pardhasaradhi
-
వాలంటీర్లకు షాకిచ్చిన ఏపీ కేబినెట్..
-
రామేశ్వరం పోయినా శనీశ్వరం పోలేదు
సాక్షి, తాడేపల్లి: రామేశ్వరం పోయినా శనీశ్వరం పోలేదన్నట్లు మాజీ సీఎం చంద్రబాబును చిత్తుగా ఓడించిన ఆయన దరిద్రం రాష్ట్రానికి పోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకురుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు కరోనాతో బాధపడుతుంటే బాబు, ఆయన కొడుకు హైదరాబాద్లో దాక్కున్నారన్నారు. ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన అంటున్న బాబు టీడీపీ హాయంలో మీ పార్టీ నాయకులు ఒక వీఆర్వోను బట్టలిప్పి కొట్టారు అది రాక్షస పాలన అని ధ్వజమెత్తారు. ఒక మహిళ అధికారిని మీ పార్టీ శాసన సభ్యుడు జుట్టు పట్టుకుని ఈడ్చిన పాలనను రాక్షస పాలన అంటారన్నారు. మీకు చేతకాక, కులం మతం పేరుతో సాగిన మీ పరిపాలన అసమర్థ పరిపాలన అని విమర్శించారు. ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం, తప్పు చేసినా వారిని శిక్షించిన పరిపాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్దని అని పేర్కొన్నారు. నంద్యాలలో జరిగిన ఘటన బాధాకరమని, బాబు తన రాజకీయ లబ్ది కోసం వెంపర్లాడటం కూడా బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. నంద్యాల ఘటన నిందితులను ప్రభుత్వం అరెస్ట్ చేస్తే మీ లాయర్తో బెయిల్ ఇప్పించి పనయ్యాక పక్కన పెట్టిన ఘనత మీది అని, బాధితులకు ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం మాది అని ఆయన పేర్కొన్నారు. (చదవండి: 'చంద్రబాబుకు, డబ్బా ఛానళ్లకు ఇవి కనపడవు') అధికారంలో లేనప్పుడు తను పుట్టింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసమే అంటాడు, అదే అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తారని ఎమ్మెల్యే విమర్శించారు. ఆనాడు నారా హమారా అంటూ సమావేశం పెడితే అందులో విన్నపాలు చేసే వారిని దేశ ద్రోహం కేసులు పెట్టిన ఘనత మీదని, బాబు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కనీసం మైనారిటీలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. మీ కుమారుడు నారా లోకేష్ను మాత్రం దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి వైఎస్సార్ అని ఆ రోజు కూడా ఈ రిజర్వేషన్లను అడ్డుకోడానికి కోర్టులో కేసు వేశారన్నారు. దాదాపు 3428 కోట్ల రూపాయలు సీఎం వైఎస్ జగన్ మైనారిటీల సంక్షేమ పథకాలకు అందించారని, ఆయన పరిపాలన ఎటువంటి వివక్షకు తావులేకుండా నడుస్తోందని తెలిపారు. హైదరాబాద్లో కూర్చుని కుల, మత రాజకీయాలు చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. (చదవండి: 'టీడీపీ సిగ్గుమాలిన చర్యలు ఎండగడతాం') -
ప్రకాశం బ్యారేజీలోకి తగ్గిన వరద ఉధృతి
సాక్షి, అమరావతి: గతవారం రోజుల పాటు మహోగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మ క్రమేణా శాంతిస్తోంది. ఆదివారం ఉదయం ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ప్రవాహం 6.26 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. బ్యారేజీలో నిల్వ సామర్థ్యం కంటే అధికంగా నీరు ఉండటంతో 70 గేట్లు ఎత్తి 6 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో శనివారం వరద ప్రవాహం తగ్గిన నేపథ్యంలో ఆదివారం నుంచి ప్రకాశం బ్యారేజీ వద్ద తగ్గింది. పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 12 అడుగుల నీటిమట్టంతో 3.07 టీఎంసీ నీరు నిల్వ ఉంది. దీంతో కృష్ణా కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు డెల్టాకు 9467, పశ్చిమ డెల్టాకు 8వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి వరద ప్రవాహం ఆరు లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశం ఉన్నట్లు బ్యారేజీ కన్జర్వేటర్ తెలిపారు. దీంతో ముంపు ప్రాంతాల్లో వరద నీరు తగ్గుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నేడు మరోసారి మంత్రులు అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన.. పెనమలురు ముంపు గ్రామాల్లో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్య కొలుసు పార్థసారధి ఆదివారం ఉదయం పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని వారు పరిశీలించారు. వరద బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై ఆరా తీశారు. పునరావాసాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల బాధితులను అన్ని విధాలా ఆందుకుంటామని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. కరకట్ట వద్ద రిటర్నింగ్ వాల్ను నిర్శించాలని అక్కడి స్థానికులు ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన వారు సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. -
వసతి గృహాల్లో సమస్యలకు చెక్!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1 నుంచి హాస్టళ్లు పునఃప్రారంభం కానుండటం తో ఆలోపే అక్కడి సమస్యలను పరిష్కరిం చే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశా లు జారీ చేసింది. ప్రస్తుతం బీసీ సంక్షేమ వసతి గృహాలకు సెలవులు ఉన్నందున.. వీలైనన్ని ఎక్కువ హాస్టళ్లను సందర్శించాలని బీసీ సంక్షే మ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ విజిట్లో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమా లు, పరిశీలన తీరును వివరించారు. సందర్శన అనంతరం బీసీ సంక్షేమ శాఖ కమిషనర్కు నివేదికలు ఇవ్వాలని, ప్రాధా న్యతలను బట్టి నిధులు విడుదల చేస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వ్యక్తిగత పరిశీలనకే ప్రాధాన్యత బీసీ హాస్టళ్ల పరిశీలన వ్యక్తిగతంగా చేపట్టాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. తాగునీరు, పరిసరాల పరిశుభ్రత తదితరాలను పరిశీలించాలి. ప్రస్తుతం హాస్టల్ కొనసాగుతున్న భవనం, నిర్మాణం తీరు, కరెంటు సరఫరా, బల్బులు, కరెంటు వైరింగ్, కిటికీలు, తలుపుల పరిస్థితి, హాస్టల్ పరిసరాల్లో చెత్త తొలగింపు, యూనిఫాం పంపిణీ, స్టాకు, పుస్తకాలు, కాపీల పంపిణీ వివరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇటీవల బీసీ వసతిగృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. వాటి వినియోగం, పనితీరు ఎలా ఉందనే దాన్ని పరిశీలించాలి. రాష్ట్రవ్యాప్తంగా 700 బీసీ హాస్టళ్లలో 634 వసతిగృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో 362 హాస్టళ్లు ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతుండగా.. మిగతా 272 హాస్ట ళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. హాస్టల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో రాష్ట్ర కార్యాలయం నుంచి పరిశీలించేందుకు హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ సౌకర్యాన్ని కల్పించారు. నిర్ణీత ప్రొఫార్మాలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. వచ్చిన నివేదికలను ప్రభుత్వం పరిశీలించి ప్రాధాన్యతలకు అనుగుణంగా చర్యలు చేపడుతుంది. -
పెనమలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా నానినేషన్ వేసిన పార్థసారధి
-
‘ఓటమి భయంతోనే వరాలు’
సాక్షి, కృష్ణా: ఓటమి భయంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను చంద్రబాబు నాయుడు కాపీ కొడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు రాష్ట్ర ప్రజల మీద ప్రేమ కురిపించడం హాస్యాస్పదమన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయడంలో టీడీపీ ప్రభుత్వం దారుణంగా విఫలమయిందని మండిపడ్డారు. పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు నాయుడు మరోసారి మోసానికి వడికట్టారని పార్థసారధి విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున బీసీలపై వరాల జల్లు కురిపిస్తూ కపట ప్రేమను చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి బీసీ కులానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనను టీటీడీ ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించలేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్పై జరిగిన దాడిలో కుట్రకోణం లేదని చెప్పడం విడ్డూరమని ఆయన వ్యాఖ్యానించారు. -
అమరావతి పేరు చెప్పి కాలం గడుపుతున్నారు
-
పోలవరం ప్రాజెక్టును టీడీపీ గాలికొదిలేసింది
-
బీజేపీ-టీడీపీకి ఉన్న అనుబంధం ఏంటి?
