net profit up
-
ప్రభుత్వ బ్యాంకుల భారీ డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్చితో ముగియనున్న ఈ ఆరి్థక సంవత్సరం(2023–24)లో భారీ డివిడెండ్ను చెల్లించే వీలుంది. ఇందుకు లాభదాయకత మెరుగుపడటం సహకరించనుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ ఏడాది పీఎస్యూ బ్యాంకులు రూ. 15,000 కోట్లకుపైగా డివిడెండును చెల్లించే అవకాశముంది. ఈ ఏడాది ఇప్పటికే తొలి మూడు త్రైమాసికాల(ఏప్రిల్–డిసెంబర్)లో 12 పీఎస్యూ బ్యాంకులు ఉమ్మడిగా రూ. 98,000 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి. గతేడాది(2022–23)లో ఉమ్మడిగా సాధించిన నికర లాభానికంటే రూ. 7,000 కోట్లుమాత్రమే తక్కువ. గతేడాదిలోనే ప్రభుత్వ బ్యాంకులు చరిత్రలోనే అత్యధికంగా రూ. 1.05 లక్షల కోట్ల నికర లాభం ప్రకటించాయి. అంతక్రితం ఏడాది(2021–22)లో కేవలం రూ. 66,540 కోట్ల నికర లాభం నమోదైంది. గతేడాది ప్రభుత్వం పీఎస్యూ బ్యాంకుల నుంచి 58 శాతం అధికంగా రూ. 13,804 కోట్ల డివిడెండ్ను అందుకుంది. అంతక్రితం ఏడాదిలో రూ. 8,718 కోట్ల డివిడెండ్ మాత్రమే చెల్లించాయి. వెరసి ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో ప్రభుత్వానికి పీఎస్యూ బ్యాంకులు డివిడెండును చెల్లించనున్నట్లు అంచనా. కాగా.. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం నికర మొండిబకాయిలు(ఎన్పీఏలు) 6 శాతానికంటే తక్కువగా నమోదైన బ్యాంకులు మాత్రమే డివిడెండ్ ప్రకటించేందుకు వీలుంటుంది. అయితే వచ్చే ఏడాది(2024–25) నుంచి మాత్రమే తాజా మార్గదర్శకాలు అమలుకానున్నాయి. -
మూడింతలైన నాట్కో లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిసెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నాట్కో ఫార్మా నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మూడురెట్లకుపైగా అధికమై రూ.213 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ రూ.513 కోట్ల నుంచి రూ.795 కోట్లకు చేరింది. వ్యయాలు రూ.432 కోట్ల నుంచి రూ.539 కోట్లకు పెరిగాయి. ఫార్ములేషన్స్ ఎగుమతుల ద్వారా ఆదాయం రూ.334 కోట్ల నుంచి రూ.605 కోట్లను తాకింది. దేశీయంగా ఫార్ములేషన్స్ అమ్మకాల ద్వారా ఆదాయం రూ.101 కోట్ల నుంచి రూ.99 కోట్లకు వచ్చి చేరింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై మూడవ మధ్యంతర డివిడెండ్ రూ.1.25 చెల్లించాలన్న ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. నాట్కో ఫార్మా షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో బుధవారం 3.10 శాతం ఎగసి రూ.883.85 వద్ద స్థిరపడింది. -
యాక్సిస్ బ్యాంక్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం 10 శాతం బలపడి రూ. 5,864 కోట్లను తాకింది. వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 5,330 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 24,094 కోట్ల నుంచి రూ. 31,660 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 19 శాతం వృద్ధితో రూ. 12,315 కోట్లకు చేరింది.ప్రపంచ భౌగోళిక, రాజకీయ ఆటుపోట్ల మధ్య భారత్ వృద్ధి బాటలోనే సాగుతున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరీ పేర్కొన్నారు. ఎన్పీఏలు డౌన్ ప్రస్తుత సమీక్షా కాలంలో యాక్సిస్ బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్లు 0.15% మెరుగై 4.11 శాతాన్ని తాకాయి. త్రైమాసికవారీగా స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.96% నుంచి రూ. 1.73 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 0.41 % నుంచి 0.36 శాతానికి వెనకడుగు వేశాయి. ఫలితాల నేపథ్యంలో ఈ షేరు బీఎస్ఈలో 1% నీరసించి రూ. 955 వద్ద ముగిసింది. -
ఎయిర్టెల్ లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం దాదాపు యథాతథంగా రూ. 1,612 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,607 కోట్లు ఆర్జించింది. అయితే సర్దుబాటుకు ముందు నికర లాభం 91 శాతం జంప్చేసి రూ. 2,902 కోట్లుగా నమోదైంది. ఇక మొత్తం ఆదాయం 14 శాతం ఎగసి రూ. 37,440 కోట్లకు చేరింది. దేశీ మొబైల్ సరీ్వసుల ఆదాయం 13 శాతంపైగా పుంజుకుని రూ. 26,375 కోట్లను తాకినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 183 నుంచి రూ. 200కు బలపడింది. రూ. 19,746 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించగా.. 52.7 శాతం ఇబిటా మార్జిన్లను సాధించింది. 4జీ యూజర్లు అప్ తాజా సమీక్షా కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 56 లక్షల మంది 4జీ వినియోగదారులను జత చేసుకున్నట్లు భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ పేర్కొన్నారు. నాణ్యమైన కస్టమర్లపై దృష్టి సారించడం ద్వారా 0.8 మిలియన్ పోస్ట్పెయిడ్ వినియోగదారులను జత కలుపుకున్నట్లు తెలియజేశారు. దీంతో వీరి సంఖ్య దాదాపు 2.05 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ఇక మొబైల్ డేటా వినియోగం 22 శాతం ఎగసి ఒక్కో కస్టమర్పై నెలకు 21.1 జీబీకి చేరినట్లు వివరించారు. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు బీఎస్ఈలో 0.7 శాతం క్షీణించి రూ. 872 వద్ద ముగిసింది. -
ఎంఆర్ఎఫ్కు ఎక్స్ప్రెస్ లాభాలు
న్యూఢిల్లీ: టైర్ల రంగంలో అగ్రగామి సంస్థ ఎంఆర్ఎఫ్ జూన్తో అంతమైన మూడు నెలల కాలంలో తన పనితీరును గణనీయంగా మెరుగుపరుచుకుంది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే ఐదు రెట్లు పెరిగి రూ.589 కోట్లకు దూసుకుపోయింది. కన్సాలిడేటెడ్ ఆదాయం సైతం రూ.6,440 కోట్లకు వృద్ధి చెందింది. క్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.123 కోట్లు, ఆదాయం రూ.5,696 కోట్ల చొప్పున ఉన్నాయి. ముఖ్యంగా ముడిసరుకుల వ్యయాలు తగ్గడం కలిసొచి్చంది. ముడి సరుకులపై చేసిన వ్యయాలు రూ.3,781 కోట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ముడి సరుకుల కోసం అయిన వ్యయాలు రూ.4,114 కోట్లుగా ఉండడం గమనార్హం. వ్యయాలు రూ.5,567 కోట్ల నుంచి రూ.5,728 కోట్లకు పెరిగాయి. ఎండీగా ఉన్న కేఎం మామెన్ను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా 2024 ఫిబ్రవరి 8 నుంచి ఐదేళ్ల కాలానికి నియమిస్తూ కంపెనీ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. విమలా అబ్రహాంను ఇండిపెండెంట్ డైరెక్టర్గా రెండో విడత మరో ఐదేళ్ల కాలానికి నియమించింది. -
ఎన్టీపీసీ లాభం రూ.4,907 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ జూన్తో ముగిసిన త్రైమాసికానికి రూ.4,907 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,978 కోట్లతో పోలిస్తే 23 శాతం వృద్ధి చెందింది. ఆదాయం మాత్రం రూ.43,561 కోట్ల నుంచి రూ.43,390 కోట్లకు తగ్గింది. జూన్ క్వార్టర్లో 103.98 బిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉత్పత్తి 104.42 బిలియన్ యూనిట్లుగా ఉంది. కోల్ ప్లాంట్లలో లోడ్ ఫ్యాక్టర్ 77.43 శాతంగా ఉంది. -
ఐడీఎఫ్సీ ఫస్ట్ ఫలితాలు ఆకర్షణీయం
