Malla Reddy Ch
-
కవితకు ఈడీ నోటీసులు.. మంత్రి మల్లారెడ్డి రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది. కొన్ని నెలల తర్వాత తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఈ క్రమంలో కేంద్రంపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి మీడియాతో మట్లాడుతూ..‘కేంద్రంలోని బీజేపీ నేతలు బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారు. వాళ్ల జిమ్మిక్కులు, మానసికంగా, రాజకీయంగా అణిచివేయాలని చూస్తున్నారు. నా మీద కూడా ఐటీ దాడులు జరిగాయి. కానీ, ఏమైంది. రాజకీయాల్లో అదొక పార్ట్ మాత్రమే. వాళ్ల చేతిలో ఐటీ, ఈడీలు మాత్రమే ఉన్నాయి’ అని ఎద్దేవా చేశారు. ఇదే సయమంలో తెలంగాణలో అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. ‘దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచి అయ్యింది. కేసీఆర్ పాలనలో తెలంగాణలో చాలా అభివృద్ధి జరిగింది. దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తోంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. రాష్ట్రంలో అందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఐటీలో కూడా మనం బెంగళూరును మించిపోయాం. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఎన్నో కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు’ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఈడీ హీట్.. సుప్రీంకోర్టుకు ఎమ్మెల్సీ కవిత -
‘మంత్రి మల్లారెడ్డి నుంచి ప్రాణహాని ఉంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డిపై సంచలన ఆరోపణలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు ఇవాళ బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మీడియా ముందుకు వచ్చారు. దాదాపు 30 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కాజేసే కుట్ర జరుగుతోందని.. మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బామ్మర్ది శ్రీనివాస్రెడ్డి తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని.. తమకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వాళ్లు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో ఉన్న మంత్రి మల్లారెడ్డి కాలేజీ ఎదురుగా ఉన్న భూమిని మర్రి వెంకట్రెడ్డి, దయాసాగర్రెడ్డి అనే ఇద్దరు.. సుంకరి అనే కుటుంబం నుంచి భూమిని కొనుగోలు చేశారు. మొత్తం ఎనిమిది ఎకరాల్లో.. 4.5 ఎకరాలు కొన్నారు వీళ్లు. అదే సమయంలో మంత్రి మల్లారెడ్డి తన భార్య పేరు మీద 2 ఎకరాలు కొన్నారు. అయితే మొత్తం భూమిని కాజేసేందుకు మంత్రి కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వీళ్లు. భూమి వద్దకు వెళ్లిన మాపై మంత్రి, ఆయన అనుచరులు దాడి చేశారు. మంత్రి బామర్ది శ్రీనివాస్ రెడ్డి అయితే ఏకంగా గన్తో షూట్ చేస్తానంటూ బెదిరించాడు. భూమిని వదిలి వేళ్లాలని మమ్మల్ని బెదిరించారు. పోలీసులకు పిర్యాదు చేసినా.. రాజకీయ ఒత్తిడి ఉందంటూ పట్టించుకోవడం లేదు. భూ రికార్డుల నుండి మా పేరు తొలగించి.. అక్రమంగా మంత్రి వారి పేరు పై మార్చుకున్నారు. మా భూమి మాకు ఇప్పించాలని ప్రభుత్వం కు విజ్ఞప్తి చేస్తున్నాం అని బాధితులు మీడియా ముందు వాపోయారు. మంత్రి మల్లారెడ్డి చాలా మంది రైతులను మోసం చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి నుంచి మాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించి మాకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ను కోరుతున్నాం అని బాధితులు మర్రి వెంకట్ రెడ్డి, దయాసాగర్ రెడ్డిలు మీడియా సాక్షిగా విజ్ఞప్తి చేశారు. ఇక ఈ ఆరోపణలపై మంత్రి మల్లారెడ్డిగానీ, శ్రీనివాసరెడ్డిగానీ స్పందించాల్సి ఉంది. ఇదీ చదవండి: మేం తిరగబడితే.. మీరెక్కడా తిరగలేరు! -
ఎన్నికల స్టంటే అనుకో!: మంత్రి మల్లారెడ్డి టంగ్స్లిప్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మరోసారి తనదైన శైలి కామెంట్లతో వార్తల్లోకెక్కారు. ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటేనంటూ వ్యాఖ్యానించారాయన. టీఎస్సార్సీటీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం.. ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంపై ఉద్యోగుల నుంచి హర్షాతిరేకలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం పీర్జాదిగూడ పార్టీ కార్యాలయం వద్ద కేసీఆర్ చిత్రపటానికి మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా.. TSRTC కార్మికులకు డబుల్కా మీటాలాగా.. ఊహించని విధంగా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా సీఎం కేసీఆర్ చేశారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. అయితే.. ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటా?అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు.. ‘‘ఎన్నికల స్టంట్ అనుకో.. ఏదైనా అనుకోండి.. మాది రాజకీయ పార్టీ.. ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఎట్లైనా ఎన్నికల స్టంట్ ఉంటది’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. ఆ వెంటనే సవరించుకుని.. ‘‘ఎన్నికల కోసమే అయినా కార్మికులకు మంచి జరిగింది. ఆర్టీసీ విలీనం చేయాలంటే దమ్ము, ఫండ్స్ ఉండాలి. సీఎం కేసీఆర్ నిర్ణయంతో కార్మికులు సంతోషంగా ఉన్నారు’’ అని వ్యాఖ్యానించారాయన. ఇదీ చదవండి: మెట్రో విస్తరణ వాళ్ల లబ్ధి కోసమే! -
డీజే టిల్లు సాంగ్కు మల్లారెడ్డి డ్యాన్స్
-
డీజే టిల్లు స్టెప్పులతో అదరగొట్టిన మంత్రి మల్లారెడ్డి.. వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి స్టెప్పులతో అదరగ్గొట్టారు. డీజే టిల్లు సాంగ్కు తనదైన శైలిలో స్టెప్పులేస్తూ అలరించారు. మేడ్చల్ జిల్లాలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులతో కలిసి మంత్రి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్తో పాటు, డీజే టిల్లు మూవీ హీరో సిద్ధు జొన్నలగడ్డ హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో సిద్ధుతో కలిసి మంత్రి మల్లారెడ్డి స్టెప్పలేస్తూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. దీంతో మల్లారెడ్డి డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: (తెలంగాణ నూతన సీఎస్గా శాంతికుమారి) -
Malla Reddy: ఆది నుంచి వివాదాస్పదమే!.. తాజాగా మరోవివాదంలో..
సాక్షి, మేడ్చల్జిల్లా: మంత్రి మల్లారెడ్డి టీఆర్ఎస్లో ఆది నుంచి వివాదస్పద ఎమ్మెల్యేగా వార్తల్లోకి ఎక్కటం చర్చనీయాంశంగా మారుతోంది. విపక్షాల నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా పలు విమర్శలు ఎదుర్కోవడం గమనార్హం. తాజాగా జిల్లాకు చెందిన ఐదుగురు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మరో వివాదంలో చిక్కుకున్నారు. ►జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో సొంత నియోజకవర్గమైన మేడ్చల్కు పెద్దపీట వేస్తూ మిగతా నియోజకవర్గాలను విస్మరిస్తున్నారనేది సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రధాన ఆరోపణ. అలాగే పార్టీలో జిల్లా అధ్యక్షుడితో కలిసి గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీ పరువును బజారుకు ఈడ్చుతున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ►జయాపజయాలు ఏదైనా కాని తత్తరపాటు వ్యవహారంతో వివాదాల వరకు తొంగి చూసి.. అదే రీతిలో సమర్థించుకోవటంలోనూ మంత్రి మల్లారెడ్డి దిట్ట. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ దక్కించుకోవటం మొదలుకొని మంత్రి పదవిని సాధించటం వరకు ఆయన వేసిన వ్యూహాలు ఫలించాయి. ►స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మొదలుకొని సహకార సంఘాలు, మున్సిపల్ ఎన్నికల వరకు మంత్రి పలు వివాదాలకు నెలవయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపు.. కొన్ని పురపాలక సంఘాల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పలు పంచాయతీల్లో సర్పంచులు, ఉపసర్పంచ్ అభ్యర్థుల ఖరారు వరకు పలు వివాదాలను మంత్రి మల్లారెడ్డి అధిగమించారు. టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలను సైతం మంత్రి సొంత పార్టీతో సహా విపక్షాల నుంచి మూట గట్టుకున్నారు. కో–ఆప్షన్ సభ్యుల ఎంపికలో కూడా ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఇటీవల తన విద్యాసంస్థలపై ఐటీ దాడులు జరిగినప్పుడు కొత్త వివాదంలో చిక్కున్న మంత్రి ఏ విధంగా బయట పడతారని భావిస్తున్న బీఆర్ఎస్ పెద్దలకు తాజాగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో మంత్రి మల్లారెడ్డి పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నారు. నామినేటెట్ పదవుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బాహాటంగా విమర్శలు ఎదర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి తాడోపెడో తెల్చుకుంటామని ఎమ్మెల్యేలు హెచ్చరించటం వివాదాస్పదంగా మారింది. భూ వివాదాల్లోనూ... అలాగే జిల్లాలో పలు భూ వివాదాల్లో కూడా మంత్రి పలు ఆరోపణలను మూటగట్టుకుని వివాదంలో చిక్కుకున్న దాఖలాలు ఉన్నాయి. 2019లో మంత్రి అయ్యాక మేడ్చల్, జవహర్నగర్, శామీర్పేట, ఘట్కేసర్, బోడుప్పల్, పీర్జాదిగూడ సహా నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని ఊళ్లలోనూ భూముల కొనుగోళ్లలో పలు వివాదాలను ఎదుర్కొన్నారు. వివాదాల నడుమ ఉన్న భూములను గుర్తించి, ఇరు వర్గాలను ఒప్పించి ఆయా స్థలాలను తనకు విక్రయించేలా చేయడంలో సిద్ధహస్తుడనే పేరు ఆయనకు ఉంది. మూడు చింతలపల్లి పరిధిలో ఈ తరహాలో భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
మల్లారెడ్డికి ఊహించని షాక్.. సొంత పార్టీ నేతల వార్నింగ్!
