Odela 2 Movie
-
దెయ్యం సినిమాకు వసూళ్లు ఎంతొచ్చాయ్?
35 ఏళ్లొచ్చినా సరే గ్లామరస్ పాత్రలు చేస్తూ అలరిస్తున్న తమన్నా(Tamannaah Bhatia).. తొలిసారి డిఫరెంట్ గా కనిపించిన సినిమా ఓదెల 2(Odela 2 Movie). శివశక్తిగా నటించిన తమన్నా ఈ చిత్రంపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్లు ముంబై, హైదరాబాద్ లో తిరుగుతూ గట్టిగానే ప్రమోట్ చేసింది. మరి ఈ మూవీకి ఇప్పటివరకు వసూళ్లు ఎంతొచ్చాయ్?తమన్నా, వశిష్ట సింహా నటించిన ఓదెల 2 మూవీ.. రీసెంట్ గా ఏప్రిల్ 17న థియేటర్లలోకి వచ్చింది. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో తొలి రెండు రోజుల్లో రూ.2-3 కోట్ల మాత్రమే వచ్చాయనే టాక్ వినిపించింది. కానీ తాజాగా మూవీ టీమ్.. ఆదివారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. వసూళ్లని(Movie Collection) అధికారికంగా ప్రకటించింది.(ఇదీ చదవండి: స్టార్ హీరోకి ఐదేళ్ల తర్వాత హిట్.. కలెక్షన్ ఎంతొచ్చాయంటే?)మూడు రోజుల్లో రూ.6.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఇదే కార్యక్రమంలో మాట్లాడిన నిర్మాత సంపత్ నంది.. విడుదలకు ముందే ఈ చిత్ర బ్రేక్ ఈవెన్ అయిందని చెప్పుకొచ్చారు. కానీ వసూళ్లు చూస్తుంటే మొత్తానికి మొత్తం రాబడతాయా అనే సందేహం కలుగుతోంది. ఈ వీకెండ్ గడిచిన తర్వాత ఓదెల 2 అసలు సంగతేంటనేది తెలుస్తోంది. వచ్చేవారం పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ లేకపోవడం ఈ చిత్రానికి ప్లస్ అవ్వొచ్చేమో చూడాలి.ఓదెల 2 విషయానికొస్తే.. ఓదెలలో తిరుపతి(వశిష్ట సింహ) అనే కామాంధుడు.. కొత్తగా పెళ్లయిన అమ్మాయిల్ని మానభంగం చేస్తుంటాడు. దీంతో తిరుపతి భార్య అతడి తల నరికి జైలుకెళ్తుంది. కానీ తిరుపతి ఆత్మకు శాంతి కలగకుండా ఉండాలని.. సమాధిశిక్ష వేస్తారు. కొన్ని సంఘటనల వల్ల ఇతడి ప్రేతాత్మ తిరిగి ఊరిపై పడుతుంది. దీంతో శివశక్తి అలియాస్ భైరవి (తమన్నా) అనే ఓదెల ఊరికి వస్తుంది. ఆ తర్వాత దుష్టసంహారమే మిగిలిన స్టోరీ.(ఇదీ చదవండి: చాలా అసహ్యంగా నటించా.. ఇప్పుడు చూస్తే సిగ్గేస్తుంది: సమంత) -
తమన్నా ఫైనాన్షియల్ మేటర్లు ఎవరు సెట్ చేస్తారో తెలుసా..?
ఎప్పటికప్పుడు ఆమె కెరీర్ అయిపోయిందని అనుకునే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ, కమ్బ్యాక్ అవుతోంది తమన్నా భాటియా(Tamannaah Bhatia). తాజాగా ఓదెల2 చిత్రం ద్వారా శివశక్తిగా తన నటనతో దుమ్మురేపారు. తమన్నా ఒక ప్రాజెక్ట్లో ఉంటే మినిమమ్ గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి. చిత్రపరిశ్రమలోకి వచ్చి రెండు దశాబ్ధాలు దాటినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆమె గురించిన కొన్ని విషయాలు.తమన్నా ఐటమ్ సాంగ్ చేస్తే , ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో పాతుకుపోయింది. ‘జై లవకుశ’, ‘జైలర్’ ఇలా ఐటమ్ సాంగ్ చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్! ఈ మధ్య ‘స్త్రీ 2’లో కూడా ‘ఆజ్ కీ రాత్ హై’ అని చేసిన సాంగ్ సినిమా ఘన విజయానికి చాలా హెల్ప్ అయింది. జాట్లో కూడా ఆమె ఒక స్పెషల్ సాంగ్ చేశారు.తమన్నా క్రేజ్ చూసి ‘రైడ్ –2’లోనూ ఛాన్స్ ఇచ్చారు. ఇందులో ఓ పాట కోసం తమన్నాకు ఏకంగా రెండు కోట్లు ఇచ్చారని టాక్. బాలీవుడ్లో ఆమెకు ఉన్న క్రేజ్ వల్ల చాలా ఎక్కువ అమౌంట్ కోట్ చేసినా, అడిగినంత నిర్మాతలు ఇచ్చారని సమాచారం. పైగా వయసు 35 ఏళ్లు దాటేయడంతో, వచ్చిన ప్రతి చాన్స్ను కమర్షియల్గా వాడుకుంటోంది తమన్నా.తమన్నాకు సంబంధించిన రెమ్యునరేషన్ వివరాలు మొదట్లో మేనేజర్లు డీల్ చేసినా, ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ మేటర్లు అన్నీ తమన్నా తండ్రి సంతోష్ భాటియా స్వయంగా చూసుకుంటున్నారు. పారితోషికం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. వరుస విజయాలతో రష్మిక మందన్నా 5 కోట్లు డిమాండ్ చేస్తుంటే, తమన్నా నాలుగున్నర కోట్లకి తగ్గడం లేదని ఫిలిమ్ ఇండస్ట్రీ టాక్! తెలుగులో కొన్ని సినిమాలు రెమ్యూనరేషన్ తేడాలతోనే వదులుకుందని తెలుస్తోంది.ఎందరో అగ్ర హీరోలతో కలిసి నటించినా, ఎవరితోనూ ప్రేమలో పడని తమన్నా– విజయ్ వర్మ అనే కోఆర్టిస్టుతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది. ఇద్దరూ కలిసి కొన్ని వెబ్ సిరీస్లలో బోల్డ్గా నటించారు. ప్రస్తుతం విజయ్ వర్మతో బ్రేకప్ అయిందని వార్తలు వస్తున్నాయి. తమన్నా మాత్రం ఆ రూమర్స్ని ఖండించడం లేదు, అవును అనడం లేదు. అయితే, రిలేషన్షిప్లో లేనప్పుడే ఆనందంగా ఉన్నాను అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది తమన్నా.12వ ఏటనే యాక్టింగ్లో ట్రైనింగ్ మొదలు పెట్టిన తమన్నా ఇంత వరకు వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. తెలుగు, తమిళం, హిందీ భాషా చిత్రాల్లో ఎక్కువ నటించిన తమన్నా మలయాళంలో ఒకే ఒక్క సినిమా చేసింది. దిలీప్ హీరోగా నటించిన ‘బాంద్రా’ సినిమా డిజాస్టర్ అయింది.ఆ మధ్య కర్ణాటకలో ఏడవ తరగతి పాఠ్యాపుస్తకాల్లో తమన్నా మీద ఓ పాఠం పెట్టారు. విమర్శలు రావడంతో కర్ణాటక ప్రభుత్వం ఆ పాఠ్యాంశాన్ని తొలగించింది. పాఠం పెట్టినప్పుడు ఆశ్చర్యపోయినా, తీసేసినప్పుడు మాత్రం బాధ పడలేదని చెప్పింది తమన్నా.ఓ ప్రైవేట్ స్కూల్ వాళ్లు సింధీ కమ్యూనిటీ గురించి చెబుతూ, అందులో తమన్నా జీవిత చరిత్ర రాశారు. అయితే పిల్లల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఓ సినిమా హీరోయిన్ని రోల్ మోడల్గా చెప్పడం– పిల్లలపై దుష్ప్రభావం చూపిస్తుందని తల్లిదండ్రులు అనడంతో ఆ పాఠాన్ని తొలగించారు.సంపత్ నంది నిర్మించిన ‘ఓదేల–2’ తన కెరీర్ని మలుపు తిప్పే సినిమా అవుతుందని తమన్నా బలంగా నమ్ముతోంది. ఈ సినిమాలో తను అసలు మేకప్ వేసుకోలేదట. తను పోషించిన అఘోరా పాత్ర ‘అఖండ’లాగే అందరి ఆదరణ పొందుతుందని ఆశ పడుతోంది తమన్నా. -
తమన్నా హారర్ సినిమా.. కలెక్షన్ మరీ ఇంత తక్కువా?
