propaganda
-
ప్రభుత్వ ప్రచారం బాధ్యత ప్రైవేటుకు..
సాక్షి, అమరావతి: ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు, పాలనపై సానుకూల ప్రచారం రావడం లేదని, ప్రతికూల ప్రచారాన్ని సమర్థంగా తిప్పి కొట్టలేకపోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పనిని సమర్థంగా చేసేందుకు ఓ ప్రైవేటు ఏజెన్సీని నియమించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కమ్యూనికేషన్ ఏజెన్సీ ఎంపిక కోసం ఆసక్తి వ్యక్తీకరణకు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ ప్రకటన విడుదల చేసింది.తొలుత జనవరిలోనే కమ్యూనికేషన్ ఏజెన్సీ ఏర్పాటుపై ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన విడుదల చేసినప్పటికీ పరిపాలన పరమైన అంశాల్లో సవరణలు చేసి మళ్లీ తాజాగా జారీ చేశారు. ఆసక్తి వ్యక్తీకరణకు మార్చి 11వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆసక్తిగల సంస్థలు ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున గత మూడేళ్లు టర్నోవర్ కలిగి ఉండాలని, కనీసం 100 మంది జర్నలిజం, మీడియాలో నిష్ణాతులైన ఉద్యోగులు ఉండాలనే నిబంధనలు విధించారు. వీటితోపాటు సమాచార శాఖ అధికారులు పేర్కొన్న నిబంధనలను పరిశీలిస్తే చంద్రబాబు ప్రభుత్వం తమ ప్రచారం కోసం ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేయనున్నట్లు స్పష్టం అవుతోంది. ఏజెన్సీ ఏం చేయాలంటే...ప్రధానంగా ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడంతోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. సంప్రదాయ మీడియాతోపాటు దూరదర్శన్, రేడియో, సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను పెంచాలి. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలతోపాటు ఇతర ప్రముఖ భాషల్లోనూ ప్రచారం నిర్వహించడంతోపాటు ప్రభుత్వ ప్రతిష్ట పెంచే కథనాలను ఆయా మీడియాల్లో వచ్చేలా చూడాలి.మీడియా కవరేజ్, ట్రాకింగ్, విశ్లేషణ చేయడంతోపాటు వివిధ శాఖలకు చెందిన వార్తలను మీడియా సంస్థలకు తెలియజేయాలి. అవసరం మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మీడియా ప్రముఖులతో ట్రిప్లను నిర్వహించాలి. సీఎంతోపాటు మంత్రులు, ఉన్నతాధికారుల ఇంటర్వ్యూలు ప్రముఖ వార్తాపత్రికలు, టీవీలు, ఎఫ్ఎం రేడియో చానళ్లలో వచ్చేలా చూడాలి. దేశీ, విదేశాల్లోని మీడియా రంగ ముఖ్యులకు ప్రభుత్వ సమావేశాల గురించి తెలియజేయాలి. ప్రభుత్వ సానుకూల, ప్రతికూలతలపై ప్రజాభిప్రాయం సేకరించాలి. వాటికి అనుగుణంగా వ్యూహాలను సిఫార్సు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా 360 డిగ్రీల్లో భారీ ఎత్తున చంద్రబాబు సర్కారు గురించి ప్రచారం చేయాల్సి ఉంటుంది. -
సరికొత్త ప్రచారం!
సాక్షి, అమరావతి : వాట్సాప్ లేదా మెసేజ్లు తెరవగానే ప్రెస్టేజ్ నుంచి ప్రత్యేక ఆఫర్లు.. తనిష్క్ మీ కోసం ప్రత్యేకమైన ఆఫర్లు.. అంటూ పలు కంపెనీల మెసేజ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇటువంటి బిజినెస్ మెసేజింగ్పై కంపెనీలు పెద్ద ఎత్తున దృష్టి సారిస్తున్నాయి. సాధారణ మెసేజ్లతో పోలిస్తే బిజినెస్ మెసేజ్లు 90 శాతంపైగా చదువుతుండటంతో వ్యాపార సంస్థలు తమ ప్రచారం కోసం బిజినెస్ మెసేజింగ్ను ఎంచుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో బిజినెస్ మెసేజింగ్ రూపు రేఖలు వేగంగా మారిపోతున్నాయి. వినియోగదారుల వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వ్యాపార ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఇందుకోసం రిచ్ కమ్యూనికేషన్స్ సర్విసెస్ (ఆర్సీఎస్), జెనరేటివ్ ఏఐ, చాట్బోట్ వంటి సాధనాలపై దృష్టి సారిస్తున్నాయి. సాధారణ స్పామ్ మెసేజ్లు, ఇతర మెసేజ్లతో పోలిస్తే ఈ బిజినెస్ మెసేజ్లు ఎటువంటి మోసాలకు ఆస్కారం లేకుండా సెక్యూరిటీ ఉండటం, చూడగానే ఆకర్షించే విధంగా విజువల్ ఆడియోతో ఉంటుండటంతో కంపెనీలు వీటిపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ప్రతి కంపెనీ తమ ఉత్పత్తుల ప్రచారం, లేదా సమాచారం ఎప్పటికప్పుడు అందించడం కోసం గూగుల్, యాపిల్ వంటి సంస్థలు అందిస్తున్న సర్విసు సేవలను వినియోగించుకుంటున్నాయి. రూ.26 వేల కోట్ల మార్కెట్దేశీయ బిజినెస్ మెసేజింగ్ మార్కెట్ పరిమాణం 2024లో రూ.6,885 కోట్లుగా ఉండగా, 2025లో బిలియన్ డాలర్లు అంటే రూ.8,500 కోట్ల మార్కును అధిగమిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2030 నాటికి ఈ మార్కెట్ పరిమాణం మూడు రెట్లు పెరిగి రూ.26,000 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కంపెనీలు అందిస్తున్న వాయిస్ బోట్స్ సర్విసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో 4 శాతం కంపెనీలు ఈ బిజినెస్ మెసేజింగ్ సేవలు వినియోగించుకుంటుండగా, మరో 30 శాతం కంపెనీలు జనరేటివ్ ఏఐపై ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దేశీయ బిజినెస్ మెసేజింగ్ మార్కెట్లో 50 శాతం వాటాను వాట్సాప్ అందిస్తున్న ఆర్సీఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉందంటున్నారు. 2029 నాటికి దేశవ్యాప్తంగా ఆర్సీఎస్ లావాదేవీల సంఖ్య 2.54 కోట్లు దాటడంతోపాటు ఈ వ్యాపార పరిమాణం ఒక్కటే రూ.4,624 కోట్లు దాటుందని అంచనా వేస్తున్నారు. -
జనం జాగ్రత్త.. వీళ్లు మామూలోళ్లు కాదు
-
పచ్చ బ్యాచ్.. నీతిమాలిన రాజకీయాలు
-
వాలంటీర్లపై వేటు? టీడీపీ తప్పుడు ప్రచారం
-
నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది: టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి తీవ్రంగా ఖండించారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయనపై ఇటీవల సోషల్మీడియాలో పలు అవినీతి ఆరోపణలు వ్యాప్తి చెందాయి. దీంతో మహేందర్రెడ్డి మంగళవారం తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై వివరణ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధాలు, నిరాధారమైనవి, సత్యానికి దూరంగా ఉన్నవని తెలియజేశారు. ‘నేను 36 ఏళ్ళకు పైగా ఎలాంటి కళంకం లేకుండా పదవీ విరమణ వరకు అంకిత భావంతో పనిచేశా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రంలో పోలీసు శాఖలో సుధీర్ఘ కాలం పనిచేశా. నా కెరీర్ మొత్తంలో.. నేను క్లీన్ రికార్డ్, ఖ్యాతిని కొనసాగించాను. పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశ్యంతో తప్పుడు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం. చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధాలు, నిరాధారమైనవి, సత్యానికి దూరంగా ఉన్నాయి. నా ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్న/ సర్క్యులేట్ చేస్తున్న వారందరిపై క్రిమినల్ చర్యలు, పరువునష్టం దాఖలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని మహేందర్రెడ్డి తెలిపారు. -
విషయాలను మరచి సీఎం జగన్పై విషం చిమ్ముతున్న ఈనాడు
ఆంధ్రప్రదేశ్ నుంచి దావోస్ సభలకు సీఎం జగన్ వెళ్ళలేదంటూ ఈనాడు విషం చిమ్ముతోంది. నిజానికి మొత్తం 29 రాష్ట్రాల్లో దావోస్కు వెళ్లింది కేవలం ముగ్గురు ముఖ్యమంత్రులే. గతంలో ఐదు సార్లు దావోస్ వెళ్లానని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు ఒక్క విదేశీ పరిశ్రమను కూడా రాష్ట్రానికి తీసుకురాలేదు. చంద్రబాబు.. నేనే తెచ్చినట్లు గొప్పగా చెప్పుకునే కియా పరిశ్రమ కూడా ప్రధాని మోదీ కొరియా పర్యటనలో ఉన్నప్పుడు చేసిన సూచన మేరకు ఆ కంపెనీ ఏపీకి వచ్చిందనేది వాస్తవం. అయితే ఈ కంపెనీ తీసుకు వచ్చింది నేనే అంటూ బాబు ఇప్పటికీ ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. సీఎం జగన్ దావోస్ ఇప్పుడు దావోస్ సభలకు వెళ్లకపోయినా.. ఇప్పటి వరకు తన పాలనలో రాష్ట్రంలో రూ. 30000 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 3.94 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా 26.29 లక్షలమంది ఉపాధి పొందుతున్నారనే విషయం తెలిసిందే. చంద్రబాబు పాలనలో ఉన్నన్ని రోజులు (దిగిపోయేనాటికి) రాష్ట్రానికి వచ్చిన ఎంఎస్ఎంఈల సంఖ్య 1.93 లక్షలు మాత్రమే. దీంతో పోలిస్తే సీఎం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈలు రెట్టింపు అని స్పష్టమవుతోంది. ఇవన్నీ పక్కన పెడితే 2023 మార్చిలో జరిగిన విశాఖ సమ్మిట్లో మాత్రమే పారిశ్రామిక వేత్తలు రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇవి మాత్రమే కాకుండా.. ఫోర్టుల అభివృద్ధికి కూడా సీఎం జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ప్రస్తుతం ఏపీ పారిశ్రామిక వృద్ధిలో దూసుకెళ్తోందన్న విషయం పారదర్శకంగా కనిపిస్తున్నాయనే.. విషయాలన్నీ తెలిసినా విష ప్రచారాలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. -
లేని బ్రాండ్లపై ఎల్లో బ్యాండ్ కథనాలు
-
‘కర్ణాటక’ కుట్రపై అధికారుల అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్లోని పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను బెంగళూరుకు తరలించుకెళ్లేందుకు కర్ణాటక ప్రభుత్వం కుట్రలకు తెరతీసిందన్న ప్రచారంపై రాష్ట్ర అధికారులు దృష్టి పెట్టి తెలిసింది. సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరును తలదన్నేలా హైదరాబాద్ దూసుకెళ్తుండటం, ఐటీ రంగంలో అవకాశాలు సన్నగిల్లుతుండటం, పారిశ్రామికంగానూ దెబ్బతిన్న క్రమంలో కర్నాటక ప్రభుత్వం ఈ వ్యవహారానికి తెరలేపిందన్న ప్రచారంపై ఫోకస్ చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ ఇటీవల ఫాక్స్కాన్ సహా పలు ప్రముఖ కంపెనీలకు లేఖ రాసినట్టుగా ఆ రాష్ట్రంలోని పలు ఆంగ్ల, స్థానిక పత్రికల్లో కథనాలు రావడం, ఈ అంశాలు సోషల్ మీడియాలోనూ వైరల్ కావడాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల సమయమే అదనుగా.. బెంగళూరులో మౌలిక వసతుల కల్పనలో పురోగతి లేకపోవడం, ట్రాఫిక్, సరైన మంచినీటి సౌకర్యం లేకపోవడం, రహదారులు అస్తవ్యస్తంగా మారడం, తీవ్ర కరెంటు సంక్షోభంపై బడా పారిశ్రామికవేత్తలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కర్ణాటక స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందార్షా, ఖాతాబుక్ స్టార్టప్ సీఈవో రవీశ్ నరేశ్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మోహన్దాస్ తదితరులు బెంగళూరు మౌలిక వసతులపై పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారని.. ఇదే సమయంలో హైదరాబాద్లోని వసతులను ప్రశంసించారని అంటున్నాయి. ఈ క్రమంలోనే కర్నాటక ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కీన్స్ కంపెనీ సీఈవో రాజేశ్ శర్మ.. బెంగళూరులో ఏర్పాటు చేయతలపెట్టిన తమ కంపెనీని హైదరాబాద్ను మార్చాలని నిర్ణయించుకున్నారని పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో ఐటీ ఉద్యోగులు కూడా హైదరాబాద్–బెంగళూరు వసతులను పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారని అంటున్నాయి. గతంలోని అంశాలను ప్రస్తావిస్తూ.. గతంలోనూ కర్ణాటక ప్రభుత్వం హైదరాబాద్ నుంచి కంపెనీలను తమ వైపు తిప్పుకొనేలా ప్రయతి్నంచిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది మార్చి 1న టీ–వర్క్స్ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా సీఎం కేసీఆర్తో భేటీ అయిన ఫాక్స్కాన్ సీఈవో యంగ్లీ యూ.. త్వరలో తెలంగాణలో రూ.3వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని, తద్వారా ఇక్కడ లక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందని ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. ఆ మరునాడే ఫాక్స్కాన్ తెలంగాణలో కాకుండా బెంగళూరులో పెట్టుబడులు పెట్టబోతోందంటూ సోష ల్ మీడియాలో వైరల్ చేశారని పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై.. ఫాక్స్కాన్తో సీఈవోతో మాట్లాడటంతో, తెలంగాణలోనే పెట్టుబడులు పెడుతున్నామంటూ మార్చి 6న ఫాక్స్కాన్ సీఈవో లేఖ రాశారని గుర్తు చేస్తున్నాయి. కోడై కూస్తున్న కన్నడ పత్రికలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు రాజకీయ పారీ్టలు కూడా ఎన్నికలపైనే దృష్టి సారించాయని.. దీన్ని సావకాశంగా తీసుకుని పరిశ్రమలను బెంగళూరుకు తరలించుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని కన్నడ పత్రికల్లో కథనాలు వస్తున్నాయని అంటున్నారు. బెంగళూరు కోల్పోయిన ప్రభను తెచ్చేందుకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి ఎంబీ పాటిల్ ఇటీవల జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు లేఖలు రాశారని సదరు పత్రికలు పేర్కొంటున్నాయని చెప్తున్నారు. బెంగళూరుకు వస్తే అనేక ప్రోత్సాహకాలు ఇస్తామంటూ ఆశచూపుతున్నా రని.. తెరపై ఫాక్స్కాన్కు రాసిన లేఖ కనిపిస్తు న్నా, ఇలా మరెన్ని కంపెనీలకు లేఖలు రాశారన్నది తెలియాల్సి ఉందని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోందని అంటున్నారు. ఊహకందని రీతిలో పురోగతితో.. హైదరాబాద్ గత పదేళ్లలో ఐటీ, ఐటీఈఎస్తోపాటు పారిశ్రామికంగానూ ఊహించని రీతిలో పురోగతి సాధిస్తోందని.. టీఎస్ ఐపాస్తో పరిశ్రమల ఏర్పాటు సరళీకృతమై బడా కంపెనీలు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. మౌలిక వసతుల కల్పన, 24 గంటల కరెంటు, పుష్కలమైన నీటి సరఫరా, రవాణా వ్యవస్థ, తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల చర్యలతో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు ఇక్కడ కొలువుదీరాయని అంటున్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, గూగుల్, మైక్రాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఇక్కడ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్యాంపస్లను ఏర్పాటు చేసుకున్నాయని.. తెలంగాణ ప్రభుత్వ చొరవతో హైదరాబాద్ ఐటీ రంగం గణనీయ వృద్ధి సాధించిందని వివరిస్తున్నారు. పదేళ్లలో ఐటీ ఎగుమతులు సుమారు రూ.53 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.2.41 లక్షల కోట్లకు.. ఐటీ ఉద్యోగుల సంఖ్య మూడు లక్షల నుంచి దాదాపు పది లక్షలకు చేరాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నాటక తాజా కుట్రలకు తెరతీసినట్టు ప్రచారం జరుగుతోందని పేర్కొంటున్నారు. -
క్రిసిల్ సంస్థ పేరుతోనూ పురందేశ్వరి తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై క్రిసిల్ సర్వే నివేదిక అంటూ శనివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చూపిన కాగితాలు అసలు ఆ సంస్థకు సంబంధించిన నివేదికే కాదని తేలింది. వాటిని చూపిస్తూ (ప్రతులు మీడియా ప్రతినిధులకు ఇవ్వలేదు) ఆమె రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తీరా చూస్తే.. ఆ కాగితాలు ఓ వ్యక్తి తన పరిశోధన కోసం క్షేత్రస్థాయి పరిశీలన (గ్రౌండ్ రిపోర్ట్)గా వెబ్సైట్లో రాసుకున్న అంశాలని సాక్ష్యాధారాలతో స్పష్టమైంది. ఆ కాగితాలను పురందేశ్వరి మీడియాకు చూపిస్తున్నప్పుడు తీసిన ఫొటోలోనూ అదొక ఆన్లైన్ వెబ్సైట్లో ఉంచిన గ్రౌండ్ రిపోర్టు అని స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి తన గ్రౌండ్ రిపోర్టును ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చి(ఎన్సీఏఈఆర్)’ సంస్థకు పరిశీలనకు సమర్పించారు. ఎన్సీఏఈఆర్ ఆ రిపోర్టును తిరస్కరించింది. అంటే.. అందులో వివరాలు అవాస్తవాలు, విలువ లేనివి. ఆ వ్యక్తి గ్రౌండ్ రిపోర్టులో పేర్కొన్న అంశాలు కూడా 2020 మే నెల 7వ తేదీ నాటిది. అంటే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటయి అప్పటికి ఏడాది కూడా పూర్తవదు. దీనినే క్రిసిల్ నివేదిక అంటూ పురందేశ్వరి రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు మేరకే స్కిల్ స్కాంపై సీఐడీ కేసు: పురందేశ్వరి ఎవరో విజిల్ బ్లోయర్ (అవినీతికి సంబంధించి కచ్చితమైన సమాచారం తెలిసిన అజ్ఞాత వ్యక్తి) ఫిర్యాదు మేరకే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసి, విచారణ జరిపి చంద్రబాబు అరెస్టు దాకా వెళ్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఆమె శనివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు కేసుపై విలేకరుల ప్రశ్నలకు స్పందిస్తూ.. ‘చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం లేదు. అరెస్టు చేసిన విధానంలో లోపాలు ఉన్నాయని బీజేపీ ఆనాడే చెప్పింది. అవినీతి జరిగిందా లేదా అన్నది కోర్టే తేల్చాలి’ అని అన్నారు. చంద్రబాబు ఆయన భద్రత, చికిత్స బాధ్యత ఎవరిదో వారినే అడగాలని అన్నారు. తనను అమిత్ షా పిలిచారని లోకేశ్ చెబుతున్న విషయాన్ని ప్రస్తావించగా.. ‘ఎవరు పిలిచారన్నది అప్రస్తుతం. లోకేశ్కి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు ఆరోగ్య స్థితి, కేసు, సెక్షన్లు, జడ్జిలు ఎవరో ఆరా తీశారు. బాబు అరెస్టులో బీజేపీ హస్తం ఉంటే వారు ఎలా కలుస్తారు?’ అంటూ బదులిచ్చారు. ఎన్డీఏ, ఇండియా కూటములకు సమదూరమన్న లోకేశ్ వ్యాఖ్యలపై స్పందించనని చెప్పారు. ఆరోపణలపై జగన్ సిబీఐ విచారణ కోరాలి రాష్ట్రంలో మద్యం తయారీ, నాణ్యత, అమ్మకాలు, ఇసుక, మైనింగ్లో అక్రమాలు జరిగాయని, సీఎంజగన్ నిజాయితీని నిరూపించుకునేందుకు సీబీఐతో విచారణ చేయించుకోవాలని పురందేశ్వరి సవాల్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 20 మద్యం తయారీ సంస్థలలో 12 చంద్రబాబు కాలంలోనే అనుమతులు పొందాయని, అయితే 2019 తర్వాత మద్యం తయారీదారుల్ని బెదిరించి వైఎస్సార్సీపీ నేతలు వాటిని లాక్కున్నారని ఆరోపించారు. -
నేను పార్టీ మారడం లేదు
కైలాస్నగర్: పార్టీ మారుతున్నట్లు కొద్దిరోజులుగా తనపై జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని, తాను ఏ పార్టీలోకీ వెళ్లడం లేదని ఎంపీ సోయం బాపూరావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వేలైన్ ఏర్పాటు ప్రజల చిరకాల కోరిక అని, దాన్ని నెరవేర్చే ఉద్దేశంతో రెండు నెలలుగా ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చిందన్నారు. ఈ రైల్వేలైన్కు సంబంధించి ఫైనల్ లోకేషన్ సర్వే వరకు తెచ్చానని, వచ్చే బడ్జెట్లో దానికి కేంద్రం నిధులు కేటాయించే అవకాశముందని తెలిపారు. స్థానికంగా పార్టీకి సమయం ఇవ్వకపోవడంతో తాను కాంగ్రెస్లోకి వెళుతున్నట్లుగా ప్రచారం జరిగిందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బలపడుతుండటాన్ని తట్టుకోలేక బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని బాపూరావు స్పష్టం చేశారు. -
చంద్రబాబు వల్లే రాష్ట్రం దివాలా: మంత్రి రాజా
తుని రూరల్: చంద్రబాబు హయాంలో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని దివాలా తీయించారని రోడ్లు భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. కాకినాడ జిల్లా తుని మండలం గెడ్లబీడు వద్ద శుక్రవారం జరిగిన జేసీఎస్ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజా మాట్లాడుతూ ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు, యనమల రామకృష్ణుడు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ధ్వజమెత్తారు. తనపై యనమల రామకృష్ణుడు తప్పుడు ప్రచారం చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటనందూరు మండలంలో తాను 150 ఎకరాలు కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే ఆ భూమిని ఆయనకే రాసిచ్చేస్తానని సవాల్ విసిరారు. -
వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నాయుడు నాశనం చేశారని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు), వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవస్థలన్నింటికీ జీవం పోశారని చెప్పారు. మంగళవారం ఆయన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్లు వలంటీర్లపై ఇష్టానుసారం మాట్లాడుతుండటం దారుణం అన్నారు. కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ఆ సమయంలో చంద్రబాబు, పవన్ ఎక్కడికి పారిపోయారని నిలదీశారు. కరోనా సమయంలో సేవలు అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ బెస్ట్ స్టేట్గా నిలిచిందని గుర్తు చేశారు. ఈ అంశం ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగ్గదన్నారు. సచివాలయం, వలంటీర్ల వ్యవస్థను దేశంలోని రాష్ట్రాలన్నీ ప్రశంసిస్తుంటే పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం బాబు, పవన్లకు మాత్రమే చెల్లిందని ధ్వజమెత్తారు. పాలనను ప్రతి గడపకూ తీసుకెళ్లడంలో సీఎం జగన్ విజయం సాధించారని చెప్పారు. ఎవరెంతగా దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని, తిరిగి వైఎస్ జగన్కే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
కోతల బాబు రోత మాటలు.. ఎక్కడికి వెళ్లి ఏం మాట్లాడుతున్నారో..!
