Pakistan Occupied Kashmir
-
పాక్ ఆక్రమిత కశ్మీర్ ‘భారత్ కిరీటంలో రత్నం’
జౌన్పూర్ (యూపీ): Pakistan Occupied Kashmir)పాక్ ఆక్రమిత కశ్మీర్ మన దేశపు కిరీటంలో రత్నం లాంటిదని, అది లేకుండా జమ్మూకశ్మీర్ అసంపూర్ణమని రక్షణ మంత్రి (Rajnath Singh)రాజ్నాథ్ సింగ్ అన్నారు. (Jammu Kashmir)జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంపొందించే కుట్రను పాకిస్తాన్ కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు. జౌన్పూర్ జిల్లా నిజాముద్దీన్ పూర్ గ్రామంలో బీజేపీ సీనియర్ నేత జగత్ నారాయణ్ దూబే ఇంట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాజ్నాథ్ అక్కడ విలేకరులతో మాట్లాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్.. ఆ దేశానికి ఉగ్రవాదాన్ని, భారత వ్యతిరేక ప్రచారాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగించే విదేశీ భూభాగం తప్ప మరేమీ కాదన్నారు. అక్కడ ఉగ్రవాద శిబిరాలు, లాంచ్ ప్యాడ్లను కూల్చివేయాలని, లేదంటే తగిన ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి ఉంటుందని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. పాక్ నేత అన్వర్ ఉల్హక్ భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రక్షణ మంత్రి మండిపడ్డారు. మత ప్రాతిపదికన భారత్కు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు పాక్ ప్రయతి్నస్తోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, ప్రస్తుతం అత్యధికంగా 5జీని ఉపయోగిస్తున్న భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. -
కొందరి బలహీనత వల్లే పీఓకే చేజారింది.. నెహ్రూపై విదేశాంగ మంత్రి
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) భారత్లో అంతర్భాగమేనని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. కొంతమంది బలహీనత వల్లే పీఓకేపై భారత్ నియంత్రణ కోల్పోయిందని ఆరోపించారు. ఒకరు చేసిన పొరపాటే దీనికి కారణమని చెప్పారు. భారత తొలి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా ఉద్ధేశిస్తూ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్లో ‘విశ్వబంధు భారత్’ పేరుతో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ పీఓకేపై జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్ విలీనం చేసుకునే విషయమై లక్ష్మణ రేఖ వంటివి ఉన్నాయంటే తాను నమ్మబోనని చెప్పారు.లక్ష్మణ రేఖ వంటిది ఏదీ లేదని పేర్కొన్నారు. భారత్లో పీఓకే అంతర్భాగమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కొందరి బలహీనత వల్లే పీఓకే తాత్కాలికంగా మన నుంచి చేజారిందని, దానిపై పట్టు కోల్పోవడానికి వారి పొరపాటే కారణం అని నెహ్రూపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. విశ్వ వేదికపై మన స్థానాన్ని బలంగా ఉంచుకోవాలని భావిస్తున్నానని, స్వీయ విశ్వాసాన్ని ఏనాడూ వీడొద్దన్నారు.చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, పాక్తో బీజింగ సహకారంపై జై శంకర్ విమర్శలు గుప్పించారు. ‘నేను చైనా రాయబారిగా ఉన్నాను, చైనా గత చర్యల గురించి మనందరికీ తెలుసు. ఈ భూమిని పాకిస్తాన్ లేదా చైనా తమదని చెప్పుకోలేదని మేము వారికి పదేపదే చెప్పాము. సార్వభౌమాధికారం ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే, అది భారతదేశం. మీరు ఆక్రమిస్తున్నారు, మీరు అక్కడ నిర్మిస్తున్నారు, కానీ చట్టపరమైన హక్కు మాదే.’నని పేర్కొన్నారు.చైనా పాకిస్తాన్ మధ్య 1963 సరిహద్దు ఒప్పందాన్ని కూడా జైశంకర్ ఎత్తి చూపారు. అక్కడ పాకిస్తాన్ దాదాపు 5,000 కి.మీ భూభాగాన్ని చైనాకు అప్పగించిందని అన్నారు. ‘1963లో, పాకిస్తాన్- చైనా తమ స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అంగీకరించాయి. చైనాను దగ్గరగా ఉంచడానికి, పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో దాదాపు 5,000 కి.మీలను డ్రాగన్కు అప్పగించింది. ఈ ప్రాంతం భారతదేశానికి చెందింది’ ఆయన తెలిపారు. -
‘పీఓకే’లో ఆందోళనలపై మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు
కోల్కతా: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) ఎప్పటికీ భారత్దేనని విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం పీఓకేలో జరుగుతున్న ఆందోళనలపై కోల్కతాలో బుధవారం(మే15) జరిగిన ఓ కార్యక్రమంలో జైశంకర్ స్పందించారు.పీఓకేలో ఉన్న ప్రజలు తమ జీవన ప్రమాణాలు, జమ్మూకాశ్మీర్లో ఉన్న ప్రజల జీవన స్థితులతో పోల్చుకుంటున్నారన్నారు. ‘పీఓకేలో ప్రస్తుతం ఆందోళనలు జరుగుతున్నాయి. వాటికి గల కారణాలు విశ్లేషించడం అంత సులభం కాదు.అయితే పీఓకే ప్రజలు తమ జీవన పరిస్థితులను జమ్మూ కాశ్మీర్ ప్రజల జీవన ప్రమాణాలతో పోల్చుకుంటున్నారని నా అభిప్రాయం. తాము వివక్షకు గురవుతున్నామని పీఓకే ప్రజలు భావిస్తున్నట్లున్నారు’అని జైశంకర్ అన్నారు. కాగా, ఇటీవల పెరిగిపోయిన ఆహారం, ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని పీఓకే ప్రజలు ఆందోళన బాట పట్టారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులపై దాడికి దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
పీఓకేలో తీవ్ర ఘర్షణలు
ఇస్లామాబాద్: ఆందోళనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణలతో పాకిస్తాన్ ఆక్రమిత కాశీ్మర్(పీఓకే) అట్టుడికిపోతోంది. శనివారం మొదలైన రగడ ఆదివారం మరింత ఉధృతమైంది. గోధుమ పిండి ధరలు విపరీతంగా పెరగడం, విద్యుత్ చార్జీలు మండిపోతుండడం పట్ల జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గంచాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. వారిని అడ్డుకొనేందుకు ప్రయతి్నంచిన భద్రతా సిబ్బందిపై తిరగబడుతున్నారు. తుపాకులతో కాల్పులు తెగబడుతున్నారు. ఆదివారం పీఓకేలోని ఇస్లాంగఢ్లో జరిగిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారి మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది పోలీసులే ఉన్నారు. పీఓకేలో పలు ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. తాజా పరిస్థితిపై సమీక్షించేందుకు పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. పీఓకేలో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చెప్పారు. -
పీవోకేలో భగ్గుమన్న నిరసనలు
మిర్పూర్: పన్నుల పెంపు, నిరసనకారుల అరెస్టులపై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో శుక్రవారం నిరసనలు భగ్గుమన్నాయి. మిర్పూర్ జిల్లా దద్యాల్ తహశీల్ పరిధిలో నిరసనకారులు భద్రతా బలగాలపై రాళ్లు రువ్వడంతోపాటు వారితో తలపడ్డారు. బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టాయి. కొన్ని టియర్ గ్యాస్ తూటాలు సమీపంలోని పాఠశాల ఆవరణలో పడగా విద్యార్థినులు గాయపడ్డారు.పెరుగుతున్న ధరలు, పన్ను భారం, విద్యుత్ కొరతకు సంబంధించి ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం అమలు చేయనుందుకు ఆగ్రహిస్తూ జమ్మూకశ్మీర్ జాయింట్ ఆవామీ కమిటీ 10వ తేదీన శుక్రవారం బంద్కు, 11న లాంగ్ మార్చ్కి పిలుపునిచి్చంది. దీంతో, భద్రతా బలగాలు గురువారం కమిటీ నాయకులు సహా 70 మందిని అదుపులోకి తీసుకున్నాయి. -
పీవోకేలో బస్సు ప్రమాదం.. 20 మంది దుర్మరణం
పెషావర్: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని గిల్గిట్–బల్టిస్తాన్లో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 20 మంది మృత్యువాతపడ్డారు. రావల్పిండి నుంచి గిల్గిట్ వైపు 43 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు దియామెర్ జిల్లాలో కారకోరం హైవేపైని పర్వత ప్రాంతంలో అదుపు తప్పి నది ఒడ్డున పడింది. ఈ దుర్ఘటనలో 20 మంది చనిపోగా మరో 21 మంది గాయపడ్డారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయినందునే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. -
పాక్లో భారీ వర్షాలు.. 37 మంది మృతి
పెషావర్: పాకిస్తాన్లోని ఆక్రమిత కశ్మీర్తోపాటు బలోచిస్తాన్, ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్స్ల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటల వ్యవధిలో ఈ ప్రాంతాల్లో వర్షాలు, వరద సంబంధిత ఘటనల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్స్లో ఇళ్లుకూలి, ఇళ్లలోకి వరద చేరిన ఘటనల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులేనని అధికారులు తెలిపారు. అదేవిధంగా, బలోచిస్తాన్, పీవోకేలో అయిదుగురు చొప్పున చనిపోయారు. గ్వాదర్ రేవు పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుంది. చైనా–పాకిస్తాన్లను కలిపే కారకోరం హైవే మూతబడింది. -
పీఓకేలో పాక్ బ్రిటన్ హైకమిషనర్ పర్యటన.. భారత్ తీవ్ర అభ్యంతరం
‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ లో (పీఓకే) ఇస్లామాబాద్ బ్రిటన్ రాయబారి పర్యటించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జేన్ మారియట్ పర్యటన అత్యంత అభ్యంతరకరమని పేర్కొంది. ఇది ‘భారత సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే చర్య’గా అభివర్ణించింది. కాగా పాకిస్థాన్లోని బ్రిటన్ హైకమిషనర్ జేన్ మారియట్ ఈనెల 10న పీఓకేలోని మీర్పూర్ను సందర్శించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు, వీడియోలను `ఎక్స్`లో పోస్ట్ చేశారు. ఆమె పర్యటనపై తాజాగా కేంద్ర విదేశీ వ్యవహరాల మంత్రిత్వశాఖ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇస్లామాబాద్లో బ్రిటన్ హై కమిషనర్ జాన్ మారియట్ పీవోకేలో పర్యటించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లడఖ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఈ ఉల్లంఘణపై విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా భారత్లోని బ్రిటీష్ హైకమిషనర్ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: మమ్మల్ని విమర్శించే హక్కు ఏ దేశానికి లేదు: మాల్దీవ్స్ అధ్యక్షుడు -
నెహ్రూ వల్లే కశ్మీర్లో కుంపట్లు
జమ్మూ కశ్మీర్ ఏడు దశాబ్దాలుగా అనుభవిస్తున్న కష్టనష్టాలన్నింటికీ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన భారీ తప్పిదాలే ఏకైక కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్సభలో ఆరోపించారు. అవే అక్కడ ఉగ్రవాదానికి, వేర్పాటువాద కుంపట్లకు, పాక్ ఆక్రమిత కశ్మీర్ పుట్టుకకు కారణమయ్యాయని దుయ్యబట్టారు. ‘‘మన సైన్యం పాక్ దళాలను తరిమికొడుతున్న వేళ కశ్మీర్ను పూర్తిగా తిరిగి స్వా«దీనం చేసుకోక ముందే నెహ్రూ ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించారు. అంతటితో ఆగకుండా కశ్మీర్ అంశాన్ని హడావుడిగా, అనవసరంగా ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చేసిన ఈ రెండు ఘోర తప్పిదాలే కశ్మీర్లో ఆరని కుంపట్లకు కారణమయ్యాయి. నెహ్రూది నిజంగా చారిత్రక తప్పిదం!’’ అని మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్, విపక్షాలు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చాయి. బీజేపీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించాయి. షా వ్యాఖ్యలను నిరసిస్తూ వాకౌట్ చేశాయి. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ, నెహ్రూయే గనక అప్పట్లో సరైన చర్యలు తీసుకుని ఉంటే కశ్మీర్లో చాలా భాగాన్ని పాక్కు కోల్పోయే వాళ్లమే కాదని పునరుద్ఘాటించారు. అంతేగాక పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పుడో తిరిగి భారత్లో అంతర్భాగంగా మారేదని అభిప్రాయపడ్డారు. ‘‘అప్పటికి మన సైన్యం పంజాబ్ దాటి కశ్మీర్కేసి దూసుకుపోతోంది. నెహ్రూ కాల్పుల విరమణను కనీసం మూడు రోజులు ఆలస్యం చేసినా పీఓకే ఇప్పుడు భారత్లో అంతర్భాగంగా ఉండేది’’ అని ఆక్షేపించారు. అంతా అయిపోయాక, కాల్పుల విరమణ పొరపాటు నిర్ణయమని నెహ్రూ తీరిగ్గా అంగీకరించారని విమర్శించారు. ఆయన చేసిన సరిదిద్దుకోలేని తప్పిదం వల్ల భారీ భూభాగాన్ని దేశం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. 1962లో చైనాతో భారత యుద్ధానికి దారి తీసిన నెహ్రూ ‘భారీ తప్పిదం’ గురించి కూడా మాట్లాడాలని బిజూ జనతాదళ్ సభ్యుడు భర్తృహరి మహతబ్ కోరగా అమిత్ షా తనదైన శైలిలో స్పందించారు. ‘‘నెహ్రూ తప్పిదాల్లో రెండింటిని ప్రస్తావిస్తేనే విపక్షాలు అలిగి వాకౌట్ చేశాయి. ఇక భారీ తప్పిదం గురించి మాట్లాడితే ఏకంగా రాజీనామా చేసేవేమో!’’ అంటూ ఎద్దేవా చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఎవరినీ అవమానించడానికి కాదని, జరిగిన వాస్తవాలను దేశం ముందుంచే ప్రయత్నం మాత్ర మేనని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఇక 370 ఆరి్టకల్ను రద్దు చేసే దమ్ము గత కాంగ్రెస్ సర్కారుకు లేకపోయిందని అమిత్ షా ఎద్దేవా చేశారు. -
కశ్మీర్ అసెంబ్లీలో పీఓకేకు 24 సీట్లు!
