new plant
-
హైదరాబాద్లో స్టాండర్డ్ గ్లాస్ భారీ ప్లాంట్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా, కెమికల్ పరిశ్రమలకు ప్రత్యేక ఇంజనీరింగ్ పరికరాలను తయారు చేస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ 10వ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ సమీపంలోని బొంతపల్లి వద్ద 36 ఎకరాల్లో ఇది రానుంది. రూ.130 కోట్ల వ్యయంతో తొలి దశ 15 నెలల్లో పూర్తి అవుతుందని కంపెనీ ఎండీ నాగేశ్వర రావు కందుల వెల్లడించారు. 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వస్తుందని అన్నారు.జనవరి 6న ప్రారంభం అవుతున్న ఐపీవో వివరాలను వెల్లడించేందుకు శనివారమిక్కడ జరిగిన సమావేశంలో కంపెనీ ఈడీ కాట్రగడ్డ మోహన రావు, సీఎఫ్వో పాతూరి ఆంజనేయులుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అయిదేళ్లలో అన్ని దశలు పూర్తి చేసుకుని ప్లాంటు మొత్తం 9 లక్షల చదరపు అడుగుల స్థాయికి చేరుతుందని చెప్పారు. ఇందుకు మొత్తం రూ.300 కోట్ల పెట్టుబడి అవసరమని వెల్లడించారు. నతన కేంద్రంలో చమురు, సహజ వాయువు, భారీ పరిశ్రమలు, వంట నూనెల రంగ సంస్థలకు అవసరమైన ఇంజనీరింగ్ పరికరాలను తయారు చేస్తామని నాగేశ్వర రావు వివరించారు.అయిదేళ్లలో ఎగుమతులు సగం..కంపెనీ ఆదాయంలో గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల వాటా 0.5 శాతమే. 2024–25లో ఇది 15 శాతానికి చేరుతుందని నాగేశ్వర రావు వెల్లడించారు. ‘అయిదేళ్లలో ఎగుమతుల వాటా 50 శాతానికి చేరుస్తాం. యూఎస్కు చెందిన ఐపీపీ కంపెనీతో చేతులు కలిపాం.ఆ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 1.5 లక్షలకుపైగా కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. ఐపీపీ సహకారంతో ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకుంటాం. అలాగే జపాన్కు రెండు నెలల్లో ఎగుమతులు ప్రారంభిస్తున్నాం. కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక్క భారత్ నుంచే రూ.15,000 కోట్లు ఉంటుంది’ అని వివరించారు.ఆర్డర్ బుక్ రూ.450 కోట్లు..ప్రస్తుతం స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ 65 రకాల ఉత్పత్తులను తయారు చేస్తోంది. 15 కొత్త ఉత్పత్తులు అభివృద్ధి దశలో ఉన్నాయని నాగేశ్వర రావు వెల్లడించారు. ‘నెలకు 300 యూనిట్లు తయారు చేసే సామర్థ్యం ఉంది. రెండు నెలల్లో ర.40 కోట్ల మూలధన వ్యయం చేస్తాం. రెండేళ్లలో మరో ర.60 కోట్లు వెచ్చిస్తాం. 2023–24లో ర.549 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ర.700 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాం. ఏటా టర్నోవర్లో 50 శాతం వృద్ధి నమోదు చేస్తున్నాం. ఆర్డర్ బుక్ రూ.450 కోట్లు ఉంది’ అని పేర్కొన్నారు.జనవరి 6న ఐపీవో..స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీవో జనవరి 6న ప్రారంభమై 8న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ ర.123 కోట్లు అందుకుంది. ఒక్కొక్కటి ర.140 చొప్పున 87,86,809 ఈక్విటీ షేర్లను కేటాయించింది. అమన్సా హోల్డింగ్స్, క్లారస్ క్యాపిటల్–1, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ ఎంఎఫ్, కోటక్ మహీంద్రా ట్రస్టీ కో లిమిటెడ్ ఏ/సీ కోటక్ మాన్యుఫ్యాక్చర్ ఇన్ ఇండియా ఫండ్, టాటా ఎంఎఫ్, మోతిలాల్ ఓస్వాల్ ఎంఎఫ్, 3పీ ఇండియా ఈక్విటీ ఫండ్–1, కోటక్ ఇన్ఫినిటీ ఫండ్–క్లాస్ ఏసీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐటీఐ లార్జ్ క్యాప్ ఫండ్ వీటిలో ఉన్నాయి.ఇక ఐపీవోలో భాగంగా ర.210 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. 1,42,89,367 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు విక్రయిస్తారు. షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేస్తారు. ప్రైస్ బ్యాండ్ ర.133–140గా నిర్ణయించారు. ఇన్వెస్టర్లు కనీసం 107 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
థాయ్లాండ్లో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన రంగంలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ తాజాగా థాయ్లాండ్లో అసెంబ్లీ ప్లాంటును ప్రారంభించినట్లు ఐషర్ మోటార్స్ బుధవారం తెలిపింది. విడిభాగాలను దిగుమతి చేసుకుని ఈ కేంద్రంలో వాహనాల అసెంబుల్ చేస్తారు.‘అపారమైన వృద్ధికి అవకాశం ఉన్న మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే అంతర్జాతీయ విస్తరణ వ్యూహాన్ని కలిగి ఉండటమే మా వ్యూహాత్మక ఉద్దేశం. థాయ్లాండ్ అసెంబ్లీ ప్లాంట్ ఈ విజన్ను అందిస్తుంది’ అని రాయల్ ఎన్ఫీల్డ్ సీఈవో బి.గోవిందరాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జెంటీనా, కొలంబియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, నేపాల్లో ఇప్పటికే రాయల్ ఎన్ఫీల్డ్కు ఇటువంటి అసెంబ్లింగ్ కేంద్రాలు ఉన్నాయి. నూతన ఫెసిలిటీ థాయ్లాండ్లో మిడ్–సెగ్మెంట్ మార్కెట్ను వృద్ధి చేయడంలో సహాయపడుతుందని విశ్వసిస్తున్నామని రాయల్ ఎన్ఫీల్డ్ సీసీవో యద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు.అలాగే ఈ ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్ను సమర్ధవంతంగా తీర్చడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. కొత్త ప్లాంట్ సంవత్సరానికి 30,000 కంటే ఎక్కువ యూనిట్లను అసెంబుల్ చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. థాయ్లాండ్ మార్కెట్తో ప్రారంభించి దశలవారీగా ఈ ప్రాంతంలో విస్తరిస్తామని కంపెనీ తెలిపింది. -
కాకినాడలో పెన్సిలిన్–జీ ప్లాంటు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెన్సిలిన్–జి ఉత్పత్తి కోసం కాకినాడలో నెలకొల్పిన ప్లాంటును ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్గా ప్రారంభించినట్లు ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మాలో భాగమైన లిఫియస్ ఫార్మా వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపింది.ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద రూ. 2,500 కోట్ల వ్యూహాత్మక పెట్టుబడులతో ఈ ప్లాంటు ఏర్పాటైంది. ఈ ప్లాంటు వార్షికోత్పత్తి సామర్ధ్యం 15,000 మెట్రిక్ టన్నులుగా (ఎంటీ) ఉంటుందని సంస్థ డైరెక్టర్ ఎంవీ రామకృష్ణ తెలిపారు.భారత్ను ఫార్మా తయారీ హబ్గా తీర్చిదిద్దే క్రమంలో స్వయంసమృద్ధి సాధించాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనలో కంపెనీ తన వంతు తోడ్పాటును అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు నాంది పడింది. -
రతన్టాటాకు మోదీ ఎస్ఎంఎస్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ‘వెల్కమ్’ అంటూ రతన్ టాటాకు పంపించిన ఒక ఎస్ఎంఎస్.. సామాన్యుల కారు ‘నానో’ ప్లాంట్ను పశి్చమబెంగాల్లోని సింగూర్ నుంచి గుజరాత్లోని సనంద్కు తరలేలా చేసింది. పశి్చమబెంగాల్లోని సింగూర్లో టాటా నానో ప్లాంట్ కోసం భూసమీకరణకు వ్యతిరేకంగా ప్రస్తుత సీఎం, నాటి ప్రతిపక్ష నేత మమతా బెనర్జీ రైతులతో కలసి 2006లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అది ఎంతకీ పరిష్కారమయ్యేలా కనిపించకపోవడంతో రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు రతన్టాటా ప్రకటించారు. ఆ సమయంలో తాను పంపిన ఎస్ఎంఎస్ ఎలాంటి ఫలితాన్నిచ్చందన్నది నాటి సీఎం మోదీ తర్వాత స్వయంగా ప్రకటించారు. ‘‘తాము పశి్చమబెంగాల్ను వీడుతున్నట్టు కోల్కతాలో రతన్టాటా మీడియా సమావేశంలో ప్రకటిస్తున్న వేళ, ‘వెల్కమ్’ అంటూ నేను ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపాను. రూపాయి ఖర్చుతో పంపించిన ఎస్ఎంఎస్ ఏమి చేయగలదో మీరు ఇప్పుడు చూస్తున్నారు’’అంటూ గుజరాత్లోని సనంద్లో రూ.2,000 కోట్లతో టాటా ఏర్పాటు చేసిన నానో ప్లాంట్ను 2010లో ప్రారంభిస్తున్న వేళ నాటి సీఎం మోదీ ప్రకటించారు. దేశ పారిశ్రామిక చరిత్రలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. -
మహీంద్రా కొత్త ప్లాంటు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త ప్లాంటు ఏర్పాటు యోచనలో ఉంది. ఇందుకోసం కంపెనీ మహారాష్ట్రలోని చకన్కు సమీపంలో స్థల సేకరణలో నిమగ్నమైనట్టు సమాచారం. మొత్తంగా ఆటోమోటివ్ పరిశ్రమకు సమీపంలో ఉండాలన్నది కంపెనీ భావన. మల్టీ ఎనర్జీ ప్లాట్ఫామ్ అయిన న్యూ ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ (ఎన్ఎఫ్ఏ) ఆధారిత వాహనాలను ఇక్కడ తయారు చేస్తారు. చకన్, పుణే, నాసిక్ ప్లాంట్ల వార్షిక తయారీ సామర్థ్యం 8 లక్షల యూనిట్లు. ఎన్ఎఫ్ఏ మోడళ్ల కోసం మరింత సామర్థ్యం అవసరం అవుతుంది. ఎన్ఎఫ్ఏ ఆర్కిటెక్చర్ సుమారు 12 మోడళ్లను తయారు చేసే అవకాశం ఉంది. కొత్త ప్లాట్ఫామ్ ద్వారా తయారైన మోడళ్ల అమ్మకాలు ఏటా 3–5 లక్షల యూనిట్లు ఉండొచ్చని కంపెనీ భావిస్తోంది. కాగా, కంపెనీ తన లక్ష్యాన్ని చేరుకున్నట్టయితే ప్రస్తుత ఆర్తిక సంవత్సరంలో తొలిసారిగా 5 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును అందుకుంటుంది. మహీంద్రా మార్కెట్ వాటా రెండంకెలకు చేరుకోవచ్చు. 2024–25లో ఎస్యూవీల టర్నోవర్ రూ.75,000 కోట్లు దాటనుంది. 2023–24లో కంపెనీ ఎస్యూవీల తయారీలో పరిమాణం పరంగా భారత్లో రెండవ స్థానంలో, ఆదాయం పరంగా తొలి స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 4.59 లక్షల యూనిట్లను విక్రయించింది. ఆటోమోటివ్ బిజినెస్ కోసం రూ.27,000 కోట్ల పెట్టుబడులు చేయనున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పటికే ప్రకటించింది. -
ఎన్కోర్–ఆల్కమ్ కొత్త ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అల్యూమినియం డోర్స్, విండోస్ తయారీ కంపెనీ ఎన్కోర్–ఆల్కమ్ రూ.60 కోట్లతో గుజరాత్లోని సూరత్ వద్ద అత్యాధునిక ప్లాంటు నెలకొల్పుతోంది. అల్యూమినియం డోర్స్, విండోస్ విభాగంలో భారత్లో తొలి ఆటో రోబోటిక్ ఫెసిలిటీ ఇదేనని సంస్థ ఫౌండర్, సీఎండీ అవుతు శివకోటిరెడ్డి బుధవారం తెలిపారు. ‘1,80,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దేశంలో అతిపెద్ద కేంద్రం ఇదే. జర్మనీ సాంకేతికతతో రోజుకు 30,000 చదరపు అడుగుల తయారీ సామర్థ్యంతో మార్చికల్లా రెడీ అవుతుంది. ఇప్పటికే సూరత్లో అల్యూమినియం డోర్స్, విండోస్ ప్లాంటు ఉంది. కస్టమర్ కోరుకున్నట్టు ఆర్కిటెక్చరల్ ఉత్పాదనలు మా ప్రత్యేకత. 60 కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. హైదరాబాద్ సమీపంలోని మోకిల వద్ద ఫ్యాబ్రికేషన్ యూనిట్, ఎక్స్పీరియెన్స్ సెంటర్ మార్చికల్లా ప్రారంభం అవుతాయి. ఎన్కోర్ ఇప్పటికే వుడ్ డోర్స్ తయారీలో ఉంది. దక్షిణాదిన ఎన్కోర్, ఉత్తరాదిన ఆల్కమ్ బ్రాండ్లో కార్యకలాపాలు సాగిస్తున్నాం’ అని వివరించారు. హైటెక్స్లో జనవరి 19 నుంచి జరిగే ఏస్టెక్ ట్రేడ్ ఫెయిర్లో విభిన్న ఉత్పత్తులను ప్రదర్శిస్తామని ఆల్కమ్ డైరెక్టర్ జయంతి భాయ్ మనుభాయ్ తెలిపారు. ఎన్కోర్–ఆల్కమ్ ఫౌండర్ అవుతు శివకోటిరెడ్డి -
2 బిలియన్లు ఇన్వెస్ట్ చేస్తాం, కానీ..