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల యాత్ర చేస్తూ మద్యం సరఫరా గురించి మాట్లాడుతున్నారు. కర్నూలు న్యాయరాజధాని ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. తన హయాంలో ప్రాజెక్టులను పూర్తి చేసేసినట్లు కోతల మీద కోతలు కోస్తున్నారు. వివిధ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ద్వారా ప్రజలలో బాగా చొచ్చుకుపోయిన ముఖ్యమంత్రి జగన్ పైన, వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపైన అధిక శాతం అభాండాలు మోపడమే లక్ష్యంగా ఆయన ఈ యాత్ర చేస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు ఎన్నికల ముందు హడావుడిగా ప్రాజెక్టులు చేపడతానంటూ శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత వాటి ఊసే ఎత్తలేదు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ ప్రాజెక్టులవద్దకు వెళ్లి పూలు పెట్టి నిరసన తెలిపారు. బహుశా దానిని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ప్రస్తుతం ఆ పద్దతిలోనే పాట్లు పడుతున్నారు. (చదవండి: సినిమాలు తీసి అప్పులు తీర్చాలనుకోవడం అమాయకత్వం) ఉమ్మడి ఎపిలోకాని, విభజిత ఎపిలో కాని కలిపి పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు అసలు భారీ ప్రాజెక్టులపై నమ్మకం లేదు. అవి సత్వరమే పూర్తి కావని, వాటివల్ల రాజకీయ ప్రయోజనం రాదన్నది ఆయన సిద్దాంతం. అందువల్లే తెలుగుదేశం నేతలు కోరినా పోలవరం, పులిచింతల, వెలిగొండ తదితర ప్రాజెక్టుల జోలికి వెళ్లలేదు. రాజశేఖరరెడ్డి వచ్చాకే ప్రాజెక్టులకు ప్రాధాన్యత వచ్చింది. ఆయన ప్రాజెక్టులను ప్రకటించడమే కాదు.. చకచకా చేపట్టారు. వాటిని అడ్డుకోవడానికి తెలుగుదేశం చేయని ప్రయత్నం లేదు. అంతదాకా ఎందుకు! 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఆయన స్వయంగా ఏ ప్రాజెక్టు ప్రారంభించారు? దేనిని పూర్తి చేశారు? ఏదో ఒకటి చెప్పడం తప్ప ఆయనకు నిజాయితీ లేదన్నది వాస్తవం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను అధికారంలోకి రాగానే రాయలసీమ ఎత్తిపోతల పధకాన్ని చేపట్టినా, పోతిరెడ్డిపాడును విస్తరించాలని తలపెట్టినా చంద్రబాబు సహకరించారా? వైఎస్ ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడును విస్తరించడానికి ప్లాన్ చేస్తే టిడిపి నేతలతో విజయవాడ ప్రకాశం బ్యారేజీపై దేవినేని ఉమా, కోడెల వంటి నేతలతో ధర్నాలు చేయించింది చంద్రబాబు కాదా? అది రాయలసీమకు మేలు చేయడానికా? ద్రోహం చేయడానికా? పోతిరెడ్డిపాడు విస్తరిస్తే కోస్తాకు నీరు రావని ప్రచారం చేసింది టిడిపి నేతలు కాదా? అప్పుడేమో అలా వ్యవహరించి ఇప్పుడేమో రాయలసీమకు తానేదో పోడిచేశానని, జగన్ చేయడం లేదని అసత్య ప్రచారం చేయడానికి ఈ యాత్రను సంకల్పించారన్న సంగతి తెలుస్తూనే ఉంది. (చదవండి: అలా చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా?: మంత్రి అంజాద్ బాషా) కడప జిల్లాలో గండికోట రిజర్వాయిర్ లో 27 టిఎమ్.సిల నీటిని నిలబెట్టడానికి వైఎస్ చేసిన కృషిని జిల్లా ప్రజలు ఎన్నటికి మరవరు. చంద్రబాబు ఎంత చెప్పినా అవన్ని ఉబుసుపోక కబుర్లే అవుతాయన్న సంగతి అందరికి తెలుసు. పులివెందులకు గండికోట నుంచి నీరు తెస్తానని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వైఎస్ ఆర్ చెబితే ఎవరూ నమ్మలేదట. అదెలా సాధ్యమని చాలా మంది భావించారట. కాని ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే కొండను తొలిచి టన్నెల్ ను నిర్మించి నీరు రప్పించిన తీరు చూశాకా ఔరా! అని అనుకున్నామని పులివెందులలో ఒక జర్నలిస్టు మిత్రుడు చెప్పారు. చంద్రబాబు గురించి ఎవరైనా అలా చెబుతారేమో ఆలోచించండి. ఆయనకు నిజంగా చిత్తశుద్ది ఉంటే పోలవరం ప్రాజెక్టును పక్కనబెట్టి పట్టిసీమ లిఫ్ట్ ప్రాజెక్టును టేకప్ చేసేవారా? విశేషం ఏమిటంటే ఆ లిఫ్ట్ ద్వారా వచ్చిన నీటిని వైఎస్ తవ్వించిన కాల్వ ద్వారానే కృష్ణానదికి తరలించవలసి వచ్చింది. ఆ కాల్వే లేకపోతే పట్టిసీమే లేదు. అదే కాదు వైఎస్ ముందు చూపుతో పోలవరం కాల్వలు తవ్వించి ఉండకపోతే పోలవరం ఇప్పటికి కూడా మొదలయ్యేది కాదు. కేంద్రం చేపట్టవలసిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తీసుకుని మొత్తం ప్రాజెక్టును గందరగోళంలోకి నెట్టారు. లేకుంటే పునరావాసం తో సహా అన్ని వ్యయాల బాధ్యత కేంద్రానిది అయి ఉండేది. నిజంగా చంద్రబాబుకు ప్రాజెక్టులపై చిత్తశుద్ది ఉంటే , నీటి పారుదల ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లి మద్యం గురించి ప్రసంగాలు చేస్తారా? పైగా అందులోను అసత్యాలు! మంచి మద్యాన్ని తక్కువ రేటుకు సరఫరా చేస్తానని నలభై ఐదేళ్ల సీనియర్ నేత అయిన చంద్రబాబు ప్రచారం చేస్తున్నారంటే ఏమన్నా అర్ధం ఉందా? ఇంతకన్నా నీచం ఉంటుందా? మద్యం తాగవద్దని చెప్పాల్సిన ఆయన తాగండి.. బాబూ.. తాగండి అని ప్రచారం చేస్తున్నారు. మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వపరంగా నడుస్తుండడంతో ప్రైవేటు దందాకు అవకాశం లేకుండా పోయింది. చంద్రబాబు టైమ్ లో ఏమి జరిగేది. మద్యం సిండికేట్లు రాజ్యమేలేవి. నలభైఐదు వేల బెల్టు షాపులతో మద్యాన్ని ఇంటింటికి సరఫరా చేసేవారు. దాని ప్రభావంతో ఆయన గత ఎన్నికలలో ఓటమి పాలైనా, ఇప్పటికీ అదే దిక్కుమాలిన నినాదం ఎత్తుకుని తిరుగుతున్నారు. మందుబాబుల ఓట్లతో గెలిచిపోతానని బాబు భ్రమ పడుతున్నట్లుగా ఉంది. కాని ఆయన ఉపన్యాసాలను మహిళలు చీత్కరించుకుంటారని తెలుసుకోలేకపోతున్నారు. (చదవండి: నేను మూర్ఖుడిని.. ఎవర్నీ వదలను: నారా లోకేశ్) కర్నూలు న్యాయ రాజధానిగా ఎందుకు చేయలేకపోయారని చంద్రబాబు ప్రశ్నించడం మిలియన్ డాలర్ జోక్ అయినా కావాలి.. మరో అవకాశవాదపు హేళన స్టేట్ మెంట్ అన్నా కావాలి. ఎందుకంటే కర్నూలులో హైకోర్టు రాకుండా అడ్డుపడుతున్నదే ఆయన అయితే.. దానిని నిస్సిగ్గుగా బుకాయించడం శోచనీయం అని చెప్పాలి. అమరావతి గ్రామాలకు వెళ్లి ఆయన కర్నూలులో హైకోర్టు పెట్టాలని చెప్పగలరా? అక్కడేమో వ్యతిరేకిస్తారు. ఇక్కడేమో తానేదో అనుకూలం అన్నట్లుగా జగన్ ను ప్రశ్నిస్తారు. రాయలసీమ ప్రజలందరికి తెలుసు. ఎవరు కర్నూలుకు హైకోర్టు రాకుండా అడ్డుపడుతున్నది. తద్వారా రాయలసీమకు ద్రోహం చేస్తున్నది చంద్రబాబే అని న్యాయవాదులే కాకుండా అన్ని వర్గాల వారికి స్పష్టత ఉంది. మరో ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. ఆయన అధికారంలోకి వస్తే వైసిపివారి పని పడతారట. మురికి కాల్వలో వేసి తొక్కుతారట. ఇది ఒక నాయకుడు మాట్లాడవలసిన తీరేనా? ఇలాంటి నేతను ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్దపడతారా? తన ప్రత్యర్ధి పార్టీవారిని మురికి కాల్వలో తొక్కడం ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యం అన్నమాట. ఏది ఏమైనా వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ పథకాల గురించి జనం చర్చించుకోకుండా, వాటిని మర్చిపోయేలా చేసేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు విపరీతంగా తంటాలు పడుతున్నారు. అదంతా కేవలం ఓటమి భయంతోనే అని అంతా గుర్తించాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
మహిళల అదృశ్యంపై తప్పుడు లెక్కలు
సాక్షి, అమరావతి: మహిళల అదృశ్యంపై తెలుగుదేశం పార్టీ తప్పుడు లెక్కలతో అవాస్తవాలు ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత ధ్వజమెత్తారు. ఆమె శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో 2019–21 మధ్య 24,557 మిస్సింగ్ కేసుల్లో 23,399 మంది ఆచూకీ లభించింది. వారిని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా ఆచూకీ తేలాల్సింది 1,158 కేసుల్లోనే.. వాస్తవాలిలా ఉంటే.. చంద్రబాబు, లోకేశ్, పవన్ కాకి లెక్కలతో ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు దుశ్శాసన పాలనలో ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి. కాల్మనీ సెక్స్రాకెట్, వనజాక్షి, రిషితేశ్వరి వంటి ఘటనల్ని మహిళలు మరువరు. మహిళలపై వేధింపుల్లో నాడు రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో, అక్రమ రవాణాలో రెండో స్థానంలో ఉండేది. స్వార్థ రాజకీయాలకు మహిళల్ని అడ్డుపెట్టుకునే నీచుడు చంద్రబాబు. ఆనాడు లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచాడు. ఇటీవల సొంత భార్యను కూడా స్వార్థ రాజకీయానికి వాడుకోవాలని చూసిన దుర్మార్గుడు. బాబు దత్తపుత్రుడైన పవన్ ఉన్మాదంతో ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నాడు’ అని దుయ్యబట్టారు. సీఎం జగనన్న అంటే రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం, ధైర్యమని సునీత చెప్పారు. -
మూలధన వ్యయంలో దేశంలోనే ఏపీ టాప్
-
దేవుడితోనే ఆటలాడబోయి...చివరకు...
-
ఏది నిజం?: కమీషన్లు అందటం లేదనే.. రామోజీ నేలబారు రాతలు
అసలింతకీ రామోజీరావుకు ఏం కావాలి? పోలవరం ప్రాజెక్టు పూర్తికావటమా... లేక ఎక్కడికక్కడ పనులు ఆగిపోవటమా? దీనికి ఆగిపోవటమే ఆయనకు కావాలన్న సమాధానం తేలిగ్గానే వచ్చేస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచి్చన దగ్గర్నుంచీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రామోజీరావు ‘ఈనాడు’లో అచ్చోసిన దుర్మార్గపు కథనాలు అన్నీఇన్నీ కావు. ఇంకేముంది ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడే అవకాశం లేదని కొన్నాళ్లు... కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చే అవకాశం లేదని కొన్నాళ్లు... ఎత్తు తగ్గించి కట్టేస్తున్నారని కొన్నాళ్లు... ఇలా పదేపదే విషాన్ని చిమ్ముతూనే వస్తున్నారు. చిత్రమేంటంటే... రామోజీ అంచనాలకు భిన్నంగా పోలవరం వేగంగా ముందుకెళుతోంది. చంద్రబాబు వీసమెత్తయినా పట్టించుకోని పునరావాసాన్ని కూడా వైఎస్ జగన్ భుజాలకెత్తుకుని ప్రాజెక్టును నడిపిస్తున్నారు. కేంద్రాన్ని పదేపదే అభ్యర్థిస్తూ... రావాల్సిన నిధుల్ని రాబట్టుకుంటున్నారు. ఇదిగో... ఇదే ‘ఈనాడు’ కడుపు మంటను పెంచేస్తోంది. కాంట్రాక్టరుగా తన వియ్యంకుడిని తప్పించేసి మరీ ప్రాజెక్టును పూర్తి చేస్తుండటాన్ని రామోజీరావు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘పోలవరం నిధుల కోసం... జగన్ నేల చూపులు– బేల మాటలు’ అంటూ సోమవారం ప్రచురించిన కథనం కూడా ఇలాంటిదే!!. మరి దీన్లో నిజానిజాలెంత? ఏది నిజం? ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చేది ఇక రూ.12,911.15 కోట్లనేనని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కేంద్ర కేబినెట్లో 2017లో ఆమోదించిన మొత్తానికి అదనంగా... రూ.12,911.15 కోట్లే ఇస్తామని పేర్కొంది. దీనికన్నా పైసా ఎక్కువరాదు. వాస్తవం: వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి, ఆరి్థక శాఖ మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, నిర్మలాసీతారామన్లను కలుస్తూనే ఉన్నారు. కలిసిన ప్రతి సందర్భంలోనూ పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం కేంద్ర జలసంఘం ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి.. ఆ మేరకు నిధులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే గతేదాది జనవరి 3న ప్రధాని మోదీతో సమావేశమైనపుడు... ప్రాజెక్టు తొలి దశను సత్వరమే పూర్తి చేసి, రైతులకు ముందస్తు ఫలాలు అందించడానికి తాత్కాలికంగా రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. దీనికి మోదీ సానుకూలంగా స్పందించి... జల్ శక్తి, ఆర్థిక శాఖలకు తగు ఆదేశాలిచ్చారు. కేంద్ర జల్ శక్తి శాఖ సూచన మేరకు తొలి దశ పూర్తికి రూ.10,911.15 కోట్లు అవసరమని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వాటిని జల్ శక్తి శాఖ ఆమోదించింది. అయితే చంద్రబాబు ఘోర తప్పిదం వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దడానికి, ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చటానికి రూ.2 వేల కోట్లు ఖర్చవుతుందని గత మార్చి 5న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చింది. దాంతో తొలి దశ పూర్తికి రూ.12,911.15 కోట్లు (10,911 ప్లస్ 2వేలు) విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ జూన్ 5న అంగీకరించింది. అదీ కథ. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు 2013–14 ధరల ప్రకారం.. 2014, ఏప్రిల్ 1 నాటికి ఇరిగేషన్ కాంపొనెంట్ ఖర్చులో మిగిలిన మొత్తం అంటే రూ.15,667.9 కోట్లకు మించి ఇచ్చేది లేదని, ఆ తర్వాత పడే అదనపు భారంతో కేంద్రానికి సంబంధం లేదని 2017 మార్చి 15న కేంద్రం ఒక తీర్మానాన్ని ప్రతిపాదించగా... దాన్ని కేబినెట్ ఆమోదించింది కూడా. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,128.78 కోట్లు ఖర్చు చేయగా.. కేంద్రం రూ.14,418.39 కోట్లు రీయింబర్స్ చేసింది. అంటే 2017, మార్చి 15న కేంద్ర కేబినెట్ ఆమోదించిన ప్రకారం పోలవరానికి ఇక విడుదల చేయాల్సింది రూ.1249.51 కోట్లే. ఈ నేపథ్యంలో... తొలి దశ పూర్తిచేయడానికి అవసరమైన రూ.12,911.15 కోట్లు విడుదల చేయాలంటే.. 2017, మార్చి 15 నాటి కేబినెట్ తీర్మానాన్ని సవరించాలి. ఆ మేరకు ప్రతిపాదన పంపాలని కేంద్ర జల్ శక్తి శాఖకు కేంద్ర ఆరి్థక శాఖ సూచించిందే తప్ప ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వబోమని గానీ.. ఇచ్చేది ఇక ఇంతేననిగానీ ఆర్థిక శాఖ నోట్లో ఎక్కడా లేదు. రామోజీరావు మాత్రం ఇచ్చేది ఇక ఇంతేనని కేంద్ర ఆర్థిక శాఖ నోట్లో పేర్కొన్నట్లు తప్పుడురాతలు రాసేశారు. చంద్రబాబులా రామోజీది కూడా చంద్రబాబు తరహా బ్రీఫ్డ్ మీ ఇంగ్లీషే అయితే.. ట్యూషన్ పెట్టించుకోవాలి గానీ తనకు అర్థమైనదే వాస్తవమన్న రీతిలో రాసేస్తే ఎలా? అజా్ఞనంతో తప్పుడురాతలు అచ్చేస్తే ఎలా? ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులివ్వబోమని కేంద్రం చెప్పినా సీఎం వైఎస్ జగన్ నోరెత్తడం లేదు. లోక్సభలో బీజేపీకి కావాల్సినంత బలం ఉన్నా రాజ్యసభలో లేదు. రాజ్యసభలో ఉన్న రాజకీయ బలాన్ని పోలవరం నిధులు, ప్రత్యేక హోదా సాధనకు సీఎం వైఎస్ జగన్ ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు? వాస్తవం: విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని కేంద్రమే నిరి్మంచాలి. కానీ.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కమీషన్ల కోసం రాష్ట్రానికి హక్కుగా దక్కిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ... దాని నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని 2014, జూన్ నుంచి 2016, సెపె్టంబరు 6 వరకూ నాటి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. చివరకు కేంద్రం మంజూరు చేశాక యనమల రామకృష్ణుడు బావమరిదికి, రామోజీరావు వియ్యంకుడికి ఈ కాంట్రాక్టు పనులు నామినేషన్పై కట్టబెట్టేశారు. భారీగా కమీషన్లు దండుకున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న క్రమంలో చంద్రబాబు చేసిన ఇంకో ఘోరమైన తప్పిదమేంటంటే... 2013–14 నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని 2016, సెపె్టంబరు 7న అంగీకరించడం. మరి ఆ మూడేళ్లలో ధరలు పెరిగి ఉండవా? ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేకుంటే ఎలా? 2016, సెపె్టంబరు 26న పోలవరానికి నాబార్డు నుంచి రూ.1981.54 కోట్ల రుణాన్ని విడుదల చేస్తూ.. ఇకపై బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు రుణం రూపంలోనే నిధులు విడుదల చేస్తామని.. 2018, డిసెంబర్లోగా ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతే.. విడుదల చేసిన నిధులను రుణంగా పరిగణిస్తామంటూ కేంద్రం పెట్టిన మెలికకు సైతం చంద్రబాబు తల ఊపేశారు. 