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతానికి 24 సీట్లు రిజర్వు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది! పీఓకే కూడా మన భూభాగమే కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ), రిజర్వేషన్ (సవరణ) బిల్లులను బుధవారం ఆయన లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆరు గంటల పై చిలుకు చర్చ అనంతరం సభ వాటిని ఆమోదించింది. అసెంబ్లీలో సీట్లను పెంచడంతో పాటు పలు కీలక అంశాలు ఈ బిల్లుల్లో ఉన్నాయి. గతంలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో 83 స్థానాలుండగా వాటిని 90కి పెంచాలని ప్రతిపాదించారు. కశ్మీర్ డివిజన్లో స్థానాలను 46 నుంచి 47కు, జమ్మూ డివిజన్లో 37 నుంచి 43కు పెంచారు. ‘‘పాక్ ఆక్రమిత కశ్మర్ కూడా భారత్లో అంతర్భాగమే. కనుక అక్కడ కూడా 24 స్థానాలను అసెంబ్లీలో రిజర్వు చేశాం’’ అని అమిత్ షా సభకు వెల్లడించారు. అన్యాయాన్ని సరిదిద్దేందుకే బిల్లులు 70 ఏళ్లుగా తమ హక్కులన్నింటినీ కోల్పోయి అన్నివిధాలా అన్యాయానికి గురైన కశ్మీరీలకు పూర్తిగా న్యాయం చేయడమే ఈ బిల్లుల ఉద్దేశమని అమిత్ షా చెప్పారు. కశ్మీర్లో ఉగ్రవాదానికి ఇప్పటిదాకా 45 వేల మంది బలయ్యారని ఆవేదన వెలిబుచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమివ్వకుండా మొదట్లోనే ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపి ఉంటే పండిట్లు లోయను వీడాల్సిన అవసరమే వచ్చేది కాదన్నారు. ‘‘కశ్మీర్లో 1947లో 31,789 కుటుంబాలు 1965–71 మధ్య 10,065 కుటుంబాల వారు నిర్వాసితులయ్యారు. ఇక 1980ల్లో ఉగ్రవాదం వల్ల మరెన్నో వేల మంది స్వదేశంలోనే శరణార్థులయ్యారు. వారందరికీ తిరిగి గుర్తింపుతో పాటు హక్కులు, అన్నిరకాల ప్రాతినిధ్యం కలి్పంచడమే తాజా బిల్లుల లక్ష్యం’’ అని వివరించారు. 2024లోనూ కేంద్రంలో మోదీ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం మాకుంది. అనంతరం రెండేళ్లలో జమ్మూ కశ్మీర్ను పూర్తిగా ఉగ్రవాద విముక్తం చేసి తీరతాం’’ అని చెప్పారు. ‘‘కశ్మీరీల్లో ఎంతోమంది శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. బిల్లుతో వారికి హక్కులు సమకూరుతాయి. విద్య, ఉద్యోగావకాశాలు వస్తాయి. ఎన్నికల్లో నిలబడి గెలిచే ఆస్కారముంటుంది’’ అని తెలిపారు. బిల్లుల విశేషాలు.. ► జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 90కి పెరుగుతుంది. ►ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు అసెంబ్లీలో తొలిసారిగా 9 స్థానాలు రిజర్వు చేశారు. ►కశ్మీర్ నుంచి వలస వెళ్లిన వారి కుటుంబాలకు 2 స్థానాలు కేటాయించారు. వీటిలో ఒక మహిళకు అవకాశమిస్తారు. ►పీఓకే నుంచి నిర్వాసితులై వచ్చి స్థిరపడిన వారికి ఒక స్థానం కేటాయించారు. ►రాష్ట్ర ప్రభుత్వోద్యోగాలు, వృత్తి విద్యా సంస్థల్లో పలు కేటగిరీల వారికి జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ బిల్లు ప్రకారం రిజర్వేషన్లు కలి్పస్తారు. ►ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు కూడా రిజర్వేషన్లు అందుతాయి. ►ప్రస్తుత రిజర్వేషన్ చట్టంలోని ‘బలహీన, గుర్తింపునకు నోచని వర్గాలు (సామాజిక కులాలు)’ అనే పదబంధాన్ని ‘ఇతర వెనకబడ్డ’గా మారుస్తారు. ►జమ్మూ కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రాన్ని లద్దాఖ్, కశ్మీర్ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తారు. -
పాకిస్తాన్పై పీఓకే కన్నెర్ర
కోట్లి (పీఓకే): పాకిస్తాన్పై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) వాసులు కన్నెర్రజేస్తున్నారు. దశాబ్దాలుగా పాక్ తమపై సవతి తల్లి ప్రేమ చూపుతోందంటూ మండిపడుతున్నారు. చివరికి కరెంటు బిల్లుల మదింపులో కూడా ఈ వివక్ష భరించలేనంత ఎక్కువగా ఉందంటూ వాపోతున్నారు. ‘మా ప్రాంతం నుంచే ఏకంగా 5,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతోంది. దాన్నంతటినీ తరలించుకుపోయి దేశమంతటికీ వాడుకుంటున్నారు. బిల్లుల విషయానికి వచ్చేసరికి ప్రధాన భూభాగంలో వారికి తక్కువగా, మాకు భరించలేనంత ఎక్కువగా వేస్తున్నారు. ఇది మా పట్ల సహించరాని అన్యాయం‘ అంటూ ఆక్రోశిస్తున్నారు. అది కాస్తా కొద్ది రోజులుగా ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకుంటోంది. భారీ కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా జనం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క కోట్లి జిల్లాలోనే కేవలం ఒక్క నెలలో రూ.139 కోట్ల బిల్లులు వచ్చాయని ప్రముఖ స్థానిక నేత తౌకీర్ వాపోయారు. ‘అందులో కేవలం రూ.19 కోట్ల బిల్లులు కట్టారు. వచ్చే నెల నుంచి అవి కూడా కట్టేది లేదు‘ అని అన్నారు. తమకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. -
ఎల్ఓసీ వెంట చైనా దుశ్చర్య
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సరిహద్దు అయిన నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంట పాకిస్తాన్ సైన్యం రక్షణపరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. ఈ పనులకు పొరుగున ఉన్న దాని మిత్రదేశం చైనా సహకరిస్తోందని భారత ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. డ్రోన్లు, కమ్యూనికేషన్ టవర్లను పాకిస్తాన్కు చైనా అందజేస్తోందని చెప్పారు. భూగర్భæ కేబుళ్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. పీఓకేలో చైనా స్థావరాలు పెరుగుతున్నాయని, వాటి రక్షణ కోసం పాక్ సైన్యానికి సాయం అందిస్తోందని అన్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న 155 ఎంఎం ఎస్హెచ్–15 శతఘ్నులను ఎల్ఓసీ వద్ద పాక్ మోహరించిందని పేర్కొన్నారు. పాక్ సైనిక పోస్టుల వద్ద చైనా సైనికాధికారులు తరచుగా కనిపిస్తున్నారని తెలియజేశారు. ఇదిలా ఉండగా, ఈ మొత్తం వ్యవహారంపై భారత సైన్యం ఇంకా అధికారికంగా స్పందించలేదు. తన ప్రయోజనాల కోసం చైనా చేస్తోందని నిపుణులంటున్నారు. -
సరిహద్దుకు ఎటువైపైనా దీటైన జవాబివ్వగలం
ససరాం: దేశ సరిహద్దుకు లోపల, వెలుపలా రక్షణ సన్నద్ధత, సామర్థ్యం విషయంలో భారత్కు తిరుగులేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ పునరుద్ఘాటించారు. బాలాకోట్లో ఉగ్రస్థావరంపై వైమానిక దాడులు, పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంపై సర్జికల్ దాడులే భారత సత్తాకు సాక్ష్యాలన్నారు. బిహార్లోని రోహ్తాస్ జిల్లాలో ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు దిగినపుడు భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారని తెల్సి మోదీ వెంటనే రష్యా, ఉక్రెయిన్, అమెరికా అధ్యక్షులతో ఒక్కటే మాట చెప్పారు. అంతే. నాలుగు గంటలపాటు యుద్ధం స్తంభించింది. విద్యార్థులను వెనక్కి తెచ్చేశాం. మోదీ ఘనత చూసి ప్రపంచమే నోరెళ్లబెట్టింది’ అని అన్నారు. -
ఉద్విగ్న క్షణాలు .. 75 ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్క, తమ్ముడు
లాహోర్: 75 ఏళ్ల క్రితం దేశ విభజన సమయంలో విడిపోయిన తోబుట్టువులు మళ్లీ కలుసుకున్నారు. చిన్నతనంలో వేరుపడిన అక్క, తమ్ముడిని సామాజిక మాధ్యమాలు వృద్ధాప్యంలో కలిపాయి. ఇటీవల వీరిద్దరూ కర్తార్పూర్ కారిడార్ వద్ద కలుసుకుని ఉద్విగ్నభరితులయ్యారు. పంజాబ్కు చెందిన సర్దార్ భజన్ సింగ్ కుటుంబం 1947లో దేశ విభజన సమయంలో చెల్లాచెదురైంది. కొడుకు పాక్ ఆక్రమిత కశ్మీర్కు చేరగా కూతురు మహేంద్ర కౌర్ భజన్ సింగ్ వెంటే ఉన్నారు. ఇటీవల రెండు కుటుంబాల వారు సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం పంచుకున్నారు. పంజాబ్లో ఉండే మహేంద్ర కౌర్ (81), పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉండే షేక్ అబ్దుల్ అజీజ్ (78) స్వయానా అక్క, తమ్ముడని తెలుసుకున్నారు. తమ కుటుంబాలతో కలిసి కర్తార్పూర్ కారిడార్ ద్వారా గురుద్వారా దర్బార్ సాహిబ్లో కలుసుకున్నారు. ఆలింగనాలు, ఆనంద బాష్పాలతో ఇద్దరూ ఉబ్బితబ్బిబ్బయ్యారని డాన్ పత్రిక పేర్కొంది. -
‘పాక్ బలహీనంగా ఉంది.. పీఓకేను వెనక్కి తీసుకోవడానికి ఇదే సరైన టైం’
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్పై(పీఓకే) కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్. ప్రస్తుతం పాకిస్థాన్ బలహీన పరిస్థితుల్లో ఉందని, పీఓకేను వెనక్కి తీసుకునేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. పీఓకేను సొంతం చేసుకోవటం మన బాధ్యత అని సూచించారు. పీఓకేను తిరిగి పొందాలనే భారత లక్ష్యం ఎన్నటికీ నెరవేరదని, తమ దేశాన్ని రక్షించుకునేందుకు సైనికులు సిద్ధంగా ఉన్నారని పాక్ సైన్యాధిపతిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన జనరల్ సయ్యద్ అసిమ్ మునిర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ పీఓకే వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘పీఓకేను పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకుంది. దానికి స్వేచ్ఛను కల్పించి, తిరిగి తీసుకోవటం మన బాధ్యత. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్లో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. పీఓకేను తిరిగి తీసుకోవటం మోదీ ప్రభుత్వ అజెండాలో భాగమని నమ్ముతున్నాను. కేవలం చర్చలకే పరిమితం కాకూడదు. పాకిస్థాన్ ప్రభుత్వం బలహీనంగా ఉంది. పీఓకేను తిరిగి పొందేందుకు ఇదే సరైన సమయం.’ అని పేర్కొన్నారు హరీశ్ రావత్. అంతకు ముందు ఈ ఏడాది అక్టోబర్ 28న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం పీఓకేపై సూత్రప్రాయ వ్యాఖ్యలు చేశారు. పీఓకేలోని శరణార్థులు తిరిగి తమ స్వదేశానికి వస్తారని పేర్కొన్నారు. పీఓకేను తిరిగి పొందేందుకు తమ సైన్యం సిద్ధమవుతున్నట్లు భారత సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సైతం కొద్ది రోజుల క్రితం పేర్కొన్నారు. ఇదీ చదవండి: పార్లమెంట్లో మహిళా సభ్యురాలిపై చేయి చేసుకున్న ఎంపీ.. వీడియో వైరల్ -
‘పీఓకే’ను తిరిగి పొందటమే లక్ష్యం!.. రక్షణ మంత్రి హింట్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ పర్యటనలో భాగంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)పై కీలక వ్యాఖ్యలు చేశారు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పీఓకే ప్రజలపై పాకిస్థాన్ అకృత్యాలకు పాల్పడుతోందని, దాని పర్యావసనాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. పీఓకేను తిరిగి చేజిక్కించుకోవటమే తమ లక్ష్యమని సూత్రప్రాయంగా వెల్లడించారు. పీఓకేలోని గిల్గిత్, బాల్టిస్తాన్ను చేరుకున్నాకే.. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధి సాధించినట్లవుతుందన్నారు. 1947లో శ్రీనగర్లో భారత వైమానిక దళం అడుగుపెట్టిన రోజును పురస్కరించుకుని నిర్వహించిన శౌర్య దివాస్ కార్యక్రమంలో మాట్లాడారు. ‘జమ్ముకశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధి ప్రయాణాన్ని ఇప్పడే ప్రారంభించాం. గిల్గిత్, బాల్టిస్తాన్ చేరుకున్నాకే మా లక్ష్యం నెరవేరుతుంది. పీఓకే ప్రజలపై పొరుగు దేశం అకృత్యాలకు పాల్పడుతోంది. దాని పర్యావసనాలు ఎదుర్కోక తప్పదు. ఉగ్రవాదం అనేది ఒక మతం కాదు. టెర్రరిస్టుల ఏకైక లక్ష్యం భారత్.’ అని పేర్కొన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. 2019, ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయటం ద్వారా జమ్ముకశ్మీర్ ప్రజలపై వివక్ష తొలగిపోయిందన్నారు. ఇదీ చదవండి: ముదురుతున్న వివాదం.. కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం -
‘పీవోకే’ అంశంపై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు!