ఈ వారం థియేటర్లలో తెలుగులో పలు సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో తమన్నా 'ఓదెల 2'(Odela 2 Movie) ఒకటి. హారర్ ఫాంటసీగా తీసిన ఈ మూవీని విడుదలకు ముందు బాగానే ప్రమోట్ చేశారు. తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేశారు. కానీ కలెక్షన్సే(Odela 2 Collection) మాత్రం ఏ మాత్రం ఆశాజనకంగా రావట్లేదు. పరిస్థితి ఘోరంగా ఉంది.రెగ్యులర్ గా రిలీజయ్యే శుక్రవారం కాకుండా గురువారం (ఏప్రిల్ 17న) ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. కానీ తొలిరోజు చాలాచోట్ల థియేటర్లు సరిగా ఫుల్ కాలేదు. దీంతో రూ.85 లక్షలే వచ్చాయని, రెండో రోజుకి ఇది మరింత తగ్గి రూ.59 లక్షలే వచ్చాయని సమాచారం. మొత్తంగా రూ.1.44 కోట్లు మాత్రమే ఇప్పటివరకు వసూలైనట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఫస్ట్ డే కలెక్షన్స్)దాదాపు రూ.24 కోట్ల మేర బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు ఇంత తక్కువ వసూళ్లు రావడం చూస్తుంటే వీకెండ్ తర్వాత థియేటర్లలో నిలబడుతుందా అనే సందేహం వస్తోంది. మరి లాంగ్ రన్ లో 'ఓదెల 2'కి ఎన్ని కోట్ల వస్తాయనేది చూడాలి?కథ పరంగా యావరేజ్ టాక్ వచ్చింది. మిక్స్ డ్ రివ్యూలు వచ్చినప్పటికీ ఈ తరహా వసూళ్లు ఎందుకొస్తున్నాయనేది నిర్మాతలకు అర్థం కావట్లేదు. 'అరుంధతి' సినిమాతో పోలిక రావడం ఏమైనా మైనస్ అయిందా అనేది తెలియాల్సి ఉంది. తమన్నా(Tamannaah Bhatia) శివశక్తిగా డిఫరెంట్ గెటప్ వేసినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: బీభత్సం సృష్టించిన తెలుగు నటుడి కారు) -
'ఓదెల 2' మూవీ రివ్యూ
-
'ఓదెల 2' మూవీ రివ్యూ.. శివశక్తిగా తమన్నా మెప్పించిందా..?
టైటిల్ : ఓదెల 2నటీనటులు: తమన్నా, హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్.సింహ,యువ, మురళీ శర్మ, యువ, నాగ మహేశ్, వంశీ తదితరులునిర్మాణ సంస్థలు: సంపత్ నంది టీమ్ వర్క్స్, మధు క్రియేషన్స్నిర్మాతలు: డీ. మధుఎడిటింగ్: అవినాష్దర్శకత్వం: అశోక్ తేజ కథ, దర్శకత్వ పర్యవేక్షణ: సంపత్ నందిసంగీతం: అజనీష్ లోక్నాథ్సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్.ఎస్విడుదల: ఏప్రిల్ 17, 2025సుమారు మూడేళ్ల క్రితం వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రానికి కొనసాగింపుగా ‘ఓదెల 2’ చిత్రాన్ని దర్శకుడు అశోక్తేజ తెరకెక్కించారు. సంపత్ నంది టీమ్ వర్క్స్తో కలిసి మధు క్రియేషన్స్ పతాకంపై డి.మధు నిర్మించారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించగా హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్.సింహ కీలక పాత్రలలో మెప్పించారు. 2022లో ఓటీటీ వేదికలో విడుదలైన ‘ఓదెల రైల్వేస్టేషన్’ ప్రేక్షకులలో మంచి గుర్తింపు పొందింది. దర్శకుడు సంపత్ నంది ఇచ్చిన కథతో, అశోక్తేజ ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదే కలయికలో మరింత ఘనంగా, థ్రిల్లింగ్గా 'ఓదెల2' చిత్రాన్ని రూపొందించామని చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాలలో చెప్పారు. విజువల్ ఎఫెక్ట్స్కి పెద్ద పీట వేస్తూ.. తమన్నా గుర్తుండిపోయే పాత్రలో కనిపించారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుంచి ఎలా రక్షిస్తాడనేది 'ఓదెల2' అసలు కథ. నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.కథేంటి..తిరుపతి (వశిష్ఠ) మరణంతో ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమా ముగుస్తుంది. అయితే, ఓదెల 2 అక్కడి నుంచే మొదలౌతుంది. తిరుపతి మరణించడంతో గ్రామస్థులందరూ సంతోషంగా ఉంటారు. తమ గ్రామంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిల శోభనం నాడే చంపిన తిరుపతిని రాధ (హెబా పటేల్) చంపేసి మంచి పనిచేసిందని అనుకుంటారు. అయితే, తిరుపతి ఆత్మకు కూడా శాంతి ఉండకూడదని గ్రామ పెద్దలు నిర్ణయించుకుందటారు. అలా జరగాలంటే అతని అంత్యక్రియలు ఎలా చేయాలో గ్రామంలోని పూజారిని అడిగి తెలుసుకుంటారు. శాస్త్రాల ప్రకారం 'సమాధి శిక్ష' పద్ధతి ద్వారా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. దీంతో తిరుపతి ఆత్మ గోషిస్తూ ఉంటుంది. అదే అతనికి శిక్ష అంటూ గ్రామ పెద్దలు నిర్ణయిస్తారు. అలా కొద్దిరోజులు గడిచిన తర్వాత ఆ గ్రామంలో మళ్లీ పెళ్లి జరుగుతుంది. గతం మాదిరే శోభనం నాడే అత్యంత క్రూరంగా యువతులు హత్య చేయబడుతారు. ఇలాంటి ఘటనలు రెండు జరగడంతో గ్రామంలో మళ్లీ భయం మొదలౌతుంది. పోలీసులు రంగప్రవేశం చేసినప్పటికీ వారి చావులకు అసలు కారణాలు కనుగొనలేరు. అయితే, అదే గ్రామానికి చెందిన దర్గాలో ఉన్న మురళీ శర్మ (ఫకీర్) అసలు కారణం కనుక్కొంటాడు. తిరుపతి దెయ్యంగా తిరిగొచ్చాడని చెప్తాడు. దీంతో తమ గ్రామాన్ని ఎవరు కాపాడుతారని ఆందోళనలో గ్రామస్తులు ఉంటారు. అయితే, ఒకరోజు జైల్లో ఉన్న రాధ (హెబా పటేల్) వద్దకు వెళ్లి జరిగిన హత్యల గురించి చెప్తారు. ఎలాగైనా తిరుపతి నుంచి ఓదెల గ్రామాన్ని కాపాడాలని వేడుకుంటారు. దీంతో శివశక్తి (తమన్నా) మాత్రమే కాపాడుతుందని వారికి చెబుతుంది. శివశక్తి గతం గురించి చెబుతూ ఆమె ఎక్కడ ఉంటుందో వివరాలు తెలుపుతుంది. అలా ఒదెల గ్రామాన్ని కాపాడేందుకు శివశక్తి (తమన్నా)ను అక్కడ తీసుకొస్తారు. అలా దైవశక్తికి, ప్రేతాత్మ శక్తిల మధ్య పెద్ద పోరాటమే జరుగుతుంది. మరణించిన తిరుపతి 'సమాధి శిక్ష' నుంచి ఎలా తిరిగొస్తాడు..? శివశక్తి (తమన్నా), రాధ (హెబా పటేల్) మధ్య ఉన్న బంధం ఏంటి..? శివశక్తిలా తమన్నా మారడం వెనుకన్న అసలు స్టోరీ ఎంటి..? ఫైనల్గా తిరుపతి అంతం అవుతాడా..? మళ్లీ తిరిగొస్తాడా..? అనేది తెలియాలంటే ఓదెల2 చూడాల్సిందే.ఎలా ఉందంటే..దుష్టశక్తి, దైవశక్తిల పోరాటం గురించి చాలా సినిమాలు వచ్చాయి. ఓదెల2 కూడా ఇదే కోవకు చెందిన కథే.. సినిమా ఎక్కడా కూడా కొత్తగా అనిపించదు. ప్రతి సీన్ దాదాపు అంచనా వేయవచ్చు. మూడేళ్ల క్రితం వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్’లో చూపించిన ఉదంతాలే పార్ట్-2లో ఎక్కువ భాగం కనిపిస్తాయి. గ్రామంలోని కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు తమ శోభనం నాడే అత్యంత దారుణంగా చనిపోతారు. అందుకు కారణం ఒక ప్రేతాత్మ అనేది మాత్రమే ఇక్కడ కాస్త భిన్నంగా ఉంటుంది. ఒదెల2 కథ ప్రారంభం ఘనంగా ఉన్నప్పటికీ మొదటి 15 నిమిషాల్లోనే తేలిపోతుంది. సుమారు ఇంటర్వెల్ వరకు కొత్తగా పెళ్లైన ఇద్దరి అమ్మాయిల చావుల చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. పార్ట్1 చూసిన వారికి ఇవేమీ అంత కొత్తగా అనిపించవు.. అయితే, వారి హత్యలు చాలా క్రూరంగా ఉంటాయి. మరీ వయలెన్స్ ఎక్కువ అయిందేమో అనిపించేలా ఆ సీన్స్ ఉంటాయి. శివశక్తిగా (తమన్నా) ఎంట్రీ చాలా ఆలస్యంగా ఉంటుంది. అది కాస్త ప్రేక్షకులకు రుచించకపోవచ్చు. ఎప్పుడైతే తమన్నా కథలోకి ఎంట్రీ ఇస్తుందో కథ అనేక మలుపులు తిరుగుతుందని