సాక్షి, మేడ్చల్ జిల్లా: కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిపై సొంతపార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేశారు. నామినేటెడ్ పదవుల పంపకంలో ఏకపక్షంగా వ్యవహరించడంతో పాటు తాను చెబితేనే పనులు చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తున్నారంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. మంత్రి పెత్తనాన్ని తీవ్రంగా తప్పుబట్టిన బీఆర్ఎస్ శాసనసభ్యులు.. ఈ వ్యవహారంపై అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు సోమవారం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో అత్యవసరంగా భేటీ అయ్యారు. మైనంపల్లితో పాటు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద, బేతి సుభాష్రెడ్డి పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మంత్రి వ్యవహారశైలిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పోస్టుల్లో మేడ్చల్కే ప్రాధాన్యతనిస్తూ.. మిగతా సెగ్మెంట్లకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నాం.. ‘మా నియోజకవర్గాల్లోని కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నాం. అధికార పార్టీలో ఉండి ఏం ప్రయోజనం? మంత్రి మల్లారెడ్డి ఒకదారి.. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు మరొకదారి.. ఈ ఇద్దరి వల్ల విసిగిపోయాం.. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన వారే అయోమయానికి గురిచేస్తూ జిల్లాలో పార్టీని భ్రషు్టపట్టిస్తున్నారు. ఇద్దరూ కలిసి పార్టీకి తీవ్ర కళంకాన్ని తెస్తున్నారు..’ అంటూ సమావేశంలో నేతలు చర్చించుకున్నారు. వారిని వెంటనే తప్పించి కార్యకర్తలకు న్యాయం చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే విషయం కూడా చర్చించారు. పార్టీ పరువు తీస్తున్నారు! కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలను సమన్వయంతో ముందుకు తీసుకు వెళ్లాల్సి ఉండగా..మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ కేడర్ను తీవ్ర అయోమయానికి గురి చేస్తూ పార్టీ పరువు తీస్తున్నారని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. సిట్టింగ్లకే టికెట్ ఇస్తామని సాక్షాత్తు సీఎం కేసీఆరే ప్రకటించినప్పటికీ, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొందరు నేతలు పలు నియోజకవర్గాల్లో టికెట్ తమకే వస్తుందంటూ కార్యకర్తలను డైలమాలో పడేస్తున్నారని విమర్శించారు. ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్నాం: ఎమ్మెల్యేలు జిల్లాలోని నామినేటెడ్ పదవులన్నీ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతున్నాయని జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో కేవలం మేడ్చల్ నియోజకవర్గానికే ప్రాధాన్యత ఇస్తుండటంతో మిగతా నియోజకవర్గాల్లోని కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. సోమవారం ప్రత్యేక భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మంత్రి తీరును నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వల్లే మీడియా ముందుకు రావాల్సివచి్చందని చెప్పారు. మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, చేష్టలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళతామన్నారు. మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత కూడా.. రాత్రికి రాత్రే జీవో జారీ చేసి భాస్కర్ యాదవ్ను నియమించి, ఆ వెంటనే ప్రమాణ స్వీకారం చేయించారని విమర్శించారు. మంత్రి గతంలో పదవులను పొందిన వ్యక్తులకే మళ్లీ మళ్లీ కట్టబెడుతూ పంతం నెగ్గించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి కేడరే బలమని, అలాంటి కేడర్ను విస్మరిస్తే పార్టీ దెబ్బతినే అవకాశముందన్నారు. పార్టీ కేడర్ను రక్షించుకునేందుకే మీడియా ముఖంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు ఈ విషయాన్ని తెలుపుతున్నామని, వారి నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. -
ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్..
మేడ్చల్ రూరల్: దేశంలో అతిపెద్ద ఐటీ దాడి తనపైనే జరిగిందని, అది కూడా రికార్డేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని సీఎంఆర్ గ్రూప్స్ ఆడిటోరియంలో శుక్రవారం అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. తనపై ఇటీవల జరిగిన ఐటీ దాడి మూడోసారి కావడంతో.. హ్యాట్రిక్గా భావిస్తున్నానని పేర్కొన్నారు. తాను పాల వ్యాపారం నుండి మంత్రి స్థాయికి ఎదిగానని.. అందుకు ఎంతో కష్టపడ్డానని చెప్పుకున్నారు. తన విద్యాసంస్థల్లో పదివేల మంది అధ్యాపకులు, ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని వివరించారు. మనం ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చని.. అందుకు డిగ్రీలు అవసరం లేదని.. లక్ష్యం ఉంటే చాలని మంత్రి మల్లారెడ్డి ఉద్బోధించారు. -
మల్లారెడ్డికి ఊహించని షాక్.. భారీ ట్విస్ట్ ఇచ్చిన ఐటీ అధికారులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, ఈ కేసులో భాగంగా ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో సహా కాలేజీల్లో పనిచేసే వారిని కూడా విచారిస్తున్నారు. అయితే, తాజాగా మంత్రి మల్లారెడ్డి కేసులో ఈడీకి ఐటీ అధికారులు లేఖ రాశారు. కాగా, మంత్రి మల్లారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని అధికారులు గుర్తించారు. సోదాలకు సంబంధించి పూర్తి నివేదికతో ఈడీకి ఐటీ అధికారులు లేఖ పంపించారు. ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాలను ఐటీ.. ఈడీకి తెలిపింది. కాగా, ఈ కేసులో ఈడీ దర్యాప్తు అవసరం ఉందని ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఇక, మెడికల్ సీట్లు, డొనేషన్లలో అవకతవకలు జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు జరపాలని ఐటీ అధికారులు ఈడీని కోరారు. ఇదిలా ఉండగా.. మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు, అల్లుడు ఇళ్లలో సోదాల సందర్భంగా ఐటీ అధికారులు 18 కోట్ల రూపాయలు, లాకర్లను పగులగొట్టి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక, దర్యాప్తులో భాగంగా విదేశాల్లో పెట్టుబడులు, విదేశాలకు డబ్బు తరలించినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో, ఈడీకి ఐటీ అధికారులు లేఖ రాసినట్టు సమాచారం. ఈడీ విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఐటీ భావిస్తున్నది. కాగా, ఈ లేఖపై ఈడీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాల్సి ఉంటుంది. -
మల్లారెడ్డి ఐటీ దర్యాప్తులో మొదటిరోజు ముగిసిన విచారణ
-
మల్లారెడ్డి కేసులో మొదటి రోజు ముగిసిన విచారణ.. కొడుకు, అల్లుడు ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈ మధ్య కాలంలో జరిగిన ఈడీ, ఐటీ దాడులు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ దాడులు పొలిటికల్ హీట్ను పెంచాయి. కాగా, పెద్ద మొత్తంలో నగదు దొరకడంతో మల్లారెడ్డి సహా మరో 16 మందిని ఐటీ అధికారులు విచారిస్తున్నారు. ఇక, ఈ నేపథ్యంలో మల్లారెడ్డి ఐటీ దర్యాప్తులో మొదటిరోజు ఐటీ అధికారులు చేపట్టిన విచారణ ముగిసింది. ఐటీ అధికారులు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిని విచారించారు. కాగా, విచారణ అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాము. ఈరోజు ఎవరికైతే నోటీసులు ఇచ్చారో వారు మాత్రమే విచారణకు హాజరయ్యారు. విచారణ కోసం కాలేజీల ప్రిన్స్పాల్స్, అకౌంటెంట్స్ అందరూ విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా వారికి తెలిసిన వివరాలను అధికారులకు సవివరంగా చెప్పారు. ఐటీ అధికారులు ఇచ్చిన డేట్స్ ప్రకారంగా విచారణకు ప్రతీ ఒక్కరూ వస్తారు. అధికారులు చెప్పిన ఫార్మాట్ ప్రకారం కాలేజీ డేటాను వారికి అందించాము. ఇక, మొదటి రోజు 12 మంది విచారణకు వచ్చినట్టు తెలుస్తోంది. -
ఐటీ దాడుల వేళ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మల్లారెడ్డి.. కేసీఆర్ రెస్పాన్స్?