సిమ్లా: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) విషయంలో 1971లో భారత్-పాక్ యుద్ధ సమయంలోనే నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హిమాచల్ప్రదేశ్, కంగ్రా జిల్లాలోని బదోలిలో అమరవీరుల కుటుంబాల సంత్కరించుకునే కార్యక్రమం వేదికగా పీవోకేపై మాట్లాడారు రాజ్నాథ్. ‘1971లో పాకిస్థాన్పై యుద్ధంలో విజయాన్ని పురస్కరించుకొని స్వర్ణోత్సవ వేడుకలను ఇటీవలే ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ యుద్ధం చరిత్రలో గుర్తుండిపోతుంది. ఇది ఆస్తుల కోసమో, అధికారం కోసమో జరిగిన యుద్ధం కాదు, మానవత్వం కోసం పోరాడి ప్రత్యర్థిపై విజయం సాధించాం. కానీ, ఒకింత బాధగా కూడా ఉంది. పీవోకే అంశంలో అప్పట్లోనే నిర్ణయం తీసుకోవాల్సింది.’ అని పేర్కొన్నారు రాజ్నాథ్. అనంతరం హమిర్పుర్ జిల్లాలోని నదౌన్లో నిర్వహించిన కార్యక్రమంలోనూ పాలుపంచుకున్నారు. గతంలో భారత్ రక్షణ ఉత్పత్తుల దిగుమతిదారుగా ఉండేదని, ఇప్పుడు ప్రపంచంలోని టాప్ 25 ఎగుమతిదారుల్లో ఒకటిగా భారత్ నిలిచిందన్నారు. 8 ఏళ్ల క్రితం రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు రూ.900 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.13,000 కోట్లు చేరిందని గుర్తు చేశారు రాజ్నాథ్. 2047 నాటికి రూ.2.7లక్షల కోట్లకు చేరుకునేలా లక్ష్యాన్ని నిర్దేషించుకున్నట్లు చెప్పారు. మానవత్వం కోణంలో భారత్ ఏదేశంపై దాడులు చేయాలేదని, ఏ దేశ భూభాగాన్ని ఆక్రమించుకోలేదన్నారు. కానీ, భారతలో శాంతికి విఘాతం కలిగంచాలని చూస్తే ధీటైన సమాధానం ఇస్తామని శత్రుదేశాలకు హెచ్చరికలు చేశారు. పాకిస్థాన్ అక్రమిత కశ్మీర్ భారత్లో అంతర్భాగమని, అదే వైఖరికి తాము కట్టుబడి ఉన్నామంటూ ఇటీవలే రాజ్నాథ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దేశ ప్రజలు ఎంతో భక్తితో కొలుచుకునే శారదా శక్తి పీఠం అక్కడే ఉందని ఆయన గుర్తు చేశారు. పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్నప్పటికీ పీవోకేలో ఒక్క కుటుంబానికి కూడా ఎలాంటి నష్టం జరగనీయబోమని తెలిపారు. భారత్ పై దుష్ట పన్నాగాలు పన్నేవారికి తగిన సమాధానం ఇచ్చేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామంటూ పాకిస్థాన్కు హెచ్చరికలు పంపారు. ఇదీ చదవండి: ఔరా! ఒంటి చేత్తో నగరంలోని సైకిళ్లన్నీ మాయం చేసిన దొంగ -
పీవోకేలో ఆమె పర్యటన.. భగ్గుమన్న భారత్
అమెరికా చట్టసభ్యురాలు ఇల్హాన్ ఒమర్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించడంపై భారత్ భగ్గుమంది. సంకుచిత మనస్తత్వ రాజకీయాలకు ఇది నిదర్శనమని గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. సోమాలియాలో పుట్టిపెరిగి, అమెరికా చట్టసభ్యురాలైన ఇల్హాన్ ఒమర్(39) మొదటి నుంచి భారత వ్యతిరేకి. నాలుగు రోజుల పాక్ పర్యటనలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి 24వ తేదీల మధ్య పాక్లో పర్యటించనుంది. ఈ తరుణంలో ఇల్హాన్ ఒమర్, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను ఇంటికెళ్లి మరీ కలిసింది. ఆపై ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్తో భేటీ అయ్యి కశ్మీర్ అంశంపైనా చర్చించింది కూడా. ఈ తరుణంలో ఆమె పీవోకే పర్యటన చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బాఘ్ఛి స్పందించారు. ప్రస్తుతం పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకున్న జమ్ము కశ్మీర్లోని భారత కేంద్రపాలిత అంతర్భాగాన్ని ఆమె పర్యటించాలనుకోవడం మా దృష్టికి వచ్చింది. ఇలాంటి రాజకీయ నాయకురాలు.. తమ సంకుచిత రాజకీయాలను ఆచరించాలని కోరుకుంటే, అది ఆమె ఇష్టం. కానీ, అలాంటి ఆమె ఇంట చేసుకోవాలి. అంతేగానీ ఆ ముసుగులో భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా. కశ్మీర్ అంశంపై ఒమర్తో జరిగిన భేటీ గురించి.. స్వయంగా ప్రధాని షెహబాజ్ మీడియాకు వివరించారు. లాహోర్తో పాటు ‘‘ఆజాద్ జమ్ము కశ్మీర్’’ల గురించి ఆమెకు తెలుసని, ఆ ప్రాంతాల్లో ఆమె సందర్శిస్తుందని పాక్ ప్రధాని తెలిపారు. చదవండి: థ్యాంక్స్ ‘మోదీ జీ’.. పాక్ కొత్త పీఎం ఆసక్తికర వ్యాఖ్యలు -
జమ్మూలో 6..కశ్మీర్లో 1
న్యూఢిల్లీ: జమ్మూ ప్రాంతంలో అదనంగా ఆరు నియోజకవర్గాలు, కశ్మీర్ ప్రాంతంలో ఒక అసెంబ్లీ స్థానాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ప్రతిపాదించింది. ఎస్సీలు, ఎస్టీలకు 16 నియోజకవర్గాలను రిజర్వు చేసింది. ప్రస్తుతం కశ్మీర్ డివిజన్లో 46, జమ్మూ డివిజన్లో 37 అసెంబ్లీ సీట్లున్నాయి. అయితే, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతానికి చెందిన 24 అసెంబ్లీ స్థానాలు కశ్మీర్ అసెంబ్లీలో ఖాళీగానే కొనసాగుతాయి. జమ్మూకశ్మీర్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదనలపై నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీడీపీ తదితర పార్టీలతోపాటు బీజేపీ మిత్రపక్షం పీపుల్స్ కాన్ఫరెన్స్ కూడా తీవ్ర నిరసన తెలిపాయి. ఈ సిఫారసులను బీజేపీ రాజకీయ ఎజెండాగా నేషనల్ కాన్ఫరెన్స్ అభివర్ణించింది. 2019 ఆగస్ట్లో జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత, 2020 ఫిబ్రవరిలో పునర్వ్యవస్థీకరణ కమిషన్ను కేంద్రం ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలోని ఈ కమిషన్లో జమ్మూకశ్మీర్కు చెందిన ఐదుగురు లోక్సభ ఎంపీలు అసోసియేట్ సభ్యులుగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్చంద్ర ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. సోమవారం జరిగిన కమిషన్ మొట్టమొదటి సమావేశానికి ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సహా బీజేపీ ఎంపీలు ఇద్దరు హాజరయ్యారు. ఈ ప్రతిపాదనలపై ఆయా పార్టీలు డిసెంబర్ 31వ తేదీలోగా తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. సమావేశం అనంతరం ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ.. గుప్కార్ డిక్లరేషన్లో భాగమైన ఐదు పార్టీల నేతలతో చర్చించాకే ఈ ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. ప్రతిపాదనలను అంగీకరించం ఈ ప్రతిపాదనలు నిరుత్సాహాన్ని కలిగిం చాయని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. ‘ప్రతిపాదనల కోసం అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన కమిషన్.. బీజేపీ రాజకీయ అజెండాను ముందుకు తీసుకురావడానికే మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. శాస్త్రీయ విధానాలకు బదులు రాజకీయ ఉద్దేశాలతోనే ప్రతిపాదనలకు రూపకల్పన చేశారు. 2011 జనగణన వివరాలను ఆధారంగా తీసుకోలేదు. వీటిని మేం అంగీకరించం’అని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనలపై సంతకం పెట్టేది లేదని ఎన్సీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ప్రజలను మత, ప్రాంతాల వారీగా విభజించేందుకు, బీజేపీ రాజకీయ ప్రయోజనాలను కాపాడేందుకే ప్రభుత్వం ఈ కమిషన్ను ఏర్పాటు చేసిందని పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ దుయ్యబట్టారు. -
బీజేపీ, ఆరెస్సెస్లతో భారత్కు ప్రమాదం
ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే) శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, ఆరెస్సెస్లపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, ఆరెస్సెస్ల విధానం మొత్తం భారత్కే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ‘బీజేపీ, ఆరెస్సెస్ల సైద్ధాంతిక విధానంతో మొత్తం భారత్కే ముప్పు కలుగుతుంది. వారు ముస్లింలను మాత్రమే లక్ష్యంగా చేసుకోరు. వారు క్రిస్టియన్లను, సిఖ్లను, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలను కూడా తమ వేధింపులకు లక్ష్యంగా చేసుకుంటారు. ఎందుకంటే ఈ వర్గాలను వారు తమతో సమానులుగా భావించరు’ అని ఇమ్రాన్ విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూకశ్మీర్లో కశ్మీరీలపై వేధింపులు మరింత పెరిగాయన్నారు. అన్ని అంతర్జాతీయ వేదికలపై తాను కశ్మీరీల తరఫున బ్రాండ్ అంబాసడర్గా వ్యవహరిస్తున్నానన్నారు. కశ్మీరీల న్యాయమైన పోరాటంలో పాకిస్తాన్ వారికి తోడుగా ఉంటుందన్నారు. జులై 25న పీఓకేలో ఎన్నికలు జరగనున్నాయి. -
పీఓకేలో ఉగ్ర స్థావరాలు ధ్వంసం!
