీనంలోకి తెచ్చేసుకున్నాడు. ఆచ్చి బూచ్చి ఒంగోలు నగరంలోని ఒక వ్యక్తికి ఆచ్చి అనేది నిక్ నేమ్. తన పేరుకు ముందు ఆ పేరుతో పిలిపించుకుంటాడు. షటిల్ ఆటలో తన ప్రావీణ్యాన్ని శిక్షణ రూపంలోకి తీసుకువచ్చి ఆదాయ మార్గంగా మలుచుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ క్రీడా శిక్షకుడు ఎంచుకున్న స్థలాలే వివాదాస్పదం అవుతున్నాయి. కలెక్టరేట్లో టెన్నిస్ కోర్టు ఉంది. ఆ టెన్నిస్ కోర్టుకు సంబంధించిన స్థలాన్ని ఆచ్చి పరం చేసేశారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయాలు ఉండే కలెక్టరేట్ ఆవరణలోని స్థలాన్నే అధికార పార్టీని అడ్డం పెట్టుకొని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. దీనిని మరువకముందే మరో మునిసిపల్ స్థలంపై ఆ శిక్షకుడి కన్ను పడింది. ఒంగోలు నగర నడిబొడ్డున ఊరచెరువులో ఖాళీగా ఉన్న కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని తన అధీనంలోకి తెచ్చుకునేందుకు క్రీడా శిక్షణను తెరపైకి తీసుకువచ్చాడు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి సిఫార్సుతో తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఊర చెరువులోని షాదీఖానాకు వెనుకవైపు ఉన్న నగర పాలక సంస్థ అధీనంలోని స్థలానికి సరిహద్దులు వేసుకొన్నాడు. స్కేటింగ్ రింక్ పేరుతో బోర్డు ఏర్పాటు చేసి ఆ స్థలాన్ని అనధికారికంగా తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు. పేదలకో న్యాయం పెద్దలకు మరో న్యాయం.. ఒంగోలు నగరంలో పేదలు ఇళ్ల స్థలాలు లేక ఎక్కడైనా నగర పాలక సంస్థకు చెందిన స్థలంలో చిన్న గుడిసె వేసుకుంటే నగర పాలక యంత్రాంగం పోలీసు బలగంతో అక్కడకు చేరుకొని దానిని తొలగించే వరకు అక్కడ నుంచి కదిలేదుకాదు. కోట్ల విలువైన స్థలాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని మాత్రం పల్లెత్తు మాట అనే సాహసం నగర పాలక సంస్థ అధికారులు చేయడం లేదు. అందుకు కారణం సదరు వ్యక్తికి అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఆశీస్సులు ఉండటమే. పరిశీలనలో ఉంది: కార్పొరేషన్ కమిషనర్ ఒంగోలు నగరంలోని ఊరచెరువు స్థలంలో క్రీడాశిక్షణకు సంబంధించి అసోసియేషన్ తరపున స్థలం కేటాయించమని తన కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారని కమిషనర్ వెంకటకృష్ణ చెప్పారు. ఆ స్థలాన్ని ఎవరికీ కేటాయించలేదని, పరిశీలనలోనే ఉందన్నారు. ఈ విషయమై విచారించిన తరువాత అనుమతి ఇచ్చేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి అయిన జిల్లా కలెక్టర్కు నోట్ ఫైల్ పెడతామని తెలిపారు. -
ఏపీ రాజదానిలో బడాబాబుల కబ్జా పర్వం
-
‘కబ్జాకోరునని నిరూపిస్తే రాజకీయాల్లో ఉండను’
సాక్షి, హైదరాబాద్: భూ కబ్జాలకు తాను పాల్పడినట్టుగా ఉత్తమ్కుమార్రెడ్డి నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ అన్నారు. తనపై ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఉత్తమ్కు గాంధీభవన్లో ఏ గౌరవమూ లేదని, ఢిల్లీలో డబ్బులిచ్చి పదవిని కాపాడుకుంటున్నారన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. డబ్బులకు అమ్ముడుపోయినట్టుగా తనపై వ్యాఖ్యలు చేసిన ఉత్తమ్ కారులోనే డబ్బులు దొరికాయని.. అప్పుడు ఎవరికి అమ్ముడుపోయి డబ్బులు తెచ్చారో చెప్పాలన్నారు. -
ఆ స్థలం స్వాధీనం
బొబ్బిలి : పట్టణ నడిబొడ్డున ఉన్న దేవాదాయ శాఖ స్థలాన్ని విక్రయించేశారని తెలుసుకున్నామనీ, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నామని దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈఓ శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం సాక్షి దినపత్రికలో ‘అమ్మేస్తున్నా కిమ్మనరే’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అటు దేవాదాయ శాఖ, ఇటు రెవెన్యూ శాఖలు స్పందించాయి. ముందుగా దేవాదాయ శాఖ ఈఓ శ్రీనివాసరావు తన సిబ్బందితో వచ్చి విక్రయించిన స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో ఉన్న గోడ కూలగొట్టిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోడ వద్ద గ్రామకంఠం ఉండగా అందులో దేవాదాయ శాఖకు చెందిన 20 గజాలు రోడ్డు విస్తరణలో పోయిందన్నారు. మిగతా 66 గజాలు ఉంటుందని చెప్పారు. సర్వే నంబర్ 350 ప్రకారం ఇక్కడ కొబ్బరి, మామిడి, పనస చెట్లుండేవనీ కాలక్రమేణా చెట్లను కూలదోసి ఆక్రమించుకున్నారన్నారు. దీనికి సంబంధించిన వివరాలు, కాగితాలు తమ వద్ద లేవని, కోటలో ఉన్నాయని చెప్పడం విశేషం. దేవాదాయ శాఖ చట్టం 43 రిజిస్టర్ ప్రకారం తమవద్ద ఈ స్థలానికి సంబంధించిన వివరాలున్నాయన్నారు. రెవెన్యూ శాఖ సందర్శన ఆ ప్రాంతాన్ని గురువారం సాయంత్రం రెవెన్యూ సర్వేయర్ విఘ్నేశ్వరరావు, ఆర్ఐ శివున్నాయుడు, వీఆర్వో చంద్రశేఖర్లు పరిశీలించారు. రికార్డులను పరిశీలించారు. మున్సిపాలిటీ ఏ విధమయిన అనుమతులు ఇచ్చినదీ పరిశీలించారు. తహసీల్దార్ విజయనగరం ఎన్నికల విధుల సమావేశానికి వెళ్లడంతో సర్వేయర్, ఆర్ఐలు పరిశీలించారు. పక్కన నిర్మాణాలు చేస్తున్న వారి వివరాలు, వాటి హద్దులను పరిశీలించారు. అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. -
విజయవాడలో మరో భూకబ్జా
సాక్షి, విజయవాడ: నగరంలో మరో భూబాగోతం వెలుగులోకి వచ్చింది. కబేళా సమీపంలోని కొండ ప్రాంతంలో 500 గజాల స్థలాన్ని కబ్జా చేశారంటూ దళితులు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. తమ స్థలల్లోకి రానీయకుండా దౌర్జన్యం చేస్తున్నారంటూ సీపీ దగ్గర వాపోయారు. అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ నేతల సహకారంతో తమ భూమిని కాజేయాడానికి కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన భూములను లాక్కొని తమ స్థలం వద్దకు రానీయకుండా కొంత మంది దౌర్జన్యానికి పాల్పడుతున్నారని పేర్కొనారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించకుంటే తమ స్థలాల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. -
‘సిట్ నివేదికను బహిర్గతం చేయాలి’
సాక్షి, విశాఖ: భూముల కబ్జాపై ప్రభుత్వానికి అందించిన సిట్ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్. నర్సింగరావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిట్ నివేదిక అందించి ఆరు నెలలు అయినా బహిర్గతం చేయకపోవడం పలు అనుమానాలు కలుగుజేస్తుందని పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్, పరుచూరి భాస్కరరావులు రికార్డుల ట్యాంపరింగ్లకు పాల్పడినా ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ కేసులో అరెస్టు చేసిన కొద్ది మంతిని విడుదల చేయడం ప్రభుత్వపు దుర్మార్గపు చర్య అని ధ్వజమెత్తారు. కబ్జాకు గురైన భూముల్లో ఒక్క ఎకరం కూడా ప్రభుత్వం స్వాదీనం చేసుకోలేదని విమర్శించారు. ఎన్నికలు వస్తున్నాయనే భయంతోనే నివేదికను బహిర్గతం చేయడంలేదని నర్సింగరావు ఆరోపించారు. -
దర్జాగా వెయ్యి ఎకరాలు కబ్జా చేసిన తెలుగు తమ్ముళ్లు
-
మరో భూవివాదంలో బోండా ఉమ
-
మరో భూవివాదంలో బోండా ఉమ
సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్యెల్యే అక్రమాల పుట్ట రోజుకొకటి బయట పడుతున్నాయి. విజయవాడలో స్వతంత్ర్య సమరయోధుడి భూమిని కబ్జా చేసిన వివాదం మరవక ముందే బోండా ఉమ, ఆయన అనుచరులు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. పెనమలూరు డెవెలప్మెంట్ పేరుతో తన 86 సెంట్ల భూమిని ఆక్రమించారని ఇద్దరు మహిళలు జాయింట్ కలెక్టర్ను ఆశ్రయించారు. అభివృద్ధి పేరుతో తమ భూమిని కాజేయాలని ఎమ్మెల్యే బోండా ప్రత్నిస్తున్నారని పెనమలూరుకు చెందిన ఉమాదేవి, లక్ష్మీ భవాని జాయింట్ కలెక్టర్నకు ఫిర్యాదు చేశారు. భూమిని అప్పగించకపోతే చంపేస్తామంటూ బోండా ఉమ అనుచరులు పోలవరపు కిషన్, వెంకట నరసయ్య బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేళ్లలో వారి భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని, పోనీ తమ భూములను అప్పగించమని కోరితే బెదిరింపులకు పాల్పడుతున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు తెలియకుండానే తమ భూమిని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి అప్పు తెచ్చామంటున్నారని, వాటికి వడ్డీ కట్టాలంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను కలిసి తమ బాధలను చెప్పుకొని న్యాయం చేమని కోరితే ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారని వాపోయారు. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలంటూ అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారని కంటతడిపెట్టుకున్నారు. -
భూకబ్జా కేసులో హైకోర్టుకు బోండా సతీమణి
సాక్షి, అమరావతి : విజయవాడ స్వతంత్ర సమర యోధుడి భూమి కబ్జా కేసులో ఎమ్మెల్యే బోండా ఉమ సతీమణి సుజాత హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను కొట్టేయాలంటూ పిటీషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు 8వారాల స్టే విధించింది. ఆలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో బోండా సుజాత ఏ-8 ముద్దాయిగా ఉన్నారు. 1951లో సూర్యనారాయణ అనే స్వాతంత్య్రసమరయోధుడికి ప్రభుత్వం పదెకరాల స్థలాన్ని కేటాయించింది. 2016లో నకిలీ పత్రాలు సృష్టించి బోండా ఉమ కబ్జాకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న సూర్యనారాయణ మనువడు సురేష్ 2017, ఫిబ్రవరి 10న విజయవాడ సింగ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సురేష్ సీఐడీ అధికారులను ఆశ్రయించారు. దాంతో మొత్తం ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం భూబాగోతం వెలుగులోకి వచ్చింది. -
నీకు సగం.. నాకు సగం..
