Proteins
-
ఏ వయసులో ఏ ఆహారం?
ఆహారానికి వయసు ఉండదు కానీ, ఏ వయసుకు తగ్గ ఆహారం ఆ వయసులో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఎదిగే వయసు పిల్లలు తీసుకోవలసిన ఆహారంలో ఉండవలసినవి వృద్ధులు తీసుకోవలసిన ఆహారం ఒకటి కాదు. అదేవిధంగా టీనేజీ అమ్మాయిలు, యాభైలలో ఉండే స్త్రీలు వేర్వేరు ఆహారాలు తీసుకోవాలి. ఇంతకీ ఏ వయసు వారు ఏ ఆహారం తీసుకుంటే మంచిదో చూద్దామా?ఇప్పుడు పిల్లలు తినే ఆహారంలోప్రోటీన్లు తక్కువ; పిండి పదార్థాలు, కొవ్వులు ఎక్కువ ఉంటున్నాయి. ఇలాంటి ఆహారం తినటం వల్ల వయసుకు తగిన పెరుగుదల ఉండదు. అధిక బరువు, హార్మోన్లలో మార్పుల లాంటి సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఈ వయసు నుంచే సమతులాహారం ఇస్తూ ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోగలిగితే భవిష్యత్తులో హైపర్టెన్షన్, మధుమేహం, రక్తపోటు మొదలైన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి గుడ్లు, ఆకుకూరలు, తాజాపళ్లు, కూరగాయలు ∙బాదం, వాల్నట్స్, వేరుసెనగ ∙గోధుమలు, పెసలు, పాలు, వెన్న, పెరుగు ∗మాంసం, చేపలు, జున్ను ∙రాజ్మా, సెనగలు, బొబ్బర్లు, సాయంత్రం అల్పాహారంగా బాదం, పిస్తా, వాల్నట్స్, ఉడకబెట్టిన సెనగలు, మొక్కజొన్నలాంటివి ఇవ్వాలి.15 నుంచి 25 ఏళ్ల వయసు∙తక్కువ నూనె, తీపి, మసాలాలతో రుచికరమైన స్నాక్స్ వండే విధానాలను నేర్చుకుని పిల్లల మనసు గెలవగలిగితే బజార్లో దొరికే ఫాస్ట్ ఫుడ్స్కు పిల్లలు ఆకర్షితులవకుండా ఉంటారు ∙అలాగే మాంసాహారం వండేటప్పుడు ఎక్కువ నూనెలో వేయించకుండా ఆవిరి మీద ఉడికించి ఇవ్వాలి ∗మాంసాహారంతోపాటు కూరగాయలు కూడా ఇవ్వాలి ∗ఆహారంలో తగినంత పీచు పదార్థం ఉండేలా చూసుకుంటే పోటీన్ ఫుడ్ వల్ల మలబద్ధకం తలెత్తకుండా ఉంటుంది ∗ఉదయం అల్పాహారంలో బ్రెడ్, శాండ్విచ్లకు బదులుగా గోధుమ రవ్వతో చేసిన ఉ΄్మా, పెసలతో చేసిన ΄పోంగల్, పెసరట్టు, రాగి, క్యారట్ ఇడ్లీ లాంటివి ఇవ్వాలి కేక్ల తయారీలో డ్రై ఫ్రూట్స్, పళ్ల ముక్కలు ఎక్కువగా వాడాలి ∗బాదం, పిస్తా, వాల్నట్స్, ఉడకబెట్టిన సెనగలు, మొలకలు అందుబాటులో ఉంచాలి ∗ఫ్రిజ్ ట్రేలలో చాక్లెట్లు, బిస్కెట్లకు బదులుగా పళ్లు, సలాడ్లు, పాలు, గుడ్లు ఉంచాలి. ఎక్కువగా ఆటలాడుతూ ఉంటారు కాబట్టి రోజుకి కనీసం గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినేలా చూసుకోవాలి. ఉదయం, సాయంత్రం కలిపి కనీసం అర లీటరు పాలు తాగేలా చూసుకోవాలి ∗ఉడికించిన సెనగలు, బొబ్బర్లు ఎక్కువ సమయంపాటు శక్తినిస్తాయి. కాబట్టి బాస్కెట్బాల్, క్రికెట్లాంటి ఆటల్లో పాల్గొనే పిల్లలకు వీటిని శ్నాక్స్గా ఇస్తూ ఉండాలి.టీనేజ్లో... కొంతమంది టీనేజర్లు...మరీ ముఖ్యంగా అమ్మాయిలు బరువు పెరిగిపోతామనే బెంగతో తగినంత ఆహారం తీసుకోకుండా పోషక లో΄ాలకు గురవుతూ ఉంటారు. ఇలాంటి టీనేజర్లను కనిపెట్టి తల్లులు పాష్టికాహారం వల్ల భవిష్యత్తులో ఒరిగే ప్రయోజనాల గురించి వారికి అవగాహన కల్పించాలి ∗చిన్న వయసు నుంచే శరీరానికి పోషకాలు అందిస్తూ గర్భం దాల్చే సమయానికి శరీరాన్ని ఎలా సన్నద్ధం చేయాలో, అలా చేయకపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో వివరించాలి ∗ఉదయం అల్పాహారం స్కిప్ చేయకుండా చూసుకోవాలి ∗తగినంత క్యాల్షియం, పోటీన్ తీసుకుంటూ వ్యాయామం చేస్తే ఎత్తు పెరగటంతో΄ాటు, చక్కటి శరీర సౌష్టవం కూడా సొంతమవుతుంది.45 ఏళ్ల నుంచి వృద్ధాప్యం వరకూ...∗ఈ వయసు స్త్రీలలో హార్మోన్ల స్రావాలు తగ్గిపోతాయి కాబట్టి శరీరం కాల్షియంను శోషించుకునే శక్తి కోల్పోతుంది. ఫలితంగా ఎముకలు, కీళ్ల నొప్పులు మొదలవుతాయి. పురుషుల్లో కండరాలు పటుత్వం కోల్పోతాయి కాబట్టి క్యాల్షియంను సప్లిమెంట్ల రూపంలో తీసుకోవటం అవసరం. దీంతోపాటు మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాల సప్లిమెంట్లను వైద్యుల సూచనమేరకు వాడాలి ∙ఈ వయస్కుల్లో కంటి చూపు, జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది. బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే కాలిఫ్లవర్, క్యారెట్, చిలకడ దుంపలు, గుమ్మడికాయ మొదలైనవి తీసుకోవాలి ∙వాల్నట్స్, బాదం కూడా ఎక్కువగా తినాలి. -
నీరసంగా అనిపిస్తోందా..? ఇవి లాగించండి, తక్షణమే శక్తి వస్తుంది..!
కొన్ని సార్లు వీపరీతంగా ఆకలి అనిపిస్తుంది. తక్షణం శక్తి కావాలనిపిస్తుంది. తినగానే వెంటనే శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు ఏవి? ఆహారంలో ఏ ఏ రకాలు ఉంటాయి? ఏవి తింటే మంచిది? వాటి గురించి తెలుసుకోండి. కార్బోహైడ్రేట్లు: కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తి రావడానికి ప్రాథమిక మూలం. పండ్లు, కూరగాయలు, రొట్టె, పాస్తా మరియు అన్నం వంటి ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల వీలైనంత త్వరగా శక్తిని పొందవచ్చు. ప్రోటీన్లు: శరీర కణజాలాల పెరుగుదల మరియు మరమ్మత్తులకు ప్రోటీన్లు చాలా అవసరం. గుడ్లు, గింజలు, చీజ్ మరియు లీన్ మీట్ వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తినడం వల్ల స్థిరమైన శక్తిని శరీరానికి లభించవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు: గింజలు, అవకాడోలు మరియు చేపలలో లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు దీర్ఘకాల శక్తిని అందిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది కూడా. కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలు: కాఫీ, టీ మరియు చాక్లెట్ వంటి కెఫీన్ కలిగిన ఆహారాలు మరియు పానీయాలు కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా తాత్కాలిక శక్తిని అందిస్తాయి. అయితే ఇవి ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తాయన్న ఆలోచనను బట్టి అవసరమైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు: కణాలకు ఆక్సిజన్ను చేరవేసే హిమోగ్లోబిన్ను ఉత్పత్తి చేయడానికి శరీరానికి ఐరన్ అవసరం. బచ్చలికూర, కాయధాన్యాలు, రెడ్ మీట్ మరియు టోఫు వంటి ఇనుము అధికంగా ఉండే ఆహారాలు అలసటను నివారించడంలో మరియు శక్తిని అందించడంలో సహాయపడతాయి. ఈ ఆహారాలు తక్షణ శక్తిని అందించగలవని గమనించడం ముఖ్యం. శక్తి స్థాయిలను నిర్వహించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం వివిధ రకాల పోషకాలను కలిగి ఉన్న సమతుల్య ఆహారాన్ని తినడం మాత్రమే. అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, జంక్ ఫుడ్ లాంటివి వీలైనంత వరకు తినకూడదు. దీని వల్ల చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. -డా.నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
Sleep tips: వేడి పాలు తాగితే వెంటనే నిద్ర వస్తుంది.. ఎందుకో తెలుసా?
చిన్నప్పుడు మన పేరెంట్స్ రాత్రి భోజనాలయ్యాక పసుపు కలిపిన పాలు లేదా బాదం పాలు తాగమని పోరుపెట్టేవారు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? నిద్రపోయే ముందు వేడి పాలు తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. అసలు కారణం ఇదేనట.. పాలల్లో పెప్టైడ్ అనే ప్రొటీన్ హార్మోన్ (సీటీఎచ్) ఒత్తిడిని తగ్గించి, నిద్ర వచ్చేలా ప్రేరేపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రి జర్నల్ ప్రచురించిన నివేదిక కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. వేడిపాలల్లో సహజంగా నిద్రకుపక్రమించేలా చేసే ప్రత్యేక పెప్టైడ్లను గుర్తించినట్టు ఈ నివేదిక పేర్కొంది. చదవండి: బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? ఈ సమస్యలు పొంచి ఉన్నట్లే!! సీటీఎచ్లో నిద్రను పెంచే కారకాలు (లక్షణాలు) ఉన్నట్లు ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో బయటపడింది. ఇతర ఎలుకలతోపోలిస్తే వేడి పాలు తాగిన ఎలుకల్లో 25 శాతం త్వరగా నిద్రపోయినట్టు సైంటిస్టులు గుర్తించారు. అంతేకాకుండా ఎక్కువ సమయం నిద్రపోయాయట కూడా. చదవండి: టీనేజర్స్ మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా బ్యాడ్ ఎఫెక్ట్..! కాబట్టి శరీరంతోపాటు, మనసుకు కూడా విశ్రాంతినిచ్చి గాఢనిద్ర పట్టాలంటే.. మీ డిన్నర్ అయిన తర్వాత ఒక గ్లాస్ వెచ్చని పాలను తాగితే చాలు! ఆందోళన (యంటీ యంగ్జైటీ) తగ్గించి, మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ గుర్తుంచుకోండి.. దీనిని అమలుచేసేముందు మీకేమైనా అనారోగ్య సమస్యలున్నట్లయితే ముందుగా మీ డాక్టర్ సలహాతీసుకోవడం మంచిది. చదవండి: అప్పుడు కన్నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు.. ఇప్పుడు ఎందరికో ఆసరా..! -
Weight Loss: ఫైబర్, విటమిన్ ‘సి’,పొటాషియం, జింక్, ఐరన్.. వీటితో వేగంగా..