సాక్షి, విజయవాడ : ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును టీడీపీ గాలికొదిలేసిందని వైఎస్సార్సీపీ నేత పార్ధసారథి విమర్శించారు. అత్యంత ప్రాధాన్యత గల ప్రాజెక్టును కేవలం ఆర్భాటానికి, ప్రచారానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పోలవరం ప్రాజెక్టు లోపాలకు కేంద్ర బృందం ఎత్తిచూపింది. రోజుకు 10 కోట్ల నుంచి 20 కోట్ల పనులు జరుగుతున్నాయి. అయినా సరే ప్రభుత్వం నాణ్యతను పట్టించుకోవడంలేదు. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన స్పిల్వేలో గ్యాపులు ఉన్నాయి. కంకర తప్ప మరేమి కనబడడంలేదు. ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ముడుపులు ఇచ్చేవారికే సబ్ కాంట్రాక్టులు ఇస్తున్నారు. నిర్మాణంలో నాసిరకం సిమెంట్ ఉపయోగిస్తున్నారు. పర్మింట్ క్వాలిటి డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేయాలి. 112.45 కోట్లు ఏలాంటి పనులు జరగకుండా దొచ్చుకున్నారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఉత్తర్వులు ఇస్తున్నారు. టీడీపీ-బీజేపీకి ఉన్న లోపాయికారి ఒప్పందం వల్లనే బీజేపీ కళ్లు మూసుకుని ఉంది. వారిమధ్య ఉన్న అనుబంధం ఏంటి?. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పోలవరం అవకతవకలపై విచారణ జరిపించాలి’’ అని పేర్కొన్నారు. -
రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కోసం లక్షల్లో ఖర్చు
-
‘పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తాం’
విజయవాడ: పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదని వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి స్పష్టం చేశారు. అసలు పోలవరంకు పునాది వేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అయితే, టీడీపీ మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. పోలవరంతో సంబంధాలేని విషయాల్ని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తాజాగా లేవనెత్తడం విడ్డూరంగా ఉందన్నారు. మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన పార్థసారధి.. కనీసం రాజకీయ జ్ఞానం లేకుండా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దేవినేని ఉమ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి ఉమ చేతకానితనం కప్పిపుచ్చుకునేందుకే జగన్పై విమర్శలు చేస్తున్నారన్నారు. దేవినేని స్థాయి మరచి మాట్లాడుతున్నారని, పోలవరం గురించి మాట్లాడే హక్కు వైఎస్సార్ వారసులకే ఉందనే విషయం గుర్తించుకోవాలన్నారు. ఉమ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని ఈ సందర్భంగా పార్థసారధి సవాల్ విసిరారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామన్నారు. ప్రాజెక్టులపై బీజేపీ, టీడీపీ ప్రజలను మోసం చేస్తూ ట్రిక్కులు చేస్తున్నాయని మండిపడ్డారు. ముందు మంత్రి ఉమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మానేసి, రైతులకు మేలు చేసే విధంగా ఆలోచించాలన్నారు. జిల్లాల్లో చాలా చోట్ల నీరు లేక పంటలు ఎండిపోతున్న విషయం మంత్రలు గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. 2019లోగా పోలవరం ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం పూర్తిచేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని పార్థసారధి తెలిపారు. ఉమకు సిగ్గుంటే చంద్రబాబు ప్రభుత్వంపై సీబీఐ విచారణకు చేయించుకునే దమ్ముందా? అని పార్థసారధి చాలెంజ్ విసిరారు. -
చంద్రబాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలి
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయీ బ్రాహ్మణుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంపై బీసీ సంఘాల నేతలు మండిపడ్డారు. శుక్రవారం దాసరి భవనంలో నాయిబ్రాహ్మణ సేవాసంఘం అధ్యక్షుడు యానాదయ్య అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా బీసీ నాయకులు మీడియాతో మాట్లాడారు. బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆ విషయాన్ని మరిచి బీసీల పట్ల అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం హోదా వ్యక్తి బీసీ కులాలను కించపరిచేలా వ్యవహరించడం సబబు కాదన్నారు. నాయీ బ్రాహ్మణులపై అనుచితంగా ప్రవర్తించినందుకు చంద్రబాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె. పార్థసారధి, జంగా కృష్ణమూర్తి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు ( వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), దోనెపూడి శంకర్(సీపీఐ), కుమారస్వామి, బాజీ(బీజేపీ), పలువురు బీసీ సంఘం నేతలు పాల్గొన్నారు. -
‘చంద్రబాబు అందుకే యూటర్న్’
సాక్షి, అమరావతి: తమకు పదవుల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వైఎస్సార్సీపీ నేత పార్థసారధి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమమవుతుందని, హోదా కోసం తమ పార్టీ మొదటి నుంచి పోరాడుతోందని అన్నారు. హోదాని చంద్రబాబు నాయుడు అవహేళన చేశారని ప్రత్యేక హోదా రాకపోవడానికి ఏపీ సీఎం ముఖ్యకారణమంటూ విమర్శించారు. హోదాపై వైఎస్సార్సీపీ పోరాటాన్ని చూసి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని, మొదటి నుంచి ప్రత్యేక హోదాకు బాబు వ్యతిరేకమని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు చేశారని పార్థసారధి పేర్కొన్నారు. ఏప్రిల్ 6న వైఎస్సార్సీపీ నేతలు తమ ఎంపీ పదవులకు చేసిన రాజీనామాలు నేడు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. -
రాయలసీమను కోనసీమ చేస్తారా?