బాన్సువాడ: బాన్సువాడ మున్సిపాలిటీగా ఆవిర్భవించడంతో గతంలో గ్రామ పంచాయతీలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్గా ఆర్డీవో రాజేశ్వర్ బాధ్యతలు స్వీకరించి, బల్దియాపై పూర్తిస్థాయి దృష్టి సారించారు. బల్దియాలో జీతభత్యాలు, జమా ఖర్చులు, ఆదాయ వనరులు, అక్రమ లే అవుట్లు, మున్సిపల్ స్థలాలపై ఆయన విచారిస్తున్నారు. అయితే వీటిలో కీలకమైన లేఅవుట్లు, 10శాతం భూముల కేటాయింపులపై ఆర్డీవో చేతికి ఫైళ్లు అందకుండా కొందరు అక్రమార్కులు ఫైళ్లనే మాయం చేశారు. 1990 నుంచి 2015 వరకు గల ఫైళ్లను మొత్తం బల్దియాలోనే లేకుండా చేశారు. కొందరు వార్డు సభ్యులు, అధికారులు కలిసి చేసిన అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకు ఏకంగా పాత ఫైళ్లనే గల్లంతు చేయడం చర్చనీయాంశమవుతోంది. బల్దియా పరిధిలో చేసే లే అవుట్ల సందర్భంగా పార్కులు, ఇతర ప్రజా కార్యకలాపాల కోసం కేటాయించే భూమిని కొందరు వార్డు సభ్యులు, అధికారుల సహకారంతో విక్రయించిన సంఘటనలు కోకొల్లాలుగా ఉన్నాయి. 1995 నుంచి 2018 వరకు లే అవుట్లకు సంబంధించిన భూములు జీపీ పరిధిలో ఉండాలి. అయితే వార్డు సభ్యులు ‘నీకు సగం.. నాకు సగం’ అనే రీతిలో అధికారులతో మిలాఖాత్ అయి ఆ భూములను అమ్ముకున్నారు. చేతులు మారిన భూములు.. వాస్తవానికి బాన్సువాడ బల్దియా పరిధిలో అధికారికంగా 28,509 గజాల భూమి ఉందని రికార్డులు చెబుతున్నాయి. 1983 నుంచి 2018 వరకు గ్రామ పంచాయతీ(ప్రస్తుత బల్దియా) పరిధిలో 63 లే అవుట్లు చేశారు. వీటిలో 10 శాతం చొప్పున భూములను కేటాయించారు. అయితే ప్రజాప్రతినిధులు వివిధ కుల సంఘాల పేరిట భూములను ధారాదత్తం చేశారు. వాటిని ప్లాట్లుగా మార్చి ఇద్దరు, ముగ్గురు చేతులు మార్చి మరీ అమ్ముకున్నారు. ప్రస్తుతం పదిశాతం భూముల్లో భవనాలు వెలిసాయి. జీపీ లెక్కల ప్రకారం 4,298 గజాల భూమిని సంఘాలకు కేటాయించారు. అయితే అనధికారికంగా మరో 10వేల గజాల భూమి కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. కొందరు అక్రమార్కులు 10శాతం భూములను కాజేసేందుకు పాలకవర్గంతో తీర్మానాలు కూడా చేయించారు. ప్రస్తుతానికి 14,211 గజాల భూమి మున్సిపాలిటీ ఆధీనంలో ఉంది. లేఅవుట్ ఫైళ్లు గల్లంతవడంతో ఆ భూములను గుర్తించడం మున్సిపల్ సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. ఇన్చార్జి కమిషనర్ రాజేశ్వర్ మున్సిపల్ కార్యాలయంలోని అన్ని రికార్డులను పక్షం రోజుల క్రితమే స్వాధీనం చేసుకున్నారు. వాటిలో లేఅవుట్ ఫైళ్లు లేకపోవడం గమనార్హం. ఫైళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం.. బల్దియాకు కీలకం లే అవుట్ ఫైళ్లు. వాటి ఆధారంగానే రోడ్లు, ప్లాట్లు, ఇండ్ల నిర్మాణాలు, జీపీకి కేటాయించిన భూములను గుర్తిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత గల ఈ ఫైళ్ల మాయంతోపాటు వాటి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ ఫైళ్లను గల్లంతు చేస్తే తాము చేసిన అక్రమాలను కప్పి పుచ్చవచ్చని, అమ్మిన భూములను స్వాధీనం చేసుకొనే వీలుండదని పక్కా ప్రణాళిక ప్రకారం వీటిని మున్సిపాలిటి కాకముందే మాయం చేశారు. అనుమతులన్నీ పెండింగ్లోనే.. గత నెల 20న బాన్సువాడను మున్సిపాలిటీగా మార్చుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే మూడు నెలల క్రితమే బాన్సువాడ మున్సిపాలిటీగా మారనుందనే ప్రచారం జరగడంతో అనేక మంది భవన నిర్మాణాల కోసం దరఖాస్తులు చేసుకొని వార్డు సభ్యుల ద్వారా అనుమతులు పొందారు. అయినా మరో వంద దరఖాస్తులు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. మున్సిపల్ నిబంధనల ప్రకారం వాటికి అనుమతి ఇవ్వాలి. లేఅవుట్ల ఫైళ్లు కూడా ఆర్డీవో పెండింగ్లో పెట్టారు. మున్సిపాలిటీలో ఆదాయ వనరుల వివరాలు స్పష్టంగా లేవు. అక్రమాలపై వెంటనే విచారిస్తాం.. మున్సిపాలిటీలో గతంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతాం. లే అవుట్ ఫైళ్ల గల్లంతవగా, దీనిపై ఆరా తీçస్తున్నాం. ఇంకా పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. సిబ్బంది రాగానే బల్దియా పాలనను గాడిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తా. జీపీకి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నాం. ఇకపై ఏ అనుమతి లేనిదే పనులు చేయరాదు. –రాజేశ్వర్, ఇన్చార్జి కమిషనర్ -
దేవుని భూమిపై కన్ను
-
ఆపద'లో' మొక్కులవాడు!