ముంబై: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ జూన్ త్రైమాసికానికి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 61 శాతం వృద్ధితో రూ.765 కోట్లకు దూసుకుపోయింది. క్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.474 కోట్లుగానే ఉంది. నికర వడ్డీ ఆదాయం 36 శాతం వృద్ధితో రూ.3,745 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వడ్డీ ఆదాయం రూ.2,571 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం 45 శాతం వృద్ధితో రూ.1,427 కోట్లకు పెరిగినట్టు బ్యాంక్ తెలిపింది. రుణ ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 2.17 శాతానికి తగ్గాయి. ఇవి క్రితం ఏడాది ఇదే త్రైమాసికం చివరికి 3.36%గా ఉంటే, ఈ ఏడాది మార్చి చివరికి 2.51 శాతంగా ఉండడం గమనా ర్హం. నికర ఎన్పీఏలు 0.70 శాతానికి పరిమితమయ్యాయి. ‘‘46.5% కాసా రేషియోతో బలమైన ఫ్రాంచైజీని నిర్మిస్తున్నాం. బలమైన బ్రాండ్, విలువలు, కస్టమర్ అనుకూలమైన ఉత్పత్తులు, డిజిటల్ ఆవిష్కరణలతో మా రిటైల్ డిపాజిట్లు చక్కగా వృద్ధి చెందుతున్నాయి’’అని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్ తెలిపారు. ఫండెడ్ అసెట్స్ (రాబడినిచ్చే ఆస్తులు) 25% వృద్ధితో రూ.1,71,578 కోట్లకు పెరిగాయి. మొత్తం రుణ ఆస్తుల్లో ఇన్ఫ్రా రుణాలు 2.2 శాతానికి తగ్గాయి. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 1,247 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం రూ. 1,247 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నమోదైన రూ. 706 కోట్లతో పోలిస్తే ఇది 77 శాతం అధికం. విదేశీ మారకంపరంగా సానుకూలతలు, కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడం తదితర అంశాలు ఇందుకు దోహదపడ్డాయని సంస్థ సీఎఫ్వో పరాగ్ అగర్వాల్ వెల్లడించారు. సమీక్షాకాలంలో ఆదాయం 27 శాతం పెరిగి రూ. 5,320 కోట్ల నుంచి రూ. 6,770 కోట్లకు పెరిగినట్లు వివరించారు. గతేడాది సెప్టెంబర్లో అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టిన రెవ్లిమిడ్ ఔషధం .. కంపెనీ ఆదాయాలకు అర్ధవంతమైన రీతిలో తోడ్పడుతోందని ఆయన పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో అయిదు కొత్త ఔషధాలను ప్రవేశపెట్టామని, పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఉత్తర అమెరికా మార్కెట్లో 25 కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని వివరించారు. ధరలపరమైన తగ్గుదల ధోరణులు దాదాపుగా గత రెండు త్రైమాసికాల్లో చూసిన విధంగానే ఉన్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ పేర్కొన్నారు. అమెరికా, రష్యా మార్కెట్లలో వృద్ధి తోడ్పాటుతో పటిష్టమైన ఆర్థిక పనితీరు కనపర్చగలిగామని డీఆర్ఎల్ కో–చైర్మన్ జి.వి. ప్రసాద్ తెలిపారు. ఫలితాల్లో ఇతర ముఖ్య విశేషాలు.. ► కొత్త ఔషధాల ఆవిష్కరణ, ఉత్పత్తుల రేట్ల పెంపుతో భారత్ మార్కెట్లో ఆదాయం 10 శాతం పెరిగి రూ. 1,130 కోట్లకు చేరింది. ► కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం 64 శాతం వృద్ధి చెంది రూ. 3,060 కోట్లుగా నమోదైంది. వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 14 శాతం, యూరప్లో అమ్మకాలు ఆరు శాతం పెరిగాయి. ► క్యూ3లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై రూ. 480 కోట్లు వెచ్చించారు. పెట్టుబడి వ్యయాలపై కంపెనీ రూ. 1,500 కోట్లు వెచ్చించనుంది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 1,113 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,113 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నమోదైన రూ. 992 కోట్లతో పోలిస్తే ఇది 12% అధికం. అటు ఆదాయం 9% పెరిగి రూ. 5,763 కోట్ల నుంచి రూ. 6,306 కోట్లకు చేరింది. శుక్రవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ, సీఎఫ్వో పరాగ్ అగర్వాల్ ఈ విషయాలు తెలిపారు. అమెరికా మార్కెట్లో ఎక్స్క్లూజివ్ హక్కులు లభించిన జనరిక్ ఔషధం రెవ్లిమిడ్ సహా కొత్తగా ప్రవేశపెట్టిన ఉత్పత్తుల ఊతంతో ఆదాయాలు, లాభాలు గణనీయంగా పెరిగాయని పరాగ్ వివరించారు. అలాగే వ్యయాలను సమర్ధంగా నియంత్రించుకోవడం కూడా దోహదపడిందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 25 పైగా కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. మరోవైపు, రెండో త్రైమాసికంలో పటిష్టమైన పనితీరు సాధించడం సంతృప్తి కలిగించిందని సంస్థ సహ–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు. అంతర్జాతీయంగా చౌకగా మరిన్ని ఔషధాలను అందుబాటులోకి తేవడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగా కొనసాగిస్తున్న పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై రెండో త్రైమాసికంలో కంపెనీ సుమారు రూ. 490 కోట్లు వెచ్చించింది. ఫలితాల్లో ఇతర విశేషాలు.. ► క్యూ2లో గ్లోబల్ జనరిక్స్ ఆదాయాలు 18 శాతం పెరిగి రూ. 5,595 కోట్లకు చేరాయి. ఉత్తర అమెరికా మార్కెట్లో అమ్మకాలు 48 శాతం వృద్ధి చెంది రూ. 2,800 కోట్లకు పెరిగాయి. కొన్ని ఔషధాల రేట్లు తగ్గినప్పటికీ .. కొత్త ఉత్పత్తులు, సానుకూల ఫారెక్స్ రేట్ల ప్రభావంతో కంపెనీ ఆ ప్రతికూలతలను అధిగమించింది. ► భారత మార్కెట్లో అమ్మకాలు స్వల్పంగా పెరిగి రూ. 1,150 కోట్లకు పరిమితమయ్యాయి. ► ఫార్మా సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్ఏఐ) విభాగం 23 శాతం క్షీణించి రూ. 643 కోట్లకు తగ్గింది. శుక్రవారం బీఎస్ఈలో కంపెనీ షేరు స్వల్పంగా తగ్గి రూ. 4,461 వద్ద క్లోజయ్యింది. -
ఐజీఎల్ ఆదాయం రూ.3,922 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం ఇంద్రప్రస్థ గ్యాస్(ఐజీఎల్) పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 4 శాతం వృద్ధితో రూ. 416 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,01 కోట్లు ఆర్జించింది. సహజవాయు ధరలు పెరగడంతో మార్జిన్లు బలహీనపడినట్లు కంపెనీ పేర్కొంది. ఇక మొత్తం ఆదాయం దాదాపు రెట్టింపై రూ. 3,922 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 2,016 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గ్యాస్ ధరలు 100 శాతం పెరిగిపోయినట్లు కంపెనీ తెలియజేసింది. దీంతో నేచురల్ గ్యాస్ కొనుగోలు వ్యయాలు రూ. 930 కోట్ల నుంచి రూ. 2,610 కోట్లకు ఎగశాయి. అయితే గ్యాస్ రోజువారీ సగటు అమ్మకాలు 7.24 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల నుంచి 8.09 ఎంఎంఎస్సీఎండీకి బలపడినట్లు వెల్లడించింది. సీఎన్జీ అమ్మకాలలో 15 శాతం, పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) విక్రయాలలో 3 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. -
కరూర్ వైశ్యా బ్యాంక్ లాభం 52 శాతం అప్
చెన్నై: ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 250 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ2లో నమోదైన రూ. 165 కోట్లతో పోలిస్తే సుమారు 52 శాతం వృద్ధి సాధించింది. ఇక నికర వడ్డీ ఆదాయం దాదాపు 21 శాతం పెరిగి రూ. 680 కోట్ల నుంచి రూ. 821 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 3.74 శాతం నుంచి 4.07 శాతానికి పెరిగింది. నికర మొండి బాకీలు (ఎన్పీఏ) 2.99 శాతం నుంచి 1.36 శాతానికి దిగివచ్చినట్లు బ్యాంకు ఎండీ బి. రమేష్ బాబు తెలిపారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి మొత్తం వ్యాపార పరిమాణం దాదాపు 14 శాతం పెరిగి రూ. 1,35,460 కోట్లకు చేరినట్లు వివరించారు. దశాబ్ద కాలంలో వ్యాపారం రెట్టింపైనట్లు పేర్కొన్నారు. -