బరువు తగ్గడం అంత సులువైన పనేంకాదు. అందుకు చాలా ఓపిక, పట్టుదల, సమయం అవసరమౌతుంది. సమతుల ఆహారం, ఆరోగ్యకరమైన జీవన శైలి ద్వారా ఏ విధంగా బరువు తగ్గొచ్చో ప్రముఖ నూట్రీషనిస్ట్ రూపాలి దత్తా ఈ కింది చిట్కాల ద్వారా సూచిస్తున్నారు. అవేంటో చేసేద్దామా.. ప్రొటీన్లు బరువు తగ్గేందుకు ఉపయోగపడే పోషకాల్లో ప్రొటీన్లు చాలా ముఖ్యమైనవి. గుడ్డు, పప్పు, చికెన్, తృణ ధాన్యాల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లోని మాంసకృత్తులు శరీరంలో అధిక సమయం నిల్వ ఉండటం వల్ల జంక్ ఫుడ్ లేదా ఇతర రూపాల్లో బయటినుంచి క్యాలరీలను తీసుకోవడం అదుపుచేయవచ్చు. ఫైబర్ జీవ క్రియ సక్రమంగా ఉంటే బరువు తగ్గడం అంత కష్టమేమీ కాదు. ఫైబర్ (పీచు పదార్ధాలు) ఎక్కువగా ఉంగే ఆహారం తినడం వల్ల జీర్ణ వ్యవస్థ, జీవక్రియ మెరుగుపరచడానికి, బరువును వేగంగా తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే నిపుణులు బరువు తగ్గాలనుకునే వారికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోమని సూచిస్తుంటారు. ఆకుపచ్చ కూరగాయల్లో, డ్రైఫ్రూట్స్, తృణ ధాన్యాలు, పప్పు దినుసులు మొదలైన వాటిల్లో ఫైబర్ నిండుగా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కొవ్వులేని ఆహారం తీసుకుంటే వేగంగా బరువు తగ్గొచ్చని మీరనుకుంటే అది కేవలం అపోహ మాత్రమే.ఎందుకంటే మన శరీరం సక్రమంగా పనిచేయాలంటే తగుమోతాదులో మంచి కొవ్వులు అందిచే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అవసరం అవుతాయి. చేప, డ్రైఫ్రూట్స్, ఆకు కూరల్లో ఇవి నిండుగా ఉంటాయి. విటమిన్ ‘సి’ శరీరం సక్రమంగా పనిచేయాలంటే హానికారక ద్రావణాలను ఎప్పటికప్పుడు బయటికి పంపించెయ్యాలి. కాబట్టి యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే జీవాణువిషాలను బయటకి పంపి, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ల నుంచి శరీరాన్ని కాపాడుతాయి. విటమిన్ ‘సి’ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కేవలం విషహరణానికి మాత్రమేకాక బరువు తగ్గే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తుంది. ఆల్మా, ఆరెంజ్.. ఇతర సిట్రస్ పండ్లలో విటమిన్ ‘సి’ అధికంగా ఉంటుంది. పొటాషియం జీవక్రియను వేగవంతం చేయండంలో పొటాషియం కూడా కీలకంగా వ్యవహరిస్తుంది. ఇది బరువు తగ్గడానికి మరింత సహాయపడుతుంది. డ్రైఫ్రూట్స్, శనగలు, అవిసెగింజలు, రాజ్మా.. వంటి ఆహార పదార్ధాల్లో పొటాషియం దొరుకుతుంది. ఐరన్ బరువు తగ్గించేందుకు ఐరన్ ఉపయోగపడుతుందని మీకు తెలుసా? అవునండీ.. ఇది ఐరన్ లోపాన్ని నివారించడమేకాకుండా, శరీర కండరాలకు, కణాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. ఇంకా.. శరీరంలోని కొవ్వును హరించడానికి సహాయపడుతుంది. బీట్రూట్, రొయ్యలు, డ్రైఫ్రూట్స్ వంటి ఆహార పదార్ధాల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. జింక్ జింక్ పుష్కలంగా ఉండే ఆహారంతో కూడా అధికబరువుకు చెక్ పెట్టొచ్చు. బాదం, నువ్వులు, పప్పు, పన్నీర్ మొదలైన వాటిల్లో జింక్ అధికంగా ఉంటుంది. ఈ ఆహారపు అలవాట్లతో శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతోపాటు బరువును వేగంగా తగ్గించుకోవచ్చని రూపాలి దత్త సూచిస్తున్నారు. చదవండి: Weight Loss: ప్రతి ఉదయం ఈ డ్రింక్ తాగారంటే.. మీరే ఆశ్చర్యపోతారు!! -
మిగిలిన మెట్రోలకన్నా.. మనమే మెరుగు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఆరోగ్యానికి కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమపాళ్లలో అవసరం. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా రోగ నిరోధక శక్తికి కావాల్సిన ప్రొటీన్లు శరీరానికి అందడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ‘సౌత్ ఇండియా ప్రొటీన్ గ్యాప్’ పేరిట నిర్వహించిన సర్వేలో ప్రొటీన్లపై మన హైదరాబాదీలకు మెరుగైన అవగాహన ఉందని తేల్చింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ప్రొటీన్పై అవగాహనకు సంబంధించి ఈ సర్వే నిర్వహించారు. సిటీ టాప్... పాలు తీసుకోని వారిలో 83 శాతం మంది ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారని నగరానికి చెందిన ఓ డెయిరీ ప్రొడక్ట్ నిర్వహించిన ఈ సర్వే వెల్లడించింది. అలాగే 68 శాతం మందిలో రోజువారీగా శరీరానికి అవసరమైన ప్రొటీన్ పరిమాణంపై అవగాహన లేదు. ఈ సర్వేలో పాల్గొన్న హైదరాబాదీల్లో 68 శాతం మంది రోజువారీగా తమకు ఎంత ప్రొటీన్ అవసరం అనేది చెప్పగలిగారు. అదే చెన్నై విషయానికి వస్తే 25 శాతం మందిలోనే ఈ విషయంలో అవగాహన ఉంది. ఇక 5 శాతంతో బెంగుళూర్వాసులు ప్రొటీన్పై అవగాహనతో మరీ వెనుకబడ్డారు. (చదవండి: ఏడాదికి రాష్ట్ర ప్రజలు తింటున్న కోడికూర లెక్క ఇదీ!) లో‘పాలూ’కారణమే... రోగనిరోధక శక్తిని కాపాడుకోవడంలో ప్రొటీన్లది కీలకపాత్ర. ఒక పురుషునికి రోజుకు 56 గ్రాముల ప్రొటీన్లు అవసరం. అదే మహిళకైతే 46 గ్రాములు కావాలి. రోజుకు ఒక వ్యక్తి 400–500 మి.లీ. పాల ఉత్పత్తులు తీసుకుంటే అవి అవసరమైన ప్రొటీన్ను అందిస్తాయి. ప్రపంచంలోనే పాల ఉత్పత్తుల్లో భారత్ అతి పెద్దదిగా పేరు పొందినా.. పెద్దల్లో 32% మందే పాలు తీసుకుంటారు. సర్వే ప్రకారం.. 54% మంది పెద్దల్లో ప్రొటీన్ లోపం ఉండగా, శాకాహారుల్లో ఇది 62%గా ఉంది. -
‘ప్రోటీన్ల’ను పట్టించుకోరేమీ!
సాక్షి, అమరావతి: కోవిడ్–19 వైరస్ మహమ్మారిని మన శరీరం ఎదుర్కోవాలంటే.. మనలో రోగనిరోధక శక్తి ఉండాలి. ఇందుకు ‘ప్రోటీన్లు’ అత్యధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇంతటి కీలకమైన పోషక పదార్థాలపై భారతీయుల్లో సరైన అవగాహన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. భారతీయ తల్లుల్లో అత్యధికశాతం మంది ఆహారంలో వీటి ఆవశ్యకతను గుర్తించడం లేదని ప్రముఖ సంస్థ నిల్సన్ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ‘ప్రోటీన్లు మన హక్కు’ అనే నినాదంతో దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా.. దేశంలోని మెట్రో, ద్వితీయశ్రేణి నగరాల్లో ఈ సర్వే నిర్వహించింది. నిల్సన్ సర్వేలోని ప్రధాన అంశాలు ఇవీ.. ► ప్రోటీన్లపై భారతీయులకు సరైన అవగాహన లేదు. పేదల్లోనే కాదు మధ్యతరగతి, ఉన్నతవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ► భారతీయులు సగటున తక్కువ పరిమాణంలో పోట్రీన్లతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. కేవలం 3శాతం మందికి మాత్రమే వీటి అవశ్యకత తెలుసు. ► రోగనిరోధక శక్తిని అందించి, కండరాల శక్తిని పెంపొందించడంలో ప్రోటీన్లు కీలకమనే విషయం 90% మంది తల్లులకు తెలియదు. ► రోజువారి ఆహారంలో 82% మంది తల్లులు ప్రోటీన్లకు తక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ► 80% మంది మాతృమూర్తులకు ప్రోటీన్లు ముఖ్యమైనవి అని తెలుసు కానీ రోజూ ఆహారంలో వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ప్రోటీన్లు త్వరగా జీర్ణం కావని.. వీటిని ఎక్కువుగా తీసుకుంటే బరువు పెరుగుతారని.. ఇలా పలురకాల దురభిప్రాయాలు ఉన్నాయి. ప్రోటీన్లతోనే ఆరోగ్యభారత్ చిన్నతనం నుంచే ప్రోటీన్లు ఎక్కువుగా ఉండే ఆహారం ఇవ్వడం ద్వారానే ఆరోగ్య భారత్ను రూపొందించగలమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నిల్సన్ సంస్థ వెల్లడించిన సర్వే ఫలితాలు భారతీయులకు కనువిప్పు కలిగించాలని ఇండియన్ డయాబెటిక్ అసోసియేషన్ప్రెసిడెంట్ డా.జగ్మీత్ మదన చెప్పారు. ‘ప్రోటీన్ పారడాక్స్’పేరిట నిర్వహించిన ఈ అధ్యయనం దేశానికి సరైన మార్గనిర్దేశం చేసిందని న్యూట్రీటెక్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ డా.సురేశ్ ఇటపు అభిప్రాయపడ్డారు. ప్రోటీన్లు ఎక్కువుగా ఉండే ఆహారం ► మొక్కజొన్న, స్వీట్కార్న్ ► ఆకు కూరలు ► పాలు ► పెరుగు ► పప్పు దినుసులు ► బీన్స్, చిక్కుళ్లు, రాజ్మా, సోయా, కాబూలీ శనగలు ► వేరుశనగ(పొట్టు తీయకుండా) ► పుట్టగొడుగు ∙గుడ్లు ► పళ్లు... ప్రధానంగా సిట్రస్ ఉండే దానిమ్మ, నిమ్మ, జామ, దబ్బ, ► స్కిన్లెస్ చికెన్, చేపలు -
ఫార్మా రంగంలోకి అమెజాన్..