ముంబై: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించడంపై మరింతగా కసరత్తు చేస్తోంది. భారత్లో ప్లాంటు ఏర్పాటుపై 2 బిలియన్ డాలర్ల వరకు (సుమారు రూ. 16,600 కోట్లు) ఇన్వెస్ట్ చేయడానికి తాము సుముఖంగానే ఉన్నామని, అయితే ఈ క్రమంలో తమకు రెండేళ్ల పాటు దిగుమతి సుంకాలపరంగా కొంత మినహాయింపునివ్వాలని కేంద్రాన్ని కోరుతోంది. సుంకాల మినహాయింపులకు, పెట్టుబడి పరిమాణానికి లంకె పెడుతూ కేంద్ర ప్రభుత్వానికి టెస్లా ఓ ప్రతిపాదన సమరి్పంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం దేశీ మార్కెట్లోకి ప్రవేశించాక రెండేళ్ల పాటు తాము దిగుమతి చేసుకునే కార్లపై సుంకాలను 15 శాతానికే పరిమితం చేయాలని కంపెనీ ప్రతిపాదించింది. 12,000 వాహనాలకు తక్కువ టారిఫ్ వర్తింపచేస్తే 500 మిలియన డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేస్తామని, అదే 30,000 వాహనాలకు వర్తింపచేస్తే 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను పెంచుతామని టెస్లా పేర్కొన్నట్లు సమాచారం. జనవరి నాటికి నిర్ణయం.. ప్రధాని కార్యాలయం మార్గదర్శకత్వంలో టెస్లా ప్రతిపాదనను పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ), భారీ పరిశ్రమల శాఖ, రోడ్డు రవాణా.. జాతీయ రహదారుల శాఖ, ఆర్థిక శాఖ సంయుక్తంగా మదింపు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై వచ్చే ఏడాది జనవరి నాటికి నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాయి. టెస్లాకు మరీ ఎక్కువ వెసులుబాటు ఇవ్వకుండా అదే సమయంలో గరిష్టంగా 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను దక్కించుకునేలా మధ్యేమార్గంగా పాటించతగిన వ్యూహంపై కసరత్తు జరుగుతోందని వివరించాయి. ఇదే క్రమంలో తక్కువ టారిఫ్లతో టెస్లా దిగుమతి చేసుకోవాలనుకుంటున్న వాహనాల సంఖ్యను కుదించడంతో పాటు పలు విధానాలు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నాయి. తక్కువ స్థాయి టారిఫ్లను, ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా అమ్ముడయ్యే మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల్లో (ఈవీ) 10%కి పరిమితం చేయడం, రెండో ఏడాది దీన్ని 20% మేర పెంచడం వీటిలో ఉంది. భారత్లో ఈ ఆర్థిక సంవత్సరం 1,00,000 ఈవీలు అమ్ముడవుతాయన్న అంచనాల నేపథ్యంలో తక్కువ టారిఫ్లను, అందులో 10%కి, అంటే 10,000 వాహనాలకు పరిమితం చేయొ చ్చని తెలుస్తోంది. దేశీయంగా గత ఆర్థిక సంవత్సరం 50,000 పైచిలుకు ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. మరోవైపు, టెస్లా కూడా భారత్లో స్థానికంగా జరిపే కొనుగోళ్లను క్రమంగా పెంచుకునే అవకాశం ఉంది. తొలి రెండేళ్లలో మేడిన్ ఇండియా కార్ల విలువలో 20%, ఆ తర్వాత 4 ఏళ్లలో 40% మేర కొనుగోలు చేసేందుకు కంపెనీ అంగీకరించవచ్చని తెలుస్తోంది. -
ఏపీలో కోరమాండల్ ప్లాంటు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నెలకొలి్పన సల్ఫరిక్ యాసిడ్ ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించింది. విశాఖపట్నం వద్ద ఉన్న కంపెనీకి చెందిన ఫెర్టిలైజర్ కాంప్లెక్స్లో రూ.400 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని స్థాపించారు. ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 1,650 మెట్రిక్ టన్నులని కోరమాండల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ బుధవారం వెల్లడించారు. నూతన కేంద్రం చేరికతో సంస్థ సల్ఫరిక్ యాసిడ్ తయారీ సామర్థ్యం ఏటా 6 లక్షల టన్నుల నుంచి 11 లక్షల టన్నులకు చేరిందని పేర్కొన్నారు. -
ఏడాదిలోగా తొలి సెమీకాన్ ప్లాంటు
న్యూఢిల్లీ: దేశీయంగా ఎల్రక్టానిక్ చిప్ తయారీ తొలి ప్లాంటు ఏడాదిలోగా ఏర్పాటయ్యే వీలున్నట్లు కేంద్ర టెలికం, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దేశంలో వేఫర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటుసహా.. సెమీకండక్టర్ తయారీ ఎకోసిస్టమ్(వ్యవస్థ)ను నెలకొల్పే బాటలో తొలిగా ప్రభుత్వం 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలకు తెరతీసినట్లు తెలియజేశారు. అన్ని రకాల హైటెక్ ఎల్రక్టానిక్ ప్రొడక్టులలో వినియోగించే ఫిజికల్ చిప్స్ తయారీకి వేఫర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లను తొలి దశ బ్లాకులుగా వ్యవహరిస్తారు. అంతర్జాతీయంగా నాయకత్వ స్థాయిలో ఎదిగేందుకు కొన్ని ప్రత్యేక విభాగాలపై దృష్టి పెట్టినట్లు అశ్వినీ వెల్లడించారు. ప్రధానంగా సెమీకండక్టర్లకు టెలికం, ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) అతిపెద్ద విభాగాలుగా ఆవిర్భవించినట్లు వివరించారు. వెరసి ఈ విభాగాలలో వినియోగించే చిప్స్ అభివృద్ధి, తయారీలపై దృష్టి పెట్టడం ద్వారా టెలికం, ఈవీలకు గ్లోబల్ లీడర్లుగా ఎదిగే వీలున్నట్లు తెలియజేశారు. ఈ రెండు విభాగాలపై ప్రత్యేక దృష్టితో పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. రానున్న కొన్ని నెలల్లో చెప్పుకోదగ్గ విజయాలను అందుకోనున్నట్లు అంచనా వేశారు. వేఫర్ ఫ్యాబ్రికేషన్, డిజైన్, తయారీ ద్వారా పూర్తి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. దేశీయంగా చిప్ తయారీ యూఎస్ దిగ్గజం మైక్రాన్ పెట్టుబడుల విజయంతో ప్రపంచమంతటా దేశీ సామర్థ్యాలపై విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. మైక్రాన్ గత నెలలో గుజరాత్లోని సణంద్లో సెమీకండక్టర్ అసెంబ్లీ ప్లాంటు నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ ప్లాంటుతోపాటు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు జూన్లో మొత్తం 2.75 బిలియన్ డాలర్ల(రూ. 22,540 కోట్లు) పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. వీటిలో మైక్రాన్ 82.5 కోట్లు ఇన్వెస్ట్ చేయనుండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిగిలిన పెట్టుబడులను సమకూర్చనున్నాయి. -
భారత్లో టయోటా మూడవ ప్లాంట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ టయోటా మోటార్.. భారత్లో మూడవ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఏటా 80,000–1,20,000 యూనిట్ల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని స్థాపించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో నూతన కేంద్రంలో తయారీ సామర్థ్యాన్ని 2,00,000 యూనిట్లకు చేరుస్తారు. కర్నాటకలోని బీదడి వద్ద ఉన్న టయోటాకు చెందిన రెండు ప్లాంట్లు ఏటా 4,00,000 యూనిట్లు తయారు చేయగలవు. ఈ ప్లాంట్లకు సమీపంలోనే మూడవ కేంద్రం నెలకొల్పాలన్నది కంపెనీ ప్రణాళిక. భారత విపణి కోసం కొత్త ఎస్యూవీని అభివృద్ధి చేసే పనిలో కంపెనీ ఇప్పటికే నిమగ్నమైంది. 2026లో ఇది ఇక్కడి రోడ్లపై పరుగు తీయనుంది. కొత్త ఫ్యాక్టరీలో ఈ ఎస్యూవీని తయారు చేయనుండడం విశేషం. మధ్యస్థాయి అర్బన్ క్రూజర్ హైరైడర్కు మలీ్టపర్పస్ వెహికిల్ ఇన్నోవా హైక్రాస్కు మధ్య ఈ మోడల్ ఉండనుంది. 340–డి కోడ్ పేరుతో రానున్న ఈ ఎస్యూవీ మోడల్ కింద ఏటా 60,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలన్నది కంపెనీ ఆలోచన. ఇందుకోసం సరఫరాదార్లను టయోటా సన్నద్ధం చేస్తోంది. భారత్లో మినీ ల్యాండ్ క్రూజర్ను సైతం పరిచయం చేయాలని సంస్థ భావిస్తోంది. టయోటా మోటార్, సుజుకీ మోటార్ కార్పొరేషన్తో అంతర్జాతీయంగా భాగస్వామ్యం ఉన్న సంగతి తెలిసిందే. భారత్లో టయోటా ప్లాంట్ల సామర్థ్యంలో 40 శాతం మారుతీ సుజుకీ వినియోగించుకుంటోంది. భారత్లో 2030 నాటికి ఏటా 5,00,000 యూనిట్ల తయారీ సామర్థ్యం కలిగి ఉండాలని టయోటా భావిస్తోంది. -
పీఅండ్జీ విస్తరణ బాట