సాక్షి, వైఎస్సార్ కడప : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టింది దివంగత ముఖ్యమంత్రి వైఎఎస్ రాజశేఖరరెడ్డేనని.. రాయలసీమ సాగునీటి కోసం వైఎస్సార్, చంద్రబాబు ఎవరేం చేశారో చర్చకు సిద్దమా అంటూ పార్థసారథి టీడీపీ నాయకులైన ఆదినారాయణ రెడ్డి, దేవినేని ఉమాకు సవాల్ విసిరారు. వైఎస్సార్ జిల్లా జయరాజ్ గార్డెన్స్లో శనివారం ఏర్పాటుచేసిన కమలాపురం, జమ్మలమడుగు బూత్ కమిటీల శిక్షణా కార్యక్రమానికి హాజరైన పార్థసారిథి మాట్లాడుతూ... రాయలసీమను కోనసీమ చేస్తారా.. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచినప్పుడు ధర్నా చేసిన ఉమా ఇప్పుడు సీమ గురించి మాట్లాడతాడా అంటూ ఆయనపై ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రజలు దేవినేని ఉమను నిలదీయాలని పిలుపునిచ్చారు. బీసీలను హైకోర్టు జడ్జి కాకుండా అడ్డుకునేందుకు లేఖ రాసిన ఘనుడు చంద్రబాబు అని పేర్కొన్నారు.మైనార్టీల గురించి ఆలోచించిన మొదటివ్యక్తి వైఎస్సార్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఐటీ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, సమన్వయకర్తలు డాక్టర్ సుధీర్ రెడ్డి, దుగ్గాయపల్లి మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రజలు నష్టపోవడానికి కారణం చంద్రబాబే
-
చంద్రబాబు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్
-
మీ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించే దమ్ముందా?
-
పోలవరాన్ని జాతీయ స్కాంగా మార్చారు
సాక్షి, హైదరాబాద్: పోలవరం జాతీయ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయి కుంభకోణంగా మార్చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపితే ఒక నెల వ్యవధిలోనే చంద్రబాబు పదవీచ్యుతుడై జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లు, ఇష్టారాజ్యంగా పెంచేసిన నిర్మాణ అంచనా వ్యయం, కాంట్రాక్టు అక్రమాలపై వస్తోన్న విమర్శలను పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రే స్వయంగా సీబీఐ విచారణను కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టులో సాగుతున్న అవినీతి, అక్రమాలపై వైఎస్సార్సీపీ ఇంతకాలంగా చెప్తోందని, రైతుల నుంచి తాజాగా అందిన ఫిర్యాదులపై ప్రధాని కార్యాలయం కూడా స్పందించిందని చెప్పారు. తాము ఆరోపించిన అక్రమాలపై కేంద్రం నేడు ప్రశ్నిస్తోందని తెలిపారు. ఈ విషయాలపై పోలవరం అథారిటీ మెంబరు సెక్రటరీ æడాక్టరు ఆర్కే గుప్త ఏపీ జలవనరుల శాఖ ఇంజనీరు–ఇన్–చీఫ్ను వివరణ అడిగారని... గుప్త రాసిన లేఖను మీడియా ముందుంచారు. పోలవరంపై సీబీఐ విచారణ జరగాలి : చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నుంచి అందినకాడికి దోచుకోవాలనే చూస్తున్నారని పార్థసారధి ధ్వజమెత్తారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టును ఒక బంగారు బాతులాగా చూస్తున్నారని, జరగని పనిని జరిగినట్లు చూపించి కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేసి తన వంతు వాటా నిధులను కొట్టేస్తున్నారని ఆరోపించారు. -
వామ్మో ఉల్లి.. పెరిగింది మళ్లీ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉల్లి ఘాటెక్కింది. తాత్కాలిక కొరతతో మార్కెట్లో ధరలు మండుతున్నాయి. నిన్న మొన్నటి వరకు బహిరంగ మార్కెట్లో కిలో రూ.20–25 ఉన్న ఉల్లి.. ఇప్పుడు దాదాపు రెట్టింపయింది. రిటైల్ మార్కెట్లో కిలో రూ.40 వరకు పలుకుతోంది. మలక్పేట్ మార్కెట్లో హోల్సేల్గా నాణ్యమైన ఉల్లి కిలో రూ.28.. మెత్తబడి, అంతగా బాగా లేని ఉల్లి రూ. 20 వరకు పలుకుతోందని మార్కెటింగ్ వర్గాలు వెల్లడించాయి. కృత్రిమ కొరత వల్ల రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నాయి. 10 రోజుల్లో 80 శాతం.. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ల నుంచి రాష్ట్రానికి ఉల్లి దిగుమతులు ఉంటాయి. వీటిలో మహారాష్ట్ర నుంచే రాష్ట్రానికి ఎక్కువగా దిగుమతి అవుతుంటాయి. అయితే దేశంలోనే అతి పెద్ద మార్కెట్ అయిన మహారాష్ట్రలోని లాసల్గావ్లో 10 రోజుల్లోనే 80 శాతం మేర ఉల్లి ధరలు పెరిగినట్లు తెలిసిందని, ఆ కారణంగానే తెలంగాణలో ధరలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు గతేడాది ఉల్లికి గిట్టుబాటు కాక ఈసారి సాగు విస్తీర్ణం తగ్గిందని, దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా మహారాష్ట్రలోని మార్కెట్లు వారం రోజులు మూసేస్తారని, ఆ ప్రభావమూ ధరల పెరుగుదలపై ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో 10 వేల ఎకరాల్లోనే.. మార్కెట్లో ఉన్న ఉల్లి మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉత్పత్తి అయిందే. నిల్వ చేసిన ఉల్లిలోనూ 30 శాతం వరకు వానలకు దెబ్బతిన్నట్లు తెలిసింది. మహారాష్ట్ర నుంచి దిగుమతులు తగ్గడం.. భారీ వర్షాలు, వరదలతో పంట దెబ్బతిని ఉల్లి మార్కెట్కు రావడం లేదు. మహబూబ్నగర్, నాగర్కర్నూ ల్, గద్వాల, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో 10 వేల ఎకరాల్లోనే ఉల్లి సాగవుతోంది. దీంతో రాష్ట్ర అవసరాలు తీరడం లేదు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు పెంచుతున్నారని ఆరోపణలున్నాయి. పెరిగింది వాస్తవమే.. మహారాష్ట్ర సహా ఉల్లి సాగు చేసే రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల ఉల్లి పంట దెబ్బతిన్నది. వర్షం, తేమ వల్ల నిల్వ ఉంచిన ఉల్లి చెడిపోతోంది. దీంతో కొరత ఏర్పడి ధరలు పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి కిలో రూ.40 పలుకుతోంది. ఇది తాత్కాలికమే. త్వరలో ధరలు తగ్గుతాయని ఆశిస్తున్నాం. – పార్థసారథి, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి -
పోలవరంకు శంకుస్థాపన చేసిందెవరు?