అనుకుంటారు. కానీ, సాధారణ రొటీన్ పద్ధతిలోనే స్టోరీ కొనసాగుతుంది. ఆమె నాగసాధువుగా ఎందుకు మారిందో చెప్పిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది. అయితే, ఓదెల2లో ప్రేతాత్మగా ఉన్న తిరుపతి (వశిష్ఠ) పాత్రను చాలా బలంగా రాసుకున్న రచయిత.. శివశక్తిగా (తమన్నా) పాత్రను అంత పవర్ఫుల్గా ప్రజెంట్ చేయలేకపోయాడు. దుష్టశక్తి, దైవశక్తిల పోరాటంలో పైచెయి దుష్టశక్తిదే ప్రతిసారి కనిపించడంతో ప్రేక్షకులలో విసుగు తెప్పిస్తుంది. హార్రర్ సినిమా అంటే భయపడుతారని అందరిలో అంచనాలు ఉంటాయి. కానీ, అలాంటిదేవీ ఇందులో ఉండదు.. పైగా హత్యలకు సంబంధించిన వయలెన్స్ సీన్లే ఎక్కువగా కలవరపెడుతాయి. శివశక్తిగా తమన్నాకు మొదట ఇచ్చిన అంత ఎలివేషన్ దుష్టశక్తితో పోరాడే విషయంలో ఎంతమాత్రం దాని ప్రభావం చూపించలేదు. కథలో చాలాసార్లు రిపీటెడ్ సీన్లే ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా మొత్తానికి చివరి 15 నిమిషాలు చాలా హైప్ ఉంటుంది. అక్కడ మాత్రమే శివశక్తిగా తమన్నా విశ్వరూపం చూడొచ్చు.. ఈ సినిమాకు బలం తమన్నా నటన మాత్రమే.. శివశక్తిగా విశ్వరూపం చూపించాల్సిన పాత్రకు ఎలాంటి శక్తులు లేకుండా ప్రేక్షకులకు చూపించడాన్ని పెద్దగా కనెక్ట్ కాలేరు. సినిమా చివరి వరకు కూడా దుష్టశక్తి మీద దైవశక్తి పైచెయి అనేది కనిపించకపోవడం అంతగా రుచించదు. ప్రేతాత్మకు, పంచాక్షరీ మంత్రానికి మధ్య జరిగిన యుధ్దం అని చెప్పినప్పటికీ కనీసం దైవశక్తికి ఉన్న బలం ఏంటి అనేది దర్శకుడు చివరి వరకు చూపించకపోవడం పెద్ద పొరపాటుగా చెప్పవచ్చు. అయితే, పార్ట్-3 కూడా ప్రకటించారు. అందులో శివశక్తిగా (తమన్నా) పాత్ర బలంగా ఉండబోతుందేమో తెలియాల్సి ఉంది.ఎవరెలా చేశారంటే..ఓదెల-2 కేవలం తమన్నా కోసం మాత్రమే వెళ్లోచ్చు. తన ఎంట్రీ ఆలస్యంగా ఉన్నప్పటికీ కొత్తగా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్లో తమన్నాను చూస్తే గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలు మాత్రమే చేసిన తమన్నా మొదటిసారి శివశక్తిగా అదరగొట్టేసింది. ఆ తర్వాత ఈ మూవీకి అజనీష్ లోక్నాథ్ ఇచ్చిన బీజీఎమ్తో పాటు సంగీతం సూపర్బ్ అనిచెప్పవచ్చు. తమన్నా ఎంట్రీ సీన్తో పాటు క్లైమాక్స్లో అదరగొట్టేశాడని చెప్పవచ్చు. ఆపై సౌందర్ రాజన్.ఎస్ అందించిన సినిమాటోగ్రఫీ కథకు బాగా సెట్ అయింది. ముఖ్యంగా రాత్రి సమయంలో తీసిన సీన్స్ బాగున్నాయి. అక్కడక్కడా ప్రేక్షకులను భయపెట్టే వర్క్ కెమెరాలతో తను మాత్రమే చేశాడని చెప్పవచ్చు. ఓదెల2లో ఎక్కువగా రిపీటెడ్ సీన్స్ వస్తున్నాయనే ఫీలింగ్ చాలామందిలో కలుగుతుంది. ఇంకాస్త కత్తెరకు పనిచెప్పింటే బాగుండు. బడ్జెట్ మేరకు వీఎఫ్ఎక్స్, నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపిస్తాయి. తిరుపతి (వశిష్ఠ) ప్రేతాత్మగా చాలా బాగా చేశాడు. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. కానీ, శివశక్తిగా (తమన్నా) పాత్రను అత్యంత బలహీనంగా రాసుకోవడమే ఈ సినిమాకు పెద్ద మైనస్.. తమన్నా పాత్ర కాస్త పవర్ఫుల్గా ఉండుంటే ఓదెల-2 బ్లాక్బస్టర్ గ్యారెంటీ అని చెప్పవచ్చు. -
ఆ తెలుగు హీరోతో కలిసి పని చేయాలని ఉంది: తమన్నా ఆసక్తికర కామెంట్స్
మిల్కీ బ్యూటీ తమన్నా చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. గతేడాది కేవలం ఐటమ్ సాంగ్స్లో మెరిసిన ముద్దుగుమ్మ.. ఈ సారి లేడీ ఓరియంటెడ్ మూవీతో అభిమానుల ముందుకు రానుంది. తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఓదెల-2 ఈ వారంలోనే థియేటర్లలో సందడి చేయనుంది. గతంలో వచ్చి సూపర్ హిట్గా నిలిచిన ఓదెల రైల్వేస్టేషన్ సినిమాకు సీక్వెల్గా ఈ మూవీని తెరకెక్కించారు.రిలీజ్కు రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు హీరోయిన్ తమన్నా కూడా హాజరైంది. ఈ సందర్భంగా తమన్నా ఆసక్తికర కామెంట్స్ చేసింది. టాలీవుడ్ హీరో శర్వానంద్తో కలిసి పని చేయాలని ఉందని తన మనసులో కోరికను బయటపెట్టింది. కాగా..ఈ ఈవెంట్కు శర్వానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.తమన్నా మాట్లాడుతూ.. 'శర్వానంద్తో తాను ఎప్పుడు మీట్ అవ్వలేదు. ఇప్పటివరకు కలిసి పని చేయలేదు. సంపత్నంది గారితో మీరు నెక్ట్స్ సినిమా చేయాలని కోరుకుంటున్నా. త్వరలోనే మీతో కలిసి సినిమా చేయాలని ఉంది' అని అన్నారు. కాగా.. అశోక్ తేజ డైరెక్షన్లో వస్తోన్న ఈ థ్రిల్లర్ మూవీ ఈనెల 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. -
‘ఓదెల 2’ ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్ తమన్నా (ఫొటోలు)
-
తమన్నా ‘ఓదెల 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ప్రేక్షకుల అభినందనలే ముఖ్యం: సంపత్ నంది
‘‘రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద’.. ఈ తరహా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న నేను ‘ఓదెల 2’లాంటి కథ రాస్తాననుకోలేదు. నా భార్య మా ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించి ఎనిమిదేళ్లుగా పూజలు చేస్తోంది. మా నానమ్మ శివశక్తిగా ఉండేవారు. అప్పట్లో నేను కొన్ని సంఘటలను మా ఊర్లో గమనించాను. నా మనసులో ఉన్న అవన్నీ ‘ఓదెల 2’ రూపంలో బయటకు వచ్చాయి’’ అని దర్శక– నిర్మాత, రచయిత సంపత్ నంది అన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓదెల 2’. సంపత్ నంది సూపర్ విజన్లో అశోక్ తేజ దర్శకత్వంలో డి. మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ–‘‘అశోక్ తేజని డైరెక్టర్ చేయాలని ‘ఓదెల రైల్వేస్టేషన్స్ ’ మూవీ తీశాం. ఆహా ఓటీటీలో విడుదలైన ఆ మూవీ చాలా సక్సెస్ అయ్యింది. ఈ మూవీకి సీక్వెల్గా ‘ఓదెల 2’ చేస్తే బాగుంటుందన్నట్లుగా అశోక్ తేజ చెప్పాడు. ఓ సారి భీమ్స్తో మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తున్నప్పుడు సీక్వెల్ క్రియేట్ చేయవచ్చనిఅనిపించింది. తొలిపార్టులో రాధ క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. సీక్వెల్లో మరో ఫీమేల్ క్యారెక్టర్ అయితే బలంగా ఉంటుందని శివశక్తి పాత్రకు తమన్నాగారిని తీసుకున్నాం. ఆత్మకు, పరమాత్మకు మధ్య జరిగే యుద్ధమే ‘ఓదెల 2’.ఓ పంచాక్షరి మంత్రంతో నాగసాధువు శివశక్తి.. ఓ ప్రేతాత్మను ఎలా కంట్రోల్ చేసింది? అన్నదే కథాంశం. ‘అరుంధతి’ సినిమాతో మా చిత్రానికి పోలిక లేదు. నిర్మాత రాధామోహన్స్ గారికి ‘ఓదెల 2’ కథ చెప్పాను. ఆ సమయంలో ఆయన హిందీ మూవీతో బిజీగా ఉండటంతో డి.మధుగారు నిర్మించారు. సాంకేతిక నిపుణులకు డబ్బు ముఖ్యం కాదు.. ప్రేక్షకుల అభినందనలే ముఖ్యం. ‘ఓదెల 3’ కి అవకాశం ఉంది. నా దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ పీరియాడికల్ ఫిల్మ్ రానుంది. దర్శకుడిగా నాకు కొంత గ్యాప్ వచ్చింది. కానీ.. మరో ముప్పై ఏళ్లు ఇండస్ట్రీలో ఉండేలా సినిమాలు చేసుకుంటూ వెళ్లాలనుకుంటున్నాను’’ అని చెప్పారు. -
మొన్న బ్రేకప్.. ఇప్పుడేమో పెళ్లి గురించి అడిగితే?