న్యూఢిల్లీ: కశ్మీర్లో అలజడి సృష్టించడమే లక్ష్యంగా ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాకిస్తాన్కు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని అనుమానిత ఉగ్రవాద స్థావరాలపై గురువారం విరుచుకుపడింది. భారత సైన్యం దాడిలో ముష్కరుల స్థావరాలు ధ్వంసమైనట్లు సమాచారం. వారికి భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు పీఓకేలో తిష్ట వేశారు. పాకిస్తాన్ సైనికుల అండతో భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి కుట్రలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. చలికాలం ప్రారంభం కావడానికంటే ముందే ఉగ్రవాదులను భారత్లోకి పంపాలని పాక్ విశ్వప్రయత్నాలు సాగిస్తోంది. భారత సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో పాక్ ఆటలు సాగడం లేదని అధికారులు వెల్లడించారు. పాక్ సైన్యం ఇటీవల తరచుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఎల్ఓసీ వద్ద భారత సైన్యంపై, పౌరులపై కాల్పులకు తెగబడుతోంది. భారత్పై కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్ సైన్యానికి హెచ్చరికలు పంపడంతోపాటు ఉగ్రవాదుల పీచమణచడమే లక్ష్యంగా భారత సైన్యం పీఓకేలో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. అయితే, నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద గురువారం ఎలాంటి కాల్పులు జరగలేదని సైనిక వర్గాలు స్పష్టం చేశాయి. -
భగ్గుమన్న భారత్.. పీఓకే ఆక్రమణ..!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రశాంతంగా ఉన్న సరిహద్దు వెంబడి చిచ్చు రాజేసేందుకు దాయాది దేశం కుట్రలు పన్నుతోంది. వివాదాస్పద గిల్గిత్-బాల్టిస్తాన్ను (జీబీ)ను దానికి వేదికగా చేసుకుంది. ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎత్తులు వేస్తున్నారు. భారత ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయకుండా గుడ్డెద్దు మాదిరిగా ముందుకు వెళ్తున్నారు. పూర్వ కశ్మీర్లో అంతర్భాగంగా ఉన్న బాల్టిస్తాన్ ప్రాంతాన్ని సంపూర్ణ ప్రావిన్స్గా మార్చి (పూర్తి స్థాయి రాష్ట్ర హోదా) తన చేతిలో తీసుకోవాలని ఊవ్విళ్లూరుతున్నారు. భారత హెచ్చరికల్ని తుంగలో తొక్కి వివాదాస్పద ప్రాంతంలో పర్యటించిన ఇమ్రాన్.. అక్కడ ఎన్నికల నిర్వహిస్తున్నామని ప్రకటించి భారత్ సార్వభౌమత్వానికే సవాల్ విసిరారు. ఈ ప్రకటన ఇప్పుడు ఇరు దేశాల మధ్య కొత్త వివాదాన్ని రాజేసింది. తక్షణమే వెళ్లిపోండి.. భారత్ హెచ్చరిక అవిభాజ్య కశ్మీర్లో అంతర్భాగంగా ఉన్న బాల్టిస్తాన్ ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అధికారం పాక్ ప్రభుత్వానికి లేదని భారత్ వాదిస్తోంది. ఈ మేరకు దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ దేశ భూభాగంలో అంతర్భాగమైన గిల్గిత్–బాల్టిస్తాన్ను పాకిస్తాన్ దొంగదారిలో ఆక్రమించుకుందని, అక్కడి నుంచి తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అంతేకాకుండా గిల్గిత్–బాల్టిస్తాన్ ప్రాంతానికి ప్రొవెన్షియల్ హోదా కల్పించేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు ప్రారంభించడాన్ని తీవ్రంగా ఖండించారు. హోదా మార్చడమే కాకుండా.. ఆక్రమిత ప్రాంతం (పీవోకే) నుంచి తక్షణమే వెళ్లిపోవాలని ప్రకటించారు. ప్రొవెన్షియల్ హోదా ఇస్తామంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన తరుణంలోనే ఆయన ఈ ప్రకటన చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య ఏడు దశాబ్దాల నాటి వివాదం మళ్లీ రాజుకుంది. గిల్గిత్–బాల్టిస్తాన్ తొలినుంచీ జమ్మూకశ్మీర్లో అంతర్భాగం. కానీ 1947 దేశ విభజన సమయంలో పాకిస్తాన్ ఆక్రమించిన 78,114 చదరపు కిలోమీటర్ల కశ్మీరంలో ఉత్తరాన ఈ భూభాగం ఉంది. వివాదాస్పదమైన ఈ ప్రాంతాన్ని ఇన్నాళ్లూ పాకిస్తాన్ పాలనాపరమైన అవసరాల కోసం వాడుకుంది. ఇప్పుడు ఏకంగా ఆ ప్రాంతాన్ని సంపూర్ణ ప్రావిన్స్గా మార్చి (పూర్తి స్థాయి రాష్ట్ర హోదా) నవంబర్ 15న ఎన్నికల్ని నిర్వహించడానికి సిద్ధమవు తోంది. సింధ్, పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫంక్తున్వా తర్వాత అయిదో ప్రావిన్స్గా గిల్గిత్ బాల్టిస్తాన్ను ప్రకటించడం కోసమే ఇమ్రాన్ఖాన్ ఆ ప్రాంతంలో పర్యటించారు. పాక్ కడుపుమంట.. భారత్పై ఆధిపత్యం కోసం ఆ ప్రాంత ప్రజల మనోభావాలను కూడా లెక్కచేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఇలా చేయడంవల్ల పాక్కి ఏమాత్రం లాభం కూడా లేదు. గత ఏడాది ఆగస్టులో జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకున్నాక గిల్గిత్ బాల్టిస్తాన్ను లద్దాఖ్లో అంతర్భాగంగా చూపిస్తూ మ్యాప్లు విడుదల చేసింది. అప్పట్నుంచి కడుపు మంటతో రగిలిపోతున్న పాక్ గిల్గిత్ బాల్టిస్తాన్ను దురాక్రమణ చేయాలన్న దుస్సాహసానికి దిగుతోంది. ఈ ప్రాంతానికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించి రాజకీయంగా, చట్టపరంగా పాక్ పట్టు బిగిస్తే, చైనా ఈ ప్రాంతంలో బలపడడానికి అవకాశం వస్తుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. పీఓకే అంతా భారత్దే గిల్గిత్ బాల్టిస్తాన్ను ప్రావిన్స్గా మార్చి రాజకీయంగా పట్టు సాధించడానికి పాక్ చేస్తున్న కుయుక్తుల్ని ఎట్టి పరిస్థితిల్లోనూ సహించబోమని భారత్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపింది. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా పాక్ అడుగు ముందుకు వేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని విదేశాంగ శాఖ హెచ్చరికలు చేసింది. పీఓకేలోని ప్రతీ అంగుళం భూమి భారత్కే చెందుతుందని స్పష్టం చేసింది. అయితే కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఆ ప్రాంతంపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ మరింత పట్టుసాధించింది. ఇక అవిభాజ్య భారత్లో భాగంగా ఉన్న పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను సైతం స్వాధీనం చేసుకోవాలని భారత్ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే గిల్గిట్ బాలిస్తాన్పై తాజా ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. దీనిపై బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు ఇదివరకే బహిరంగ ప్రకటనలు చేశారు. పాకిస్తాన్ స్వాధీనం చేసుకున్న భూభాగాలను ఆక్రమించుకోవడం తమ లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు. దీనిలో భాగంగానే కశ్మీర్ మ్యాప్లో జీబీని అంతర్భాగంగా చూపినట్లు అర్థమవుతోంది. మరి మోదీ-షా ద్వయం ఏ విధమైన వ్యూహాలు రచిస్తారో వేచి చూడాలి. -
నవంబర్లో గిల్గిత్ అసెంబ్లీ ఎన్నికలు
ఇస్లామాబాద్: నవంబర్ 15వ తేదీన గిల్గిత్– బాల్టిస్తాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరపనున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని ప్రాంతంలో ఎన్నికలు జరిపేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాలపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. సైన్యం ఆక్రమించుకున్న ఆ ప్రాంతంలో ప్రస్తుతమున్న పరిస్థితులను మార్చేందుకు చేసే ఎలాంటి ప్రయత్నం కూడా న్యాయపరంగా చెల్లుబాటు కాదని పేర్కొంది. 2017 ఎన్నికల చట్టం ప్రకారం గిల్గిత్– బాల్టిస్తాన్ శాసన సభకు నవంబర్ 15న ఎన్నికలు జరుగుతాయని పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, ఆక్రమించుకున్న ప్రాంతాలపై పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు చెల్లుబాటు కావని భారత్ పేర్కొంది. విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ..భారత్ అంతరంగిక విషయాలపై మాట్లాడేందుకు పాక్కు ఎలాంటి హక్కు లేదన్నారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్లతోపాటు గిల్గిత్–బాల్టిస్తాన్ భారత్లో అంతర్భాగంగా ఉన్నాయనీ, ఎప్పటికీ ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం పాక్ సీనియర్ దౌత్యాధికారికి నోటీసులు జారీ చేసింది. -
‘క్వీన్’కు కేంద్రం రక్షణ!
న్యూఢిల్లీ: సినీనటి కంగనా రనౌత్కు వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కేటగిరీలో ఉన్నవాళ్లకు దాదాపు పదిమంది కమాండోలు రక్షణగా ఉంటారు. తనకు రక్షణ కల్పించడంపై కంగన కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ధన్యవాదాలు తెలిపారు. దేశభక్తులను ఎవరూ తొక్కేయలేరని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్ర నిర్ణయంపై శివసేన, కాంగ్రెస్లు విమర్శలు గుప్పించాయి. రెండ్రోజుల క్రితం ముంబైను పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పోలుస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలపై శివసేన సహా పలువురు భగ్గుమన్నారు. దీంతో తాను ఈ నెల 9న ముంబై వస్తున్నానని, ఎవరైనా ధైర్యముంటే అడ్డుకోవచ్చని ఆమె సమాధానమిచ్చారు. ఈ సవాళ్ల నేపథ్యంలోనే కేంద్రం ఆమెకు 24గంటల సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. వై ప్లస్ కేటగిరీలో ఆమెకు 10– 11 మంది కమాండోలు షిఫ్టుల వారీగా రక్షణ ఇస్తారు. ఆమె నివాసానికి వచ్చిపోయేవాళ్లందరినీ వీళ్లు పర్యవేక్షిస్తారు. ఒక ఎస్కార్ట్ వాహనం కూడా కేటాయిస్తారు. సుశాంత్ మరణం తర్వాత ముంబై సురక్షితంగా లేదని, బాలీవుడ్లో కొందరికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని కంగనా ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కంగనాకు కేంద్రం సెక్యూరిటీ కల్పించడంపై హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ హర్షం ప్రకటించారు. కంగనాను హిమాచల్ కన్నబిడ్డగా అభివర్ణించారు. ఆమెకు రక్షణ ఇచ్చేందుకు కేంద్రం, తమ రాష్ట్రం సిద్దమన్నారు. మనాలీలో ఆమె నివాసానికి స్థానిక పోలీసులు రక్షణ ఇస్తారన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ఇటీవలే కంగనాకు రక్షణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. ‘‘కావాలంటే నన్ను ఈ పరిస్థితుల్లో ముంబై వెళ్లవ ద్దని సూచించవచ్చు. కానీ కేంద్ర హోం మంత్రి నా ఆత్మాభిమానాన్ని గుర్తించారు. అందుకే రక్షణ కల్పించారు. ఇది భరతమాత ఆడబిడ్డకు ఇచ్చిన గౌరవం. వారికి నా కృతజ్ఞతలు’’ అని కంగనా వ్యాఖ్యానించారు. అసలు గొడవేంటి? బాలీవుడ్లో డ్రగ్స్ మాఫియాను బయటపెడుతున్న కంగనాకు శివసేన ప్రభుత్వం రక్షణ ఇవ్వాలని ఇటీవల బీజేపీ నేత రామ్ కదమ్ కోరారు. దీనిపై కంగనా స్పందిస్తూ మూవీ మాఫియా కన్నా ముంబై పోలీసులంటే తనకు భయమని ట్వీట్ చేశారు. వారికి బదులు హిమాచల్ ప్రభుత్వం లేదా కేంద్రం తనకు రక్షణ కల్పించాలన్నారు. దీనిపై శివసేన నేత సంజయ్ రౌత్ ఘాటుగా స్పందిస్తూ ఆమెను ముంబైకి రావద్దని, ముంబై పోలీసులను ఆమె అవమానించారని మండిపడ్డారు. దీనికి బదులుగా ముంబై ఏమైనా పీఓకేనా? అని కంగన ప్రశ్నించారు. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని రౌత్ ముంబై ప్రభుత్వాన్ని కోరారు. నా ఆఫీస్ కూలుస్తారేమో! మున్సిపల్ అధికారులు ముంబైలోని తన ఆఫీసును కూల్చేస్తారేమోనని కంగనా అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు తన ఆఫీసు వద్ద ఉన్న వీడియోను ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సోమవారం మున్సిపల్ అధికారులు తన ఆఫీసుకు వచ్చారని, మంగళవారం ఆఫీసును కూల్చవచ్చని ఆమె ట్విట్టర్లో కామెంట్ చేశారు. కార్యాలయ ఆస్తి విషయంలో అవకతవకలకు పాల్పడలేదని వివరించారు. ఒకవేళ అక్రమ నిర్మాణం ఉంటే నోటీసు ఇవ్వవచ్చన్నారు. అధికారులు బలవంతంగా ఆఫీసులోకి వచ్చి కొలతలు తీసుకున్నారని, ఇరుగుపొరుగును కూడా ఇబ్బంది పెట్టారని చెప్పారు. -
వై ప్లస్ సెక్యూర్టీ!