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్తో నాటిలస్ బయోటెక్నాలజీ అనే ప్రముఖ స్టార్టప్ ఫార్మా కంపెనీ జతకట్టనుంది. ఈ కంపెనీ మొదటగా 2016లో అంకుర పరిశ్రమగా ప్రారంభమయ్యి ప్రస్తుతం దిగ్గజ కంపెనీల జాబితాలో నిలిచింది. రోగుల ప్రొటీన్ను మ్యాపింగ్ చేసి విశ్లేషించడమే కంపెనీ ముఖ్య లక్ష్యమని సహ వ్యవస్థాపకుడు సుజల్ పటేల్ పేర్కొన్నారు. రోగుల ప్రొటీలన్లను మ్యాపింగ్ చేయడం వల్ల క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక జబ్బులకు తక్కువ ఖర్చుతో చికిత్స అందించవచ్చని కంపెనీ పేర్కొంది. వైద్యులకు చికిత్స అందించేందుకు, మందుల తయారీకి.. ప్రొటిన్ మ్యాపింగ్, రక్తనమూనాలను విశ్లేషించడం ఎంతో కీలకమని కంపెనీ ముఖ్య ప్రతినిథులు అభిప్రాయపడ్డారు. మరోవైపు సరికొత్తగా పుట్టుకొస్తున్న వైరస్ల వల్ల ఫార్మా రంగానికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆరోగ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
టొమాటో మాటున ఆరోగ్యం
ప్రాచీన భారతదేశీయ వైద్యమైన ఆయుర్వేదంలో టొమాటో ప్రస్తావన లేదు. ఇది మన దేశపు పంట కాకపోవటమే ఇందుకు కారణం. మౌలికంగా ఇది అమెరికా సీమకు చెందినది. క్రీ.శ. 7వ శతాబ్దంలో పెరూ, చిలీ, బొలీవియా దేశాలలో ఈ పంట ప్రారంభమైంది. అనంతరం 16వ శతాబ్దం లో ఐరోపా వాసులకు పరిచయమైంది. తదనంతరం పోర్చుగీసు వారి ద్వారా భారతదేశానికి సంక్రమించింది. ఈ పండు ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ రక్త వర్ణానికి భయపడి ప్రారంభదశలో దీనిని విషతుల్యంగా భావించి తినేవారు కాదు. క్రమేణా దీని రుచిని, ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించటం మొదలైంది. వాస్తవానికి ఈ చెట్టు కాండంలోనూ, ఆకులలోనూ ఉండే సొలానిన్ అనే పదార్థం దుర్గుణాలను కలిగి ఉంటుంది. అందుకే ఏ జంతువూ ఈ చెట్ల జోలికి పోదు. దీంట్లో ప్రధానంగా పులుపు, తీపి రుచులు ఉంటాయి. కొద్దిగా లవణ రసం (ఉప్పగా) కూడా ఉంటుంది. కనుక ఏ కూరగాయలతో దీనిని కలిపి వండినా, పచ్చిగా సేవించినా వాటి రుచి మరింత పెరుగుతుంది. వాతహరంగా ఉపకరిస్తుంది. ఆధునికశాస్త్రరీత్యా పోషక విలువలు సుమారుగా ఒక కప్పు (150 గ్రా.) టొమాటో పండ్లలోని పోషక విలువల శాతాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. క్యాలరీలు (శక్తి) 1%, పిండి పదార్థాలు 2%, ఆహారపు పీచు 7%, శర్కర 2.8%, ఒమేగా త్రీ ఫాటీ యాసిడ్స్ 3%. విటమిన్లు ఎ – 25%, సి – 32%, ఇ – 4%, కె –15%, బీ కాంప్లెక్సు – సరాసరి 4% ఖనిజ లవణాలు (మినరల్స్) క్యాల్షియం– 1%, ఐరన్ – 4%, మెగ్నీషియం – 4%, ఫాస్ఫరస్ – 4% జింక్ – 2%, కాపర్ – 4%, మాంగనీసు – 8%, పొటాషియం–10%. లైకోపిన్, ల్యూటిన్, బీటాకొరెటిన్ సమృద్ధిగా ఉంటాయి. ఉండనివి (శూన్యం) కొలెస్టరాల్, స్టార్చ్, సోడియం, సెలీనియం (విషం), విటమిన్ డి అండ్ బి12. ప్రయోజనాలు: వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. చర్మకాంతి, కంటి చూపు మెరుగుపడతాయి. కేశాలు దృఢంగా పెరుగుతాయి. గుండెకు బలం, కండరాల శక్తి పెరుగుతాయి. అధిక రక్త్తపీడనం (అధిక బీపీ) అదుపులోకి వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణం కలిగి రోగాలను దరిచేరనీయదు. బరువు తగ్గేవారికి ఇదిమంచి ఆహారం. శరీరానికి నీటి శాతం పుష్కలంగా అందుతుంది. క్యాబేజీ కుటుంబానికి చెందిన బ్రొకోలీతో టొమాటోను కలిపి తింటే ప్రొస్టేట్ క్యాన్సర్, పాంక్రియాసిస్ క్యాన్సర్లు తగ్గుతాయని ఇటీవలి పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి. గమనిక: దీంట్లో పొటాషియం అధికంగా ఉంటుంది కనుక ‘మూత్రపిండాలలో రాళ్లు’ వ్యాధిగ్రస్తులు దీనిని సేవించరాదు. -
వ్యాయామానికి ప్రత్యామ్నాయంగా ప్రొటీన్ సప్లిమెంట్?
వయసులో ఉన్నప్పుడు వ్యాయామం గట్రా చేయడం పెద్ద ఇబ్బందేమీ కాకపోవచ్చు. వద్ధులు... వికలాంగులు, గాయాలపాలైన వారి పరిస్థితి ఏమిటి? వారికి వ్యాయామం అవసరమున్నా.. చేయలేని పరిస్థితి. కొంచెం చిత్రమైన ఈ సమస్యను అధిగమించేందుకు మిషిగన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. కేవలం ఒక ప్రొటీన్ సప్లిమెంటను ఆహారంగా తీసుకోవడం ద్వారా వ్యాయామం తాలూకూ అన్ని ప్రయోజనాలు పొందవచ్చునని వీరు అంటున్నారు. శరీరంలో సహజంగా ఏర్పడే సెస్ట్రిన్ అనే ప్రొటీన్ వ్యాయామం తరువాత కండరాల్లో పేరుకుపోతుందని గతంలోనే గుర్తించారు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని తాము ప్రయోగాలు మొదలుపెట్టామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న జూ హన్ లీ తెలిపారు. ఈగలపై తాము పరిశోధనలు చేశామని ఒక గుంపు సాధారణమైన ఈగలు కాగా.. ఇంకోదాంట్లో సెస్ట్రిన్ ఉత్పత్తి జరక్కుండా చూశామని, మూడోదాంట్లో ఎక్కువ స్థాయిలో సెస్ట్రిన్ ఉత్పత్తి అయ్యేలా చేశామని జూ హన్ లీ వివరించారు. మూడు గుంపుల ఈగలూ శారీరకంగా శ్రమపడేలా చేసినప్పుడు సెస్ట్రిన్ ఎక్కువగా ఉన్న ఈగల సామర్థ్యం బాగా పెరిగినట్లు గుర్తించారు. శారీరక శ్రమ లేనప్పుడు కూడా వీటి సామర్థ్యం తగ్గకపోవడాన్ని బట్టి సెస్ట్రిన్ ద్వారా వ్యాయామం తాలూకూ ఫలితాలు అందుతున్నట్లు గుర్తించారు. భవిష్యత్తులో ఈ సెస్ట్రిన్ ప్రొటీన్ను సప్లిమెంట్గా ఇవ్వడం ద్వారా శ్రమ లేకుండానే వ్యాయామం తాలూకూ ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుందని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. -
రాగులు ఎంత ఆరోగ్యకరమంటే...