ఆర్ఐఎల్ లాభం రూ. 13,656 కోట్లు
ముంబై: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 13,656 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 13,680 కోట్లతో పోలిస్తే నామమాత్రంగా తగ్గింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్–జూన్(క్యూ1)లో ఆర్జించిన రూ. 17,955 కోట్లతో పోలిస్తే నికర లాభం భారీగా క్షీణించింది. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన విండ్ఫాల్ ట్యాక్స్ చమురు విభాగంపై ప్రతికూల ప్రభావం చూపడంతో లాభాలు నీరసించాయి. ఇక ప్రస్తుత క్యూ2లో రూ. 31,224 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) సాధించగా.. గతేడాది క్యూ2లో రూ. 26,020 కోట్లు మాత్రమే ఆర్జించింది. క్యూ1లో ఇబిటా రూ. 37,997 కోట్లుగా నమోదైంది. తాజా సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ. 2.30 లక్షల కోట్లకు బలపడింది. గతేడాది క్యూ2లో రూ. 1.68 లక్షల కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. ఈ ఏడాది క్యూ1లో రూ. 2.19 లక్షల కోట్ల టర్నోవర్ సాధించింది. కంపెనీ ఇబిటా మార్జిన్లు 13.6%కి చేరాయి. క్యూ1లో ఇవి 17.3 శాతంగా నమోదయ్యాయి. క్యూ2లో ఇతర హైలైట్స్ ► సెప్టెంబర్కల్లా ఆర్ఐఎల్ రుణ భారం రూ. 2.94 లక్షల కోట్లకు చేరగా.. నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 2.01 లక్షల కోట్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. ► చమురు, గ్యాస్ విభాగం రూ. 3,853 కోట్ల ఆదాయం సాధించింది. ఇబిటా 2510 కోట్లు కాగా, ఇబిటా మార్జిన్లు 65% నమోదయ్యాయి. ► రిటైల్ విభాగం ఆదాయం రూ.64,936 కోట్లను తాకగా.. రూ. 4,414 కోట్ల ఇబిటా సాధించింది. ఇబిటా మార్జిన్లు 6.8 %గా ఉన్నాయి. ► ఆయిల్ టు కెమికల్ ఆదాయం రూ. 1.6 లక్షల కోట్లకు చేరింది. ఇబిటా రూ. 11,968 కోట్లు. జియో లాభం 28% జూమ్ క్యూ2లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నికర లాభం 28 శాతం వృద్ధితో రూ. 4,518 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 20 శాతం పుంజుకుని రూ. 22,521 కోట్లకు చేరింది. 5 శాతం అధికంగా రూ. 11,489 కోట్ల ఇబిటా సాధించింది. ఇబిటా మార్జిన్లు 0.9 శాతం బలపడి 51 శాతానికి చేరాయి. ఈ కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 177.20ను తాకింది. ఈ ఏడాది క్యూ1లో రూ. 175 మాత్రమే. సెప్టెంబర్కల్లా మొత్తం సబ్స్క్రయిబర్ల సంఖ్య 427.6 మిలియన్లకు చేరింది. క్యూ1లో ఈ సంఖ్య 419.9 మిలియన్లు. మార్కెట్లు ముగిశాక ఆర్ఐఎల్ ఫలితాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో షేరు ఎన్ఎస్ఈలో 1.2 శాతం క్షీణించి రూ. 2,470 వద్ద ముగిసింది. -
వేదాంతా లాభం అప్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 4,421 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,224 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా రూ. 29,151 కోట్ల నుంచి రూ. 39,355 కోట్లకు జంప్చేసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 21,751 కోట్ల నుంచి రూ. 32,095 కోట్లకు ఎగశాయి. ఫైనాన్స్ వ్యయాలు స్వల్పంగా 2 శాతం పెరిగి రూ. 1,206 కోట్లకు చేరగా.. రూ. 8,031 కోట్లమేర స్థూల రుణాలు జత కలిశాయి. దీంతో మొత్తం రుణ భారం రూ. 61,140 కోట్లను తాకింది. కాగా, భాగస్వామ్య నియంత్రణా సంస్థలను కూడా కలుపుకుంటే ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం నికర లాభం 6 శాతం మెరుగుపడి రూ. 5,592 కోట్లుగా నమోదైంది. స్టెరిలైట్ యూనిట్కు బిడ్స్ తమిళనాడులోని తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ యూనిట్ కొనుగోలుకి పలు సంస్థల నుంచి బిడ్స్ దాఖలైనట్లు వేదాంతా రీసోర్సెస్ తాజాగా వెల్లడించింది. తమిళనాడు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు అభ్యంతరాల నేపథ్యంలో 2018 నుంచి మూతపడిన స్టెరిలైట్ కాపర్ స్మెల్టింగ్ ప్లాంటును వేదాంతా అమ్మకానికి పెట్టింది. ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 245 వద్ద ముగిసింది. -
జియో లాభం జూమ్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఈ ఏడాది క్యూ1లో రూ. 4,335 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఏప్రిల్–జూన్(రూ. 3,501 కోట్లు)తో పోలిస్తే ఇది 24 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం 21 శాతంపైగా ఎగసి రూ. 21,873 కోట్లను తాకింది. టారిఫ్ల పెంపు మెరుగైన పనితీరుకు సహకరించింది. నికరంగా 9.7 మిలియన్ యూజర్లు జత కలిశారు. దీంతో మొత్తం యూజర్ల సంఖ్య 41.99 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) త్రైమాసికంగా 5 శాతం బలపడి రూ. 175.7కు చేరింది. అత్యంత వేగవంత సర్వీసులందించగల 5జీ స్పెక్ట్రమ్కు వేలం ప్రారంభంకానున్న నేపథ్యంలో జియో వెల్లడించిన ఫలితాలకు ప్రాధాన్యత ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. టెలికం, డిజిటల్ బిజినెస్లతో కూడిన జియో ప్లాట్ఫామ్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం 24% పుంజుకుని రూ. 4,530 కోట్లయ్యింది. ఆదాయం 24% వృద్ధితో రూ. 27,527 కోట్లకు చేరింది. -
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లాభం ఓకే
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రైవేట్ రంగ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 3 శాతం వృద్ధితో రూ. 340 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 329 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 21 శాతం జంప్చేసి రూ. 892 కోట్లకు చేరింది. క్లయింట్ బేస్ 6.2 లక్షలు పెరిగి 76 లక్షలకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 12.75 చొప్పున తుది డివిడెండును చెల్లించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో పూర్తి ఏడాదికి రికార్డు సృష్టిస్తూ రూ. 24 డివిడెండును అందించినట్లు తెలియజేసింది. క్యూ4లో ఆల్రౌండ్ పనితీరు చూపినందుకు సంతోషిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎండీ, సీఈవో విజయ్ చందోక్ పేర్కొన్నారు. అన్ని బిజినెస్ విభాగాల్లోనూ వృద్ధి సాధించామని, ఇది మా సామర్థ్యాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ నికర లాభం 29 శాతం ఎగసి రూ. 1,383 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 33 శాతం జంప్చేసి రూ. 3,438 కోట్లయ్యింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 707 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) రూ. 707 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నమోదైన సుమారు రూ. 20 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 3,468 శాతం అధికం. నిర్దిష్ట ఉత్పత్తులకు సంబంధించి దాదాపు రూ. 597 కోట్ల మేర కేటాయింపులు జరపడం వల్ల గత క్యూ3లో లాభం తక్కువగా నమోదైంది. తాజా సమీక్షాకాలంలో ఈ తరహా కేటాయింపులు రూ. 