‘‘ప్రస్తుతం ముంబై పరిస్థితి కాశ్మీర్ను తలపిస్తోంది’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఆయితే ఆ కామెంట్లు పలువురు మహరాష్ట్ర నేతలకు రుచించలేదు. కంగనాను ముంబైలో అడుగుపెట్టనివ్వం అన్ని సవాళ్లు విసిరారు. లాక్డౌన్లో వచ్చిన బ్రేక్ కారణంగా తన సొంతూరు భంభ్లాలో ఉంటున్నారు కంగనా. హిమాచల్ ప్రదేశ్లోని చిన్న పట్టణం ఇది. ‘‘సెప్టెంబర్ 9న ముంబై వస్తున్నా’’ అని ప్రకటించారు కంగనా. ఆమెకు భద్రత కల్పించాల్సిందిగా కంగనా సోదరి రంగోలి, ఆమె తండ్రి ప్రభుత్వాన్ని కోరారట. దాంతో ఆమె హిమాచల్ ప్రదేశ్లో ఉన్నప్పుడే కాదు.. ముంబైలోనూ సెక్యూర్టీ కల్పిస్తామని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రికమండ్ చేసిన మేరకే కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ సెక్యూర్టీ అందించడానికి సిద్ధమవుతోందని సమాచారం. 9న ముంబై చేరుకున్నప్పటి నుంచి కంగనాకి కేంద్ర ప్రభుత్వం ఈ భద్రత కల్పించనుందట. -
కంగనా క్షమాపణ చెప్పాలి: శివసేన
ముంబై: ముంబై, మహారాష్ట్రలను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన నటి కంగనా రనౌత్ ముందుగా క్షమాపణ చెపితే, తాను క్షమాపణ చెప్పే విషయం ఆలోచిస్తానని శివసేనకు చెందిన ఎంపీ సంజయ్ రావత్ అన్నారు. ఇటీవల కంగనా రనౌత్ పాక్ ఆక్రమిత కశ్మీర్తో ముంబైని పోలుస్తూ చేసిన వ్యాఖ్యానాలతో అధికార శివసేన నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అహ్మదాబాద్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్తో పోల్చగల ధైర్యం కంగనా రనౌత్కు ఉందా అని రావత్ ప్రశ్నించారు. కంగనా ట్వీట్పై ఆయన మీడియాతో ‘‘ఎవరైనా ఇక్కడ నివసిస్తూ, ఇక్కడ పనిచేస్తూ, ముంబై, మహారాష్ట్ర, మరాఠా ప్రజల గురించి చెడుగా మాట్లాడితే, అటువంటి వారే మొదట క్షమాపణ చెప్పాలి. అప్పుడే నేను క్షమాపణ చెప్పే విషయాన్ని ఆలోచిస్తాను’’అని అన్నారు. -
నాలుగంచుల ఖడ్గం
కంగనకు ముంబై రోడ్లు బ్లాక్ అయి ఉన్నాయి. లోపలికి రానివ్వం అంటున్నారు శివసైనికులు. ‘క్వీన్’లో ఇలాగే ఆమె పెళ్లి బ్లాక్ అయిపోతుంది. అప్పుడు ఆత్మాభిమానం అనే ఖడ్గాన్ని తీస్తుంది. ఇప్పుడూ.. సేమ్ అదే.. సెల్ఫ్ రెస్పెక్ట్ ఆయుధం. మూవీ మాఫియా.. సోషల్ మీడియా... ముంబై పోలీసులు.. స్టార్లు, కో–స్టార్లు.. వీళ్లందరిపై.. ఒంటరిగా యుద్ధం చేస్తోంది. నాలుగంచుల ఖడ్గంగా రీమేక్ అవుతోంది. రేపు ముంబై బయల్దేరాలి కంగనా రనౌత్. రేపు బయల్దేరితేనే ఎల్లుండికి ముంబైలో ఉంటారు. ఏమిటి అంత అత్యవసరం? ఆమె చాలెంజ్ చేశారు. ‘తొమ్మిదిన ముంబైలో దిగుతున్నాను.. ఎవరు అడ్డుకుంటారో చూస్తాను’ అని. ఆ ఛాలెంజ్ మహారాష్ట్ర హోమ్ మినిస్టర్కి! ‘మూవీ మాఫియా కన్నా డేంజర్ ముంబై పోలీసులు అన్నావు కదా. అయితే ముంబై రాకు’ అన్నారాయన. కంగన ఛాలెంజ్ శివసేన ఎంపీకి కూడా. ‘ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ అన్నావు కదా.. అయితే నువ్వెలా ముంబైలోకి అడుగుపెడతావో చూస్తాను’ అన్నారు ఆయన. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ మరణం తర్వాత కంగన చాలామందిని చాలానే అన్నారు. అలా అనడంలో ఒంటరి అయిపోయారు. ఒంటరిగా ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడూ ఒంటరిగానే మనాలి నుంచి క్యాబ్లోనో, బస్లోనో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి విమానంలో ముంబై వెళుతున్నారు! కొన్నాళ్లుగా కంగన హిమాచల్ ప్రదేశ్లో తను ఇల్లు కట్టుకున్న మనాలిలో తల్లితో కలిసి ఉంటున్నారు. ముంబై చిత్రసీమలోని బంధుప్రీతి మీద, అక్కడి డ్రగ్ ముఠాల మీద, మీడియా మాఫిమా మీద, ముంబై పోలీసుల మీద ధైర్యంగా మాట్లాడగలిగిన అమ్మాౖయెతే కాదు కంగన. కానీ మాట్లాడుతున్నారు! ఆ ధైర్యం ముంబై ఇచ్చిందే. అవతలి వ్యక్తిలో తప్పు కనిపిస్తే వచ్చే ధైర్యం అది. ముంబైలో ఒక తప్పు కాదు, వంద తప్పులు కనిపించాయి కంగనకు. ముంబై చేసిన మొదటి తప్పు.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమెకు మత్తు మందు ఇచ్చి ఆమెను ఆక్రమించుకోవడం. చివరి తప్పు (ఆమె మనాలి వెళ్లే ముందు వరకు) సుశాంత్ ఎలా చనిపోయాడో తెలియనివ్వకుండా చంపేయడం. తక్కిన బయటి తారల్లా ముంబై తనకు సంబంధం లేని విషయం అనుకోవడం లేదు కంగన. ముంబై ఆమెకు ఎంత ఇచ్చిందో కానీ, ఆమె దగ్గర్నుంచి చాలానే తీసేసుకుంది! ముఖ్యంగా ఆమె అమాయకత్వాన్ని. ముంబై వచ్చిన కొత్తలో ‘క్వీన్’లా ఉన్నారు కంగన. 2014 లో వచ్చిన ఆమె చిత్రం ‘క్వీన్’ లోని రాణీ మెహ్రాలా.. కోమలంగా, లాలిత్యంగా. ‘క్వీన్’ సినిమాలో సగటు పంజాబీ అమ్మాయి కంగన. ఫ్యామిలీ ఢిల్లీలో ఉంటుంది. తండ్రిది మిఠాయి దుకాణం. పెళ్లికి ఏర్పాట్లు అవుతుండగా అప్పుడు చెబుతాడు ఆమెకు రాజ్కుమార్రావ్.. ‘నీకూ నాకూ అసలేదీ కలవదు.. ఐయామ్ సారీ. నేన్నిన్ను పెళ్లి చేసుకోలేను. చేసుకుని నా లైఫ్స్టెయిల్తో నిన్ను బాధించలేను’ అని! విదేశంలో కొంతకాలం ఉండొస్తాడు అతడు. అదీ స్టెయిల్. ఆమె వెంటపడి వెంటపడి ప్రేమించినప్పుడు, ఆమెను పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను ఒప్పించినప్పుడు, ఆమెకు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగినప్పుడు, పెళ్లయ్యాక హనీమూన్కి పారిస్, ఆమ్స్టర్డ్యామ్ టిక్కెట్లు బుక్ చేసుకున్నప్పుడు అతడికి తన లైఫ్స్టెయిల్ గుర్తుకు రాదు. పెళ్లి ఆగిపోతుంది. ఆ షాక్ నుంచి తేరుకోడానికి కసిగా.. తనొక్కటే తల్లిదండ్రులను ఒప్పించి ప్యారిస్ వెళ్లిపోతుంది కంగన. అక్కడి నుంచి ఆమ్స్టర్డ్యామ్. ఆ కొన్నాళ్ల ఒంటరి జీవితం ఆమెకు అనేక అనుభవాలను ఇస్తుంది. స్వేచ్ఛానుభూతులను మిగులుస్తుంది. ఒక తొలిముద్దును కూడా. ఓరోజు పల్చటి డ్రెస్ వేసుకుని తీసుకున్న సెల్ఫీని కంగన పొరపాటున రాజ్కుమార్ రావ్కి షేర్ చేస్తుంది. అది చూసి కంగనను వెతుక్కుంటూ ఆమ్స్టర్డ్యామ్ వస్తాడు. సారీ చెప్తాడు. తనను పెళ్లి చేసుకొమ్మని బలవంతం చేస్తాడు. ‘నువ్వెళ్లు. ఢిల్లీ వచ్చాక కలుస్తాను’ అంటుంది. కళ్లలో ఆశలు పెట్టుకుని, ఆమె కోసం మనసులో దీపాలు వెలిగించుకుని అతడు వెళ్లిపోతాడు. ఢిల్లీలో దిగాక కంగన నేరుగా రాజ్కుమార్ రావ్ ఇంటికి వెళ్లి, హ్యాండ్బ్యాగ్లో ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ని తీసి అతడి చేతిలో పెట్టి, ‘థ్యాంక్యూ’ చెప్పి వచ్చేస్తుంది. ఆమె ముఖంలో పెద్ద రిలీఫ్. ‘క్వీన్’ చిత్రం మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ప్రధానంగా అమ్మాయిలు ఆ సినిమాతో ‘రిలేట్’ అయ్యారు. ‘రాణిలా చూసుకుంటా..’ అనే మాట వినిపిస్తుంటుంది.. ప్రేమల్లో, పెళ్లిళ్లలో! ఎవరూ చూసుకోనవసరం లేదు. ఆత్మాభిమానమే ఆడపిల్లను రాణిని చేస్తుంది. ఆ ఆత్మాభిమానమే ఇప్పుడు నాలుగు భాషల్లోకి రీమేక్ అవుతోంది. తెలుగులో ‘దటీజ్ మహాలక్ష్మి’. క్వీన్ తమన్నా. తమిళ్లో ‘పారిస్ పారిస్’. క్వీన్ కాజల్. మలయాళంలో ‘జామ్ జామ్’. క్వీన్ మంజిమ. కన్నడంలో ‘బటర్ఫ్లై’. క్వీన్ పరుల్ యాదవ్. ముగ్గురు వేర్వేరు దర్శకులు రీమేక్ చేస్తున్న ఈ నాలుగు సినిమాలను మను కుమరన్ ఒక్కరే నిర్మిస్తున్నారు. ముంబై వచ్చిన కొత్తలో ‘క్వీన్’లా కోమలంగా ఉన్నారని కదా అనుకున్నాం కంగన గురించి. ముంబైకి ఎన్ని ముఖాలు ఉన్నాయో అన్ని ముఖాలూ తమ అసలు స్వరూపం చూపించి కంగనని క్రూరమైన రాణిగా రాటుదేల్చాయి. ఇప్పటికీ ఆమే బాలీవుడ్లో అత్యధిక పారితోషికం డిమాండ్ చేయగల బయటి తార. టాలెంట్ ఉంది. దాంతో పాటు ధర్మాగ్రహం ఉంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. నిజాన్ని నిర్భయంగా చెబుతారు. బాలీవుడ్ నలు చదరపు బంధుగణాల క్లబ్బులలో ఇమడని నికార్సయిన గుండ్రటి షాంపేన్ గ్లాస్ కంగనా రనౌత్. రాణి వెడలుతున్నారు. చూడాలి.. ముంబైలో బుధవారం రిక్టర్ స్కేలు ఎంత చూపిస్తుందో. తెలుగు క్వీన్ ‘దటీజ్ మహాలక్ష్మి’లో తమన్నా; తమిళ్ క్వీన్ ‘పారిస్ పారిస్’లో కాజల్ మలయాళీ క్వీన్ ‘జామ్ జామ్’లో మంజిమ; కన్నడ క్వీన్ ‘బటర్ ఫ్లై’లో పరుల్ యాదవ్ -
మరో వివాదంలో కంగనా
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పేరు వింటే వివాదాలే మొదట గుర్తుకొస్తాయి. తరచూ అందరి మీద నోరుపారేసుకునే ఆమె ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్తోనూ(పీఓకే), అధికార సంకీర్ణ సర్కార్ని తాలిబన్లతోనూ పోలుస్తూ చేసిన ట్వీట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ కంగనాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముంబై సురక్షితం కాదని భావిస్తే ఈ నగరంలో ఉండే హక్కు ఆమెకు లేదన్నారు. నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో కంగనా ముంబై పోలీసుల్ని లక్ష్యంగా చేసుకొని వరస ట్వీట్లు చేశారు. మూవీ మాఫియా కంటే ముంబై పోలీసులే ప్రమాదకారులని, వారిపై తనకు విశ్వాసం లేదని కామెంట్లు ఉంచారు. ఈ ట్వీట్ చుట్టూ మొదలైన వివాదం పెద్దదైంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పార్టీ పత్రిక సామ్నాలో కంగనాపై విమర్శలు గుప్పిస్తూ వ్యాసం రాశారు. ముంబై పోలీసులంటే గౌరవం లేని ఆమె నగరంలో అడుగు పెట్టవద్దన్నారు. ఆమె ముంబైకి వస్తే అది పోలీసులకే అవమానకరమన్నారు. ముంబై వస్తా .. ఆపే దమ్ముందా ? సంజయ్ రాసిన ఆర్టికల్తో కంగనా మరింతగా చెలరేగిపోయారు. ముంబై ఒక పాక్ ఆక్రమిత కశ్మీర్ అని ట్వీట్ చేశారు. కరోనా నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో తన సొంత ఇంట్లో ఉంటున్న కంగనా..ముంబై రావద్దంటూ కొందరు తనని హెచ్చరిస్తున్నారని అందుకే నగరానికి రావాలని నిర్ణయించుకున్నానన్నారు. ‘‘9న ముంబైకి వస్తున్నాను. దమ్ముంటే అడ్డుకోండి’’అంటూ ట్వీట్ చేశారు. పోలీసుల్ని అవమానించడం దారుణం కంగనా వ్యాఖ్యల్ని రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ తప్పు పట్టారు. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో పోలీసులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తూ ఉంటే కంగనా వారిని టార్గెట్ చేయడం దారుణమన్నారు. ముంబైలో భద్రత కరువైందని ఆమె అనుకుంటే నగరంలో నివసించే హక్కు కూడా లేదన్నారు. దీనికి కంగనా స్పందిస్తూ తన ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసే హక్కు ఎవరికీ లేదని, ప్రభుత్వం తాలిబన్లని తలపిస్తోందని దాడికి దిగారు. -
పాక్ దుర్నీతి : పీఓకేను కలిపేస్తూ నూతన మ్యాప్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మరోసారి తన దుర్నీతిని ప్రదర్శించింది. జమ్ము, కశ్మీర్, లడఖ్ ప్రాంతాలనూ తమ భూభాగాలుగా పేర్కొంటూ నూతన రాజకీయ మ్యాప్కు పాక్ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జమ్ము కశ్మీర్కు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే ఆర్టికల్ 370ను భారత్ రద్దు చేసి బుధవారంతో ఏడాది అవుతున్న క్రమంలో పాకిస్తాన్ ఈ మ్యాప్ను విడుదల చేయడం గమనార్హం. కొత్త మ్యాప్ను పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ ఆవిష్కరిస్తూ ఇది పాకిస్తాన్, కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతోందని, పాక్ చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయమని అభివర్ణించారు. కాగా, ఇప్పటివరకూ పాక్ ఆక్రమిత కశ్మీర్లో అన్ని ప్రాంతాలను అధికారికంగా తమ భూభాగంగా పాకిస్తాన్ పేర్కొనడం లేదు. గిల్గిట్-బాల్టిస్తాన్ను తమ భూభాగంగా పాక్ పేర్కొంటుండగా, మిగిలిన ప్రాంతాన్ని ఆజాద్ కశ్మీర్గా పాక్ వ్యవహరిస్తోంది. నేపాల్ సైతం భారత భూభాగాన్ని తమదిగా పేర్కొంటూ ఇటీవల కొత్త మ్యాప్ను విడుదల చేయడం కలకలం రేగింది.అంతర్జాతీయ ఒత్తిళ్లతో పాటు నేపాల్ పాలక పార్టీలోనే తిరుగుబాటు రావడంతో భారత వ్యతిరేక చర్యలపై నేపాల్ వెనక్కుతగ్గింది. చదవండి : జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ దుశ్చర్య -
పీవోకే ప్రజలు భారత్లో కలవాలనుకుంటారు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) ప్రజలు కూడా భారత్లో చేరాలని కోరుకుంటారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ తీర్మానంతో ఆ ప్రాంతం కూడా దేశంలో అంతర్భాగంగా మారుతుందని చెప్పారు. జమ్మూకశ్మీర్లో పార్టీ చేపట్టిన జన్సంవాద్ ర్యాలీనుద్దేశించి ఆయన వర్చువల్ ప్రసంగం చేశారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్కు భద్రతా బలగాలు తగిన బుద్ధి చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా వేర్పాటువాదుల వెన్ను విరిచామని చెప్పారు. జాతి గౌరవం కాపాడే విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీపడబోదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సరిహద్దుల్లో సంభవించే అన్ని పరిణామాలను సరైన సమయంలో పార్లమెంట్లో వెల్లడిస్తామని, ఈ విషయంలో దాపరికం ఉండదని తెలిపారు. సైనిక, దౌత్యపరమైన సంభాషణల ద్వారా చైనాతో వివాదాన్ని పరిష్కరించుకుంటామని చెప్పారు. చైనా ఆధీనంలో ఉన్న ఆక్సాయ్ చిన్ కూడా భారత్లో కలిసిపోతుందని హోం మంత్రి అమిత్ షా ర్యాలీనుద్దేశించి అన్నారు. -
పాక్ పోర్టులో చైనా మరో నిర్మాణం.. అందుకేనా?