ఆపద మొక్కులవాడా..అనాథ రక్షకా పాహిమాం..అని మనం మొక్కే కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి భూములకే ఇప్పుడు రక్షణ కరువైంది. అధికారులు పర్యవేక్షణ లేక, బాధ్యులు పట్టించుకోక కబ్జాకోరులు నేలకొండపల్లిలో ఏకంగా 50ఎకరాలకు గోవిందనామం పాడుతున్నారు. ఇంకా కాజేసేందుకు కాచుక్కూర్చున్నారు. మరి బాధ్యులను ఏం జేస్తారు..? దేవుడి మాణ్యాన్ని ఎలా రక్షిస్తారో..? అని భక్తులు, జనం ఎదురుచూస్తున్నారు. నేలకొండపల్లి: మండలకేంద్రం నేలకొండపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి 358ఎకరాల ఆస్తులు ఉండగా..వీటిపై కొందరు కన్నేశారు. విలువైన భూములను ఎంచక్కా కాజేస్తున్నారు. నేలకొండపల్లి, కమలాపురం, గువ్వలగూడెం, చిరుమర్రి, ముదిగొండ, మంగాపురం తదితర గ్రామాల్లో 358 ఎకరాలు ఈ దేవాలయానికి ఉన్నాయి. అయితే మంగాపురం గ్రామంలోనే 294.22 ఎకరాల భూములు ఉన్నాయి. కానీ అక్కడ 100 ఎకరాలకే కౌలు వస్తోంది. అది కూడా కేవలం రూ.60 వేలు మాత్రమే. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళణ కార్యక్రమంలో అన్యాక్రాంతం వెలుగులోకి వచ్చింది. 294.22 ఎకరాలకుగాను 244 ఎకరాల భూమికి మాత్రమే పాస్ పుస్తకాలు ఇస్తున్నట్లు రెవెన్యూ అధికారులు ఆలయ కమిటీకి తెలపడంతో..వారు కంగు తిన్నారు. కాల్వ అవసరాల రీత్యా ఎన్నెస్పీ అధికారులు కొంతభూమి తీసుకోగా..దాదాపు 50 ఎకరాల భూములు అన్యాక్రాంతమైనట్లు వెలుగులోకి వచ్చింది. చెరువుమాధారంలో 38 కుంటల భూమికి గాను 28 కుంటలకు మాత్రమే పాస్ పుస్తకాలు ఇవ్వనున్నారు. ఇక్కడ 10 కుంటలు కబ్జా అయింది. దేవాలయం వెనుక కాసాయి గడ్డ కింద 9.23 ఎకరాలు భూములను నిరుపయోగంగా వదిలేయడంతో అవి బీడుబారాయి. ఉన్నతాధికారులు స్పందించకుంటే దేవుడి భూములు కనుమరుగవుతాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ గ్రామాల్లో ఆలయ భూముల వివరాలు ఇలా.. మంగాపురంతండా 294.22 ఎకరాలు చెరువుమాధారం 38 కుంటలు గంధసిరి 3.14 ఎకరాలు చిరుమర్రి 8.22 ఎకరాలు కమలాపురం 6.26 ఎకరాలు గువ్వలగూడెం 12.13 ఎకరాలు ముదిగొండ 3.26 ఎకరాలు నేలకొండపల్లి 30 ఎకరాలు భూములు అప్పగించాలి.. శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి రికార్డుల్లో నమోదై ఉన్న భూములను అప్పగించాలి. ఆ లెక్కల ప్రకారమే పాస్ çపుస్తకాలు అందించాలి. 294.22 ఎకరాలకు గాను 244 ఎకరాలకే ఇస్తున్నారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశా. బోర్లు వేసుకోవడానికి కౌలురైతుల పేరున రెవెన్యూ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారు. దీనిపై కూడా ఫిర్యాదు చేశాను. – చవళం వెంకటేశ్వరరావు, దేవస్థానం చైర్మన్, నేలకొండపల్లి ఇక విచారిస్తాం.. నేలకొండపల్లి దేవాలయం భూములు గెజిట్ ప్రకారం తక్కువగా ఉందని ఫిర్యాదు అందింది. మంగాపురంతండాలో క్షేత్ర స్థాయిలో విచారించి ఎక్కడ జరిగిందో తెలుసుకుంటాం. – దొడ్డారపు సైదులు, తహసీల్దార్, నేలకొండపల్లి చర్యలు తీసుకోవాలి.. దేవాలయం భూములు అభివృద్ధికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి. అన్యాక్రాంతమైన భూములపై క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి..బాధ్యులను శిక్షించాలి. – వంగవీటి నాగేశ్వరరావు,సర్పంచ్ -
యాద్గార్పల్లి చిన్న చెరువు ఆక్రమణ
మిర్యాలగూడ : కోట్ల రూపాయల విలువైన యాద్గార్పల్లి చిన్న చెరువు ఆక్రమణకు గురైంది. కనీసం చెరువు ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. ఆక్రమిత స్థలంలో వరినాట్లు వేసుకోవడంతోపాటు రోడ్డు వెంట ఆక్రమించుకున్న స్థలంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడ మండలంలోని యాద్గార్పల్లిలోని రోడ్డు వెంటనే ఉన్న ఈ చెరువు విస్తీర్ణం 16 ఎకరాలు. ప్రస్తుతం చెరువు శిఖం భూమి ఏ మాత్రం మిగల్లేదు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఎకరం భూమి 50 లక్షల రూపాయల విలువ చేస్తుంది. సుమారు 8 కోట్ల రూపాయల విలువైన చెరువు శిఖం భూమి ఆక్రమణకు గురైంది. చెరువు శిఖంలో కొంత భూమి ఉండగా దానిలో ఒక సంఘ కార్యాలయం ఏర్పాటు చేయడానికి గాను మట్టి పోయిస్తున్నారు. డబ్బులు వసూలు చేస్తున్న మధ్యవర్తులు చెరువు ఆక్రమణకు సంబందించి అధికారులు ఎవరు కూడా తమ వద్దకు రాకుండా ఉండేందుకు గాను డబ్బులు ఇవ్వాలని మధ్యవర్తులు ఆక్రమితదారులనుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. చెరువు శిఖంలో సాగు చేసుకుంటున్న వారితోపాటు రోడ్డు వెంట ఉన్న వారు సైతం డబ్బులు ఇచ్చినట్లు తెలిసింది. పరిశీలించిన అధికారులు యాద్గార్పల్లి చిన్న చెరువును రెవెన్యూ అధికారులు, ఐబీ అధికారులు గురువారం సందర్శించారు. తహసీల్దార్ మాలి కృష్ణారెడ్డి మాట్లాడుతూ చెరువు ఆనవాళ్లు లేకుండా ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై ఆక్రమితదారులందరికి నోటీసులు ఇస్తామని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. విలువైన చెరువు భూమిని ఆక్రమించుకున్న వారందరిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ ఎఈ విజయలక్ష్మి, ఆర్ఐ, వీఆర్ఓ ఉన్నారు. -
ఓ మై గాడ్ !
హసన్పర్తి: ఓ రియల్టర్ వ్యాపారి.. స్వామికే శఠగోపం పెడుతున్నాడు. కోనేరును కబ్జా చేసి.. దాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇరు శాఖలకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది కుమ్మక్కై రియల్టర్కు వత్తాసు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ గజం భూమి ధర రూ.20 వేల వరకు పలుకుతోందని.. కబ్జాకు గురైన కోనేరు భూమి సుమారు రూ.కోటి ఉంటుందని.. ప్రస్తుత అధికారులు గతంలో డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ రియల్టర్కు మద్దతు పలుకుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోనేరు స్థలం కబ్జా.. భీమారం శివారులోని సర్వే నంబర్ 137/సీలో 0.10 ఎకరాల భూమి ఉంది. ఇందులో కొంతభాగంలో కోనేరు విస్తరించింది. ఇది శిథిలావస్థకు చేరుకోగా.. దీనిపై ఓ రియల్టర్ కన్ను పడింది. ఈ మేరకు సదరు రియల్టర్ దాని చుట్టు పక్కల సుమారు 16 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. కోనేరును కబ్జా చేసి పార్క్గా చూపించినట్లు గతంలోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే.. ఈ భూమిని చింతగట్టుకు చెందిన మధుసూదన్రెడ్డి ఎర్రగట్టు దేవస్థానానికి దానంగా ఇచ్చినట్లు పత్రాలు ఉన్నాయని అప్పటి పాలకవర్గం ఎండోమెంట్ అధికారులకు నివేదించింది. దీనిపై పత్రికల్లో కథనాలు రాగా.. అప్పటి దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ స్పందించి కోనేరును సందర్శించారు. ఈ క్రమంలో కోనేరుకు సంబంధించిన భూమి పేరుమాండ్లు (దేవుడి) పేర ఉన్నట్లు అప్పటి చైర్మన్ బూర సురేందర్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో శ్రీ ఎర్రగట్టు దేవస్థాన భూములను సర్వే చేసి హద్దులను నిర్ధారించాలని అప్పటి డిప్యూటీ కమిషనర్ రమేష్ ఆదేశించారు. దేవస్థాన భూములు స్వాధీనం చేసుకుని ఆలయం పేరుపైనే పాసుపుస్తకాలు జారీ చేస్తామన్నారు. కమిషనర్ ఆదేశాలు ఇచ్చి చాలా కాలం గడుస్తున్నా.. అవి బుట్టదాఖలయ్యాయి. రెవెన్యూ, ఎండోమెంట్ అధికారులు సర్వేచేయడంలో నిర్లక్ష్యం వహించారు. డీసీ రమేష్ బదిలీ కాగా.. ఆయన స్థానంలో సునీత వచ్చారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో రియల్టర్ మళ్లీ కబ్జాకు తెరలేపారు. ప్లాట్లుగా విభజించే యత్నం.. కొంతకాలం విరామం తర్వాత రియల్టర్ కోనేరు స్థలాన్ని మళ్లి ప్లాట్లుగా విభజించడానికి యత్నిస్తుండగా.. స్థానికులు సోమవారం అడ్డుకున్నారు. ఈ క్రమంలో రియల్టర్ తమపై తిరగబడ్డాడని.. కోనేరు స్థలం కబ్జా కాకుండా చూడాలని స్థానికులు కోరారు. -