హీరోయిన్లు ప్రేమ-పెళ్లి విషయంలో ఆచితూచి అడుగులేస్తుంటారు. త్వరగా పెళ్లి చేసుకుంటే కెరీర్ ముగిసిపోతుందేమోనని భయం, కొన్నిసార్లు బ్రేకప్ వల్ల కూడా పెళ్లి చేసుకోవడం చాలా లేటు చేస్తుంటారు. మొన్నీమధ్య బ్రేకప్ అయిన తమన్నాని ఇప్పుడు పెళ్లి గురించి అడిగితే ఏం సమాధానమిచ్చిందో తెలుసా?దాదాపు 20 ఏళ్లుగా నటిగా కొనసాగుతున్న తమన్నా.. దక్షిణాదితో పాటు హిందీలోనూ సినిమాలు-ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. గత రెండేళ్లుగా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉందని తెగ రూమర్స్ వినిపించాయి. అందుకు తగ్గట్లు కలిసి చాలాసార్లు కనిపించారు.(ఇదీ చదవండి: తమన్నా ట్రెండీ ఐటమ్ సాంగ్.. రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు?)మరి ఏమైందో ఏమో గానీ కొన్నిరోజుల క్రితం వీళ్ల బ్రేకప్ న్యూస్ బయటకొచ్చింది. అది నిజమేనని కొన్ని సంఘటనల ద్వారా క్లారిటీ వచ్చింది. తాజాగా ఓదెల 2 సినిమా ప్రమోషన్లలో భాగంగా తమన్నాని పెళ్లెప్పుడు అని అడిగితే.. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని చెప్పింది.తమన్నా ప్రస్తుత వయసు 35 ఏళ్లు. మరి ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదని చెప్పిందా? లేదంటే మొత్తానికి ఒంటరిగా ఉండిపోతుందా అని అభిమానులు అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?) -
ఎండల్లో చెప్పులు లేకుండా తమన్నా నటించారు: డి. మధు
‘‘ఓదెల 2’ చిత్రకథ వినగానే తమన్నా ఎగ్జైట్ అయ్యారు. తొలిసారి ఆమె నాగసాధువు పాత్ర చేశారు. అద్భుతంగా నటించడంతో పాటు ఆ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డారామె. ఏప్రిల్, మే నెలల్లో ఎండల్లోనూ చెప్పులు లేకుండా షూటింగ్లో పాల్గొన్నారు. సరైన టైమ్లో సరైన కథ తమన్నా దగ్గరకెళ్లిందని నమ్ముతున్నాను’’ అని నిర్మాత డి. మధు అన్నారు. తమన్నా లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఓదెల 2’. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి. మధు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న తెలుగు, హిందీలో విడుదలవుతోంది.ఈ సందర్భంగా డి. మధు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఓదెల రైల్వేస్టేషన్’ మూవీ నాకు బాగా నచ్చింది. అనుకోకుండా ఓ రోజు సంపత్ నందిగారు ‘ఓదెల 2’ కథని నాకు చెప్పడం... చాలా నచ్చడంతో ఈప్రాజెక్టు మొదలైంది. ‘ఓదెల 2’ కథ లాజికల్గా ఉంటుంది. అశోక్ తేజ చక్కగా తీశారు. ఇందులో ఉన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తాయి.అజినీష్ లోక్నాథ్ మ్యూజిక్, నేపథ్య సంగీతం చాలా బాగుంటాయి. సౌందర్ రాజన్గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. వశిష్ఠ, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, హెబ్బా పటేల్ పాత్రలన్నీ కూడా చాలా బాగుంటాయి. ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలని, అలాగే మంచి సక్సెస్ అందుకోవాలనే ప్యా షన్తో బడ్జెట్ గురించి ఆలోచించకుండా ‘ఓదెల 2’ని గ్రాండ్గా తీశాం. ఇక భావోద్వేగాలున్న చిత్రాలతో పాటు లేడీ ఓరియంటెడ్ కథలంటే నాకు ఇష్టం’’ అన్నారు. -
వారెవ్వా.. పోలీసు అఫీసర్... తమన్నాను మించి క్రేజ్
తమన్నా తన రాబోయే చిత్రం ఓదెల- 2 ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్లో చాలా స్టైలిష్గా కనిపిస్తూ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. ఈ ప్రమోషన్స్కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. మరీ ముఖ్యంగా ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమన్నాసెక్యూరిటీఅధికారిణి అద్భుతమైన భద్రతా నైపుణ్యాలు విశేషంగా నిలిచాయి.తమన్నా ప్రమోషన్ ఈవెంట్కు హాజరవ్వడం కోసం ముంబైలోని తన నివాసం నుంచి బయటకు వచ్చింది. రెడ్ డ్రెస్లో మెరిసిపోతూ ఉన్న తమన్నాకు మించి ఆమెకు ఎస్కార్ట్గా ఉన్న పోలీసు ఆఫీసర్ అందర్నీ ఆకర్షించింది. తమన్నాకు రక్షణ కల్పిస్తూ...రద్దీ రోడ్లో ఆ పోలీసు అధికారిని మార్గాన్ని క్లియర్ చేసింది. అక్కడున్న వారిని తప్పుకోమని కోరుతూ.. సైడ్ సైడ్ అంటూ తమన్నాకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించింది. ‘సైడ్..సైడ్’ అంటూ అక్కడున్న వారిని నియంత్రిస్తున్న ఆమె వీడియో వైరల్గా మారింది.ఆమె పని తీరుపై నెటిజనులు ప్రశంసలు కురిపించారు. డ్యూటీలో ఆమె అంకితభావానికి, నైపుణ్యానికి ముగ్ధులయ్యారు, వాటే పోలీస్ ఆఫీసర్ అని ఒకరు, "మహారాష్ట్ర లేడీ పోలీస్ ఆఫీసర్" మరో యూజర్ కమెంట్ చేశారు. దీంతో హీరోయిన్ తమన్నాకు మించి క్రేజ్ సంపాదించుకుంది ఈ మహిళా పోలీసు అధికారి. View this post on Instagram A post shared by Bollywood Pap (@bollywoodpap) -
ముంబైలోని బాబుల్నాథ్ ఆలయం సందర్శించిన ‘ఒడెలా 2’ మూవీ టీమ్ (ఫొటోలు)
-
తమన్నా 'ఓదెల 2' ట్రైలర్ రిలీజ్
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ఓదెల 2'. ఇప్పటికే టీజర్ తో మంచి బజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఏప్రిల్ 17న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: పాత కేసు.. హీరోయిన్ కి మళ్లీ అరెస్ట్ వారెంట్)ట్రైలర్ బట్టి చూస్తే.. ఓదెల అనే ఊరిలో ప్రేతాత్మల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. దీంతో ఎక్కడో కాశీలో ఉన్న శివశక్తి (తమన్నా) ఈ ఊరికి వస్తుంది. తర్వాత దెయ్యాల ఆట ఎలా కట్టించింది అనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.తమన్నా తప్పితే పెద్దగా పేరున్న నటీనటులు ఎవరూ లేనప్పటికీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రస్తుతం డివోషనల్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. చూస్తుంటే ఓదెల 2.. బాక్సాఫీస్ దగ్గర క్లిక్ అయ్యేలా కనిపిస్తుంది. అశోక్ తేజ దర్శకుడు కాదా.. సంపత్ నంది మిగతా విషయాలన్నీ చూసుకున్నారు. (ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్.. సందేహాలు తీర్చిన మారుతి) -
ఆ న్యూస్ చూసి ఏడ్చేశాను: హీరోయిన్ తమన్నా
హీరోయిన్ తమన్నా (Tamannaah Bhatia) పేరు చెప్పగానే తెలుగు, తమిళ, హిందీలో బోలెడన్ని సినిమాలు గుర్తొస్తాయి. టీనేజీలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. తాజాగా నటిగా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. తమన్నా నటించిన లేటెస్ట్ మూవీ ఓదెల 2 (Odela 2 Movie).. విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్బంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: వంటలక్క రెమ్యునరేషన్.. ఒకరోజుకి ఎంతో తెలుసా?)'ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడే 20 ఏళ్లు అవుతోంది. ఎంతో సంతోషంగా ఉంది. నటిగా కెరీర్ మొదలుపెట్టినప్పుడు ఇంతవరకు వస్తానని అనుకోలేదు. అయితే నాకు 21 ఏళ్లున్నప్పుడు జరిగిన సంఘటనని మాత్రం అస్సలు మర్చిపోలేను. పుట్టినరోజు అని ఇంట్లోనే ఉన్నా. అలా న్యూస్ పేపర్స్ తిరగేస్తుంటే.. తమిళంలో నం.1 నటి అనే నా గురించి ఆర్టికల్ ఉంది. ఇది చూసేసరికి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాను. నటించడం ఓ బాధ్యతగా తీసుకున్నాను. ఈ స్థాయికి చేరుకున్నాను' అని తమన్నా చెప్పుకొచ్చింది.సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వ పర్యవేక్షణలో తీసిన ఓదెల 2 సినిమాలో శివశక్తి పాత్రలో తమన్నా నటించింది. ఏప్రిల్ 17న రిలీజయ్యే ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి మిల్కీబ్యూటీ హిట్ కొడుతుందో లేదో చూడాలి?(ఇదీ చదవండి: రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
తమన్నాలా నేనెప్పుడు చేయలేదు: హెబ్బా పటేల్
‘ఓదెల రైల్వే స్టేషన్ లాక్ డౌన్ టైం లో చేసిన సినిమా. కరోనా కారణంగా షూటింగులన్నీ ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలియని సమయంలో సంపత్ నంది గారు అండ్ టీం ధైర్యంగా ముందుకు వచ్చి ఓదెల చేయడం జరిగింది. నిజానికి ఆ సమయంలో దీనికి సీక్వెల్ అవుతుందని నేను అనుకోలేదు. సినిమా చాలా మంచి విజయాన్ని అందుకుంది. మేము ఊహించిన దాని కంటే గొప్ప విజయం దక్కింది. సినిమా చూసిన ప్రేక్షకులంతా చాలా బావుందని మెచ్చుకున్నారు. అయితే అప్పుడు కూడా ఈ సినిమాకి సీక్వెల్ ఈ స్థాయిలో ఉంటుందని, ఇంత గ్రాండ్ స్కేల్లో సీక్వెల్ వస్తుందని నేను ఊహించలేదు’ అని హెబ్బా పటేల్(Hebah Patel) అన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ట సింహా కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హెబ్బా పటేల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ ఓదెల 2 (Odela 2 Movie) సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఓదెల కంటే ఓదెల2 చాలా పెద్ద సినిమా. చాలా అద్భుతమైనటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఆడియన్స్ కి గ్రేట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.