న్యూఢిల్లీ: సరిహద్దుల వద్ద భారత్తో విభేదాలు తలెత్తిన తరుణంలో చైనా మరింతగా దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో నావికా దళాల్నిమోహరించేందుకు వీలుగా పాకిస్తాన్లోని గ్వడార్ పోర్టు వద్ద సరికొత్త నిర్మాణాలు చేపట్టినట్లు సమాచారం. తాజాగా విడుదలైన సాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడవుతోంది. కాగా భారత్ అభ్యంతరాలను పక్కనపెట్టిన డ్రాగన్.. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) మీదుగా చైనా -పాక్ మధ్య వ్యూహాత్మక ఆర్థిక కారిడార్ (సీపెక్)ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రోడ్లు, నౌకాశ్రయాల వ్యవస్థ ద్వారా యూరప్, ఆసియా, ఆఫ్రికాలతో తన అనుసంధానాన్ని బలోపేతం చేసుకోవడం కోసం చైనా చేపట్టిన అత్యంత భారీ సిల్క్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా సీపెక్ నిర్మాణాన్ని తలపెట్టింది. (సరిహద్దు ఉద్రిక్తత : మోదీ, ట్రంప్ చర్చ) కర్టెసీ: సివింట్ ఈ క్రమంలో చైనా పశ్చిమ ప్రాంతం నుంచి పీఓకే మీదుగా అరేబియా సముద్రం తీరంలోని గ్వడార్ పోర్టుకు ఆర్థిక కారిడార్ ఏర్పాటు చేస్తోంది. తద్వారా వాణిజ్య సంబంధాల బలోపేతంతో పాటు ఇరాన్ సరిహద్దుల్లో తమ సైన్యాన్ని మోహరించడం సహా... గ్వడార్ పోర్టు ద్వారా హిందూ మహా సముద్రంపై పట్టు సాధించేందుకే డ్రాగన్ ఈ నిర్మాణాన్ని చేపట్టిందనే సందేహాలు ఉన్నాయి. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో గ్వడార్ పోర్టు ద్వారా సైన్యాన్ని తరలించేందుకే చైనా ఈ పోర్టును మరింతగా అభివృద్ధి చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.(పాక్లో హిందూ యువతులపై అకృత్యాలు) ఇదిలా ఉండగా.. సీపెక్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నస్థానిక ప్రజల దాడుల నుంచి తమ ఇంజనీర్లు, ఇతర కార్మికులకు కాపాడుకునేందుకే డ్రాగన్ తాజా నిర్మాణాలు చేపట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బలూచి ప్రజల ఆగ్రహ జ్వాలలకు తమ పౌరులు బలైపోకూడదనే ఉద్దేశంతో డ్రాగన్ ఈ చర్యకు ఉపక్రమించినట్లు పలువురు భావిస్తున్నారు. 2018లో కరాచిలోని చైనీస్ కాన్సులేట్పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసేందుకు ప్రయత్నించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. -
ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను సమర్థించిన శివసేన!
ముంబై: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భూభాగం భారత్ స్వాధీనంలోకి రావాలని పార్లమెంటు భావిస్తే.. ఆ దిశగా చర్యలు చేపడతామన్న ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే వ్యాఖ్యలను శివసేన సమర్థించింది. తుక్డే-తుక్డే గ్యాంగ్(వామపక్షాలు, వారికి మద్దతు తెలిపే వారిపై విమర్శల దాడి చేయడానికి బీజేపీ, రైట్ వింగ్ సభ్యులు తరచూ ఉపయోగించే పదం) అంటూ విమర్శలకు దిగే బదులు ఆర్మీ చీఫ్కు ఆదేశాలు జారీ చేయవచ్చు కదా అని బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ మేరకు..‘జనరల్ వ్యాఖ్యల్లో తప్పేం లేదు. పీఓకేలో చాలా వరకు ఉగ్రవాద క్యాంపులు ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ మద్దతుతో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అందుకే నరవాణే కొత్త విధానాన్ని మేం స్వాగతిస్తున్నాం. 1994 ఫిబ్రవరిలో జమ్మూ కశ్మీర్, పీఓకే భారత్లో అంతర్భాగమేనని పార్లమెంటు తీర్మానం చేసిందని నరవాణే చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం తుక్డే తుక్డే గ్యాంగ్ అంటూ విమర్శలు చేయడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తోంది. దానికి బదులు ఆర్మీ చీఫ్నకు భారత్ పటం ఇచ్చి ఆదేశాలు జారీ చేస్తే బాగుంటుంది’ అని తన అధికార పత్రిక సామ్నాలో శివసేన కథనం వెలువరించింది.(పార్లమెంటు ఓకే అంటే పీఓకేనూ సాధిస్తాం) అదే విధంగా పీఓకేపై భారత్ జరిపిన మెరుపు దాడులను ప్రస్తావిస్తూ... ఎన్ని దాడులు జరిగినా పాకిస్తాన్ తన అలవాట్లను మార్చుకోలేదని శివసేన విమర్శించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసి కేంద్రం మంచి పని చేసిందని.. ఇప్పుడు నరవాణే కోరినట్లు పీఓకేపై కూడా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ‘ మోదీ- షా నుంచి నరవాణేకు ఆదేశాలు అందిన వెంటనే పీఓకే మనదైపోతుంది. అప్పుడు అఖండ భారత్ను కోరుకున్న వీర్ సావర్కర్ విగ్రహం పూలమాలలతో నిండిపోతుంది. కాబట్టి ప్రధాని మోదీ వెంటనే నరవాణేకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలి. భారత ప్రజలంతా ఇదే కోరుకుంటున్నారు’ అని శివసేన కథనంలో పేర్కొంది. -
జమ్మూకశ్మీర్, లదాఖ్ల కొత్త మ్యాప్
న్యూఢిల్లీ: ఇటీవలే కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన జమ్మూకశ్మీర్, లదాఖ్ల కొత్త పటాన్ని కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఇందులో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) జమ్మూకశ్మీర్లో ఉండగా, గిల్గిత్–బల్టిస్తాన్ లదాఖ్లో ఉంది. పీఓకేలోని ముజఫరాబాద్ భారత సరిహద్దుగా ఉంది. తాజా పటం ప్రకారం లదాఖ్ రెండు జిల్లాలను (కార్గిల్, లేహ్) కలిగి ఉంది. పాత కశ్మీర్ రాష్ట్రంలో 14 జిల్లాలు ఉండగా, అందులోని లదాఖ్, లేహ్లను లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో చేర్చారు. ఇందులో కార్గిల్ జిల్లాను కొత్తగా ఏర్పాటు చేశారు. కార్గిల్తో కలిపి రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరో 14 జిల్లాలను అదనంగా ఏర్పాటు చేశారు. దీంతో రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 28 జిల్లాలు ఏర్పాటయ్యాయి. -
ఉగ్రవాదుల నియంత్రణలో పీఓకే
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ఉగ్రవాదుల నియంత్రణలో ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. గిల్గిత్–బల్టిస్తాన్, పీఓకేలు పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్నాయని శుక్రవారం పేర్కొన్నారు. 1947 అక్టోబర్ 24న మహారాజ హరిసింగ్ భారత్తో ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే కశ్మీర్ భారత్లో విలీనమైందన్నారు. ఆర్టికల్ 370 కూడా తాత్కాలికమైందేనన్నారు. భారత భూభాగాలైన పీఓకే, గిల్గిత్–బల్టిస్తాన్లను పాక్ ఆక్రమించుకొని వాటిని ఉగ్రస్థావరాలుగా మార్చిందన్నారు. ఇటీవల యాపిల్ వ్యాపారులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనపై స్పందించారు. ఇది ముమ్మాటికి పాక్ ఉగ్రవాదుల పనేనని, కశ్మీర్లో దుకాణాలు తెరవనివ్వకుండా భయపెట్టేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. విద్యార్థులను సైతం భయపెడుతున్నారన్నారు. శాంతియుత పరిస్థితులను కల్లోలంగా మార్చడానికి ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం కశ్మీర్లో శాంతిని, అభివృద్ధిని సాధిస్తుందని తెలిపారు. -
ఉగ్రవాదాన్ని వీడకుంటే పాక్ ముక్కలే
సూరత్: ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం పాకిస్తాన్ విడనాడాలని, లేకుంటే ఆ దేశం ముక్కలు కాకుండా ఎవరూ అడ్డుకోలేరని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విధి నిర్వహణలో నేలకొరిగిన 122 మంది అమర సైనికుల కుటుంబాలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పాకిస్తాన్ను వేరే ఎవరూ విడదీయాల్సిన అవసరం లేదు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపకుంటే ఆ దేశం తనంత తానే ముక్కలవుతుంది’అని వ్యాఖ్యానించారు. భారత్లో మైనారిటీలు సురక్షితంగా ఉన్నారు..ఉంటారు అని స్పష్టం చేశారు. మతం, కులం ప్రాతిపదికన దేశం చీలిపోదని తెలిపారు. మన సైన్యం సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉందని, నియంత్రణ రేఖను దాటి వచ్చే పాక్ సైనికులు మళ్లీ తిరిగి వెళ్లలేరని స్పష్టం చేశారు. అందుకే పాక్ ప్రధాని ఇమ్రాన్ తమ ప్రజలను ఎల్వోసీ దాటి వెళ్లవద్దని హెచ్చరించారన్నారు. శుక్రవారం ముజఫరాబాద్లో జరిగిన సభలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ..‘నేను చెప్పే వరకు ఎల్వోసీ దాటి వెళ్లకండి’అంటూ ప్రజలను కోరడంపై ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దును జీర్ణించుకోలేని పాక్ ఐరాసను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించిందని, అయితే ఆ దేశాన్ని అంతర్జాతీయ సమాజం నమ్మబోదన్నారు. అనంతరం మంత్రి రాజ్నాథ్..మారుతీ వీర్ జవాన్ ట్రస్ట్ తరఫున ఒక్కో వీర సైనికుని కుటుంబానికి రూ.2.5 లక్షల సాయం అందజేశారు. -
పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధం
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను తిరిగి అధీనంలోకి తెచ్చుకునేందుకు ఎలాంటి చర్యకైనా సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రకటించారు. పీవోకే రాజధాని ముజఫరాబాద్లో 13న జరిగే జల్సా (ర్యాలీ)కి వెళ్తున్నట్లు పాక్ ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. – న్యూఢిల్లీ/గ్వాలియర్: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను తిరిగి అధీనంలోకి తెచ్చుకునేందుకు ఎలాంటి చర్యకైనా సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రకటించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో జల్సా పేరుతో భారీ ర్యాలీ నిర్వహించాలన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పీవోకేను తిరిగి భారత్లో అంతర్భాగంగా చేసుకోవడమే ప్రభుత్వం తదుపరి లక్ష్యమంటూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేసిన ప్రకటనపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పీవోకేను స్వాధీనం చేసు కోవడంతోపాటు దేనికైనా మేం సంసిద్ధంగా ఉన్నాం’అని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పీవోకే రాజధాని ముజఫరాబాద్లో 13వ తేదీన జరిగే జల్సా(ర్యాలీ)కి వెళ్తున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రకటించిన నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పీవోకేపై ప్రత్యేక వ్యూహం ఉంది పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)కు సంబంధించి ప్రభుత్వం వద్ద ప్రత్యేక వ్యూహం ఉందని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ వెల్లడించారు. మన బలగాలు పీవోకేలోకి ప్రవేశించేందుకు సదా సన్నద్ధంగా ఉన్నాయి.. అయితే, ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయన్న ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ..‘పీవోకే విషయంలో ప్రభుత్వం వద్ద ప్రత్యేక వ్యూహం ఉంది. దాని ప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఇటువంటి విషయాలను బహిర్గతం చేయరాదు’అని తెలిపారు. -
మోదీ చివరి అస్త్రం వాడారు
ఇస్లామాబాద్/శ్రీనగర్/న్యూఢిల్లీ: కశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దుచేయడం ద్వారా భారత ప్రధాని మోదీ వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డారని పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ విమర్శించారు. పాక్ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో బుధవారం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) అసెంబ్లీలో ఇమ్రాన్ మాట్లాడారు. ‘మోదీ తన చివరి అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ నిర్ణయం మోదీకి, బీజేపీకి చాలా ఖరీదైన వ్యవహారంగా మారబోతోంది. ఎందుకంటే కశ్మీర్ సమస్యను వారు అంతర్జాతీయం చేసేశారు. భారత్లో కర్ఫ్యూ సందర్భంగా ఏమేం జరిగిందో మేం అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళతాం. ప్రతీ అంతర్జాతీయ వేదికపై కశ్మీరీలకు నేను రాయబారిగా నిలుస్తా’ అని వెల్లడించారు. కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం ఎందుకు మౌనం వహిస్తోందని ఆయన ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేసిన సంగతి తెలిసిందే. భారత్ చర్యకు నిరసనగా దౌత్య, వాణిజ్య సంబంధాలను తెంచుకున్న పాక్, ఆగస్టు 14ను కశ్మీరీలకు సంఘీభావ దినంగా పాటిస్తామని ప్రకటించింది. భారత్ దాడికి సిద్ధమైంది.. భారత్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా పాక్ దీటుగా తిప్పికొడుతుందని ఇమ్రాన్ హెచ్చరిం చారు. ‘భారత్ దుందుడుకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైందని మా ఆర్మీకి పూర్తి సమాచారం ఉంది. మీకు(భారత్కు) నేను చెప్పేదొక్కటే. భారత్ విసిరే ప్రతీ ఇటుకకు రాయితో జవాబిస్తాం. మీరు ఎలాంటి చర్య తీసుకున్నా, మేం చివరివరకూ పోరాడుతాం. భారత్–పాకిస్తాన్ల మధ్య యుద్ధమే జరిగితే అందుకు ప్రపంచశాంతి కోసం ఏర్పడ్డ అంతర్జాతీయ సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని ఇమ్రాన్ హెచ్చరించారు. జమ్మూలో ఆంక్షల ఎత్తివేత.. శాంతిభద్రతలు అదుపులోనే ఉన్న నేపథ్యంలో బుధవారం జమ్మూలో ఆంక్షలను ఎత్తివేశారు. ఈ విషయమై జమ్మూకశ్మీర్ అదనపు డీజీపీ మునీర్ ఖాన్ మాట్లాడుతూ..‘జమ్మూలో విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేశాం. స్కూళ్లు, ఇతర కార్యాలయాలు సాధారణంగానే నడుస్తున్నాయి. కశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. కర్ఫ్యూ సందర్భంగా అక్కడక్కడా చెదరుమదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొందరికి పెల్లెట్ గాయాలయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు’ అని తెలిపారు. సామాజికమాధ్యమాల ఆధారంగా పాక్ తప్పుడు వార్తల్ని వ్యాప్తిచేస్తోందనీ, ఈ విషయంలో తాము చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. -
పీవోకే మనదే..!