విజయవాడ: కృష్ణా డెల్టాపై సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి విమర్శించారు. కృష్ణా డెల్టాకు తానొచ్చిన తర్వాతే నీళ్లు వచ్చాయని బాబు చెప్పుకోవడం శోచనీయమన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అప్పట్లో సీఎం ఉన్న చంద్రబాబు కృష్ణా డెల్టాకు అన్యాయం చేశారని ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదులను తానే అనుసంధానించినట్టు ఆయన చెప్పుకోవడాన్ని తప్పుబట్టారు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభించినప్పుడే గోదావరి, కృష్ణా అనుసంధానికి బీజం పడిందని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిందెవరని ప్రశ్నించారు. పులిచింతల ప్రాజెక్టుకు ఎప్పుడు అనుమతులు లభించాయని నిలదీశారు. వైఎస్ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టులు కట్టడానికి ఆయన ప్రయత్నిస్తే టీడీపీ నాయకులు, తమ వర్గంతో అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. మీ వర్గానికి సంబంధించిన రైతాంగాన్ని రెచ్చగొట్టి కేసులు వేయించి అడ్డుపడింది మీరు కాదా అని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని పార్థసారధి అన్నారు. -
కేసీఆర్కు భయపడే చంద్రబాబు..
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం చంద్రబాబు పెట్టినవి అయిదు సంతకాలు కావని, అయిదు వెన్నుపోట్లు అని ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబావబు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని అన్నారు. కేసీఆర్కు భయపడి హైదరాబాద్ నుంచి విజయవాడకు పారిపోయారన్నారు. చంద్రబాబు మూడేళ్ల పాలనలో ఎవరూ సంతోషంగా లేరని, 600 హామీల్లో ఏ ఒక్కటీ ఆయన అమలు చేయాలేదని విమర్శించారు. ఈ మూడేళ్లలో చంద్రబాబు ఆస్తులు, హెరిటేజ్ ఆస్తులు పెరిగాయన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే రాజధాని భూముల కుంభకోణం, ఉచిత ఇసుక, చెట్టు-నీరు, పోలవరం, పట్టిసీమ, విశాఖలో భూకబ్జాపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
'నరసరావుపేట సభను చూసి వణికిపోతున్నారు'
-
'నరసరావుపేట సభను చూసి వణికిపోతున్నారు'
విజయవాడ: నరసరావుపేటలో వైఎస్ జగన్ బహిరంగ సభను చూసి టీడీపీ నేతలు వణికిపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక పిచ్చి ప్రేలాపణలు పేలుతున్నారన్నారు. మంత్రి దేవినేని ఉమ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని.. ప్లేస్, టైమ్ దేవినేని ఉమానే డిసైడ్ చేసుకోవాలని పార్థసారధి సవాల్ విసిరారు. ప్రజలకు చేసిన మోసాలపైనా, అవినీతిపైనా వైఎస్సార్సీపీ చర్చకు సిద్ధమన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అభ్యర్థులుండరని మాట్లాడుతున్న మంత్రి ఉమ దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధపడాలని ఆయన బహిరంగ సవాల్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు కాసు మహేష్ రెడ్డి శుక్రవారం నరసరావుపేటలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. -
'హోదాను చంద్రబాబే అడ్డుకుంటున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాకుండా సీఎం చంద్రబాబే అడ్డుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి అన్నారు. శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ...చంద్రబాబును చూసి తుపానే కాదు మబ్బులు కూడా పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనం లేదన్న వాదనను చంద్రబాబు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని పార్థసారధి ఆరోపించారు. ఇప్పటికే హోదా పొందిన 11 రాష్ట్రాల్లో అభివృద్ధి లేదనడం అవివేకమన్నారు. అభివృద్ధి విషయంలో ఈశాన్య రాష్ట్రాలతో పోటీపడుతున్నారా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజల హక్కులను బాబు ఢిల్లీలో తాకట్టుపెట్టారని ఆయన అన్నారు. చంద్రబాబు పక్క రాష్ట్రమైనా తెలంగాణలోఅక్రమ ప్రాజెక్టులను అడ్డుకోలేని అసమర్థుడని విమర్శించారు. కృష్ణానదిని ఎడారిగా మారుస్తున్నారని పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'ఉచిత యిసుక పేరుతో వందల కోట్ల లూటీ'
హైదరాబాద్: ఉచిత యిసుక పేరుతో కొన్ని వందల కోట్ల రూపాయాలు లూటీ చేసి టీడీపీ కార్యకర్తలకు దోచి పెడుతున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు పార్థసారధి ఆరోపించారు. అవినీతికి తావు లేకుండా ఉచిత యిసుక ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జన్మభూమి కమిటీలతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. జన్మభూమి కమిటీల అవినీతికి సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. ఎస్డీఎఫ్ నిధుల కేటాయింపులో టీడీపీ ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎస్డీఎఫ్ ను, టీడీపీ సంక్షేమ నిధిగా మార్చేశారని ఆక్షేపించారు. ఓడిపోయిన వారికి, టీడీపీ కార్యకర్తలకు వందల కోట్లు కేటాయించడానికి సీఎంకు అధికారం ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తల పేరు మీద జీవోలు ఇచ్చి నిధులు కేటాయించడం సరికాదన్నారు. విచారణ జరిపి పక్షపాతధోరణితో కేటాయించిన నిధులు నిలుపుదల చేయాలని పార్థసారధి డిమాండ్ చేశారు. -
మృతదేహంతో స్టేషన్ ముందు బైఠాయింపు
విశాఖపట్టణం : విశాఖ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రియురాలు ప్రేమకు నిరాకరించిందని సోమవారం ఆత్మహత్యకు పాల్పడిన పార్థసారధి మృతదేహంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆరిలోవ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఆత్మహత్యకు కారణమైన ప్రేమించిన యువతిని స్టేషన్కు తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు వారికి సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. -
'సీఎంపై అట్రాసిటీ కేసు పెట్టాలి'