2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ.. కేంద్ర జలశక్తి శాఖకు పంపిన మెమొరాండంలో 2014, ఏప్రిల్ 1 నాటికి నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకు అయ్యే (ఇరిగేషన్ కాంపొనెంట్) వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని పునరుద్ఘాటించింది. ఆ తర్వాత ఐదున్నర నెలలకు 2017, మార్చి 15న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో.. 2014, ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని.. అది ఎంతన్నది పోలవరం ప్రాజెక్టు అథారిటీ మదింపు చేస్తుందని.. ఆ ప్రకారమే నిధులిస్తామని స్పష్టం చేసింది. ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి నోరు మెదపలేదు. 2014, ఏప్రిల్ 1 నాటికి నీటిపారుదల విభాగం వ్యయంలో మిగిలిన మొత్తాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని.. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే .. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని 2017, మే 8న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ లేఖ రాసినా సరే... చంద్రబాబు స్పందించలేదు. 2016, సెపె్టంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమొరాండం ప్రకారం... 2014, ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను సీడబ్ల్యూసీకి పంపామని.. వాటిని ఆమోదించి.. నిధులిస్తే ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2018, జనవరి 12న నాటి సీఎం చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు. 2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ ఆమోదించిన నీటిపారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లు. ఇందులో ఏప్రిల్ 1, 2014 నాటికి చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లను మినహాయిస్తే కేవలం రూ.15,667.9 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసినా.. చంద్రబాబు దానికి అంగీకరించారు. 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ. 33,168.23 కోట్లు. అలాంటిది కేవలం రూ.15,667.9 కోట్లు ఇస్తే పోలవరాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు ఎలా అంగీకరించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదే అంశాన్ని నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ శాసనసభలో పలు మార్లు ఎత్తిచూపుతూ.. భూసేకరణ చట్టం 2013 ప్రకారం పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లని.. అలాంటిది కేంద్రం ఇస్తామన్న రూ.15,667.9 కోట్లతో ఎలా పూర్తి చేస్తారని నిలదీస్తే.. నాటి సీఎం చంద్రబాబు వాటిని తోసిపుచ్చుతూ వచ్చారు. అంటే చంద్రబాబుకు కావాల్సింది కమీషన్లు తప్ప ప్రాజెక్టు పూర్తవటం కాదు. అందుకే రాష్ట్రమే చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ... ప్రత్యేక హోదా అడగబోమని తాకట్టుపెట్టేశారు. అంచనా వ్యయాన్ని సవరించకున్నా నోరు మెదపలేదు. ఆఖరికి పునరావాసం ఊసెత్తకుండా కేవలం ఇరిగేషన్ కాంపొనెంట్ మాత్రమే ఇస్తామన్నా... సై అనేశారు. అసలు పునరావాసం లేకుంటే ప్రాజెక్టు ఉంటుందా? ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే పేదలకు సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి, వారికి తగిన పరిహారం ఇవ్వకుంటే వారు అక్కడి నుంచి వెళతారా? వారు వెళ్లకపోతే ప్రాజెక్టు పూర్తి చేసినా నీటిని నిల్వ చేయగలరా? నీటిని నిల్వ చేసే పరిస్థితి లేనపుడు ఎంత ఎత్తు కడితే లాభమేంటి? మరి పునరావాస నిధుల ఊసెత్తకుండా చంద్రబాబు ఎందుకు నోరుమూసుకున్నారు నిజానికి ఎలాంటి ప్రాజెక్టు అయినా... ఎంత ప్రతిష్టాత్మకమైనది అయినా కాలం గడుస్తున్న కొద్దీ ముందుగా వేసిన అంచనా వ్యయం పెరుగుతుంది. అది నాగార్జున సాగర్కైనా.. శ్రీశైలానికైనా కూడా!!. పోలవరానికైనా అంతే. 2013–14లో ఉన్న ధరలు ఇప్పుడెందుకు ఉంటాయి? అన్నిరకాల సామగ్రి, లేబర్ చార్జీలు అప్పటితో పోలిస్తే రెట్టింపుకన్నా ఎక్కువే పెరిగాయి. కానీ చంద్రబాబు నాయుడు నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని ఏకంగా లేఖ రాసేయటంతో... ఇప్పుడు తాజా ధరల ప్రకారం నిధులడిగిన ప్రతిసారీ కేంద్రం సవాలక్ష కొర్రీలు పెడుతోంది. అసలు చంద్రబాబు ఇలా ఎందుకు చేశారంటే... ఆయనకు కమీషన్లు వస్తే చాలనుకున్నారు కనక. చంద్రబాబు నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నిధుల కొరత ఎదురవుతోందన్నది నిజం. ç2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి.. నిధులు విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ, జల్ శక్తి శాఖ మంత్రులను సీఎం వైఎస్ జగన్ కోరుతూ వస్తున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ.. పోలవరం ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్తోపాటు సీఎం వైఎస్ జగన్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించడానికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి, కేంద్ర ఆర్థిక, జల్ శక్తి శాఖ అధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీ చర్చల వల్ల 2014–15 నాటి రెవెన్యూ లోటు రూ.10,421 కోట్లను ఇటీవల కేంద్రం విడుదల చేసింది. పోలవరం తొలి దశ పూర్తికి అవసరమైన రూ.12,911.15 కోట్లను విడుదల చేయడానికి అంగీకరించింది. ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు సీఎం వైఎస్ జగన్ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశంపై అటు లోక్సభ, ఇటు రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీలు పోరాటం చేస్తున్నారు. ఇవేవీ కని్పంచడం లేదా రామోజీ? ఈనాడు ఆరోపణ రెండో దశ పునరావాసానికి రాష్ట్రం ఏమీ చేయలేదని సీఎం స్వయంగా ప్రకటించారు. రాష్ట్రం నిధులు ఇచ్చే పరిస్థితుల్లో లేదని చెప్పారు. వాస్తవం: కొత్తగా నిర్మించే ఏ ప్రాజెక్టులోనైనా నీటిని నిల్వ చేయాలంటే.. ఐఎస్(ఇండియన్ స్టాండర్డ్) ఆపరేషన్ ఆఫ్ రిజర్వాయర్స్ గైడ్ లైన్స్, కేంద్ర జలసంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒకేసారి గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేయకుండా.. మూడు దఫాలుగా నిల్వ చేసుకుంటూ పోవాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలి ఏడాది 41.15 మీటర్ల వరకూ నీటిని నింపి.. ప్రాజెక్టులో అన్ని భాగాలను పరిశీలిస్తారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుతారు. ఆ తర్వాత 44 మీటర్ల కాంటూర్ వరకూ నీటిని నింపి, లోటుపాట్లు ఏవైనా ఉత్పన్నమైతే వాటిని సరిదిద్దుతారు. ఆనక 45.72 మీటర్లలో అంటే గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తారు. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ పలు మార్లు శాసనసభ వేదికగా స్పష్టం చేశారు. తొలుత 41.15 మీటర్ల వరకూ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని.. ఆ తర్వాత దశలవారీగా పునరావాసం కల్పించి 45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేస్తామని ఉద్ఘాటించారు. ప్రాజెక్టు ఎత్తు ఏమాత్రం తగ్గదని.. కావాలంటే పూర్తయ్యాక టేపు తెచ్చుకుని కొలుచుకోవాలని చంద్రబాబు, రామోజీరావు ఎల్లో మీడియాకు సవాల్ విసిరారు. ఇదే అంశంపై అటు లోక్సభ, ఇటు రాజ్యసభలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పందిస్తూ.. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి ఒక్క ఇంచు కూడా తగ్గదని, నిర్వాసితులు అందరికీ పునరావాసం కల్పించే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన లైడార్ సర్వేలో పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలో అదనంగా 36 గ్రామాలు ముంపునకు గురవుతాయని తేలటంతో ఆ గ్రామాల ప్రజలకూ పునరావాసం కల్పించడానికి రూ.5,122 కోట్ల నిధులివ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అభ్యరి్థంచారు. దీనికీ కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు. దీన్ని బట్టి చూస్తే ప్రాజెక్టు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని స్పష్టమవుతుంది. అయినా సరే.. రామోజీరావు పదే పదే విషం చిమ్ముతున్నారు. -
పోలవరం ప్రాజెక్టుపై ఎల్లోమీడియా దుష్ప్రచారం
-
పచ్చ విషం గక్కడమే పనిగా పెట్టుకున్నరామోజీరావు
-
ఏపీలో విద్యుత్ డిమాండ్ పెరిగినా, కోతల్లేవ్..
-
రామోజీ ‘‘డ్రామాల’’ ఆర్థిక నిపుణుడు: దువ్వూరి కృష్ణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విపక్షంతో పాటు, ఆ పార్టీకి వత్తాసు పలికే మీడియాలో అదేపనిగా దుష్ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి (ఫైనాన్స్, ఎకనామిక్ అఫైర్స్) దువ్వూరి కృష్ణ ఆక్షేపించారు. ఎవరికీ తెలియని, పరిచయం లేని వ్యక్తిని ఆర్థిక నిపుణుడిగా పరిచయం చేస్తూ, ఆయనతో ఒక ప్రకటన చేయించిన ఈనాడు పత్రిక, దాన్ని ప్రముఖంగా ప్రచురించిందని, దీని వల్ల ప్రజల్లో లేనిపోని అపోహలు తలెత్తే అవకాశం ఏర్పడిందని కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు కీలకమైన ఆర్థిక అంశాలన్నింటినీ గణాంకాలను మీడియా ముందు ఉంచుతున్నట్లు వెల్లడించారాయన. ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ పబ్లిక్ డొమెయిన్లో ఉన్నాయి. వాటిని విశ్లేషించి, మాట్లాడితే స్వాగతిస్తాం. కానీ ఎక్కడా ఏ విశ్లేషణ చేయకుండా, ఎక్కడా లెక్కలు చెప్పకుండా.. రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దిగజారిపోయిందని అర్ధంలేని ప్రకటన చేయించారు. ఒక అవగాహనతో మాట్లాడితే ఎవరైనా స్వాగతిస్తారు. కానీ అవేవీ లేకుండా ఒక అనామకుడితో మాట్లాడించి, ఒక పత్రిక రాయడం దారుణం. రుణాలు.. నాడు–నేడు: రాష్ట్రానికి సంబంధించిన రుణాలు (పబ్లిక్ డెట్)తో.. పబ్లిక్ ఎక్కౌంట్ వివరాలు చూస్తే.. ఆర్బీఐ నివేదిక ప్రకారం విభజన నాటికి.. అంటే 2014, మార్చి 31 నాటికి ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న అప్పులు రూ.1,96,202 కోట్లు. ఇంకా అప్పుడు తొలి రెండు నెలల్లో ఉన్న ద్రవ్య లోటు రూ.7,333 కోట్లు. టీడీపీ ప్రభుత్వ హయాంలో: విభజన తర్వాత 58 శాతం వాటా ప్రకారం లెక్కిస్తే విభజిత ఆంధ్రప్రదేశ్కు మిగిలిన అప్పు రూ.1,18,050 కోట్లు. అదే 5 ఏళ్లలో, 2019 మార్చి 31 నాటికి రూ.2.64 లక్షల కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత రెండు నెలల్లో ద్యవ్యలోటు రూ.7346 కోట్లు. దాన్ని కూడా కలుపుకుంటే 2019, మే లో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర రుణం మొత్తం రూ.2,71,797.56 కోట్లు. మా ప్రభుత్వ హయాంలో: ఆ తర్వాత మా ప్రభుత్వ హయాంలో, అంటే ఈ నాలుగేళ్లలో రాష్ట్ర రుణం మొత్తం రూ.4,42,442 కోట్లకు చేరింది. ఇది కూడా ఆర్బీఐ నివేదికలో స్పష్టంగా ఉంది. ప్రభుత్వ గ్యారెంటీ రుణాలు: ఇదే కాకుండా, ప్రభుత్వ పూచీకత్తుతో, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు చూస్తే.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న ఆ రుణాలు రూ.14,028.23 కోట్లు కాగా, ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి, అంటే 2019, మే నాటికి ఆ రుణాలు రూ.59,257.31 కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత నాలుగేళ్లలో.. ఈ ఏడాది మార్చి నాటికి ఆ రుణాల మొత్తం రూ.1,44,875 కోట్లు. ఇందులో దాదాపు రూ.45 వేల కోట్లు విద్యుత్ రంగానికి చెందినవే. ఆ సంస్థలే ఆ రుణాలు తిరిగి చెల్లిస్తాయి. అందుకే ఆ రుణాలన్నీ ప్రభుత్వానివి అని చెప్పడానికి లేదు. 2014 నాటికి ప్రభుత్వానికి ఉన్న అప్పులు, ప్రభుత్వ పూచీకత్తుతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు.. రెండూ కలిపి రుణభారం రూ.1.32 లక్షల కోట్లు కాగా.. 2019లో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆ రుణాలు రూ.3.31 లక్షల కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత నాలుగేళ్లలో రాష్ట్ర రుణభారం రూ.5.87 లక్షల కోట్లకు చేరింది. గ్యారెంటీ లేని రుణాలు: ఇంకా ప్రభుత్వ గ్యారెంటీలు లేకుండా, ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు చూస్తే.. 2014 నాటికి విద్యుత్ రంగంలో జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్ల అప్పులు రూ.18,374 కోట్లు కాగా, ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఆ అప్పుల మొత్తం రూ.59,692 కోట్లకు చేరింది. ఆ తర్వాత ఇక ఈ ప్రభుత్వ హయాంలో, ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న ఆ రుణభారం రూ.56,017 కోట్లు. డిస్కమ్లు–బకాయిలు: విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు, విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్లు) ఇవ్వాల్సిన బకాయిలు చూస్తే.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2893 కోట్ల బకాయిలు ఉండగా, 2019 నాటికి అవి రూ.21,540 కోట్లకు చేరాయి. అదే ఇప్పుడు ఆ బకాయిలు కేవలం రూ.8,455 కోట్లు మాత్రమే. టీడీపీ కంటే మేం చేసిన అప్పులు తక్కువే: మొత్తం మీద పబ్లిక్ డెట్ టు పబ్లిక్ ఎక్కౌంట్ (ప్రభుత్వ రుణాలు), ప్రభుత్వ పూచీకత్తుతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు, ఆ పూచీకత్తు లేకుండా చేసిన అప్పులు.. అన్నీ కలిపి చూస్తే.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న మొత్తం రుణాలు రూ.1,53,346.80 కోట్లు కాగా, గత ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఆ రుణాలు ఏకంగా రూ.4,12,288 కోట్లకు పెరిగాయి. ఇక ఈ నాలుగేళ్లలో, అంటే ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్ర రుణ మొత్తం రూ.6,51,789 కోట్లకు చేరింది. టీడీపీ హయాంలో 5 ఏళ్లలో దాదాపు రూ.2.58 లక్షల కోట్ల అప్పులు పెరగ్గా.. ఈ ప్రభుత్వ హయాంలో 4 ఏళ్లలో రూ.2.38 లక్షల కోట్లు పెరిగాయి. అంటే ఎలా చూసినా గత ప్రభుత్వంలో కంటే, ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కువ రుణాలు తీసుకోలేదన్నది స్పష్టమవుతోంది. టీడీపీ హయాంలో 21.87 శాతం సీఏజీఆర్ పెరగ్గా, ఈ ప్రభుత్వ హయాంలో 12.69 శాతం సీఏజీఆర్ మాత్రమే పెరిగింది. రూ.10 లక్షల కోట్లు అని దుష్ర్పచారం: నిజానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ రుణభారం రూ.6.51 లక్షల కోట్లు మాత్రమే కాగా, ఏ విధంగా రూ.10 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేస్తున్నారు? ఆ మిగతా అప్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఎవరైనా అలా లెక్క లేకుండా అప్పులు ఇస్తారా?. అంత బాధ్యతారహితంగా ఆ పత్రిక ఎలా రాసింది? ఎవరికీ పరిచయం లేని వ్యక్తితో మాట్లాడించి, అలా ప్రచురించడం ఎంత వరకు సబబు? ఇది అభ్యంతరకరం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, అలా బాధ్యతారహితంగా ప్రచురించడం దారుణం. సీఏజీఆర్ ప్రకారం చూసినా, టీడీపీ హయాం కంటే, ఈ ప్రభుత్వ హయాంలో అప్పులు తక్కువగా పెరిగాయి. అయినా అదే పనిగా బురద చల్లడం దారుణం. టీడీపీ హయాంలో కంటే రుణాల సేకరణ తగ్గింది: 2022–23లో కేంద్ర ప్రభుత్వ రుణాలు చూస్తే.. (డెట్ టు జీడీపీ) 55.89 శాతం కాగా, 2023–24 నాటికి 56.16 శాతం ఉంటుందని అంచనా. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే, ఈ ప్రభుత్వ హయాంలో రుణాల సేకరణ తగ్గింది. అంటే ఏ రకంగా చూసినా, రాష్ట్ర ప్రభుత్వం రుణాలు ఏ మాత్రం ఎక్కువ కాదు. ఇంకా ప్రభుత్వం వృథా ఖర్చు చేస్తోందని, ఆ గుర్తు తెలియని అపరిచిత వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతి రెవెన్యూ వ్యయం వృథా ఖర్చు కానేకాదు. ఉదాహరణకు: మనం ఒక ఇల్లు కట్టుకుంటే అది క్యాపిటల్ వ్యయం కాగా, పిల్లలను స్కూల్కు పంపిస్తే అది రెవెన్యూ వ్యయం అవుతుంది. దేని ప్రాధాన్యం అదే. గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా ఒకేరోజు రూ.5 వేల కోట్ల అప్పు చేసి, పథకంలో భాగంగా పంపిణీ చేశారు. దాన్ని ఏ రకంగా సమర్థిస్తారో చెప్పలేదు. పథకాలు–ప్రయోజనాలు: విద్యా రంగంలో చేసిన వ్యయం వల్ల కలిగిన ప్రయోజనాలు చూస్తే.. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) గణనీయంగా పెరిగింది. గతంలో దేశంలో జీఈఆర్ 99 శాతం ఉంటే, అప్పుడు రాష్ట్రంలో అది 84.48 శాతం మాత్రమే. అన్ని రాష్ట్రాల కంటే తక్కువ. అదే ఈరోజు మన రాష్ట్ర జీఈఆర్ 100.1 శాతం. అంటే దేశ సగటు కంటే ఎంతో ఎక్కువ. దీనిపై స్పష్టంగా గణాంకాలు ఉన్నాయి. ఇదంతా విద్యా రంగంలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాల వల్లనే సాధ్యమైంది. గత ప్రభుత్వ హయాంలో కంటే దాదాపు రెట్టింపు విద్యా రంగంపై వ్యయం చేస్తున్నాం. అమ్మ ఒడి, గోరుముద్ద, మనబడి (నాడు-నేడు) విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుక.. ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం కోసం గత ప్రభుత్వం 5 ఏళ్లలో, ఏటా చేసిన సగటు వ్యయం రూ.553 కోట్లు కాగా, అందుకోసం ఈ ప్రభుత్వం ఏటా సగటున రూ.1209 కోట్లు ఖర్చు చేస్తోంది. 👉 పెన్షన్ల కోసం గత ప్రభుత్వం ఏటా సగటున రూ.5600 కోట్లు వ్యయం చేయగా, ఈ ప్రభుత్వం ఏటా సగటున రూ.17,694 కోట్లు వ్యయం చేస్తోంది. మరి దీన్ని కూడా వృథా వ్యయం అంటారా? 👉 కోవిడ్ సమయంలో ప్రజలను ఆదుకోవడం కోసం, ఎక్కడా ఏ పథకాలు ఆపలేదు. రూ.2 లక్షల కోట్లకు పైగా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జమ చేయడం జరిగింది. కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు కూడా పెంచడం జరిగింది. ఆదాయం కోల్పోయాం: కోవిడ్ వల్ల ఒకవైపు ప్రభుత్వ ఆదాయం తగ్గడం, మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో వాటా తగ్గడం వల్ల, ప్రభుత్వం దాదాపు రూ.66,116 కోట్ల ఆదాయం కోల్పోయింది. అప్పటి కంటే తక్కువ ఫైన్లు: వాహనమిత్ర పథకాన్ని ప్రస్తావిస్తున్న విపక్షం.. వాహనాల నుంచి ఫైన్లపైనా అసత్యాలు ప్రచారం చేస్తోంది. కానీ గత ప్రభుత్వ హయాంలో వాహనాల నుంచి ఫైన్ల రూపంలో ఏటా సగటున రూ.270.39 కోట్లు వసూలు చేయగా, ఈ ప్రభుత్వ హయాంలో ఆ మొత్తం రూ.183.94 కోట్లు మాత్రమే. అంటే ఎలా చూసినా, ప్రజలపై భారం వేయడం లేదు. మూలధన వ్యయమూ ఎక్కువే: కాగ్ (సీఏజీ) నివేదిక ప్రకారం మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండీచర్) వివరాలు చూస్తే.. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో అందుకోసం చేసిన వ్యయం రూ.76,139 కోట్లు. అంటే ఏటా సగటు వ్యయం రూ.15,227.80 కోట్లు. అదే మా ప్రభుత్వ హయాంలో, ఈ నాలుగేళ్లలోనే రూ.75,411 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు చేయడం జరిగింది. అంటే ఏటా సగటు వ్యయం రూ.18,852 కోట్లు. ఏ విధంగా చూసినా, గత ప్రభుత్వం కంటే ఇప్పుడు తక్కువ రుణాలు చేస్తూ.. ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, అయినా విపక్షంతో పాటు, ఎల్లో మీడియాలో అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారని శ్రీ దువ్వూరి కృష్ణ ఆక్షేపించారు. ఏపీ ఆర్థిక పరిస్థితులపై జీవీ రావు అనే వ్యక్తి తప్పుడు విశ్లేషణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దువ్వూరి కృష్ణ. ఐసీఏఐ నుంచి ఆయన్ని తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా కృష్ణ గుర్తు చేశారు. అలాగే.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారాయన. చదవండి: ఏపీ అప్పులపై ఈనాడు అర్థం, పర్థం లేని వార్తలు.. -
కుహానా మేధావి విశ్లేషణ.. ఈనాడు అర్థం, పర్థం లేని రాతలు
ఈనాడు దినపత్రిక అసూయ, అక్కసు, అసహనం వంటి సమస్యలతో రగిలిపోతుంది. మరోసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమకు పుట్టగతులు ఉండవని భయపడుతోందో ఏమో తెలియదు కానీ, నిత్యం అసత్యాల, అర్థం ,పర్థం లేని వార్తలతో పత్రికను నింపేస్తోంది. టీవీలలో గంటల కొద్ది తప్పుడు వార్తలను ప్రసారం చేస్తోంది. వారం లేదా పదిహేను రోజులకోసారి ఏపీలో అప్పులు పెరిగిపోయాయని. ఏదో అయిపోతోందని అంటూ చెత్త కథనాలు వండి వార్చుతోంది. ఇలా వార్తలు రాస్తున్నా జనం నమ్మడం లేదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా ఉంది. ఎవరో ఒకరిని మేధావి అంటూ టాగ్ తగిలించి వారితో మాట్లాడిస్తోంది. వారు కుహానా మేధావులో, నిజంగానో మేధావులో కానీ, ఈనాడు, తెలుగుదేశం పార్టీ అవసరాలకు అనుగుణంగా మాట్లాడి తమ డొల్లతనాన్ని బయటపెట్టుకుంటున్నారు. ఆ మధ్య ఒక మహిళా మేధావి అంటూ అప్పులపై మాట్లాడించారు. తాజాగా ఎవరో జీవీ రావు గారట.. ఆయనను పట్టుకువచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎలాగైతే విమర్శలు చేస్తోందో అవే వ్యాఖ్యలు ఈయన చేయడం ద్వారా తన అసలు రంగును ఆయన బయటపెట్టుకున్నారనిపిస్తుంది. వీరు నిజమైన మేధావులే అయితే, రాష్ట్రానికి ఎంత అప్పు ఉండాలి? ఎంత ఉంది? ఎందుకు పెరిగింది? కరోనా వంటి సంక్షోభాలలో అప్పులు చేయాలా? వద్దా? ప్రజలకు వివిధ స్కీముల ద్వారా డబ్బు ఇవ్వడం వల్ల జీఎస్డీపీ పెరిగే అవకాశం ఉందా? లేదా? నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ వంటివారు ఈ స్కీములపై ఏమి చెప్పారు. ప్రమాదకర పరిస్థితిలో అప్పులు చేయాలని ఎవరూ చెప్పరు. రుణాలకు సంబందించి కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట విధి,విధానాలను అమలు చేస్తోంది. వాటిని దాటి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్లడం చాలా కష్టం. ఉదాహరణకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం మితిమీరి అప్పులు చేసిందని చెప్పి, ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు పదిహేడు వేల కోట్ల రుణంపై కోత విధించింది. గత ప్రభుత్వం సుమారు రెండు లక్షల కోట్ల అప్పులు చేసింది. అప్పుడు కూడా బడ్జెట్తో సంబంధం లేకుండా కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేశారు. అప్పుడేమో రాష్ట్రం సిరిసంపదలతో తులతూగినట్లు, ఇప్పుడేమో శ్రీలంక అయిపోయినట్లు ఈ కుహానా మేధావులు చిత్రీకరించే యత్నం చేయడం దారుణంగా ఉంది. ఇక్కడ ఒక చిత్రం ఉంది. ఈ మేధావులంతా 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తాను రైతులకు, డ్వాక్రా మహిళలకు సంబంధించిన లక్ష కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసేస్తానని చెబితే ఆహా,ఓహో అని అన్నారు. చంద్రబాబుకు ఉన్న సీనియారిటీతో అది సాధ్యమేనని టీవీలలో కూర్చుని మరీ వాదించేవారు. తీరా ప్రభుత్వం వచ్చాక నాలుక మడతేసినా వీరు కూడా కిమ్మనలేదు. 2019 ఎన్నికల ముందు పసుపు -కుంకుమ, అన్నదాత సుఖీభవ అంటూ మహిళలకు ,రైతులకు డబ్బు పంచితే , ఇంకేముంది వీరంతా చంద్రబాబుకు ఓటు వేసేస్తారు. ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చేస్తారు అని డబ్బా కొట్టారు. వీరికన్నా రైతులు, మహిళలకే ఎక్కువ విజ్ఞత ఉంది కనుక ఈ మేధావుల అసత్య ప్రచారాన్ని నమ్మలేదు. అయినా వారు మళ్లీ ఎన్నికల ముందు బయల్దేరినట్లుగా ఉంది. జీవీ రావు అనే మేధావి విశ్లేషించదలిస్తే, రెండు ప్రభుత్వాల తీరును పోల్చి మంచి సలహాలు ఇస్తే బాగుండేది. ఆయన అలా చేయలేదు. పైగా చిత్రమైన వాదన చేశారు. ప్రజల జేబుల్లో పది రూపాయలు పెట్టి, వారి నుంచి వంద రూపాయలు తీసుకుంటోందని ఈయన అన్నారని ఈనాడు రాసింది. ఆయన నిజంగానే అలా అని ఉంటే ఆర్దిక నిపుణుడు ఎలా అవుతారో అర్థం కాదు. ప్రజలకు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు గుంజుకుంటే అసలు అప్పులు చేయవలసిన అవసరం ఏమి వస్తుంది? ఆర్థిక సమస్యలు ఎందుకు ఉంటాయి? ఇది కనీస ఇంగితం కాదా! ఉచితంగా ఇచ్చే మొత్తాలకన్నా అధికంగానే ప్రజల నుంచి తీసుకుంటోందని ఆయన చెప్పారట. అది ఏ రకంగానో వివరించాలి కదా? తెలుగుదేశం నేతల అర్థరహిత ప్రచారానికి ,ఈయన అభిప్రాయానికి ఏమైనా తేడా ఉందా? ఒక ప్రైవేటు సంస్థ అయిన మార్గదర్శి అక్రమంగా వందల కోట్ల రూపాయల డిపాజిట్లను తీసుకుంది. అదంతా అప్పు గానే పరిగణించాలి కదా? గతంలో 1800 కోట్ల నష్టాలలో ఉన్నా డిపాజిట్ల సేకరణ ఆపలేదు కదా! మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ దీనిపై ఫిర్యాదు చేసిన తర్వాత కదా తన టీవీచానళ్లను అమ్మి దానినుంచి బయటపడింది. అయినా మరోరూపంలో డిపాజిట్లు తీసుకుంటే అదేమో పారదర్శకమట. ప్రభుత్వం అదేమిటని అడిగితే కక్ష అట. ఇలా మాట్లాడే మేధావులంతా ప్రభుత్వం వద్దకు వచ్చేసరికి అమ్మో అప్పా? అంటూ గుండెలు బాదుకుంటూ నటిస్తుంటారు. శ్రీలంక, పాకిస్తాన్ వంటివాటితో ఈ రావుగారు పోల్చి మాట్లాడడం కూడా విడ్డూరమే. నిజంగానే ఏ రాష్ట్రం అయినా అలా సంక్షోభంలోకి వెళుతుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా?పోనీ ఈ ప్రభుత్వం వివిధ స్కీముల కింద ఆర్దిక సాయం చేయడం తప్పు అని ఈ మేధావి భావిస్తే, మరి ఈ సంక్షేమ కార్యక్రమాల కన్నా మరింత అధికంగా అమలు చేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెబుతున్నారు కదా! ఆయనను ఎందుకు విమర్శించడం లేదు. అంటే చంద్రబాబు 2019 నాటికి ప్రభుత్వంలో వంద కోట్లు మాత్రమే మిగిల్చి దిగిపోయినా, వీరి దృష్టిలో ఆయన మంచి ఆర్దికవేత, విజనరీ.ఇప్పుడు జగన్ కన్నా అధికంగా స్కీములు ఇస్తామని చెబుతుంటే అప్పుడు మాత్రం రాష్ట్రం శ్రీలంక, పాకిస్తాన్ ల లా గా మారదట. ఇతర రాష్ట్రాల పరిస్థితి వేరట. ఏపి వేరట. తెలంగాణ అప్పులపై ఈనాడు ఏనాడన్నా ఒక్క కథనాన్ని అయినా ఇచ్చిందా? ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఎందుకు ఈనాడు రామోజీ అంత భయపడుతున్నారు. అదే టైమ్ లో ఏపీలో మాత్రం పనికట్టుకుని ఇలాంటి అప్పుల తప్పుడు కథనాలు ఎందుకు రాస్తున్నారు. వెలుగు దినపత్రిక ఇచ్చిన ఒక కథనంలో తెలంగాణ ప్రభుత్వం 2.12 లక్షల కోట్ల అప్పును బడ్జెట్లో చూపకుండా చేసిందని తెలిపింది. ఈనాడులో ఎప్పుడైనా ఈ వార్తను ఇచ్చారా! గతంలో ఈనాడు రాసింది కనుక, తెలుగుదేశం ఆరోపించింది కనుక జి.వి.రావు అనే మేధావి కూడా ఏపిలో పది లక్షల కోట్ల అప్పు ఉందని చె్ప్పారని అర్థం అవుతూనే ఉంది. ఆయన దగ్గర అప్పులు సమాచారం ఉంటే ఆ క్లాసిఫికేషన్ ఇచ్చి ఉండేవారు కదా? ఈనాడులో వచ్చిన వార్తలనే మళ్లీ తాను కూడా చెప్పడానికి ఇంటర్వ్యూ ఎందుకు? ఏదో ఈనాడులో మేధావిగానో,నిపుణుడుగానో ఉచిత ప్రచారం చేసుకోవడానికి తప్ప ఎందుకు పనికి వస్తుంది ఈ ఇంటర్వ్యూ. 'గ్రామాలలో సచివాలయాలు ఏర్పాటు చేేస్తే అభివృద్ది కాదట. రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పితే అది ప్రజలకు నష్టమట. స్కూళ్లకు వేల కోట్ల వ్యయం చేసి బాగు చేసి పేదలకు విద్యాబుద్దులు నేర్పడం మంచిది కాదట. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వరాదట... కేంద్రం నాలుగు లక్షల కోట్ల అప్పే ఏపీకి ఉందని చెప్పినా ఒప్పుకోరట. ఈనాడులో రాశారు కనుక మరో ఆరు లక్షల కోట్ల అప్పు అని చెప్పాల్సిందేనట." ఆ మేధావి ఫీలింగ్స్ ఇలా ఉన్నాయనిపిస్తుంది. అందుకే ఏపీలో ఆయనకు అభివృద్ది కనిపించలేదుగతంలో ఎప్పుడూ రోజువారి అప్పులు చేయలేదా? వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ఎందుకు తీసుకుంటారు? కేంద్ర ప్రభుత్వం 35 వేల కోట్ల రుణాలకు అనుమతి ఇచ్చింది! అందుకూ ఈనాడు, జ్యోతి వంటి మీడియాలకు ఏడుపే. కేంద్రంలో కొందరు అదికారులు ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని అప్పుడు రాశారు. పోనీ ప్రభుత్వం ఈ స్కీములు అమలు చేయవద్దని రాస్తారా?అంటే అది రాయరు. ఇంకా అదనంగా ఇవ్వాలంటారు. వారికి కావల్సినప్పుడు రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వస్తుందని రాస్తారు. ఇప్పుడు కూడా ఈ మేధావి ఎవరో జీవీ రావు గారు కూడా పది రూపాయలు ఇచ్చి పంద రూపాయలు తీసుకుంటే , ప్రభుత్వానికి ఆర్ధిక సమస్యలు ఎందుకు వస్తాయో వివరించి ఉండాలి కదా? కేవలం తెలుగుదేశం కోసమో, ఈనాడు మీడియా కోసమో ఇలాంటి పిచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చి ఈ సోకాల్డ్ మేధావులు అప్రతిష్టపాలు కాకుండా ఉంటే మంచిది. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ ఛైర్మన్ (చదవండి: మనది ఉద్యోగాంధ్ర.. ఉపాధి అవకాశాలు పుష్కలం.. దేశంలో 4వ స్థానం) -
సర్వే నివేదిక పుస్తకాన్ని ఆవిష్కరించిన కొమ్మినేని శ్రీనివాసరావు
-
రైతే రాజన్న ఆలోచనలతో వైఎస్ జగన్ పాలన
-
బందరులో భయపడ్డ బాబు..
-
ముస్లింలపై ‘ఈనాడు’ ద్వంద్వ నీతి!.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో ముస్లిం సమాజంపై వివక్ష చూపి వారిని తీవ్ర వేధింపులకు గురిచేసినా ఒక్క అక్షరం ముక్క రాయని ఈనాడు పత్రిక ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారిని సగౌరవంగా నిలబెట్టినా అన్యాయం చేస్తున్నారంటూ దుష్ప్రచారానికి దిగింది. పల్నాడు జిల్లా పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ రాజకీయ ప్రయోజనాల కోసం ఆదివారం అమరావతిలోని ఒక ముస్లిం కాలనీకి వెళ్లి ముస్లిం యువకులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఈ క్రమంలో ఏర్పడిన ఉద్రిక్తతలను తొలగించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటే దాన్ని ముస్లిం యువకులపై దాడిగా ఈనాడు చిత్రీకరించి చిలవలు పలవలుగా కథనం రాసింది. ఒక యువకుణ్ణి పోలీసులు కొడుతున్నట్లు ఫొటో ఒకటి ప్రచురించి వైఎస్సార్సీపీ ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నట్లు చూపించడానికి తాపత్రయపడింది. దేశద్రోహం కేసుపై ఎందుకు రాయలేదు? ఈ చిన్న ఘటనను భూతద్దంలో చూపించిన ఈనాడు.. చంద్రబాబు హయాంలో ముస్లింలపై అడుగడుగునా దారుణాలు జరిగినా ఏనాడూ రాయలేదు. 2018లో చంద్రబాబు సీఎంగా ఉండగా గుంటూరులో నారా హమారా పేరుతో నిర్వహించిన సభలో కొందరు యువకులు తమకిచ్చిన హామీలు అమలుచేయాలని ప్లకార్డులు చూపించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించి వారిపై రాజద్రోహం కేసుపెట్టి చిత్రహింసలు గురిచేసినప్పుడు ఈనాడులో కనీసం వారి గురించి రాయలేదు. కేవలం చంద్రబాబును ప్రశ్నించారనే కారణంతో 9 మంది యువకులపై ఉగ్రవాదులనే ముద్రవేసి నెలలపాటు వారిని చిత్రహింసలకు గురిచేశారు. సామాన్య ముస్లిం యువకులపై దేశద్రోహం కేసులు ఏమిటని ముస్లిం సమాజం యావత్తూ ఆందోళన చేసినా ఈనాడు స్పందించలేదు. గుంటూరులో పలు సాకులు చూపి ముస్లిం పిల్లలు 200 మందిపై కేసులు పెట్టినా, వేధించినా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు తెలుగుదేశం ప్రయోజనాల కోసం ఏమీ జరగకపోయినా ముస్లిం యువకులపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తూ ఇష్టారాజ్యంగా రాతలు రాయడంపై ఆ వర్గంలోనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. చదవండి: మార్గదర్శి అక్రమ వ్యవహారాల కేసులో సీఐడీ కీలక నిర్ణయం వారికి మంత్రి పదవి ఇవ్వకపోయినా పట్టించుకోలేదు నిజానికి.. చంద్రబాబు ముస్లింలను అన్ని రకాలుగా అవమానించడంతోపాటు తీవ్రంగా అణచివేశారు. టీడీపీకి ఓట్లు వేయలేదనే కక్షతో కనీసం ఆ వర్గానికి చంద్రబాబు తన కేబినెట్లో నాలుగేళ్లపాటు చోటు కల్పించలేదు. నంద్యాల ఉప ఎన్నిక రావడంతో ఆ వర్గాన్ని ఆకట్టుకునేందుకు చివరి ఆర్నెలల్లో ఎన్ఎండీ ఫరూక్ను మంత్రిని చేశారు. దీనిపై అప్పట్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది.ముస్లిం సమాజమంతా ముక్తకంఠంతో చంద్రబాబు తీరును వ్యతిరేకించినా ఈనాడుకు పట్టలేదు. ఇప్పుడుమాత్రం చంద్రబాబుకు మేలు చేకూర్చేందుకు వారిపై ప్రేమ ఒలకబోసేలా వార్తలు రాయడంపై ముస్లింలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
పచ్చ పార్టీ.. పచ్చ కుట్రలు.. ఫేక్ న్యూస్తో ఎల్లో మీడియా శునకానందం..