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్(పీఅండ్జీ) దేశీయంగా విస్తరణ బాట పట్టింది. దీనిలో భాగంగా గుజరాత్లో వ్యక్తిగత సంరక్షణ ప్రొడక్టుల తయారీకి కొత్త ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇందుకు రూ. 2,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించనున్నట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. తద్వారా దేశీయంగా తొమ్మిదో ప్లాంటుకు తెరతీయనుంది. ఏరియల్, జిల్లెట్, హెడ్ అండ్ షోల్డర్స్, ఓరల్–బి, ప్యాంపర్స్, ప్యాంటీన్, టైడ్, విక్స్, విస్పర్ తదితర సుప్రసిద్ధ బ్రాండ్లు కంపెనీ సొంతం. సణంద్ ప్రాంతంలోని 50,000 చదరపు మీటర్లలో కొత్త ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇక్కడ గ్లోబల్ హెల్త్కేర్ పోర్ట్ఫోలియో నుంచి ఉత్పత్తులను రూపొందించనున్నట్లు తెలియజేసింది. ప్రధానంగా డైజెస్టివ్స్ను తయారు చేయనున్నట్లు వెల్లడించింది. రానున్న కొన్నేళ్లలో ప్లాంటు కార్యకలాపాలు ప్రారంభంకానున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా ప్రొడక్టులను విదేశాలకు ఎగుమతి చేసే కేంద్రంగా వినియోగించనున్నట్లు వివరించింది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలకొద్దీ ఉద్యోగాల కల్పనకు వీలున్నట్లు తెలియజేసింది. గ్లోబల్ కంపెనీ ద్వారా దేశీయంగా ఎఫ్ఎంసీజీ విభాగంలో రెండో పెద్ద పెట్టుబడిగా ఇది నిలవనున్నట్లు పీఅండ్జీ ఇండియా సీఈవో ఎల్వీ వైద్యనాథన్ పేర్కొన్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో సమావేశం సందర్భంగా వివరాలు వెల్లడించారు. గతేడాది సెపె్టంబర్లో మరో ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఎస్ఏ సైతం దేశీయంగా రూ. 5,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. 2015 నుంచి సణంద్లో పీఅండ్జీ తయారీ ప్లాంటును నిర్వహిస్తోంది. కొత్త ప్లాంటును అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రంగా ఏర్పాటు చేయనుంది. -
భారత్లో ఎంజీ మోటార్ రెండో ప్లాంటు!
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా మరో ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 1.8 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. గుజరాత్లోని హలోల్ వద్ద 1.2 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో కంపెనీకి ఇప్పటికే ప్లాంటు ఉంది. జనరల్ మోటార్స్ నుంచి ఈ కేంద్రాన్ని కొనుగోలు చేసింది. భారత్లో అయిదేళ్ల వ్యాపార ప్రణాళికలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ 4–5 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని ఎంజీ మోటార్ ఇండియా నిర్ణయించింది. 2028 నాటికి మొత్తం విక్రయాల్లో ఈవీల వాటా 65–75 శాతానికి చేరవచ్చని కంపెనీ భావిస్తోంది. సంయుక్త భాగస్వామ్య కంపెనీ లేదా థర్డ్ పార్టీ ద్వారా సెల్ తయారీ, హైడ్రోజన్ ప్యూయల్ సెల్ టెక్నాలజీలోని ప్రవేశించే అవకాశాలను అన్వేషిస్తున్నట్టు వెల్లడించింది. దేశంలో ఉద్యోగుల సంఖ్యను 20,000 స్థాయికి చేర్చాలని భావిస్తోంది. మెజారిటీ వాటా విక్రయం.. వచ్చే 2–4 ఏళ్లలో మెజారిటీ వాటాలను స్థానిక భాగస్వాములకు విక్రయించాలన్నది ఎంజీ మోటార్ ఇండియా ప్రణాళిక. 2028 నాటికి దేశంలో కార్యకలాపాలను విస్తరించేందుకు రూ.5,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించిన ఈ సంస్థ.. తదుపరి దశ వృద్ధికి నిధులు సమకూర్చేందుకు కొంత కాలంగా మూలధనాన్ని సమీకరించాలని చూస్తోంది. చైనా నుండి భారత్కు మరింత మూలధనాన్ని తీసుకురావాలన్న కంపెనీ ప్రణాళికలు ఇప్పటివరకు విజయవంతం కాలేదు. రెండేళ్లుగా ప్రభుత్వ అనుమతి కోసం వేచి ఉన్న ఎంజీ మోటార్ ఇండియా మూలధనాన్ని పెంచడానికి ఇతర మార్గాలను వెతకడం ప్రారంభించింది. లక్ష మంది విద్యార్థులు.. ఎంజీ నర్చర్ కార్యక్రమం కింద 1,00,000 మంది విద్యార్థులను ఈవీ, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీస్ విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు ఎంజీ మోటార్ ఇండియా సీఈవో రాజీవ్ ఛాబా తెలిపారు. బ్రిటిష్ బ్రాండ్ అయిన ఎంజీ మోటార్ ప్రస్తుతం చైనాకు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ ఎస్ఏఐసీ మోటార్ కార్పొరేషన్ చేతుల్లో ఉంది. భారత మార్కెట్లో హెక్టర్, ఆస్టర్, గ్లోస్టర్, జడ్ఎస్ ఈవీని విక్రయిస్తోంది. ఇటీవలే చిన్న ఎలక్ట్రిక్ వాహనం కామెట్ను ఆవిష్కరించింది. -
డీఎస్ఎం కొత్త రైస్ ప్లాంట్ మన తెలంగాణాలో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆరోగ్యం, పోషణ సంబంధ ఉత్పత్తుల తయారీలో ఉన్న రాయల్ డీఎస్ఎం హైదరాబాద్ సమీపంలో రైస్ ప్లాంటును ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో విటమిన్లు, పోషకాలతో కూడిన బలవర్ధక బియ్యం తయారు చేస్తారు. ఏటా ఇక్కడ 3,600 టన్నుల బియ్యం ఉత్పత్తి చేస్తామని, భారత్తోపాటు దక్షిణాసియా దేశాలకు సరఫరా చేస్తామని కంపెనీ తెలిపింది. -
హీరో ఎలక్ట్రిక్ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఉన్న హీరో ఎలక్ట్రిక్ నూతన ప్లాంటును రాజస్థాన్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 20 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో రూ.1,200 కోట్ల పెట్టుబడితో ఇది రానుంది. లుధియానా వద్ద నెలకొల్పుతున్న ప్లాంటు నిర్మాణ దశలో ఉంది. మధ్యప్రదేశ్లోని పీతాంపుర వద్ద ఉన్న మహీంద్రా గ్రూప్ ప్లాంటును వినియోగించుకునేందుకు ఆ సంస్థతో ఇప్పటికే భాగస్వామ్యం ఉంది. ప్రస్తుతం హీరో ఎలక్ట్రిక్ వార్షిక తయారీ సామర్థ్యం 5 లక్షల యూనిట్లు. 2022–23లో ఒక లక్ష యూనిట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల యూనిట్ల విక్రయాలను కంపెనీ ఆశిస్తోంది. దేశంలో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి భాగస్వాములతో కలిసి పనిచేస్తునట్టు హీరో ఎలక్ట్రిక్ ఎండీ నవీన్ ముంజాల్ తెలిపారు. రెండు మూడేళ్లలో 10 లక్షల యూనిట్ల అమ్మకం స్థాయికి చేరతామని ఆశాభావం వ్యక్తం చేశారు. 15 ఏళ్లలో కంపెనీ ఇప్పటి వరకు 6 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించింది. మూడు కొత్త మోడళ్లు.. హీరో ఎలక్ట్రిక్ తాజాగా కొత్త ఆప్టిమా సీఎక్స్5.0 (డ్యూయల్ బ్యాటరీ), ఆప్టిమా సీఎక్స్2.0 (సింగిల్ బ్యాటరీ), ఎన్వైఎక్స్ (డ్యూయల్ బ్యాటరీ) మోడళ్లను ప్రవేశపెట్టింది. ధర రూ.85 వేల నుంచి రూ.1.3 లక్షల వరకు ఉంది. జపనీస్ మోటార్ టెక్నాలజీ, జర్మన్ ఈడీయూ సాంకేతికతతో ఇవి తయారయ్యాయి. బ్యాటరీ సేఫ్టీ అలారమ్, డ్రైవ్ మోడ్ లాక్, రివర్స్ రోల్ ప్రొటెక్షన్, సైడ్ స్టాండ్ సెన్సార్ వంటి హంగులు ఉన్నాయి. 3 కిలోవాట్ అవర్ సీ5 లిథియం అయాన్ బ్యాటరీతో ఆప్టిమా సీఎక్స్5.0 తయారైంది. ఒకసారి చార్జింగ్తో 113 కిలోమీటర్లు పరుగెడుతుంది. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒకసారి చార్జింగ్తో ఎన్వైఎక్స్ 113 కిలోమీటర్లు, సీఎక్స్2.0 మోడల్ 89 కిలోమీటర్లు వెళ్తుంది. ఈ రెండు మోడళ్లూ గంటకు 48 కిలోమీటర్ల వేగంతో పరుగెడతాయి. -
లోకేష్ మెషీన్స్ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సీఎన్సీ మెషీన్స్, వాహన విడిభాగాల తయారీలో ఉన్న లోకేష్ మెషీన్స్ రక్షణ, అంతరిక్ష రంగ ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్ సమీపంలోకి కాలకల్ వద్ద 11 ఎకరాల్లో ప్లాంటును నెలకొల్పుతోంది. తొలి దశలో రూ.100 కోట్ల వ్యయం చేయనుంది. 4–6 నెలల్లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని కంపెనీ డైరెక్టర్ ఎం.శ్రీనివాస్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘భారత్తోపాటు అంతర్జాతీయ మార్కెట్ కోసం నూతన కేంద్రంలో చిన్న, మధ్యతరహా ఆయుధాలను తయారు చేస్తాం. ప్రత్యక్షంగా 200, పరోక్షంగా 800 మందికి ఉపాధి లభిస్తుంది. రెండవ దశలో మరో రూ.150 కోట్లు వెచ్చిస్తాం. ప్రతిపాదిత ఫెసిలిటీ పక్కన 3 ఎకరాల్లో వెండార్ పార్క్ ఏర్పాటు చేస్తాం. విడిభాగాల తయారీలో ఉన్న 8 యూనిట్లు ఈ పార్క్లో వచ్చే అవకాశం ఉంది. లోకేష్ మెషీన్స్ ఆర్డర్ బుక్ రూ.250 కోట్లుంది. 2021–22లో రూ.201 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25–30 శాతం వృద్ధి ఆశిస్తున్నాం’ అని వివరించారు. మేడ్చల్ కేంద్రంలో కంపెనీ కొత్త విభాగాన్ని లోకేష్ మెషీన్స్ ఎండీ ఎం.లోకేశ్వర రావు సమక్షంలో రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీష్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. -
ఆజాద్ ఇంజనీరింగ్ మరో ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రెసిషన్ ఇంజనీరింగ్ ఉత్పత్తుల తయారీలో ఉన్న ఆజాద్ ఇంజనీరింగ్ మరో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ కోసం హైదరాబాద్ సమీపంలోని తునికిబొల్లారం వద్ద రూ.165 కోట్లతో ఈ కేంద్రాన్ని ప్రత్యేకంగా స్థాపిస్తోంది. 300 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 2024 మధ్యకాలంలో ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్ఫోన్! -