హైదరాబాద్: ఎస్సీలను అవమానిస్తూ చంద్రబాబు చేసిన ప్రకటనతో దళితులు మనోవేదనకు గురవుతున్నారని వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే కె. శ్రీనివాసులు అన్నారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని పేర్కొన్నారు. తక్షణం రాజీనామా చేసి దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథితో కలిసి వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. దళితులపై కపటప్రేమ ఒలకబోస్తున్నారని మండిపడ్డారు. దళితులను ఎన్నికల్లో వాడుకుని వదిలేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని చంద్రబాబు హేళన చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ దళిత నేతలు ఇప్పటికైనా ఆలోచించుకోవాలని సూచించారు. దళితులను అవమానించేలా మాట్లాడిన చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కాపులను, బీసీలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని పార్థసారథి ఆరోపించారు. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చొద్దని హితవు పలికారు. బీసీలకు నష్టం జరగకుండా కాపులను ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు. -
కల్తీ మద్యం అడ్డాగా ఎక్సైజ్ మంత్రి నియోజకవర్గం
-
'కల్తీ మద్యం అడ్డాగా ఎక్సైజ్ మంత్రి నియోజకవర్గం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గమైన మచిలీపట్నం కల్తీ మద్యం తయారీకి అడ్డాగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.పార్థసారధి ఆరోపించారు. విజయవాడలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతిరోజు కల్తీ మద్యం మరణాలు జరుగుతున్నాయన్నారు. ఎక్సైజ్ మంత్రి ఇంటికి సమీపంలోనే కల్తీ మద్యం సామాగ్రి లభించడంతో... రాష్ట్రంలో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకుని కల్తీ మద్యం మరణాలను అరికట్టాలని పార్థసారధి డిమాండ్ చేశారు. -
కాల్మనీ-సెక్స్ రాకెట్ను రాజకీయం చేస్తోంది
ప్రభుత్వానికి నిందితుల్ని శిక్షించాలని లేదు: పార్థసారథి సాక్షి, హైదరాబాద్: కాల్మనీ-సెక్స్ రాకెట్ను టీడీపీ ప్రభుత్వం రాజకీయం చేసి తప్పించుకోవాలని చూస్తోందితప్ప నిందితుల్ని శిక్షించాలనుకోవట్లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ అంశాన్ని ఒక సామాజిక సమస్యగా, రాష్ట్ర రాజధాని పరువును దిగజార్చుతున్న రాకెట్గా పరిగణించకుండా రాజకీయం చేస్తూ దోషుల్ని రక్షించాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. కొంతమందికి అక్కడ రాజధాని రావడం ఇష్టం లేదని చంద్రబాబు చేస్తున్న వాదన చూస్తే.. సెక్స్రాకెట్ వ్యవహారం ప్రతిపక్షం, మీడియా సృష్టించిందే తప్ప వాస్తవం లేదన్నట్లుగా ఆయన మాటలున్నాయని పార్థసారథి విమర్శించారు. అసలు ఈ సెక్స్రాకెట్ నిజమో కాదో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ వ్యవహారం వైఎస్సార్సీపీ, మీడియాలే సృష్టించిందైతే ఈ రాకెట్ వాస్తవమేనని విజయవాడ నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఎలా చెప్పారని ఆయన ప్రశ్నించారు. ఈ రాకెట్ నిజమని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలన్నారు. ఈ సమస్యకు సంబంధించి పత్రికల్లో కథనాలు స్పష్టంగా వస్తూఉంటే ఇంకా ఆధారాలివ్వండని ప్రభుత్వం చెప్పడమేంటి? ఇంకా ప్రతిపక్షాలు ఆధారాలు చూపాల్సిన అవసరం ఏముంది? అని పార్థసారథి ప్రశ్నించారు. రోజా సస్పెన్షన్ ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధం.. సీఎంను తమ ఎమ్మెల్యే రోజా ఏదో అన్నారనే నెపంతో అధికారం చేతిలో ఉంది క దా అని ఏడాదిపాటు సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పార్థసారథి అన్నారు. ఇంత స్వల్పవిషయానికే శాసనసభ్యురాల్ని సస్పెండ్ చేసినపుడు, కాల్మనీ ముఠాలు ఏళ్లతరబడి మహిళలను అతి జుగుప్సాకరంగా, శారీరకంగా హింసిస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు నిద్రపోతోందని ప్రశ్నించారు. -
ప్రభుత్వ వైఖరివల్లే మాఫియా
-
ప్రభుత్వ వైఖరివల్లే ‘కాల్మనీ’ మాఫియా
వైఎస్సార్సీపీ నేత కె.పార్థసారథి ధ్వజం సాక్షి, హైదరాబాద్: పేదప్రజలు, మహిళల పరువు ప్రతిష్టలతో చెలగాటమాడే ‘కాల్మనీ’ వంటి వ్యవహారాలకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. సీఎం వైఖరి వల్లనే రాష్ట్రంలో మాఫియా వ్యవహారాలు చెలరేగిపోతున్నాయన్నారు. ఆయన ఆదివారమిక్కడ పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా రాజధానిని నిర్మిస్తామని చంద్రబాబు చెబుతున్నారని, అయితే ఆయన వైఖరివల్ల విజయవాడ-అమరావతి మాఫియా జలగల చేతుల్లో చిక్కుకుపోతున్నదనేది అందరూ గమనించాలన్నారు. తెలుగు ప్రజలకు అందరూ మెచ్చే రాజధాని కావాలని, అవలక్షణాల రాజధాని కాదన్నారు. ‘కాల్మనీ’ వ్యవహారం వెనుక తెలుగు తమ్ముళ్లున్నారంటూ వివిధ పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్లను పార్థసారథి చూపిస్తూ ఈ వ్యవహారంలో పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహ రించి దోషుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కామాంతకులెవరో పోలీసులు తేల్చాలన్నారు. డ్వాక్రామహిళల రుణాల్ని మాఫీ చేస్తానని అబద్ధపు హామీఇచ్చి అధికారంలోకొచ్చాక మాట తప్పినందునే అప్పులఊబిలో ఈ సంఘాలన్నీ కూరుకుపోయాయని, దాని ఫలితంగానే వాటిలోని మహిళలు విజయవాడలో ‘కాల్మనీ’ మాఫియా ఊబిలో చిక్కుకున్నారని పార్థసారథి అన్నారు. ఈశ్వరిపై హత్యాయత్నం కేసా! చింతపల్లి బాక్సైట్ వ్యతిరేక సభలో గిరిజనుల మనోభావాలు ప్రతిబింబించేలా మాట్లాడినందుకుగాను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై హత్యాయత్నం(307) కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని చూడటం దారుణమని పార్థసారథి మండిపడ్డారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. విపక్ష నేత జగన్ను తోలుతీస్తానని మాట్లాడితే ఆయనపై ఎలాంటి చర్యా తీసుకోరా? చంద్రబాబు కనీసం మందలించలేదెందుకు? అని ప్రశ్నించారు. బోడే ప్రసాద్ అనే ఎమ్మెల్యే ‘అక్రమ కట్టడాల పేరు’తో లక్షల సొమ్మును బాహాటంగా వసూలుచేస్తూంటే, మరో ఎమ్మెల్యే డీడీలద్వారా లంచాలు తీసుకుంటానని చెబుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు. -
'రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని వైఎస్సార్ సీపీ నాయకుడు పార్థసారథి పునరుద్ఘటించారు. రియల్ ఎస్టేట్ కోసమే శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఆర్భాటాలు మానేసి అన్నిప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... రియల్ ఎస్టేట్ కోసమే రాజధాని నిర్మిస్తున్నట్టు చంద్రబాబు ఒప్పుకున్నారు భ్రమరావతి నిర్మిస్తూ భ్రమలు కల్పించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు మీరు సంపద సృష్టించేది రాష్ట్రానికా, మీ బినామీదార్లకా? సింగపూర్ కంపెనీలు, రాజధాని చుట్టూ భూములు కొన్న మీ తాబేర్ల ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారు మీ ఆలోచనా విధానాన్ని స్పష్టంగా వెల్లడించండి తన కారణంగా రైతులు, మహిళలు ఎంత మోసపోయారో చంద్రబాబుకు ఇంకా అర్థం కావడంలేదు రాజధాని కోసం రైతులు స్వచ్చందంగా భూములు ఇచ్చారనడం బూటకం ఇబ్బందులకు గురి చేస్తారనే భయంతోనే రైతులు భూములు ఇచ్చారు శంకుస్థాపనకు రూ.9 కోట్ల కంటే అదనంగా ఖర్చు పెట్టకుండా చేయగలరా అని సవాల్ చేస్తున్నాం శంకుస్థాపన ఖర్చు స్పాన్సర్స్ ఇచ్చినట్టయితే వాళ్లు ఏం ఆశించి ఖర్చు చేస్తున్నారో చెప్పాలి కృష్ణా నది ఒడ్డున ఉన్న అక్రమ నిర్మాణాలను కూలివేయమన్న చంద్రబాబు తన కోసం గెస్ట్ హౌస్ కోసం రూ. 70 కోట్లతో రోడ్డు నిర్మించారు తన ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు -
మట్టిని 'రియల్' వ్యాపారులకు అమ్ముతున్నారు..
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేయడంపై వైఎస్సార్ సీపీ మండిపడింది. ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా మట్టిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముతున్నారని వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. నీరు-చెట్టు పథకం పేరుతో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్నారు. కృష్ణా జిల్లాలో భారీగా మట్టి కుంభకోణం జరుగుతున్నా.. మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా పార్థసారధి ఎద్దేవా చేశారు. -
'విభేదాలు సృష్టించి.. హీరో కావాలని చూస్తున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పార్ధసారథి మండిపడ్డారు. మంత్రుల్లో విభేదాలు సృష్టించి చంద్రబాబు హీరో కావాలని చూస్తున్నారని పార్ధసారథి విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ సర్కార్ అన్ని చోట్ల విఫమైందన్నారు. అటువంటి టీడీపీ సర్కార్ లోకి వైఎస్సార్ సీపీ సభ్యులు ఎందుకు వెళతారని పార్ధసారథి ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా సమర్ధవంతంగా పనిచేస్తున్నారని ఆ పార్టీ మంత్రులే చెబుతున్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు ఆరు నెలల్లో సాధించినది ఏమీ లేదని ఆ పార్టీ ఎంపీలే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కేఈ లాంటి బలమైన నేతను అణదొక్కేందుకు యత్నాలు జరుగుతున్నాయన్నారు. రుణమాఫీ సక్రమంగా జరగలేదని స్పీకరే అన్నారని పార్ధసారథి తెలిపారు. -
ఎన్టీఆర్పై ద్వేషంతోనే గుంటూరుకు రాజధాని
*రాజధాని తప్పును కప్పిపుచ్చుకునేందుకే జగన్పై ఆరోపణలు *చంద్రబాబు తీరుపై పార్టీ నేతల్లోనే అసంతృప్తి *రంగా వర్ధంతి సభలో వైఎస్సార్ సీపీ నేత పార్థసారథి ఉయ్యూరు : మహనీయుడు ఎన్టీఆర్పై ఉన్న ద్వేషంతోనే చంద్రబాబు రాజధానిని విజయవాడ కాకుండా గుంటూరుకు మార్చారని వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు, మాజీ మంత్రి పార్థసారథి ఆరోపించారు. రాజధాన్ని అంశాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తూ ప్రజల దృష్టిని మరల్చే యత్నం చేస్తున్నారని ఆయన నిన్న రంగా వర్ధంతి సభలో విమర్శించారు. రాజధాని విషయంలో జగన్ స్పష్టంగా ఉన్నారని, ఎక్కడ పెట్టినా అభ్యంతరం లేదన్న విషయాన్ని గుర్తుచేశారు. రాజధాని నిర్మాణంలో లోపభూయిష్ట విధానాలనే తమ పార్టీ ప్రశ్నిస్తోందన్నారు. మున్సిపల్ శాఖకు అప్పగించడంలో ఆంతర్యమేమి? రాజధాని భూసేకరణను రెవెన్యూ శాఖను కాదని, మున్సిపల్ శాఖకు అప్పగించడంలో ఆంతర్యమేమిటని పార్థసారథి ప్రశ్నించారు. రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టారని గుర్తుచేశారు. చెక్కుచెదరని వైఎస్సార్ సీపీ క్యాడర్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ క్యాడర్ చెక్కుచెదరకుండా పనిచేస్తోందని సారథి చెప్పారు. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు టీడీపీ నాయకుల చేత వైఎస్సార్ సీపీ నేతలు పార్టీ వీడుతున్నట్లు అసత్య ప్రచారానికి తెరతీసి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తీరుపై ఇమడలేక సీనియర్ నాయకులే బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయన్నారు. మంత్రులను మాట్లాడనివ్వడం లేదని ఉపముఖ్యమంత్రి కేఈ.. పార్టీలోకి ఎందుకొచ్చామా అని జేసీ దివాకర్రెడ్డి.. ప్రభుత్వ పాలనను ఎంపీ కేశినేని తప్పుబట్టిన విషయాలను ప్రస్తావించారు. దాళ్వాకు నీటి విడుదలపై మంత్రి ఉమా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
టిడిపిలో ఎవరిలాభం వాళ్లు చూసుకుంటున్నారు
-
'టీడీపీ బడ్జెట్ మేడిపండులా ఉంది'
విజయవాడ:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ మేడిపండులా ఉందని వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి విమర్శించారు. ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడిన పార్థసారధి.. ఈ బడ్జెట్ తో ప్రజలకు మేలు చేకూర్చడం మాట అటుంచితే, వారిని మరింత మభ్య పెట్టేదిగా ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీల గురించి అసెంబ్లీలో మాట్లాడుతుంటే.. ప్రతిపక్షంపై అధికార పార్టీ సభ్యులు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. కేంద్రపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సూచించారు. ఈ బడ్డెట్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. -
రుణమాఫీ చేయలేక వైఎస్ జగన్పై దాడా?