4.7 కోట్లకు పరిమితమయ్యాయి. మరోవైపు, సమీక్షాకాలంలో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఊతంతో ఆదాయం రూ. 4,930 కోట్ల నుంచి రూ. 5,320 కోట్లకు పెరిగింది. కోవిడ్–19 నివారణ, చికిత్సలకు సంబంధించి టీకాలతో పాటు పలు ఔషధాలను ప్రవేశపెడుతున్నామని సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ శుక్రవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా తెలిపారు. మోల్నుపిరావిర్ ఔషధానికి మరో ఆరు దేశాల్లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా రెండు దేశాల్లో ఆమోదం లభించిందని కంపెనీ సీఈవో (ఏపీఐ, సర్వీసులు విభాగం) దీపక్ సప్రా పేర్కొన్నారు. 12–18 ఏళ్ల వయస్సు గల వారి కోసం ఉద్దేశించిన స్పుత్నిక్ ఎం టీకాను భారత్లో ప్రవేశపెట్టడంపై త్వరలో ఔషధ రంగ నియంత్రణ సంస్థను సంప్రదించనున్నామని ఆయన వివరించారు. అవసరమైతే దేశీయంగా దీనికి మరో విడత క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఉందని సప్రా తెలిపారు. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈలో షేరు దాదాపు 1% క్షీణించి రూ. 4,218 వద్ద క్లోజయ్యింది. -
యస్ బ్యాంక్.. 80 % జూమ్
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 266 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే లాభం ఏకంగా 80 శాతం ఎగిసింది. మొండిబాకీలకు ప్రొవిజనింగ్ గణనీయంగా తగ్గడం ఇందుకు తోడ్పడింది. నికర వడ్డీ మార్జిన్ 0.25 శాతం వృద్ధి చెంది 2.4 శాతానికి పెరిగినప్పటికీ .. రుణ వృద్ధి అంతంత మాత్రంగానే ఉండటంతో కీలకమైన నికర వడ్డీ ఆదాయం 31 శాతం క్షీణించి రూ. 1,764 కోట్లకు పరిమితమైంది. సమీక్షాకాలంలో రుణ వృద్ధి 4 శాతంగా నమోదైంది. క్యూ3లో ప్రొవిజనింగ్ రూ. 2,089 కోట్ల నుంచి ఏకంగా 82 శాతం తగ్గింది. రూ. 375 కోట్లకు పరిమితమైనట్లు బ్యాంకు ఎండీ, సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు. భారీ విలువ రుణాలను తగ్గించుకోవడంతో పాటు కార్పొరేట్లు రుణాల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి గైడెన్స్ను 10 శాతానికి కుదించుకున్నట్లు ఆయన వివరించారు. గతంలో ఇది 15 శాతంగా ఉండవచ్చని అంచనా వేశారు. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం 19% అప్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం దాదాపు 19 శాతం ఎగిసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 6,536 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ), గణనీయంగా పెరగడం, ప్రొవిజనింగ్ తగ్గడం ఇందుకు దోహదపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో బ్యాంక్ నికర లాభం రూ. 5,498 కోట్లు. మరోవైపు, సమీక్షాకాలంలో ఆదాయం రూ. 40,419 కోట్ల నుంచి రూ. 39,866 కోట్లకు తగ్గింది. ‘‘అన్ని విభాగాల్లోనూ వృద్ధి నమోదు చేశాం. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 23 శాతం, ప్రధానమైన ఆపరేటింగ్ లాభం 25 శాతం మేర పెరిగాయి. ప్రొవిజన్లు 27 శాతం తగ్గాయి’’ అని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా తెలిపారు. క్యూ3లో ఎన్ఐఐ రూ. 9,912 కోట్ల నుంచి రూ. 12, 236 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 3.67 శాతం నుంచి 3.96 శాతానికి చేరింది. స్థూల మొండిబాకీలు (జీఎన్పీఏ) నిష్పత్తి 4.38 శాతం నుంచి 4.13 శాతానికి దిగి వచ్చింది. నికర ఎన్పీఏలు 0.63 శాతం నుంచి 0.85 శాతానికి చేరాయి. మరోవైపు, స్టాండెలోన్ ప్రాతిపదికన ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం 25 శాతం పెరిగి రూ. 4,940 కోట్ల నుంచి రూ. 6,194 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 24,416 కోట్ల నుంచి రూ. 28,070 కోట్లకు పెరిగింది. -
ఓఎన్జీసీ లాభాల రికార్డ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఓఎన్జీసీ లిమిటెడ్ కంపెనీ చరిత్రలోనే ఒక త్రైమాసికానికి అత్యధిక లాభాలను సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో క్వార్టర్లో రూ. 18,347 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది సరికొత్త రికార్డ్కాగా.. గతేడాది ఇదే కాలం(జూలై–సెప్టెంబర్)లో రూ. 2,758 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు ప్రధానంగా వన్టైమ్ పన్ను లాభం దోహదపడింది. గతేడాది(2020–21) పూర్తికాలంలో ఓఎన్జీసీ కేవలం రూ. 11,246 కోట్ల లాభం సాధించింది. దీంతో పోల్చినా తాజా సమీక్షా కాలంలో భారీ లాభాలు ఆర్జించగా.. దేశీయంగా మరే ఇతర కంపెనీ ఒక త్రైమాసికంలో ఈ స్థాయి నికర లాభం ఆర్జించకపోవడం గమనార్హం! వాటాదారులకు షేరుకి రూ. 5.50 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. అంతక్రితం 2013 జనవరి–మార్చిలో మరో పీఎస్యూ దిగ్గజం ఐవోసీ ఈ స్థాయిలో అంటే రూ. 14,513 కోట్లు ఆర్జించింది. పన్ను దన్ను: అధిక చమురు ధరలకుతోడు రూ. 8,541 కోట్లమేర లభించిన వన్టైమ్ పన్ను ఆదాయం ఓఎన్జీసీ రికార్డ్ లాభాలకు సహకరించింది. సర్చార్జికాకుండా 22 శాతం కార్పొరేట్ పన్ను రేటును చెల్లించేందుకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు బీఎస్ఈలో నామమాత్ర లాభంతో రూ. 155 వద్ద ముగిసింది. -
కల్యాణ్ జ్యుయలర్స్ లాభం రూ. 69 కోట్లు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆభరణాల సంస్థ కల్యాణ్ జ్యుయలర్స్ ఇండియా రూ. 69 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ2లో కంపెనీ రూ. 136 కోట్ల నష్టం నమోదు చేసింది. తాజాగా కోవిడ్–19 పరమైన ఆంక్షలు తగ్గడం, ఆర్థిక వ్యవస్థ రికవరీ తదితర అంశాలు అమ్మకాలకు ఊతమిచ్చినట్లు కంపెనీ తెలిపింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 1,798 కోట్ల నుంచి 61 శాతం ఎగిసి రూ. 2,889 కోట్లకు పెరిగింది. క్యూ2లో కంపెనీ పటిష్టమైన పనితీరు కనపర్చిందని, కోవిడ్–19పరమైన ఆంక్షలు సడలింపుతో పాటు వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడుతుండటంతో ప్రస్తుత త్రైమాసికంలో కూడా అమ్మకాలు మరింతగా వృద్ధి చెందవచ్చని కల్యాణ్ జ్యుయలర్స్ ఇండియా ఈడీ రమేష్ కల్యాణరామన్ తెలిపారు. బీఎస్ఈలో బుధవారం కంపెనీ షేరు సుమారు 4 శాతం పెరిగి రూ. 81.50 వద్ద క్లోజయ్యింది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం 24% అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 2,088 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నమోదైన రూ. 1,679 కోట్ల లాభంతో పోలిస్తే ఇది సుమారు 24 శాతం అధికం. రైటాఫ్ చేసిన ఖాతాల నుంచి అధిక మొత్తం రికవర్ కావడం, మార్జిన్లు స్థిర స్థాయిలో కొనసాగడం తదితర అంశాలు లాభాలు మెరుగుపడటానికి దోహదపడినట్లు బ్యాంక్ ఎండీ సంజీవ్ చడ్ఢా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 7–10 శాతం స్థాయిలో ఉండవచ్చని, కార్పొరేట్ రుణాలు కూడా వృద్ధి చెందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమీక్షా కాలంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 20,729 కోట్ల నుంచి రూ. 20,271 కోట్లకు తగ్గింది. వడ్డీ ఆదాయం 6.33 శాతం క్షీణించి రూ. 17,820 కోట్ల నుంచి రూ. 16,692 కోట్లకు తగ్గింది. వడ్డీయేతర ఆదాయం 23 శాతం పెరిగి రూ. 2,910 కోట్ల నుంచి రూ. 3,579 కోట్లకు చేరింది. మరోవైపు, ఇచ్చిన మొత్తం రుణాల్లో .. స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) పరిమాణం 9.14 శాతం నుంచి 8.11 శాతానికి దిగి వచ్చింది. కానీ నికర ఎన్పీఏలు 2.51 శాతం నుంచి స్వల్పంగా పెరిగి 2.83 శాతానికి చేరాయి. మొండి బాకీలు తదితర అంశాలకు కేటాయింపులు రూ. 2,811 కోట్ల నుంచి రూ. 2,754 కోట్లకు తగ్గాయి. బీఎస్ఈలో బుధవారం బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 5 శాతం క్షీణించి రూ. 100.65 వద్ద క్లోజయ్యింది. -