రూ.900 కోట్లతో ఓరియంటల్ ఈస్ట్ ప్లాంటు
న్యూఢిల్లీ: ఈస్ట్ తయారీలో ఉన్న జపాన్ దిగ్గజం ఓరియంటల్ ఈస్ట్ కంపెనీ మహారాష్ట్రలోని ఖండాలా ఎంఐడీసీ వద్ద అత్యాధునిక ప్లాంటు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రానికి కంపెనీ రూ.900 కోట్లు ఖర్చు చేసింది. బేకరీ, డిస్టిల్లరీస్, ఇతర ఆహార పదార్థాల్లో వాడే ఈస్ట్ను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. 33,000 మిలియన్ టన్నుల ఈస్ట్ తయారీ సామర్థ్యంతో ప్లాంటు తొలి దశ అందుబాటులోకి వచ్చింది. విదేశాలకూ ఈస్ట్ను ఎగుమతి చేస్తారు. కోబో బ్రాండ్లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్లాంటు రాకతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,000 మందికిపైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ తెలిపింది. అత్యంత ముఖ్యమైన మార్కెట్లలో భారత్ ఒకటని ఓరియంటల్ ఈస్ట్ కంపెనీ జపాన్ ప్రెసిడెంట్, ఓరియంటల్ ఈస్ట్ ఇండియా చైర్మన్ మసాషి నకగవ తెలిపారు. అంతర్జాతీయంగా విస్తరణలో కొత్త ప్లాంటు ముందడుగు అని, భారత్ పట్ల కంపెనీ నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. -
నల్లమలలో కొత్త మొక్క
జడ్చర్ల టౌన్: నల్లమల అడవుల్లో సరికొత్త మొక్కను కనుగొన్నట్టు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర ప్రొఫెసర్ సదాశివయ్య వెల్లడించారు. తన పరిశోధక బృందంతో కలిసి గుర్తించిన ఆ మొక్కకు యూఫోర్బియా తెలంగాణేన్సిస్గా నామకరణం చేసినట్టు ప్రకటించారు. శుక్రవారం ఆ వివరాలను విలేకరులకు తెలిపారు. సదాశివయ్య బృందం, ఏపీ రాష్ట్ర జీవవైవిధ్య మండలి సభ్యుడు డాక్టర్ ప్రసాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం నుంచి నిర్మలా బాబురావు, రామకృష్ణ సంయుక్తంగా నల్లమల అటవీ ప్రాంతంలో గడ్డి జాతులపై పరిశోధన చేస్తున్నారు. అటవీశాఖ సహకారంతో చేపట్టిన ఈ పరిశోధనలో ఒక కొత్త మొక్కను గుర్తించారు. అది రాజస్తాన్లో ఉండే యూఫోర్బియా జోధ్పూరెన్సిస్ అనే మొక్కను పోలి ఉందని.. కానీ కొన్ని లక్షణాల్లో వైవిధ్యం ఉండటంతో కొత్త మొక్కగా తేల్చామని పరిశోధక బృందం తెలిపింది. ఈ మొక్కల సంఖ్య చాలా తక్కువగా ఉండటం, కేవలం రెండు ప్రాంతాల్లోనే లభ్యమవుతుండటంతో అంతరించిపోతున్న మొక్కల జాబితా కింద చెప్పవచ్చన్నారు.కొత్త మొక్కను కనుగొన్న పరిశోధక బృందాన్ని ఉన్నతవిద్యా శాఖ కమిషనర్ నవీన్మిట్టల్ అభినందించారు. మరింత అధ్యయనం చేస్తాం.. నల్లమలలో కనుగొన్న కొత్త మొక్కపై మరింత అధ్యయనం అవసరమని సదాశివయ్య చెప్పారు. ఈ మొక్క సుమారు 30 సెంటీమీటర్ల పొడవు పెరిగి, మొత్తం పాల వంటి లేటెక్స్ (చిక్కని ద్రవం) ను కలిగి ఉంటుందన్నారు. ఈ మొక్క ఔషధ గుణాలు కలిగి ఉండే అవకాశాలు ఎక్కువన్నారు. గత నాలుగేళ్లలో తెలంగాణ అడవుల్లో 5 కొత్త మొక్కలను కనుగొన్నామని, రాష్ట్రంలో మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అటవీ ప్రదేశాలు చాలా ఉన్నాయని వివరించారు. కాగా.. నల్లమల అటవీప్రాంతం జీవ వైవిధ్యానికి కేంద్రమని, గతంలో అనేక ఇబ్బందికర పరిస్థితులు ఉండటం వల్ల పరిశోధనలు జరగలేదని నాగర్కర్నూల్ డీఎఫ్ఓ రోహిత్ గోపిడి చెప్పారు. ప్రస్తుతం మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేసే అవకాశం ఉందన్నారు. -
16 నెలల్లో ఏపీలో అరబిందో ప్లాంటు
హైదరాబాద్: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్న బెంజైల్పెన్సిలిన్ తయారీ ప్లాంటు 2024 మార్చి నాటికి సిద్ధం కానుంది. ఈ ప్రాజెక్టుకు కంపెనీ రూ.2,000 కోట్లు వెచ్చిస్తోంది. ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు అయింది. 15,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద ఈ ప్లాంటుకు ఆమోదం లభించింది. పైలట్ ప్రాతిపదికన తయారీ 2023 అక్టోబర్ నుంచి మొదలవుతుందని అరబిందో ఫార్మా సీఎఫ్వో ఎస్.సుబ్రమణియన్ తెలిపారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో యూఎస్ఏలో 20కిపైగా ఉత్పత్తులను విడుదల చేసే అవకాశం ఉందని అరబిందో అనుబంధ కంపెనీ యూగియా ఫార్మా స్పెషాలిటీస్ సీఈవో యుగంధర్ పువ్వాల తెలిపారు. తక్కువ పోటీ ఉన్న ఉత్పత్తులకు ఆమోదం లభించే చాన్స్ ఉందన్నారు. చదవండి: ఆకాశమే హద్దురా.. అక్కడి ప్లాట్ ధరలకు రెక్కలు.. ఏకంగా 5 రెట్లు పెరగడంతో.. -
‘రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్’గా రామ్కీ ఎన్విరో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సమగ్ర పర్యావరణ నిర్వహణ సర్వీసులు అందించే రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ పేరు మారింది. ’రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్’గా దీన్ని రీబ్రాండ్ చేస్తున్నట్లు సంస్థ సీఈవో, ఎండీ గౌతమ్ రెడ్డి తెలిపారు. వచ్చే రెండు నెలల్లో దేశీయంగా తమ తొలి ఈ–వేస్ట్ రిఫైనింగ్ ప్లాంటును హైదరాబాద్లో ఆవిష్కరిస్తున్నట్లు ఆయన వివరించారు. వాహనాల స్క్రాపింగ్కు సంబంధించి తమ తొలి ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్ (ఈఎల్వీ) రీసైక్లింగ్ ప్లాంటు .. న్యూఢిల్లీలో వచ్చే ఆరు నెలల్లో ఏర్పాటవుతోందని గౌతమ్ రెడ్డి తెలిపారు. అలాగే ముంబై, బెంగళూరు, హైదరాబాద్లో కూడా ఈఎల్వీ ప్లాంట్లను ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నట్లు ఆయన వివరించారు. వీటి ఏర్పాటుకు ఒక్కో దానికి రూ. 100 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. ‘ప్రస్తుతం భారత్ .. రీసైక్లింగ్ కోసం ఈ–వ్యర్థాలను యూరప్నకు ఎగుమతి చేస్తోంది. మేము హైదరాబాద్లో ఈ–వేస్ట్ రిఫైనింగ్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నాం. ఇది రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుంది. రిఫైనింగ్ ప్రక్రియలో మదర్బోర్డులను ప్రాసెస్ చేసి .. బంగారం, ప్లాటినం, పల్లాడియం వంటి విలువైన లోహాలను రాబడతాం‘ అని ఆయన చెప్పారు. రూ. 5 వేల కోట్ల పెట్టుబడులు .. రాబోయే మూడేళ్లలో రూ. 5 వేల కోట్ల మేర పెట్టుబడి వ్యయాలు చేయనున్నట్లు గౌతమ్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతానికైతే పబ్లిక్ ఇష్యూకి వెళ్లే యోచనేదీ లేదని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు దాదాపు రూ. 3,000 కోట్లుగాను, లాభాలు సుమారు రూ. 550 కోట్ల స్థాయిలోను ఉండగలవని అంచనా వేస్తున్నట్లు గౌతమ్ రెడ్డి వివరించారు. భారత్, సింగపూర్, మధ్య ప్రాచ్య దేశాల్లో.. కంపెనీ ఏటా 6–7 మిలియన్ టన్నుల మేర ఘన వ్యర్ధాలను ప్రాసెస్ చేస్తోంది. -
ఇండియన్ ఆయిల్ మెగా ప్లాంట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) భారీ స్థాయిలో మలీక్ అన్హైడ్రైడ్ ప్లాంట్ను రూ.3,681 కోట్లతో ఏర్పాటు చేస్తోంది. పాలిస్టర్ రెసిన్స్, సర్ఫేస్ కోటింగ్స్ ప్లాస్టిసైజర్స్, అగ్రోకెమికల్స్, లూబ్రికెంట్ అడిటివ్స్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకై హర్యానాలోని పానిపట్ వద్ద ఉన్న సంస్థకు చెందిన రిఫైనరీ, పెట్రోలియం కాంప్లెక్స్ వద్ద ఈ కేంద్రాన్ని స్థాపించనుంది. 54 నెలల్లో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఏటా 1,20,000 టన్నుల తయారీ సామర్థ్యంతో ఇది రానుంది. -
కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం మొక్కను కనుగొన్నారు. అండమాన్ దీవుల్లో ఉన్న అర్చిపెలాగో దీవిలో కనుగొన్న ఆ మొక్కకు వృక్ష శాస్త్రజ్ఞులు ఓ పేరు పెట్టారు. ఆ మొక్కతో పాటు ఆ పేరు కూడా ఎంతో ఆకట్టుకుంటోంది. ఆ మొక్క పేరే ‘జలకన్య’. ఆంగ్లంలో అయితే మెరమైడ్ (Meramaid). అయితే ఈ మొక్కను కనుగొని రెండేళ్లయినా అది కొత్త రకం మొక్క అని చెప్పడానికి ఇన్నాళ్లు పట్టిందట. ఆసక్తిగొలుపుతున్న ఈ మొక్క వివరాలు తెలుసుకోండి. 2019లో అర్చిపెలాగో దీవిలో వృక్ష శాస్త్రవేత్తలు పర్యటించారు. ఆ సమయంలో ఆ దీవుల్లో ఆల్గేకు చెందిన కొత్త జాతిని గుర్తించారు. నాలుగు దశాబ్దాల్లో ఇది మొదటిగా పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. 18 నెలల పాటు ఆ మొక్కపై పరిశోధనలు చేశారు. ఆ మొక్క డీఎన్ఏను అధ్యయనం చేసి ఆల్గె జాతికి చెందిన మొక్కగా నిర్ధారించారు. మొక్కకు మెరమైడ్ అని నామకరణం చేసిన శాస్త్రజ్ఞులు మొక్కకు శాస్త్రీయ నామం ‘అసిటబులేరియా’ అని పెట్టారు. జలకన్య అంటే సముద్ర దేవత అని అర్థం. ఈ కొత్త మొక్క అందంగా ఉంది. ఆకు తక్కువ మందంలో ఉండి సున్నితంగా ఉంది. దీంతో గొడుగుల మాదిరి ఆకులు ఉండడం విశేషం. ఆ గొడుగుల్లోనే జలకన్య కనిపిస్తోందని.. అందుకే ఆ పేరు పెట్టినట్లు పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ ఫెక్లీ బస్త్ వివరించారు. ఈ మొక్క ఒకే బక్క భారీ కణంతో తయారైనట్లు తెలిపారు. -