టీడీపీ గ్రాఫ్ పెంచలేకపోతున్నారు. పడిపోతోన్న బాబు ఇమేజ్ని లేపలేకపోతున్నారు. పైనున్న ప్రభుత్వ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తే పోలా అనుకున్నారు. అంతే ఫేక్ జీవోలతో ఫేక్ సర్వేలతో ఫేక్ వ్యవహారాలు నడుపుతూ దిగజారుడుగా వ్యవహరిస్తున్నారు ఎల్లో కూలీ మీడియా పెద్దలు. ఆ మధ్య ఫేక్ జీవో వైరల్ చేసి శునకానందం పొందారు. అది జనం నమ్మకపోవడంతో ఫేక్ సర్వేతో తెరపైకి వచ్చారు. అదీ వర్కవుట్ కాకపోవడంతో సోషల్ మీడియాలో ఫేక్ స్టోరీలతో సంతృప్తి చెందుతున్నారు. ఎల్లో గ్యాంగ్ వారి కూలీ మీడియాల వ్యవహారాలు చూసి జనం ఏవగించుకుంటున్నారు. రిటైర్మెంట్ పేరిట ఫేక్ న్యూస్ కొద్ది రోజుల క్రితం ఎల్లో మీడియాలో ఓ కథనం హల్ చల్ చేసింది. అదేంటంటే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్ల నుండి 65 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం జీవో జారీచేసినట్లు కథనం అల్లారు. అయితే అసలు అటువంటి జీవో ఏదీ తాము జారీ చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎల్లో గ్యాంగ్ పనిగట్టుకుని నకిలీ జీవోను సోషల్ మీడియాలో వైరల్ చేసింది. దాన్నే ఈనాడు పత్రికలో బ్యానర్ స్టోరీ చేసేశారు. సర్వేల పేరిట ఫేక్ న్యూస్ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐ ప్యాక్ టీమ్ ఏపీలో ఓ సర్వే చేసిందని అందులో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తేలిందని ఓ కథనాన్ని వండి వార్చేశారు. ఈ ఫేక్ సర్వే గురించి ఎల్లో కూలీ మీడియాలో బ్యానర్ స్టోరీ వచ్చిన మరుక్షణమే ఐ ప్యాక్ సంస్థ స్పందించింది. తాము అసలు చాలా కాలంగా ఎలాంటి సర్వేలు జరపనే లేదని ఎల్లో మీడియాలో వచ్చిన కథనం అంతా ఫేకే నని ఐ ప్యాక్ ట్వీట్ చేసింది. మనవాడు వచ్చాడంటూ ఫేక్ సర్వే రఘురామ సర్వే పేరుతో ఒకటి, ఆత్మసాక్షి పేరుతో మరో సర్వే వెలువడ్డట్లు ప్రచారం చేశారు. రఘురామ సర్వే అనగానే ఆయన ఎవరికి అనుకూలమో ఎవరిపై రోజూ విషం చిమ్ముతూ ఉంటారో అందరికీ తెలుసు. ఆ సర్వేలో ఆయన ఎవరికి అనుకూలంగా అంశాలను మలుస్తాడో కూడ అందరికీ తెలుసు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే నేతలు సర్వే చేసినట్లు చెప్పడం వాటిని ఎల్లో మీడియాలో ప్రచురించి ప్రజల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరుగుతోందని అవాస్తవాలు ప్రచారం చేయడం ఎల్లో గ్యాంగ్ లక్ష్యాలుగా ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. 2019లోనూ ఫేక్ సర్వేలు 2019 ఎన్నికల సమయంలోనూ ఎల్లో బ్యాచ్ ఫేక్ సర్వేలతో ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసేందుకు విఫల యత్నాలు చేసింది. అప్పట్లో టీడీపీ అనుకూల మీడియా వ్యక్తిగతంగా సర్వేలు నిర్వహించినట్లు చెప్పుకున్నాయి. కేవలం ఎల్లో మీడియా మాత్రమే చెబితే జనం నమ్మరేమోనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో చీకట్లో భేటీ అయిన విజయవాడ మాజీ ఎంపీ ఆంధ్రా ఆక్టోపస్ను తెరపైకి తెచ్చింది టీడీపీ. ఈ సర్వేలన్నింటినీ ఎడం కాలితో తన్నేసిన ఓటర్లు 175 స్థానాలున్న ఏపీలో 151 స్థానాల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించి టీడీపీకి కేవలం 23 స్థానాలు విదిల్చారు. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డిపై నిత్యం ఏదో ఒక విష ప్రచారంతో విరుచుకు పడుతూనే వస్తున్నారు ఎల్లో బ్యాచ్ పెద్దలు. ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులు చంద్రబాబు హయాంలో కన్నా చాలా ఎక్కువగా వస్తోంటే ఏపీ నుండి పరిశ్రమలు తరలిపోతున్నాయని.. ఒక్క కొత్త పరిశ్రమ కూడా రావడం లేదని ఎల్లో కూలీ మీడియా కథనాలు వండి వార్చింది. అప్పులపై ఫేక్ ప్రచారం చంద్రబాబు పాలనలో చేసిన అప్పులతో పోలిస్తే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులు చాలా చాలా తక్కువే. అయినా జగన్ పాలనలోనే ఎక్కువ అప్పులు చేస్తున్నట్లు ఫేక్ స్టోరీలు వండి వార్చారు. సంక్షేమ పథకాలతో ఏపీలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటే ఎవ్వరికీ ఏ పథకమూ అందడం లేదంటూ కుట్ర కథలు ప్రచారంలో పెట్టారు. బడుగు బలహీన వర్గాలకు పదవుల్లో పెద్ద పీట వేస్తే.. ఆ వర్గాలకు అన్యాయం జరిగిపోతోందంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ విషం చిమ్ముతున్నారు. దేశంలోనే ప్రగతి పథంలో ఏపీ అగ్రగామిగా దూసుకుపోతూ ఉంటే ఏపీ శ్రీలంక అయిపోతోందంటూ కుళ్లు కథలు చెప్పుకుపోతున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఏపీ అమెరికాలో మెరిసిపోయినట్లు.. జగన్ పాలనలో అమెరికాలా ఉన్న ఏపీ కాస్తా దివాళా తీసేసినట్లు దిగజారుడు రాతలతో పేట్రేగిపోతున్నారు. అన్నీ ఫేకే. ఒక్కదాంట్లోనూ నిజం లేదు. ఒక్క కథనంలోనూ విలువలు లేవు. తాము రాసేది తప్పని వారికి తెలుసు. తాము చిమ్మేది విషమని తెలుసు. తమ బాబు పాలనకన్నా ఇపుడే బాగుందని కూడా తెలుసు. అయినా తమ బాబు రాజకీయ ప్రయోజనాల కోసమే ఎల్లో కూలీ మీడియా ఫేక్ వేషాలతో రెచ్చిపోతోంది. ఫేక్ స్టోరీలు సృష్టించడం వాటిని ప్రచారంలో పెట్టించడం వాటిని చూసి స్పందించినట్లుగా టీడీపీ శ్రేణుల చేత గొడవలు చేయించడం.. వాటికి వత్తాసుగా పవన్ కళ్యాణ్ చేత వేషాలు వేయించడం అన్నీ కూడా చంద్రబాబు నాయుడి పొలిటికల్ గేమ్లో భాగంగానే జరుగుతున్నాయంటున్నారు పాలక పక్ష నేతలు. అందుకే ఎల్లో మీడియాలో వచ్చే వార్తలు, కథనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలకు పిలుపునిస్తున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
'చైనా సంస్థ నుంచి డబ్బులు తీసుకొనే బీబీసీ తప్పుడు ప్రచారం'
న్యూఢిల్లీ: చైనాకు చెందిన సంస్థ నుంచి డబ్బులు తీసుకునే ప్రధాని మోదీపై బీబీసీ తప్పుడు డాక్యుమెంటరీని రూపొందించిందని బీజేపీ ఎంపీ, సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలాని ఆరోపించారు. హూవావే సంస్థ నుంచి బీబీసీకి డబ్బులు అందాయని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. Why is #BBC so anti-India? Because it needs money desperately enough to take it from Chinese state linked Huawei (see link) & pursue the latter’s agenda (BBC a fellow traveller, Comrade Jairam?)It’s a simple cash-for-propaganda deal. BBC is up for sale https://t.co/jSySg542pl — Mahesh Jethmalani (@JethmalaniM) January 31, 2023 'బీబీసీ ఎందుకు భారత్కు వ్యతిరేకం? ఆ సంస్థకు బాగా డబ్బు అవసరమైంది. చైనాకు చెందిన హువావే సంస్థ ఆ డబ్బును సమకూర్చింది. డబ్బు తీసుకుని కావాలనే బీబీసీ తప్పుడు ప్రచారం చేస్తోంది. బీబీసీ అమ్ముడుపోతోంది.' అని మహేష్ జెఠ్మాలని ట్వీట్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి బ్రిటన్ మేగజీన్ 'ది స్పెక్టేటర్' 2022 ఆగస్టులో ప్రచురించిన ఓ కథనాన్ని కూడా షేర్ చేశారు. బీజేపీ నేత అమిత్ మాలవీయ సైతం బీబీసీ డాక్యుమెంటరీ దురుద్దేశంతో ఉందని ఆరోపించారు. భారత్ వృద్ధికి ఆటంకం కల్గించేందుకే ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. చైనా ప్రభుత్వం అండదండలతో కొన్ని సంస్థలు బీబీసీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, రెండేళ్లుగా డబ్బులు అందిస్తున్నాయని అన్నారు. ఈ డాక్యుమెంటరీని ప్రతిపక్షాలు కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నాయని పేర్కొన్నారు. కార్తీ చిదంబరం సెటైర్లు.. మరోవైపు బీజేపీ నేతల తీరుపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సెటైర్లు వేశారు. కేంద్రం బీబీసీ డాక్యమెంటరీని బ్యాన్ చేయడం చిన్నపిల్లల మనస్తత్వాన్ని గుర్తు చేస్తోందన్నారు. ఒకవేళ బీజేపీ నేతల దగ్గర బలమైన ఆధారాలుంటే బ్రిటన్లో ఆ సంస్థపై ఫిర్యాదు చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. డాక్యుమెంటరీలో వాస్తవం లేదని ప్రభుత్వం భావిస్తే అసలు నిజాలేంటో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయకుండా బ్యాన్ ఎందుకు చేశారని అడిగారు. బీజేపీ నేతలు నిజంగా చైనా గురించి మాట్లాడాలనుకుంటే సరిహద్దులో చొరబాట్లు గురించి చర్చించాలన్నారు. చదవండి: మోదీ బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై సుప్రీంకోర్టులో విచారణ -
ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా సీఎం జగన్ను మిల్లీమీటర్ కూడా కదపలేరు
తాడేపల్లి: టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ప్రాయోజిత కార్యక్రమం అన్నారు పేర్ని నాని. నందమూరి వారసులను చూసి చంద్రబాబా భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కుప్పం సభలో లోకేష్ బరితెగించి అబద్దాలు మాట్లాడాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు మంచి పనులు చేస్తే లోకేష్ ఎందుకు బజారున పడ్డారని ప్రశ్నించారు. తెలుగుదేశాన్ని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు చెత్తనాయకుడని అచ్చన్నాయుడే చెబుతున్నాడని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు, లోకేష్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పెన్షన్లు తీసేశారంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో 40 లక్షల పెన్షన్లు వస్తే.. సీఎం వైఎస్ జగన్ 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారని తెలిపారు. కొత్త వైన్ బ్రాండులన్నీ చంద్రబాబు హయాంలో వచ్చినవేనని పేర్ని గుర్తు చేశారు. చంద్రబాబు పెట్టిన ధాన్యం బకాయిలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. చంద్రబాబు పెట్టిన 22వేల కోట్ల కరెంటు బకాయిల భారాన్ని ప్రజలు మోస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు 100 అబద్దాలు చెబితే లోకేష్ 1000 చెబుతున్నారని విమర్శించారు. జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తామని చెప్పే దమ్ము టీడీపీకి ఉందా? అని పేర్ని సవాల్ విసిరారు. తెలుగు గంగను పూర్తి చేస్తామని చెప్పడానికి సిగ్గు లేదా? అని ఫైర్ అయ్యారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. టీడీపీ నేతలు ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా సీఎం జగన్ను మిల్లీమీటర్ కూడా కదపలేరని పేర్ని వ్యాఖ్యానించారు. చదవండి: పప్పు సుద్ద లోకేష్ పాదయాత్రతో టీడీపీ అధికారంలోకి వచ్చే సీనుందా? -
టీటీడీపై ఎల్లో మీడియా అసత్య ప్రచారం
-
కొంప ముంచిన ప్రచార పిచ్చి
సాక్షి,అమరావతి/సాక్షిప్రతినిధి,నెల్లూరు/కందుకూరు: రాజకీయాలకు సంబంధించి ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు ప్రజలను భ్రమింపజేయడంలో చంద్రబాబును మించిన వారెవరూ లేరని మరోమారు నిరూపించుకున్నారు. తన ప్రచార పిచ్చి కోసం అమాయకులైన ప్రజల ప్రాణాలకు ఆయన ఏమాత్రం విలువ ఇవ్వరు. తన రాజకీయ ప్రయోజనాలు, పబ్లిసిటీ తప్ప ఆయనకు మరేమీ కనిపించవు. ఈసారి జరగబోయే ఎన్నికలే తనకు చివరివి అని చంద్రబాబు తన నోట తానే ఒప్పుకున్నారు. ఎలాగైనా గెలవాలని, ఇందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడకూడదని నిర్ణయించుకుని.. ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెర లేపారు. ఇదేం ఖర్మ.. అంటూ ఊరూరూ తిరగడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో తన సభలకు జనం రావడం లేదనే వాస్తవాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఇరుకు సందులను ఎంచుకుని, అక్కడకి భారీగా జనాన్ని సమీకరించడం ద్వారా తండోపతండాలుగా వచ్చినట్లు చూపించే ఎత్తుగడను కొద్ది నెలలుగా అమలు చేస్తున్నారు. తన సభలు సక్సెస్ అయ్యాయని, తన జీవితంలో ఎప్పుడూ చూడనంత మంది జనం వచ్చారని ఆయన ఇటీవల పదేపదే చెబుతుండటమే ఇందుకు నిదర్శనం. పెద్ద కూడళ్లు, గ్రౌండ్లలో సరిపడా జనం తన సభలకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆయన ఈ వైఖరి ఎంచుకున్నారు. ఇరుకు సందుల్లో సభలు నిర్వహిస్తూ.. సొంత టీమ్ ద్వారా డ్రోన్ షూటింగ్/ డ్రోన్ ఫొటోల ద్వారా జనం కిక్కిరిసినట్లు చిత్రీకరించడం ద్వారా పడిపోయిన తన గ్రాఫ్ పెరిగినట్లు చూపించుకునేందుకు తహతహలాడుతున్నారు. సభ నిర్వహించిన ఇరుకు రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతం.. (బాణం గుర్తు వైపు) తప్పు చేసి, ప్రభుత్వంపై నెట్టేసే యత్నం ఈ తాపత్రయంలో భాగంగానే కందుకూరులో ఇరుకు సందులో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండానే సభ పెట్టి 8 మంది ప్రాణాలు కోల్పోవడానికి చంద్రబాబు కారకుడయ్యారు. ఇంతమంది ప్రాణాలు పోయినా కనీస పశ్చాత్తాపం కూడా ఆయనలో కనిపించకపోవడం అన్యాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సభకు సరైన భద్రత కల్పించకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందంటూ నెపాన్ని చాలా తేలిగ్గా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా.. జగన్ సభలో ఒకరు.. పవన్ సభలో ఒకరు చనిపోయారని, ఇలాంటివి మామూలేనని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. 2015లో గోదావరి పుష్కరాల సమయంలో పుష్కరఘాట్లో వేలాది మందిని ఒక గేటు వద్ద నిలిపి, ఒక్కసారిగా గేటు తెరిపించి తొక్కిసలాటకు కారణమయ్యారు. ఆ దారుణ ఘటనలో 29 మంది అమాయక యాత్రికులు మృత్యువాత పడగా, 60 మంది గాయాలపాలయ్యారు. అప్పట్లో ఆ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కుంభమేళా తరహాలో తాను గోదావరి పుష్కరాలను అద్భుతంగా నిర్వహించానని ఒక ఇంగ్లిష్ టీవీ చానల్ ద్వారా చూపించుకునేందుకు ఆ షూటింగ్ నిర్వహించే క్రమంలో ఆ దారుణం జరిగింది. ఈ ఘటనపై అప్పట్లోనూ చంద్రబాబు పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోగా కుంభమేళాలో జనం చనిపోలేదా? రోడ్డు ప్రమాదాల్లో ఎంత మంది చనిపోవడం లేదు? అంటూ బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా కందుకూరు ఘటనపై ప్రభుత్వంపై ఆవేశంతో జనం వచ్చారంటూ.. వక్రీకరించారు. ఇలా చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటైన విద్యేనని విశ్లేషకులు చెబుతున్నారు. రోడ్డును ఆక్రమించి టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కింద పడ్డవారిని తొక్కుకుంటూ వెళ్లారు నేను, నా ఫ్రెండ్ ఇద్దరం టీడీపీ మీటింగ్కు వెళ్లాం. బాబు వాహనానికి కొంచెం దూరంలో నిలబడి ఉన్నాం. ఎందుకో ఒక్కసారిగా జనాలు పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో మా పక్కనే ఉన్న బైక్లు కిందపడ్డాయి. ఒక బైక్ కింద నాఫ్రెండ్ పడ్డాడు. వాడు పెద్దగా అరుస్తున్నాడు. అయినా జనాలు ఆగకుండా తొక్కుకుంటూ వెళ్తున్నారు. వాడి అరుపులకు భయమేసి వాడిని కాపాడానికి వెళ్లాను. బైక్ కింద ఉన్న వాడిని పట్టుకుని గట్టిగా పక్కకు లాగాను. ఈ ప్రయత్నంలో నా కాలు బైక్ కింద ఇరుక్కుపోయి రక్తం కారింది. అయినా ఒకరికొకరం లాక్కుని ప్రాణాలతో బయటపడ్డాం. – మోసీన్, ప్రమాదంలో గాయపడిన యువకుడు -
గన్ షాట్: ఎల్లో మీడియా విష ప్రచారానికి అడ్డు అదుపు లేదా ..?
-
గన్ షాట్ : చంద్రబాబు అబద్ధాలకు అంతులేదా..?
-
ఎల్లో మీడియా కు నరకయాతన..
-
వినుర వేమ.. ఏదైనా సరే రాజకీయమే ..!
-
KSR కామెంట్ : అమరావతి దారుణాలను ఏనాడూ రాయని ఎల్లో మీడియా
-
గణేష్ మండపాలపై ఏపీలో ప్రతిపక్షాల నీచ రాజకీయాలు
-
పాత ఫొటోలతో విష ప్రచారం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): గత తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల జీవీఎంసీ పరిధిలో ఉన్న రహదారులన్నీ దెబ్బతిన్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రహదారులన్నీ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేస్తోందని, నిధులు కూడా కేటాయించామని ఆయన తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రి బూడి ముత్యాలనాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈనాడు పత్రిక పాత ఫొటోలు వేసి తప్పుగా ప్రచారం చేసిందని, ద్వారకానగర్లో జూన్ 6వ తేదీలోపు రహదారులు వేసినట్టు స్పష్టం చేశారు. ఇక్కడే మరమ్మతులు కూడా చేపట్టామని ఉప ముఖ్యమంత్రి అన్నారు. మరమ్మతులు జరిగిన రహదారుల్లో పాత ఫొటోలతో పత్రికలో వేసి వార్తలు రాయడం దారుణమన్నారు. అల్లా ఉద్దీన్ అద్భుత దీపం మాదిరిగా రాత్రికి రాత్రి రోడ్లు వేయడం జరగదు కదా అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ రహదారులన్నీ ఛిద్రంగా మారాయని, దాని వల్లే ఇప్పుడు అధ్వానంగా తయారయ్యాయన్నారు. పాత ఫొటోలు వేసి పచ్చ పత్రిక ప్రభుత్వంపై బురద జల్లేందుకు కంకణం కట్టుకుందన్నారు. జీవీంఎసీ పరిధిలోని అన్ని వార్డుల్లో రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం కార్పొరేటర్లు సూచనలు, సలహాలు మేరకు పనులు చేపడుతున్నట్టు చెప్పారు. జీవీఎంసీ పరిధిలో అన్ని వార్డుల్లో మొత్తం 6,900 గుంతలను, రహదారులను గుర్తించడం జరిగిందని, ఇందులో సుమారు 3,200 గుంతలను 9 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేసినట్టు చెప్పారు. మిగిలిన 3,700 గుంతలు జూలై 15 నాటికి పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే వార్డుల్లో పనుల కోసం ఒక్కొ కార్పొరేటర్కు రూ.కోటి 50 లక్షల కేటాయించామన్నారు. ఈ పనులు కూడా టెండర్లు పిలిచి త్వరగా చేపట్టాలని, వచ్చే సెప్టెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. గ్రామీణా ప్రాంతాల్లో కూడా రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు. నాడు–నేడు పథకం నిధులు కేటాయింపు ప్రక్రియ ప్రణాళిక బద్ధంగా జరుగుతోందన్నారు. రాష్ట్రంలో రహదారుల కోసం రూ.1,073 కోట్లు కేటాయించామన్నారు. అలాగే మన్యం ప్రాంతాల్లో కూడ పీఆర్, ఆర్అండ్బీ రహదారులు వేయాలని వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ శ, ఆర్డీవో డి.హుస్సేన్ సాహెబ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. (చదవండి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మెరిసిన మన్యం బిడ్డ) -
ఎల్లో సిండికేట్ మరో దుష్ప్రచార కుట్ర
సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ, ఎల్లో మీడియా కూటమి నిత్యం అసత్య కథనాలు వండి వారుస్తున్నాయి. తాజాగా.. వారికి వైఎస్సార్ కడప జిల్లా జైలు అదనపు సూపరింటెండెంట్గా బదిలీపై వచ్చిన పి. వరుణారెడ్డి టార్గెట్ అయ్యారు. ఆయనను సాకుగా చేసుకుని ప్రభుత్వంపై ఆ దుష్ట కూటమి బురద జల్లుతోంది. ఈ విషయంలో ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారానికి పూర్తి భిన్నంగా వాస్తవాలు ఉన్నట్లు జైళ్ల శాఖ వర్గాలే చెబుతున్నాయి. అవేమిటంటే.. అప్పుడు వరుణారెడ్డి జైలు సూపరింటెండెంట్ కాదు 2008లో అనంతపురం జైలులో మొద్దు శ్రీను హత్యకు జైలర్గా ఉన్న వరుణారెడ్డి నిర్లక్ష్యమే కారణమని ఎల్లో మీడియా ఓ అసత్య కథనాన్ని వండివార్చింది. కానీ, వరుణారెడ్డి అప్పుడు అనంతపురం జైలు సూపరింటెండెంట్ కాదు. మొద్దు శ్రీను హత్య వెనుక కుట్ర కోణం ఏమీలేదని మెజిస్టీరియల్ విచారణలో కూడా వెల్లడైంది. వరుణారెడ్డిపై ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే శాఖాపరమైన చర్యలను ఉపసంహరించిందని ఎల్లో మీడియా మరో దుష్ప్రచారానికి తెరలేపింది. నిజానికి ఆయనపై రెండేళ్లపాటు ఇంక్రిమెంట్ వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని 2013లోనే అప్పటి కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం సవరించి ఊరట కలిగించింది. క్యుమిలేటివ్ ప్రభావం లేకుండా ఏడాదిపాటు ఆయన వార్షిక ఇంక్రిమెంట్ను నిలుపుదల చేసింది. ఇక రెండో ఇంక్రిమెంట్ వాయిదా నిర్ణయాన్ని కూడా ఉపసంహరిస్తూ 2019, ఫిబ్రవరిలో అంటే చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. శాఖాపరమైన చర్యలను ఉపసంహరిస్తూ సస్పెన్షన్ కాలాన్ని కూడా ఆన్ డ్యూటీగా పరిగణించాలని టీడీపీ హయాంలోనే హోంశాఖ సంబంధిత ఫైలును క్లియర్ చేసింది. వరుణారెడ్డి చేసిన విజ్ఞప్తిని కూడా అన్ని కోణాల్లో పరిశీలించే ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం.. కోడ్ కారణంగా హోంశాఖ ఉత్తర్వుల జారీని వాయిదా వేసింది. ఎన్నికల అనంతరం కోడ్ తొలగించాక ఉత్తర్వులు జారీచేసింది. అంతేగానీ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వరుణారెడ్డికి అనుకూలంగా ప్రత్యేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కీలక పోస్టింగ్ ఇచ్చింది టీడీపీనే.. నాన్ ఫోకల్ (అంతగా ప్రాధాన్యతలేని) పోస్టులో ఉన్న వరుణారెడ్డికి కడప జైలు అదనపు సూపరింటెండెంట్గా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కీలక పోస్టింగు ఇచ్చిందని ఎల్లో మీడియో మరో దుష్ప్రచారం చేస్తోంది. కానీ, రాయలసీమలోనే అత్యంత ప్రాధాన్యం ఉన్న కర్నూలు జైలు అదనపు సూపరింటెండెంట్గా ఆయనకు టీడీపీ ప్రభుత్వమే 2016లో పోస్టింగ్ ఇచ్చింది. అంతటి కీలక స్థానంలో ఆయన వరుసగా ఐదేళ్లపాటు కొనసాగారు. దాంతో సాధారణ బదిలీల్లో భాగంగానే వరుణారెడ్డిని కడప జైలుకు బదిలీ చేశారు. వృత్తిపరంగా ఆయన నిబద్ధతను టీడీపీ కూడా గతంలో ఏనాడూ ప్రశ్నించలేదు. మొద్దు శ్రీను హత్య కేసు అంశంలో ఆయనపై టీడీపీకి సందేహాలు ఉండి ఉంటే ఆయనకు ఎందుకు కీలక పోస్టింగ్ను ఇచ్చింది? విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు వరుణారెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఇండియన్ పోలీస్ మెడల్ను ప్రకటించింది కూడా. ఇలాంటి అధికారిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోందని జైళ్ల శాఖ వర్గాలుఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కడప సెంట్రల్ జైలు ఇన్చార్జి సూపరింటెండెంట్ బదిలీ కడప అర్బన్: కడప కేంద్ర కారాగారం ఇన్చార్జి సూపరింటెండెంట్ వరుణారెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను ఒంగోలు కారాగారం సూపరింటెండెంట్గా ప్రభుత్వం నియమించింది. ఇక్కడ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ఐఎన్హెచ్ ప్రకాష్ను కడప కేంద్ర కారాగారానికి బదిలీ చేసింది. -
మతి పోయి 'రివర్స్' రాతలు
సాక్షి, అమరావతి: ‘చదివితే ఉన్న మతి పోయింది’ అన్నట్లుగా.. రాన్రాను ఎల్లో మీడియా విష ప్రచారం పిచ్చికి పరాకాష్టగా మారింది. నిద్దర లేస్తే ప్రభుత్వంపై విష ప్రచారం చేయాలి, ప్రజలను రెచ్చగొట్టే రాతలతో పబ్బం గడుపుకోవాలన్న యావలో వాస్తవాలకే మసి పూస్తోంది. ఇందుకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సంబంధించి కార్యదర్శుల కమిటీ నివేదికపై ఆ మీడియా రాసిన రాతలే నిదర్శనం. కార్యదర్శుల కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగకపోగా తగ్గిపోతాయని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. ఈ విష ప్రచారంపై ఉద్యోగుల్లోనే అసహనం వ్యక్తమవుతోంది. ఈ నివేదికతో ఒక్కో ఉద్యోగి జీతంలో రూ.10 వేలు తగ్గిపోతాయని ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం ఉద్యోగుల్లో భయాందోళనలు రేకెత్తించడం కోసం వండినదేనని ఆగ్రహం వ్యక్టం చేస్తున్నారు. దానికి టీడీపీ వంతపాడటంపై మండిపడుతున్నారు. అదంతా విష ప్రచారమే తప్ప వాస్తవాలు వేరుగా ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. 14.29 శాతం ఫిట్మెంట్తో ఉద్యోగుల జీతాలు రివర్స్లోకి వెళ్తున్నాయన్న ప్రచారం పచ్చి అబద్ధమని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ అమలు చేస్తోందనే విషయాన్ని గుర్తించాలని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల ఏడాదికి సుమారు రూ.7,200 కోట్ల భారం రాష్ట్ర ఖజానాపై ఇప్పటికే పడుతోందని ఆర్ధిక శాఖ వర్గాలు తెలిపాయి. సీఎస్ కమిటీ నివేదిక ప్రకారం 14.29 శాతం ఫిట్మెంట్ ఇస్తే ఏడాదికి సుమారు రూ.11,200 కోట్ల అదనపు భారం పడుతుందని వెల్లడించాయి. అంటే ఐఆర్కన్నా ఫిట్మెంట్ అమలు వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.4 వేల కోట్ల భారం పడుతుంది. ఇది రివర్స్ ఎలా అవుతుందో ఎల్లో మీడియానే చెప్పాలని పలువురు ఉద్యోగులు అంటున్నారు. ప్రభుత్వంపై పడే అదనపు భారం రూ.4 వేల కోట్లలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు రెగ్యులర్ స్కేలులోకి రావడంవల్ల, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వల్ల పడుతున్న భారం రూ.2 వేల కోట్లని నివేదిక చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. దీన్ని కూడా మినహాయించినా ఫిట్మెంట్ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్న అదనపు భారం దాదాపు రూ.2 వేల కోట్లు. ఈ వాస్తవాలకు మసి పూసి ఉద్యోగులను రెచ్చగొట్టేలా తోక పత్రిక విషం కక్కడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కమ్యూనిస్టుల పాలనలో ఉన్న కేరళలో కూడా 2019 జులైలో ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్మెంట్ 10 శాతమేనని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు సైతం కేంద్ర ప్రభుత్వ సిఫార్సులనే అమలు చేస్తున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్మెంట్ 14.29 శాతమే. వీటిని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందని చిత్రీకరించేందుకు ఎల్లో మీడియా, టీడీపీ రక రకాల వక్రీకరణలతో విష ప్రచారం చేయడం ఏమిటనే ప్రశ్నలు సామాన్యుల నుంచి కూడా వస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2019 నుంచి అంగన్వాడీ, ఆశా వర్కర్లు, శానిటరీ వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, కుకింగ్ హెల్పర్లకు జీతాలు పెంచిందని అధికారులు గుర్తు చేస్తున్నారు. దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులకు 70 శాతం మేర జీతాలు పెంచడం నిజం కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఇవేమీ పీఆర్సీ పరిధిలోకి రావు. వాళ్లకు పెంచిన జీతాల వల్ల కలగుతున్న భారం, ఫిట్మెంట్ అమలు వల్ల కలుగుతున్న భారానికి అదనంగా ఉన్నదేనని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. -
‘ఈనాడు’ ఏనాడూ చెప్పని నిజం.. రైతు భరోసాలో ఇదో చరిత్ర
నిజమే!! భారీ వర్షాలకు కోతకొచ్చిన వరి నేల వాలింది. తడిసిన ధాన్యం రంగు మారుతుందని, మిల్లులో ఆడిస్తే నూక ఎక్కువొస్తుందని ‘ఈనాడు’కు కూడా తెలుసు. ఆ ధాన్యానికి మామూలు ధాన్యం కన్నా తక్కువ ధర వస్తుందనేది కూడా నిజమే కదా? ఒకవేళ దానిక్కూడా మామూలు ధరే వస్తే... సాధారణ రకం ధర పెంచమని అడగరా? ఇవన్నీ రామోజీ రావుకు తెలియనివా? తెలిసి కూడా ‘వరికి కన్నీటి తడి’ అంటూ అక్కసు వెళ్లగక్కటమెందుకు? ఎందుకంటే రైతన్నల విషయంలో ఈ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక మార్పులను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తన చంద్రబాబు అధికారంలో ఉండగా కనీసం ఊహించటం కూడా చేయని పనులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిశ్శబ్దంగా చేసుకుపోతుంటే తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఈ ‘కన్నీటి తడి’. ‘ఈనాడు’ రాతల్లో నిజానిజాలేంటో... రైతుల విషయంలో ప్రభుత్వ అడుగులు ఎలా ఉన్నాయో వివరించే కథనమిది.. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఐదేళ్లు రాష్ట్రాన్నేలింది రామోజీ మిత్రుడు చంద్రబాబే. మరి ఆ ఐదేళ్లలో ఒక్కసారైనా తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొన్నారా? వరదలొచ్చి రైతులు గగ్గోలు పెట్టినా పట్టించుకున్నారా? విచిత్రమేంటంటే నాటి ప్రభుత్వమే కాదు. ‘ఈనాడు’ సైతం పట్టించుకుంటే ఒట్టు. బాబు హయాంలో ధాన్యం కొనుగోలుకు ఏటా పెట్టిన ఖర్చు రూ.8వేల కోట్లు. ఇపుడది రెట్టింపు కన్నా అధికం. రూ.17వేల కోట్ల పైమాటే. ఈ రెండేళ్లలో ధాన్యానికి ఏకంగా రూ.35 వేల కోట్లు ఖర్చుచేశారన్న నిజాన్ని ‘ఈనాడు’ ఏనాడూ చెప్పలేదే? ఎందుకని? అంతేకాదు!! ఇతర పంటలకు మరో రూ.8,200 కోట్లు వెచ్చించగా... దాన్లో పత్తి పంట కోసమే రూ.1,800 కోట్లు ఖర్చు చేసిందనేది కాదనలేని వాస్తవం. పంటల కొనుగోలుకు 6400 కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి కారణంగా రూ.600 కోట్ల నష్టం వచ్చినా... రైతుకు నష్టం రాకూడదని తపన పడ్డ ప్రభుత్వం ‘ఈనాడు’కు కనపడదెందుకు? గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలు, రూ.9000 కోట్ల విద్యుత్ బకాయిలు, రూ.384 కోట్ల విత్తన బకాయిల్ని ఈ ప్రభుత్వం భరించటం నిజం కాదా? మిల్లర్ల ప్రమేయం ఎక్కడైనా ఉందా? రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుగుతున్న కొనుగోళ్లలో మిల్లర్ల ప్రమేయం ఎక్కడుందసలు? గతంలో రాజ్యమంతా దళారులదే కదా? వారి చెప్పుచేతల్లో రైతు మోసపోవటమే కదా? నకిలీ విత్తనాలు, ఎరువుల నుంచి మొదలెడితే... అప్పులిచ్చి వడ్డీ కింద పంటను జమ చేసుకోవటమనే దౌర్భాగ్య పరిస్థితులను ఏనాడైనా ప్రశ్నించారా? ఇప్పుడు మోసాలకు తావు లేకుండా ఆర్బీకేల ద్వారానే పంటలను పూర్తిగా కొనుగోలు చేస్తున్నారు. దేశ చరిత్రలోనే ఏ రైతుకూ దక్కని భరోసా 10,778 ఆర్బీకేలతో ఇక్కడ దక్కుతోంది. ముఖ్యమైన డీలర్లంతా అనుసంధానమై ఉన్నారు కనక నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతులకు ఆర్బీకేలతోనే అందుతున్నాయి. గ్రామ స్థాయిలో... విత్తు నుంచి విక్రయం వరకూ రైతన్నను చేయి పట్టుకుని నడిపించే గొప్ప వ్యవస్థ అమల్లోకి వచ్చినా మరి శవాలపై పేలాలేరుకునే రీతిలో ఈ రాతలెందుకు? దీనికి జవాబొక్కటే. అధికారంలో ఉన్నది చంద్రబాబు కాదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజాభిమానం పుష్కలంగా ఉంది. కాబట్టి ప్రతిదీ భూతద్దంలో చూపించి విషం కక్కాలి. ఇదే రామోజీ అజెండా. అందులో భాగమే ఈ అబద్ధపురాతలు. 100 శాతం ఈ క్రాపింగ్.. ఇపుడు పంటలకు సంబంధించిన వివరాల్లో చిన్నచిన్న మోసాలక్కూడా ఎలాంటి తావూ లేదు. నూరు శాతం ఈ–క్రాపింగ్. అంటే ప్రతి ఎకరం పారదర్శకం. ఎక్కడ.. ఏ రైతు... ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశాడన్నది ఈ–క్రాపింగ్తో సుస్పష్టం. ప్రతి ఒక్క ఎకరా నమోదవుతున్నది కాబట్టి సున్నా వడ్డీ, పంటల బీమా, పంటల కొనుగోలు అన్నీ పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. అదే గతంలో బీమా చేయించాలంటే... పంట రుణం తీసుకున్న వారికి మాత్రమే బ్యాంకులు బీమా చేసేవి. అది కూడా 95 శాతానికే బీమా. ఇప్పుడు ఆ పరిస్థితే లేదు. పంట రుణాలతో సంబంధం లేకుండా అందరికీ నూరు శాతం ఉచితంగా బీమా లభ్యమవుతోంది. ఇక రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించటం నుంచి వ్యవసాయ విద్యతో పాటు తగిన సలహాలివ్వటం.. వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల కోసం కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయటం కూడా ఆర్బీకేలతో సాధ్యమవుతోంది. అంటే.. ఆర్బీకేల సారథ్యంలో వరి ధాన్యం మాత్రమే కాక... అన్ని పంటల కొనుగోలుకూ పక్కా వ్యవస్థ రూపుదిద్దుకుంది. బలంగా వేళ్లూనుకుని ఎదుగుతోంది. మిల్లర్ల జోక్యం లేదు. రైతులతో వారికి సంబంధమే లేదు. ధాన్యాన్ని ఆర్బీకేల్లో కొనుగోలు చేశాకే మిల్లర్లు రంగంలోకి వస్తున్నారు. ఇక వైఎస్సార్ జలకళ పేరిట రైతులకు ఉచితంగా బోర్లు కూడా తవ్విస్తున్నదీ ప్రభుత్వమే. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా ‘ఈనాడు’కు ఏనాడూ కనిపించవెందుకు? విద్యుత్ గురించి పట్టించుకున్నారా? విత్తనాలు, ఎరువులు, పంటల కొనుగోలు మాత్రమే కాదు. వీటన్నిటికీ మూలమైన విద్యుత్ సరఫరాపైనా ముఖ్యమంత్రి మొదట్లోనే దృష్టి సారించారు. చంద్రబాబు హయాంలో 9 గంటల పాటు పగటిపూట నాణ్యమైన విద్యుత్ గురించి ఆలోచించిన దాఖలాలే లేవు. ఎందుకంటే అప్పట్లో ఒకవేళ ఇవ్వాలనే ఆలోచన వచ్చినా... ఇచ్చే వ్యవస్థ లేదు. ఫీడర్లు మొత్తం దెబ్బతిని వ్యవస్థ కునారిల్లి ఉంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ప్రాధాన్యాల్లో భాగంగా రూ.1,750 కోట్ల వ్యయంతో ఫీడర్ల వ్యవస్థను చక్కదిద్దారు. దీంతో పగటిపూట రైతుకు నిరాటంకంగా 9 గంటల విద్యుత్ ఇవ్వటం సాధ్యమవుతోంది. అంతేకాదు. అప్పట్లో యూనిట్ రూ.4.50 చొప్పున కొనుగోలు చేసేలా చంద్రబాబు పీపీఏలు చేసుకుని ప్రయివేటు కంపెనీలకు ముడుపుల కోసం దోచిపెడితే... పారదర్శకంగా యూనిట్ రూ.2.49కే ఏకంగా కేంద్ర ప్రభుత్వం నుంచే కొనుగోలు చేస్తున్న చరిత నేటి ప్రభుత్వానిది. కాకపోతే దీన్లో కూడా ‘ఈనాడు’కు వ్యతిరేక కోణమే కనిపిస్తోందన్నది వేరే సంగతి. ఇదీ... ఈనాడు రాతల కథ ‘ఈనాడు’ రాతలెంత అబద్ధాలో చెప్పటానికిదో ఉదాహరణ. శనివారంనాటి ‘ఈనాడు’ కథనంలో పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలోని టి.నాగేశ్వరరావుతో మాట్లాడినట్లు రాశారు. నిజానికి ఆయన రైతే కాదు. ఆయన పుట్టా నాగప్రసాద్ దగ్గర పనిచేస్తున్నాడు. నాగప్రసాద్ చాన్నాళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఖరీఫ్లో 23 ఎకరాల్లో వరి సాగు చేశారు. 15 రోజుల క్రితం కోతలు కోయించారు. అదే సమయంలో వర్షాలు రావటంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఆర్బీకేకు సమాచారమిస్తే వ్యవసాయాధికారులు వచ్చి పంటను పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేసి పరిహారం కోసం రాసుకొని వెళ్లారు. ఆర్బీకే ద్వారా మంచి రేటుకు ధాన్యం కొంటామని భరోసా ఇచ్చారు. ధాన్యం ఆరబెట్టుకున్నా. ఆర్బీకే సిబ్బంది వచ్చి చూసి తడిసిన ధాన్యాన్ని విడతల వారీగా సేకరిస్తున్నారు. ఉచితంగా ఇచ్చిన గోతాముల్లో నింపి రావులపాలెం మిల్లుకు తరలిస్తున్నారు. ధాన్యం ఒబ్బిడి చేసి సంచుల్లో ఎక్కిస్తుండగా ‘ఈనాడు’ వాళ్లు వచ్చి అక్కడ పనికోసం వచ్చిన టేకి నాగేశ్వరరావు(కూలీ)ను ఆరా తీసారు. వర్షం వల్ల తడిసి రంగు మారింది. ఈసారి మంచి రేటు రావడం కష్టమే అన్నాడు. అతను నిజంగా రైతా..ఆ పొలం అతనిదా..కాదా అని కనీసం తెలుసుకోకుండా తమకనుకూలంగా రాసుకొని వెళ్లిపోయారు. ఆ బురద ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేశారు. అసలు ఈనాడు వాళ్లు తనతో మాట్లాడనే లేదని రైతు నాగప్రసాద్ ‘సాక్షి’తో వాపోయాడు. ఇదీ కథ. ఇలాంటి వ్యవస్థ ఎన్నడూ లేదు: కన్నబాబు ఈ–క్రాపింగ్ వల్ల రాష్ట్రంలోని ప్రతి ఎకరంలో రైతులు ఏ పంట వేశారో ప్రభుత్వానికి తెలుసు. దీనికి కేవైసీ కూడా అనుబంధమై ఉంది కనక డబ్బులు నేరుగా రైతు ఖాతాలోకే వెళతాయి. ఇతర రాష్ట్రాల నుంచి మోసపూరితంగా తెచ్చి ఇక్కడ విక్రయించే పద్ధతికి అడ్డుకట్ట వేశాం. రీసైక్లింగ్ను నివారించాం. నేరుగా రైతు మాత్రమే లబ్ధి పొందాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్దేశం. దానికి పక్కా వ్యవస్థ తీసుకొచ్చారు. ఈ ఏడాది దురదృష్టవశాత్తూ తుపాన్ల వల్ల రంగుమారిన, తడిసిన ధాన్యం కొందరు రైతుల వద్ద ఉంది. దీన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒకవంక కోరుతూనే... ఇక్కడ కూడా కొనుగోలు మొదలుపెట్టాం. కేంద్రం ప్రకటించిన 23 పంటలే కాక.. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అరటి, బత్తాయి వంటి మరో 7 పంటలకూ కనీస మద్దతు ధర కల్పించాం. పొగాకు కొనుగోళ్లలో కార్పొరేట్లు రైతులను దెబ్బతీస్తున్న పరిస్థితి చూసి గతేడాది ముఖ్యమంత్రి ఆదేశాలతో మేమే వేలంలో పాల్గొన్నాం. ఐటీసీ వంటి దిగ్గజాలతో పోటీపడి రూ.130 కోట్లు వెచ్చించి పొగాకు కొన్నాం. ఒక్కటి మాత్రం నిజం!!. రైతులను వారి మానానికి వారిని వదిలేయకూడదన్నదే ఈ ప్రభుత్వ సంకల్పం. అందుకే పెసలు, సజ్జలు కూడా కొంటున్నాం. మూడు వారాల్లో ధర చెల్లిస్తున్నాం. వీటన్నిటినీ వదిలి ఒకటి రెండు చోట్ల ఉన్న పరిస్థితిని ‘ఈనాడు’ భూతద్దంలో చూపిస్తోంది. అది వారి కడుపు మంటకు నిదర్శనమని చెప్పాలి. -
ఓటీఎస్తో రూ.10 వేల కోట్లు రుణాలు మాఫీ
సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్)పై దుష్ప్రచారాన్ని సీరియస్గా తీసుకోవాలని, అటువంటి ప్రచారం చేసే వారిపై కఠినంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ బుధవారం అధికారులను ఆదేశించారు. ఓటీఎస్ పథకం ద్వారా లక్షల మంది పేదలకు లబ్ధి కలుగుతుందని, చట్టపరంగా హక్కులు దఖలు పడతాయన్నారు. ఈ పథకంపై దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చదవండి: సిరివెన్నెల కుటుంబానికి అండగా నిలిచిన సీఎం జగన్ లబ్ధిదారుల్లో సందేహాలు ఉంటే ఒకటికి రెండుసార్లు అవగాహన కల్పించాలన్నారు. పథకం ద్వారా వచ్చే లబ్ధిని, రిజిస్టర్డ్ పత్రాల ద్వారా వారికి మాఫీ అవుతున్న అసలు, వడ్డీ వివరాలను చూపించాలన్నారు. సీఎం కార్యాలయ అధికారులతో జరిగిన సమావేశంలో సీఎం ఈ ఆదేశాలిచ్చారు. చదవండి: ఇది బలవంతపు పథకం కాదు: బొత్స సత్యనారాయణ -
కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలు.. టీడీపీ ఓవరాక్షన్