బీపీసీఎల్ మెరుగైన పనితీరు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) నికర లాభం సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో 24 శాతం పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.2,589 కోట్ల నుంచి రూ.3,201 కోట్లకు చేరుకుంది. ఆదాయం సైతం 54 శాతం వృద్ధి చెంది రూ.1.02 లక్షల కోట్లుగా నమోదైంది. గత కొంత కాలంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం మెరుగైన పనితీరుకు తోడ్పడింది. చమురు కంపెనీలు ముడి చమురును కొనుగోలు చేసి, శుద్ధి చేసిన అనంతరం వివిధ ఉత్పత్తులుగా విక్రయిస్తుంటాయి. కొనుగోలు చేసి, విక్రయించే నాటికి ధరలు పెరగడం కలిసొస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతీ బ్యారెల్ ముడిచమురు శుద్ధిపై 5.11 డాలర్లను ఆర్జించినట్టు బీపీసీఎల్ తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఒక్కో బ్యారెల్ శుద్ధిపై మార్జిన్ 3.19 డాలర్లుగానే ఉండడం గమనార్హం. సెప్టెంబర్ త్రైమాసికంలో 9.91 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను సంస్థ విక్రయించింది. వ్యాపారాలు కుదురుకోవడం, చమురు డిమాండ్ పెరుగుతూ ఉండడంతో మంచి వృద్ధిని చూసినట్టు కంపెనీ సీఎఫ్వో వీఆర్కే గుప్తా తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు పెరగడం రిఫైనరీ మార్జిన్ల విస్తరణకు సాయపడినట్టు చెప్పారు. ఈక్విటీ మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో షేరు ఒక శాతం నష్టంతో రూ.418 వద్ద ముగిసింది. -
ఇండస్ఇండ్.. రయ్ లాభం 73 శాతం జూమ్
ముంబై: ప్రైవేటు రంగంలోని ఇండస్ఇండ్ బ్యాంకు సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో పనితీరు మెరుగుపరుచుకుంది. కన్సాలిడేటెడ్గా నికర లాభం 73 శాతం పెరిగింది. రూ.663 కోట్ల లాభాన్ని బ్యాంకు ప్రకటించింది. రుణాల్లో వృద్ధికితోడు, ఎన్పీఏలకు (వసూలు కాని మొండి రుణాలు) కేటాయింపులు తగ్గడం లాభం పెరిగేందుకు దోహదపడింది. సూక్ష్మ, వాహన రుణ విభాగం లో ఒత్తిళ్లు ఉన్నట్టు బ్యాంకు ప్రకటించింది. ► నికర వడ్డీ ఆదాయం 12 శాతం పెరిగి రూ.3,658 కోట్లకు చేరింది. ► నికర వడ్డీ మార్జిన్ 4.07 శాతంగా ఉంది. ► ఫీజుల రూపంలో ఆదాయం రూ.1,554 కోట్ల నుంచి రూ.1,838 కోట్లకు పెరిగింది. ► సెప్టెంబర్ త్రైమాసింకలో రూ.2,658 కోట్ల రుణాలు ఎన్పీఏలుగా మారాయి. ► స్థూల ఎన్పీఏలు 2.77 శాతానికి చేరాయి. ఇవి అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికం నాటికి 2.21శాతంగా ఉంటే, ఈ ఏడాది జూన్ త్రైమాసికం చివరికి 2.88 శాతంగా ఉన్నాయి. ► కేటాయింపులు రూ.1,703 కోట్లకు తగ్గాయి. -
ఐసీఐసీఐ రికార్డు లాభాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 5,511 కోట్ల నికర లాభం ఆర్జించింది. త్రైమాసికాలవారీగా చూస్తే ఇది రికార్డు గరిష్ట స్థాయి లాభం. వివిధ విభాగాల్లో రుణ వృద్ధి మెరుగుపడటం, మొండి బాకీలు తగ్గడం ఇందుకు దోహదపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో బ్యాంక్ రూ. 4,251 కోట్ల లాభం నమోదు చేసింది. తాజా క్యూ2లో ఆదాయం రూ. 23,651 కోట్ల నుంచి రూ. 26,031 కోట్లకు పెరిగింది. ఇవి స్టాండెలోన్ ప్రాతిపదికన ఫలితాలు కాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన చూస్తే జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో బ్యాంకు అత్యధికంగా రూ. 6,092 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇది రూ. 4,882 కోట్లు. ఇక మొత్తం ఆదాయం స్వల్పంగా వృద్ధి చెంది రూ. 39,290 కోట్ల నుంచి రూ. 39,484 కోట్లకు చేరింది. కనిష్టానికి ఎన్పీఏలు: బ్యాంక్ ఎన్పీఏలు 5.17 శాతం నుంచి 4.82 శాతానికి దిగి వచ్చాయి. ఇక నికర ఎన్పీఏలు 1 శాతం నుంచి 0.99 శాతానికి తగ్గాయి. 2014 డిసెంబర్ 31 తర్వాత నికర ఎన్పీఏలు ఇంత కనిష్టానికి తగ్గడం ఇదే ప్రథమం. -
డీమార్ట్ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2021–22) రెండో త్రైమాసికంలో డీమార్ట్ స్టోర్ల నిర్వాహక కంపెనీ ఎవెన్యూ సూపర్మార్ట్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ2(జులై–సెపె్టంబర్)లో నికర లాభం రెట్టింపై దాదాపు రూ. 418 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 196 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 47 శాతం ఎగసి రూ.7,789 కోట్లను తాకింది. అయితే మొత్తం వ్యయాలు 44 శాతం పెరిగి రూ. 7,249 కోట్లయ్యాయి. స్టాండెలోన్ పద్ధతిన డీమార్ట్ ఆదాయం 47 శాతం జంప్చేసి రూ. 7,650 కోట్లకు చేరింది. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెపె్టంబర్)లో మొత్తం ఆదాయం రూ. 9,189 కోట్ల నుంచి రూ. 12,972 కోట్లకు పురోగమించింది. -
మెప్పించిన టెక్ మహీంద్రా
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా జూన్తో ముగిసిన త్రైమాసికంలో ఆకర్షణీయమైన పనితీరును ప్రదర్శించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 43 శాతం వృద్ధి చెంది రూ.1,366 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.956 కోట్లతో పోల్చినా లేక ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో లాభం రూ.1,206 కోట్లతో చూసినా వృద్ధి చెందింది. లాభాల్లో మార్జిన్ 15.3 శాతానికి విస్తరించడం వల్ల పన్నుకు ముందస్తు లాభంలో 39 శాతం వృద్ధి నమోదైంది. కన్సాలిడేటెడ్ ఆదాయం 10 శాతం పెరిగి రూ.10,485 కోట్లుగా నమోదైంది. సీక్వెన్షియల్గా ఆదాయం (మార్చి క్వార్టర్తో పోలిస్తే) 10 శాతం వృద్ధిని చూపించింది. డాలర్ మారకంలో చూస్తే నికర లాభం 42 శాతానికి పైగా వృద్ధితో 183.2 మిలియన్ డాలర్లుగాను, ఆదాయం 14.6 శాతం వృద్ధితో 1,383 మిలియన్ డాలర్లుగాను ఉన్నాయి. కంపెనీ ఉద్యోగులు సీక్వెన్షియల్గా (మార్చి త్రైమాసికంతో పోల్చినప్పుడు) జూన్ క్వార్టర్లో 5,209 మంది పెరిగారు. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,26,263కు చేరింది. సుమారు 13,544 కోట్లు (183 మిలియన్ డాలర్లు) నగదు, నగదు సమాన నిల్వలున్నాయి. కంపెనీ చరిత్రలోనే అత్యధిక త్రైమాసిక లాభాన్ని జూన్ క్వార్టర్లో నమోదు చేసినట్టు సీఎఫ్వో మిలింద్ కుల్కర్ణి తెలిపారు. 815 మిలియన్ డాలర్ల (రూ.6 వేల కోట్లకు పైగా) విలువైన నూతన వ్యాపార ఒప్పందాలను సొంతం చేసుకున్నట్టు వెల్లడించారు. అన్ని విభాగాల్లోనూ మంచి పనితీరును సాధించినట్టు చెప్పా రు. డిజిటల్పై పెరుగుతున్న వ్యయాలను అవకాశాలుగా మలుచుకుని రానున్న కాలంలో ఇదే వృద్ధిని లేదంటే ఇంతకుమించి మెరుగైన పనితీరును నమోదు చేస్తామన్న ఆశాభావాన్ని కంపెనీ ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ పేర్కొన్నారు. -