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో తెలంగాణలో ఈడీ, ఐటీ దాడులు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పొలిటికల్ లీడర్లే లక్ష్యంగా ఈ దాడులు జరగడం రాజకీయంగా పెను దుమారం రేగింది. కాగా, మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ దాడుల సందర్భంగా కోట్ల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పెద్ద డ్రామానే జరిగింది. అయితే, రాష్ట్రంలో ఐటీ దాడుల నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసే వార్తల్లో నిలిచారు. కాగా, మల్లారెడ్డి ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఐటీ దాడులు చేయించేది లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పన్ను మినహాయింపు ఇస్తాము. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ స్వచ్చందంగా పన్నులు చెల్లించేలా సీఎం కేసీఆర్ కొత్త చట్టాన్ని తీసుకువస్తారు. అప్పుడు పన్ను మినహాయింపులు ఇస్తాము. కేసీఆర్ నా వెంట ఉన్నంత వరకు నేను ఏ రైడ్లకు భయపడను’ అని కామెంట్స్ చేశారు. -
మల్లారెడ్డి కేసులో ట్విస్ట్.. హైకోర్టులో భద్రారెడ్డికి షాక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఐటీ దాడుల వ్యవహారం హాట్ టాపిక్ మారింది. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో, బంధువుల ఇళ్లలో ఐటీ శాఖ అనూహ్య దాడులు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. కాగా, దాడుల సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐటీ అధికారులపై మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి చేసిన ఫిర్యాదుపై హైకోర్టు స్టే విధించింది. దీంతో, భద్రారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఫిర్యాదుపై నాలుగు వారాల పాటు కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. -
2024లో కేసీఆరే ప్రధాని
నల్గొండ రూరల్ : 2024లో జరిగే ఎన్నికల్లో కేసీఆరే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని, సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ కోసం దేశమంతా ఎదురుచూస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ఆరెగూడెం ఇన్ చార్జ్ గా నియమితులైన ఆయన శుక్రవారం ఆరెగూడెం, కాట్రేవు, గుండ్లబావి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 19రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారని, కానీ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. ఇక్కడి సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ఆ రాష్ట్రాల సీఎంలకు దమ్ము సరిపోవడంలేదన్నారు. సీఎం కేసీఆర్ దమ్మున్న లీడరని, బీజేపీ అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి రూ.22కోట్లకు మునుగోడు నియోజకవర్గాన్ని గుత్తకు ఇచ్చిందన్నారు. ప్రచారంలో ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరెగూడెంలో వృద్ధులతో మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి బీజేపీ, కాంగ్రెస్లకు డిపాజిట్లు రావు మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు రావని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తాను ఇన్ చార్జ్ గా నియమితులైన మండలంలోని ఆరెగూడెం, కాట్రేవు, గుండ్లబావి, రెడ్డిబావి, సైదాబాద్ గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆరెగూడెంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా వృద్ధులతో, రైతులతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ పథకాలను గూర్చి వివరించి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న మూడున్నరేళ్లలో ఏనాడూ గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదన్నారు. దమ్ముంటే కేంద్రం నుంచి రూ.100కోట్లు మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి తెచ్చి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. పంతంగి–గుండ్లబావి రోడ్డు వేయించాలని మంత్రి జగదీశ్రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు మునగాల ప్రభాకర్రెడ్డి, బచ్చ రామకృష్ణ, నాయకులు జక్క వెంకట్రెడ్డి, మంద సంజీవరెడ్డి, జాల మల్లేశ్యాదవ్, నందగిరి శ్యామ్, మునగాల దామోదర్రెడ్డి, బచ్చ మల్లేశం, పల్లె లింగస్వామి, దుర్గం రాజు, కొలను ఆగిరెడ్డి పాలొన్నారు. -
మల్లారెడ్డా మజాకా.. మాస్ డ్యాన్స్తో ఇరగదీసిండు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం ఎవరి నోట విన్నా మునుగోడు పాలిటిక్స్ గురించే చర్చ నడుస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు మునుగోడుపైనే ఫోకస్ పెట్టాయి. కాగా, అధికార టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో గెలుపే టార్గెట్గా ముందుకు సాగుతోంది. ఇక, శనివారం మునుగోడులో ప్రజాదీవెన బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు సీఎం కేసీఆర్ కూడా హాజరు కానున్నారు. మరోవైపు.. మునుగోడు సభకు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మంత్రులు సైతం హుషారుగా సభకు విచ్చేస్తున్నారు. కాగా, మునుగోడుకు వస్తున్న క్రమంలో మంత్రి మల్లారెడ్డి చేసిన డ్యాన్స్ ఈరోజు హైలైట్ ఆఫ్ ది డేగా చెప్పుకోవచ్చు. తన కాన్వాయ్లో వస్తున్న మల్లారెడ్డి ఓపెన్ టాప్ కారులో నిల్చుని ఊరా మాస్ డ్యాన్స్ స్టెప్పులు వేశారు. ఇక, కారు దిగిన అనంతరం కూడా మల్లారెడ్డి మాస్ డ్యాన్స్ స్టెప్పులతో ఇరగదీశారు. ఆయన డ్యాన్స్ చేయడంతో అక్కడున్న టీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ పెరిగి మంత్రితో వారు కూడా స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి చక్కర్లు కొడుతోంది. ఇది కూడా చదవండి: మునుగోడు సభకు.. సీఎం కేసీఆర్ కారెక్కనున్న చాడ వెంకట్రెడ్డి! -
నాపై దాడి వెనుక రేవంత్ హస్తం: మల్లారెడ్డి
రసూల్పురా(హైదరాబాద్)/ఘట్కేసర్: తనపై దాడి వెనుక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి హస్తముందని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. రేవంత్రెడ్డి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రశ్నిస్తున్నందునే తన అనుచరులతో రెడ్డిసింహగర్జన సభలో తనపై దాడి చేయించారని అన్నారు. సోమవారం మంత్రి బోయిన్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రేవంత్పై విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. గత ఎనిమిదేళ్లుగా రేవంత్రెడ్డి తనను బ్లాక్మెయిల్ చేస్తు న్నారని, ఇదే విషయాన్ని గతంలో కూడా తాను చెప్పానని మల్లారెడ్డి పేర్కొన్నారు. రేవంత్రెడ్డి తనను హత్య చేయించేందుకు కుట్ర పన్నుతున్నారని, అయినా తాను భయపడనని చెప్పారు. సింహగర్జన సభలో రెడ్డి సామాజిక వర్గానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తుండగా తనకు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారని.. చివరకు తనపై, తన కాన్వాయ్పై రాళ్లు, చెప్పులు, కుర్చీలు విసిరి దాడికి దిగారని తెలిపారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు రెడ్డి కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. ఈ విషయంలో కరోనా కారణంగా జాప్యం జరిగిందని, ఇదే అంశాన్ని తాను సభా వేదికపై చెబుతున్న సమయంలోనే తన ప్రసంగానికి అడ్డుపడ్డారని మంత్రి తెలిపారు. తనమీద దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఎంపీ రేవంత్రెడ్డి నేరాలపై విచారణ చేసి జైలులో పెడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు, మేడ్చల్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఘట్కేసర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు మంత్రిపై దాడి చేసిన వారిమీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఘట్కేసర్ సీఐ చంద్రబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం రాత్రి జరిగిన రెడ్ల సింహగర్జన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మల్లారెడ్డి సభావేదికపై మాట్లాడుతుండగా రేవంత్రెడ్డి అనుచరులైన మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి.. మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ దుర్భాషలాడుతూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అనంతరం మంత్రి వేదిక దిగి వెళ్లిపోతుండగా మరికొందరు రేవంత్ అనుచరులు మంత్రి కాన్వాయ్పై నీళ్ల్లబాటిళ్లు, కుర్చీలతో దాడి చేశారు. రేవంత్రెడ్డి అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఘట్కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఫిర్యాదు మేరకు 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. కేసులో ఏ1గా సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డి, ఏ2గా సోమశేఖర్రెడ్డి పేర్లను పేర్కొన్నారు. -
డ్రగ్స్ ఎమ్మెల్యేలు, వసూల్ మంత్రిని తొలగించండి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధికార మదంతో అక్రమాలతో దుష్ట పాలన సాగిస్తోందని.. కళ్లు నెత్తికెక్కి మంత్రి మల్లారెడ్డి బహిరంగంగా వసూల్ చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డిని ఎందుకు బర్తరఫ్ చేయడం లేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నలుగురు ఎమ్మెల్యేలు బెంగళూరు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని, తెలంగాణ పరువు తీసిన ఈ నలుగురు ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని బెంగళూరు పోలీసులు తెలిపారని ఉత్తమ్ చెప్పారు. టీఆర్ఎస్ నేతలు ఇప్పటివరకు భూమి, ఇసుక, మద్యం డీల్ చేయగా ఇప్పుడు డ్రగ్స్ దందాలో కూడా వేలు పెట్టారని తెలిపారు. కర్ణాటకలో బీజేపీతో మాట్లాడుకొని కేసును మాఫీ చేసుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య అవగాహన ఉందని, నాగార్జునసాగర్లో టీఆర్ఎస్కు లబ్ది చేకూర్చడం కోసం బీజేపీ బలహీనమైన వ్యక్తిని పోటీలో పెట్టిందని వివరించారు. సాగర్కు నీళ్లు రావు.. ఎడారిగా మారుతోందనే విషయం ఓటర్లు గమనించాలని సూచించారు. టీఆర్ఎస్ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. సాగర్ ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిగే పరిస్థితి కనిపించడం లేదని సందేహం వ్యక్తం చేశారు. డబ్బు, మద్యం ఆపాలని ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే బండి సంజయ్ కర్ణాటకలో చీకటి ఒప్పందాలు ఎలా చేసుకుంటారు అని నిలదీశారు. చదవండి: వాళ్ల కాళ్లు పట్టుకుని చంద్రబాబు సీఎం అయ్యారు చదవండి: ‘ఆ నలుగురు’ లేక వృద్ధ దంపతుల ఆత్మహత్య -
మంత్రి మల్లారెడ్డికి కోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ప్రజా ప్రతినిధులపై నమోదైన పలు కేసులు నేడు కోర్టు ముందుకు విచారణకు వచ్చాయి. వేర్వేరు కేసుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్లు కోర్టుకు హాజరయ్యారు. అయితే వీరిలో బండి సంజయ్కు ఊరట లభించగా, మంత్రి మల్లారెడ్డి, దానం నాగేందర్లు మరో వాయిదాకు హాజరుకాక తప్పదు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్పై కరీంనగర్లో నమోదైన మూడు కేసులను కోర్టు కొట్టి వేయగా, తన కేసును కూడా కొట్టివేయాలంటూ మంత్రి మల్లారెడ్డి చేసిన అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది. బంజారాహిల్స్లో నమోదైన కేసులో మంత్రి మల్లారెడ్డి దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 11న మంత్రి మల్లారెడ్డి కచ్చితంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. -