⇢ ఇందులో తమన్నా గారితో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. తను నా సిస్టర్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. అయితే సినిమాలో ఎక్కువ శాతం నేను జైల్ ఎపిసోడ్స్ లో కనిపిస్తాను. ఫస్ట్ పార్ట్ లో నా క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో ఈ సెకండ్ పార్ట్ లో కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ⇢ తమన్నా గారు ప్రతి క్యారెక్టర్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఒక క్యారెక్టర్ కోసం ఆమె ప్రిపేర్ అయ్యే విధానం నాకు చాలా నచ్చింది. ఓదెల2 కోసం చాలా అద్భుతంగా ప్రిపేర్ అయ్యారు. నిజానికి ఓదెల సినిమా చేస్తున్నప్పుడు నా క్యారెక్టర్ గురించి నేను ముందుగా ఏం ప్రిపేర్ కాలేదు. తమన్నా గారిలా హోంవర్క్ నేనెప్పుడూ చేయలేదు. ఫ్యూచర్లో అలాంటి హోంవర్క్ చేయాలని నేర్చుకున్నాను.⇢ సంపత్ గారు విజనరీ ఫిలిం మేకర్. ఆయన ఫస్ట్ ఓదెల కథలో నా క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకే షాకింగ్ అనిపించింది. అంత పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్ నేను చేయగలనా? అనిపించింది. అయితే సంపత్ గారు ప్రయత్నించమని చెప్పారు. ఆయన నాపై అలాంటి నమ్మకాన్ని ఉంచడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన నమ్మకం నాకు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సంపత్ గారు చాలా నైస్, కైండ్ పర్సన్. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.⇢ కుమారి 21ఎఫ్ సినిమా నాకు ఒక ఫేమ్ తీసుకొచ్చింది. ఓదెల సినిమా యాక్టర్ గా నాకు ఒక క్రెడిబిలిటీ ఇచ్చింది. నేను అన్ని రకాల పాత్రలు చేయగలనని నమ్మకాన్ని కల్పించింది. ఒక నటిగా ఓదెల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.⇢ అజినీస్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ ఎసెట్. ఆయన మ్యూజిక్ తో సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లారు. బ్యాగ్రౌండ్ స్కోరు ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్ కి కావాల్సిన పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ⇢ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తయింది. ఈ ప్రయాణం ఆనందంగానే ఉంది. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అయితే ఒక నటిగా నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను. సక్సెస్ ఫెయిల్యూర్ ఏది ఫైనల్ కాదు. పనిచేసుకుంటూ వెళ్లడమే మన చేతిలో ఉంది. ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. మరో 10 ఏళ్లు నటిగా ప్రయాణిస్తానని నమ్మకం ఉంది.⇢ ఇప్పటివరకు చాలా జోనర్స్ సినిమాలు ట్రై చేశాను. ఒక ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ ఎంటర్టైనర్ చేయాలనుంది. ప్రస్తుతం తెలుగులో ఓ రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా అవుతున్నాయి. ఒక కన్నడ సినిమా చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ స్టార్ట్ కాబోతుంది. -
తమన్నా కోసమే ఈ పాత్ర పుట్టింది: సంపత్ నంది
‘‘ఓ పల్లెటూరి కథని ఎగ్జయిటింగ్గా, థ్రిల్లింగ్గా చెప్పడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ అశోక్ ‘ఓదెల 2’ని ఓ రేంజ్లో తీశారు. నేను ఏ సినిమా చేసినా ప్రేక్షకులకు కొత్త అనుభూతి దక్కాలని కోరుకుంటాను. అలాంటి సరికొత్త అనుభూతినిచ్చే సినిమా ఇది. భైరవి క్యారెక్టర్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని తమన్నా తెలిపారు. ఆమె లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్గా ‘ఓదెల 2’ రూపొందింది.అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా ఇతర పాత్రల్లో నటించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి. మధు నిర్మించారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఏప్రిల్ 17న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ– ‘‘ఓదెల రైల్వేస్టేషన్’ చూసినప్పుడే పార్ట్ 2 ఉండాలని భావించాను. సంపత్ నందిగారు పార్ట్–2 ఐడియా చెప్పినప్పుడు ఎగ్జయిట్ అయ్యాను.నా కెరీర్లో అత్యధిక ఐ షాట్ క్లోజప్స్ ఉన్న సినిమా ‘ఓదెల 2’’ అన్నారు. ఈ మూవీ క్రియేటర్ సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘నేను ఓదెల అనే ఊర్లో పుట్టి, పెరిగాను. చాలా గౌరవంగా, ప్రేమతో ఈ కథ రాశాను. ఓదెలకు ఒక కష్టం వస్తే... ఆ ఊరిలో కొలువై ఉన్న ఓదెల మల్లన్న నాగ సాధు పాత్ర ద్వారా ఆ సమస్యని ఎలా పరిష్కరించారు? అనేది ఈ చిత్రకథ. ఈ పాత్ర తమన్నా కోసమే పుట్టింది’’ అని చెప్పారు. ‘‘కథని నమ్ముకుని తీసిన ‘ఓదెల 2’ని ప్రేక్షకులు థియేటర్స్లో చూసి, ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు డి. మధు. ‘‘ఆకలిగా ఉందని అన్నం కోసం సంపత్ నందిగారి దగ్గరికి వెళ్లాను... ‘ఓదెల 2’ రూపంలో ఆయన బిర్యానీ తినిపించారు’’ అని అశోక్ తేజ అన్నారు. -
నాకు కోపమొస్తే తెలుగులోనే బూతులు తిడతా..: తమన్నా
పదిహేనేళ్ల వయసులోనే కెమెరా ముందుకు వచ్చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా. హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓదెల 2. ఇది 2021లో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్కు సీక్వెల్గా తెరకెక్కింది. హెబ్బా పటేల్, వశిష్ట సింహ కీలక పాత్రలు పోషించారు. సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వం వహించాడు.శనివారం నాడు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏప్రిల్ 17న ఓదెల 2 ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో తమన్నా ముఖం రక్తసిక్తంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. అందరూ నన్ను తెలుగమ్మాయే అనుకుంటారు. నేను కూడా అలాగే ఫీలవుతాను. నాకు కోపం వచ్చినప్పుడు తెలుగే మాట్లాడతాను. తెలుగులోనే తిడతాను అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఓదెల 2 కోసం తమన్నా మాంసాహారం తినడం కూడా మనేసింది. A PRESENCE TO BE FELT. #Odela2 on April 17th. 🙏@iamsampathnandi @dimadhu @alle_ashok_teja @ihebahp@imsimhaa @b_ajaneesh @soundar16 @neeta_lulla@madhucreations9 pic.twitter.com/ihUozJX6Rt— Tamannaah Bhatia (@tamannaahspeaks) March 22, 2025 చదవండి: నన్ను తిట్టించడం కోసం లక్షలు ఖర్చు చేశారు: పూజా హెగ్డే -
ఓదెల 2లో తమన్నా శివతాండవం..
-
జీవితంలో ఒక్కసారే ఇలాంటి చాన్స్ వస్తుంది: తమన్నా
‘‘మహా కుంభమేళా జీవితంలో ఒక్కసారే వస్తుంది. అలాగే ‘ఓదెల 2’ లాంటి సినిమాలో నటించే అవకాశం కూడా జీవితంలో ఒక్కసారే వస్తుంది’’ అని తమన్నా అన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, యువ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి. మధు నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.ప్రయాగ్ రాజ్లోని మహా కుంభ మేళాలో త్రివేణి సంగమం వద్ద నాగ సాధువుల సమక్షంలో ‘ఓదెల 2’ టీజర్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ– ‘‘సంపత్ నంది విజన్ని దర్శకుడు అశోక్ తేజ అద్భుతంగా తెరపైకి తీసుకువచ్చాడు. సంపత్ నందిగారితో నాలుగు సినిమాలు సైన్ చేశాను. కానీ ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది’’ అని తెలిపారు. సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత తమన్నా మాంసాహారం తినడాన్ని మానేశారు.‘అమ్మోరు’లో సౌందర్యగారిని, ‘అరుంధతి’ మూవీలో అనుష్కగారిని ఎంత ఆరాధించామో... అలా ఈ సినిమాతో తమన్నా కూడా ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘అవకాశం ఇచ్చిన సంపత్ నందిగారికి, తమన్నా, డి. మధుగార్లకు ధన్యవాదాలు’’ అని తెలిపారు అశోక్తేజ. ‘‘ఇది థియేటర్స్లో చూడాల్సిన చిత్రం’’ అన్నారు డి. మధు. -
హరోం హర అంటున్న సినీ స్టార్స్
మహా శివరాత్రి పర్వదినం (ఫిబ్రవరి 26) సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. శివుడికి ఎంతో ఇష్టమైన రోజు అయిన మహా శివరాత్రికి జాగరణ చేసేందుకు భక్తులు శివాలయాలకు పోటెత్తుతారు. ఆ రోజు శివాలయాలన్నీ హరోం హర అంటూ శివనామ స్మరణతో మార్మోగుతాయి. సినిమా ఇండస్ట్రీకి కూడా మహా శివుడితో ప్రత్యేక అనుబంధం ఉందనే చెప్పాలి. శివుడి నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చి, ప్రేక్షకులను అలరించాయి. తాజాగా పరమేశ్వరుడి నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలాగే శివ భక్తి నేపథ్యంలో పాటలు కూడా ఉన్నాయి. ఆ చిత్రాల విశేషాల గురించి తెలుసుకుందాం.శివుడి నేపథ్యంలో...తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో రష్మికా మందన్న హీరోయిన్. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పీ బ్యానర్పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శివుడి నేపథ్యం ఉంటుందని తెలుస్తోంది. గత ఏడాది మహా శివరాత్రి కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ని విడుదల చేశారు మేకర్స్. ఆహార దేవతగా భావించే అన్నపూర్ణా దేవి నుంచి శివుడు భిక్ష తీసుకుంటున్న ఫొటో పోస్టర్లో ఉంది.