తిరుపతిలో రెచ్చిపోతున్న తెలుగు తమ్ముళ్లు
-
నా తప్పుంటే చర్యలు తీసుకోవచ్చు: ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్ : జనగాం జిల్లాలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై ఇరువురి మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. బతుకమ్మ కుంట విషయంలో తన తప్పు ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చునని ఆయన చెప్పారు. ఈ అంశంపై మంగళవారం సచివాలయంలో సీఎస్ ఎస్పీ సింగ్ను ముత్తిరెడ్డి కలిసి అక్కడి పరిస్థితులపై నివేదిక ఇచ్చారు. అనంతరం సచివాలయం మీడియా పాయింట్ మాట్లాడుతూ... బతుకమ్మ కుంట కబ్జాకు గురికాకుండా ఉండాలనే గోడ కట్టామన్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి కమిటీ వేయలేదన్నారు. జనగామ చెరువు సుందరీకరణకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందన్నారు. అఖిల పక్షం కమిటీ సూచన మేరకే స్థానికుల సౌకర్యం కోసం చెరువు అభివృద్ధి చేశామన్నారు. కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని, కలెక్టర్ ప్రభుత్వాన్ని బదునాం చేస్తున్నారని తెలిపారు. అనుభవంలేని కలెక్టర్ వల్లే ఈ సమస్య అని, పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని, ప్రభుత్వ ఆలోచనలకు విరుద్ధంగా కలెక్టర్ పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎందుకు కలెక్టర్పై చర్యలు తీసుకోవడంలేదని విలేకరుల ప్రశ్నించగా, అందుకు తగిన సమయం రావాలన్నారు. ఇప్పటికే ఈ అంశంపై సీఎస్కు ఫిర్యాదు చేశామన్నారు. -
తిన్నదంతా కక్కిస్తాం
⇔ టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములన్నిటినీ పేదలకు తిరిగి ఇచ్చేస్తాం : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ⇔ టీడీపీ కబ్జా బారిన పడ్డ బాధితులకు అండగా ఉంటాం ⇔ ముఖ్యమంత్రి మాఫియాగా మారి దోచుకుతింటున్నారు ⇔ గంటాకు ఇంత.. లోకేశ్కు ఇంత అంటూ వాటాలు పంచుకుంటున్నారు ⇔ ‘సేవ్ విశాఖ’ మహాధర్నాలో వైఎస్ జగన్ ధ్వజం సాక్షి, విశాఖపట్నం: ‘‘మీకందరికీ ఒక మాట చెబుతున్నా. ఒక భరోసా ఇస్తున్నా. పేదలకు చెందిన ఒక్క అంగుళం భూమి కూడా పరాధీనం కాకుండా, వారికి నష్టం జరగకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుతుంది. వీళ్ల(టీడీపీ) పాలన మరో సంవత్సరమో, ఒకటిన్నర సంవత్సరమో అంతకంటే ఎక్కువ ఉండదని గట్టిగా చెబుతున్నా. ఆ తర్వాత వచ్చేది మనందరి పరిపాలన. వీళ్లు తిన్నదంతా కక్కిస్తామని హామీ ఇస్తున్నాం. ప్రతి అంగుళం భూమినీ మళ్లీ పేదవాడికే ఇస్తామని చెబుతు న్నాం. వైఎస్సార్సీపీ మీకందరికీ తోడుగా, నీడగా నిలుస్తుంది’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ ప్రజలకు భరోసా ఇచ్చారు. మన భూములను కాజేస్తున్న తెలుగుదేశం పార్టీ దొంగలను బంగాళాఖాతంలో కలిపేద్దామని పిలుపునిచ్చారు. విశాఖ భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ గురువారం జీవీఎంసీ ఎదుట గాంధీబొమ్మ వద్ద ‘సేవ్ విశాఖ’ పేరిట అఖిలపక్ష నేతలతో కలసి మహాధర్నా నిర్వహించింది. నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా వేలాదిగా తరలి వచ్చిన భూ బాధితులతో విశాఖ హోరెత్తింది. మహాధర్నాలో ప్రజలను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలసి మాఫియాగా తయారయ్యారని నిప్పులు చెరిగారు. విశాఖ జిల్లాను పూర్తిగా దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ఇంకా ఏం చెప్పారంటే... హుద్హుద్లో రికార్డులు పోయాయట! ‘‘కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఇటీవలే ఓ ప్రకటన చేశారు. జిల్లాలో 43 మండలాలు ఉన్నాయి. 2,45,896 ఫీల్డ్ మెజర్మెంట్ బుక్స్ ఉన్నాయి. వాటిలో 16,375 ఫీల్డ్ మెజర్మెంట్ బుక్స్ అంటే సర్వే నంబర్లు కనిపించడం లేదట! 1,06,239 ఎకరాలకు సంబంధించిన సర్వే నంబర్లు ఇవీ. 375 రీసెటిల్మెంట్ రిజిస్టర్స్ కూడా కనిపించడం లేదట. కలెక్టర్ ఏమన్నారో తెలుసా? హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు అవన్నీ పోయాయట. హుద్హుద్ వచ్చిన మూడేళ్ల తర్వాత ఈ విషయం కలెక్టర్కు గుర్తుకురావడం ఆశ్చర్యమే స్తోంది. హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు సునామీ మాదిరిగా నీళ్లేమీ రాలేదు. గాలి వచ్చింది. గాలితోపాటు కొద్దోగొప్పో వర్షం వచ్చి వెళ్లిపోయింది. అంతేగానీ కలెక్టరేట్ వంటి పెద్దపెద్ద భవనాలు గాలికి ఎగిరిపోయినట్టు మనమెక్కడా చూడలేదు. ఆ సమయంలో నేనొచ్చి 11 రోజులపాటు ఇక్కడే ఉన్నా. ప్రతి ప్రాంతాన్నీ సందర్శించా. వీళ్లు చేసే అన్యాయమైన పని ఏమిటంటే.. రెవెన్యూ రికార్డులన్నీ మాయం చేయడం, రికార్డులను ఎలా కావాలంటే అలా మార్చేసుకోవడం. హుద్హుద్ వచ్చింది రికార్డులన్నీ పోయాయని చెప్పడం ఆశ్చర్యమేస్తోంది. అక్షరాలా 1.6 లక్షల ఎకరాల పరిస్థితి ఇది. ప్రభుత్వ భూములే దాదాపు 23,876 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇంత దారుణంగా భూ కుంభకోణాలు జరుగుతుంటేæ ప్రభుత్వం ఏం చేస్తోందో అర్థం కావడం లేదు. హుద్హుద్ వల్ల 1.6 లక్షల ఎకరాలకు చెందిన రికార్డులు పోయాయంటే ఎవరు నమ్ముతారు. ఆ సమయంలో ఈయనే జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత జీవీఎంసీ కమిషనర్గా పనిచేసింది ఈయనే. ఇప్పుడు కలెక్టర్గా ఈయనే వచ్చారు. అధికారులు దగ్గర ఉండి మరీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నేతలతో కుమ్మక్కై కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేశ్తో కుమ్మక్కై ల్యాండ్ పూలింగ్ కోసం జీవోలు ఇప్పిస్తున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను, చివరకు వేరేవారి పేరు మీద ఉన్న భూములను సైతం కాజేస్తున్నారు. గంటాకు ఇంత.. లోకేశ్కు ఇంత మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువు పరుచూరి భాస్కరరావు వేరేవారి భూములకు తన పేరు మీద డాక్యుమెంట్లు సృష్టించారు. వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. సర్వే నంబర్ 122/11లో పేదల కాలనీలోని ఇళ్లు కూడా తమవిగా పేర్కొంటూ బ్యాంకులో తాకట్టు పెట్టారు. సర్వే నంబర్ 121/9,10,11,12కు సంబంధించిన ప్రభుత్వ భూములు, ఇతరుల పేరు మీద ఉన్న భూములకు కూడా డాక్యుమెంట్లు సృష్టించి, బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకున్నారు. ఇదే విశాఖ జిల్లా అధికారులు దగ్గర ఉండి మరీ ఇలాంటి పనులు చేయిస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ పనులు చేయిస్తూ ఉన్నాడంటే కేవలం ఆయన ఒక్కడికే దీంతో సంబంధం ఉందనుకోవద్దు. గంటాకు ఇంత, నారా లోకేశ్ ఇంత అని వాటాలు పంచుకునే కార్యక్రమాలు జరుగుతు న్నాయి. గంటా శ్రీనివాసరావు సాక్షాత్తూ ఒక మంత్రి. రెవెన్యూ రికార్డులను మార్చేసి, ఇతరుల భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న కంపెనీలో ఆయన ఇంతకుముందు డైరెక్టర్గా ఉన్నారు. గంటా వ్యవహారాన్ని మరో మంత్రి అయ్యన్నపాత్రుడు బయటపెట్టారు. విశాఖలో భూముల దోపిడీ, భూ దందా జరుగుతోందని చెప్పారు. దీన్ని ఎందుకు అరికట్టలేక పోతున్నామో ప్రశ్నించుకోవాలన్నారు. రాజకీయ నేతల ప్రమేయం లేకుండా ఈ దందా సాగదన్నారు. ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి విశాఖకు వచ్చి భూదందాలు చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ భూ కుంభకోణాలపై మంత్రి ఏకంగా పత్రికలకెక్కారు. జగన్ వస్తున్నాడంటే బటన్ నొక్కేస్తారు ఇదే భూదందాకు సంబంధించి చోడవరం ఎంపీపీ గున్నూరు వెంకట సత్యనారాయణ(పెదబాబు) కొమ్మాదిలో తన పేరుతో 24.3 ఎకరాలు, ఆయన భార్య పేరిట 25 ఎకరాలు రాయిం చేసుకున్నారు. ఈ విషయం ఈనాడు పత్రికలో వచ్చింది. సాక్షిలో కాదు. జగన్మోహన్రెడ్డి ఈ రోజు కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడానికి వస్తున్నాడని తెలుసుకొని కంప్యూటర్లలో ఈ భూముల పేర్లను సరిచేశారు. పరిస్థితి ఎలా ఉందంటే.. జగన్ వస్తున్నాడంటే కంప్యూటర్లో ఒక బటన్ నొక్కుతారు. జగన్ రావడం లేదంటే ఇంకొక బటన్ నొక్కుతారు. ఇంత దారుణంగా ఇక్కడ భూములను స్వాహా చేసేస్తున్నారు. రూ.1,100 కోట్ల భూములు ‘గీతం’కు ధారాదత్తం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి గీతం యూనివర్సిటీని నడుపుతున్నారు. ఆయన ఎవరో కాదు.