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), చైనా ఆక్రమణలో ఉన్న ఆక్సాయ్చిన్లు కూడా భారత్లో అంతర్భాగమేనని హోం మంత్రి అమిత్ షా మంగళవారం లోక్సభలో చెప్పారు. కశ్మీర్లో శాంతి కోసం తమ ప్రభుత్వం ప్రజలతో చర్చిస్తుందనీ, అంతేకానీ వేర్పాటువాద సంస్థ అయిన హురియత్ కాన్ఫరెన్స్తో చర్చలేమీ ఉండవని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్ను పాకిస్తాన్ ఆక్రమించినప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోకుండా, నాడే భారత సైనికులకు స్వేచ్ఛ ఇచ్చి ఉంటే ఈరోజు పీవోకే కూడా సంపూర్ణంగా భారత్లో అంతర్భాగంగా ఉండేదని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించేందుకు రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేసే తీర్మానాన్ని, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టే బిల్లును ఆయన మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టగా, సభ ఆమోదం తెలిపింది. బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు, ఆ తర్వాత చర్చ సమయంలోనూ అమిత్ షా ఎంతో ఆవేశంగా, ఉద్వేగంతో సుదీర్ఘ సమయంపాటు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతుండగా, ప్రతిపక్షాలు వాగ్వాదానికి దిగగా, గట్టిగా బదులిచ్చారు. కాగా, తీర్మానం, బిల్లు రాజ్యసభలో సోమవారమే పాస్ అవ్వడంతో వీటికి సోమవారం పార్లమెంటు ఆమోదం లభించనట్లైంది. చర్చ అనంతరం తీర్మానం ఆమోదంపై ఓటింగ్ నిర్వహించగా, అనుకూలంగా 351 ఓట్లు, వ్యతిరేకంగా 72 ఓట్లు పడ్డాయి. ఒక సభ్యుడు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. అలాగే జమ్మూ కశ్మీర్ను విడగొట్టి, లదాఖ్ను అసెంబ్లీ రహిత కేంద్ర పాలిత ప్రాంతంగా, జమ్మూ కశ్మీర్ను అసెంబ్లీ సహిత కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు తీసుకొచ్చిన ‘జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019’పై కూడా ఓటింగ్ నిర్వహించగా, 370 ఓట్లు అనుకూలంగా, 70 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల బిల్లును మాత్రం లోక్సభ నుంచి అమిత్ షా వెనక్కు తీసుకుంటూ, ఈ రిజర్వేషన్లు కేంద్రపాలిత ప్రాంతాల్లో వాటంతట అవే అమలవుతాయని అన్నారు. రాజ్యసభ నుంచి కూడా బిల్లును వెనక్కు తీసుకుంటామన్నారు. తీర్మానం, బిల్లును లోక్సభ ఆమోదించిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా సభలోనే ఉన్నారు. బిల్లుపై ఓటింగ్ జరపడానికి కొద్దిసేపటి ముందు.. ములాయం సింగ్ యాదవ్ మినహా మిగిలిన ఎస్పీ సభ్యులు, ఎన్సీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్తోపాటు ఎన్డీయేలో భాగమైన జేడీ(యూ)కూడా సభ నుంచి బయటకు వెళ్లిపోయింది. కొందరు కాంగ్రెస్ సభ్యులతోపాటు మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఓటింగ్కు పట్టుబట్టారు. దీంతో సభలో ఓటింగ్ నిర్వహించగా, వైఎస్సార్ కాంగ్రెస్, బీజేడీ, టీఆర్ఎస్, బీఎస్పీ, అన్నా డీఎంకే తదితర పార్టీలు అనుకూలంగా ఓటు వేశాయి. తీర్మానం, బిల్లు ఆమోదం పొందిన అనంతరం లోక్సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అమిత్ షా ప్రసంగం వివరాలు.. పీవోకే, ఆక్సాయ్చిన్లు భారత్లో భాగమే.. ‘పీవోకే, ఆక్సాయ్చిన్లు భారత్లో అంతర్భాగమే. అందులో ఏ సందేహమూ లేదు. నేను జమ్మూ కశ్మీర్ అని పలుకుతున్నానంటే అందులో పాక్ ఆక్రమిత కశ్మీర్, చైనా ఆక్రమిత ఆక్సాయ్చిన్లు కూడా కలిసి ఉన్నట్లే లెక్క. ఆ భూభాగాల కోసం తమ ప్రాణాలైనా అర్పించేందుకైనా మేం సిద్ధంగా ఉన్నాం. ఆక్సాయ్చిన్తో కూడిన లదాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. అలాగే అక్కడి రెండు స్వతంత్ర పాలక మండళ్లు కూడా కొనసాగుతాయి.’ పాక్ నిబంధనలు ఉల్లంఘించడంతో భారత్కు పూర్తి హక్కులు ఐక్యరాజ్య సమితి (ఐరాస) నియమాలను పాక్ ఉల్లంఘించినందున జమ్మూ కశ్మీర్పై ఏ నిర్ణయమైనా తీసుకునే పూర్తి హక్కులు భారత్కు ఉన్నాయి. ఐరాస నియమాలను 1965లోనే పాకిస్తాన్ ఉల్లంఘించి దురాక్రమణకు పాల్పడింది. దీంతో ప్రజాభిప్రాయ సేకరణ అంశం ముగిసింది. ఐరాస నిబంధనల ప్రకారం ఒక దేశ బలగాలు మరో దేశ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసేలా ప్రవర్తించకూడదు. 1965లో పాకిస్తాన్ ఎప్పుడైతే నిబంధనలను ఉల్లంఘించి, దురాక్రమణకు పాల్పడిందో అప్పుడే అక్కడ ప్రజాభిప్రాయమన్న అంశం ముగిసింది. కాబట్టి ప్రాదేశిక సమగ్రతపై ఏ నిర్ణయమైనా తీసుకునే పూర్తి హక్కులు భారత్కు ఉన్నాయి. ఈ విషయాన్ని ఐరాస కూడా ఒప్పుకుంది. నాడు సైనికులకు స్వేచ్ఛ ఉంటే ఇప్పుడు పీవోకే మనదే కశ్మీర్ అంశాన్ని ఐరాస వరకు తీసుకెళ్లింది ఎవరు? ఏకపక్షంగా 1948లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తెచ్చింది ఎవరు? ఇదంతా తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూయే చేశారు. సైనికులకు ఆనాడే స్వేచ్ఛ ఇచ్చి ఉంటే ఇప్పుడు పీవోకే భారత్లో అంతర్భాగంగా ఉండేది. మేం చేస్తున్నది చారిత్రక తప్పిదం కాదు. చారిత్రక తప్పిదాన్నే మేం సరిచేస్తున్నాం. 1989 నుంచి జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం కారణంగా 41,500 మంది మరణించారు. దీనికి కారణం ఆర్టికల్ 370, 35–ఏలే. ప్రజలతో చర్చిస్తాం.. వేర్పాటువాదులతో కాదు కశ్మీర్లో వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్తో చర్చలేమీ ఉండవు. కానీ కశ్మీర్ ప్రజలతో మాట్లాడేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. జమ్మూ కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత మళ్లీ పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏ మాత్రం సంకోచించదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను కూడా భారత్లో అంతర్భాగంగానే భావిస్తాం. పార్లమెంటు అధికారాన్నే కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది బిల్లులకు అసలు న్యాయబద్ధత ఎక్కడుందని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురీ ప్రశ్నించారు. ‘ఇది దేశ అంతర్గత అంశమని మీరు చెబుతారు. కానీ 1948 నుంచి కశ్మీర్లో పరిస్థితిని ఐక్యరాజ్యసమితి పరిశీలిస్తోంది. సిమ్లా ఒప్పందం, లాహోర్ ఒప్పందాలూ ఉన్నాయి. అప్పుడు ఇది ద్వైపాక్షిక అంశమో లేక అంతర్గత అంశమో స్పష్టత ఇవ్వాలని నేను కోరుతున్నాను’ అని చౌధురీ అన్నారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ ‘కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంలో పార్లమెంటుకు అధికారాన్నే ఆయన ప్రశ్నిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన దేశభక్తులు ఈ ప్రశ్న వింటే తీవ్రంగా కలత చెందేవారు. హోం మంత్రి ఎందుకంత కోపంగా ఉన్నారని విపక్ష సభ్యులు ప్రశ్నిస్తున్నారు. పీవోకే భారత్లో భాగం కాదని మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను కోపంగా ఉన్నాను’ అని బదులిచ్చారు. 370 రద్దుపై భాగస్వామ్య పక్షాలను కేంద్రం సంప్రదించలేదని ప్రతిపక్ష పార్టీలు నిందించాయి. ఏకపక్షంగా తీసుకున్నారని మండిపడ్డాయి. తృణమూల్ కాంగ్రెస్ వాకౌట్ చేసింది. నినాదాల హోరు జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందగానే లోక్సభలో బీజేపీ సభ్యులు ఆనందోత్సాహాలతో పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. ‘భారత్ మాతా కీ జై, ‘వందేమాతరం’, ‘జహాః హుయే బలిదాన్ ముఖర్జీ కా, వో కశ్మీర్ హమారా హై’.. అనే నినాదాలతో హోరెత్తించారు. చర్చకు అమిత్ షా సమాధానమిస్తున్నప్పుడు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. వారితో ప్రధాని మోదీ కూడా జతకలిశారు. షా సమాధానమివ్వడానికి కొద్ది సేపు ముందే సభలోకి మోదీ వచ్చారు. ఆ సమయంలో బీజేపీ సభ్యులు గట్టిగా హర్షధ్వానాలు చేస్తూ ఆయనను స్వాగతించారు. లోక్సభ వాయిదా అనంతరం ప్రధాని మోదీ విపక్ష సభ్యుల స్థానాల వద్దకు వెళ్లారు. బ్లాక్డే.. ఆనాడే: అమిత్ మనీష్ తివారీ వ్యాఖ్యలకు అమిత్ షా సమాధానమిస్తూ, ఆంధ్రప్రదేశ్ విషయంలో చాలా చర్చ చేశామని ఆయన చెప్పారు. అయితే ఏం చర్చ చేశారో చెప్పాలి. రాష్ట్ర విభజనకు ఒక తీర్మానం పంపితే ఆంధ్రప్రదేశ్ శాసనసభ మూడింట రెండొంతుల మెజారిటీతో తిరస్కరించింది. శాసన మండలి కూడా తిరస్కరించింది. ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేశారు. అయినా వారు ఆంధ్రప్రదేశ్ను విభజించారు. ఇంక చర్చ ఏం చేశారు? మా పార్టీ విభజనకు మద్దతు ఇచ్చిందా లేదా అన్నది ఇక్కడ విషయం కాదు. నేను విభజన గురించి మాట్లాడడం లేదు. అది మంచిదా కాదా అనే విషయంపై నేను చర్చించడం లేదు. విభజన ప్రక్రియ తీరును మీరు ఇప్పుడు ప్రస్తావించడంతో నేను దానిపై మాట్లాడుతున్నా. అసెంబ్లీ, శాసనమండలితో చర్చించాలని అంటున్నారు. ఏపీ అసెంబ్లీ, మండలి విభజన వద్దన్నాయి. మీరెందుకు ఏపీని విభజించారు? మీరు చేసి మమ్మల్ని ఎందుకు వద్దంటున్నారో చెప్పండి. మేం ఇంత ప్రశాంతంగా చర్చిస్తున్నాం. కానీ మీరు చేసిన ప్రక్రియ బాగుందని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా? వ్యతిరేకంగా ఉన్న సభ్యులను మార్షల్స్తో బయటకు లాగేశారు. పార్లమెంటు తలుపులు మూశారు. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి ఏపీని విభజించారు. బ్లాక్ డే ఈరోజు కాదు.. ఆనాడే. నేను ఇక్కడ ఒక్కటి స్పష్టం చేయదలుచుకున్నా. నేను విభజన గురించి మాట్లాడడం లేదు. విభజన ప్రక్రియకు మీరు అనుసరించిన తీరుపై మాట్లాడుతున్నా. విభజన తీరును మనీష్ తివారీ ప్రస్తావించడంతో నేను ఏపీ విషయాన్ని లేవనెత్తాను. -
రూటు మార్చుకోనంటున్న పాక్
న్యూఢిల్లీ : ఉగ్రవాద నిర్మూలన కోసం ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తుంటే... పాకిస్తాన్ మాత్రం తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. ఇప్పటికే భారత్ చేతిలో అనేకసార్లు దెబ్బ తిన్న పాక్.. తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. భారత సైన్యాలు ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేయడం, ప్రపంచ వేదిక మీద పాక్ను ఒంటరి చేయడం వంటి చర్యలు ఎన్ని తీసుకున్నప్పటికి దాయాది దేశంలో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు మరింత తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇప్పటికే 16 ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఒక సీనియర్ ఆర్మీ అధికారి మాట్లాడుతూ.. ‘పీఓకేలో 16 టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం అందింది. వేసవి ముగిసేలోపలే భారత్లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ క్యాంప్లకు చెందిన ఉగ్రవాదులు కొందరు ఎల్ఓసీ సమీపంలో పాడ్స్ను లాంచ్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. అయితే వారి చర్యలను చాలా నిశితంగా గమనిస్తున్నాం. ఏ మాత్రం అవకాశం చిక్కినా మరో సారి గట్టిగానే బుద్ధి చెప్తాం’ అన్నారు. జాకీర్ ముసాను చంపడం మూలానే ఇంత భారీ ఎత్తున ఉగ్ర చర్యలకు పాల్పడుతుండవచ్చని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం జైషే మహ్మద్ నాయకత్వం మొత్తం అంతరించి పోయిందని.. ఉన్న వారు కూడా అజ్ఞాతంలోకి వెళ్లారని అధికారులు తెలిపారు. భారత సైన్యం, ఇతర బలగాలు చేస్తున్న దాడులకు జడిసి.. కొత్త వారు ఎవరూ ఇలాంటి ట్రైనింగ్ క్యాంప్ల్లో చేరేందుకు ముందుకు రావడం లేదన్నారు. -
పీవోకేలో పాక్ వ్యతిరేకంగా నిరసనలు
ముజఫరాబాద్ : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నీలం-జీలం నదిపై పాకిస్తాన్ ప్రభుత్వం నిర్మించబోయే హైడ్రోపవర్ప్లాంట్ ప్రాజెక్ట్ను వ్యతిరేకిస్తూ.. ముజఫరాబాద్ ప్రజలు రొడ్డెక్కారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వెంటనే ఉపసంహారించుకోవాలని, మరే ఇతర ప్రాజెక్టులను చేపట్టవద్దని డిమాండ్ చేస్తున్నారు. వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల తమ జీవనం దెబ్బతింటోందని, వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పుడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కు వ్యతికేకంగా గత వారం రోజులుగా ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. Protests held against Pakistan in Muzaffarabad, Pakistan Occupied Kashmir (PoK), demanding immediate termination of the hydropower plant project underway on the Neelum-Jhelum river & also demanded authorities to refrain from sanctioning any further projects pic.twitter.com/MQ45cWTGv1 — ANI (@ANI) 19 December 2018 -
పాకిస్థాన్పై రగిలిపోతున్న పీవోకే!