అంటే... ఈ కథలో శివుడి గురించి ఏదో ఒక లైన్ టచ్ చేసి ఉంటారని కచ్చితంగా ఊహించవచ్చు. పైగా మహా శివరాత్రి కానుకగా ప్రత్యేకించి ఆ పోస్టర్ విడుదల చేయడం కూడా శివుడి నేపథ్యం ఉంటుందని చెప్పకనే చెప్పింది యూనిట్. ఈ సినిమాలో మురికి వాడల్లో నివశించే వ్యక్తిగా ధనుష్ పాత్ర ఉంటుంది. అలాగే ముంబైకి చెందిన ఓ ధనవంతుడి పాత్రలో నాగార్జున కనిపించనుండగా, రష్మికా మందన్న మధ్యతరగతి యువతి పాత్ర చేస్తున్నారు. నటుడు జిమ్ సర్భ్ ఓ బిలియనీర్ బిజినెస్ మ్యాన్గా కనిపిస్తారు. శివ భక్తుడి కథమంచు విష్ణు టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై మంచు మోహన్బాబు పాన్ ఇండియన్ మూవీగా నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 25న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదలకానుంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది ‘కన్నప్ప’ యూనిట్. పరమశివుడికి వీర భక్తుడైన కన్నప్ప నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. కన్నప్పలోని వీరత్వం, భక్తిని మేళవించి ఈ మూవీ తెరకెక్కించారు ముఖేశ్ కుమార్ సింగ్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడి పాత్ర చేయడం విశేషం. శివ తాండవం చేస్తున్న అక్షయ్ కుమార్ పోస్టర్ని చిత్ర బృందం విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది.శివుడిగా ఆయన పాత్ర ఎలా ఉండబోతోందో ఆ పోస్టర్ ద్వారా చూపించింది యూనిట్. అంతేకాదు... ఈ సినిమా నుంచి విడుదలైన ‘శివ శివ శంకరా...’ పాటకి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్కి పెద్ద పీట వేశారు. ఈ మూవీలో తిన్నడు పాత్రలో మంచు విష్ణు, రుద్ర పాత్రలో ప్రభాస్, పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ నటించారు. మధుబాల, ప్రీతీ ముకుందన్, ఐశ్వర్య, దేవరాజ్, విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా వంటి వారు ఇతర పాత్రల్లో నటించారు. శివ తాండవం పాప వినాశక సాక్షాత్ సాంబ శివ అంటూ ఆడి పాడుతున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘భైరవం’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించారు. ఈ మూవీలో అదితీ శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై కథానాయికలు. పెన్ స్టూడియోస్పై డా. జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రంలో శివుడి నేపథ్యంలో ఓ పాట తెరకెక్కించారు మేకర్స్. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘భైరవం’ థీమ్ సాంగ్ను విడుదల చేసింది యూనిట్. ఈ పాటలో పరమ శివుని భయం, బలం ఈ రెండింటినీ తన హావభావాలు, నృత్యంతో అద్భుతంగా కనబరిచారు సాయి శ్రీనివాస్. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించిన ఈ పాటని శంకర్ మహదేవన్ తనదైన శైలిలో పాడారు. ఓ ఆలయం ముందు ఈ పాటను చిత్రీకరించారు.‘‘ఈ నెల 26న రానున్న మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ ఆధ్యాత్మిక పాటని విడుదల చేశాం. పరమ శివుడి దైవిక సారాన్ని అందంగా ప్రజెంట్ చేసి, లోతుగా ప్రతిధ్వనించే ఎమోషన్స్ని ఈ పాట ఆవిష్కరిస్తుంది. సాయి శ్రీనివాస్ పాత్ర శివ తాండవం ప్రేరణ స్ఫూర్తితో మెస్మరైజ్ చేస్తుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. జటాధరవైవిధ్యమైన కథా నేపథ్యం ఉన్న చిత్రాలు, పాత్రలను ఎంచుకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సుధీర్బాబు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘జటాధర’. వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్ కేఆర్ భన్సల్, ప్రేరణా అరోరా నిర్మిస్తున్నారు. సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న చిత్రం ‘జటాధర’. అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరిగే కథ ఇది.అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, పురాణ చరిత్ర వీటి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కూడా పరమ శివుడితో ముడిపడిన కథే అని సమాచారం. పైగా టైటిల్ని బట్టి చూస్తే ఇదే వాస్తవం అనిపిస్తుంది. జటాధరుడు అని పరమ శివుణ్ణి పిలుస్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణ కథల్ని కూడా చూపించబోతున్నారు మేకర్స్. ఈ సినిమాలో సుధీర్ బాబు పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది.పరమ శివుని భక్తురాలుహీరోయిన్ తమన్నా లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. తొలి భాగాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ అశోక్ తేజ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా, యువ, నాగ మహేశ్, వంశీ, గగన్ విహారి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి. మధు నిర్మిస్తున్నారు.సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో శివ భక్తురాలైన శివ శక్తి నాగసాధు పాత్రలో నటిస్తున్నారు తమన్నా. తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఓదెల మల్లన్న స్వామి ఎలా కాపాడారు? అనే అంశంతో ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. మల్లన్న స్వామి అంటే శివుడే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా షూటింగ్ సింహ భాగం వారణాసిలోని కాశీలో జరిగింది. శనివారం విడుదలైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.ఇవే కాదు... మరికొన్ని సినిమాలు కూడా శివుడి నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి. -
లుక్స్తోనే భయపెట్టిన తమన్నా.. ఉత్కంఠంగా ‘ఓదెల 2’ టీజర్
‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్గా ‘ఓదెల 2’ (Odela 2)తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా ప్రధాన పాత్రలో నటించగా, హెబ్బా పటేల్, వశిష్ట కీలక పాత్రలు పోషిస్తున్నారు. తొలి భాగాన్ని తెరకెక్కించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి. మధు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా..నాగసాధు పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్(Odela 2 Teaser)ని మహాకుంబమేళాలో విడుదల చేశారు మేకర్స్. నాగసాధు పాత్రలో తమన్నా నటన అదిరిపోయింది. ఉత్కంఠ రేకెత్తించే సీన్లలో టీజర్ని కట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు విడుదలైన టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది. -
మహా కుంభమేళాలో తమన్నా ‘ఓదెల 2’ టీజర్
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ట ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. తొలి భాగాన్ని తెరకెక్కించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి. మధు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా..నాగసాధు పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ టీజర్ని ఈ నెల 22న కాశీ మహా కుంభమేళాలో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాశీ మహా కుంభమేళాలో లాంచ్ కానున్న మొట్టమొదటి టీజర్ 'ఓదెల 2' కావడం విశేషం. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కుంభమేళా బ్యాక్ డ్రాప్ లో నాగసాధు గా కనిపించిన తమన్నా లుక్ డివైన్ వైబ్ తో పవర్ ఫుల్ గా ఉంది.ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ చిత్రం కథాంశం. సంపత్ నంది ఈ సినిమాకు కథ అందించగా, అజనీష్ లోక్నాథ్ స్వరాలు సమకూర్చాడు. -
‘భయం’తో బాక్సాఫీస్పై దాడి.. కాసుల వర్షం కురిసేనా?
హారర్ సినిమాలు ఏ మాత్రం ఆడియన్స్కు కనెక్ట్ అయినా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. అందుకే కథాబలం ఉన్న భయపెట్టే కథలు తమ దగ్గరకి వస్తే చేసేందుకు భయపడరు హీరోలు, హీరోయిన్లు. కథలోని భయాన్నే భరోసాగా చేసుకుని, ప్రస్తుతం కొందరు నటీనటులు హారర్ సినిమాలు చేస్తున్నారు. ఆ స్టార్స్ చేస్తున్న హారర్ చిత్రాల గురించి తెలుసుకుందాం.రాజా డీలక్స్ థియేటర్లో రాజా సాబ్ ప్రభాస్ కటౌట్ చాలు బాక్సాఫీస్ భయపడటానికి. కానీ వెండితెరపై ప్రభాస్ భయపడితే ఎలా ఉంటుంది? ఆడియన్స్ను ప్రభాస్ భయపెడితే ఎలా ఉంటుంది? అనేది ‘రాజా సాబ్’ సినిమాలో చూడొచ్చు. ‘ప్రేమకథా చిత్రమ్’తో ఆడియన్స్ని నవ్విస్తూనే భయపెట్టి, బాక్సాఫీస్ కాసులను కురిపించిన దర్శకుడు మారుతి ‘రాజా సాబ్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, తాతా మనవళ్ళుగా ప్రభాస్ కనిపిస్తారని, ఈ సినిమాలోని ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్స్లో సీరియస్ హారర్ సీన్స్ ఉన్నాయని సమాచారం. ‘రాజా డీలక్స్’ అనే థియేటర్లో జరిగే హారర్ సీన్స్ ఈ సినిమాకు కీలకమని ఫిల్మ్నగర్ భోగట్టా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు చాలా సీజీ వర్క్ చేయాల్సి ఉంది. దీంతో వీలైనంత తొందరగా షూటింగ్ను కంప్లీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హారర్ తరహా జానర్లో ప్రభాస్ ఇప్పటివరకు సినిమా చేయలేదు. దీంతో ‘రాజా సాబ్’ సినిమా ఎలా ఉండబోతుంది? అనే క్యూరియాసిటీ ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్లోను నెలకొంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇప్పుడు సినిమాలోనూ... నాగచైతన్య కెరీర్లో ఇప్పటివరకూ హారర్ బ్యాక్డ్రాప్ సినిమాలు లేవు. అయితే హారర్ టచ్ ఉన్న ‘ధూత’ అనే వెబ్ సిరీస్ చేశారు. ఈ సిరీస్కు వీక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఓ పర్ఫెక్ట్ హారర్ మూవీతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు నాగచైతన్య. ‘విరూపాక్ష’ సినిమాతో దర్శకుడు కార్తీక్వర్మ దండు ఆడియన్స్ను బాగా భయపెట్టి, బాక్సాఫీస్ వద్ద డబ్బులు రాబట్టుకున్నారు. ఈ దర్శకుడు తెరకెక్కించనున్న కొత్త సినిమాలో నాగచైతన్య హీరోగా నటించనున్నారు. ‘విరూపాక్ష’ను మించిన హారర్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయని, కథకు కాస్త మైథలాజికల్ టచ్ కూడా ఉంటుందని సమాచారం. ఈ సినిమాను ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఓ ఎత్తైన పర్వతం పైకి ఎక్కుతున్న నాగచైతన్యను ఓ పక్షి కన్నులో నుంచి చూపించారు మేకర్స్. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్కు ఆసక్తి నెలకొంది. ఈ నెలాఖర్లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. నాగచైతన్య కెరీర్లోని ఈ 24వ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. కొరియన్ కనకరాజు లవ్స్టోరీ, యాక్షన్ జానర్స్లో సినిమాలు చేశారు వరుణ్ తేజ్. అయితే ఈసారి కొత్తగా ప్రయత్నించాలని వరుణ్ తేజ్ డిసైడ్ అయ్యారు. అందుకే ఓ హారర్ కామెడీ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వరుణ్. ‘రన్ రాజా రన్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ వంటి చిత్రాలతో ఆడియన్స్ను ఆకట్టుకున్న మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ సినిమా కథనం రాయలసీమ నేపథ్యంలో ఉంటుంది. మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ను ప్రారంభించాలనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇది పీరియాడికల్ ఫిల్మ్గా ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని తెలిసింది. మార్చిలో చిత్రీకరణ అంటున్నారు కాబట్టి, వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ఊహించవచ్చు. చీకటి–వెలుగుల మధ్యలో...! చీకటి వెలుగుల మధ్య దాగి ఉన్న ఓ మిస్టరీని చేధించే పనిలో పడ్డారట బెల్లకొండ సాయి శ్రీనివాస్. ఆయన హీరోగా కౌశిక్ పెగుళ్లపాటి దర్శకత్వంలో ఓ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది. సాయి శ్రీనివాస్ కెరీర్లోని ఈ 11వ చిత్రంలో ‘కిష్కింధపురి’ అనే కల్పిత ప్రాంతం ఉంటుందని, అక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయని, ఈ నేపథ్యంలో ఓ హారర్ కథను కౌశిక్ రెడీ చేసుకున్నారనీ భోగట్టా. ఈ సినిమాకు ‘కిష్కింధపురి’ అనే టైటిల్ అనుకుంటున్నారట. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కావొచ్చు. రహస్యాలను కనిపెట్టే యువతిగా∙ఈ ఏడాది ‘అరణ్మణై 4’ (తెలుగులో ‘బాకు’) వంటి హారర్ సినిమాతో ఆడియన్స్ను ఆలరించారు తమన్నా. ఈ సినిమాలో ఓ పాజిటివ్ ఆత్మగానే కనిపించారు. అలాగే ఈ ఏడాదే విడుదలైన హిందీ బ్లాక్బస్టర్ హారర్ ఫిల్మ్ ‘స్త్రీ 2’లోనూ మెరిశారు తమన్నా. కానీ ఆమె పాత్రకు హారర్ టచ్ లేదు. ఓ స్పెషల్ సాంగ్తోనే సరిపోయింది. కాగా ప్రస్తుతం తమన్నా ‘ఓదెల 2’ అనే మైథలాజికల్ హారర్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో నాగసాధువు శివశక్తి పాత్రలో కనిపిస్తారు తమన్నా. హెబ్బా పటేల్, వశిష్ఠ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ చిత్రం కథాంశం. సంపత్ నంది ఈ సినిమాకు కథ అందించారు. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సంపత్ నంది టీమ్ వర్క్స్, మధు క్రియేషన్స్ పతాకాలపై డి. మధు ఈ నిర్మిస్తున్నారు. మరోవైపు గాంధారి కోటలోని రహస్యాలను కనిపెట్టే యువతి పాత్రలో నటించారు హన్సిక. ‘శ్రీ గాంధారీ’ సినిమా కోసం హన్సిక ఈ పాత్ర చేశారు. హారర్, మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్ అంశాలతో రూపొందిన ఈ చిత్రంలో మెట్రో శిరీష్, మయిల్ సామి, తలైవాసల్ విజయ్ ఇతర కీలక పాత్రధారులు. ఆర్. కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో రాజు నాయక్ రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇంకా సత్యం రాజేశ్ ‘పొలిమేర 3’, తిరువీర్ ‘మసూద 2’, వంటి హారర్ సినిమాలు స్క్రిప్ట్ దశలో ఉన్నాయని తెలుస్తోంది. మరికొందరు యువ దర్శకులు కూడా హారర్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. - ముసిమి శివాంజనేయులు -
పండగ వేళ పసందుగా...
కొత్త లుక్స్, విడుదల తేదీల ప్రకటనలతో దీపావళి సందడి తెలుగు పరిశ్రమలో బాగానే కనిపించింది. మాస్ లుక్, క్లాస్ లుక్, భయంకరమైన లుక్, కామెడీ లుక్... ఇలా పండగ వేళ పసందైన వెరైటీ లుక్స్లో కనిపించారు స్టార్స్. ఆ వివరాల్లోకి వెళదాం.⇒ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్లో నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టిస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నల పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. టీజర్ని ఈ నెల 15న విడుదల చేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ⇒ హీరో వెంకటేశ్ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ని ఖరారు చేసి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. యూనిక్ ట్రయాంగిలర్ క్రైమ్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం రూపొందుతోంది. ⇒ సంక్రాంతికి ఆట ప్రారంభించనున్నారు రామ్చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ బ్యానర్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్ని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, రామ్చరణ్ లుక్ని రిలీజ్ చేశారు. ⇒ అర్జున్ సర్కార్గా చార్జ్ తీసుకున్నారు హీరో నాని. ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ప్రొడక్షన్స్పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి నాని యాక్షన్ ఫ్యాక్డ్ పోస్టర్ రిలీజ్ చేశారు. 2025 మే 1న ఈ సినిమా విడుదల కానుంది. ⇒ నితిన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘రాబిన్హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ విడుదలైంది. త్వరలో టీజర్ రిలీజ్ కానుంది. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ⇒ నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్లస్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘లెవెన్’. రేయా హరి కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రంలోని ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్..’ అంటూ శ్రుతీహాసన్ పాడిన పాట చాలా పాపులర్ అయింది. ‘లెవెన్’ని నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ⇒ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాత–మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంగా రాజా గౌతమ్ పోషిస్తున్న పాత్ర ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ఇందులో ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్ హీరోయిన్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది.⇒ నాగ సాధువుగా తమన్నా లీడ్ రోల్లో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓదెల 2’. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై బహు భాషా చిత్రంగా రూపొందుతోంది. ఈ డివోషన్ యాక్షన్ థ్రిల్లర్లో విలన్ తిరుపతి పాత్రలో వశిష్ఠ ఎన్. సింహ నటిస్తున్నట్లు పేర్కొని, లుక్ని విడుదల చేశారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ మరో కీలక -
బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే స్కెచ్ వేసిన నాని
-
ఓదెల మల్లన్న క్షేత్రంలో...
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్ లీడ్ రోల్లో నటించిన హిట్ మూవీ ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. తొలి భాగాన్ని తెరకెక్కించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి. మధు నిర్మిస్తున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ఓదెల గ్రామంలో జరుగుతోంది. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. కాశీలో ప్రారంభమైన ఈ సీక్వెల్ చిత్రీకరణ ప్రస్తుతం ఓదెల మల్లన్న క్షేత్రంలో జరుగుతోంది. ఓదెల మల్లన్న ఆలయంతో పాటు గ్రామంలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. తమన్నా, మురళీ శర్మ, హెబ్బా పటేల్, యువ తదితరులు షూట్లో పాల్గొంటున్నారు. తన కెరీర్లో తొలిసారిగా తమన్నా శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటిస్తున్నారు’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్నాథ్, కెమెరా: సౌందర్ రాజన్ .ఎస్, క్రియేటెడ్ బై: సంపత్ నంది. -
Tamannaah Bhatia: ఇప్పుడే ఏమీ చెప్పలేను..
సాక్షి, సిటీబ్యూరో: మిల్కీ బ్యూటీ, ప్రముఖ సినీతార తమన్నా భాటియా మంగళవారం నగరంలో తళుక్కున మెరిశారు. నగరంలో ఓ ప్రయివేటు కార్యక్రమానికి హాజరై తమన్నా ఈ సందర్భంగా మాట్లాడారు.. చాలా రోజుల తరువాత హైదరాబాద్ వచ్చాను, చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. మరి కొద్ది రోజుల్లో ఓదెల –2 సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నానని, ఆ సినిమాకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఇక సినిమాకు సంబంధించి చిన్న పార్ట్ మాత్రమే పెండింగ్ ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఎప్పటి నుంచో తన పెళ్లి విషయమై ఊరిస్తున్న తమన్నా, ఈ సారి కూడా పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు.., ‘పెళ్లి ఎప్పుడు అనేది ఇప్పుడే ఏం చెప్పలేనని’ దాటవేశారు. అయితే ఈ సందర్భంగా తమన్నా ప్రత్యేకంగా డిజైనింగ్ చేయించుకుని ధరించిన నీలి రంగు డ్రెస్ విశేషంగా ఆకట్టుకుంది. -
బోనాల పండగలో...