ఇటీవల ఆరోగ్యం కోసం రాగులను ఆహారంగా తీసుకోవడం పెరిగింది. రాగిముద్ద అని పిలిచే రాగిసంకటి ఇప్పుడు చాలా రెస్టారెంట్లలో ఓ ట్రెండీ ఫుడ్. రాగులను పిండి రూపంలో తీసుకోవడం ద్వారా దీంతో రాగిరొట్టెలు, రాగి అంబలి ఇలా అనేక రూపాల్లో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తీసుకుంటున్నాం. కొందరు రాగి దోసెలూ, ఇడ్లీలు, లడ్డూలంటూ చాలా ఐటమ్సే తయారు చేస్తున్నారు. రాగులు ఆరోగ్యానికి చాలా మంచివి కావడంతో వీటితో రకరకాల పదార్థాలు వంటలు చేసుకోవడం ఇటీవల బాగా పెరిగింది. రాగుల్లో పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్) చాలా ఎక్కువ. ఆ తర్వాత ప్రోటీన్లు, ఆ తదిపరి స్థానంలో పీచు పదార్థాలు ఉన్నాయి. ఇక రాగిపిండిలో ఉండే కొవ్వు శాతం చాలా చాలా తక్కువ. రాగులకు ఉన్న ఆదరణ వల్ల ఇప్పుడు రాగిపిండి మార్కెట్లో రెడీమేడ్గా లభిస్తోంది. వంద గ్రాముల రాగి పిండిలో... వంద గ్రాముల రాగి పిండితో 336 క్యాలరీలు లభ్యమవుతాయి. రాగుల్లో 80 శాతం కార్బోహైడ్రేట్లే. 12 శాతం తేమ ఉంటుంది. రాగిపిండిలో క్యాల్షియం చాలా ఎక్కువ. వంద గ్రాముల రాగిపిండిలో 350 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. అందుకే ఎముకల ఆరోగ్యానికీ, పటిష్టతకూ రాగిపిండి చాలా మేలు చేస్తుంది. ఐరన్ కూడా కొంతమేరకు ఉంటుంది. రాగిపిండిలో మన శరీరానికి బాగా అవసరమైన ఎన్నోరకాల అమైనో ఆసిడ్స్ (ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్) పుష్కలంగా లభ్యమవుతాయి. వ్యాలైన్, మిథియోనైన్, ఐసోల్యూసిన్, థ్రియోనైన్, ట్రిప్టోఫాన్ వంటి అత్యావశ్యక అమైనో ఆసిడ్స్ అన్నవి మన ఆరోగ్య నిర్వహణ కోసం చాలా అవసరం. రాగుల్లో పీచుపదార్థాలు బాగా ఎక్కువే. దీంతోపాటు రాగిపిండి గ్లూటెన్ ఫ్రీ కావడం వల్ల తేలిగ్గా జీర్ణమవుతుంది. తేలిగ్గా ఒంటికి పడుతుంది. (గ్లూటెన్ అంటే... పిండిని కంచంలో రాశిగా పోసి మధ్యలో గురుగు చేసి (గుంట పెట్టి) అందులో నీళ్లు పోసినప్పుడు పొడి పిండి కాస్తా... పిండిముద్దగా మారుతుంది కదా. ఇలా పొడి పిండిని, పిండిముద్దలా మార్చడానికి పిండిలోని గ్లూటెన్ అనే ప్రోటీన్ తోడ్పడుతుంది. కొందరి ఒంటికి ఈ గ్లూటెన్ సరిపడదు. దాంతో వాళ్లకు గ్లూటెన్ ఉన్న పిండితో చేసిన వంటకం తిన్న వెంటనే కడుపులో ఇబ్బంది, కడుపునొప్పి, వికారం, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీరిని ‘గ్లూటెన్ ఇన్టాలరెన్స్’ ఉన్న వ్యక్తులుగా పేర్కొంటారు. ఇలాంటి వారి కోసమే... ఆయా పిండులతో గ్లూటెన్ లేకుండా కూడా తయారు చేస్తున్నారు. అంటే ఆ పిండి నుంచి గ్లూటెన్ను తొలగిస్తారన్నమాట. ఇలాంటి పిండిని ‘గ్లూటెన్ ఫ్రీ’ పిండి అని అభివర్ణిస్తుంటారు. కొన్ని రకాల పిండిలలో స్వాభావికంగానే గ్లూటెన్ ఉండదు). ఆరోగ్యానికి ప్రయోజనాలెన్నో... రాగుల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ వల్ల వెంటనే ఆకలి తీరినట్లు ఉంటుంది. మనం రోజూ తినే తెల్ల అన్నంతో పోలిస్తే రాగిపిండిలో ఉండే పీచుపదార్థాలు చాలా ఎక్కువ. కొవ్వులు దాదాపు లేనట్టే. ఈ పీచుపదార్థాల వల్ల తిన్న వెంటనే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. దాంతో రాగిపిండితో చేసిన పదార్థాలు తినేవారు బరువు పెరగకపోవడం, స్థూలకాయం రాకపోవడం వంటి ప్రయోజనాలు చేకూరతాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది మంచి ఆహారం. ఇక ఇందులోని పీచుపదార్థాల కారణంగా రాగిపిండితో చేసిన వంటకాలు మెల్లగానూ, తేలిగ్గానూ జీర్ణమవుతాయి. ఇందులో క్యాల్షియమ్తో పాటు విటమిన్ ‘డి’ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఎముకల బలానికి ఇది బాగా తోడ్పడుతుంది. అందుకే ఎదిగే పిల్లలకు రాగిపిండితో చేసిన వంటకాలు ఇవ్వడం వల్ల వాళ్లు బాగా, వేగంగా ఎత్తు పెరుగుతారు. ఇక యువకులు, పెద్దవాళ్ల ఎముకల ఆరోగ్య నిర్వహణకూ రాగులు సమర్థంగా పనిచేస్తాయి. రాగిపిండి తినేవాళ్లలో ఎముకలు బలంగా ఉండటం వల్ల ఫ్రాక్చర్స్ అయ్యే రిస్క్ చాలా తక్కువ. డయాబెటిస్ నియంత్రణ... రాగులలో పాలీఫినాల్తో పాటు పీచు పదార్థాలు (డయటరీ ఫైబర్) ఉండటం వల్ల డయాబెటిస్తో పాటు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక వ్యాధులను నివారిస్తాయి. ఇందులోని పీచు వల్ల రాగులతో చేసిన వంటలు తిన్న తర్వాత రక్తంలో చక్కెర పెరగడం అన్నది చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఇందులో ఉండే లెసిథిన్, మిథియోనైన్ వంటి అమైనో ఆసిడ్లు కొలెస్ట్రాల్ను బాగా తగ్గిస్తాయి. అంతేకాదు... కాలేయంలో పేరుకుపోయిన అదనపు కొవ్వులనూ అవి తొలగిస్తాయి. అందుకే కాలేయంలో కొవ్వు పేరుకుంటున్నవారు రాగులతో చేసిన ఆహారాన్ని తినడం చాలా మంచిది. రక్తహీనత నివారించే రాగులు రాగులలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటితో చేసిన ఆహారాలను తీసుకుంటూ ఐరన్ శరీరంలోకి ఇంకడానికి దోహదపడే విటమిన్ ‘సి’ ఉండే పండ్లు ఎక్కువగా తింటే రక్తహీనత (అనీమియా) సమస్య వేగంగా తగ్గుతుంది. ఒత్తిడినీ తగ్గిస్తాయి... తృణధాన్యాల్లో వేరే వాటికి లేని ఒక మంచి గుణం రాగులకు ఉంది. రాగులు ఒత్తిడిని సమర్థంగా తగ్గిస్తాయి. అందుకే యాంగై్జటీ, డిప్రెషన్, మైగ్రేన్తో బాధపడేవారికి రాగులు మంచి ఆహారం. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ నిద్ర వచ్చేలా చేసి నిద్రలేమి (ఇన్సామ్నియా) సమస్యను స్వాభావికంగా తగ్గిస్తుంది. మన ఒంటికి చాలా అవసరమైన ఎన్నెనోన అమైనో ఆసిడ్స్ ఇందులో ఉన్నాయి. ఉదాహరణకు థ్రియోనైన్, వ్యాలైన్, ఐసోల్యూసిన్, మిథియోనైన్ వంటివి మన కణజాలాన్ని అనుక్షణం రిపేర్ చేస్తూ, శరీర జీవక్రియలకూ, ఎముకల ఆరోగ్య నిర్వహణకు ఉపయోగపడతాయి. అంతేకాదు మన ఎముకలను రిపేర్ ప్రక్రియలోనూ ఈ అమైనోయాసిడ్స్ పాలుపంచుకుంటాయి. చాలా ఇతర తృణధాన్యాలలో సామాన్యంగా లభ్యం కాని మిథియోనైన్ ఇందులో ఉంటుంది. ఇది శరీరం నుంచి కొవ్వులను తొలగించడానికి, విషాలను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందున రాగులతో చేసే వంటకాలు ఆరోగ్యానికి ఆరోగ్యం. రుచికి రుచి. -
హెల్దీ టేస్టీ లంచ్ బాక్స్