‘మల్లారెడ్డి కార్మిక మంత్రిగా ఉండటం మన ఖర్మ’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రిగా ఉండటం మన కర్మ అని, ప్రజలు చేసుకున్న పాపం అని ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. సోమవారం సుందరయ్య విజ్ఞా న కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం (టీపీయూఎస్) డైరీ ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన నాయిని డైరీని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజల పక్షాన ఉండాల్సిన మంత్రి మల్లారెడ్డి యాజమాన్యాలకు సహకరించి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పనికిరాని కార్మిక మంత్రిని చూస్తే జాలివేస్తుందన్నారు. నేడు రాష్ట్రంలో కార్మికులు సమ్మెచేసే పరిస్థితి లేదని వాపోయారు. జగన్ నిర్ణయం సరైనదే..: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొనగాడు అని నాయిని కితాబు ఇచ్చారు. జగన్ ప్రైవేట్ రంగంలో లోకల్ వారికి 75 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారని, ఇక్కడ కూడా అది అమలు చేయాలని కోరారు. 3 రాజధానుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని, ఆయన తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని చెప్పారు. టీడీపీ బినామిలే అమరావతిని రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని విమర్శించారు. -
మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ
సాక్షి, మేడ్చల్: జిల్లాలోని జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో రాష్ట్ర కార్మిక శాఖమంత్రి మల్లారెడ్డికి ఆదివారం నిరసన సెగ ఎదురైంది. కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం కేటాయించిన మార్కెట్ యార్డులోని చిరు వ్యాపారస్తులు కొందరు గుమిగూడి మంత్రి కాన్వాయికి అడ్డుపడ్డారు. ప్రభుత్వం తమకు ఇక్కడే శాశ్వత నిర్మాణాలు చేపట్టి ఇవ్వాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడంతో మంత్రి కాన్వాయ్ ముందుకు కదిలింది. -
మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ
-
పెండింగ్ పనులు పూర్తి చేయండి: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కార్మిక శాఖలో పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని మంత్రి సీహెచ్.మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. కార్మిక, పరిశ్రమ, ఉపాధి కల్పన శాఖ అధికా రులతో మంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులను గుర్తించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. శాఖాపరంగా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. పూర్తి చేసిన పెండింగ్ పనులను వెబ్సైట్లో పొందుపర్చాలని ఆదేశించారు. -
గత పాలకులు దోచుకున్నారు
చేవెళ్ల: గత పాలకులు రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకున్నారని.. ప్రజల కోసం చేసింది ఏమీ లేదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మండిపడ్డారు. మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో ఆదివారం చేవెళ్ల పార్లమెంట్ స్థాయి ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా ఆయన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి గట్టు రాంచందర్రావు, మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, డాక్టర్ ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డి, ప్రకాశ్గౌడ్, అరికెపూడి గాంధీతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అన్నిరంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. ఐదేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభ్యున్నతిని చూసి ప్రజలు మరోసారి భారీ మోజార్టీతో గెలిపించి ఆశీర్వదించారని పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీయే గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లుగా ఏమి చేయని ఆయా పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిఇంట్లో ఒకరు ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందిన వారే ఉన్నారన్నారు. అందుకే జనం గులాబీ పార్టీ పక్షం నిలబడ్డారని చెప్పారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీ స్థానాలను అత్యధిక మోజార్టీతో గెలిపించి కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలని పేర్కొన్నారు. జిల్లా అంటేనే ప్రత్యేకంగా ఉండాలని, దీనికి కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈనెల 9న జరిగే కేటీఆర్ బహిరంగ సభను చేవెళ్లలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చేవెళ్ల పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజకవర్గం నుంచి 3 వేల మందికి తక్కువ కాకుండా బహిరంగసభకు రావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం చేవెళ్లలో కేటీఆర్ పాల్గొనే సభా స్థలాన్ని మంత్రి తదితరులు పరిశీలించారు. సభ అదిరిపోవాలి: గట్టు రాంచందర్రావు రాబోయే ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సైనికులుగా పనిచేయాలని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి గట్టు రాంచందర్రావు అన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 9న చేవెళ్లలో ఎంపీ ఎన్నికల సన్నాహక బహిరంగ సభ జరుగుతుందన్నారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి దశదిశ నిర్దేశించేందుకు టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ వస్తున్నారని చెప్పారు. ఈ సభను విజయవంతం చేసేందుకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఎంపీ సీటును సాధిస్తామనే ధీమా ఈ సభ ద్వారా కలిగించాలని చెప్పారు. భారీగా జన సమీకరణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాశ్గౌడ్, డాక్టర్ ఆనంద్, మహేశ్రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో వీరు మాట్లాడుతూ.. బహిరంగ సభ కోసం ఆయా నియోజకవర్గాల పరిధిలో నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే అత్యధిక ఎంపీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ సభద్వారా టీఆర్ఎస్ సత్తా ఏంటో ప్రతిపక్షాలకు తెలుస్తుందన్నారు. చేవెళ్ల ఎంపీ సీటు గెలుపు ఖాయమనే ధీమాను ఈ సభ ద్వారా కేటీఆర్ఎకు ఇస్తామని చెప్పారు. సమావేశంలో ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు నాగేందర్గౌడ్, పర్యాద కృష్ణమూర్తి, కొండల్రెడ్డి, స్వప్న, నారాయణ, రాంనర్సింహ్మారెడ్డి, కొత్త మనోహర్రెడ్డి, సుజాత, చేవెళ్ల ఎంపీపీ బాల్రాజ్, పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, పలువురు సర్పంచులు ఉన్నారు. -
‘మన కూరగాయలు’ చాలా కాస్ట్ గురూ..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రవేశపెట్టిన ‘మనకూరగాయలు’ రిటైల్ విక్రయ కేంద్రాల్లో ధరలు హాట్ హాట్గా ఉన్నాయని వినియోగదారులు వాపోతున్నారు. శుక్రవారం మోండా డివిజన్ మారేడుపల్లి నెహ్రూపార్కులో ‘మన కూరగాయల’ రిటైల్ విక్రయ కేంద్రాన్ని సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ప్రారంభించారు. తాజా కూరగాయలు తక్కువ ధరలో విక్రయించాలనే సంకల్పంతో ‘మన కూరగాయల’ రిటైల్ కేంద్రాలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఏర్పాటుచేశారు. జన సంచారం ఎక్కువ ఉండే ప్రాంతాల్లో కేంద్రాన్ని ఏర్పాటుచేసి సేల్స్మెన్ల ద్వారా విక్రయాలు జరుపుతున్నారు. మన కూరగాయల రిటైల్ విక్రయ కేంద్రాన్ని ప్రత్యేక క్యాబిన్లో ఏర్పాటు చేశారు. కూరగాయలు తాజాగా ఉండేందుకు ఏసీని సైతం ఏర్పాటు చేశారు. అన్నిరకాల కూరగాయలతో పాటు పండ్లను ఈ కేంద్రంలో అమ్మకానికి పెట్టారు. అయితే మన కూరగాయలు విక్రయ కేంద్రంలో ధరలు చూసి వినియోగదారులు కళ్లు తేలేస్తున్నారు. బయట మార్కెట్ ధరల కంటే సుమారు కిలోకు రూ.5 నుంచి 10 వరకు వ్యత్యాసం కనిపిస్తోంది. సూపర్ మార్కెట్ల కంటే అదనంగా రేట్లు ఉండడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. బయటి మార్కెట్ కం టే సూపర్మార్కెట్లో కొంతమేర అధిక ధరలు ఉన్నప్పటికీ అదే స్థాయిలో మనకూరగాయలు విక్రయ కేంద్రంలో ధరలు ఉండడంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. నేరుగా రైతు పండించిన కూరగాయలను వినియోగదారులకు అందించాలనే సంకల్పంతో వ్యవసాయ మార్కె టింగ్ శాఖ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ధరల్లో వ్యత్యాసం మూలంగా వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. దళారీ వ్యవస్థ నిర్మూలనకు మన కూరగాయలు తాజా కూరగాయలను అందించడంతో పాటు తక్కువ ధరలో నాణ్యమైన కూరగాయాలను అందించే లక్ష్యంగా ‘మన కూరగాయలు’ విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్యాదవ్ అన్నారు. మన కూరగాయల రిటైల్ విక్రయ కేంద్రం ద్వారా దళారుల వ్యవస్థను పూర్తిగా రూపుమాపవచ్చునని, దీంతో వినియోగదారులకు తక్కువ ధరల్లోనే కూరగాయలు లభిస్తాయన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మరికొన్ని మనకూరగాయల కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సాయన్న తెలి పారు. డిప్యూటీ డైరెక్టర్ పద్మహర్ష, మార్కెట్ యార్డు ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మోండా మార్కెట్ కార్పొరేటర్ రూప, నగేశ్ ఉన్నారు. -
దలైలామాను కలిసిన ఎంపీ మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : గౌతమ బుద్ధుని బోధనలు సర్వదా ఆచరణీయమని ఎంపీ మల్లారెడ్డి అన్నారు. సామాజిక న్యాయం, సాధికారిత శాఖ పార్లమెంటరీ స్థాయిసంఘం సమావేశంలో పాల్గొనేందుకు ధర్మశాలకు వెళ్లిన ఆయన...బౌద్ధ గురువు దలైలామాను కలిశారు. ఆధ్యాత్మిక అంశాలతో పాటు సామాజిక రుగ్మతలను రూపుమాపడంపై పార్లమెంటరీ స్థాయి సంఘం చేపడుతున్న చర్యల గురించి దలైలామాతో ప్రత్యేకంగా చర్చించినట్లు ఎంపీ ఒక ప్రకటనలతో తెలిపారు. ఈ పర్యటనలో ఎంపీ మల్లారెడ్డి వెంట సామాజిక న్యాయం, సాధికారత శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ రమేశ్ బేయాస్, ఇతర కమిటీ సభ్యులున్నారు. -
పిల్లలు.. పిడుగుల్లాంటి ప్రశ్నలు