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు బంధువు. రుషికొండలో ఈయన 55 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారు. అవి ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల కోసం, ప్రభుత్వ భవనాల కోసం వివిధ శాఖలకు కేటాయించినవి. వాటిని కబ్జా చేయడమే కాదు.. ఆ భూములను తనకే ఇచ్చేయండంటూ ఎంవీవీఎస్ మూర్తి ప్రభుత్వానికి లేఖ రాస్తే చంద్రబాబు ఆ మేరకు కేబినెట్లో తీర్మానం చేశారు. రూ.1,000 కోట్ల విలువైన ఈ భూములను చంద్రబాబు దగ్గరుండి మరీ తన బంధువుకు ధారా దత్తం చేశారు. అలాగే పేదలకు ఇళ్లు కట్టించాలన్న ఆలోచనతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 7.52 ఎకరాలు కేటాయించి, జీవో కూడా ఇచ్చారు. ఆ భూములను కూడా ఎంవీవీఎస్ మూర్తి కబ్జా చేశారు. వాటిని కూడా తనకే ఇవ్వాలని అడగడం, చంద్ర బాబు వెంటనే ఆమోదం తెలపడం జరిగిపోయాయి. ఈ భూముల విలువ రూ.100 కోట్లు. ఇవి ఆక్రమ ణకు గురయ్యాయని ఇంతకు ముందు పనిచేసిన విశాఖ కలెక్టర్ రాజీవ్ స్వగృహ సంస్థకు లేఖ రాశారు. ‘ఒక అన్యాయస్తుడు మీ భూములను ఆక్రమించాడు, కాపాడుకోండి’ అని సూచించారు. అధికారులు సర్వే చేసి, పూర్తి వివరాలు ఇచ్చినా పట్టించుకోకుండా చంద్రబాబు తన సొంత బంధువులకు ఈ భూములను ధారాదత్తం చేస్తున్నారు. ఇక వివాదంలో ఉన్న దసపల్లా భూముల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టించారు. ప్రైవేట్ భూమిని కబ్జా చేసి కట్టించారా? ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కట్టించారా? చంద్రబాబే సమాధానం చెప్పాలి. పేదలను కొట్టి.. పెద్దలకు పెట్టి.. చంద్రబాబు హయాంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది అంటే ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, పేదలు, అసైన్డ్ భూములున్న వాళ్లు వణికిపోతున్నారు. ఎక్కడ మా భూములు లాక్కుంటారో అని భయపడి పోతున్నారు. చంద్రబాబు ఫిలాసఫీ ఎమిటో తెలుసా? ‘రాబ్ దా పూర్ అండ్ డీల్ విత్ రిచ్’ అంటే పేదవాడిని దోచేసుకో, పెద్దవాడితో కుమ్మక్కుకా.. ఇదీ చంద్రబాబు సిద్ధాంతం. ఇవాళ విశాఖ జిల్లాలో పేదలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెద్దల కళ్లు ఎక్కడ మా భూములపై పడతాయో? ఎక్కడ కబ్జా చేస్తారో? అని భయపడుతూ జీవిస్తున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ముందెన్నడూ లేదు. ఇంత పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతా ఉంటే సీబీఐ విచారణ జరిపించాల్సిన ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడంలేదు. మొట్టమొదట బహిరంగ విచారణ చేయిస్తామన్నారు. అలాగైతే వేలాది మంది వచ్చి తమకు అన్యాయం జరిగింది అని ఫిర్యాదు చేస్తారన్న భయంతో బహిరంగ విచారణ ఆపేశారు. చంద్రబాబు ఇచ్చింది కుంభకోణాలు, అవినీతి విశాఖ జిల్లా చంద్రబాబుకు, ఆయన పార్టీకి చాలా చేసింది. ఎంతో ఇచ్చింది. కానీ, మీరు విశాఖ జిల్లాకు ఏం చేశారని చంద్రబాబును అడుగుతున్నా. ఈ జిల్లాకు చంద్రబాబు ఏమిచ్చారో తెలుసా? కుంభకోణాలు ఇచ్చారు, అవినీతిని ఇచ్చారు. దోచుకోవడానికి విశాఖ జిల్లా ప్రజలు తనకు అనుమతి ఇచ్చారని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే విచ్చలవిడిగా దోపిడీ సాగిస్తున్నారు. సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ముఖ్యమంత్రి అంటే కొంత భయం ఉంటుంది. ఏమైనా అవకతవకలు జరిగి ముఖ్యమంత్రికి తెలిస్తే తాట తీస్తాడని భయపడతారు. అన్యాయం చేస్తే జైల్లో పెట్టిస్తారని అనుకుంటారు. ఇవాళ చంద్రబాబు హయాంలో మన పరిస్థితి ఎలా ఉందంటే.. ప్రజలను కాపాడాల్సిన ముఖ్యమంత్రే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ఒక మాఫియాగా తయారై దోచుకొని తింటూ ఉంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. పొరుగు దేశం నుంచి ఎవరైనా వచ్చి మన భూములను కబ్జా చేస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? యుద్ధం చేస్తాం. మన భూములను కాపాడుకునేందుకు పోరాడతాం. కానీ, మన ప్రభుత్వ పెద్దలే మన భూములను లాక్కుంటూ ఉంటే మనమేం చేయాలి? కబ్జాదారులను బంగాళాఖాతంలో కలిపేయాలి’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. సీబీఐకి ఇస్తే జైలుకు పంపిస్తారని భయమా? విశాఖ భూముల కబ్జాలపై విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) వేశారు. ఈ సిట్లో ఉన్న అధికారులంతా చంద్రబాబు కింద పనిచేసే వాళ్లే. వారితో విచారణ చేయిస్తారట! ఇక్కడ జరిగిన స్కామ్లన్నీ చేసింది చంద్రబాబు.. ఆయన కొడుకు.. ఆయన మంత్రులు.. ఆయన రెవెన్యూ అధికారులు. అలాంటప్పుడు ఆయన కింద ఉన్న అధికారులతో ఎంక్వైరీ చేయిస్తే ఏం జరుగుతుందని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా? ఇదెలా ఉందంటే ‘సీతమ్మ వారిని ఎత్తుకుపోవడం కరెక్టేనా అనేదానిపై రావణాసురుడు కుంభకర్ణుడితో విచారణ వేయించినట్టుగా ఉంది. అదే విచారణ హనుమంతుడితో చేయిస్తే దోషులను తన్ని లోపల వేస్తాడు. రావణాసురుడిని తంతాడు. రాక్షసులను తంతాడు. అలాగే ఇక్కడ కూడా విచారణను సీబీఐకు అప్పగిస్తే చంద్రబాబును, ఆయన కొడుకును, మంత్రులను తంతారు. తన్ని లోపల వేస్తారు. సీబీఐ విచారణ చేయిస్తే అది పూర్తి కావడానికి 20 ఏళ్లు పడుతుంది, అందుకే చేయించడం లేదని చంద్రబాబు చెబుతున్నారు. సీబీఐకి అప్పగిస్తే విచారణ 20 ఏళ్లు పడుతుందనా? లేక 20 ఏళ్లు మిమ్మల్ని జైలుకు పంపిస్తారని భయమా? విశాఖ భూముల కబ్జాపై ‘సిట్’ విచారణ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కచ్చితంగా సీబీఐ విచారణ జరిపించాలి. వీళ్లు నిజంగా మనుషులేనా? పెందుర్తి, మదుపాకలో 955 ఎకరాల అసైన్డ్ భూములపై టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కన్నేశారు. మేము రూ.10 లక్షలకు కొనుగోలు చేస్తాం, అదే ప్రభుత్వమైతే లక్షా, రెండు లక్షలు కూడా ఇవ్వబోదని చెప్పి, రైతులను భయపెట్టి కొనుగోలు చేసి, చివరకు ల్యాండ్ పూలింగ్లో రూ.2 కోట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకునే కార్య క్రమం చేస్తున్నారు. బండారు కూడా ‘నాకు ఇంత.. లోకేశ్కు ఇంత’ అని డీల్ మాట్లాడుకుని దోచేస్తున్న తీరు చూస్తుంటే వీళ్లు నిజంగా మనుషులేనా? అనిపిస్తోంది. గద్దలు తన్నుకుపోతున్నాయ్ భీమిలి నియోజకవర్గంలో 358 ఎకరాల అసైన్డ్ భూములను గంటా శ్రీనివాసరావు తన బినామీలతో కొనుగోలు చేయిస్తాడు. అసైన్డ్ భూములను ఎవరూ కొనుగోలు చేయకూడదు. అయినా ల్యాండ్ పూలింగ్ అని భయపెట్టి తన బినామీల ద్వారా గంటా కొనుగోలు చేయిస్తాడు. కొనుగోలు చేయించిన తర్వాత అసైన్డ్ భూములను కూడా ల్యాండ్ పూలింగ్లో ఇవ్వొచ్చు, అగ్రిమెంట్ హోల్డర్లకు కూడా ఆ హక్కు ఉంటుందని చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేశ్ ద్వారా జీవోలు కూడా ఇప్పించేస్తారు. ఎస్సీ, ఎస్టీలు, బీసీల భూములను గద్దలొచ్చి తన్నుకుపోతున్నాయి. ఇవొక్కటే కాదు.. విశాఖ జిల్లాలో జరిగే అన్ని భూ దందాల్లో వాటాలు పంచుకుంటున్నారు. ‘గంటాకు ఇంత.. నారా లోకేశ్కు ఇంత’ అని డీల్ మాట్లాడుకుం టున్నారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు విశాఖ జిల్లాను దోచేస్తున్నారు. -
అట్ల.. ఎట్టెట్టా..!