ఇక వచ్చే వారం నుంచి మళ్లీ పిల్లలకు స్కూళ్లు మొదలవ్వబోతున్నాయి. వేసవి సెలవుల వల్ల ఇప్పటివరకూ ఇంట్లోనే కళ్ల ముందు ఉన్న పిల్లలు నేడో రేపో బడికి వెళ్లక తప్పదు. బాక్స్ కట్టి ఇచ్చినా అక్కడ వాళ్లేం తింటారో ఎలా తింటారో అసలు తింటారో లేదో అన్న బెంగ తల్లులకు వారం రోజుల ముందునుంచే మొదలైపోతుంది. ఇప్పటివరకూ ఇంట్లో ఉంటేనే ఎన్నోసార్లు బతిమిలాడితేగానీ పిల్లలు ఇంతన్నా తినరు. అలాంటి ఆ లంచ్ టైమ్లో ఎంత తింటారో తెలియదు. అందుకే స్కూల్ మొదలయ్యాక... మన ఎదిగే పిల్లలకు పోషకాలేమీ మిస్ కాకుండా ఇవ్వాల్సిన ఆహారం ఎలా ఉండాలో తెలుకునేందుకే ఈ కథనం. స్కూలుకు బయలుదేరేముందు పిల్లలు చాలా హడావుడిగా ఏదో తినేస్తుంటారు. బడికి టైమ్ అవుతుందన్న తొందరలో ఇంత నోట్లో వేసుకొని బయలుదేరుతారు. పైగా చాలా స్కూళ్లు ఎనిమిదింటికల్లా మొదలైపోతుంటాయి. దాంతో పిల్లలు నింపాదిగా, నిమ్మళ్లంగా తినడానికే టైమ్ ఉండదు. అయితే స్కూల్కు వెళ్లే ముందర కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం పిల్లలకు చాలా మేలు చేస్తుంది. వాళ్లు ఆరోగ్యకరంగా ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు... అలా పొద్దున్నే టిఫిన్ తిన్న పిల్లల్లో ఏకాగ్రత, విజయసాధన అవకాశాలు చాలా ఎక్కువని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. వివిధ వయసుల్లోని స్కూలు పిల్లలకు ఏయే పోషకాలు అవసరమో తెలుసుకుందాం. ప్రోటీన్ ఇవ్వడం మరవద్దు రోజును మంచి ప్రోటీన్తో ప్రారంభించడం పిల్లలకు ఎంతో మేలు చేస్తుంది. ఎదిగే వయసు పిల్లల విషయంలో ప్రోటీన్లను ‘బిల్డింగ్ బ్లాక్స్’గా చెబుతుంటారు ఆహార నిపుణులు. అంటే భవన నిర్మాణానికి ఇటుకలు ఎలాగో... శరీర నిర్మాణానికి ప్రోటీన్లు అలాగన్నమాట. పైగా ప్రోటీన్లు మన కండరాల్లో అయిన గాయాలను ఎప్పటికప్పుడు రిపేర్లు చేస్తుంటాయి.అందుకే ఉదయం బ్రేక్ఫాస్ట్లో పిల్లలకు ప్రోటీన్లు పుష్కలంగా ఉండే గుడ్డు పెట్టవచ్చు. దాంతోపాటు వెన్న, పెరుగు వంటి వాటిల్లోనూ ప్రోటీన్ ఎక్కువగానే ఉంటుంది. అలాగే పప్పులో కూడా ప్రోటీన్ ఎక్కువ. అందుకే పూరీ/చపాతీతో పాటు పప్పు లేదా శనగల వంటివి ఇవ్వడం వల్ల అటు పూరీ/చపాతీలోని కార్బోహైడ్రేట్లతో పాటు ఇటు పప్పు, శనగలు, గుడ్డు వంటి వాటి నుంచి ప్రోటీన్ కూడా సమకూరుతుంది. స్కూల్ నుంచి రాగానే... పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారికి ‘‘పవర్’’ శ్నాక్స్ ఇవ్వడం మంచిది. అంటే ఇందులో భాగంగా పొట్టు తీయని ధాన్యంతో తయారు చేసిన బ్రెడ్ ముక్కలకు వెన్న, చీజ్ వంటివి పుష్కలంగా రాసి, ఆ బ్రెడ్ ముక్కల మధ్యన తాజా ఆకుకూరలు, కీర, టొమాటో వంటి కాయగూరలు నింపి శాండ్విచ్లు తయారు చేసి ఇవ్వాలి. వీటితో పాటు అరటిపండ్లు ఇవ్వడం మంచిది. పిల్లలు స్కూల్ల్లో బాగా ఆటలాడి వచ్చినా లేదా స్కూల్ నుంచి రాగానే ఆటలకు వెళ్లాలనుకున్నా ఈ తరహా శాండ్విచ్లు వారికి అవసరమైన పోషకాలను, తక్షణ శక్తిని ఇస్తాయి. రాత్రి వేళలో ద్రవాహారాలు ఇవ్వండి పిల్లల రాత్రి భోజనం సమయంలో వారికి ద్రవాలు ఎక్కువగా ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఉదయం నుంచి స్కూలుకు వెళ్లడం, ఆటలాడటం వంటి కార్యకలాపాలతో వారు చేసిన శారీరక శ్రమ వల్ల వారు కోల్పోయిన వారి ఒంట్లోని లవణాలు, ద్రవాలు మళ్లీ భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. పిల్లల లంచ్బాక్స్ ఎలా ఉండాలంటే... పిల్లలు స్కూల్లో దాదాపుగా ఒక పూట లేదంటే రెండు పూటలు తింటారు. ఆ బాక్స్ ఈ కిందివిధంగా ఉండటం వారి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.పిల్లల లంచ్–బాక్స్ ఎలా ఉండాలనేందుకు చాలా సింపుల్ ఫార్ములా ఉంది. అదేమిటంటే... వారి లంచ్బాక్స్లో సగం... రంగురంగుల తాజా పండ్ల ముక్కలతో నింపండి. (ఇందులో కనీసం రెండు నుంచి మూడు రకాలు ఉండాలి). ఆ తర్వాత మరో పావు భాగం దంపుడు బియ్యం (పాలిష్ చేయని బియ్యం)తో వండిన అన్నం లేదా పొట్టు తీయని ధాన్యాలతో చేసిన చపాతీలు నింపండి. ఇక మిగతా పావు భాగాన్ని ప్రోటీన్ పుష్కలంగా ఉండే కూరలతో నింపండి. అంటే శాకాహారులైతే బీన్స్, కిడ్నీ–బీన్స్, ఛోలే వంటి వాటితో వండిని కూరలు గానీ... మాంసాహారులైతే చికెన్, చేపలతో వండిన కూరలను ప్రతిరోజూ మార్చి మార్చి వారికి ఇస్తుండాలి. ఇక వారు రోజూ తగినన్ని నట్స్ కూడా తినేలా చూడాలి. ఇక అన్నం, చపాతీలకు బదులుగా తమకు అందుబాటులో ఉన్నవారు హోల్గ్రెయిన్ పాస్తా, క్వినోవా వంటి వాటినీ వండి ఇవ్వవచ్చు. ►అరబాక్స్ పండ్లలో ఏమేం ఉండాలంటే... తాజా ద్రాక్ష, ఆపిల్స్, పుచ్చపండు ముక్కలు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, అరటిపండ్లు వంటివి ►రంగురంగుల పచ్చికాయగూరల్లో... క్యారట్, దోస, కీర, బ్రాకలీ, బెల్పెప్పర్ (బెంగుళూరు మిర్చీల పేరిట ఇవి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగుల్లో లభ్యమవుతుంటాయి), టొమాటోల వంటి వాటిని ముక్కలుగా కోసి పండ్ల ముక్కలతో పాటు కలిపి కొన్ని ఇవ్వాలి ►ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాలివే... బీన్స్, శనగలు, పీనట్ బటర్, చికెన్, చేపలు, ఉడకబెట్టిన గుడ్లు ►ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు ఏమిటంటే... పొట్టు తీయని పాస్తా, పొట్టు తీయని ధాన్యాలతో చేసిన బ్రెడ్, ముడిబియ్యంతో వండిన అన్నం, ఓట్స్ వంటివి ►ద్రవాహారాలుగా పాల ఉత్పాదనలివి... పాలు, ఫ్లేవర్డ్ మిల్క్, పెరుగు, వెన్న, కాటేజ్ చీజ్, సోయా పాలు, (అందుబాటులో ఉన్నవారు సోయా యోగర్ట్ వంటివి తీసుకోవచ్చు). వీటిలో పిల్లల ఎముకలను బలంగా చేయడానికి, వారు ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడే క్యాల్షియమ్, విటమిన్–డి పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్లు కూడా ఉండనే ఉంటాయి. ఇక పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వారికి మీరే భోజనం ఎలాగూ పెడతారు. వారు ఇంట్లో ఉన్నప్పుడు తక్కువ మోతాదుల్లో వీలైనన్ని ఎక్కువ సార్లు మీరు ఇంట్లో తినే ఆరోగ్యకరమైన భోజనం పెట్టండి. వేర్వేరు వయసుల పిల్లలకు లంచ్ బాక్స్ ఇలా... మూడున్నర ఏళ్ల నుంచి ఆరేళ్ల పిల్లల లంచ్బాక్స్ : ఇప్పుడు పిల్లలు మూడున్నర ఏళ్ల నుంచే ప్రీ–స్కూల్ అంటూనో, ఎల్కేజీ, యూకేజీ అంటూనో స్కూలుకు వెళ్తున్నారు. ఆ వయసు నుంచి ఆరేళ్ల లోపు వారి లంచ్ బాక్స్ ఈ కింద ఉన్న పదార్థాలతో ఉండటం మంచిది. వారి బాక్స్లో పొట్టు తీయని ధాన్యాలతో చేసిన రొట్టెలు (రోటీ–పప్పు), ముడిబియ్యంతో వండిన అన్నం (దాల్–చావల్), శాండ్విచ్ పరాఠాలు వంటివి ఇవ్వవచ్చు. ఈ వయసు పిల్లలు తినే ఆహార పదార్థాల్లో కొన్ని ఆప్షన్స్ చూద్దాం 1 క్యారట్ రైస్ + బీన్స్ కూర + ఆకుకూరలతో చేసిన కూర+ పెరుగు + పండ్లు 2 పాలక్ రైస్ + పప్పు (1 కప్పు) + ఏదైనా ఆకుకూర/కాయగూర (1 కప్పు) + పెరుగు + పండ్లముక్కలు 3 బీట్రూట్ రోటీ + ఏదైనా ఆకుకూర/కాయగూర (ఒక కప్పు) + ఒక ఉడకబెట్టిన గుడ్డు + పెరుగు + పండ్లముక్కలు 4 మిక్స్డ్ వెజిటబుల్ రైస్ గ్రీన్పీస్ పనీర్ కూర లేదా చిక్కుళ్ల వంటి ప్రోటీన్ కూర + పెరుగు + పండ్ల ముక్కలు. 