ఇంజెక్టబుల్స్ సామర్థ్యం పెంచుతున్న అరబిందో
న్యూఢిల్లీ: ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా ఇంజెక్టబుల్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచుతోంది. యూఎస్లో కొత్త ప్లాంటు నిర్మాణం పూర్తి చేసింది. మరో కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వద్ద ఏర్పాటు చేస్తోంది. ఈ ఫెసిలిటీ పూర్తి కావడానికి 15–18 నెలల సమయం పడుతుందని 2020–21 వార్షిక నివేదికలో అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ కె.నిత్యానంద రెడ్డి తెలిపారు. ‘కోవిడ్–19 వ్యాక్సిన్ వాణిజ్యీకరణకై సామర్థ్యాలను పెంచుకుంటున్నాం. మల్టీటోప్ పెప్టైడ్ ఆధారిత కోవిడ్–19 వ్యాక్సిన్ యూబీ612 అభివృద్ధి, వాణిజ్యీకరణ, తయారీ కోసం యూఎస్కు చెందిన వ్యాక్సినిటీతో ప్రత్యేక లైసెన్స్ ఒప్పందం చేసుకున్నాం. తైవాన్లో వ్యాక్సినిటీ చేపట్టిన వ్యాక్సిన్ రెండవ దశ ఔషధ ప్రయోగాలు సెప్టెంబరుకల్లా పూర్తి కానున్నాయి. భారత్లో రెండు, మూడవ దశ ఔషధ పరీక్షలకు ఈ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. వ్యాక్సిన్ల తయారీ ప్లాంటు సిద్ధం అయింది’’ అని తెలిపారు. -
రూ. 500 కోట్లతో పోకర్ణ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్వాంట్రా బ్రాండ్లో క్వార్జ్ సర్ఫేసెస్ తయారీలో ఉన్న పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ కొత్త ప్లాంటును ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సమీపంలోని మేకగూడ వద్ద 6,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నెలకొల్పారు. వార్షిక తయారీ సామర్థ్యం 86 లక్షల చదరపు అడుగులు. బుధవారం ఈ ఫెసిలిటీలో ఉత్పత్తి మొదలైంది. జంబో, సూపర్ జంబో సైజులో స్లాబ్స్ తయారు చేసేందుకు ఇటలీకి చెందిన బ్రెటన్ అభివృద్ధి చేసిన బ్రెటన్స్టోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. స్టూడియో డిజైన్స్తోపాటు సహజత్వం ఉట్టిపడేలా ఉత్పత్తుల తయారీకి అత్యాధునిక రోబోలను రంగంలోకి దింపారు. క్వార్జ్ సర్ఫేసెస్ తయారీలో ప్రపంచంలోని భారీ తయారీ కేంద్రాల్లో ఇదీ ఒకటని కంపెనీ సీఈవో పరాస్ కుమార్ జైన్ తెలిపారు. ఆదాయం రూ.200 కోట్లు: కొత్త కేంద్రానికి రూ.500 కోట్లు పెట్టుబడి చేశామని పోకర్ణ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ‘ఈ ఫ్యాక్టరీ ద్వారా ప్రస్తుతం 150 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య రెండింతలు కానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నూతన ప్లాంటు ద్వారా రూ.200 కోట్ల ఆదాయం ఆశిస్తున్నాం. కొత్త ఫెసిలిటీ చేరికతో సంస్థ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.5 కోట్ల చదరపు అడుగులకు చేరింది’ అని చెప్పారు. పోకర్ణ ఇప్పటికే వైజాగ్ వద్ద ఇటువంటి ప్లాంటును నిర్వహిస్తోంది. -
కొత్త మొక్కను కనుగొన్న ఎస్వీయూ శాస్త్రవేత్తలు
యూనివర్సిటీ క్యాంపస్(చిత్తూరు జిల్లా) : శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వృక్ష శాస్త్ర విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు శివరామకృష్ణ, యుగంధర్, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన కేటగిరీ–ఈ శాస్త్రవేత్త డాక్టర్ లాల్జీ సింగ్ ‘క్రోటాలేరియా లామెల్లిఫారి్మస్’ అనే నూతన మొక్కను కనుగొన్నారు. తమ పరిశోధనల్లో భాగంగా తూర్పు కనుమల ప్రాంతంలోని చిత్తూరు జిల్లా కైలాస కోన, పూడి ప్రాంతాల్లో ఈ మొక్కను గుర్తించారు. ఈ విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ప్రచురించింది. దీనిపై విస్తృత పరిశోధనలు చేయగా ఈ మొక్క ఎర్ర నేలల్లో పెరుగుతుందని, గడ్డిలో కలిసి ఉంటుందని తేలింది. శివరామకృష్ణ మాట్లాడుతూ ఈ మొక్క గడ్డిలో కలిసిపోయి పగటి పూట సరిగా కనిపించదన్నారు. 10 సెం.మీ ఎత్తు పెరుగుతుందని తెలిపారు. పుత్తూరు సమీపంలోని దుర్గం ప్రాంతంలోనూ ఈ మొక్కలున్నట్టు తాజాగా గుర్తించామన్నారు. దీని ఇతర లక్షణాలపై భవిష్యత్ పరిశోధనలు చేస్తామని శివరామకృష్ణ, యుగంధర్ తెలిపారు. చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు అక్రమాల పుట్ట ‘అమరావతి’ -
ఏపీలో 1,200 కోట్లతో ఎంఎస్ఏఎఫ్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టీల్ తయారీలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ (ఎంఎస్ఏఎఫ్) కొత్తగా అత్యాధునిక స్టీల్ ప్లాంటును నెలకొల్పుతోంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద 4 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది ఏర్పాటవుతోంది. ఇందుకోసం సంస్థ రూ.1,200 కోట్లు పెట్టుబడి చేస్తోంది. తద్వారా 1,800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్లాంటు సిద్ధమవుతుందని కంపెనీ డైరెక్టర్ గౌతమ్ గనెరివాల్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఇప్పటికే సంస్థకు తెలంగాణ, ఏపీలో మూడు ప్లాంట్లు ఉన్నాయి. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.50 లక్షల మెట్రిక్ టన్నులు. వీటి సా మర్థ్యం 2021లో 2.5 లక్షల మెట్రిక్ టన్నులకు చేరనుంది. ప్రస్తుతం సంస్థలో 8,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. గ్రూప్ టర్నోవర్ రూ.2,100 కోట్లు. కంపెనీ నుంచి కొత్త ఉత్పాదన.. ఎంఎస్ఏఎఫ్ కొత్తగా ఎంఎస్ లైఫ్ 600 ప్లస్ పేరుతో భూకంపాలను తట్టుకునే టీఎంటీ బార్స్ను అందుబాటులోకి తెచ్చింది. సొంతంగా తామే దీనిని అభివృద్ధి చేశామని, ఇటువంటి ఉత్పాదన దేశంలో తొలిసారి అని కంపెనీ డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని తూప్రాన్ వద్ద ఉన్న ప్లాంటులో తయారు చేస్తున్నట్టు చెప్పారు. ఎంఎస్ లైఫ్ 600, ఏఎఫ్ స్టార్ 500–డి పేరుతో స్టీల్ ఉత్పత్తులను దక్షిణాదిన 750 చానెల్ పార్ట్నర్స్ ద్వారా కంపెనీ విక్రయిస్తోంది. గంగవరం, కృష్ణపట్నం పోర్టు, హైదరాబాద్, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు స్టీల్ను సరఫరా చేసింది. -
భువనగిరి వద్ద ఏజీఐ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంటెయినర్ గ్లాస్ బాటిళ్ల తయారీ సంస్థ ఏజీఐ గ్లాస్ప్యాక్ హైదరాబాద్ సమీపంలోని భువనగిరి వద్ద కొత్త ప్లాంటును నెలకొల్పుతోంది. ఇందుకోసం కంపెనీ మాతృ సంస్థ అయిన హెచ్ఎస్ఐఎల్ రూ.220 కోట్లు పెట్టుబడి చేస్తోంది. 15 ఎకరాల్లో స్థాపిస్తున్న ఈ నూతన కేంద్రం 2022 సెప్టెంబర్ చివరికి కార్యరూపం దాల్చనుందని హెచ్ఎస్ఐఎల్ వైస్ చైర్మన్ సందీప్ సొమానీ తెలిపారు. రోజుకు 150 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. ఔషధాలు, సుగంధ పరిమళాలు, సౌందర్య సాధనాలు, ఖరీదైన మద్యం ప్యాకింగ్ కోసం హై ఎండ్ స్పెషాలిటీ గ్లాస్ బాటిళ్లను ఇక్కడ తయారు చేస్తారు. ఫర్నేస్తోపాటు అయిదు తయారీ లైన్లు ఏర్పాటు కానున్నాయి. యూఎస్ఏ, ఆ స్ట్రేలియా, యూరప్ దేశాలకు సైతం ఎగుమతి చేయ నున్నారు. 1972లో ప్రారంభమైన ఏజీఐ గ్లాస్ప్యాక్.. ముడి సరుకు లభ్యత దృష్ట్యా హైదరాబాద్లోని సనత్నగర్తోపాటు భవనగిరిలో ప్లాంట్లను నిర్వహిస్తోంది. వీటి సామర్థ్యం రోజుకు 1,600 టన్నులు. కంపెనీ వార్షికాదాయం రూ.1,300 కోట్లు. సుమారు 3,000 మంది ఉద్యోగులున్నారు. 5 నుంచి 4,000 మిల్లీలీటర్ల సామర్థ్యం గల బాటిళ్లను ఉత్పత్తి చేస్తోంది. -
విశాఖలో యోకొహామా టైర్ల ప్లాంట్