కంటోన్మెంట్: పిల్లలే కానీ, పిడుగుల్లాంటి ప్రశ్నలు సంధించారు! తమ తరఫున పార్లమెంట్లో ప్రస్తావించిన ప్రశ్నలేంటో సూటిగా స్పష్టంగా వెల్లడించారు. విద్యార్థులుగా వారు ప్రత్యక్షంగా ఎదుర్కొనే సమస్యలతో పాటు, ప్రభుత్వ విధానాలతో తమ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యల్నే ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘మీ ప్రశ్న నేను అడుగుతా’’ పేరిట మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి చేపట్టిన వినూత్న కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ‘‘మంచి ప్రశ్న అడగండి పార్లమెంట్ సందర్శనకు నాతో రండి’’ అంటూ మల్లారెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు. ఈ మేరకు ఉత్తమ ప్రశ్నలు అడిగిన నలుగురు విద్యార్థులను వారి తల్లిదండ్రులతో సహా తన సొంత ఖర్చులతో పార్లమెంట్కు తీసుకెళ్తానని గతంలో ప్రకటించారు. తాజాగా ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందనను చూసి ఏకంగా 37 మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులతో సహా పార్లమెంట్ సందర్శనకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ 36వేల మంది విద్యార్థులు స్పందించారని, వీరిలో సందర్భానుచితంగా, ఉత్తమంగా ప్రశ్నలు సంధించిన 37 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రస్తుత శీతాకాల సమావేశాలు ముగిసేలోపు, జనవరి మొదటి వారంలో తొలివిడతలో కనీసం 20 మంది విద్యార్థులతో కూడిన బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడంతో పాటు, వారు సూచించిన ప్రశ్నల్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తానని వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం బోయిన్పల్లిలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 337 ప్రశ్నలడిగా... తాను ఎంపీగా ఎన్నికైన మూడున్నరేళ్ల కాలంలో ఇప్పటివరకు పార్లమెంట్లో 337 ప్రశ్నలు అడిగినట్లు ఎంపీ మల్లారెడ్డి వెల్లడించారు. వాటిలో మెజారిటీ సమస్యలు మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం పరిధిలోని క్షేత్రస్థాయి సమస్యలే ఉన్నాయని తెలిపారు. తన పార్లమెంట్ సమావేశాల హాజరు 81 శాతం (రాష్ట్ర సగటు కంటే 11 శాతం అధికం) ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన ఎంపీ లాడ్స్ నుంచి రూ.23 కోట్లు వెచ్చించానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలుపుకుని పోతూ మల్కాజ్గిరిలో వేలాది కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రశ్నలు/ సూచనలివే... ‘మీ ప్రశ్న నేను అడుగుతా’ కార్యక్రమంలో భాగంగా 37 మంది విద్యార్థులు పంపిన ప్రశ్నలను ఎంపిక చేశారు. వీటిలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ⇔ బడిపిల్లలు పుస్తకాల బ్యాగు భారం అధికమవుతోంది, ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోబోయే కఠిన నిర్ణయాలేంటి? ⇔ దేశంలో ఒకటే పన్ను విధానంలో భాగంగా జీఎస్టీ మాదిరిగానే ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలన్నింటిని ఒకేతాటిపైకి తీసుకురావాలి. ఫిన్లాండ్ తరహా విద్యావిధానం ప్రవేశపెట్టేలా చూడాలి. ⇔ పాఠశాలల్లో క్రీడల ప్రాధాన్యం పెంచాలి, లైబ్రరీలను ఆధునీకరించేలా చూడండి. ⇔ నానాటికీ పెరుగుతున్న ధరల నియంత్రణకు చేపట్టేల చర్యలేవీ? ⇔ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఆలోచనల్ని ప్రజలకు చేరువ చేయడానికి స్థానికంగా ప్రతి వార్డు కార్యాలయంలో అధికారిని అందుబాటులో ఉంచేలా చూడాలి ⇔ వస్తుసేవా పన్ను, జీఎస్టీని ఆసరా చేసుకుని కొందరు దుకాణదారులు సాధారణ ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు, వీరినెలా కట్టడి చేస్తారు? ⇔ పెట్రోల్, డీజిల్పై కేంద్ర, రాష్ట్ర పన్నుల శాతం అధికంగా ఉంది, దీన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావచ్చు కదా? ⇔ అగ్రవర్ణాల్లో నిరుపేదలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశముందా? ⇔ ఆధార్– ఓటర్కార్డు అనుసంధానం చేసి, బోగస్ ఓట్లను ఎందుకు తొలగించడం లేదు? విద్య, వైద్య ఖర్చులకు ఆధార్ను అనుసంధానిచాలి. -
సంగీత దీక్ష: ఎంపీ మల్లారెడ్డి కీలక ప్రకటన
-
సంగీత దీక్ష: ఎంపీ మల్లారెడ్డి కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ బహిష్కృత నేత శ్రీనివాస్రెడ్డి, ఆయన రెండో భార్య సంగీత మధ్య గొడవ చర్లపల్లి సెంట్రల్ జైలుకు చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న శ్రీనివాస్రెడ్డిని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి కలిసి.. చర్చలు జరిపారు. సంగీత డిమాండ్లకు శ్రీనివాస్రెడ్డి అంగీకరించారని ఆయన తెలిపారు. సంగీతతో మాట్లాడి.. ఆమె దీక్షను విరమింపచేస్తానని ఆయన తెలిపారు. దీంతో ఈ వివాదానికి తెరపడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. శ్రీనివాస్రెడ్డి మూడో పెళ్లి చేసుకోవడంతో.. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని కోరుతూ అతని ఇంటి ముందు గత ఆరు రోజులుగా రెండో భార్య సంగీత నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రెండు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చేందుకు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. చర్లపల్లి జైలులో ఉన్న శ్రీనివాస్రెడ్డిని వారు కలిసి రాజీ కుదుర్చడానికి ప్రయత్నించారు. సంగీతకు ఎంతో కొంత డబ్బు చెల్లించి వదిలించుకోవాలని శ్రీనివాస్రెడ్డికి సూచిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నేతల రాకతో జైలు ప్రాంతం సందడిగా మారింది. కాగా ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న సంగీత ఆరోగ్యం క్షీణిస్తోంది. రాజీ కుదిర్చేందుకు వచ్చిన సామాజికవేత్తల, రాజకీయ నాయకుల ప్రయత్నాలను కొంతమంది మహిళా కార్యకర్తలు ముందుకు సాగనివ్వడంలేదు. సంగీత కోరుతున్న షరతులకు మామ బాల్రెడ్డిని ఒప్పించి దీక్ష విరవింపజేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
'బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి'
హైదరాబాద్ : బంగారు తెలంగాణ ఏర్పాటులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప, భరత్నగర్, బర్షిపేట ప్రాంతాలలో 29.80 లక్షల నిధులతో ఆట స్ధలం, భూగర్భ డ్రైనేజి పనులకు స్ధానిక కార్పొరేటర్ జితేందర్ నాథ్తో కలసి ఆయన శంకుస్ధాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కెజి టు పిజి, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఎంపీ కొనియాడారు. -
లాటరీ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు
సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్ భగాయత్ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ వేగవంతమైంది. భూములు కోల్పోయిన రైతులతో హెచ్ఎండీఏ కమిషనర్ టి. చిరంజీవులు, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు తార్నాకలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో శనివారం సమావేశమయ్యారు. కమిషనర్ చేసిన ప్రతిపాదనలపై రైతులు సానుకూలత వ్యక్తం చేశారు. 12 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ప్లాట్ల కేటాయింపుపై సీఎం కేసీఆర్ ఈనెల 4వ తేదీన స్పందించిన విషయం తెలిసిందే. ఎకరా పట్టా భూమికి అభివృద్ధి చేసిన లే అవుట్ వెయ్యి గజాలు, యూఎల్సీ భూమికి 600 గజాలు కేటాయించి.. రైతులకు అందజేయాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ప్రతిజాప్రతినిధులు, అధికారులతో సమావేశం జరిగింది. లాటరీ పద్ధతిన కేటాయింపు.. లాటరీ పద్ధతిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయిస్తామని కమిషనర్ టి. చిరంజీవులు స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా కేటాయింపుల్లో పారదర్శకత ఉంటుందన్నారు. రైతుల నుంచి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేయిస్తామని పేర్కొన్నారు. ఈ భారాన్ని హెచ్ఎండీఏ భరిస్తుందన్నారు. ఈ నిర్ణయంపై మెజారిటీ రైతులు సానుకూలత వ్యక్తం చేశారు. వారం పది రోజుల తర్వాత లాటరీ ప్రక్రియ చేపట్టాలని, ఆ తర్వాత తాము అఫిడవిట్లు అందజేస్తామన్న రైతుల విజ్ఞప్తి మేరకు అధికారులు సమ్మతించారు. లే అవుట్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా, విద్యుత్ తదితర సౌకర్యాలు ఉంటాయన్నారు. అంతేగాక సదరు లే అవుట్ని.. మల్టీ పర్పస్ జోన్గా గుర్తిస్తామని చెప్పారు. ఈ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. 10న వివరాల వెల్లడి... ఉప్పల్ భగాయత్లో ప్రభుత్వ సేకరించిన 733.08 ఎకరాల్లో.. 413.13 ఎకరాల్లో లే అవుట్ని హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. గుంటల నుంచి ఎకరాల వరకు చాలా మంది రైతులు భూమిని కోల్పోయారు. అయితే నష్టపోయిన ఒక్కో ఎకరం పట్టా భూమికి వెయ్యి గజాలు ఇవ్వాల్సి ఉంది. ఏ రైతు ఎంత భూమి నష్టపోయాడు.. ఎంత విస్తీర్ణంలో పాట్లు కేటాయించాల్సి ఉందో.. తదితర వివరాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఈ మేరకు జాబితాను రైతులకు అందజేస్తామని అధికారులు వెల్లడించారు. అలాగే కొంతమంది రైతులు కోల్పోయిన భూమి గుంటలలో ఉంది. వీరికి ప్లాట్ల కేటాయింపులో 30 – 40 గజాలు మాత్రమే రైతులకు చెందాల్సి ఉంది. వాస్తవంగా నిబంధనల ప్రకారం.. ఇంత తక్కువ విస్తీర్ణంలో లేవుట్లో చోటు ఉండదు. ఈ నేపథ్యంలో పది రైతులు కలిస్తే.. 300 గజాలుగా సమకూరుతుంది. ఈ మొత్తాన్ని బహిరంగా మార్కెట్కు ధరకు విక్రయించడం ద్వారా రైతులకు లాభం చేకూరుతుందని అధికారులు సలహా ఇచ్చారు. ఇలా అన్ని స్థాయిల్లో పనులు పూర్తయితే.. దీపావళిలోగా రైతులకు ప్లాట్ల కేటాయింపు పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.కార్యక్రమంలో హెచ్ఎండీఏ మెంబర్ ఎస్టేట్ రాజేషం, సెక్రటీరీ కె. మధుకర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బతుకమ్మ సంబరాల్లో ఎంపీ మల్లారెడ్డి ఫుల్ జోష్
-
నెరవేరిన ‘భగాయత్’ కల
సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్: నగరంలోని ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో సాగు భూములు కోల్పోయిన బాధితుల ఎదు రు చూపులకు మోక్షం లభించింది. వారికి ల్యాండ్ ఫూలిం గ్ పద్దతిన ప్లాట్లను కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంగళవారం ప్రకటించారు. దసరా పండుగలోగా ఎకరాకు వెయ్యి గజాల చొప్పున హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన వెంచర్లో రైతులకు ప్లాట్లను కేటాయించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉప్పల్ భగాయత్ రైతులు సీఎంను తన అధికార నివాసంలో కలిశారు. వంశపారంపర్యంగా సాగు చేసుకుంటున్న తమ భూములను అసైన్మెంట్, సీలింగ్ పేరుతో గత ప్రభుత్వాలు తీసుకున్నాయని, తమకు పరిహారంగా ఎకరాకు వెయ్యి గజాల చొప్పున ప్లాట్లను కేటాయిస్తామని గతంలో హామీ ఇచ్చినట్లు వివరించారు. 11 ఏళ్లయినా హామీ అమలు కాలేదని సీఎం దృష్టికి తెచ్చిరు. దీనిపై ఆయన స్పందిస్తూ రైతులకు ప్లాట్లు కేటాయించే ప్రక్రియను దసరా లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే అసైన్డ్ పట్టా భూములకు ఎకరాకు వెయ్యి గజాలు ఇస్తున్న నేపథ్యం లో.. సీలింగ్ భూములపై కూడా నిర్ణయం తీసుకున్నారు. సీలింగ్ ఎకరా భూమికి 600 గజాల చొప్పున ప్రభుత్వం కేటాయిస్తుందని సీఎం ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్కు సూచించారు. ఫలించిన పుష్కర నిరీక్షణ.. నాగోల్ సమీపంలో మూసీకి ఉత్తరాన రోడ్డుకు ఇరువైపుల 754 ఎకరాల రైతుల భూము, 54 ఎకరాల సీలింగ్ భూములను 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం సేకరించింది. ఇందులో మొత్తం 1,200 మంది రైతులు నష్టపోయారు. ఇందుకుగాను రైతులకు హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన భూములను అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే కోర్టు కేసులు, సీలింగ్ వివాదాల కారణంగా కేటాయింపు ప్రక్రియ ముందుకు సాగలేదు. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఎంపీ మల్లారెడ్డితో పాటు టీఆర్ఎస్ నేతలు బేతి సుభాష్రెడ్డి, రామ్మోహన్గౌడ్, పలువురు కార్పొరేటర్లు, రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు. కేటాయింపులు ఎలా..? దసరాలోపు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తికావాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై అధికారులు దృష్టి సారించారు. దాదాపు 1200 మంది రైతులకు ప్లాట్లు కేటాయించాల్సి ఉండగా, ఎవరెవరికి ఎక్కడ, ఏ ప్రాతిపదికన కేటాయిస్తారోనని రైతుల్లో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 15 ఎకరాలపై భూమిపై రైతులు కోర్టును ఆశ్రయించగా తీర్పు రావాల్సి ఉంది. ఈ క్రమంలో ఈశాన్యం వైపు కొందరు రైతులు రోడ్లను మూసివేశారు. ఈ సమస్య పరిష్కారమైతే కేటాయింపులు సాధ్యపడతుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోపక్క కేటాయింపుల విషయంలో లాటరీ పద్ధతిని అవలంబించాలా? లేక మరో విధానాన్ని పాటించాలా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇందుకోసం నిర్వాసిత రైతులందరితో హెచ్ఎండీఏ అధికారులు శుక్రవారం సమావేశం కానున్నట్లు సమాచారం. -