6 – 12 ఏళ్ల పిల్లల లంచ్ బాక్స్: ఈ పిల్లల్లో ఎదుగుదల చాలా వేగంగా జరగుతుంటుంది. వాళ్లకు అవసరమైన రోజువారీ శక్తి (ఎనర్జీ) కూడా ఎక్కువే. ఈ రెండు అవసరాలు తీరేలా వారి ఆహారం ఉండాలి. వారి ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజలవణాలు ఎక్కువగా ఉండాలి. అయితే వారికి చాలా ఎక్కువ శక్తి అవసరం కాబట్టి వారి ఆహారంలో అధిక క్యాలరీలను ఇచ్చే ఆరోగ్యకరమైన పదార్థాలే ఉండాలి తప్ప... ఎక్కువ క్యాలరీలను ఇచ్చే చక్కెర పదార్థాలు (కోలా డ్రింక్స్లో ఉండే షుగర్స్ వంటివి), చెడు కొవ్వు పదార్థాలు (ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు వాడే మార్జరిన్ వంటి నూనెలతో చేసిన పదార్థాలు) ఉండకూడదు. అందుకే వారికి సాఫ్ట్డ్రింక్స్, చిప్స్, క్యాండీలు, తియ్యటి డెజర్ట్స్ చాలా తక్కువగా/పరిమితంగా మాత్రమే ఇవ్వాలి. ఎప్పుడో ఒకసారి రుచికోసం మాత్రమే ఇవి అని వారు గుర్తుంచుకునేలా వారికి మంచి ఆహారపు అలవాట్లను మప్పాలి. ఈ వయసు పిల్లల్లో ముడి బియ్యం, పొట్టుతీయని ధాన్యాలతో వండిన పదార్థాల వల్ల వారికి కార్బోహైడ్రేట్లతో పాటు పీచుపదార్థాలు, విటమిన్–బి కాంప్లెక్స్ వంటివి దొరుకుతాయి. ఇక తాజా పండ్లు, ఆకుకూరలు, కాయగూరల నుంచి విటమిన్–ఏ, విటమిన్–సి, పొటాషియమ్, పీచుపదార్థాలు లభ్యమవుతాయి. అందుకోసం వారి రాత్రి భోజనంలో అన్నంతో పాటు కరకర నమిలి తినే క్యారట్లు, ఆపిల్స్ ఇవ్వాలి. డిన్నర్లో వారి కూరల్లో బ్రాకలీ, బెల్పెప్పర్, మొక్కజొన్న గింజలు, గ్రీన్సలాడ్స్ అందేలా చూడాలి. ఆరెంజ్ వంటి తాజా పండ్లు ఇవ్వాలి. పిల్లల ఎదిగే అవసరాల కోసం క్యాల్షియమ్, పొటాషియమ్, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ వంటివి బాగా అందేలా చూడాలి. ఇందుకోసం వీలైతే మూడు పూటలా లేదా కనీసం రెండు పూటలా పాలు, పాల ఉత్పాదనలు తీసుకునేలా చూడాలి. ఒకవేళ పాలు తాగని వారు సోయామిల్క్, సోయా పెరుగు, క్యాల్షియమ్ సెట్ టోఫూ తీసుకునేలా చూడాలి.వారి ప్రోటీన్ అవసరాల కోసం కొవ్వు తక్కువగా ఉండే చికెన్, తాజా చేపల కూర, బీన్స్, నట్స్, ఇవ్వాలి. అలాగే ఆ మాంసాహారం వల్లనే వారికి ఐరన్, జింక్తో పాటు బి–విటమిన్లోని బి12 వంటివీ సమకూరతాయని గుర్తుంచుకోండి. ఈ వయసులోని పిల్లలకు వారంలో వీలైనన్ని సార్లు గుడ్లు ఇవ్వవచ్చు. రోజుకో గుడ్డు తప్పక ఇవ్వడమూ వారికి మేలు చేస్తుంది. అలాగే ఈ వయసు పిల్లలు ఆటలు ఎక్కువ ఆడతారు. కాబట్టి వారు తరచూ వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగేలా చూసుకోవాలి ఈ వయసులో పిల్లలు చాలా వేగంగా ఎదుగుతుంటారు. వాళ్ల ఎదుగుదలకు తగ్గట్లుగా పోషకాలు అందేలా వాళ్ల లంచ్ బాక్స్ ఉండాలి. ఒకవేళ అన్ని పోషకాలు అందక వాళ్ల ఎదుగుదల తగినంత వేగంగా జరగకపోయినా లేదా అనీమియా వంటి లోపాలు కనిపించినా డాక్టర్ సలహాలతో న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ వాడటం మంచిది. ఎందుకంటే ఈ వయసులో ఆహార లోపాలవల్ల భవిష్యత్తులో వాళ్లకు హార్మోన్ సమస్యలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 13–18 ఏళ్ల పిల్లల లంచ్బాక్స్... ఈ వయసు పిల్లల్లో పెరుగుదల చాలా ఎక్కువ. పైగా మిగతా అన్ని దశలతో పోలిస్తే ఆహారం, పోషకాల అవసరం ఈ దశలో చాలా ఎక్కువ. ఫ్రెండ్స్ ప్రభావాలతో ఆహారపు అలవాట్లు మారిపోయే అవకాశం కూడా ఉంది. తమ స్నేహితులతో కలిసి తినేందుకు వారు లంచ్ బాక్స్ను కూడా స్కిప్ చేస్తుంటారు. ఇలాంటి వారు జంక్ఫుడ్కు అలవాటు పడే ప్రమాదం ఉంది. స్వీట్స్, బాగా ప్రాసెస్ చేసిన ఆహారం, వేపుళ్లు, ఫాస్ట్ఫుడ్స్ వైపు మొగ్గుచూపి ఆరోగ్యకరమైన ఆహారానికి దూరమయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. చిప్స్, పిజ్జా, బర్గర్స్కు సాధ్యమైనంత దూరంగా ఉంచి అన్ని రకాల ఆకూకూరలు, కూరగాయలు, మాంసాహారంతో ఆరోగ్యకరమైన సమతుల ఆహారం అందేలా చూడాలి. 6–12 ఏళ్ల పిల్లలకు ఇచ్చే ఆహారాలే మరింత ఎక్కువ మోతాదుల్లో వీరి లంచ్బాక్స్లో ఉండాలి. ఈ వయసు పిల్లలు లంచ్ బాక్స్ తీసుకెళ్లేలా పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాలి. ఏయే ఆహారాలలో ఎన్నెన్ని క్యాలరీలు ►ఆరు అంగుళాల వ్యాసంతో ఉన్న రోటీలో దాదాపు 85 క్యాలరీలు ఉంటాయి. కొవ్వులు దాదాపు 0.5 గ్రాముల వరకు ఉంటాయి ►150 గ్రాముల మినప్పప్పులో 154 క్యాలరీలు ఉంటాయి. కొవ్వులు 6 గ్రాముల వరకు ఉంటాయి ►150 గ్రాముల శనగలు / రాజ్మా లో 153 క్యాలరీలు ఉంటాయి. కొవ్వులు 5 గ్రాముల వరకు ఉంటాయి ►150 గ్రాముల మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ (కూరలో) 142 క్యాలరీలు ఉంటాయి. దాదాపు 15 గ్రాముల కొవ్వులు ఉంటాయి. (ఈ కొవ్వుల పాళ్లు కూర కోసం వాడిన నూనె పరిమాణం మీద ఆధారపడిఉంటాయి) ►100 గ్రాముల చికెన్ కర్రీలో 300 క్యాలరీలు ఉంటాయి. ఇందులో 15–35 గ్రాముల కొవ్వుల వరకు ఉండవచ్చు. (ఇది స్కిన్తో ఉన్న చికెనా, స్కిన్లెస్నా, ఇక అందులో వాడిన నూనె ఎంత అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది) ∙ఒక సాధారణ ప్లెయిన్ దోశ లో 125 క్యాలరీలు ఉంటాయి. దాదాపు 3 గ్రాముల కొవ్వు ఉంటుంది ∙రెండు సాధారణ సైజ్ ఇడ్లీల్లో 132 క్యాలరీలు ఉంటాయి. దాదాపు 3 గ్రాముల కొవ్వు ఉంటుంది ∙100 గ్రాముల పెరుగన్నం (కర్డ్ రైస్)లో 190 క్యాలరీలు ఉంటాయి. కొవ్వులు దాదాపు 7 గ్రాముల ఉంటాయి ∙100 కోకోనట్ రైస్లో 369 క్యాలరీలు ఉంటాయి. దాదాపు 15 గ్రాముల కొవ్వు ఉంటుంది. కంటి నిండా నిద్ర పోనివ్వండి చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకోవాలని, ఈ వయసులోనే కష్టపడాలంటూ ఉదయం చాలా త్వరగా నిద్రలేపేస్తుంటారు. ఎదిగే వయసులోని ఏ పిల్లలైనా సరే... ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోయేలా చూడండి. ఆ నిద్రే లేకపోతే వారు చదివేదంతా మెదడులో సరిగా నిక్షిప్తం కాదు. మంచి నిద్ర సమయంలోనే చదివిందంతా పర్మనెంట్ మెమరీలోకి వెళ్తుందని గుర్తుంచుకోండి. సుజాతా స్టీఫెన్, చీఫ్ న్యూట్రిషనిస్ట్ యశోద హాస్పిటల్స్, మలక్పేట, హైదరాబాద్ -
ప్రొటీన్లో మార్పుతో రేడియో ధార్మికత నుంచి రక్షణ!
కేన్సర్కు అందుబాటులో ఉన్న చికిత్సల్లో రేడియో ధార్మికత ఒకటి. ఈ పద్ధతితో వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుందన్న మాట నిజమైనప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. కేన్సర్ కణాలతోపాటు ఆరోగ్యకరమైన కణాలు కూడా రేడియో ధార్మికత కారణంగా నాశనం కావడం దీనికి కారణం. ఈ సమస్యను అధిగమించేందుకు స్పెయిన్కు చెందిన సీఎన్ఐఓ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మన పేగుల్లోని ఒక ప్రొటీన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా రేడియోధార్మికత దుష్ప్రభావాల నుంచి రక్షణ పొందవచ్చునని వీరు అంటున్నారు. ఎలుకలపై తాము జరిపిన పరిశోధనలు దీనికి రుజువని చెబుతున్నారు. ఈ పద్ధతి కేన్సర్ రోగులకు మాత్రమే కాకుండా అణు ప్రమాదాల బాధితులు, భవిష్యత్తులో సుదూర గ్రహాలకు వెళ్లే వ్యోమగాములకూ ఉపయోగపడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఆల్ముడెనా ఛావెజ్ ప్రెజ్ తెలిపారు. రేడియోధార్మికత కారణంగా నాశనమైన పేవు కణాలతోపాటు యుఆర్ఐ ప్రొటీన్ ఎక్కువగా కనిపించిన నేపథ్యంలో తాము దానిపై పరిశోధనలు చేపట్టామని ఆయన తెలిపారు. ఈ ప్రొటీన్ ఉత్పత్తిని నియంత్రించిన ఎలుకలను, సాధారణమైన వాటిని తీసుకుని రెండింటినీ రేడియోధార్మికతకు గురిచేసినప్పుడు మొదటి రకం ఎలుకలు 70 శాతం మరణించాయని, ఎక్కువ ప్రొటీన్ను ఉత్పత్తి చేసిన ఎలుకలన్నీ చికిత్సను తట్టుకోగలిగాయని వివరించారు. పేగు మూలల్లో ఉన్న మూలకణాలను ప్రేరేపించడం ద్వారా ఈ ప్రొటీన్ కణాలకు రక్షణ కల్పిస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. కేన్సర్కు కొత్త, నిరపాయకరమైన చికిత్సలు అందించేందుకు తమ పరిశోధన ఉపకరిస్తుందని.. వివరాలు సైన్స్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయని ప్రెజ్ తెలిపారు. -
మా బాబు ముఖం ఉబ్బుతోంది...తగ్గేదెలా?