తాడేపల్లి రూరల్ : కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలు పురస్కరించుకుని టీడీపీ నాయకులు సోమవారం ఎక్కడాలేని అత్యుత్సాహం ప్రదర్శించారు. తమ అధినేతను ఇంట్లో నుంచి బయటకు రానీయడంలేదని నానా యాగీ చేశారు. కానీ, చివరికి చంద్రబాబే తన కుప్పం పర్యటనను రద్దుచేసుకుంటే పార్టీ శ్రేణులు ఓవరాక్షన్ చేసి హంగామా సృష్టించారు. అసలేమైందంటే.. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతుండగా అక్కడకు వస్తానని స్థానిక నాయకులకు సమాచారమిచ్చారు. ఆయన సోమవారం అక్కడకు వెళ్లాల్సి ఉండగా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం చూపిస్తూ ప్రభుత్వం తమ అధినేతను ఇంట్లో నుంచి కదలనీయకుండా అడ్డుకుంటోందని టీవీల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. కానీ, వాస్తవానికి చంద్రబాబు తనే కుప్పం పర్యటనను రద్దుచేసుకుని అక్కడి నాయకులతో టెలి కాన్ఫరెన్స్లో పరిస్థితులను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. ఉ.11గంటల అనంతరం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడి నుంచి ముఖ్య నాయకులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకున్నారు. కానీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అరాచకం చేస్తోందని, చంద్రబాబును కుప్పం వెళ్లకుండా అడ్డుకుంటోందని హోరెత్తించారు. -
ఆ పార్టీలకు ఓటేసినా ఉపయోగం లేదు: మంత్రి అనిల్ కుమార్
-
దుష్ప్రచారమే టీడీపీ అజెండా
సాక్షి, అమరావతి: ప్రజా విశ్వాసం పూర్తిగా కోల్పోయిన ప్రతిపక్ష టీడీపీ దుష్ప్రచారాన్నే ఏకైక అస్త్రంగా చేసుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పాలనను చూసి ఓర్వలేక కుతంత్రాలకు పాల్పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సహేతుకమైన అంశాలు లేకపోవడంతో ఫొటో మార్ఫింగులు, అవాస్తవ ప్రచారాలతో రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు చంద్రబాబు తంటాలు పడుతున్నారు. ఫొటో మార్ఫింగ్తో తిరుమలలో శిలువ ఏర్పాటు చేశారన్న దుష్ప్రచారం మొదలు.. తాజాగా గుజరాత్లోని హెరాయిన్ స్మగ్లింగ్ను రాష్ట్రానికి ఆపాదించేందుకు విఫలయత్నం చేయడం వరకు చంద్రబాబు ఇదే రీతిలో పన్నాగానికి పాల్పడుతున్నారు. మత విద్వేషాలు రేకెత్తించే కుతంత్రం ►2019లో అఖండ మెజార్టీతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలకు తెరతీశారు. తిరుమలలో ఉన్న బయోడైవర్సిటీ సెంటర్ ఫొటోను మార్ఫింగ్ చేసి చర్చిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఓ శిలువ బొమ్మను కూడా జోడించి తిరుమలలో చర్చి నిర్మించారని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా, టీడీపీ సానుభూతిపరులే ఆ విధంగా ఫొటో మార్ఫింగ్ చేసి దుష్ప్రచారానికి పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వారిని తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. ►తిరుమల బస్సుల్లో టికెట్ల వెనుక అన్యమత ప్రచారానికి సంబంధించిన అంశాలు ముద్రించారని టీడీపీ గగ్గోలు పెట్టింది. ఈ అంశంపై ఆర్టీసీ విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా నెల్లూరు రీజియన్లో బస్సు టికెట్ల వెనుక అన్యమత ప్రచార అంశాలను ముద్రించేందుకు అనుమతిచ్చింది. ఆ మేరకు అనుమతి ఇచ్చిన తేదీలతో సహా అసలు విషయం బట్టబయలైంది. దాంతో టీడీపీ ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయింది. ►టీటీడీ చైర్మన్గా నియమితులైన వైవీ సుబ్బారెడ్డి క్రిస్టియన్ అని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. కానీ వైవీ సుబ్బారెడ్డి కుటుంబం అత్యంత భక్తిప్రపత్తులు ఉన్న హిందూ కుటుంబం అన్నది ప్రకాశం జిల్లాతోపాటు రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ దుష్ప్రచారం చేసి ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నించడం టీడీపీ దుర్నీతికి నిదర్శనం. ►ప్రకాశం జిల్లా సింగరాయ కొండ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న హిందూ దేవతల విగ్రహాల పట్ల అపచారం జరిగిందని ఓ ఫొటోను మార్ఫింగ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీడీపీ యత్నించింది. అందుకు కొన్ని మీడియా చానళ్లు కూడా సహకరించాయి. కాగా పోలీసులు, దేవదాయ శాఖల విచారణలో వాస్తవం వెలుగులోకి వచ్చింది. దాంతో దుష్ప్రచారానికి పాల్పడ్డ వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు. ►కర్నూలు జిల్లాలో ఓ ఆలయంలో అపచారం జరిగిందని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. అందుకోసం ఓ పేద అర్చకుడికి డబ్బులు ఇచ్చి మరీ అపచారం చేయించారు. అనంతరం దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని గగ్గోలు పెట్టారు. పోలీసుల విచారణలో ఆ అర్చకుడు అసలు విషయాన్ని వెల్లడించడంతో టీడీపీ కుట్ర బెడిసి కొట్టింది. ►ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పంపిణీ చేసేందుకు ముద్రించిన ఆక్స్ఫర్డ్ నిఘంటువులపైనా టీడీపీ అన్యమత ప్రచారమంటూ దుష్ప్రచార విషం చిమ్మింది. ప్రపంచ వ్యాప్తంగా ఆక్స్ఫర్డ్ నిఘంటువు అదే రీతిలో ఉందని తేలడంతో ఒక్కసారిగా మౌనం దాల్చింది. వరదల్లో టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు ►2019లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నదికి వరదలు వచ్చాయి. ఆ సమయంలో టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా పేర్కొంటూ రంగంలోకి దింపింది. ►ఇళ్లు నీట మునిగాయి.. పంటలు నష్టపోయాయి.. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదంటూ టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నీళ్లలో మోకాళ్లపై కూర్చొని.. తాము నిండా మునిగిపోయినట్టు డ్రామాకు తెరతీశారు. కాగా వారు సినిమా జూనియర్ ఆర్టిస్టులని బయటపడటంతో టీడీపీ డ్రామా బట్టబయలైంది. వాస్తవం నిగ్గు తేలినా డ్రగ్స్ పేరిట డ్రామా ►అఫ్గానిస్తాన్ నుంచి గుజరాత్కు అక్రమంగా దిగుమతి అయిన హెరాయిన్ అంశంలోనూ ప్రతిపక్ష నేత చంద్రబాబు అసత్య ప్రచారంతో రోజుకో రీతిలో చెలరేగిపోతున్నారు. హెరాయిన్ను గుజరాత్ నుంచి ఢిల్లీకి తరలించాలన్నది స్మగ్లర్ల లక్ష్యమని కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) దర్యాప్తులో మొదట్లోనే వెల్లడైంది. ►ఆ మేరకు అఫ్గానిస్తాన్, గుజరాత్, చెన్నై, ఢిల్లీ లింక్లు ఆధార సహితంగా వెలుగు చూశాయి. డీఆర్ఐ అధికారులను బురిడీ కొట్టించేందుకే విజయవాడ అడ్రస్తో జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా నిగ్గు తేలింది. ►కానీ చంద్రబాబు, టీడీపీ నేతలు రాష్ట్ర ప్రతిష్టను మసకబార్చేలా కొన్ని వారాలుగా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. విజయవాడకు భారీ స్థాయిలో హెరాయిన్ వచ్చిందని, కాకినాడ పోర్టులో దిగుమతి అయ్యిందని.. తాడేపల్లిలో హెరాయిన్ నిల్వలు ఉన్నాయని.. చంద్రబాబు నిస్సిగ్గుగా అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారు. ►చివరికి డ్రగ్స్ గ్యాంగ్ లీడర్ ఢిల్లీకి చెందిన కుల్దీప్ సింగ్ అని డీఆర్ఐ నిర్ధారించింది. హెరాయిన్ దందాతో ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేదని తేల్చి చెప్పింది. అయినా సరే చంద్రబాబు, టీడీపీ నేతలు మాత్రం తమకు అలవాటైన రీతిలో దుష్ప్రచారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించే కుట్రలు కొనసాగిస్తుండటం పట్ల రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
టీఆర్ఎస్ నేతలే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు:ఈటల
సాక్షి, కరీంనగర్: టీఆర్ఎస్ పార్టీ నేతలే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల పక్షాన జీవితాంతం అండగా ఉంటాని తెలిపారు. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తు నకిలీ లేఖలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ వాళ్లే ఏమైనా కుట్ర పన్ని తనపై దాడి చేస్తున్నారా? అనే అనుమానం వస్తోందని అన్నారు. టీఆర్ఎస్ కుట్రలకు హుజురాబాద్ ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. -
పాఠ్యాంశాలపై తప్పుడు ప్రచారం: పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ప్రభుత్వాన్ని అప్రతిష్ణపాలు చేసేలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై విద్యా శాఖ తరపున స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యా శాఖ ఫిర్యాదుపై ఇబ్రహింపట్నం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాల పరిచయం కోసం అన్ని మతాల పండగలకి సమాన ప్రాధాన్యనిస్తూ తెలుగు వాచకంలో రెండవ తరగతి నుంచి ఏడో తరగతి వరకు పాఠ్యపుస్తకాల రూపకల్పన చేశామన్నారు. చదవండి: దుర్గమ్మ పాఠ్యాంశాలను తొలగించలేదు పాఠ్యపుస్తకాలలో హిందూ పండుగలు - 7, ముస్లిమ్ పండుగలు - 2 , క్రిస్టియన్ పండుగలు - 2, సవరల పండుగ- ఒకటి చొప్పున పాఠ్యాంశాలు ఉన్నాయని తెలిపారు. మొత్తం 12 పండగలు గురించి పాఠ్యాంశాల్లో పొందుపరిచి అన్ని మతాలకి సమ ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. ఇందులో నుంచి ఒక్క పండగ మాత్రమే ఎంపిక చేసి హిందూ మతానికి అన్యాయం జరుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. అందుకోసమే ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. చదవండి: శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయకపోతే కృష్ణా జలాలు వృథా -
సంక్షేమ యజ్ఞాన్ని అడ్డుకునే రాక్షసత్వం
అసహనంతో ఉన్నవాళ్లు విచక్షణ కోల్పోతారు. ఒకప్పుడు తాము చేసిన వాదనలనే పూర్తిగా ఖండించుకుంటున్నామని మరిచిపోతారు. తెలుగుదేశం పార్టీకి గల ఈ అసహనానికి కారణం ఏమిటి? అధికారం కోల్పోయామన్న బాధ. అధికార వైసీపీకి ప్రజల్లో మంచిపేరు వస్తున్నదన్న దుగ్ధ. అందుకే ముఖ్యమంత్రి జగన్ను ఎలా ఉక్కిరిబిక్కిరి చేయాలి, ఆయన్ని ఎంత త్వరగా గద్దె దించాలి, దానికోసం ఏ వ్యవస్థల్ని మేనేజ్ చేయాలి, అవసరమైతే ఏయే అంశాల్ని తప్పుగా ప్రచారంలో పెట్టాలి... ఎంతసేపూ టీడీపీ నేతలకు ఇదే ఆలోచన. కానీ ఈ చర్యల ద్వారా సంక్షేమ యజ్ఞానికి అడ్డుపడుతున్న రాక్షసుల్లా మిగిలిపోతున్నామని మరిచిపోతున్నారు. ప్రజల మనసులను నిర్మాణాత్మకంగా కూడా గెలవొచ్చన్న సంగతిని విస్మరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుతోందని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పుల విష యంలో కానీ, ఇతర అంశాలపై కానీ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారాలు రాష్ట్ర విశ్వసనీయత దెబ్బతీయడం కోసమేనని ఆయన అన్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గత రెండేళ్లుగా ప్రతి అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లడానికి గట్టిగా వినియో గించుకుంటోంది. ఈ విషయంలో ఆయా వ్యవస్థలను కూడా టీడీపీ విజయవంతంగా వాడుకోగలుగుతోందన్నది వాస్తవం. అందులో భాగంగానే తమకు సంబంధించిన వారితో కోర్టు కేసులు వేయిం చడం, ఆ సందర్భంలో కోర్టువారు చేసే వ్యాఖ్యలను తమ మీడియా ద్వారా ప్రచారం చేయించడం, ఇంకో వైపు కేంద్ర ప్రభుత్వానికి ఆయా అంశాలపై ఫిర్యాదులు పంపించడం మొదలైన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అంతేకాకుండా వైసీపీ అసమ్మతి ఎంపీ ఒకరిని అడ్డు పెట్టుకుని నిత్యం ప్రభుత్వంపై ఉన్నవీ, లేనివీ ఆరోపణలు చేస్తూ కథ నడుపుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వానికి ఊపిరి ఆడకుండా చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది. ఊపిరాడకుండా చేసే పన్నాగం అయితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ విషయాన్ని అంచనా వేయడంలో కానీ, ఊహించడంలో కానీ అంతగా సఫలం అయిందని చెప్పజాలం. తన పని తాను చేసుకుంటూ, ప్రజలలో ఆదరణ ఉంది కదా అన్న భావనతో టీడీపీ అమలు చేస్తున్న వ్యూహాలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అవి రానురాను ముదిరిపోయా యంటే ఆశ్చర్యం లేదు. ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం ఎంతో కష్టపడి పలు పథకాలను అమలు చేస్తోంది. వాటిని బదనాం చేయడానికి టీడీపీ రకరకాల ఎత్తుగడలను వేసింది. అయితే అవి పెద్దగా ఫలించలేదు. దాంతో ఆ పార్టీ కొత్త రూటు వెతుక్కుంది. ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో తనకు ఉన్న అనుభవాన్ని ప్రయోగించడం ఆరం భించింది. తద్వారా ప్రభుత్వాన్ని ప్రజలలో అప్రతిష్టపాలు చేయ డంతో పాటు, ఉక్కిరిబిక్కిరి చేయాలని పన్నాగం వేసింది. సచివాలయంలో కానీ, ఇతరత్రా కానీ తనకు మద్దతు ఇచ్చే వ్యక్తులను వాడుకుంటూ కొన్ని విశేష సమాచారాలను సేకరించి, వాటిని తనకు అనుకూలంగా మలచుకుంటూ వస్తోంది. ఏ ప్రభుత్వ ఉత్తర్వు అయినా రావడమే తరువాయి... ఆ వెంటనే ఆ జీవోపై కోర్టుకు వెళ్లడం పెద్ద ప్రాక్టీసుగా మార్చారు. తద్వారా ప్రభుత్వం ఏ విషయం లోనూ ముందుకు కదలకుండా చేసే వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. విద్యా దీవెన పథకంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల లోకి కాకుండా కాలేజీల ప్రిన్సిపాల్స్ ఖాతాలో వేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ వెంటనే దానికి టీడీపీ మీడియా పెట్టిన హెడ్డింగ్ ఏమిటి అంటే– ఓటు బ్యాంక్ పాలిటిక్స్ రివర్స్ అని! అంటే దాని అర్థం తెలుసుకోవడం కష్టం కాదు కదా! అధికారంలో ఉంటే ఒక వాదన మరోవైపు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అప్పులు చేస్తున్నట్లు విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలోని ప్రముఖులకు ఏదో రూపంలో ఫిర్యాదులు పంపుతూ వైసీపీ ప్రభుత్వానికి చికాకు తెచ్చే యత్నం చేస్తున్నారు. దీంతో బుగ్గన చెప్పినట్లు– సహజంగానే ఏపీలో ఏదో జరగకూడనివి జరుగుతున్నాయన్న అనుమానాన్ని అటు కేంద్రం లోనూ, ఇటు ప్రజలలోనూ కలిగించడానికి టీడీపీ నేతలు తంటాలు పడుతున్నారు. ఈ సందర్భంలో కొన్ని విషయాలు ప్రస్తావించాలి. 1999 ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ కనెక్షన్లను ఇచ్చే స్కీమ్ను తెచ్చింది. ఆ సందర్భంలో చంద్రబాబు ఎన్డీయేలో తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి, కొన్ని ఎక్కువగా గ్యాస్ కనె క్షన్లను తెచ్చారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత రోశయ్య, ఆ పథకం అమలులో జరుగుతున్న లోపాలు, అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అంతే... చంద్రబాబు, ఆయన అనుయా యులు కాంగ్రెస్ పార్టీపై విరుచుకు పడ్డారు. రాష్ట్రానికి వచ్చే ప్రయో జనాన్ని ప్రజలకు దక్కకుండా చేస్తోందని కాంగ్రెస్ మీద విమర్శలు సాగించారు. అలాగే ఎవరైనా కేంద్రానికి ఇంకే విషయంలో ఫిర్యాదు చేసినా వెంటనే అది రాష్ట్రానికి చేస్తున్న నష్టంగా ప్రచారం చేసేవారు. అప్పట్లో పనికి ఆహార పథకం కింద ఆంధ్రప్రదేశ్కు వచ్చిన బియ్యంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఆరో పిస్తే కూడా అదే తరహా వ్యాఖ్యలను తెలుగుదేశం చేసింది. వ్యవస్థల సాయంతో ముందుకెళ్తాం 2014లో చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చాక, ఏ స్కీమ్ పైన అయినా ఎవరైనా కోర్టుకు వెళితే అదంతా వైసీపీ పనే అని చంద్ర బాబు ఆరోపించేవారు. తాను యజ్ఞం చేస్తుంటే రాక్షసుల్లా అడ్డు తగులుతున్నారని ధ్వజమెత్తేవారు. ఇప్పుడవే విమర్శలను బాబు టీమ్ ఎదుర్కుంటోంది. వైసీపీ మంత్రులు పలువురు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ–రాక్షసుల్లా టీడీపీ వారు ప్రతి దానికీ అడ్డు పడుతున్నారని అంటున్నారు. ఆనాటి చంద్రబాబు ప్రభుత్వానికి ఈ స్థాయిలో ఇబ్బం దులు రాలేదన్నది వాస్తవం. ఆయా వ్యవస్థలు ఆయనకు బాగానే సహకరించాయి. దానికి రకరకాల కారణాలు ఉండవచ్చు. అయినా బాబు మాత్రం వైసీపీ మీద విరుచుకుపడుతుండేవారు. ఇప్పుడు చంద్రబాబు అండ్ టీమ్ ప్రజలలోకి వెళ్లడంకన్నా, ఆయా వ్యవస్థ లపైనే ఆధారపడి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. తమ రాజకీయ లబ్ధికోసం రాష్ట్రం పాడైపోయినా ఫర్వాలేదనే తరహాలో టీడీపీ ఆలోచిస్తోందని మంత్రి బుగ్గన అన్నారు. టీడీపీ తన దుర్మా ర్గానికి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కరోనా కష్టకాలంలో పేదలను కాపాడటం కోసం అప్పులు తీసుకొచ్చామని, తెలుగుదేశం హయాంలో కరోనా లేనప్పటికీ అప్పులు చేశారని మంత్రి బుగ్గన అన్నారు. కరోనా కారణంగా పెరగాల్సిన ఆదాయం పడిపోయిందని, అందుకే ఈ పరిస్థితుల్లో అప్పులు చేయక తప్పడం లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వసనీయతను దెబ్బతీసేలా టీడీపీ ప్రవర్తిస్తోం దని, ఆ పార్టీ ప్రవర్తన కారణంగా మొత్తం రాష్ట్రానికే నష్టం కలుగు తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బుగ్గన చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునే విధంగా మరికొన్ని ఆధారాలను బహి ర్గతం చేసి ఉండాల్సింది. నిజంగా టీడీపీ ఏయే రకాలుగా ఏపీ ప్రయో జనాలకు విఘాతం కలిగిస్తోందో సోదాహరణంగా వివరిస్తే ప్రజలకు అర్థం అవుతుంది. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులను ఏ రకంగా వినియోగించింది స్పష్టంగానే చెబుతున్నారు. అదే తరుణంలో గత టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా అప్పులు చేసింది? వాటిని ఏ రకంగా వాడింది? దానివల్ల నష్టం ఏమి జరిగింది అన్నదానిపై బుగ్గన వివ రణాత్మక పత్రం విడుదల చేసి ఉండాల్సింది! అర్థమయ్యేలా ప్రజలకు చెప్పాలి తన హయాంలో జరిగినవాటిని కనబడకుండా చేస్తూ, టీడీపీ తనకు ఉన్న మీడియా అండద్వారా ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని వాయువేగంతో చేయడానికి యత్నిస్తోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో టీడీపీ... ప్రజాభిమానం కన్నా, ఆయా వ్యవస్థలలో తనకు ఉన్న మేనేజ్మెంట్ నైపుణ్యాన్ని ఎక్కువగా నమ్ముకుంటోంది. అలాగే కొన్ని మీడియా సంస్థలపై ఆధారపడుతోంది. దీనిని ప్రజలు భవి ష్యత్తులో ఎలా అవగాహన చేసుకుంటారన్నది వేరే విషయం. తెలుగు దేశం పార్టీ నిజంగానే ఆంధ్రప్రదేశ్ విశ్వసనీయతను దెబ్బతీస్తుంటే, అది ఎలా జరుగుతోందో పూర్తి స్థాయిలో బయటపెట్టే బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుంది. లేకుంటే ప్రభుత్వాన్ని పరోక్షంగా తెలుగు దేశం పార్టీనే శాసిస్తోందని, ఆయా వ్యవస్థలు పెత్తనం చేస్తున్నాయన్న అభిప్రాయం ప్రబలే అవకాశం ఉంది. కనుక వైసీపీ నేతలు ఈ విష యంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి సుమా! -కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
టీడీపీ అసత్య ప్రచారాలు నమ్మొద్దు : మంత్రి అనిల్
-
కిమ్ బరువు తగ్గడం వెనక కారణమిదేనట..!