హైదరాబాద్: రైతుల రుణాలు మాఫీ చేయలేక వైఎస్ జగన్మోహన రెడ్డి నివేదికలు పంపుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి నేత పార్థసారధి మండిపడ్డారు. మంత్రి దేవినేని ఉమపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటను అమలు చేయలేక ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయడం తగదని హితవు పలికారు. దమ్ముంటే 10 రోజుల్లో ఏ ఏజెన్సీతోనైనా విచారణ చేయించుకోండన్నారు. వాస్తవాలు బయటపెట్టండని కూడా సవాల్ విసిరారు. వైఎస్ఆర్ సీపీపై చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే మీరు పదవి వదులు కోవడానికి సిద్ధమా? అని ఆయన ఉమను ప్రశ్నించారు. రీ షెడ్యూల్కు, రుణమాఫీకి సంబంధం ఏంటని ఆయన అడిగారు. బీజేపీపై రుణమాఫీ కోసం ఎందుకు ఒత్తిడి చేయరు? అని ప్రశ్నించారు. ఆర్బిఐపై నెపం వేసి రుణమాఫీని వాయిదా వేయడం తగదన్నారు. తక్షణమే రైతులకు కొత్త రుణాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అప్పులు కట్టొద్దు అన్నారు, మీ వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్మోహన రెడ్డి దిష్టిబొమ్మల దహనానికి చంద్రదండు ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. రుణమాఫీ చేయమని వైఎస్ జగన్ అడగటమే తప్పా అని ప్రశ్నించారు. అబద్ధాలను కట్టిపెట్టి తక్షణమే రుణమాఫీ అమలు చేయాలని పార్థసారధి డిమాండ్ చేశారు. -
'రైతులను విషవలయంలోకి నెడుతున్న చంద్రబాబు'
హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా 70 శాతంపైగా వ్యవసాయ రుణాల మీద ఆధాపడ్డ రైతులు మన ఏపిలో ఉన్నారని, అటువంటి రైతులను ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వడ్డీ వ్యాపారుల విషవలయంలోకి నెట్టివేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారధి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని చంద్రబాబు మోసం చేశారన్నారు. రుణమాఫీ పేరుతో ఆశలు పెడుతూ రైతులను అవమానపరిచారన్నారు. ఆర్బిఐ మాట వినడంలేదని రైతులకు మొండి చెయ్యి చూపారని మండిపడ్డారు. చంద్రబాబు వల్ల వడ్డీలేని రుణాలను పొందే అవకాశాన్ని రైతులు కోల్పోయారని ఆయన బాధపడ్డారు. పాత రుణాలు కట్టందే కొత్త రుణాలివ్వం అని బ్యాంకులు చెబుతున్నాయన్నారు. రుణ మాఫీపై చంద్రబాబు శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానికత అనేది విద్యా, ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు విఫలయ్యారని పార్థసారధి అన్నారు. -
అసెంబ్లీలో టి.బిల్లును ఓడిస్తాం: మంత్రి పార్థసారధి
అనంతం:తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ఓడిస్తామని మంత్రి పార్ధసారధి తెలిపారు. రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకమని మరోమారు ఆయన స్పష్టం చేశారు. టి.బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ జరుగుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. టి.బిల్లును అసెంబ్లీలో ఓడిస్తామన్నారు. ఆర్టికల్-3ని వక్రీకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఆర్టికల్-3 అనేది రాష్ట్రాన్ని విడగొట్టడానికే కాదు..విభజించడానికి కూడా ఉపయోగపడుతుందన్నారు. -
22 లేదా జనవరి 5న టెట్!
గుంటూరు, న్యూస్లైన్ : ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్) ఈనెల 22 లేదా వచ్చే నెల 5న నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 29న టెట్ను నిర్వహించేందుకు అనుమతి కోరుతూ విద్యాశాఖ 3న ప్రభుత్వానికి ఫైలు పంపించింది. అయితే అదే రోజు‘నెట్’ పరీక్ష ఉన్నందున ఈ మార్పు చేయాలని భావిస్తోంది. దీనిపై ఒకటీరెండు రోజుల్లో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సెకండరీ విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో డీఎస్సీ: మంత్రి పార్థసారథి వచ్చే ఫిబ్రవరి 15నాటికి డీఎస్సీ పరీక్ష నిర్వహించి అదే నెల చివరల్లో ఫలితాలు ప్రకటిస్తామని సెకండరీ విద్యాశాఖ మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. -
విభజనపై అసెంబ్లీ తీర్మానం ఉండదు:మంత్రి పార్ధసారథి
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై అసెంబ్లీ తీర్మానం ఉండదని మంత్రి పార్ధసారథి స్పష్టం చేశారు. ఒకవేళ తీర్మానం అనివార్యమైతే విభజనను వ్యతిరేకిస్తామన్నారు. విభజన అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన అసెంబ్లీ తీర్మానం ఉండదన్నారు. అసెంబ్లీలో అభిప్రాయ సేకరణ మాత్రమే జరుగుతుందని తెలిపారు. సమన్యాయం అంటున్న టీడీపీ నేతలు అసెంబ్లీలో తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి తామంతా విభజన జరగదనే ఆశాభావంతో ఉన్నామని, జరిగితే భవిష్య కార్యచరణపై చర్చిస్తామన్నారు. విభజన అంశంపై కేంద్రం వేగవంతంగా పావులు కదుపుతోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదనతో పాటు, రాయల తెలంగాణ అంశాన్ని కూడా తెరమీదుకు తెచ్చింది. కేంద్రం కొత్తగా ఎత్తుకున్న రాయల తెలంగాణ అంశం మాత్రం విభజన బిల్లు ఆమోదింప చేసుకునే క్రమంలో ఆడుతున్న డ్రామా అని నేతలు అభిప్రాయపడుతున్నారు. -
పైలీన్, హెలెన్ అయిపోయాయి - ఇప్పుడు లెహర్!