మా బాబు వయసు తొమ్మిదేళ్లు. ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు ముఖం, కాళ్లు వాపు వచ్చాయి. యూరిన్లో ప్రోటీన్స్ పోయాయనీ, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని చెప్పి చికిత్స చేశారు. నెలరోజులు మందులు వాడిన తర్వాత యూరిన్లో ప్రోటీన్ పోవడం తగ్గింది. మందులు ఆపేశాము. మళ్లీ 15 రోజుల తర్వాత యూరిన్లో మళ్లీ ప్రోటీన్లు పోవడం ప్రారంభమైంది. మళ్లీ మందులు వాడితే ప్రోటీన్లు పోవడం తగ్గింది. మందులు వాడినప్పుడల్లా తగ్గి, ఆపేయగానీ యూరిన్లో మళ్లీ ప్రోటీన్లు పోతున్నాయి. అయితే ఎక్కువకాలం మందులు వాడితే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందా అని ఆందోళనగా ఉంది. వాటివల్ల ఏవైనా సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలూ ఉన్నాయా? నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్నప్పుడు మొదటిసారి పూర్తిగా మూడు నెలల పాటు డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. కొంతమంది పిల్లల్లో మందులు మానేయగానే మళ్లీ ప్రోటీన్ పోవడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పిల్లల్లో తక్కువ మోతాదులో మందులను ఆర్నెల్ల నుంచి తొమ్మిది నెలల పాటు వాడాల్సి ఉంటుంది. కొంతమందిలో సైడ్ఎఫెక్ట్స్ కనిపించే అవకాశం ఉంటుంది. అప్పుడు వేరే మందులు వాడాల్సి ఉంటుంది. చాలామంది పిల్లల్లో ఈ వ్యాధి 12–14 సంవత్సరాల వయసప్పుడు పూర్తిగా నయమవుతుంది. కిడ్నీలు దెబ్బతినే అవకాశం చాలా తక్కువ. మీరు ఆందోళన పడకుండా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడండి. తరతూ మూత్రంలో మంట... ఎలా తగ్గుతుంది? నా వయసు 36 ఏళ్లు. తరచూ జ్వరం వస్తోంది. మూత్రవిసర్జన సమయంలో మంటతో బాధపడుతున్నాను. మందులు వాడినప్పుడు తగ్గుతోంది. నెలలోపు మళ్లీ జ్వరం వస్తోంది. ఇలా పదే పదే జ్వరం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు తరచూ జ్వరం, మూత్రంలో ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే, అది మళ్లీ మళ్లీ రావడానికి గల కారణాలు ఏమిటో ముందుగా నిర్ధారణ చేసుకోవాలి. షుగర్ ఉంటే కూడా ఇలా కొన్ని సందర్భాల్లో కావచ్చు. ఒకసారి షుగర్ పరీక్ష చేయించుకోండి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని మూత్రవిసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లు ఉన్నాయేమో చూడాలి. యాంటీబయాటిక్స్ పూర్తి కోర్సు వాడకపోతే కూడా ఇన్ఫెక్షన్స్ ఇలా తిరగబెడతాయి. ఒకవేళ యాంటీబయాటిక్స్ పూర్తికోర్సు వాడకపోతే డాక్టర్ చెప్పిన మోతాదులో మూడు నెలల పాటు అవి వాడాలి. ఇన్ఫెక్షన్స్ తరచూ తిరగబెట్టకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు (రోజూ రెండు నుంచి మూడు లీటర్లు) తాగుతుండాలి. మూత్రవిసర్జనను ఆపుకోకూడదు. ఒకసారి మీరు డాక్టర్కు చూపించుకోండి. మూత్రం ఎర్రగా వస్తోంది? భవిష్యత్తులో సమస్యా? నాకు 34 ఏళ్లు. అప్పుడప్పుడూ మూత్రం ఎర్రగా వస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఇలా జరుగుతోంది. రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందా? కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? మీరు చెప్పినట్లుగా మూత్రంలో రక్తం చాలాసార్లు పోతుంటే... ఎందువల్ల ఇలా జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి తగినట్లుగా చికిత్స తీసుకోవాలి. ఇలా మాటిమాటికీ మూత్రంలో రక్తస్రావం అవుతుండటానికి కిడ్నీలో రాళ్లు ఉండటం, ఇన్ఫెక్షన్ ఉండటం, కిడ్నీ సమస్య లేదా మరేదైనా కిడ్నీ సమస్య (గ్లోమెరూలో నెఫ్రైటిస్ వంటిది) ఉండవచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోండి. మూత్రపరీ„ కూడా చేయించుకోవాలి. కిడ్నీలో రాళ్లుగానీ, ఇన్ఫెక్షన్ గానీ లేకుండా ఇలా రక్తం వస్తుంటే మూత్రంలో ప్రోటీన్ పోతుందేమోనని కూడా చూడాలి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఒకవేళ రక్తంతో పాటు ప్రోటీన్ కూడా పోతుంటే కిడ్నీ బయాప్సీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలు దెబ్బతినకుండా ఉండేందుకు మందులు వాడాల్సి ఉంటుంది. డయాలసిస్ తర్వాత చర్మంపై దురద... ఏం చేయాలి? నా వయసు 42 ఏళ్లు. ఒక ఏడాదిగా క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నాను. నాకు ఈమధ్య విపరీతంగా చర్మం దురద పెడుతోంది. ఎందుకిలా జరుగుతోంది? దురద రాకుండా ఉండటానికి ఏం చేయాలి? డయాలసిస్ చేయించుకునే పేషెంట్స్లో చర్మం పొడిగా అవుతుంది. అంతేకాకుండా వాళ్ల రక్తంలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటంవల్ల కూడా దురద ఎక్కువగా వస్తుంటుంది. చర్మం పొడిగా ఉన్నవాళ్లు స్నానం తర్వాత చర్మంపై వాజిలేన్ లేదా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. రక్తంలో ఫాస్పరస్ తగ్గించే మందులు తీసుకోవడంతో పాటు ఆహారంలో పాల ఉత్పాదనలు, మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. రక్తహీనత ఉన్నవాళ్తు రక్తం పెరగడానికి మందులు వాడాలి. డాక్టర్ విక్రాంత్రెడ్డి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
పాపకు నత్తి వస్తోంది... తగ్గేదెలా?
మా పాపకు పదేళ్లు. చదువులో ముందుంటుంది. కానీ మాట్లాడుతుంటే కొద్దిగా నత్తిగా వస్తుంటుంది. డాక్టర్ను కలిస్తే అంతా మామూలు అయిపోతుంది. మాటలు చక్కగానే వస్తాయి, కాకపోతే కాస్త ఆలస్యంగా కావచ్చు. అయితే మా పాప కంటే చిన్నవాళ్లు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మా అమ్మాయి చక్కగా మాట్లాడాలంటే మేమేం చేయాలో సలహా ఇవ్వండి. ఉచ్చారణ విషయంలో మీ పాపకు ఉన్న సమస్యను స్టామరింగ్ లేదా స్టట్టరింగ్ అంటారు. ఈ కండిషన్ ఉన్న పిల్లలు ఒక పదాన్ని ఉచ్చరించే ముందు అదేమాటను పదే పదే పలుకుతూ ఉండటం, లేదా గబుక్కున అనలేక దాన్ని పొడిగించడం, ఒక్కోసారి మాట ఆగిపోవడం కూడా జరగవచ్చు. మన జనాభాలో దాదాపు ఒక శాతం మందికి ఈ సమస్య ఉంటుంది. ఇది అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువ. ఈ సమస్యకు నిర్దిష్టంగా ఇదే కారణం అని చెప్పలేకపోయినా... జన్యుపరమైన, న్యూరోఫిజియలాజికల్ మార్పుల వల్ల ఒక్కోసారి ఈ సమస్య రావచ్చు. ఇలాంటి పిల్లల్లో కొందరికి వినికిడి సమస్య కూడా ఉండవచ్చు. కాబట్టి పై సమస్యలు ఉన్నాయా లేదా అని పరీక్షించడం చాలా ముఖ్యం. పిల్లల మానసిక స్థితిని సరిగ్గా అర్థం చేసుకోకుండా వారిని ఇతరులతో పోల్చిచూడటం, బాగా రాణించాలని కోరుతూ ఒత్తిడి పెంచడం వంటి కారణాలతో స్టామరింగ్ ఇంకా ఎక్కువ కావచ్చు. మాటలు నేర్చుకునే వయసు పిల్లల్లో స్టామరింగ్ అన్నది చాలా సాధారణంగా కనిపించే సమస్య. అయితే వాళ్లలో వయసు పెరుగుతున్నకొద్దీ సమస్య తగ్గుతూ ఉంటుంది. పిల్లల్లో ఒకవేళ స్టామరింగ్ ఉంటే... ఐదేళ్లు వచ్చేనాటికి 65 శాతం మంది పిల్లల్లో, యుక్తవయసు వచ్చేదానికి ముందర (అర్లీ టీన్స్లో) 75 శాతం మందిలో ఈ సమస్య తగ్గిపోతుంది. ఇలాంటి పిల్లల్లో వాళ్లు చెప్పేది పూర్తిగా వినడం తల్లిదండ్రుల బాధ్యత. వాళ్లను తొందరపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. వాళ్లు చెప్పదలచుకున్నది పూర్తిగా చెప్పేలా ప్రోత్సహించడం అవసరం. ఇలాంటి పిల్లలకు నిర్దిష్టంగా ఒకే ప్రక్రియతో సమస్య మటుమాయం అయ్యేలా చేయడం జరగదు. కొన్ని మందులు వాడుకలో ఉన్నా వాటి వల్ల అంతగా ప్రయోజనం లేదు. స్పీచ్ ఫ్లుయెన్సీ, స్టామరింగ్ మాడిఫికేషన్ వంటి స్పీచ్థెరపీ ప్రక్రియల ద్వారా మీ పాపకు సమస్య చాలావరకు నయమవుతుంది. మీరు మొదట స్పీచ్ థెరపిస్ట్ కలిసి తగు చికిత్స తీసుకోండి. బాబుకు గేదెపాలు పట్టించవచ్చా? మా బాబు వయసు నెల రోజులు. తల్లికి పాలు పడకపోవడంతో ఆమె దగ్గర తగినన్ని పాలు లేవు. దాంతో గేదెపాలు పట్టిస్తున్నాం. ఇంత చిన్న బాబుకు గేదెపాలు తాగించవచ్చా? దీనివల్ల బాబుకి ఏమైనా సమస్యలు ఎదురవుతాయా? నెలల బిడ్డకు గేదె పాలు పట్టించడం అంత మంచిదికాదు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం... పోతపాల (యానిమల్ మిల్క్)పై పెరిగే పిల్లల్లో కడుపునొప్పి వంటి ఉదరసంబంధమైన సమస్యలు, ఆస్తమా వంటి అలర్జిక్ వ్యాధులు, చెవి ఇన్ఫెక్షన్లు, స్థూలకాయం వంటి అనేక సమస్యలు రావచ్చని, ఆ సమస్యలకు ఇలా గేదె పాలు పట్టడం కూడా ఒక కారణమని తెలుస్తోంది. పైగా ఇటీవల పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి అనేక హార్మోన్లు, మందులు, యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తున్నారు. వీటి ఫలితంగా పిల్లల దీర్ఘకాలిక ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం కనిపిస్తోంది. కాబట్టి పోతపాలు, సురక్షితం కాని పాలు (అన్పాష్చరైజ్డ్ మిల్క్) పిల్లలకు ఇవ్వడం సరికాదు. ఇక తల్లి పాలు ఇవ్వలేని తప్పనిసరి పరిస్థితుల్లో (అంటే లాక్టోజెన్ ఇన్టాలరెన్స్, ప్రోటీన్ ఇన్టాలరెన్స్ వంటి సమస్యలు ఉన్నప్పుడు) మార్కెట్లో దొరికే కొన్ని స్పెషల్ ఫార్ములా ఫీడ్స్ ఉపయోగించవచ్చు. కానీ వీటన్నింటికంటే తల్లిలోనే పాలు పెరిగేలా స్వాభావిక విధానాలు (ప్రోటీన్లు పుష్కలంగా ఉంటే పుష్టికరమైన ఆహారం ఇవ్వడం వంటివి) అనుసరించడం మంచిది. ఇక తప్పనప్పుడు డాక్టర్ సలహా మేరకు తల్లిలో పాలు పెరిగేందుకు కొన్ని మందులు ఉపయోగించాల్సి ఉంటుంది. పిల్లలకు తల్లిపాలే శ్రేయస్కరం. మీరు మరొకసారి మీ గైనకాలజిస్ట్ను కలిసి రొమ్ముకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నాయేమో పరీక్షించుకోండి. వాటికి చికిత్స తీసుకుని తల్లిపాలే పట్టడానికి ప్రయత్నించండి. అదేమీ సాధ్యం కానప్పుడు మాత్రమే ఫార్ములా ఫీడ్స్ వెళ్లాల్సి ఉంటుంది. డా. రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్,రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ,హైదరాబాద్ -
వేసవిలో కేశాల ఆరోగ్యం కోసం...