నగరం నుంచి 400 కిమీల సైకిల్ రైడ్
దుండిగల్: కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లి సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం హైదరాబాద్–400 ద గ్లోరీ 400 బ్రెవట్ సైకిల్రైడ్ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ రౌండోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, ఇంటర్నేషనల్ వెటరన్ అథ్లెటిక్, కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. 27 గంటల్లో 400 కిలోమీటర్ల లక్ష్యాన్ని 42 మంది రైడర్లు ఛేదించనున్నారు. సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ప్రారంభమయ్యే ఈ రైడ్ ఆర్మూర్, నిజామాబాద్, బోధన్, ఎల్లారెడ్డి, మెదక్, నర్సాపూర్, గండిమైసమ్మ చౌరస్తా, బహదూర్పల్లి మీదుగా దూలపల్లిలోని కళాశాల ఆవరణలో ముగియనుంది. కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యాదవ్, డైరెక్టర్ ఆఫ్ అకడమిక్స్ ప్రొఫెసర్ డి.శోభారాణి, ప్రిన్సిపాల్ కె.సమ్మయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
శివాలయంలో ఎంపీ మల్లారెడ్డి పూజలు
హాలియా : కష్ణాపుష్కరాల సందర్భంగా బుధవారం నాగార్జునసాగర్లో పుష్కర స్నానం ఆచరించిన మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి అనంతరం శివాలయం ఘాట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1,500 మంది విద్యార్థులతో కలిసి సాధారణ ఘాట్లో స్నానం చేసి కుటుంబసభ్యులతో కలిసి పూజలు చేశారు. పుష్కరస్నానం మహాపుణ్యమన్నారు. విద్యార్థులకు సంస్కతి సంప్రదాయాలను తెలియజేసేందుకే పుష్కరాలకు తీసుకువచ్చినట్లు వివరించారు. -
కుట్రలు ఎదుర్కొనేందుకే పునరేకీకరణ
♦ టీఆర్ఎస్లో టీడీపీ ఎంపీ మల్లారెడ్డి చేరిక సందర్భంగా కేసీఆర్ ♦ రాజకీయంగా తెలంగాణను ఏకం చేసే యత్నం ♦ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు, తెలంగాణను అస్థిర పర్చేందుకు చంద్రబాబు కుట్ర చేశారు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాన్ని అస్థిరపర్చే యత్నం చేసిన తరహాలో తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిర పర్చేందుకు కుట్రలు జరిగాయని.. వాటిని ఎదుర్కొనేందుకే రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్లో చేరికలు ఆషామాషీగా జరుగుతున్నవి కాదని, తెలంగాణ గెలిచి నిలిచేందుకు అనుసరిస్తున్న వ్యూహంలో భాగమని పేర్కొన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఏకైక ఎంపీ, మల్కాజిగిరి లోక్సభ సభ్యుడు మల్లారెడ్డి బుధవారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డికి సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పలువురు మంత్రులు, నేతలు హాజరైన ఈ కార్యక్రమంలో కేసీఆర్ తన అనుభవాలను వివరిస్తూ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా అనేక మందితో సంప్రదింపుల అనంతరం 2001లో ఒంటరిగా ప్రారంభించిన తన ప్రయాణంలో అనేక మంది తోడుగా వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. మూడు నాలుగు వేల గంటలు చర్చలు జరిపామని, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. నాలుగు రకాలుగా కుట్ర... తెలంగాణ ఉద్యమం రాజకీయంగా ముందుకు సాగుతున్న క్రమంలో అప్పటి సీఎం చంద్రబాబు, ఆంధ్రా శక్తులు పలు కుట్రలు చేశారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఉద్యమాన్ని నీరు గార్చేందుకు విభజించు-పాలించు విధానం, ఉద్యమ నాయకత్వ వ్యక్తిత్వ హననం, మీడియా ద్వారా అబద్ధాల ప్రచారం, ప్రభుత్వ అండతో ఉద్యమాన్ని అణచివేయడం... అనే నాలుగు పద్ధతుల్లో కుట్రలు పన్నారని చెప్పారు. 2004 వరకు వెనుకంజ వేయకుండా ఉద్యమాన్ని కొనసాగించి.. కేంద్ర మంత్రి పదవి చేపట్టడం, జార్ఖండ్ ఉద్యమ కారుడు శిబుసోరెన్తో స్నేహం, 36 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడంతో పాటు ఈ క్రమంలో తనపై వచ్చిన జోక్లనూ కేసీఆర్ ప్రస్తావించారు. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని మర్రి చెన్నారెడ్డి ఆకాశమంత ఎత్తుకు లేపినా.. విఫలం కావడం వెనుక కారణాలను విశదీకరించారు. ప్రజాకర్షక నేతగా ఇందిరాగాంధీ ఎదిగేందుకు చేసిన ప్రయత్నాలు, బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి 11 స్థానాలు గెలవడం తదితర అంశాలను ప్రస్తావించారు. అప్పటి సీపీఐ నాయకుడు డాంగే సలహా మేరకు తెలంగాణ ఏర్పాటుపై ఇందిరాగాంధీ విముఖత చూపారని.. చెన్నారెడ్డిని ద్రోహిగా చిత్రీకరించడంలో ఆంధ్ర పత్రిక పాత్ర కూడా ఉందని పేర్కొన్నారు. 1969లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇప్పటికే దేశంలో నంబర్వన్ రాష్ట్రంగా ఉండేదని చెప్పారు. 2019-20 నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ. 2లక్షల కోట్లకు, 2024-25 నాటికి రూ.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. బంగారు తెలంగాణ కోసమే.. రాజకీయ జన్మనిచ్చిన టీడీపీని వీడడం బాధాకరమైనప్పటికీ బంగారు తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితమై టీఆర్ఎస్లో చేరినట్టు మల్లారెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికే ఈ నిర్ణయమన్నారు. పార్టీ మారే విషయం కుటుంబ సభ్యులు, అనుచరులతో నాలుగైదు నెలలుగా మాట్లాడుతున్నానని, తిరుపతి మహానాడులో చంద్రబాబు సహా సన్నిహితులకు కూడా చెప్పానని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు చంద్రులు ఎంతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఏకమై అభివృద్ధి చేయాలి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా అస్థిరపరిచే కుట్ర జరిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. శాసనసభలో టీఆర్ఎస్ పార్టీ సభ్యుల సంఖ్య ప్రస్తుతం 83కు చేరుకోవడంతో రాజకీయ స్థిరత్వం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే శక్తులన్నీ ఏకమై రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కారెక్కనున్న ఒకే ఒక్కడు!
♦ టీడీపీని వీడనున్న మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి ♦ సన్నిహితులతో చర్చలు ఒకట్రెండు రోజుల్లో స్పష్టత సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/ మేడ్చల్: తెలుగుదేశం పార్టీకి జిల్లాలో మరో ఎదురుదెబ్బ తగలనుంది. 2014 ఎన్నికల్లో బలంగా వీచిన గులాబీ పవనాలను ఎదుర్కొని మల్కాజిగిరి నుంచి విజయం సాధించిన ఒకే ఒక్క ఎంపీ చామకూర మల్లారెడ్డి ఆ పార్టీని వీడడానికి రంగం సిద్ధమైంది. పాలవ్యాపారి నుంచి విద్యాసంస్థల అధినేతగా మారిన మల్లారెడ్డి గత ఎన్నికల్లో టీడీపీలో చేరిక ద్వారా రాజకీయరంగ ప్రవేశం చేశారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఆశించిన రేవంత్రెడ్డిని కాదని టీడీపీ అధిష్టానం మల్లారెడ్డికి టికెట్ కేటాయించ డం.. విజయం సాధించడం చకచకా జరిగిపోయాయి. అనంతరం జరి గిన పరిణామాలతో రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణలు మారిపోయాయి. జిల్లాలో టీడీపీ బలహీనపడింది. తెలంగాణలోనే అత్యధిక శాసనసభ స్థానాలు గెలిచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిన జిల్లాలో పరిస్థితుల వేగంగా మారిపోయి.. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్తో ఒక్కో ఎమ్మెల్యే జారుకున్నారు. దాదాపు ఎమ్మెల్యేలంతా (ఎల్బీనగర్ కృష్ణయ్య మినహా) కారెక్కారు. ఎమ్మెల్యేలతోపాటు పార్టీ శ్రేణులు కూడా వలసబాట పట్టాయి. దీంతో జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. దీనికితోడు విద్యాసంస్థలను నిర్వహిస్తున్న చామకూరకు ప్రభుత్వ సహకారం తప్పనిసరైంది. పచ్చపార్టీలో కొనసాగడం ఆయనకు ప్రతికూలంగా మారిం ది. ఈ క్రమంలోనే గులాబీ గూటికి దగ్గరవుతున్న ట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్లో ఆయన చేరికపై కొన్నిరోజులుగా సంకేతాలు అందుతున్నా.. సోమవారం ఆయన తన సన్నిహితుల వద్ద ‘దేశం’ను వీడడంపై స్పష్టత నిచ్చినట్లు తెలిసింది. అధికారపార్టీలో చేరడం ద్వారా ఒనగూరే ప్రయోజనా లు.. టీడీపీలో కొనసాగడంతో వచ్చే ఇబ్బందులను ఏకరువు పెట్టిన చామకూర.. గులాబీ కండువా కప్పుకోవడమే శ్రేయస్కరమని భావిస్తున్నట్లు అంతరంగాన్ని వెల్లడించినట్లు సమాచారం. మేడ్చల్ ఎమ్మె ల్యే సుధీర్రెడ్డితో అంటీముట్టనట్లు వ్యవహరించే చామకూర.. వారంరోజులుగా కలివిడిగా మెలడం.. 2 నెలల క్రితం పార్టీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ ఎమ్మె ల్యే ఒకరితో రాయభారం నెరపడం ద్వారా గులాబీ గూటికి లైన్క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధినాయకత్వంతో కొన్ని రోజులుగా టచ్లో ఉన్న మల్లారెడ్డి పార్టీ మా ర్పుపై ఒకట్రెండు రోజుల్లో కీలక నిర్ణయాన్ని ప్రకటిం చే అవకాశముంది. ఇదలావుండగా, టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరే అంశంపై సోమవారం ఉదయం నుంచి మీడియాలో కథనాలు వస్తున్నా.. ఖండించకపోవడం చూస్తే ఆయన కారెక్కడం ఖాయమని స్పష్టమవుతోంది. మల్లారెడ్డి బాటలో తమ్ముళ్లు గులాబీ కండువా కప్పుకునేందుకు తన అనుచరులతో రెండు రోజులుగా వుంతనాలు జరిపి టీఆర్ఎస్లో చేరడానికి నిర్ణయుం తీసుకున్నట్లు మేడ్చల్ టీడీపీ వర్గాలు తెలిపారుు. ఎంపీకి ప్రధాన అనుచరుడు, వుండల టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు శైలజ, కండ్లకోయు గ్రావు సర్పంచ్ నరేందర్రెడ్డి, వుండలంలో ఎంపీకి అన్ని తామై వ్యవహరిస్తున్న నర్సింహారెడ్డి, భాగ్యరెడ్డితో పలు గ్రావూల సర్పంచ్లు కారెక్కడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సవూచారం. మొదట జూన్ 3వ తేదీనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణరుుంచుకున్నప్పటికీ.. రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని జూన్ 15కు వాయిదా వేసుకున్నట్టు సమాచారం. ఇదే విషయూన్ని టీడీపీ నాయుకులతోపాటు టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. -
సాక్షి టుడే హెడ్ లైన్స్...