► టీడీపీ నాయకుడి అక్రమాలు ► ఈర్లదిన్నెలో భూముల కబ్జా ► ఇతరుల భూములకు తన పేరు చూపి రుణం ► బ్యాంకులను మోసం చేసిన కృష్ణారెడ్డి ► సింగిల్ విండో డైరెక్టర్ కావడంతో అక్రమాలను పట్టించుకోని అధికారులు! టీడీపీ అధికారంలోకి వచ్చేనాటికి అతనికి ఉన్నది మూడెకరాల పొలం.. నేడు అతనికి ఉన్న పొలం 13.64 ఎకరాలు.. ఇది కష్టార్జితం కాదు.. రికార్డులు మాయ చేసి సంపాదించింది.. కబ్జాలు చేసి కూడబెట్టుకుంది.. ఇందుకు సాక్షాలుగా.. వెబ్ల్యాండ్లో ఒక విస్తీర్ణం.. పాసుపుస్తకంలో మరో విస్తీర్ణం.. కనిపిస్తోంది! మరొకరి భూమిని తనదిగా చూపించి ఇతను బ్యాంకులనే బురిడీ కొట్టించాడు!! సి.బెళగల్ మండలంలో టీడీపీ నాయకుడి అక్రమాల బాగోతమిదీ!!! కోడుమూరు : టీడీపీ నాయకుల భూదందాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. రెవెన్యూ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లను లొంగదీసుకొని ఇష్టానుసారంగా వెబ్ల్యాండ్లో పేర్లు మార్చుకుంటున్న బాగోతం సి.బెళగల్ మండలంలో వెలుగులోకొచ్చింది. తెలుగుదేశం పార్టీ నాయకుల అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడుతుండడంతో పట్టా భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. సి.బెళగల్ మండలం కొత్తకోట మజారా గ్రామమైన ఈర్లదిన్నెలో టీడీపీ నాయకుడు కృష్ణారెడ్డి ఇతరుల భూములను తన పేరుతో వెబ్ల్యాండ్లో నమోదు చేయించుకొని గూడూరు కేడీసీసీ బ్యాంకులో రూ.19.64లక్షలు రుణం తీసుకోవడం అక్రమాలకు పరాకాష్ట. భూమిని ఎలా మార్చారంటే... అట్ల రాధాకృష్ణారెడ్డికి.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేనాటికి కేవలం మూడెకరాలు మాత్రమే వ్యవసాయ భూమి ఉంది. వీఆర్వోలు, రెవెన్యూ అధికారుల అండదండలతో 13.64 ఎకరాల భూమి ఉన్నట్లు వెబ్ల్యాండ్లో నమోదు చేయించుకొని రూ.19.64లక్షల రుణం తీసుకున్నారు. కృష్ణారెడ్డికి ఖాతా నెంబర్ 941లో 13.37ఎకరాల భూమి ఉన్నట్లు వీఆర్వో అక్బర్సాహెబ్ పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చారు. ఆ ఖాతా నెంబర్లో ఉన్న సర్వేనెంబర్లు ప్రభుత్వ భూములు కావడంతో రిజిష్టర్ ఆఫీస్ మార్టిగేజ్కు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే కృష్ణారెడ్డి.. సింగిల్ విండో డైరెక్టర్ కావడంతో అదే ఖాతా నెంబర్లో ఇతరుల భూమిని తన పేరు మీద నమోదు చేయించుకొని.. కేడీసీసీ బ్యాంకులో రుణం తీసుకున్నారు. ప్రస్తుతం కృష్ణారెడ్డి వెబ్ల్యాండ్ ఆధారంగా 10.29ఎకరాలు ఉంది. పట్టాదారు పాసుపుస్తకంలో ఉన్న వివరాలకు, వెబ్ల్యాండ్లో ఉన్న వివరాలు పరిశీలిస్తే ఎన్నో తేడాలు కన్పిస్తున్నాయి. నిజానిజాలు ఇవీ.. ♦ అట్ల కృష్ణారెడ్డికి 312/1ఎ, 312/1ఈ సర్వే నెంబర్లలో రెండెకరాల భూమి ఉంది. కొండాపురంలో సర్వే నెంబర్ 427లో ఒక ఎకరా భూమి కలదు. ♦ కొండాపురం గ్రామంలో సర్వే నెంబర్ 322/2లో వెంకటలక్ష్మమ్మకు 1.77సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని కృష్ణారెడ్డి తన పేరు మీద వెబ్ల్యాండ్లో నమోదు చేయించుకున్నారు. ♦ కొత్తకోటలోని 387సర్వే నెంబర్లో భూమి విస్తీర్ణమే లేదు. రుణం తీసుకునే సమయంలో 1.44సెంట్ల భూమి ఉన్నట్లు ఆన్లైన్లో చూపించారు. ♦ 386 సర్వేనెంబర్లో పూర్తి విస్తీర్ణం 56సెంట్లు. ఇందులో కృష్ణారెడ్డి 36సెంట్లు, కె.రంగనాథరావు అనే రైతుకు 20సెంట్ల భూమి ఉంది. అయితే మొత్తం 56సెంట్లు తనదేనని కృష్ణారెడ్డి ఆన్లైన్లో చూపించారు. ♦ ఈర్లదిన్నె గ్రామంలోని 352, 353, 354 సర్వే నెంబర్లలో పూర్తి విస్తీర్ణం 20.55ఎకరాల భూమిలో 13.68ఎకరాల భూమిని కృష్ణారెడ్డి సోదరుడు (డాక్యుమెంట్ నెంః 2007/2014, 2008/2014) కొనుగోలు చేశారు. మిగిలిన భూమి 6.87ఎకరాలను కృష్ణారెడ్డి తనకు వంశపారపర్యంగా వచ్చినట్లు ఆన్లైన్లో చూపించుకున్నారు. తనకున్న 3ఎకరాలు తీసేస్తే 10.67సెంట్ల భూమి ఇతరులది తన పేరు మీద నమోదు చేయించుకొని గూడూరు కేడీసీసీ బ్యాంకులో రుణం తీసుకున్నారు.. వెబ్ల్యాండ్లో రైతుల పేర్లను రాత్రికి రాత్రే మార్చివేసి రుణాలు పొందారు. -
తవ్విన కొద్దీ అక్రమాలే..!