ముంబై: జపాన్ దిగ్గజం యోకొహామా గ్రూప్లో భాగమైన అలయన్స్ టైర్ గ్రూప్ (ఏటీజీ) విశాఖలో తమ టైర్ల ప్లాంటు ఏర్పాటు చేయనుంది. దీనిపై 165 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,240 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. 2023 తొలి త్రైమాసికంలో ఇది అందుబాటులోకి రాగలదని యోకొహామా ఇండియా చైర్మన్, ఏటీజీ డైరెక్టర్ నితిన్ మంత్రి వెల్లడించారు. దీనితో కొత్తగా 600 ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆఫ్–హైవే టైర్ల తయారీ సంస్థ అయిన ఏటీజీకి ప్రస్తుతం 5,500 మంది సిబ్బంది ఉన్నారు. దేశీయంగా గుజరాత్లోని దహేజ్, తమిళనాడులోని తిరునల్వేలిలో రెండు ప్లాంట్లు ఉన్నాయి. విశాఖలో ఏర్పాటు చేసేది మూడోది అవుతుంది. తాము గత మూడేళ్లుగా ఫ్యాక్టరీకి అనువైన ప్రాంతాన్ని అన్వేషిస్తున్నామని, కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తికి ముందే వైజాగ్ను ఎంపిక చేసుకున్నామని తెలి పారు. ఏటీజీకి ఇజ్రాయెల్లో 45,000 టన్నుల ప్లాంటుతో పాటు ప్రధాన అభివృద్ధి, పరిశోధన (ఆర్అండ్డీ) కేంద్రమూ ఉంది. దేశీయంగా తమిళనాడు ప్లాంటులోనూ ఆర్అండ్డీ సెంటర్ ఉంది. పెరగనున్న ఉత్పత్తి సామర్థ్యం.. అచ్యుతాపురం పారిశ్రామిక పార్కులోని స్పెషల్ ప్రాజెక్టుల జోన్లో ఏర్పాటు చేసే ఈ ప్లాంట్లో ఆఫ్–హైవే టైర్లను తయారు చేయనున్నారు. దీని రోజువారీ సామర్థ్యం 55 టన్నులు (రబ్బరు బరువు)గా ఉండనుంది. ప్రస్తుతం రెండు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2.3 లక్షల టన్నులుగా ఉండగా, ఈ ఫ్యాక్టరీతో మరో 20,000 టన్నులు పెరగనుంది. దహేజ్, తిరునల్వేలి ఫ్యాక్టరీలు ప్రధానంగా మూడు ఆఫ్–హైవే టైర్ల బ్రాండ్లు తయారు చేస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల కోసం అలయన్స్ పేరిట, నిర్మాణ.. పారిశ్రామిక ఉత్పత్తుల కోసం గెలాక్సీ పేరిట, అటవీ ప్రాంతాల్లో వినియోగించే వాహనాల కోసం ప్రైమెక్స్ పేరిట టైర్లను ఉత్పత్తి చేస్తున్నాయి. 90 శాతం ఉత్పత్తిని 120 పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. యోకొహామా గ్రూప్నకు జపాన్, ఇండియా, ఇజ్రాయెల్, వియత్నాంలలో ఎనిమిది ఆఫ్–హైవే ప్లాంట్లు ఉన్నాయి. 2016లో ఏటీజీని కొనుగోలు చేసింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 3,000 రకాల టైర్లను విక్రయిస్తోంది. -
నౌకాశ్రయం ఉన్న చోటే ఓరియంట్ ఎలక్ట్రిక్ కొత్త ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సీకే బిర్లా గ్రూప్కు చెందిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఓరియంట్ ఎలక్ట్రిక్ దక్షిణాదిలో నూతన ప్లాంట్ను నెలకొల్పనుంది. ఇప్పటికే బోర్డ్ ఆమోదం పూర్తయిందని, ఎగుమతులకు వీలుగా ఉండే నౌకాశ్రయం ఉన్న రాష్ట్రంలోనే గ్రీన్ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయించామని కంపెనీ సీఈఓ రాకేష్ ఖన్నా తెలిపారు. స్థానిక ప్రభుత్వ విధానాలు, కార్మికుల నైపుణ్యత, అందుబాటులో స్థల లభ్యత వంటివి ప్లాంట్ ఏర్పాటులో ప్రధాన అంశాలని ఆయన పేర్కొన్నారు. కొత్త ప్లాంట్లో తొలి దశలో ఫ్యాన్లను మాత్రమే ఉత్పత్తి చేస్తామని, ఆ తర్వాత ఎయిర్ కూలర్లు, ఇతర గృహోపకరణాల తయారీ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఓరియంట్ ఎలక్ట్రిక్కు కోల్కతా, ఫరీదాబాద్, నోయిడా, గౌహతీలో నాలుగు ప్లాంట్లున్నాయి. 40 అంతర్జాతీయ మార్కెట్లకు ఫ్యాన్లను ఎగుమతి చేస్తుంది. మార్కెట్లోకి కొత్త ఎయిర్ కూలర్లు.. బుధవారమిక్కడ ఎనర్జీ ఇఫీషియన్సీ ఇన్వెర్టర్ ఎయిర్ కూలర్లను ప్రవేశపెట్టిన సందర్భంగా హోమ్ అప్లియెన్సెస్ బిజినెస్ హెడ్ సలీల్ కపూర్తో కలిసి రాకేష్ ఖన్నా విలేకరులతో మాట్లాడారు. ఈసీఎం టెక్నాలజీతో నడిచే ఈ కూలర్లతో 50 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుందని తెలిపారు. ఐవోటీ ఆధారిత ఈ ఎయిర్ కూలర్లను స్మార్ట్ఫోన్ లేదా అలెక్సాతో నియంత్రణ చేసుకోవచ్చు. 8 లీటర్ల నుంచి 105 లీటర్ల వరకు 54 రకాల ఎయిర్ కూలర్లున్నాయి. వీటి ధరల శ్రేణి రూ.5,190 నుంచి రూ.19,900 మధ్య ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 25 శాతం మార్కెట్ వాటా.. దేశవ్యాప్తంగా ఏటా 29 లక్షల ఓరియంట్ ఎలక్ట్రిక్ ఎయిర్ కూలర్లు విక్రయమవుతుంటే.. ఇందులో 4.7 లక్షల యూనిట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనే జరుగుతున్నాయి. ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లు, గృహోపకరణాలు అన్ని కలిపి ఏపీ, తెలంగాణలో 18–19 శాతం మార్కెట్ వాటా ఉందని, రెండేళ్లలో 25 శాతం మార్కెట్ వాటాను లకి‡్ష్యంచామన్నారు. ఓరియంట్ ఎలక్ట్రిక్ నుంచి లైటింగ్, హోమ్ అప్లయెన్సెస్, స్విచ్ గేర్స్ వంటి ఉత్పత్తులు కూడా ఉన్నాయి. 450 నగరాల్లో సుమారు 4 వేల మంది డీలర్లు, 1.25 లక్షల రిటైల్ ఔట్లెట్లున్నాయి. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా ఎక్స్క్లూజివ్ ఔట్లెట్లను తెరవనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బెంగళూరు, ఎన్సీఆర్, చండీఘడ్ నగరాల్లో మాత్రమే ఉన్నాయి. -
తెలంగాణలో హట్సన్ ఐస్క్రీమ్ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చెన్నైకి చెందిన పాలు, పాల ఉత్పత్తుల కంపెనీ హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్... తెలంగాణలో అతిపెద్ద ఐస్క్రీమ్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. రూ.207 కోట్ల పెట్టుబడులతో సంగారెడ్డి జిల్లాలోని గోవింద్పూర్లో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 250 మందికి ఉద్యోగాలతో పాటు, పరోక్షంగా మరో 250 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, స్థానికంగా ఉన్న సుమారు 4 వేల మంది పాడి రైతులు ప్రయోజనం పొందుతారని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ప్లాంట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది అక్టోబర్ నాటికి ప్లాంట్ కార్యకలాపాలు ఆరంభమవుతాయని పేర్కొంది. హట్సన్ సంస్థ అరుణ్ ఐస్ క్రీమ్, హట్సన్, ఆరోక్య మిల్క్, ఐబాకో ఐస్క్రీమ్స్, ఓయాలో, అనీవా, సంటోసా బ్రాండ్లతో పాలు, పెరుగు, ఐస్క్రీమ్స్, నెయ్యి, పన్నీర్ వంటి అన్ని రకాల పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ కార్యకలాపాల్లో ఉంది. మన దేశంలో విక్రయించడంతో పాటు అమెరికా, మధ్యప్రాచ్యం వంటి 38 దేశాలకు ఎగుమతులూ చేస్తోంది. -
టెక్నో పెయింట్స్ మరింత కలర్ఫుల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెయింట్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ టెక్నో పెయింట్స్ 1,800 రకాల కొత్త రంగులను పరిచయం చేసింది. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, ఇన్ఫ్రారెడ్ రిఫ్లెక్టివ్ పెయింట్లు కూడా ఉన్నాయి. దిగ్గజ కంపెనీలకు ధీటుగా కలర్ స్పెక్ట్రాను రూపొందించింది. దీని ద్వారా నచ్చిన రంగులు ఎంచుకోవడానికి కస్టమర్లకు మరింత సులువు అవుతుందని టెక్నో పెయింట్స్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డైరెక్టర్లు సీవీఎల్ఎన్ మూర్తి, సత్యనారాయణ రెడ్డి, సీఈవో కె.అనిల్తో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది డీలర్ నెట్వర్క్ ద్వారా రిటైల్ విభాగంలోకి ప్రవేశిస్తామన్నారు. ఇప్పటికే 30 కోట్ల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో ప్రాజెక్టులకు రంగులు అందించామని పేర్కొన్నారు. రూ.250 కోట్ల ఆర్డర్ బుక్ ఉందని వెల్లడించారు. రెండింతలకు సామర్థ్యం..: ప్రస్తుతం టెక్నో పెయింట్స్కు అయిదు ప్లాంట్లున్నాయి. వీటన్నిటి వార్షిక సామర్థ్యం 42,000 మెట్రిక్ టన్నులు. ఆరవ ప్లాంటును హైదరాబాద్ సమీపంలోని సుల్తాన్పూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో నెలకొల్పుతున్నారు. 3 ఎకరాల విస్తీర్ణంలో రానున్న ఈ ప్లాంటు కోసం రూ.25 కోట్ల పెట్టుబడి చేస్తున్నట్టు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ‘ఏడాదిలో సిద్ధం కానున్న కొత్త ప్లాంటుతో సామర్థ్యం రెండింతలకు చేరుతుంది. నూతనంగా 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 2018–19లో రూ.62 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.90 కోట్లు ఆశిస్తున్నాం. రెండేళ్లలో రూ.250 కోట్ల టర్నోవర్ లక్ష్యం. ఆఫ్రికాలో సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నాం. దక్షిణాదితోపాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో సేవలు అందిస్తున్నాం. త్వరలో దేశవ్యాప్తంగా విస్తరిస్తాం’ అని వివరించారు. -