ముజఫరాబాద్: పాకిస్థాన్ ఆర్మీ, ఆ దేశ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ పాల్పడుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రజలు ఆందోళన బాట పట్టారు. పాకిస్థాన్కు వ్యతిరేకంగా గళమెత్తుతున్న కశ్మీర్ ఆజాదీ నేతల బూటకపు ఎన్కౌంటర్లు, అక్రమ హత్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ఆర్మీ, ఐఎస్ఐ కూడబల్కుకొని ఈ హత్యలు చేస్తున్నాయంటూ పీవోకేలోని కోటిల్ వాసులు ఇటీవల భారీ ఆందోళన నిర్వహించారు. ‘కశ్మీర్ను ముక్కలు చేసిన కసాయి పాకిస్థాన్ ఆర్మీ’, ‘ఐఎస్ఐ కన్నా కుక్కలు విధేయంగా ఉంటాయి’ అంటూ ఈ సందర్భంగా ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కశ్మీరీ జాతీయవాద ప్రధాన నేత ఆరిఫ్ షాహిద్ హత్యపై స్వతంత్ర దర్యాప్తు జరుపాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అఖిలపక్ష జాతీయ కూటమి (ఏపీఎన్ఏ) చైర్మన్, జమ్మూకశ్మీర్ జాతీయ విముక్తి కాన్ఫరెన్స్ (జేకేఎన్ఎల్సీ) అధ్యక్షుడు అయిన 60 ఏళ్ల షాహిద్ 2013 మే 14న రావాల్పిండిలో తన ఇంటి ఎదుట హత్యకు గురయ్యారు. పీవోకేలో పాక్ అణచివేతను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయనను ఐఎస్ఐ కుట్రపూరితంగా చంపిందని ఆరోపణలు ఉన్నాయి. ముజఫరాబాద్లోని అఖిలప జాతీయ కూటమి లెక్కల ప్రకారం దాదాపు వందమంది కశ్మీర్ ఆజాదీ అనుకూల రాజకీయ కార్యకర్తలను పాక్ కిరాతకంగా హతమార్చిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీవోకేలో ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. -
పాకిస్థాన్పై రగిలిపోతున్న పీవోకే!
-
పాక్లో విన్యాసాలపై మాట మార్చిన రష్యా!
ఇస్లామాబాద్: పాకిస్థాన్తో కలిసి గిల్గిట్-బాల్టిస్తాన్లో తాను సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్టు వస్తున్న వార్తలను రష్యా తోసిపుచ్చింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న గిల్గిట్-బాల్టిస్తాన్ భారత భూభాగమేనని, ఈ ప్రాంతంలో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో రష్యా వివరణ ఇచ్చింది. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో పాక్తో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించబోమని ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ప్రచ్ఛన్న యుద్ధం నాటి శత్రువైన పాకిస్థాన్తో కలిసి రష్యా తొలిసారిగా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించబోతున్నది. ఇందుకోసం రావల్పిండికి రష్యా సైనలు తరలివచ్చాయి. అయితే, గల్గిట్-బాల్టిస్తాన్ పరిధిలో ఉన్న రట్టు పర్వత ప్రాంతాల్లో ఉన్న పాక్ సైనిక స్కూల్లో ఈ సంయుక్త డ్రిల్స్ ఉంటాయని రష్యా ప్రభుత్వ వార్తాసంస్థ టీఏఎస్ఎస్ (టాస్) కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం భారత్ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సమస్యాత్మకమైన ఈ ప్రాంతంలో రష్యాతో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహిస్తే అది దాయాది దేశానికి దౌత్యపరమైన విజయం అవుతుంది. దీంతో అప్రమత్తమైన భారత్ గిల్గిట్-బాల్టిస్తాన్ భారత భూభాగమేనని స్పష్టం చేసింది. ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాక్తో కలిసి ఇలాంటి చర్యకు దిగడంపై రష్యాకు తమ ఆందోళన వ్యక్తం చేసినట్టు విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ ప్రకటించారు. దీంతో ఢిల్లీలోని రష్యా రాయబారా కార్యాలయం వెంటనే ఓ ప్రకటన విడుదల చేసింది. పీవోకేలో సంయుక్త సైనిక విన్యాసాలు ఉండబోవని స్పష్టం చేసింది. కేవలం చేరట్ ప్రాంతంలోనే డ్రిల్స్ ఉంటాయని, ఈ విషయంలో వచ్చిన కథనాలన్నీ తప్పుడువేనని తేల్చిచెప్పింది. దీంతో టాస్ కూడా తన కథనంలో పీవోకే ప్రస్తావనను తొలగించి.. కథనాన్ని ప్రచురించింది. -
పీవోకేపై ఎయిర్ఫోర్స్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) విషయంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ చీఫ్ మార్షల్ అరూప్ సాహా అసాధారణరీతిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1971 యుద్ధం వరకు వైమానిక శక్తిని భారత్ పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయిందని, పీవోకే విషయంలో ఆదర్శాల ప్రాతిపదికన కాకుండా సైనిక చర్యకు భారత్ దిగివుంటే, ఆ ప్రాంతం ఇప్పటికీ మన ఆధీనంలోనే ఉండేదని ఆయన పేర్కన్నారు. ఇప్పుడు పీవోకే మన శరీరంలోకి దిగిన ముల్లులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రత అవసరాల విషయంలో భారత్ ఎప్పుడూ ఆచరణాత్మక ధోరణిని అవలంబించలేదని పేర్కొన్నారు. భారత్లో భద్రతా వాతావరణం దుర్భరంగా ఉందని పేర్కొన్న ఆయన.. గగనతల వైమానిక శక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ఈ ప్రాంతంలో సంక్షోభాలను అధిగమించి, శాంతిభద్రతలను నెలకొల్పే అవకాశముంటుందని చెప్పారు. 'ఐరాస, అలీనోద్యమం, పంచశీల లక్ష్యాలకు అనుగుణంగా మన విదేశాంగ విధానం ఉంది. మనల్ని పెద్ద పెద ఆశయాలున్న నేతలు పాలించారు. భద్రతా అవసరాల విషయంలో మనం ఎప్పుడూ ఆచరణాత్మక వైఖరిని అవలంబించలేదు. ఆమేరకు సామరస్యమైన వాతావరణాన్ని నెలకొల్పడంలో సైనిక శక్తిని మనం విస్మరించాం' అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సవాళ్లను, సంఘర్షణలను ఎదుర్కోవడంలో సైనిక శక్తి, ముఖ్యంగా వైమానిక శక్తిని వినియోగించుకోవడంలో భారత్ ఎప్పుడూ విముఖత చూపిస్తూ వస్తున్నదని ఆయన పేర్కొన్నారు. -
'పీఓకేలో అంగుళమైన పాక్కు ఇచ్చేదిలేదు'
హైదరాబాద్: పీఓకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్)లో అంగుళం కూడా పాకిస్తాన్కు ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. దేశ 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. దేశానికి కమ్యూనిజం, క్యాపిటలిజం పనికిరావని జాతీయవాదం మనకు వేదం కావాలని ఆయన వ్యాఖ్యానించారు. అప్పుడే దేశం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందని.. స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చాలంటే ప్రతి ఒక్కరు తమతమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలన్నారు. అందరి జీవన ప్రమాణాలు పెరగాలి. అందరికి అభివృద్ది ఫలాలు అందాలి. స్వతంత్ర భారతంలో మనము భాగస్వామ్యులము అనే భావం అందరికీ కలగాలన్నారు. పరిపాలనలో పారదర్శకత ఉండాలని ..వ్యవస్థలో జవాబుదారీతనం అవసరమని ఆయన అన్నారు. అట్టడుగున ఉన్నవారికి అభివృద్ధి ఫలాలు అందేవరకు స్వతంత్రానికి, అభివృద్ధికి అర్ధంలేదన్నారు. అందుకే ఎన్డీయే ప్రభుత్వం అంత్యోదయ విధానాన్ని అమలు చేస్తున్నదని వెంకయ్య పేర్కొన్నారు. గోవుల పేరుతో దాడులు చేసేవారు హిందువులు కాలేరన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదని వెంకయ్య హితవు పలికారు. దళితులపై కొన్నిచోట్ల 68ఏళ్ల తర్వాత కూడా దాడులు జరగటం సభ్య సమాజానికి సిగ్గుచేటుగా ఆయన అభివర్ణించారు. ఇది మనందరికీ సవాలు అని... దీన్ని సమష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మైనారిటీలు, స్త్రీలు, పురుషులు, కులం, మతం, భేదభావం వీడి మనమంతా భారతీయులం అనే భావం కలిగించాలన్నారు. దళితులపై దాడులను రాజకీయం చేయడం, ఓటుబ్యాంకు రాజకీయ దృష్టితో చూడడంవలెనే ఈ పరిస్థితి దాపురించిందని ఈ వైఖిరి మారాలని వెంకయ్య అన్నారు. కాగా పార్టీ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, మురళీధర్రావు, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
'పాక్ ఆక్రమిత కశ్మీర్ ఆ దేశానిదే'
శ్రీనగర్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ఆ దేశంలోనే అంతర్భాగంగా ఉంటుందని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు. భారత్లోని జమ్ము కశ్మీర్ భూభాగం దేశంలో ఉంటుందని, ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. 'కశ్మీర్ సమస్యకు యుద్ధం పరిష్కారం కాదు. ప్రాణాలు మాత్రమే కోల్పోతాం. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలి' అని ఫరూక్ అబ్దుల్లా శుక్రవారం అన్నారు. ఫరూక్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండి పడ్డారు. 'ఇదో అబద్ధపు ప్రకటన. పాకిస్థాన్ ఆధీనంలోని కశ్మీర్, ఆ దేశం అక్రమంగా స్వాధీనం చేసుకున్నది' అని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి, బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ అన్నారు. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ స్పందిస్తూ.. కశ్మీర్ సమస్యపై 1994లో పార్లమెంట్లో ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయాన్ని మరచిపోరాదని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉందని, దీనిపై బిన్న వైఖరి లేదని స్పష్టం చేశారు.