బోగస్పత్రాలతో భూముల కబ్జా - కబ్జాస్థలంలో క్రషర్ ప్లాంట్ నిర్వహణ - మనుషుల పేర్లు మార్చేసి మాయాజాలం - వెలుగులోకి వస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి వ్యవహారాలు - ముగ్గురు నిందితులకూ జ్యుడీషియల్ రిమాండ్ సాక్షి, హైదరాబాద్: బోగస్ పత్రాలతో భూ కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టు అయిన టీడీపీ ఎమ్మెల్సీ జి.దీపక్రెడ్డి, న్యాయవాది శైలేష్ సక్సేనా అక్రమాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. ఈ కేసుల్ని లోతుగా దర్యాప్తు చేస్తున్న అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. 2012లో అడ్వొకేట్ శైలేష్ సక్సేనా, దీపక్రెడ్డి శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలోని సర్వే నం. 33/ఏఏ/5లో ఉన్న 5 గుంటల స్థలంపై కన్నేశారు. మాజీ సైనికోద్యోగి అంటూ బాలయ్య అలియాస్ బాబయ్య పేరుతో బోగస్ డాక్యుమెంట్లు సృష్టించారు. ఆ స్థలాన్ని మావూరి శివభూషణానికి జీపీఏ చేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో శివభూషణం పేరును ముసుకు శివభూషణంగా మార్చారు. శివభూషణం పేరుతో పహాణీ కాపీలు, పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. ఈ స్థలంలో దీపక్రెడ్డి క్రషర్ ప్లాంట్ నడుపుతున్నారు. ఈ స్థలం ప్రభుత్వాని దంటూ ఆర్డీవో ఖరారు చేసినా.. శైలేష్ సక్సేనా ద్వారా కేసు వేయించి తన అధీనంలోనే ఉంచుకున్నారు. శివభూషణాన్ని ‘చంపేశాడు’.. స్థలాలను కబ్జా చేయడానికి శివభూషణాన్ని పావుగా వాడుకున్న శైలేష్ సక్సేనా 2012లో అతడిని ‘చంపేశాడు’. ప్రస్తుతం ఇక్బాల్ ఇస్లాం ఖాన్గా చలామణి అవుతున్న ఇతగాడు తీవ్ర అనారోగ్యంతో ఆ ఏడాది సెప్టెంబర్ 10న చనిపోయినట్లు రికార్డులు సృష్టించాడు. అదే సమయంలో మహ్మద్ బషీర్ అనే వ్యక్తిని తీసుకువచ్చి ఇక్బాల్ ఇస్లాం ఖాన్ కుమారుడు షకీల్ అస్లం ఖాన్గా మార్చారు. మరికొందరినీ రంగంలోకి దింపారు.. గుడిమల్కాపూర్ సమీపంలోని భోజగుట్టలో 78.22 ఎకరాల స్థలంపై కన్నేసిన శైలేష్ సక్సేనా, దీపక్రెడ్డి.. 2014లో శైలేష్ తండ్రి ప్రకాశ్చంద్ సక్సేనా(జై హనుమాన్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధి)తో పాటు కర్ణాటకకు చెందిన ఎన్హెచ్ శైలజను రంగంలోకి దింపారు. 2006 మార్చ్ 3న తమ పేరుతో ఓ బోగస్ జీపీఏ సృష్టించి.. దాని ఆధారంగా రంగారెడ్డి జిల్లా ఫస్ట్ అడిషనల్ జడ్జి కోర్టులో సూట్ ఫైల్ చేసి.. యజమానులను ముప్పుతిప్పలు పెట్టారు. ఇది లోక్ అదాలత్కు వెళ్లడంతో వీరికి వ్యతిరేకంగా డిక్రీ వచ్చింది. 1936లో చనిపోతే.. 1943లో సంతకమట..! భోజగుట్ట స్థలాన్ని చేజిక్కించుకునేందుకు శైలేష్ సక్సేనా అండ్ కో.. ఈ భూమిని నిజాం నవాబులు ఇనాం ఇచ్చారంటూ నలుగురు మహిళల పేరుతో ఉర్దూలో పత్రాలు సృష్టించారు. ఈ భూమిని తాము ఓ కల్నల్కు ఇచ్చామని, భూ బదలాయింపు చేయమని 1943లో అప్పటి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించినట్లు కథ అల్లారు. కొద్ది రోజుల తర్వాత తాము సదరు కల్నల్కు భూమిని విక్రయిం చామంటూ మరికొన్ని పత్రాలు తెరపైకి తీసుకు వచ్చారు. తర్వాత కల్నల్ తన నలుగురు కుమా రులకు సదరు స్థలాన్ని గిఫ్ట్గా ఇచ్చినట్లు మరికొన్ని పత్రాలు సిటీ సివిల్ కోర్టులో దాఖలయ్యాయి. సదరు కల్నల్ కుమారులు 2008లో భూమి హక్కు పత్రాలు తీసుకున్నారు. సదరు కల్నల్ 1936లో చనిపోయి నట్లు కుమారులు పేర్కొనగా.. 1943లో నలుగురు మహిళలు స్థలాన్ని విక్రయించినట్లు ఉండటంతో తప్పుడు పత్రాలుగా తేలాయి. కొత్త పత్రాలు పాతవిగా మారుస్తూ.. శైలేష్ సక్సేనా, దీపక్రెడ్డి వ్యవహారాల్లో బోగస్ పత్రాలదే కీలకపాత్ర. స్టాంప్ వెండర్ల నుంచి ఖాళీ స్టాంపు పేపర్లు సేకరించి.. వాటికి నూనె, పసుపు రాసి ఎండబెట్టడం ద్వారా పాతవిగా మార్చేవారు. వీటిపై తమకు కావాల్సిన పేర్లతో జీపీఏలు, ఏజీపీఏలు రాసేవారు. కబ్జాల కోసం నకిలీ పత్రాలతో పాటు బోగస్ వ్యక్తుల్నీ రంగంలోకి దింపడం శైలేష్ సక్సేనా, దీపక్రెడ్డిలకు వెన్నతో పెట్టిన విద్య. పిటిషన్ దాఖలు చేయించేది బోగస్ వ్యక్తులతో కావడంతో కొన్ని చిరునామాలను ఈ ముఠా సృష్టించింది. చంచల్గూడ జైలుకు దీపక్రెడ్డి ఎమ్మెల్సీ దీపక్రెడ్డి, శైలేష్ సక్సేనాతోపాటు మరో నిందితుడు ఆర్.శ్రీనివాస్ను సీసీఎస్ పోలీసులు బుధవారం జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చంచల్గూడ జైలుకు తరలించారు. విచారణ కోసం నిందితుల్ని తమ కస్టడీకి అప్ప గించాలని నాంపల్లి కోర్టులో సీసీఎస్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కాగా, జైలు ప్రాంగణంలో వేచి ఉన్న దీపక్రెడ్డి చట్ట విరుద్ధంగా మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ మీడియా కంటికి చిక్కారు. మరోవైపు అలీ మహ్మద్ ఇచ్చిన ఫిర్యాదుతో దీపక్రెడ్డి, శ్రీనివాస్ను అరెస్టు చేశామన్నారు. షేక్పేట మాజీ తహశీల్దార్ చంద్రకళ ఫిర్యాదుతో శైలేష్ సక్సేనాను అరెస్టు చేసినట్లు తెలిపారు. నాకు సంబంధం లేదు: దీపక్రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థలాలు, కేసు లతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కుట్ర పూరితంగా తనను ఇరికించారని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి ఆరోపించారు. సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత దీపక్రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన సంతకాలను కొందరు ఫోర్జరీ చేసినట్లు పేర్కొ న్నారు. అయితే ఈ ఆరోపణల్ని సీసీఎస్ పోలీసులు ఖండిస్తున్నారు. ఆయా స్థలాలతో దీపక్రెడ్డికి సంబంధం లేకపోతే ఎన్నికల ఆఫిడవిట్లో వాటిని ఎలా పొందుపరిచారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దీపక్రెడ్డి అరెస్టు విషయంపై ఏపీ శాసన మండలి చైర్మన్కు సమాచారం ఇచ్చారు. -
‘భూములిచ్చేయ్..లేకపోతే..’
► తొలకరి నాటికి రైతులకు తిరిగి ఇచ్చేయాలి ► లేకపోతే నీ ఇంటి ముందు ధర్నా చేస్తాం ► ప్రత్తిపాటిని హెచ్చరించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు చిలకలూరిపేట: ‘దళితుల భూములు కాజేయడానికి నీకెంత ధైర్యం. ఎవరి అండ చూసుకుని రెచ్చిపోతున్నావు. ఆక్రమించుకున్న భూములను తొలకరి సాగునాటికి రైతులకు తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే నీ ఇంటి ముందు ధర్నా చేస్తా’ అని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఘాటుగా హెచ్చరించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో భూముల అన్యాక్రాంతానికి నిరసనగా గురువారం ఇక్కడ నిర్వహించిన సదస్సులో మధు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భూములు కాజేసేవారిని, ప్రోత్సహించేవారిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. అణగారిన వర్గాలకు అండగా నిలవాల్సిన మంత్రి పుల్లారావు దళితులనే లక్ష్యంగా ఎంచుకుని భూములు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. దర్జాగా కబ్జా చేస్తున్నారు దశాబ్దాల నుంచి సాగుచేసుకుంటున్న పచ్చని పంట పొలాలను గ్రానైట్ నిక్షేపాల పేరుతో దౌర్జన్యంగా, దర్జాగా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. తనకు సంబధం లేదని బుకాయిస్తున్న ప్రత్తిపాటి.. యడవల్లి దళతులకు చెందిన 416 ఎకరాల ఏకపట్టాను ఎందుకు రద్దు చేయించారని నిలదీశారు. వేలూరు గ్రామంలో 41.50 ఎకరాల దళితుల భూములను నీరు- చెట్టు పేరిట «ధ్వంసం చేసి రూ. 62 లక్షల మట్టిని అమ్ముకున్నారని ఆరోపించారు. తూబాడులో 18 ఎకరాలు, అప్పాపురంలో 50ఎకరాలు ఇలా ఎటు చూసినా దళితుల భూములను లాక్కొని వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రమేయంతోనే ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వరుస రాజకీయ హత్యలు జరిగాయని మధు ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అరాచక పాలనపై రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణ కోరడం సబబేనన్నారు. -
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి బెదిరింపుల దందా