ఎస్బీఐ మొండిబాకీలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) రూ. 5,196 కోట్ల నికర లాభం సాధించింది. గతేడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో ఆర్జించిన రూ. 5,583 కోట్లతో పోలిస్తే ఇది 7 శాతం క్షీణత. స్టాండెలోన్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం స్వల్ప వెనకడుగుతో రూ. 75,981 కోట్లకు పరిమితమైంది. గత క్యూ3లో రూ. 76,798 కోట్ల ఆదాయం నమోదైంది. కాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన తాజా క్వార్టర్లో నికర లాభం 4 శాతం నీరసించి రూ. 6,258 కోట్లను తాకింది. గతంలో రూ. 4,500 కోట్లమేర లభించిన అదనపు ఆదాయం కారణంగా లాభాలు అధికమైనట్లు బ్యాంక్ ప్రస్తావించింది. వీటిలో ఎస్సార్ స్టీల్ రుణ పరిష్కారం ద్వారా రూ. 4,000 కోట్ల వడ్డీ లభించగా.. మరో రూ. 500 కోట్ల ఇతర ఆదాయం నమోదైనట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా వివరించారు. ప్రొవిజన్లు అప్ తాజా సమీక్షా కాలంలో ఎస్బీఐ ఆస్తుల(రుణాల) నాణ్యత మెరుగుపడింది. క్యూ3లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 6.94 శాతం నుంచి 4.77 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు కూడా 2.65 శాతం నుంచి 1.23 శాతానికి క్షీణించాయి. అయితే మొండి రుణాలకు ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 7,253 కోట్ల నుంచి రూ. 10,342 కోట్లకు పెరిగాయి. ఇక నికర వడ్డీ ఆదాయం దాదాపు 4 శాతం పుంజుకుని రూ. 27,779 కోట్లకు చేరింది. ఇందుకు 7 శాతం రుణ వృద్ధి సహకరించింది. నికర వడ్డీ మార్జిన్లు 3.12 శాతంగా నమోదయ్యాయి. రిటైల్ రుణాలు 15 శాతం జంప్చేయగా.. మొత్తం లోన్ బుక్లో వీటి వాటా 61 శాతానికి చేరాయి. వీటిలో వ్యక్తిగత రుణ వాటా 39 శాతంకాగా.. ఏడాది కాలంలో 45 శాతానికి పెరిగే వీలున్నట్లు ఖారా అంచనా వేశారు. డిసెంబర్కల్లా బ్యాంక్ కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 14.5 శాతాన్ని తాకింది. ఇతర ఆదాయం రూ. 9106 కోట్ల నుంచి రూ. 9246 కోట్లకు స్వల్పంగా పెరిగింది. మారటోరియంపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో జీఎన్పీఏలుగా పరిగణించే స్లిప్పేజెస్ రూ. 16,461 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ షేరు ఎన్ఎస్ఈలో 6.6 శాతం జంప్చేసి రూ. 358 వద్ద ముగిసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఇంట్రాడేలో రూ. 331 వద్ద కనిష్టానికీ చేరింది. షేరు ధర పుంజుకోవడంతో ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 17,000 కోట్లకుపైగా బలపడింది. వెరసి బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 3.19 లక్షల కోట్లను అధిగమించింది. -
మళ్లీ ఎయిర్టెల్ లాభాల ట్యూన్
న్యూఢిల్లీ: టెలికం రంగ మొబైల్ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఈ ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో రూ. 854 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ3లో రూ. 1,035 కోట్ల నికర నష్టం ప్రకటించింది. వెరసి ఆరు క్వార్టర్ల తదుపరి టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించింది. కాగా.. ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 24 శాతం ఎగసి రూ. 26,518 కోట్లను తాకింది. తద్వారా మూడు నెలల కాలానికి కంపెనీ చరిత్రలోనే అత్యధిక ఆదాయాన్ని అందుకుంది. ఇందుకు మొబైల్ టారిఫ్లు మెరుగుపడటం, కస్టమర్ల సంఖ్య పుంజుకోవడం వంటి అంశాలు దోహదపడ్డాయి. క్యూ3లో దేశీ బిజినెస్ టర్నోవర్ సైతం 25 శాతం జంప్చేసి రూ. 19,007 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 135 నుంచి రూ. 166కు ఎగసింది. క్యూ3లో ఆఫ్రికా నుంచి ఆదాయం 22 శాతం పుంజుకుని రూ. 7,644 కోట్లను అధిగమించింది. యూజర్లు 45.79 కోట్లకు... కంపెనీ కస్టమర్ల సంఖ్య 9.4 శాతం పెరిగి 45.79 కోట్లకు చేరింది. దేశీయంగా ఈ సంఖ్య 30.87 కోట్ల నుంచి 33.62 కోట్లకు ఎగసింది. ఆఫ్రికాలో వినియోగదారుల సంఖ్య 11% వృద్ధితో 11.89 కోట్లను తాకింది. డిసెంబర్కల్లా కంపెనీ రుణ భారం రూ. 1,47,438 కోట్లుగా ఉంది. డిబెంచర్లు, బాండ్లు తదితర మార్గాలలో నిధుల సమీకరణకు బోర్డు అనుమతించినట్లు ఎయిర్టెల్ తాజాగా వెల్లడించింది. ఒకేసారి లేదా దశలవారీగా రూ. 7,500 కోట్లవరకూ సమీకరించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది. అనిశ్చితి ఉన్నా ఏడాది పొడవునా అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ మరోసారి పటిష్ట పనితీరును చూపగలిగినట్లు భారతీ ఎయిర్టెల్ దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ పేర్కొన్నారు. పోర్ట్ఫోలియోలోని ప్రతీ విభాగంలోనూ స్థిరమైన వృద్ధిని సాధించినట్లు తెలియజేశారు. పెరిగిన మార్కెట్ వాటా ద్వారా ఇది ప్రతిఫలిస్తున్నట్లు చెప్పారు. క్యూ3లో ప్రధానంగా 13 మిలియన్ల 4జీ కస్టమర్లు కొత్తగా జత కలిసినట్లు పేర్కొన్నారు. తద్వారా ఈ సంఖ్య 165.6 మిలియన్లకు చేరినట్లు తెలియజేశారు. దేశంలోనే తొలిసారిగా హైదరబాద్ నగరంలో ఒక వాణిజ్య నెట్వర్క్పై 5జీ లైవ్ను ప్రదర్శించినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం లాభపడి రూ. 612 వద్ద ముగిసింది. -
అమ్మకాల జోష్ : మారుతి లాభాలు భేష్
సాక్షి,ముంబై: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ క్యూ3లో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 24.1శాతం వృద్ధితో రూ.1941.4 కోట్లకు ఎగబాకింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికరలాభం రూ.1565 కోట్లుగా నమోదైంది. కంపెనీ స్టాండలోన్ రెవిన్యూ 13.3శాతం వృద్ధితో రూ.20,706.8 కోట్ల నుంచి రూ.23,457.8 కోట్లకు పెరిగింది. కంపెనీ పన్నుల వ్యయం రూ.441.6 కోట్ల నుంచి రూ.508.4 కోట్లకు చేరింది. కంపెనీ ఎబిట్టా 5.9శాతం వృద్ధితో రూ.2102 కోట్ల నుంచి రూ.2226 కోట్లకు చేరగా, ఎబిట్టా మార్జిన్ 10.1 శాతం నుంచి 9.5శాతానికి తగ్గింది. కరోనా సంక్షోభంలో భారీగా పడిపోయిన అమ్మకాలు తిరిగి పుంజుకోవడంతో డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో మారుతి నికరలాభం అంచనాలను అధిగమించింది. అమ్మకాలు 22,367 కోట్ల రూపాయలు పెరిగాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13.2శాతం ఎక్కువ.ఈ క్వార్టర్లో కంపెనీ మొత్తం 495,897 వాహనాలను విక్రయించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13.4శాతం పెరిగింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం అమ్మకాలు 13.4 శాతం వృద్ధితో 4,95,897 యూనిట్లుగా ఉన్నాయి. ఇందులో దేశీయ మార్కెట్ వాటా 13శాతం వృద్ధితో 4,67,369 యూనిట్లుగా ఉంది. ఇక 20.6 శాతం వృధ్ధితో 28,528 వాహనాలకు కంపెనీ ఎగుమతి చేసింది. అయితే ఏప్రిల్- డిసెంబర్ తొమ్మిది నెలల కాలంలో మొత్తం 965,626 వాహనాలను విక్రయించింది, అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 18.0శాతం తగ్గింది. దేశీయ మార్కెట్లో అమ్మకాలు 905.015 యూనిట్లు, 17.8శాతం తగ్గాయి. ఎగుమతులు 60.611 యూనిట్ల వద్ద ఉన్నాయి, ఇది 21.9శాతం క్షీణత. మరోవైపు గురువారం నాటి బేర్ మార్కెట్లో మారుతి సుజుకి షేరునష్టాలను ఎదుర్కొంది. 3.44 శాతం నష్టంతో రూ.7600 వద్ద ముగిసింది. -
హెచ్సీఎల్ టెక్.. క్యూ3 కిక్!