బాబు అనైతిక రాజకీయాలను మోదీ ఆమోదిస్తారా? రాజ్యసభ ఎన్నికల విషయంలో మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ అనైతిక చర్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదిస్తారా? త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో గెలిపించుకునేంతగా ఎమ్మెల్యేల సంఖ్యా బలం లేకపోయినప్పటికీ నాలుగవ అభ్యర్థిని రంగంలో నిలిపి అనైతిక చర్యలకు పాల్పడటానికి రంగం సిద్ధం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలపై బీజేపీలో నేతల్లో అంతర్మథనం మొదలైంది. టుడే హెడ్ లైన్స్... ఆ అలవాటును గుర్తించొచ్చు మద్యానికి బానిసయ్యే అవకాశం ఉన్న విద్యార్థులను సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. మెల్బోర్న్లో ఎంపీ కవితకు ఘనస్వాగతం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవితకు మెల్ బోర్న్ లో ఘన స్వాగతం లభించింది. శ్మశానాలను వదలని తెలుగు తమ్ముళ్లు !! తెలుగు తమ్ముళ్లు నీరు-చెట్టు పథకం పేరుతో శ్మశానాలను సైతం పూడ్చి నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు యత్నిస్తున్నారు. మింగేసిన ఆ మహా ప్రళయానికి పదేళ్లు ఒక సంస్కృతి, సంప్రదాయలతో పచ్చగా కళకళలాడుతున్న ఆ నివాస ప్రాంతాలను తుడిచి పెట్టేసిన బురద ప్రళయం ఇప్పుడక్కడ మిగిల్చేంది అవశేషాలు మాత్రమే. మేమిద్దరం మరి కాసేపు ఉంటే.. రిజల్టే వేరు: కోహ్లీ మరి కొంతసేపు తాను, డివీలియర్స్ కలిసి ఆడి ఉంటే.. ఫలితం వేరేగా ఉండేదని బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. 'విజయసాయిరెడ్డి విజయం ఖాయం' రాజ్యసభ ఎన్నికకు టీడీపీ నాలుగో అభ్యర్థిని నిలబెట్టినా...తమ పార్టీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విజయం ఖాయమని వైస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్థన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆ వీడియో ట్విటర్ లో పెట్టిన వారికోసం.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన బ్రెజిల్ గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వావ్..! ప్రపంచంలో భారతీయులే టాప్ ప్రపంచంలో భారతీయులే అత్యంత ఆత్మవిశ్వాసం గలవారని ఓ సర్వే తేల్చి చెప్పింది. 2 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తాం: మంత్రి పోచారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పేదలకు రెండు లక్షల రెండు పడక గదుల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. యూపీలో వర్షాలకు 12 మంది మృతి ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలకు 12మంది మృతి చెందారు. ఫ్లిప్కార్ట్ బాటలోనే ఎల్అండ్టీ ఐఐఎం పట్టభద్రులకు ఆఫర్ లెటర్లు ఇచ్చినట్లే ఇచ్చి ఎంతకీ ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఫ్లిప్కార్ట్ మీద జనం దుమ్మెత్తి పోసిన సంగతి గుర్తుంది కదూ. ఇప్పుడు అదేబాటలో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ కూడా పయనిస్తోంది. సీమా పునియాకు కోపం వచ్చింది రియో డిజనిరోలో జరిగే ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించిన కొద్ది గంటల్లోనే డిస్కస్ త్రో ప్రముఖ క్రీడాకారిణి, గత ఒలంపిక్ విజేత సీమా అంతిల్ పునియా కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశీ బ్యాంక్పై భారతీయ జంట వేలకోట్ల దావా భారతీయ దంపతులు పంకజ్ ఓస్వాల్ రాధిక ఆస్ట్రేలియన్ బ్యాంకు కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. ఆన్ లైన్ పెళ్లి సంబంధాలపై డేగ కన్ను! మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లలో ప్రొఫైళ్ల ద్వారా వరుడు లేదా వధువులను బోల్తా కొట్టించి డబ్బు లేదా వేరే విధంగా దోచుకునే వారికి త్వరలో ముకుతాడు పడనుంది. బిగ్ బజార్ భారీ డిస్కౌంట్ స్కీమ్ ఆన్ లైన్ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ నుంచి పోటీని తట్టుకోవడానికి దేశంలోనే అతిపెద్ద సూపర్ మార్కెట్ చైన్ బిగ్ బజార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. హోటళ్లలో సరికొత్త బాదుడు సరదాగా సెలవు రోజుల్లో దుబాయ్ వెళ్లి వద్దామనుకుంటున్నారా? అయితే జేబులు మరికాస్త ఎక్కువగా నింపుకోండి. మహిళల టాప్ ఐదు భయాలు తెలుసా? గ్లామర్ మీద కామెంట్ చేస్తే మహిళలు అస్సలు తట్టుకోలేరనే విషయం సాధారణంగా అందరికీ తెలిసిందే. కష్టాల్లో కమెడియన్ 'సచిన్ వర్సెస్ లత సివిల్ వార్' వ్యవహారంతో కమెడియన్ తన్మయ్ భట్ కష్టాల్లో పడ్డాడు. బయోమెట్రిక్ హాజరు సాధ్యమేనా? ఈ విద్యా సంవత్సరంలో యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో విద్యార్థుల బయోమెట్రిక్ హాజరు తప్పని సరిగా అమలు చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తుంది. నిషేధం అమలు మరో 11 సిటీల్లో? దేశ రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న పెద్ద డీజిల్ వాహనాల అమ్మక నిషేధం మరో 11 సిటీలపై కూడా విధించేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్ జీటీ) నేడు నిర్ణయం తీసుకోనుంది. సాఫ్ట్ బ్యాంక్ సీవోవో జీతం ఎంతో తెలుసా? జపాన్కు చెందిన టెలీ కమ్యూనికేషన్స్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ కార్పొరేషన్ అధ్యక్షుడు, సీవోవో నికేష్ అరోరా (48) ఈ ఏడాదికి గాను 5వందల కోట్ల భారీ వేతనంతో మరోసారి తన సత్తాను చాటుకున్నారు. 'చంద్రబాబు మాటల వెనుక ఏదో కుట్ర' త్వరలో వైఎస్సార్ సీపీ ఖాళీ అవుతుందన్న ఆయన మాటల వెనుక ఏదో కుట్ర ఉందని భూమన కరుణాకర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. 'నాది ఆకర్షించే అందం కాదంట' పెరల్ హార్బర్ చిత్రం కోసం తనను నాజూకుగా తయారవ్వమని డైరెక్టర్ మైఖెల్ బే చెప్పినట్లు ప్రముఖ హాలీవుడ్ నటి కేట్ బెకిన్ సేల్ తెలిపింది. లక్షా 20వేల బీఎండబ్ల్యూ కార్ల రీకాల్ ప్రముఖ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ భారీ సంఖ్యలో కార్లను రీకాల్ చేసింది. ఎయిర్ బ్యాగ్ సాంకేతిక లోపాలకారణంగా అమెరికాలో దాదాపు లక్షా 20వేలకార్లను వెనక్కి పిలిపించనున్నట్టు తెలుస్తోంది. భార్యకు మొండిచేయి చూపిన లాలూ లాలూ ప్రసాద్ భార్య రబ్రీదేవిని కాదని కూతురికి రాజ్యసభ సీటు ఇచ్చారు. వెంకయ్య, నిర్మలా సీతారామన్లను ఎందుకు వద్దనుకున్నారు? కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్లకు బీజేపీ నాయకత్వం తిరిగి రాజ్యసభ టికెట్లు ఖరారు చేసినా, వారిని స్వరాష్ట్రం నుంచి కాకుండా వేర్వేరు రాష్ట్రాల నుంచి ఎందుకు నామినేట్ చేస్తున్నట్టు? టాప్ టెన్ కాస్ట్లీ స్మార్ట్ ఫోన్లు ఇవే... ఇన్నిరోజులు అత్యధిక ధరలున్న స్మార్ట్ ఫోన్లు ఏవీ అంటే.. యాపిల్ ఐఫోన్ స్మార్ట్ ఫోన్లేనని చటుక్కున చెప్పేవాళ్లం. తిడుతున్నా ట్రంప్కు చైనాలో భలే డిమాండ్ చైనా తమ దేశాన్ని రేప్ చేసిందంటూ.. తమ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్కు చైనాలో మాత్రం మంచి డిమాండ్ పెరుగుతోంది. ఓలా, ఊబర్ లకు షాక్ తక్షణమే లైసెన్స్ తీసుకోవాలన్న ప్రభుత్వ నిబంధలను బేఖాతరు చేసిన ట్యాక్సీల సేవలను తక్షణమే నిలిపివేయనున్నట్టు కర్ణాటక ప్రకటించింది. గేల్ ను అవుట్ చేయడానికి వార్నర్ ఏం చెప్పాడు? క్రిస్ గేల్ ను అవుట్ చేయడానికి వైడ్, స్లో బంతులు వేయాలని తమ బౌలర్లకు చెప్పినట్టు వార్నర్ వెల్లడించాడు. వ్యభిచారం చేయమని తల్లి, భర్త ఒత్తిడి, సూసైడ్ నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోములలో దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీలో దౌర్జన్యానికి దిగిన ఆఫ్రికన్లు! దేశరాజధాని ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున ఓ క్యాబ్ డ్రైవర్పై ఆఫ్రికన్ దేశస్తులు దౌర్జన్యానికి దిగారు. యూత్కి సత్య నాదెళ్ల సలహా ఇదే! భారత పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల సోమవారం న్యూఢిల్లీలో కీలకోపన్యాసం ఇచ్చారు. ఈ ఫ్యామిలీ వెరీ స్పెషల్..! ఫెదరర్ టెన్నిస్ తర్వాత అధిక ప్రాధాన్యం ఇచ్చేది కుటుంబానికే. విశేషం ఏంటంటే.. ఫెడెక్స్ ఆటే కాదు అతని కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. విరాట్ అరుదైన ఫీట్ ప్రస్తుతం క్రికెట్ ను శాసిస్తున్న ఆటగాళ్లలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ముందున్నాడనడంలో ఎటువంటి సందేహం లేదు. నేపాల్ సరిహద్దులో చిక్కుకున్నతెలుగువారు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన 28 మంది తీర్థయాత్రలకు వెళ్లి నేపాల్ సరిహద్దులో చిక్కుకున్నారు. ఆ సినిమాలో బోర్ సీన్స్ తీసినందువల్ల.