దక్షిణాదిన ఓరియంట్ ఎలక్ట్రిక్ ప్లాంటు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఓరియంట్ ఎలక్ట్రిక్ దక్షిణాదిన ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న అయిదు ప్లాంట్లలో వినియోగం పూర్తి స్థాయికి చేరుకున్నందున కొత్త ఫెసిలిటీ అవసరమని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ జైన్ వెల్లడించారు. ఎలిగంజా సిరీస్ ఉత్పత్తులను ఇక్కడ ప్రవేశపెట్టిన సందర్భంగా గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపాదిత ప్లాంటును ఎక్కడ, ఎంత మొత్తంతో ఏర్పాటు చేసేదీ త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ కేంద్రంలో ఫ్యాన్లతోపాటు ఇతర ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఉత్పత్తి చేస్తామన్నారు. కాగా, ఎలిగంజా సిరీస్లో ఫ్యాన్తో కూడిన షాండెలియర్స్ను ఆవిష్కరించారు. ధరల శ్రేణి రూ.17,500–23,500 మధ్య ఉంది. ప్రీమియం ఫ్యాన్ల విపణిలో ఓరియంట్కు 50 శాతం మార్కెట్ వాటా ఉందని కంపెనీ బ్రాండ్ హెడ్ అన్షుమన్ చక్రవర్తి తెలిపారు. ఓరియంట్ ఎలక్ట్రిక్ 2018–19లో సుమారు రూ.2,000 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో 20 శాతం వృద్ధి నమోదు చేసింది. -
ఆంధ్రప్రదేశ్లో జీపీఎస్ ట్రాకర్స్ తయారీ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీపీఎస్, ఐవోటీ పరికరాల తయారీ సంస్థ వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్... ఆంధ్రప్రదేశ్లో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. మంగళగిరి సమీపంలో రానున్న ఈ కేంద్రానికి కంపెనీ రూ.50 కోట్ల దాకా వెచ్చించనుంది. రోజుకు 2,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేస్తామని, 2020 జూలై నాటికి తయారీ ప్రారంభమవుతుందని వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్ ఫౌండర్ కోణార్క్ చుక్కపల్లి చెప్పారు. సేల్స్ డైరెక్టర్ పి.ఆర్.రాజారామ్తో కలిసి సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్లాంటులో ఏఐఎస్ 140 ప్రమాణాలు గల జీపీఎస్ పరికరాలను రూపొందిస్తామని, ఈ కేంద్రం ద్వారా 400–500 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. హైదరాబాద్ ప్లాంటు సామర్థ్యం రోజుకు 1,000 యూనిట్లని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. పరికరాలకు భారీ డిమాండ్..: నవంబర్ 26 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్ ట్రాకర్ల వాడకం తప్పనిసరి చేశారు. 25,000 వాహనాల దాకా ఇసుక రవాణాలో నిమగ్నమై ఉన్నట్లు కోణార్క్ తెలిపారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏఐఎస్ 140 ధ్రువీకరణ పొందిన ఏకైక కంపెనీ మాదే. ఏపీలో ఉన్న డిమాండ్ కంపెనీకి కలిసొస్తుంది. భారత్తో పాటు పలు దేశాల్లో ఇప్పటికి 2 లక్షల పైగా పరికరాల్ని విక్రయించాం. ప్రజా రవాణా వాహనాల్లో జీపీఎస్ ట్రాకర్ల వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019–20)లో 2 లక్షలకుపైగా యూనిట్లను విక్రయించాలని లకి‡్ష్యంచాం. ఏప్రిల్–సెప్టెంబర్లో 70,000 యూనిట్లు విక్రయించాం. ఏపీ ప్లాంటు కోసం వచ్చే ఏడాది మే నాటికి రూ.35 కోట్ల దాకా నిధులు సమీకరించనున్నాం’ అని కోణార్క్ వివరించారు. -
‘సోలార్’.. కేరాఫ్ ప్రాకృతిక్ పవర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌర విద్యుత్ ఆవశ్యకత మనకు తెలిసిందే! కానీ, విద్యుత్ ఫలకాల ఏర్పాటు నుంచి కొనుగోలు, ఇన్స్టలేషన్, నిర్వహణ, ప్రభుత్వ రాయితీలు తీసుకోవటం వరకూ ప్రతిదీ పెద్ద పనే. పెద్ద స్థాయిలో సోలార్ పవర్ను ఏర్పాటు చేసే కార్పొరేట్ సంస్థలకైతే మరీనూ. జస్ట్! వీటన్నింటికీ సింపుల్ సొల్యూషన్ అందిస్తోంది ప్రాకృతిక్ పవర్. ‘హర్ఘర్సోలార్.కామ్’ పేరిట సేవలందిస్తున్న ఈ స్టార్టప్ గురించి మరిన్ని వివరాలు కంపెనీ కో–ఫౌండర్, విశాఖపట్నానికి చెందిన తెలుగమ్మాయి సాహిత్య సింధు ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. అవి ఆమె మాటల్లోనే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల వివరాలను ప్రజలకు చేరవేసే సోషల్ స్టార్టప్ ఇండియన్ ఐరిస్ మాదే. ఈ క్రమంలో చాలా లీడ్స్ సోలార్ పవర్ ఏర్పాటు, ప్రభుత్వ రాయితీల గురించి వచ్చేవి. అప్పుడే అనిపించింది.. మనమే ప్రత్యేకంగా సౌర విద్యుత్ సొల్యూషన్స్ సార్టప్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందా అని? ఇంకేముంది! మహీందర్ సింగ్ రావు, నారాయణ్ సింగ్ రావుతో కలిసి నోయిడా కేంద్రంగా గతేడాది హర్ఘర్సోలార్.కామ్ను ప్రారంభించాం. వ్యక్తిగత, కార్పొరెట్ అవసరాలకు అనుగుణంగా సోలార్ పవర్ ఏర్పాటు, నిర్వహణ, రాయితీలు అన్నీ ఒకేచోట అందించడమే మా ప్రత్యేకత. 100కు పైగా క్లయింట్స్.. ప్రస్తుతం తెలంగాణ, ఒరిస్సా, రాజస్తాన్, యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో 100కి పైగా వ్యక్తిగత, కార్పొరేట్ క్లయింట్లు ఉన్నారు. సుమారు 6,135.7 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్లను నిర్వహిస్తున్నాం. వీటి విలువ రూ.16 కోట్లు. త్వరలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో పలు ప్రాజెక్ట్లను చేపట్టనున్నాం. సెంట్రల్ ఆఫ్రికాలో 25 మెగావాట్ల రెండు ప్రాజెక్ట్లతో చర్చలు జరుగుతున్నాయి. సోలార్ పవర్ ఒప్పందాలు.. మా క్లయింట్ల జాబితాలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు కూడా ఉన్నాయి. హైదరాబాద్లోని డ్రైల్యాండ్ అగ్రికల్చర్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జోధ్పూర్లోని నిఫ్ట్, ఢిల్లీలోని అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, భరత్పూర్లోని డైరెక్టరేట్ ఆఫ్ ర్యాప్సీడ్ మస్టర్డ్ రీసెర్చ్ వంటివి ఉన్నాయి. టాటా పవర్, రెన్వైస్, వరీ సోలార్, విక్రమ్ సోలార్ వంటి 10 మంది సోలార్ ప్రొవైడర్లతో ఒప్పందం చేసుకున్నాం. ఇన్వెర్టర్ల కోసం పాలీక్యాబ్, డెల్టా, ఏబీబీ, ప్రోనిస్ కంపెనీలతో, ప్యానెల్స్ కోసం ఎన్కే సోలార్, మెహర్ సోలార్లతో ఒప్పందాలున్నాయి. రూ.60 లక్షల టర్నోవర్.. ప్రస్తుతం మా కంపెనీలో 15 మంది శాశ్వత ఉద్యోగులున్నారు. మా క్లయింట్లకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రూ.5 కోట్ల రాయితీలందించాం. గతేడాది రూ.60 లక్షల టర్నోవర్ను నమోదు చేశాం. వచ్చే ఏడాది కాలంలో 10 మెగావాట్ల ప్రాజెక్ట్లు, రూ.20 కోట్ల టర్నోవర్కు చేరుకోవాలని లకి‡్ష్యంచాం’’ అని సింధు వివరించారు. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.comకు మెయిల్ చేయండి... -
ఏఆర్ఎల్ టైర్స్ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏఆర్ఎల్ బ్రాండ్ పేరుతో టైర్లు, ట్యూబుల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ అగర్వాల్ రబ్బర్ మరో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ సమీపంలోని సదాశివపేట వద్ద 40 ఎకరాల్లో రూ.225 కోట్లతో దీనిని నెలకొల్పుతోంది. 2020 ఏప్రిల్ నాటికి ఈ ప్లాంటు సిద్ధమవుతుందని అగర్వాల్ రబ్బర్ సీఎండీ అమిత్ కుమార్ అగర్వాల్ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. తొలుత 80 టన్నుల రోజువారీ ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభించి, 300 టన్నుల స్థాయికి తీసుకు వెళతామన్నారు. అంతర్గత వనరుల ద్వారా రూ.100 కోట్ల పెట్టుబడిని సమకూరుస్తున్నామని, కొత్త యూనిట్ ద్వారా 500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారాయన. ప్రస్తుతం కంపెనీ ఉద్యోగుల సంఖ్య 1,700. మూడేళ్లలో రూ.1,000 కోట్లు..: కంపెనీకి పటాన్చెరు, బొలారం, సదాశివపేట వద్ద ప్లాంట్లున్నాయి. 1986లో ప్రారంభమైన ఈ సంస్థ టూవీలర్లు, త్రీవీలర్లు, తేలికపాటి ట్రక్కులు, వ్యవసాయ యంత్రాల టైర్లు, ట్యూబులను ఉత్పత్తి చేస్తోంది. 2000 ఏడాది నుంచి ఏఆర్ఎల్ బ్రాండ్తో మార్కెట్లోకి వచ్చింది. భారత్లో మిలిటరీ విమానాలు, హెలికాప్టర్లకు ట్యూబులను సరఫరా చేస్తున్న ఏకైక కంపెనీ ఇదే. రోజువారీ తయారీ సామర్థ్యం 70 టన్నులు. టర్నోవర్ రూ.300 కోట్లు. ఇది మూడేళ్లలో రూ.1,000 కోట్లకు చేరుతుందని అమిత్ ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం 50 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. కొత్త ప్లాంటుతో నూతన మార్కెట్లకు విస్తరిస్తాం. విదేశాల నుంచి 50% ఆదాయం వస్తోంది’ అని వివరించారు. -