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఈ ఏడాది(2020–21) మూడో త్రైమాసికంలో రూ. 3,982 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 31 శాతం అధికంకాగా.. డిజిటల్, ప్రొడక్టుల విభాగంలో పటిష్ట వృద్ధి ఇందుకు సహకరించింది. క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో యూఎస్గాప్ ప్రమాణాల ప్రకారం మొత్తం ఆదాయం 6.4 శాతం పెరిగి రూ. 19,302 కోట్లను తాకింది. స్థిరకరెన్సీ ప్రాతిపదికన ఆదాయం తొలుత వేసిన 1.5–2.5 శాతం అంచనాలను మించుతూ 3.5 శాతం బలపడింది. ఈ బాటలో క్యూ4(జనవరి–మార్చి)లోనూ ఆదాయం 2–3 శాతం స్థాయిలో పుంజుకోనున్నట్లు అంచనా వేసింది. వెరసి గతంలో ఇచ్చిన 1.5–2.5 శాతం గైడెన్స్ను ఎగువముఖంగా సవరించింది. కొత్త ఏడాది హుషారుగా...: త్రైమాసిక ప్రాతిపదికన డిసెంబర్ క్వార్టర్లో పటిష్ట వృద్ధిని సాధించినట్లు హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈవో సి.విజయ్ కుమార్ పేర్కొన్నారు. డీల్ పైప్లైన్లో కనిపిస్తున్న స్పీడ్ ప్రకారం రానున్న త్రైమాసికాలలో మరింత పురోగతిని సాధించే వీలున్నట్లు తెలియజేశారు. తద్వారా కొత్త ఏడాదిని హుషారుగా ప్రారంభించినట్లు వ్యాఖ్యానించారు. సొల్యూషన్లు, సర్వీసులపై దృష్టిపెట్టడం ద్వారా కంపెనీ ప్రత్యేక తరహాలో వృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. 2020 జనవరి–డిసెంబర్ మధ్యకాలంలో తొలిసారి ఆదాయం 10 బిలియన్ డాలర్లను అధిగమించినట్లు తెలియజేశారు. స్థిరకరెన్సీ ప్రాతిపదికన వార్షికంగా 3.6 శాతం పెరిగినట్లు వెల్లడించారు. ఏడు బిజినెస్ విభాగాల్లో ఐదు సానుకూల వృద్ధిని సాధించినట్లు వివరించారు. ప్రధానంగా యూరోప్లో మీడియా, టెలికం విభాగాలు పటిష్ట ప్రగతిని సాధించినట్లు వెల్లడించారు. 20,000 మందికి చాన్స్ వాటాదారులకు షేరుకి రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు నిర్ణయించింది. క్యూ3లో 13 ట్రాన్స్ఫార్మేషనల్ డీల్స్ను కుదుర్చుకుంది. డిసెంబర్ క్వార్టర్లో నికరంగా 6,597 మందిని నియమించుకుంది. ఉద్యోగ వలస 10.2 శాతంగా నమోదైంది. దీంతో కంపెనీ ఉద్యోగుల సంఖ్య తాజాగా 1,59,682కు చేరింది. మార్చి క్వార్టర్లో 5,000 మంది ఫ్రెషర్స్ను ఎంపిక చేసుకోనున్నట్లు వెల్లడించింది. రానున్న రెండు త్రైమాసికాలలో 20,000 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు విజయ్ కుమార్ తెలియజేశారు. ఐబీఎం డీల్ను పూర్తిచేసిన నేపథ్యంలో జూలై–డిసెంబర్ మధ్య కాలంలో 13.4 శాతం వృద్ధి సాధించినట్లు తెలియజేశారు. ఐబీఎం సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ను రూ. 12,252 కోట్లకు హెచ్సీఎల్ సొంతం చేసుకున్న విషయం విదితమే. క్యూ3 ఫలితాలు, మార్కెట్లలో అమ్మకాల నేపథ్యంలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేరు ఎన్ఎస్ఈలో 4% పతనమై రూ. 989 వద్ద ముగిసింది. -
అంచనాలు మించిన ఇన్ఫీ!
న్యూఢిల్లీ: దేశీయంగా రెండో అతి పెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అంచనాలకు మించి రూ. 4,845 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నమోదైన రూ. 4,019 కోట్లతో పోలిస్తే ఇది 20.5 శాతం అధికం. లాభం సుమారు రూ. 4,534 కోట్ల స్థాయిలో ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. రెండో త్రైమాసికంలో ఇన్ఫీ ఆదాయం రూ. 22,629 కోట్ల నుంచి 8.5 శాతం వృద్ధి చెంది రూ. 24,570 కోట్లకు పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధి గైడెన్స్ను కూడా ఇన్ఫోసిస్ పెంచింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 2–3 శాతం మేర వృద్ధి ఉంటుందని సవరించింది. గతంలో ఇది 2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ‘క్లయింట్లకు మాపై ఉన్న నమ్మకమే ఊ తంగా 2021 ఆర్థిక సంవత్సరం ఆదాయ, మార్జిన్ల అంచనాలను సవరించాము‘ అని కంపెనీ సీఈవో సలిల్ పరేఖ్ చెప్పారు. డిజిటల్, క్లౌడ్ విభాగాల తోడ్పాటుతో మార్కెట్లో మెరుగైన పనితీరు కనపర్చగలుగుతున్నామని, త్రైమాసిక ఆర్థిక ఫలితాలు దీన్ని ప్రతిబింబించేవిగా ఉన్నాయని ఆయన పేర్కొ న్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో నిధు ల నిల్వలు గణనీయంగా పెరిగాయని ఇన్ఫీ సీఎఫ్వో నీలాంజన్ రాయ్ తెలిపారు. ఈ నేపథ్యంలో మధ్యంతర డివిడెండ్ను షేరుకు 50% పెంచి రూ. 12 చెల్లించనున్నట్లు వివరించారు. ఈ క్వార్టర్లో ఐటీ దిగ్గజాలకు సంబంధించి ఇప్పటికే టీసీఎస్, విప్రో ఫలితాలు వెలువడ్డాయి. ఇక హెచ్సీఎల్ అక్టోబర్ 16న ఆర్థిక ఫలితాలు ప్రకటించనుంది. జనవరి 1 నుంచి జీతాల పెంపు.. అన్ని స్థాయిల సిబ్బందికి జనవరి 1 నుంచి జీతాలను పెంచనున్నట్లు, ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు వెల్లడించారు. అలాగే, రెండో త్రైమాసికానికి సంబంధించి ప్రత్యేక ప్రోత్సాహకాలతో పాటు 100 శాతం వేరియబుల్ పే ఇస్తున్నట్లు వివరించారు. ‘క్లిష్ట పరిస్థితుల్లోనూ మా ఉద్యోగులు నిబద్ధతతో విధులు నిర్వర్తించిన నేపథ్యంలో రెండో త్రైమాసికంలో 100% వేరియబుల్ పే చెల్లిస్తున్నాం. అలాగే క్యూ3లో మా జూనియర్ ఉద్యోగులకు వన్ టైమ్ ప్రాతిపదికన ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నాం‘ అని సలీల్ పరేఖ్ చెప్పారు. జీతాల పెంపు ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమవుతుందని, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని వివరించారు. జూనియర్ స్థాయిల్లో గత త్రైమాసికం నుంచి ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభించామని, ఇకపై మిగతా అన్ని స్థాయిలకు దీన్ని విస్తరించనున్నామని పరేఖ్ చెప్పారు. కరోనా సంక్షోభంతో వ్యాపారంపై ప్రతికూలత కారణంగా ప్రమోషన్లు, జీతాల పెంపులను నిలిపివేస్తున్నట్లు ఇన్ఫీ గతంలో ప్రకటించింది. తాజాగా పరిస్థితులు మెరుగుపడుతుండటంతో వాటిని మళ్లీ అమలు చేయాలని భావిస్తోంది. జీతాల పెంపు పరిమాణం గతంలోలాగానే ఉంటుందని సీవోవో ప్రవీణ్రావు తెలిపారు. దేశీయంగా ఉద్యోగులకు గతేడాది సగటున వేతనాల పెంపు సుమారు 6%గా ఉండగా, విదేశాల్లో ఉన్న సిబ్బందికి 1–1.5 శాతం స్థాయిలో నమోదైంది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెల్లడయ్యాయి. ఇన్ఫీ షేరు 2% క్షీణించి రూ. 1,136 వద్ద ముగిసింది. ఇతర విశేషాలు... ► క్యూ2లో డిజిటల్ విభాగ ఆదాయాలు 1,568 మిలియన్ డాలర్లుగా (మొత్తం ఆదాయంలో 47.3 శాతం వాటా) నమోదయ్యాయి. ► క్యూ2లో ఇన్ఫోసిస్ 3.15 బిలియన్ డాలర్ల భారీ డీల్స్ కుదుర్చుకుంది. ► ఆదాయాల్లో ఉత్తర అమెరికా వాటా 60% కాగా, యూరప్(24.3%), భారత్(3%), ఇతర దేశాలు(12%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ► వ్యయ నియంత్రణ, సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడంతో నిర్వహణ మార్జిన్ సీక్వెన్షియల్గా 270 బేసిస్ పాయింట్లు మెరుగుపడింది. ► సెప్టెంబర్ క్వార్టర్లో ఇన్ఫీ నికరంగా 975 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకుంది. ఉద్యోగుల సంఖ్య 2,40,208కి చేరింది. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) వార్షిక ప్రాతిపదికన 18.3 శాతం నుంచి 7.8 శాతానికి దిగి వచ్చింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ.6,659 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2020–21) తొలి త్రైమాసిక కాలంలో 20 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ1లో రూ.5,568 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.6,659 కోట్లకు పెరిగిందని బ్యాంక్ తెలిపింది. ఆదాయం రూ.32,362 కోట్ల నుంచి రూ.34,453 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మరిన్ని వివరాలు... రుణ నాణ్యత మెరుగుపడింది. స్థూల మొండి బకాయిలు 1.40 శాతం నుంచి 1.36 శాతానికి, నికర మొండి బకాయిలు 0.43 శాతం నుంచి 0.33 శాతానికి తగ్గాయి. కేటాయింపులు రూ.2,614 కోట్ల నుంచి రూ.3,892 కోట్లకు పెరిగాయి. కాగా ఫలితాలపై సానుకూల అంచనాలతో శుక్రవారం ఈ షేర్ ధర బీఎస్ఈలో 3% లాభంతో రూ.1,099 వద్ద ముగిసింది. వారసుడు సొంత సంస్థ నుంచే... హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ ఆదిత్య పురి త్వరలో రిటైర్కాబోతున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లోనే 25 ఏళ్లుగా పనిచేస్తున్న వ్యక్తే తన వారసుడయ్యే అవకాశాలున్నాయని ఆదిత్య పురి పేర్కొన్నారు. ఆ వ్యక్తి పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. శశిధర్ జగదీశన్, కైజాద్ బరూచాలు బ్యాంక్ సీఈఓ రేసులో ఉన్నారని సమాచారం. -