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం' ఫ్యాన్స్ను నిరాశ పరిచిన విషయం తెలిసిందే. పవిత్రమైన పాత్రలో నటించి.. బికినీ ఫొటోలా? మీరు ప్రముఖమైన టీవీ నటులా? అయితే సోషల్ మీడియలో ఫొటోలు పెట్టే విషయంలో కాస్తా జాగ్రత్త ఉండండి! యూపీ బీజేపీ సీఎంగా స్మృతి ఇరానీ? వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ప్రభావితం చేయగల ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయాన్ని కైవసం చేసుకోవాలనే కృతనిశ్చయంతో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఉంది. అమ్మాయిలే ఎక్కువ ఎడిక్ట్ అవుతున్నారట అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువగా స్మార్ట్ ఫోన్లకు ఎడిక్ట్ అవుతున్నారట. వార్నర్ పీఎస్ఎల్ టైటిల్ గెలిచాడట! తమ క్రికెటర్లు పెద్దగా విద్యావంతులు కాదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)చైర్మన్ షహర్యార్ ఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను నిజమని నిరూపించాడు ఆ దేశ క్రికెటర్ ఉమర్ అక్మల్. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారమిక్కడ భేటీ అయ్యారు. 'అందుకే విజయ సాయిరెడ్డిని పోటీలో నిలిపాం' రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఒక అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్య కంటే ఎక్కువ బలం తమకుందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఆ అసభ్య వీడియోను వెంటనే బ్లాక్ చేయండి! సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న కమెడియన్ తన్మయ్ భట్ వీడియోపై ముంబై సైబర్ సెల్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ యాడ్ తీయడం తప్పే.. క్షమించండి చైనాలో కియోబీ అనే లాండ్రీ డిటర్జెంట్ బ్రాండ్ ప్రకటన జాతి దురహంకారానికి ప్రతీకగా ఉందంటూ సర్వత్రా విమర్శలు రావడంతో ఈ కంపెనీ వెనక్కి తగ్గింది. కారెక్కనున్న మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి తెలంగాణ టీడీపీకి చెందిన మల్కాజిగిరి లోక్ సభ సభ్యుడు సీహెచ్ మల్లారెడ్డి టీఆర్ఎస్ లో చేరడానికి రంగం సిద్ధమవుతోంది. నెహ్రా వుయ్ మిస్ యూ! ఈ విజయం నీకే అంకితం!! 8 పరుగుల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ను హైదరాబాద్ సన్ రైజర్స్ ఓడించడంతో సంబరాలు మిన్నంటాయి. -
రోడ్లు మూసేస్తే ధర్నా
సబ్ ఏరియా జీఓసీకి తేల్చి చెప్పాను నసీరుద్దీన్ షా ఉర్సుకు ‘దారి’క్లియర్ ఎంపీ మల్లారెడ్డి వెల్లడి కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రతిపాదిత రోడ్లను మూసేస్తే తాను ధర్నాకు సైతం వెనుకాడేది లేదని ఎంపీ మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం తెలంగాణ-ఆంధ్రా సబ్ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీఓసీ)- ఇన్- చీఫ్ మేజర్ జనరల్ పచోరీని కలిశారు. ఈ భేటీలో కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ అజయ్ సింగ్ నేగీ, కల్నల్ క్యూ అజయ్ కటోచీ తదితరులున్నారు. బోయిన్పల్లిలోని ప్రముఖ దర్గా నసీరుద్దీన్ షా బాబా దర్గాలో ఉర్సు నిర్వహించనున్న నేపథ్యంలో ఆర్మీ స్థావరాల నుంచి వెళ్లేందుకు తాత్కాలికంగా రోడ్డు తెరిపించాల్సిందిగా మల్లారెడ్డి జీఓసీని కోరారు. ఇందుకు సమ్మతించి ఈ నెల 7 నుంచి 9 వతేదీ వరకు దర్గా వెళ్లేందుకు అనువుగా రోడ్డు మార్గాన్ని తెరిచేలా సంబంధిత కమాండర్కు జీఓసీ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఏఓసీ రోడ్ల మూసివేతపై ఆసక్తి కరమైన చర్చ జరిగినట్లు ఎంపీ మల్లారెడ్డి తెలిపారు. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ గుండా వెళ్లే రోడ్ల మూసివేతపై ఆర్మీ అధికారుల నిర్ణయం ఏంటని జీఓసీని అడగ్గా... ఈ మార్గంలో సాధారణ పౌరుల రాకపోకలపై నిషేధం విధించేందుకు తమకు కోర్టు అనుమతిచ్చినట్లు తెలిపారన్నారు. ఈ మేరకు డిసెంబర్ 1 నుంచి గాఫ్ రోడ్డు మూసేస్తున్నట్లు స్పష్టం చేశారని మల్లారెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనను మానుకోవాలని సూచించగా ఉన్నతాధికారులు, లేదా మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే రోడ్ల మూసివేత నిర్ణయంలో మార్పు ఉంటుందని పచోరీ పేర్కొన్నట్లు ఎంపీ వెల్లడించారు. తాను శుక్రవారం ఢిల్లీకి వెళ్లి నేరుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ను కలిసి రోడ్ల మూసివేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వాలని కోరతానన్నారు. -
పరుగుతో ఆరోగ్యం పదిలం: మల్లారెడ్డి
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదని మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి అన్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ డిమాండ్ కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో బోయిన్ పల్లి ఓల్డ్ ఎయిర్ పోర్టు రోడ్డులో 1 కే రన్ నిర్వహించారు. మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి మల్లారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. వన్ ర్యాంక్, వన్ పెన్షన్ కోసం సైనికులు సుదీర్ఘ పోరాటం చేసి దక్కించుకున్నారని తెలిపారు. సైనికుల పోరాటానికి తాను సహకారం అందించిన విషయాన్ని గుర్తుచేశారు. విజయోత్సవ సంబరాలకు మళ్లీ తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని అన్నారు. -
మల్లారెడ్డి ఆస్తులెంతో చెప్పండి: ఈసీ
రంగారెడ్డి: మల్కాజగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డికి సంబంధించిన ఎన్నికల ఆఫిడవిట్పై కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక కోరింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి లేఖ రాసింది. ఆస్తుల వివరాలను ఆఫిడవిట్లో పొందుపరచలేదని ఒకరు చేసిన ఫిర్యాదుకు స్పందించిన ఎలక్షన్ కమిషన్ దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికీ ఆ భూములు ఎంపీ పేరిట రికార్డుల్లో కొనసాగుతున్నాయని, ఈ ఆస్తులను ఆఫిడవిట్లో చూపలేదని ఎన్నికల సమయంలోనే ఈసీకి ఫిర్యాదు అందింది. ఈ క్రమంలోనే సదరు ఎంపీ వివరణను నమోదు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈనెల 25లోపు దీనిపై నివేదిక పంపాలని గడువు నిర్ధేశించిన నేపథ్యంలో మల్లారెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే, ఫిర్యాదుదారు పేర్కొన్న భూములను ఎప్పుడో ఆమ్మేశానని, భూమి కొన్న వ్యక్తి పహాణీల్లో పేరు నమోదు చే సుకోకపోతే తమ తప్పేలా అవుతుందని ఎంపీ వర్గీయులు అంటున్నారు. ఈ భూమి అమ్మకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కాపీని త్వరలోనే సమర్పిస్తామని చెబుతున్నారు. -
ఓటు వేసిన ఎంపీ మల్లారెడ్డి
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పాలక మండలి ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ సి.మల్లారెడ్డి తన ఓటును బోయిన్పల్లిలో వినియోగించుకున్నారు. అన్ని బూత్ల దగ్గర పోలింగ్ ప్రశాంతంగా జరుగగా బాపూజీ నగర్ లోని 13వ బూత్ దగ్గర స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓటు వేస్తున్నారంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. -
కంటోన్మెంట్ రోడ్లు రాత్రి వేళల్లో తెరచి ఉంచాలి
* రక్షణశాఖ మంత్రికి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: భద్రత పేరిట సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని రోడ్లను మిలిటరీ సిబ్బంది మూసివేస్తుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మల్కాజ్గిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి పేర్కొన్నారు. గురువారం పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సమస్యను రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ దృష్టికి తెచ్చినట్టు తెలిపారు. విజయ్చౌక్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజాం కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రజలకు అందుబాటులో ఉన్న రోడ్లను అకస్మాత్తుగా భద్రత పేరుతో మూసివేయడం సరికాదన్నారు. దీంతో సుమారు 12 లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ‘రాత్రి వేళల్లో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వెళ్లాలంటే 8 కిలోమీటర్లు అదనంగా తిరిగి రావాల్సి వస్తోంది. దీంతో ప్రజలకు ఎంతో ఇబ్బందిగా ఉందని రక్షణశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశా. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు’ అని మల్లారెడ్డి తెలిపారు.