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్కు సంబంధించిన వీడియో ఒకటి నిన్నంత సోషల్ మీడియాలో వైరలయిన సంగతి తెలిసిందే. వీడియోలో కిమ్ గతంతో పోలిస్తే చిక్కినట్లు కనిపించాడు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా అనారోగ్య సమస్య వల్లే కిమ్ ఇలా అయ్యాడంటే.. కాదు.. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నాడు.. అందుకే ఇలా చిక్కిపోయినట్లు కనిపించాడని మరో వర్గం తెలిపింది. ఏది ఏమైనా కిమ్ బరువు తగ్గడంపై పెద్ద చర్చే నడిచింది. తాజాగా మరో ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. కరోనా కారణంగా గతేడాది నుంచి ఉత్తర కొరియాలో లాక్డౌన్ అమల్లో ఉండటంతో తీవ్ర ఆహార కొరత ఎదుర్కుంటుందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలో నెలకొన్న ఆహార కొరత వల్ల కిమ్ ఇలా చిక్కిపోయాడని ఉత్తర కొరియా వాసులు భావిస్తున్నారట. నార్త్ కొరియా అధికారక మీడియా ప్రకారం పేరు తెలియని ప్యాంగ్యాంగ్ వాసి ఒకరు కిమ్ బరువు తగ్గడంపై ఆ దేశ ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారని తెలిపాడు. ‘‘చిక్కిపోయినట్లు ఉన్న గౌరవనీయ ప్రధాన కార్యదర్శి (కిమ్ జాంగ్ ఉన్)ను చూసి మా దేశ ప్రజల గుండె బద్దలయ్యింది’’ అని తెలిపాడు. ఈ సందర్భంగా ఉత్తర కొరియా కదలికలను గమనించే అమెరికాకు చెందిన 38 నార్త్ కొరియా డైరెక్టర్ జెన్ని టౌన్ మాట్లాడుతూ.. ‘‘కిమ్ బరువు తగ్గడం వెనక ప్రధాన కారణం తెలియదు. అనారోగ్య సమస్యలు లేదా ఫిట్గా మారడం కోసం ఇలా బరువు తగ్గి ఉండవచ్చు. అలా కాకుండా ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆహార కొరత సమస్యపై ప్రజల్లో సానుభూతి పొందడం కోసం కిమ్ ఇలా ప్రచారం చేస్తున్నారేమో అనిపిస్తుంది’’ అన్నారు. మొత్తానికి కిమ్ బరువు తగ్గడంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తుందన్నమాట. చదవండి: వీడియో వైరల్: భారీగా బరువు తగ్గిన కిమ్ జాంగ్ -
జనంలో తక్కువ.. సోషల్ మీడియాలో ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ పరిస్థితి ‘సమాజంలో తక్కువ.. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ’అనే రీతిలో ఉందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ఎద్దేవా చేశారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపుతూ బీజేపీ గోబెల్స్కే పాఠాలు నేర్పేస్థాయికి చేరిందని ఘాటైన విమర్శలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ‘బీజేపీ నాయకులు, కార్యకర్తలు వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థుల్లా ప్రవర్తిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధిస్తుంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’అని వ్యాఖ్యానించారు. ఓపిక నశిస్తే ఎవరినీ వదలిపెట్టం.. బీజేపీ నేతలు సీఎం కేసీఆర్పై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఓపిక నశిస్తే తామూ కేంద్ర మంత్రులు, ప్రధాని సహా ఎవరినీ వదిలిపెట్టకుండా కడిగిపారేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ‘కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను ఘోరంగా దెబ్బతీసింది. కరోనాకు ముందు ఎనిమిది త్రైమాసికాల పాటు జీడీపీ క్షీణిస్తూ వచ్చింది. లాక్డౌన్ సమయానికి జీరో స్థాయికి చేరింది. హైదరాబాద్ వరదల గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు, బెంగళూరు వరదల గురించి ఎందుకు మాట్లాడటం లేదు’అని కేటీఆర్ అన్నారు. ‘దుబ్బాకకు ఏం చేశామో శ్వేతపత్రం విడుదల చేయాలని అడగటం సరికాదు. నలుగురు బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి అదనపు నిధులు తెచ్చారా? కేంద్రం నిధుల వాటాపై మంత్రి హరీశ్ విసిరిన సవాలుకు బీజేపీ నేతలు పారిపోయారు. హిందూ, ముస్లిం గొడవ తప్ప వారికి మరో ఎజెండా లేదు’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. హరీశ్కు క్రెడిట్ ఇస్తే తప్పేంటి? ‘హరీశ్, నేను ఎవరైనా.. పార్టీ కోసమే పనిచేస్తాం. హార్సెస్ ఫర్ ఫోర్సెస్ అనే సామెత ప్రకారం ఏ గుర్రాన్ని ఏ రేసులో పరుగెత్తించాలో మా అధ్యక్షుడు కేసీఆర్కు తెలుసు. ఎవరు సైన్యాన్ని నడుపుతారో వారికే పార్టీ బాధ్యత అప్పగిస్తుంది. హరీశ్ జిల్లా మంత్రి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో కేడర్ పనిచేస్తుంది. సీఎం కేసీఆర్ అడుగు పెట్టకుండానే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నియోజకవర్గం హుజూర్నగర్లో 47 వేల ఓట్ల మెజారిటీ సాధించాం. దుబ్బాక ప్రచారానికి సీఎం వెళ్లాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా. అవసరం ఉంటే ప్రచారానికి వెళ్లడంపై సీఎం స్వయంగా నిర్ణయం తీసుకుంటారు. మా పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో బహుళ నాయకత్వం ఉంది. రాష్ట్ర స్థాయిలో సీనియర్లు ఉన్నారు. ఆధునిక భావాలు కలిగిన వారు వస్తే పార్టీలోకి తీసుకుంటాం. అలాంటి వారు అన్ని పార్టీల నుంచి మాతో టచ్లో ఉన్నారు. దుబ్బాక ఎన్నిక తర్వాత కాంగ్రెస్ నేతలు వేరే పార్టీల్లో చేరతారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరికలు ఉంటాయి. రాజకీయ విదూషకుడు రేవంత్ను ప్రజలు సీరియస్గా తీసుకోవడం లేదు. రేపో మాపో ఆయన బీజేపీలో చేరతాడనే వార్తలు వింటున్నాం. ఆయన రాజకీయ వ్యాఖ్యాతగా మారారు’అని కేటీఆర్ విమర్శించారు. తలసరి ఆదాయం రెట్టింపు.. ‘రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ప్రకారం రూ.27,718 కోట్ల రుణ మాఫీ చేశాం. రైతు బంధు కింద రూ.28 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేయడంతో పాటు రైతు బీమా, ఇన్పుట్ సబ్సిడీకి అదనంగా నిధులు ఇచ్చాం. తలసరి ఆదాయం రాష్ట్రంలో ఆరేండ్లలో రెట్టింపు కావడంతో పాటు, జీఎస్డీపీ మూడు వందల రెట్లు పెరిగింది. రైతుబంధుతో చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం దక్కిందని ఆర్బీఐ నివేదికలో వెల్లడించింది. షీ టీమ్స్ పనితీరు బాగా ఉంది. గురువారం మరో భారీ పారిశ్రామిక పెట్టుబడిపై ప్రకటన చేస్తాం’అని కేటీఆర్ వెల్లడించారు. ఇటీవల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టంపై కేబినెట్లో చర్చించి ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటారని మంత్రి చెప్పారు. -
‘టిక్టాక్’కు ప్రమాదకరమైన ‘వైరస్’
న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యధికంగా ప్రాచుర్యం పొందిన మూడు వీడియో యాప్స్లో ‘టిక్టాక్’ ఒకటి. దీన్ని వినియోగిస్తున్న వినియోగదారుల్లో 30 శాతం మంది 18 ఏళ్ల లోపు వారే. వారికింకా సొంత వ్యక్తిత్వం అబ్బనితరం. అంటే పలు ప్రభావాలకు లోనయ్యే అవకాశం ఉన్న ప్రాయం వారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలనే అత్యంత ప్రమాదరకరమైన వైరస్ టిక్టాక్కు సోకింది. అదే ‘ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా)’ ఐసిస్ టెర్రరిస్టులు తమ బంధీలను పలు రకాలుగా హింసిస్తున్న, గొంతులు కోసి చంపేస్తున్న వీడియో క్లిప్పులను ఇందులో పోస్ట్ చేస్తున్నారు. గత మూడు వారాల నుంచే ఈ వైరస్ ప్రారంభమైంది. వీటిని చూసి ఉలిక్కిపడిన ‘టిక్టాక్’ కంపెనీ యాజమాన్యం ఎప్పటికప్పుడు వాటిని తొలగించేస్తోంది. గత వారం ఐసిస్ టెర్రరిస్టుల ప్రచార వీడియోలను యాప్ నుంచి యాజమాన్యం తొలగించే లోగానే అవి డజన్ ఖాతాలకు షేర్ అయ్యాయి. ఐసిస్ వీడియో క్లిప్పింగ్స్లో ఎక్కువగా బందీల చేతులు వెనక్కి విరిచి కట్టేసి మొకాళ్లపై కూర్చోబెట్టి వారి మెడ రక్తనాళాలను చాకుతో తెగ నరకడం, అతి దగ్గరి నుంచి బందీల తలలకు తుపాకులు ఎక్కుపెట్టి కాల్చివేసే దృశ్యాలే ఎక్కువగా ఉన్నాయి. 175 నుంచి వెయ్యి మంది వరకు ఫాలోవర్లు ఉన్న ఓ ముగ్గురు యూజర్ల నుంచే ఇప్పటి వరకు ఈ వీడియోలు పోస్ట్ అయిన విషయాన్ని యాప్ యాజమాన్యం గుర్తించింది. వారిలో ఒక యూజర్ మహిళ కావడం గమనార్హం. వారి పోస్టింగ్లకు 25 నుంచి 125 వరకు లైక్స్ కూడా రావడం ఆందోళనకరమైన విషయం. మూడు వారాల క్రితం ఈ వీడియో క్లిప్పింగ్ల పోస్టింగ్లు మొదలు కాగా, తాజాగా ఒకటి రెండు రోజుల క్రితం పోస్ట్ అయింది. వాటిల్లో టెర్రరిస్టులు తుపాకులు గాల్లోకి ఎత్తి పాటలు పాడుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. ఐసిస్ టెర్రరిస్టులు తమ ప్రచారం కోసం సోషల్ మీడియాలోని ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, అల్ఫాబెట్లను ఉపయోగించుకోగా, పాటలు, డ్యాన్సుల షేరింగ్లతో ఎక్కువ పాపులర్ అయిన ‘టిక్టాక్’లోకి ప్రవేశించారు. టెర్రరిస్టు సంస్థలను నిషేధించినట్లు టిక్టాక్ యాజమాన్యం తన కంపెనీ మార్గదర్శకాల్లోనే పేర్కొంది. టెర్రరిస్టుల పోస్టింగ్లను ఎవరు షేర్ చేయరాదని, ప్రోత్సహించరాదని యాజమాన్యం తాజాగా పిలుపునిచ్చింది. బీజింగ్లోని ‘బైటెండెన్స్ లిమిటెడ్’ కంపెనీ టిక్టాక్ను నిర్వహిస్తోంది. -
అన్యమత ప్రచారం అంటూ టీడీపీ కుట్ర ముగ్గురు అరెస్ట్
-
ఏల్లో మీడియా దుష్ప్రచారం
-
కాదేదీ ప్రచారానికి అనర్హం!
శ్రీకాకుళం న్యూకాలనీ : శ్రీకాకుళంలో జరగనున్న స్వాతంత్య్ర వేడుకలను కూడా అధికార పార్టీ నా యకులు తెలివిగా తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో మం త్రుల కనుసన్నల్లోనే అధికారులు పనిచేస్తుండడం అందుకు ఉదాహరణ. పంద్రాగస్ట్ వేడుకల్లో చం ద్రబాబు సర్కారు ప్రభుత్వ సంక్షేమ పథకాల తీ రును వివరిస్తు పార్టీ సభను తలపిస్తూ బెలూ న్లను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండటం ఇందుకు మరో నిదర్శనంగా కనిపిస్తోంది. శ్రీకాకుళం అభివృద్ధి చెందుతోందని ఇక్కడ పంద్రాగస్ట్ వేడుకలు ఏర్పాటుచేశామని, అందుకు సీఎం అంగీకరించారని మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్నా వాస్తవ పరిస్థితి చూస్తే మాత్రం అం దుకు భిన్నంగా తయారైంది. అభివృద్ధి పేరిట పేద, బడుగు, చిరువ్యాపారుల కుటుంబాలను రోడ్డున పడేసిన సర్కారు.. తాజాగా తమ పథకా లను ప్రదర్శించి ప్రజలకు ఆకర్షితులను చేసేం దు కు ఈ వేడుకలను ఉపయోగించుకోవడంపై ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నా యి. ‘వాడవాడలా చంద్రన్న బాట’ పేరిట ఏర్పాటుచేసిన బెలూన్ తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అది చూసిన జనాలు విస్తుపోతున్నారు. వాటిని తక్షణమే తొలగించాలని పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం రాకతో నగరంలో పోలీసుల ఆంక్షలు సైతం అదే రీతిలో పెచ్చుమీరుతున్నాయి. వేడుకలకు సమీపంలో ఉ న్న శాంతినగర్కాలనీ, నెహ్రూనగర్కాలనీ, ఆర్కే నగర్కాలనీ వాసులు.. పోలీసు ఆంక్షలతో కనీసం పాలప్యాకెట్లకు కూడా నోచుకోవడం లేదని, తమ పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేడుకల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, కానిస్టేబుళ్లు, ఎన్సీసీ క్యాడెట్స్, స్కౌట్స్, గైడ్స్, విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు. వర్షాలతో వారు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వసతులు, భోజనాలు పూర్తిస్థాయిలో లేక అల్లాడిపోతున్నారు. అధికారులు ఏసీ గదుల్లో బాగానే ఉంటున్నా.. ఉద్యోగులు, కానిస్టేబుళ్లు, విద్యార్థులు ఎవరికీ చెప్పుకోలేక మదన పడుతున్నారు. అన్నీ తొలగింపులే.. ఆగస్టు 15 సందర్భంగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో రోజువారి చిరువ్యాపాలతో తోపుడు బళ్లు, బడ్డీలను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. ఇప్పటికే వారం రోజులుగా పాలకొండ రోడ్, ఆర్ట్స్ కళాశాల రోడ్, రెవెన్యూ గెస్ట్ హౌస్ రోడ్, డై అండ్ నైట్ నాలుగువైపుల గల మార్గాల్లో ఉన్న అనాథలను, చిరు వ్యాపారులను వెళ్లగొట్టారు. ఇప్పటికే సుమారుగా 400 కుటుంబాలు సీఎం పర్యటన పుణ్యమా అని రోడ్డున పడ్డాయి. తాజాగా సోమవారం రాత్రి మరింత హంగామా సృష్టించారు. కాంప్లెక్స్ నుంచి బలగ వైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిరువ్యాపారులపై ఉక్కుపాదం మోపారు. బడ్డీలను, తోపుడు బళ్లను క్రెయిన్ల సాయంతో తొలగిస్తున్నారు. దీంతో మరో 60 కుటుంబాలు జీవాన ఆధారం కోల్పోయి రోడ్డున పడుతున్నాయి. సంక్షేమ పథకాల బెలూన్లలో ఎయిర్గ్యాస్తో నింపుతున్న సిబ్బంది -
కేంద్రంపై దుష్ప్రచారం తగదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేత జితేందర్రెడ్డిలు కావాలనే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. వీరు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రాష్ట్రానికి రూ.21,631 కోట్లు కేటాయించిందని, ఇందులో డిసెంబర్ నాటికి రూ.19,601 కోట్లు విడుదల చేసిందని స్పష్టం చేసింది. వీటికి అదనంగా కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా మరో రూ.9వేల కోట్లు విడుదల చేసిందని తెలిపింది. బుధవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్రెడ్డి పార్టీ మీడియాసెల్ కన్వీనర్ సుధాకరశర్మతో కలసి విలేకరులతో మాట్లాడుతూ... గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం రూ.3,56,375 కోట్లు కాగా అందులో కేంద్రం నుంచి పొందిన నిధులే రూ 1,58,000 కోట్లని పేర్కొన్నారు. -
ఎల్లో మీడియాలో దుష్ప్రచారం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రత్యేక హోదా ఉద్యమానికి అసలు సిసలు చిరునామాగా మారిన వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం విమానాశ్రయంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోను ఉపయోగించుకుని ఎల్లో మీడియా దుష్ప్రచారానికి తెరతీసింది. అందులో జగన్ చేసినట్లుగా ఉన్న కొన్ని వ్యాఖ్యలను వక్రీకరించి ప్రసారం చేయడంలో ఒక చానెల్ అత్యుత్సాహం ప్రదర్శించింది. ‘నేను ప్రతిపక్ష నాయకుడిని నన్ను అడ్డగిస్తున్నారు. అదే ముఖ్యమంత్రిని ఇలా పట్టుకుంటావా’ అన్న వ్యాఖ్యను వక్రీకరించి నేను ముఖ్యమంత్రిని నన్నే పట్టుకుంటావా అని వ్యాఖ్యానించినట్లుగా సొంతపైత్యం జోడించారు. ప్రతిపక్ష నాయకుడు అనని మాటలను ఆపాదించి ప్రసారం చేసి పండుగ చేసుకుంటున్న సదరు చానెల్పై కూడా సోషల్ మీడియాలో హోదా ఉద్యమకారులు దుమ్మెత్తిపోశారు. ఈ ఉత్సాహం హోదా పోరాటానికి మద్దతివ్వడంలో చూపించాలన్న వ్యాఖ్యానాలు కనిపించాయి. బాధ్యత గలిగిన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఒక శాంతియుత పోరాటానికి వెళ్తుండగా అడ్డగించడమేకాక అనుచితంగా వ్యవహరించిన పోలీసులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడం నిజమే. ప్రతిపక్ష నేత, ఎంపీలకు ప్రొటోకాల్ పాటించకపోతే పోయారు కనీసం ఒక సాధారణ ప్రయాణీకుడికి ఇచ్చిన మర్యాదైనా ఇవ్వరా అని ఆశ్చర్యపోయిన మాటా నిజమే. ఆ విషయాలను వదిలేసి రామాయణంలో పిడకల వేటలా కోడిగుడ్డుపై ఈకలు పీకడం సదరు చానల్ యజమానికి పరిపాటేనని నెటిజన్లు చర్చించుకోవడం కనిపించింది. -
రచ్చబండ.. ప్రచారమే అజెండా!
విజయనగరం కలెక్టరేట్, న్యూస్లైన్ : రచ్చబండ రాజకీయం అవుతోంది. అంతా అధికార పార్టీ మార్కుతోనే జరుగుతోంది. ఇది ప్రభుత్వ కార్యక్రమమా? లేక కాంగ్రెస్ పార్టీ సమావేశమా? అన్న సందిగ్ధత ప్రజల్లో నెలకొంటోంది. వాస్తవానికి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల నుంచి తేదీలు తీసుకోవాలని సూచించినప్పటికీ.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నచోట అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకే తేదీలు నిర్ణయిస్తున్నారు. రెండేళ్లుగా ప్రజల సంక్షేమం పట్టని సర్కారు.. ఎన్నికల వేళ ప్రజల్లో కాంగ్రెస్ మార్కుకోసం రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలు ఎలా ఉన్నప్పటికీ జిల్లాలో రచ్చబండ జరుగుతున్న తీరు విమర్శలపాలవుతోంది. ప్రజల సమస్యలను విన్నవించేందుకు రచ్చబండకు వెళ్తున్న నాయకులను సైతం అడ్డుకోవడం విస్మయానికి గురి చేస్తోంది. వాస్తవానికి గ్రామీణప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి రచ్చబండ కార్యక్రమానికి స్వీకారం చుట్టారు.అయితే ప్రస్తుత పాలకులు ఆ కార్యక్రమాన్ని ప్రజా సమస్యల కంటే పార్టీ ప్రచారానికి వేదికలుగా మల్చుకుంటున్నారు. కమిటీ సభ్యులతోపాటూ అంతా అధికార పార్టీ నేతల సూచనల మేరకే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతోంది. వేదికలను సైతం అధికార పార్టీ నేతలు తమ ప్రచారానికి, రాజకీయ ప్రసంగాలకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్న చోట సైతం వారికి తెలియకుండానే రచ్చబండ తేదీలు నిర్ణయించడం గమనార్హం. విజయనగరంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పూసపాటి అశోక్గజపతిరాజు ప్రమేయం లేకుండానే తేదీలు ప్రకటించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రచ్చబండ సభల్లో కొంతమందికి మాత్రమే రేషన్కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసి చేతులు దులుపుకొంటున్నారు. కనీసం సామాజిక సమస్యలపైనైనా దృష్టి సారించకపోవడం పట్ల ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. 8 మండలాల్లో రచ్చబండ పూర్తి.. జిల్లాలో ఈ నెల 11 నుంచి ప్రారంభమైన రచ్చబండ సాలూరు మున్సిపాలిటీతోపాటు, ఎనిమిది మండలాల్లో పూర్తయింది. 114 గ్రామ పంచాయతీలతోపాటు 29 వార్డుల్లో ర చ్చబండ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పూర్తయిన వాటిలో గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, రామభద్రపురం, కొమరాడ, జియ్యమ్మవలస, పార్వతీపురం, మక్కువ, నెల్లిమర్ల మండలాలు ఉన్నాయి. వేలాది వినతులు.. రచ్చబండ కార్యక్రమాల్లో పలు సమస్యల పరిష్కారం కోరుతూ వే లాది వినతులు అందాయి. కొత్తగా రేషన్ కార్డుల కోసం 7,348 దరఖాస్తులు, పింఛన్ల కోసం 5,378, ఇళ్ల కోసం 6,630 దరఖాస్తులు అందాయి. అయితే ఈ వినతుల పరిష్కారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు మాసాల్లోపు సాధారణ ఎన్నికలు వస్తున్న వేళ.. ప్రస్తుతం ఇస్తున్న దరఖాస్తులకు మోక్షం లభిస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమం ఎటువంటి ప్రాధాన్యతా లేకుండా ప్రచారమే అజెండాగా జరుగుతోంది. కొంతమంది లబ్ధిదారులను తీసుకొచ్చి ‘మమా’ అనిపించేస్తున్నారు.