- తనపై భూకబ్జా కేసు విత్డ్రా చేసుకోవాలంటూ హెచ్చరికలు - మాదాపూర్ పోలీసు స్టేషన్లో బాధితుడు మూర్తి ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ పత్రాలతో భూ కబ్జాకు ప్రయత్నించిన కేసులో నిందితుడైన టీడీపీ నేత, అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జి.దీపక్రెడ్డి బెదిరింపుల దందాకు దిగారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన భూకబ్జా కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న మాదాపూర్ వాసి ఎం.రాధాకృష్ణమూర్తిని దీపక్రెడ్డి బెదిరిం చారు. బాధితుడి ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు శనివారం దీపక్రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నం.286/2017తో రిజిస్టరైన ఈ కేసులో అనుమతి లేకుండా బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించడం (ఐపీసీ 448), బెదిరించడం (ఐపీసీ 506) సెక్షన్ల కింద ఆరోపణలను చేర్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన దీపక్రెడ్డి ఆ జిల్లాలోని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి స్వయానా అల్లుడు. 3.37 ఎకరాలపై కన్ను బంజారాహిల్స్లోని రోడ్ నం.2లో ఉన్న సర్వే నెం.129/71లోని 3.37 ఎకరాల స్థలంపై దీపక్రెడ్డి సహా ఇతర నిందితులు కన్నేశారు. ఈ స్థలాన్ని దశాబ్దాల క్రితం నగరంలో నివాసం ఉన్న శరణార్థి అయూబ్ కమల్కు ప్రభుత్వం కేటాయించింది. దీన్ని ఆయన నుంచి 1960 లో ఎంవీఎస్ చౌదరితో పాటు ఆయన సోద రులు ఖరీదు చేశారు. అయూబ్ కమల్ ఈ స్థలాన్ని అన్సారీ బ్రదర్స్కు విక్రయించినట్లు, వారి నుంచి దీన్ని తాము ఖరీదు చేసినట్లు జై హనుమాన్ ఎస్టేట్స్ సంస్థకు చెందిన బి.శైలేష్ సక్సేనా, బి.సంజయ్ సక్సేనా, బి.ప్రకాశ్ చంద్ర సక్సేనాలతోపాటు జి.దీపక్రెడ్డి బోగస్ డాక్యుమెంట్లు రూపొందించి, సివిల్ సూట్ వేయడం ద్వారా తదుపరి చర్యలకు ఉప క్రమించారు. దీంతో ఎంవీఎస్ చౌదరి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. షేక్పేట్ మండల రెవెన్యూ అధికారులు విచారించి ఆ స్థలం ఎంవీఎస్ చౌదరిదని తేల్చారు. దీంతో చౌదరి తరపు ప్రతినిధి, మాదాపూర్కు చెందిన ఎం.రాధాకృష్ణ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బదులు చెప్పలేక నీళ్లు నమిలిన దీపక్ సీసీఎస్ పోలీసులు దీపక్రెడ్డిని శనివారం విచారించగా.. ఆ స్థలానికి, తనకు సంబం ధం లేదన్నారు. అయితే, పోలీసులు ఎన్నికల అఫిడవిట్లో ఈ స్థలం వివరాలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. దీంతో దీపక్రెడ్డి బదులు చెప్పలేక నీళ్లు నమిలినట్లు తెలిసింది. నిందితుడిపై చర్యలు తీసుకుంటాం ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న మాదాపూర్ వాసి ఎం.రాధాకృష్ణమూర్తిని దీపక్రెడ్డి బెదిరించారు. శనివారం ఉదయం 7.10 గంటలకు మూర్తి ఇంటికి వెళ్లిన దీపక్రెడ్డి దాదాపు 45 నిమిషాలపాటు అక్కడే ఉండి, తనపై కేసును ఉపసంహ రించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే తనకున్న అనంతపురంలో మూర్తిపై తప్పు డు కేసులు నమోదు చేయిస్తానంటూ హెచ్చరించారు. దీనిపై బాధితుడు ఫిర్యాదు మేరకు దీపక్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ కళింగ్రావ్ చెప్పారు. -
న్యాయం జరగలేదని రైతు ఆవేదన
-
కన్ను పడితే చాలు కబ్జా యత్నం
-
శ్రీకాళహస్తిలో మంత్రి బొజ్జల భూకబ్జా
-
పహాడీ షరీఫ్ పీఎస్ పరిధిలో భారీగా భూకబ్జా
-
వారి భూదాహం తీరడం లేదు
► గోశాల తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు ► ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన విహెచ్పీ అనంతపురం కల్చరల్ : అమరావతి నుంచి అనంత దాకా భూములన్నీ ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తున్నా, అధికార పక్షానికి భూదాహం తీరడం లేదని పలువురు రాజకీయ పార్టీల నాయకులు విమర్శించారు. ఇస్కాన్ వారి గోశాలను ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశ్వహిందూ పరిషత్తు ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. వీరికి మద్దతుగా వివిధ రాజకీయ పక్షాల నేతలు పాల్గొని ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. వీహెచ్పీ జిల్లా ఉపాధ్యక్షులు యర్రగుంట్ల శ్యామసుందర్, ఇస్కాన్ జిల్లా నిర్వాహకులు దామోదర గౌరంగదాసు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్ధన్రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లలిత్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు దాదా గాంధీ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కేవీ రమణ తదితరులు మాట్లాడారు. గోశాలను తరలించాలన్న నిర్ణయం ఎంతమాత్రం సరైంది కాదని, ఎటువంటి పరిస్థితులలోనూ గోశాలను అన్యాక్రాంతం చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రం తరం చేస్తామని హెచ్చరించారు. అధికారులపై చర్యలు తీసుకోండి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. గోశాల తరలింపు నిర్ణయమే అనాలోచితమైంది. ధార్మిక భావజాలానికి వ్యతిరేకంగా ఇప్పటికే అనేక సంఘటనలు జరుగుతున్నాయి. మరోసారి ప్రభుత్వం తప్పు చేయకుండా ఆలోచించుకోవాలి. గోశాల ఉద్యమంలో బీజేపీ పూర్తి మద్దతునిస్తుంది.- విష్ణువర్ధన్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు కబ్జా పర్వం కొనసాగుతోంది మనుషులు తిండి మాత్రమే తింటారు. కానీ తెలుగుదేశం పార్టీలోని వారు భూములను కూడా యథేచ్ఛగా తింటారనడానికి గోశాలను ఆక్రమించాలన్న నిర్ణయమే నిదర్శనం. సేవా కార్యక్రమాలను ప్రతీకగా నిలుస్తున్న ఇస్కాన్ గోశాల తరలింపును అడ్డుకుంటాము. అధికార పక్షాన్ని నిలదీయడానికి ఉద్యమంలో పాల్గొంటాం. - కేవీ రమణ,ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు టీడీపీ ప్రభుత్వంలో భూకబ్జాలు పెరిగిపోయాయి సజావుగా నడుస్తున్న గోశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకోవడం వెనుక కుట్ర దాగుందని అందరూ అనుకుంటున్నారు. పార్టీ కార్యాలయానికి వాడుకోవడానికి గోశాల భూములను వాడుకోవడం దారుణం. అందరూ దీనిని ఖండించాలి.- దాదా గాంధీ,కాంగ్రెస్ నగర అధ్యక్షులు అన్యమత ప్రచారానికే గోశాల భూములు హిందుత్వ సంస్థలను దెబ్బతీయడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఓ పద్ధతి ప్రకారం వెళుతోంది. నిన్నటి వాసవీ కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపం, నేడు గోశాల ఇలా ధార్మిక సంస్థల నుంచి భూములను లాక్కొని ఇతర మతాల వారికియ్యడం కోసం కుట్రలు జరుగుతున్నాయి. ప్రాణాలు పోయినా గోశాల తరలింపును ముందుకు సాగనీయం. - శ్యామసుందర్,వీహెచ్పీ,జిల్లా ఉపాధ్యక్షులు -
ఖాళీస్ధలం కన్పిస్తే చాలు కబ్జాకవాల్సిందే !
-
బీజేపీ నల్లగొండ సభలో కలకలం
* కిషన్రెడ్డి మాట్లాడుతుండగా వ్యక్తి ఆత్మహత్యాయత్నం * గ్రామకంఠం భూమి కబ్జాపై పోరాడుతున్న బాధితుడు * శంకర్కు మద్దతుగా కలెక్టర్ బంగ్లా వద్ద కిషన్రెడ్డి ధర్నా నల్లగొండ టూటౌన్: నల్లగొండ జిల్లా కేంద్రంలో మోదీ సర్కారు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా బుధవారం నల్లగొండలో బీజేపీ నిర్వహించిన ‘ప్రజాసేవ పునరంకిత’ సభలో కలకలం రేగింది. పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్రెడ్డి ప్రసంగిస్తుండగానే ఓ వ్యక్తి హఠాత్తుగా ఒంటినిండా మంటలతో కేకలు వేస్తూ వేదికపైకి దూసుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా సభ మొత్తం హడలెత్తిపోయింది. ఆత్మాహుతి దాడి యత్నం జరిగిందని వదంతులు రావడంతో అక్కడున్న వారంతా పరుగులు తీశారు. ఏం జరుగుతోందో అర్థంకాక కొంతసేపు గందరగోళం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు, పార్టీ నేతలు కిషన్రెడ్డి చుట్టూ వలయంగా మారారు. అక్కడి నుంచి ఆయన్ని బయటకు తీసుకెళ్లారు. మంటలతో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా, అతను ఆత్మాహుతి దళ సభ్యుడు అయి ఉం టాడని పార్టీ వర్గాలు భావించాయి. ఆ వ్యక్తి వెంట వచ్చిన ఓ యువకుడిని గుర్తించిన బీజేపీ కార్యకర్తలు అతనిపై దాడికి యత్నిం చారు. పోలీసులు అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. భూ వివాదమే కారణం! కిషన్రెడ్డి ఎదుటే ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి పేరు బరిశెట్టి శంకర్. ఈయనది నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని కేశరాజు పల్లి. ఈ గ్రామకంఠం భూమిని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించడంపై శంకర్ పోరాడుతున్నాడు. కబ్జాకు గురైన భూమిని గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయానికి కేటాయించాలని కొద్ది రోజులుగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నాడు. జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్కు సైతం విన్నవించాడు. కానీ ఆక్రమించుకున్న వ్యక్తి టీఆర్ఎస్ కార్యకర్త కావడంతో ఈ వ్యవహారం కొలిక్కి రావడం లేదని ఆవేదన చెందాడు. ఈ విషయమై కిషన్రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు శంకర్ నల్లగొండ బీజేపీ సభకు వచ్చాడు. వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పటించుకున్నాడు. బీజేపీ నేతలు మంటలను ఆర్పి శంకర్ను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తర్వాత కిషన్రెడ్డి ఆసుపత్రికి వెళ్లి శంకర్ను పరామర్శించారు. ఆర్డీవోను పిలిచించి భూ కబ్జా విషయంలో నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.శంకర్ కుటుంబానికి న్యాయం చేయాలని, అతన్ని వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ బంగ్లా ఎదుట కిషన్రెడ్డి ధర్నా చేశారు.