హైదరాబాద్: రాష్ట్రం మీద వరణుడు పగబట్టినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే వరుస తుపాన్లతో కకావికలమైన రాష్ట్రంపై వరణుడు మరోసారి విజృంభించనున్నాడు. ఈ క్రమంలో రాష్ట్రానికి మరో ప్రమాదం ముంచుకొస్తోంది. ఈ ప్రమాదం ఇంతకుముందు ప్రమాదం కంటె మరింత తీవ్రమైనదని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ కొత్త తుపానుకు లెహర్ అని పేరు పెట్టారు. లెహర్ తుపాను హెలెన్ తుపాను కంటె ప్రమాదకరమైందని అధికారులంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరో 24 గంటల్లో తుపానుగా మారి రాష్ట్రం వైపు దూసుకొస్తుందని అధికారులు వివరించారు. పైలీన్, హెలెన్ తుపానులు అయిపోయాయి. ఇప్పుడు కొత్తగా లెహర్ తుపాను ముంచుకొస్తోంది. కోస్తా తీరానికి లెహర్ తుఫాన్తో పెను ముప్పు పొంచి ఉందని విపత్తుల నివారణ శాఖ కమిషనర్ పార్ధసారధి హెచ్చరించారు. ప్రస్తుతం లెహర్ తుఫాన్ పోర్ట్బ్లెయిర్కు 200కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. ఈ రాత్రికి పోర్ట్బ్లెయిర్ వద్ద తీరం దాటే అవకాశముందని చెప్పారు. హెలెన్ తుఫాన్ కంటే లెహర్ తుఫాన్ తీవ్రమైందని, చాలా జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకూ అప్రమత్తంగా ఉండాలని పార్ధసారథి సూచించారు. ఒకటి రెండు రోజుల్లో లెహర్ తుఫాన్ కదలికలపై పూర్తి స్పష్టత వస్తుందని ఈ నెల 28న కాకినాడ వద్ద తీరం దాటే అవకాశంముందని తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకూ లెహర్తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేశారు. గుడిసెలు, పెంకుటిళ్లల్లో నివసించే వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. తీరప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పార్థసారథి విజ్ఞప్తి చేశారు. -
డీఎస్సీ-2012 రెండో జాబితా.. 468 మందికి పోస్టింగ్లు
ముఖ్యమంత్రి అంగీకారం మొదటి జాబితాపై వారంలో నివేదిక: మంత్రి పార్థసారథి సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ-2012 రెండో జాబితాలోని 468 మందికి వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ జాబితాలో వారికి పోస్టింగ్లు ఇవ్వాలని ఇటీవల ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. శుక్రవారం ఇదే అంశంపై సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో మాధ్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారథి, ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తదితరులు సమావేశమై చర్చించారు. కోర్టు స్టేతో ఉద్యోగాలకు దూరమైన వారికి పోస్టింగ్లు ఇవ్వాలని నిర్ణయించడమే కాక, అభ్యర్థులకు సంబంధించి పరిశీలన వెంటనే పూర్తిచేయాలని ఆయా డీఈఓలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మొదటి ఎంపిక జాబితాలో పేర్లు ఉండి.. రెండో జాబితాలో పేర్లు లేని 987 మందికి కూడా ఎలా న్యాయం చేయాలనే అంశంపైనా ఈ సమావేశంలో చర్చించారు. లోకల్, నాన్లోకల్కు సంబంధించి మొదటి జాబితాలో తప్పులు దొర్లడంతో విద్యాశాఖ ఆ జాబితాను రద్దు చేసి రెండో జాబితాను రూపొందించిన సంగతి తెలిసిందే. దీంతో పోస్టులకు ఎంపికైనట్లు మొదటి జాబితాలో పేర్లు ఉండి.. రెండో జాబితాలో పేర్లు లేకపోవడంతో ఆ 987 మంది ఉద్యోగాలకు దూరం అయ్యారు. దీంతో తమకు న్యాయం చేయాలని వారంతా అప్పటినుంచి ఆందోళనలు చేస్తున్నారు. అయితే మానవతా దృక్పథంతో వారికి కూడా పోస్టింగ్లు ఇవ్వాలని, ఇందుకు ఏ విధానాన్ని అనుసరించాలనే దానిపైనా చర్చించామని మంత్రి పార్థసారథి విలేకరులతో చెప్పారు. సూపర్ న్యూమరీ పోస్టులు రూపొందించాలా?, ఖాళీల్లో నియమించాలా? సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి, ఎంపిక జాబితాలను మరోసారి పరిశీలించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని వివరించారు. వారికి న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని వివరించారు. -
భాషా పండితులు, పీఈటీల అప్గ్రెడేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న భాషా పండితులు, పీఈటీ లను అప్గ్రేడ్ చేయటంపై సానుకూలంగా ఉన్నామని, ఇందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి తెలిపారు. ఎయిడెడ్ టీచర్ల నోషనల్ ఇంక్రిమెంట్లు, ఇతర సమస్యలకు సంబంధించిన ఫైలు చివరి దశలో ఉందని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే వారికి పదోన్నతులు, బదిలీల సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. గురువారమిక్కడ రవీంద్రభారతిలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, డీఎస్సీ 2012 ద్వారా వేల పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. డీఎస్సీ 2013 అంశాన్ని ప్రస్తావించిన మంత్రి దానిపై వివరణ ఇవ్వకుండానే దాటవేయటంతో నోటిఫికేషన్పై స్పష్టత రాలేదు. ఉపాధ్యాయులు ఉన్నత మన స్తత్వంతో కులతత్వం, మతతత్వం, అవినీతి రుగ్మతలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం గురువులను చూస్తే గౌరవం తగ్గిపోతోందని అది మంచిది కాదన్నారు. ఉపాధ్యాయ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తే వారి వ్యక్తిగత సమస్యలపైనే చర్చ వస్తోందని, ప్రభుత్వ స్కూళ్లను ఎలా బాగు చేయాలనే చర్చ రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని తప్పయితే క్షమించాలని కోరారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చి రూ.21 వేల కోట్ల బడ్జెట్ను కేటాయించిందన్నారు. టీచర్ల అప్రెంటిస్ రద్దు, అప్రెంటిస్ కాలానికి రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా 202 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు నగదు బహుమతితో పాటు బంగారు పతకాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం కొరవడుతోందని, హాజరుశాతం తగ్గుతోంద ని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ జయప్రకాశరావు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న వారిలో పాఠశాల విద్యాశాఖ తరపున 57 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్ కింద 38 మంది టీచర్లకు, ఇంటర్మీడియట్ విద్యా శాఖ నుంచి 23 మంది లెక్చరర్లు, ముగ్గురు సాంకేతిక విద్యాశాఖ లెక్చరర్లతోపాటు యూనివర్సిటీ, కళాశాల విద్యా శాఖ లెక్చరర్లు 77 మందికి, సాంస్కృతిక శాఖ నుంచి నలుగురుకి పురస్కారాలు లభించాయి.