40,000 దాటిన సెన్సెక్స్
ఆదాయపు పన్ను విషయంలో, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించిన పన్ను అంశాల్లో కూడా ఊరటనిచ్చే నిర్ణయాలను కేంద్రం తీసుకోనున్నదన్న వార్తల కారణంగా బుధవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. కంపెనీల సానుకూల క్యూ2 ఫలితాలు, షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు కలసివచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 40,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,800 పాయింట్ల ఎగువకు ఎగబాకాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల నిర్ణయం నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో అప్రమత్తత నెలకొన్నా, మన మార్కెట్ మాత్రం ముందుకే దూసుకుపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ 6 పైసలు పతనమై 70.91కు చేరినా, ఆ ప్రభావం కనిపించలేదు. బీఎస్ఈ సెన్సెక్స్ 220 పాయింట్ల లాభంతో 40,052 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 11,844 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రభుత్వ రంగ కంపెనీలు, ఐటీ, ఆయిల్, గ్యాస్ షేర్లు పెరిగాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. ఆల్టైమ్ హై స్థాయిలకు ఈ రెండు సూచీలు చెరో 250 పాయింట్ల దూరంలోనే ఉన్నాయి. ఈక్విటీ పన్ను సంస్కరణలు.. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ)ను రద్దు చేయనున్నారని, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను(ఎల్టీసీజీ), సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ)ల్లో కూడా మార్పులు, చేర్పులు చేయనున్నారన్ని వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు జోష్నిచ్చాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలను మించుతుండటం, ప్రభుత్వ కంపెనీల్లో వాటా విక్రయం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల తగ్గింపు అంచనాలు.. ఇవన్నీ సానుకూల ప్రభావం చూపించాయి. ► భారీ రుణభారంతో ఇప్పటికే కుదేలైన టెలికం కంపెనీలకు తాజాగా ఏజీఆర్ విషయమై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో కష్టాలు మరింతగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ రంగానికి బెయిలవుట్ ప్యాకేజీ నిమిత్తం కార్యదర్శుల సంఘాన్ని కేంద్రం నియమించింది. ఈ నేపథ్యంలో టెలికం షేర్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఆరంభంలో 8.5% ఎగసిన వొడాఫోన్ ఐడియా షేర్ చివరకు 1% నష్టంతో రూ.3.81 వద్ద ముగిసింది. ఎయిర్టెల్ షేర్ 2.3% లాభంతో రూ.368 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ లాభం... ఆరు రెట్లు జంప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో దాదాపు ఆరు రెట్లు పెరిగింది. గత క్యూ2లో రూ.576 కోట్లుగా ఉన్న లాభం ఈ క్యూ2లో రూ.3,375 కోట్లకు పెరిగింది. తమ అనుబంధ కంపెనీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 4.5% వాటా విక్రయం ద్వారా రూ.3,500 కోట్ల లాభం వచ్చిందని, ఈ లాభానికి తోడు రుణ నాణ్యత మెరుగుపడటం వల్ల కూడా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వివరించారు. మొత్తం ఆదాయం రూ.79.303 కోట్ల నుంచి రూ.89,348 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం రూ.23,075 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.24,600 కోట్లకు పెరిగిందని తెలిపారు. నికర వడ్డీ మార్జిన్ 2.78 శాతం నుంచి 3.22 శాతానికి చేరిందని పేర్కొంది. స్టాండ్అలోన్ లాభం రూ.3,012 కోట్లు స్డాండ్అలోన్ పరంగా చూస్తే, గత క్యూ2లో రూ.945 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో మూడు రెట్లకు (212%)పైగా ఎగసి రూ.3,011 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది మార్చిలో ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ ఉంటుందన్నారు. తగ్గిన మొండి బకాయిలు.... గత క్యూ2లో రూ.2.05 లక్షల కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.1.61 లక్షల కోట్లకు తగ్గాయి. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 9.95% నుంచి 7.19%కి, నికర మొండి బకాయిలు 4.84 శాతం నుంచి 2.79 శాతానికి దిగొచ్చాయి. నికర లాభం మూడు రెట్లు పెరగడం, రుణ నాణ్యత మెరుగుపడటంతో బీఎస్ఈలో ఎస్బీఐ షేర్ 7.5 శాతం లాభంతో రూ.282 వద్ద ముగిసింది. -
లాభాల్లోకి ఎస్బీఐ, కానీ అంచనాలు మిస్
సాక్షి, ముంబై : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్దిగ్గజం క్యూ1 ఫలితాల్లో మెరుగైన లాభాలను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.2312కోట్ల నికర లాభాలను సాధించింది.గత ఏడాది నష్టాలతో పోలిస్తే ప్రధానంగా అధిక ఆదాయం, చెడు రుణాల తగ్గింపుతో ఈ ఫలితాలను సాధించినట్టు బ్యాంకు తెలిపింది. 2018-19 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బ్యాంక్ 4,876 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసింది. స్వతంత్ర మొత్తం ఆదాయం 2019-20 మొదటి త్రైమాసికంలో రూ .70,653 కోట్లకు పెరిగింది. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ .65,493 కోట్లుగా ఉంది. అయితే 4,106 కోట్ల లాభాలను సాధించనుందన్న ఎనలిస్టుల అంచనాలను అందుకోలేకపోయింది. నికర వడ్డీ, ఆదాయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే 5.23 శాతం పెరిగిందని ఎస్బీఐ రెగ్యులేటరీ సమాచారంలో తెలిపింది. ప్రొవిజన్లు 11 శాతం తగ్గి రూ. 11648 కోట్లుగా ఉన్నాయి. ఎసెట్ క్వాలిటి జూన్ త్రైమాసికంలో స్థిరంగా ఉంది. నికర ఎన్పిఎలు 3.07 శాతానికి తగ్గాయి. ఏడాది క్రితం ఇది 5.29 శాతంగా ఉంది. ఆస్తులతో పోల్చితే దాని స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పిఎ) జూన్ చివరినాటికి 7.53 శాతానికి తగ్గింది, గత ఏడాది జూన్ చివరినాటికి ఇది 10.69 శాతానికి పైగా ఉంది. ఈ ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ బ్యాంకు లాభాలతో కొనసాగుతోంది. -
అదరగొట్టిన రిలయన్స్ ఇండస్ట్రీస్
సాక్షి,ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. ముఖ్యంగా జియో బూస్ట్తో లాభాల్లోనూ, ఆదాయంలోనూ గణనీయమైన వృద్ధిని సాధించి ఎనలిస్టులు అంచనాలను బ్రేక్ చేసింది. సెప్టెంబర్ 30తో ముగిసిన క్వార్టర్ 2లో 9,516 కోట్ల రూపాయల నికర లాభాలను సాధించింది. వార్షిక ప్రాతిపదికన నికరలాభాల్లో 17శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం ఆదాయం రూ.1.43 లక్షల కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ .9,516కోట్లు. ఎబిటా మార్జిన్లు రూ. 3573కోట్లుగా ఉంది. ఆర్ఐఎల్ చరిత్రలో భారీ లాభాలను సాధించిన త్రైమాసికం ఇదేనని ఎనలిస్టులు చెబుతున్నారు. స్టాక్ ఎక్స్ఛేంజీల తాజా సమాచారం ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారతదేశంలోని అన్ని లిస్టెడ్ కంపెనీలలో అత్యంత విలువైన సంస్థల్లో ఒకటిగా ఉంది. నేటి ముగింపు సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ .7.28 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను సాధించింది. మరోవైపు కేబుల్ టీవీ, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలను పెద్దయెత్తున విస్తరించే క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశీయంగా అతి పెద్ద కేబుల్ ఆపరేటర్ హాథ్వే కేబుల్ అండ్ డేటాకామ్, డెన్ నెట్వర్క్స్ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను ప్రకటించింది. -
పెరిగిన రిలయన్స్ ఇన్ఫ్రా లాభాలు
ముంబై:రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏకీకృత నికరలాభంలో ఏడు శాతం పెరుగుదలను కనబర్చింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను తొలి త్రైమాసికం ఫలితాలను మంగళవారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో రూ 439 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 409 కోట్లుగా వుంది. అయితే కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ మొత్తం ఆదాయం స్వల్పంగా తగ్గింది. గత ఏడాది రూ. 7,644కోట్ల ఆదాయంతో పోలిస్తే ప్రస్తుతం రూ. 7,640కోట్ల ఆదాయాన్ని గడించింది. కంపెనీ ఏకీకృత నికర విలువ క్వార్టర్ చివర్లో రూ 25.920 కోట్లు నమోదైంది. వడ్డీ , పన్నులు, తరుగుదల (ఈబీఐటీడీఏ ) 4 శాతం వృద్ధిని సాధించి రూ 1,751 కోట్లుకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వీటివిలువ రూ 1,691 కోట్లుగా ఉంది.