బోనాల పండగ జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తమన్నా కూడా బోనం ఎత్తారు. అయితే ఆమె పండగ చేసుకుంటున్నది ‘ఓదెల 2’ చిత్రం కోసం. తమన్నా లీడ్ రోల్లో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి. మధు నిర్మిస్తున్న చిత్రం ఇది. దర్శకుడు సంపత్ నంది సూపర్విజన్లో ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021) సినిమాకి సీక్వెల్గా అశోక్ తేజ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ బహు భాషా చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది.భారీ మల్లన్న టెంపుల్ సెట్లో క్లైమాక్స్ని చిత్రీకరిస్తున్నారు. తమన్నా, ఇతర నటీనటులతోపాటు 800 మంది జూనియర్ ఆర్టిస్టులు షూటింగ్లోపాల్గొంటున్నారు. బోనాల సంబరాల నేపథ్యంలో సాగే ఎపిసోడ్ ఇది. ఈ సన్నివేశాల్లోని తమన్నా కొత్త పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఈ సినిమాలోనిపాత్ర కోసం తమన్నా శిక్షణ తీసుకున్నారు. యాక్షన్ సన్నివేశాలను ఆమె అద్భు తంగా చేస్తున్నారు’’ అని మేకర్స్ పేర్కొన్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహ, యువ, నాగమహేశ్, వంశీ, గగన్ విహారి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్నాథ్, కెమెరా: సౌందర్రాజన్. -
బోనమెత్తిన తమన్నా.. దాదాపు 800 మందితో!
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్నతాజా చిత్రం ఓదెల-2. ఈ సినిమాను అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్వర్క్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ఓదెల రైల్వేస్టేషన్ చిత్రానికి సీక్వెల్గా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అయితే తెలంగాణలో బోనాల పండుగ సందర్బంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. చీర కట్టులో తమన్నా బోనం మోస్తున్న పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 800 మందితో క్లైమాక్స్ సీన్ షూట్..ఈ చిత్రం క్లైమాక్స్ కోసం ఏకంగా 800 మంది కళాకారులతో భారీస్థాయిలో చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లోని ఓదెల మల్లన్న టెంపుల్ సెట్లో జరుగుతోంది. కేవలం క్లైమాక్స్ సీన్ కోసమే అత్యంత భారీ ఆలయ సెట్ను అధిక బడ్జెట్తో నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్లో తమన్నాతో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొంటున్నారు. కాగా.. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతమందిస్తున్నారు. Team #Odela2 wishes everyone celebrating the festival a very Happy Bonalu ✨#Odela2 climax currently being shot in a Grand Mallanna Temple set erected at Ramoji Film City.@tamannaahspeaks @IamSampathNandi @ashokalle2020 @ImSimhaa @AJANEESHB @SampathNandi_TW @creations_madhu… pic.twitter.com/xfSR8QFfZh— Telugu FilmNagar (@telugufilmnagar) July 29, 2024 -
చెడుపై గెలుపు
అహీరోయిన్ తమన్నా లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఫేమ్ అశోక్ తేజ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి. మధు నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. తన ప్రజలను రక్షించడానికి దేవుడు ప్రతి యుగంలో చెడుని ఎలా గెలుస్తాడో చూపించే కథాంశంతో ఈ మూవీ ఉంటుంది.హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో జరుపుతున్న రెండో షెడ్యూల్ 25 రోజుల పాటు సాగుతుంది. సినిమాలోని ప్రధాన తారాగణంతో పాటు ఇతర నటీనటులతో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్ సింహ, మురళీ శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్నాథ్, కెమెరా: సౌందర్ రాజన్ .ఎస్, క్రియేటెడ్ బై: సంపత్ నంది. -
‘శివ... శివా...’ అంటూ శివనామాన్ని స్మరిస్తున్న టాలీవుడ్ స్టార్స్
భక్తి కలిసిన చిత్రాల్లో స్టార్స్ కనిపించడం చాలా తక్కువ. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. డివోషన్ ప్లస్ కమర్షియల్ మిక్స్ అయిన కథలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ తరహా చిత్రాల్లో నటించడానికి స్టార్ హీరోలు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చిత్రాల్లో ‘శివుడు’ నేపథ్యంలో సాగే కథలు, శివుడి ప్రస్తావన కాసేపు ఉండే కథలు ఉన్నాయి. ‘శివ... శివా...’ అంటూ శివుడి నేపథ్యంలో భక్తి భావంతో రానున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. కన్నప్ప విష్ణు మంచు హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియన్ చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్పై మంచు మోహన్బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మోహన్బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివ భక్తుడైన భక్త కన్నప్ప కథను ‘కన్నప్ప’ ద్వారా వెండితెరకు తీసుకొస్తు్తన్నారు. ఈ చిత్రంలో శివుడి పాత్రలో ప్రభాస్ నటించనున్నారని సమాచారం. ఈ వార్తలు ఆ మధ్య హల్ చల్ చేయగా ‘హర హర మహాదేవా’ అంటూ రిప్లై ఇస్తూ పరోక్షంగా హింట్ ఇచ్చారు విష్ణు మంచు. ఈ విషయం గురించి మేలో అధికారిక ప్రకటన రావొచ్చని కూడా తాజాగా విష్ణు మంచు స్పందించారు. దీంతో ‘కన్నప్ప’లో శివుడి పాత్రలో ప్రభాస్ నటించడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటివరకు మాస్ యాక్షన్ హీరోగా, లవర్ బాయ్గా నటించిన ప్రభాస్ ఇటీవలే ‘ఆదిపురుష్’ సినిమాలో రాముడిగా కనిపించారు. ఇప్పుడు ‘కన్నప్ప’ చిత్రంలో శివుడిగా కనిపించనున్నారు. ఇక శివుడి పాత్రలో ప్రభాస్ ఎలా ఉంటారో అంటూ ఏఐ టెక్నాలజీ సాయంతో శివుడి రూపంలో ఉన ్న ప్రభాస్ పోస్టర్లను డిజైన్ చేసి, నెట్టింట షేర్ చేస్తున్నారు ఆయన అభిమానులు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్ శివుడి రూపంలో ప్రభాస్ లుక్ సూపర్గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పార్వతీదేవి పాత్రలో నయనతార కనిపిస్తారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ‘కన్నప్ప’ విడుదల కానుంది. కుబేర ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్లో నటిస్తున్న మల్టీస్టారర్ ఫిల్మ్ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ని విడుదల చేశారు మేకర్స్. అయితే ఫస్ట్ లుక్ మాత్రం టైటిల్కు భిన్నంగా ఉండటంతో పాటు ఆశ్చర్యపరిచేలా ఉంది. కుబేరుడు డబ్బులు ప్రసాదించే దేవుడు. కాగా ఫస్ట్ లుక్లో ధనుష్ సరైన కాస్ట్యూమ్ లేని పేదవాడిలా కనిపిస్తారు, ఆహార దేవత అన్నపూర్ణాదేవి నుంచి శివుడు భిక్ష తీసుకుంటున్న ఫొటో కూడా పోస్టర్లో ఉంది. అంటే ఈ కథలో శివుడి గురించి ఏదో ఒక లైన్ టచ్ చేసి ఉంటారని ఊహించవచ్చు. పైగా మహా శివరాత్రి కానుకగా ప్రత్యేకించి ఆ పోస్టర్ విడుదల చేయడం కూడా శివుడి నేపథ్యం ఉంటుందనుకోవచ్చు. హరోం హర ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు హీరో సుధీర్ బాబు. తాజాగా ఆయన నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘హరోం హర’. ‘ది రివోల్ట్’ అనేది ట్యాగ్లైన్. ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవికా శర్మ హీరోయిన్ గా నటించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి. నాయుడు నిర్మించిన ఈ సినిమా కథనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేపథ్యంలో సాగుతుంది. పైగా ఈ మూవీలో హీరో పేరు కూడా సుబ్రహ్మణ్యమే కావడం విశేషం. ఈ చిత్రానికి ‘హరోం హర’ టైటిల్ ఫిక్స్ చేశారంటే శివుడి నేపథ్యం ఎంతో కొంత ఉంటుందని ఊహించవచ్చు. ఎందుకంటే.. పరమశివుడి తనయుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పుత్రుడి కథ చెప్పే క్రమంలో తండ్రి కథని టచ్ చేసుంటారనుకోవచ్చు. చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే ‘హరోం హర’లో సుధీర్ బాబు చిత్తూరు యాసలోనే మాట్లాడతారు. ఈ వేసవిలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓదెల 2 తమన్నా పేరు చెప్పగానే గ్లామరస్ హీరోయిన్ గుర్తొస్తారు. తన నటన.. ప్రత్యేకించి తన అద్భుతమైన డ్యాన్సుతో ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు తమన్నా. ప్రస్తుతం ఆమె శివుడి నేపథ్యంలో రూపొందుతున్న ‘ఓదెల 2’ మూవీలో లీడ్ రోల్ చేస్తున్నారు. ‘ఓదెల రైల్వేస్టేషన్’ వంటి హిట్ సినిమాకి సీక్వెల్గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్గా ఈ మూవీ రూపొందుతోంది. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్వర్క్స్ బ్యానర్లపై డి. మధు ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కాశీలో మొదలైంది. ఈ చిత్రంలో శివశక్తిగా తమన్నా నటిస్తున్నారు. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివశక్తిగా తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగసాధువు వేషంలో కనిపించారు తమన్నా. తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఓదెల మల్లన్న స్వామి ఎలా కాపాడాడు? అనే అంశంతో ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. మల్లన్న స్వామి అంటే శివుడే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు మేకర్స్. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, పూజా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది. -
Odela 2: నాగ సాధువుగా తమన్నా!
తమన్నా లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హీరోయిన్ హెబ్బా పటేల్ లీడ్ రోల్లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకి సీక్వెల్గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్గా ఈ మూవీ రూపొందుతోంది. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లపై డి. మధు నిర్మిస్తున్నారు. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివ శక్తిగా తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగ సాధువు వేషంలో కనిపించారు తమన్నా. ‘‘ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా కాపాడారు? అనే అంశంతో ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అత్యధిక బడ్జెట్తో బహు భాషల్లో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కాశీలో జరుగుతోంది. శివ శక్తి పాత్ర కోసం తమన్నా పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. యూనివర్సల్ అప్పీల్ ఉండే ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు మేకర్స్. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహ, యువ, నాగ మహేశ్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూ΄ాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్. ఎస్, సంగీతం: అజనీష్ లోక్నాథ్.