ఏపీలో అల్ట్రాటెక్ సిమెంట్ భారీ ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ అల్ట్రాటెక్... ఆంధ్రప్రదేశ్లో భారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి సంస్థకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కర్నూలు జిల్లా పెట్నికోట వద్ద రానున్న ఈ ప్రాజెక్టుకై అల్ట్రాటెక్ సుమారు రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇప్పటికే కంపెనీ 431.92 హెక్టార్ల స్థలాన్ని ప్లాంటు కోసం కొనుగోలు చేసింది. ప్రతిపాదిత ప్రాజెక్టులో భాగంగా 40 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో క్లింకర్ యూనిట్, 60 లక్షల టన్నుల సామర్థ్యంతో సిమెంటు తయారీ కేంద్రాలు ఏర్పాటవుతాయి. అలాగే ప్లాంటు అవసరాల కోసం 60 మెగావాట్ల విద్యుత్ ప్లాంటుతోపాటు తయారీ ప్రక్రియలో జనించే వేడి నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే 15 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కూడా రానుంది. 900 మందికి ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి లభించనుందని సమాచారం. ప్రాజెక్టు ఏర్పాటు, నిర్వహణకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి అల్ట్రాటెక్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. విభిన్న రంగాల్లో ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీయే అల్ట్రాటెక్ సిమెంట్. సామర్థ్యం పరంగా భారత్లో అతిపెద్ద సిమెంటు ఉత్పత్తిదారుగా నిలిచింది. అయిదు దేశాల్లో విస్తరించిన ఈ సంస్థకు ఏటా 6.8 కోట్ల టన్నుల సిమెంటు తయారీ సామర్థ్యం ఉంది. -
దక్షిణాదిన సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్లో కొడాక్, థామ్సన్ బ్రాండ్ల టీవీల తయారీ లైసెన్సున్న ‘సూపర్ ప్లాస్ట్రానిక్స్’... మరో ప్లాంటు ఏర్పాటు చేయనుంది. ఉత్తరాదిన మూడు ప్లాంట్లున్న ఈ కంపెనీ నాల్గవ యూనిట్ను దక్షిణాదిన ఏర్పాటు చేస్తామని తెలియజేసింది. ఇందుకోసం ఏపీ, తెలంగాణ, తమిళనాడు పరిశీలనలో ఉన్నాయని సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈవో అవనీత్ సింగ్ మార్వా బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు. ‘కొత్త ప్లాంటు వార్షిక సామర్థ్యం 2 లక్షల యూనిట్లు ఉంటుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైతే ఎక్కువ ప్రోత్సాహకాలిస్తుందో అక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం కంపెనీ వార్షిక తయారీ సామర్థ్యం 9 లక్షల యూనిట్లపైనే. కొడాక్, థామ్సన్ బ్రాండ్లలో 2017–18లో 2.1 లక్షల యూనిట్లు విక్రయించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 4.8 లక్షల యూనిట్లకు చేరుతుంది. కొడాక్ బ్రాండ్లో 14 మోడళ్లున్నాయి. ఈ ఏడాది కొత్తగా 8 మోడళ్లు మార్కెట్లోకి విడుదల చేస్తాం. టీవీల విపణిలో సూపర్ ప్లాస్ట్రానిక్స్కు 4 శాతం మార్కెట్ వాటా ఉంది. 2022 నాటికి వాటాను రెండింతలు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆన్లైన్లో ప్రస్తుతం టాప్–2 ప్లేయర్గా ఉన్నాం’ అని వివరించారు. -
వైజాగ్లో క్రీమ్లైన్ డెయిరీ ప్లాంటు
చెన్నై: దాదాపు రూ. 30 కోట్లతో ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో కొత్త ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు క్రీమ్లైన్ డెయిరీ సంస్థ సీఈవో పి. గోపాలకృష్ణన్ వెల్లడించారు. దీని సామర్థ్యం ఒక్క లక్ష లీటర్లు ఉంటుందని తెలిపారు. జెర్సీ బ్రాండ్ కింద ఎన్రిచ్ డీ పేరిట ఫోర్టిఫైడ్ మిల్క్ ఉత్పత్తిని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. కంపెనీ ప్రాసెసింగ్ సామర్థ్యం రోజుకు 10 లక్షల లీటర్ల మేర ఉంది. గతేడాది డిసెంబర్లో గోద్రెజ్ ఆగ్రోవెట్.. క్రీమ్లైన్ డెయిరీ ప్రోడక్ట్స్లో దాదాపు రూ. 150 కోట్లతో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. సంస్థకు హైదరాబాద్లోని రెండింటితో పాటు మొత్తం ఏడు ఫ్యాక్టరీలు ఉన్నాయి. గతేడాది గ్రూప్ ఆదాయాలు రూ.1,000 కోట్ల మేర నమోదయ్యాయి. -
రస్ అల్ ఖైమాలో మోల్డ్-టెక్ ప్లాంట్ ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రస్ అల్ ఖైమా ఫ్రీ ట్రేడ్ జోన్లో తమ కొత్త ప్లాంటును ఆవిష్కరించినట్లు మోల్డ్-టెక్ ప్యాకేజింగ్ వెల్లడించింది. ఈ నెలలోనే పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభం కాగలవని పేర్కొంది. 1,192 చ.మీ. మేర విస్తరించిన ప్లాంటు సామర్థ్యం ప్రస్తుతం 2,500-3,000 టన్నులుగా ఉంది. ప్లాంటు కార్యకలాపాల సానుకూల పనితీరు ప్రభావంతో రాబోయే మూడు, నాలుగు త్రైమాసికాల్లో మరింత వృద్ధి కనిపించగలదని కంపెనీ పేర్కొంది. మరోవైపు, ప్యాకేజింగ్ రంగానికి విశిష్ట సేవలందిస్తున్నందుకు గాను సంస్థ సీఎండీ లక్ష్మణ రావుకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ తయారీ సంస్థల అసోసియేషన్(సీపీఎంఏ) .. ఎలీట్ ప్లస్ బిజినెస్ సర్వీసెస్ గ్రూప్ ‘అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్’ అవార్డును ప్రకటించాయి. -
రాజమండ్రి దగ్గర కోకాకోలా ప్లాంటు
♦ మాజాను బిలియన్ డాలర్ల బ్రాండ్గా మారుస్తాం ♦ దీన్ని ఇంకా 80 శాతం మంది రుచి చూడలేదు ♦ కోకాకోలా ఇండియా ప్రెసిడెంట్ వెంకటేశ్ కిని ముంబై నుంచి మైలవరపు చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సమీపంలో ఉన్న గోపాలపురంలో కొత్తగా ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు కోకాకోలా ప్రకటించింది. 2023 నాటికి తమ శీతల పానీయం ‘మాజా’ బ్రాండ్ను బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలియజేసింది. మాజా బ్రాండ్ ఆరంభమై 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోకాకోలా ఇండియా ప్రెసిడెంట్ వెంకటేశ్ కిని ఈ విషయాలు చెప్పారు. దేశంలో 20 శాతం మంది మాత్రమే ఇప్పటిదాకా మాజాను రుచి చూశారని, మిగిలిన 80 శాతం మందికీ దీన్ని చేరువ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. దేశంలోని ప్రజలు సగటున నెలకు ఒకసారి మాత్రమే కూల్ డ్రింక్ తాగుతున్నారన్నారు. ఏపీలో 4కు చేరనున్నప్లాంట్ల సంఖ్య: మేకిన్ ఇండియాలో భాగంగా దేశవ్యాప్త విస్తరణకు ప్రయత్నిస్తున్నట్లు ఈ సందర్భంగా వెంకటేశ్ తెలియజేశారు. ‘‘భారత్లో విస్తరణలో భాగంగా 2012-2020 మధ్య రూ.30,000 వేల కోట్లు ఖర్చు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏపీలో కొత్త ప్లాంట్ ఏర్పాటుతో అక్కడ మొత్తం ప్లాంట్ల సంఖ్య 4కి చేరుతుంది. దీంతో దేశవ్యాప్తంగా ప్లాంట్ల సంఖ్య 58కి పెరుగుతుంది. తెలంగాణలో ప్రస్తుతం మాకు రెండు ప్లాంటున్నాయి’’ అని వివరించారు. మాజాకు 40 ఏళ్లు... పార్లే సంస్థ 1976లో తొలిసారి మాజాను భారత్కు పరిచయం చేసింది. అటు తర్వాత ఇది 1993లో కోకాకోలా ఇండియా వంశమైంది. పార్లే చేతిలో ఉన్నప్పుడు ఆరెంజ్, ఫైనాపిల్, మ్యాంగో వంటి ఫ్లేవర్లో లభ్యమయ్యే మాజా.. కోకాకోలా చేతికి వచ్చిన దగ్గరి నుంచి మ్యాంగో ఫ్లేవర్లో మాత్రమే లభిస్తోంది. అలాగే కోకాకోలాకు మాజాను కేవలం భారత్లో మాత్రమే విక్రయించే అధికారమే ఉంది. విదేశాల్లో విక్రయానికి పార్లే కోకాకోలాకు అనుమతి ఇవ్వలేదు. జైన్ ఇరిగేషన్తో భాగస్వామ్యం మామిడి రైతులకు అధిక ఆదాయం కల్పించే విధంగా కోకాకోలా.. జైన్ ఇరిగేషన్ సంస్థతో కలిసి ‘ఉన్నతి’ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా కంపెనీ చిత్తూరులో రైతులతో కలిసి 1,000 ఎకరాల్లో మామిడి పంటను సాగు చేస్తోంది. దీన్ని ఏటా 2,000 ఎకరాల చొప్పున పెంచాలని కూడా కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం ఏటా 50 వేల మంది రైతుల నుంచి 70 వేల మెట్రిక్ టన్నుల మామిడి గుజ్జును సేకరిస్తోంది. బిలియన్ బ్రాండ్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రైతుల సంఖ్య లక్షకు, అదేవిధంగా ఉత్పత్తి 1.40 లక్షల మెట్రిక్ టన్నుల స్థాయికి చేరాల్సి ఉంటుంది.