కేశాలను క్రమంగా కత్తిరించండి వేసవిలో సాధారణంగా జుట్టు పొడిగా నిర్జీవంగా తయారు అవుతుంది, ఈ సమయంలో జుట్టు చివరలను కత్తిరించండి. చూడటానికి అందంగా కనపడటానికి, కేశాలను పావు అంగుళం కత్తిరించండి. ఫలితంగా కేశాలు ఆరోగ్యకరంగా కనిపిస్తాయి. పెరుగుదల కూడా మెరుగుపడుతుంది రెండురోజులకోసారి తలస్నానం వేసవిలో తలపైన చెమట ఎక్కువగా రావటం వలన తలపైన ఉండే చర్మం దుమ్ము ధూళితో నిండిపోయి, చికాకుగా అనిపిస్తుంది. దాంతో చాలామంది తలను రోజు శుభ్రపరుస్తుంటారు. ఇలా రోజూ తలస్నానం చేయడం వల్ల తల పైన ఉండే చర్మం సహజ నూనెలను కోల్పోయి జుట్టు కూడా నిర్జీవంగా కనిపిస్తుంది. అందువల్ల రెండు రోజులకు ఒకసారి తలస్నానం చేయడం మంచిది. కండిషనింగ్ కేశాలకు తరచు షాంపూలను వాడటం వలన ‘రీహైడ్రేషన్’కు గురవకుండా ‘ప్రోటీన్’లతో కూడిన కండిషనర్లను వాడటం మంచిది. అలాగని ఎక్కువ ప్రోటీన్లు ఉన్న కండిషనర్లను వాడరాదు. ఇలా వాడటం వలన కేశాలు పొలుసులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి వారానికి ఒకసారి మంచి కండిషనర్ ఉన్న షాంపూలను వాడటం మంచిది. ఎక్కువగా దువ్వకండి ఎక్కువగా దువ్వటం వలన కేశాలు పాడయ్యే అవకాశం ఉంది. వేసవిలో ఉండే వేడికి తలపైన ఉండే చర్మం తేమని కోల్పోతుంది. దీనికితోడు బాగా దువ్వటం వలన కురులు పెళుసుబారి చిట్లిపోవడం లేదా ఊడిపోవడం జరుగుతుంది. తల స్నానం చేసిన వెంటనే ఫైబర్’తో తయారు చేసిన దువ్వెనలను వాడడం మరింత హానికరం. కాబట్టి వీలయినంత వరకు చెక్కదువ్వెనతో... అదీ కూడా జుట్టు బాగా ఆరిన తర్వాత దువ్వడం మంచిది. మీ కేశాలను కడగటానికి సమయం లేదు కదా అని అశ్రద్ధ చూపకండి, వెంట్రుకల మూలాలు, తలపైన చర్మంలో ఉండే దుమ్ము, నూనెల వలన దురదలు కలుగుతాయి, కొన్ని సమయాల్లో కేశాలు బలహీనంగా మారి వెంట్రుకలు ఉడిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి వారానికి మూడు లేదా కనీసం రెండుసార్లు తలస్నానం చేయడం మంచిది. నిమ్మరసం వాడండి ఒకోసారి అనుకోకుండా ఎండలో ఎక్కువసేపు ఉండవలసి వస్తుంది. అలాంటప్పుడు కేశాలకు కొద్దిగా నిమ్మరసం రాయడం మంచిది. -
ఉపవాసంతో వ్యర్థానికి మోక్షం!
లంఖణం పరమౌషధం అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఆధునిక శాస్త్రం కూడా ఈ విషయాన్ని చాలాసార్లు రుజువు చేసింది కూడా. హార్వార్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనలు కూడా నిరాహారంగా ఉండటం, తరచూ వ్యాయామం చేయడం శరీరంలోని కణ వ్యవస్థను పూర్తిగా చైతన్యవంతం చేస్తుందని గుర్తించారు. ఈ చర్యల ఫలితంగా పాడైపోయిన ప్రొటీన్లను బయటకు పంపేందుకు శరీరానికి మరింత శక్తి లభిస్తుందని పరిశోధన పూర్వకంగా తెలుసుకున్నారు. శరీరాన్ని తనను తాను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు స్వయంగా కొన్ని పనులు చేసుకుంటుంది. చెడిపోయిన ప్రొటీన్లు, కణాలను వదిలించుకోవడం ఇందులో భాగం. అయితే కొన్నిసార్లు ఈ వ్యవస్థలు సక్రమంగా పనిచేయక వ్యాధులు వస్తూంటాయి. ప్రొటీన్ను ఒక నిర్దిష్ట పద్ధతిలో మడతపెట్టడం ద్వారా అవి బయటకు పోకుండా పోగుబడుతూంటాయని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఈ ప్రక్రియను నియంత్రించే మార్గాలను అన్వేషిస్తున్నారు. వ్యాయామం, ఉపవాసం వంటి చర్యల వల్ల శరీరంలో జరిగే హార్మోన్ మార్పులు కణాలపై ప్రభావం చూపుతున్నాయని... పాడైన ప్రొటీన్లను బయటకు పంపే వ్యవస్థను చైతన్యవంతం చేస్తున్నాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వెట్ప్లాంక్ తెలిపారు. సైక్లింగ్ వ్యాయామం చేసే కొందరిపై పరీక్షలు జరిపినప్పుడు పాడైన ప్రొటీన్లు వేగంగా నశించిపోతున్నట్లు గుర్తించారు. -
చేపల వినియోగం పెరగాలి
సాక్షి, హైదరాబాద్: పౌష్టికాహారమైన చేపల వినియోగాన్ని పెంచేందుకు జాతీయ చేపల అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్డీబీ) నిరంతరం కృషి చేస్తోందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఐఏఎస్ అధికారి రాణికుముదిని తెలిపారు. శరీరానికి కావాల్సిన ఆవశ్యక ప్రొటీన్లను అందించే చేపలు మెరుగైన ఆహారమన్నారు. వీటిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, చేపల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పలు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. చేపలు తింటే ముళ్లు గొంతులో ఇరుక్కుంటాయని, ఇతర అపోహలు ప్రజల్లో ఉన్నాయని.. ఇలాంటి వాటిని పోగొట్టేందుకు జాతీయ స్థాయిలో పలు ఫిష్ ఫెస్టివల్స్ను నిర్వహిస్తునట్లు పేర్కొన్నారు. 2018 జూలైలో విశాఖపట్నంలో తొలిసారిగా ఫిష్ ఫెస్టివల్ నిర్వహించామని, దీనికి అద్భుతమైన స్పందన వచ్చిందని చెప్పారు. ఈ ఏడాది తొలి ఫిష్ ఫెస్టివల్ను హైదరాబాద్లోని నెక్లెస్రోడ్డులో ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో పాల్గొనే వారికి స్టాల్స్ కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. మాంసం విక్రయాలు 93 శాతం.. తెలంగాణలో చేపల వినియోగం మొదటి నుంచి తక్కువగానే ఉందని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. చికెన్, మటన్ వినియోగం ఏకంగా 93 శాతం ఉందన్నారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిలో భాగంగానే రూ. 50 కోట్ల విలువైన పరికరాలు పంపిణీ చేసిందన్నారు. ముళ్లు లేని చేపల మాంసాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసిందని వెల్లడించారు. నగరంలో 15 మొబైల్ ట్రక్కుల్లో డీ బోనింగ్ (ముళ్లు, చర్మం తొలగించినవి) చేపలను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇవి సఫలీకృతం కాగానే రాష్ట్రమంతా విస్తరిస్తామని తెలిపారు. -
ఆ గట్టు నుంటావా ఈ గట్టు కొస్తావా..
పప్పన్నం తినమంటే ముఖం అదోలా పెడతాం. అదే బంగాళ దుంపల వేపుడు అయితే ఇష్టంగా లాగించేస్తాం. వేపుళ్లు, అందులోనూ బంగాళాదుంప వినియోగం భారత్లో ఎక్కువగా ఉంటోందని ‘ఈట్–లాన్సెట్ కమిషన్’ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఇది ఏమాత్రం దీర్ఘకాల ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరించింది. భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా భారత ప్రజలు ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని స్పష్టం చేసింది. తరచుగా భారతీయులు అనారోగ్యం పాలవడానికి కారణం శరీరానికి అవసరమైన స్థాయిలో ప్రొటీన్లు తీసుకోకపోవడమే కారణమని నివేదికలో పేర్కొంది. భారత్ సహా ప్రపంచదేశాలన్నీ ఆహారపు అలవాట్లను మార్చుకుంటే ఏటా 1.1కోట్ల ముందస్తు మరణాలను అరికట్టవచ్చని లాన్సెట్ మెడికల్ మ్యాగజైన్లో పేర్కొంది. చేపలు, మాంసం తగ్గిస్తేనే! మాంసాహారం, షుగర్ వినియోగాన్ని సగానికి సగం తగ్గించాల్సిందేనని నివేదిక పేర్కొంది. పళ్లు, గింజలు, కూరగాయలు తినడాన్ని రెట్టింపు చేయాలని చెబుతోంది. భారతీయులు బంగాళ దుంపలను ఎక్కువగా తింటున్నారని.. వీటి వాడకాన్ని వీలైనంత తగ్గించాలని సూచించింది. ‘భారత్లో అవసరానికంటే 1.5 రెట్లు ఎక్కువగా బంగాళ దుంపలు తింటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వీటి బదులుగా ప్రొటీన్లను తీసుకోవడంపై దృష్టిపెట్టాలి. పప్పులు, గింజలు, పళ్లు మొదలైన శాకాహార ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. చేపలు, మాంసం వంటివి ఎంత మితంగా తింటే అంత మంచిది’ అని లాన్సెట్ కమిషన్ సభ్యుడు, న్యూఢిల్లీకి చెందిన పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. భారత్లో పప్పులు, కూరగాయలు, పండ్ల సాగు, వినియోగం విస్తృతంగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. చక్కెర వినియోగాన్ని అరికట్టడంపై ప్రపంచదేశాలన్నీ ఏకమై ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. భూమండలమూ సురక్షితం ఈట్–లాన్సెట్ కమిషన్ పరిశోధనలో భాగంగా.. 16 దేశాలకు చెందిన 37 మంది శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు కలిసి మూడేళ్ల పాటు ప్రపంచ ఆహార అలవాట్లను అధ్యయనం చేశారు. మొత్తంమీద మాంసాహారం వినియోగాన్ని తగ్గించి శాకాహారాన్ని తినడం వల్ల ఈ భూగోళాన్ని కాపాడుకోగలమని కమిషన్కు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జాన్ రాక్స్టామ్ అన్నారు. అదనపు భూమిని వినియోగించుకోకుండా, జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటూ, నీటి వాడకాన్ని తగ్గించుకుంటూ, కర్బన ఉద్గారాల విడుదలను అరికట్టేవిధంగా ప్రపంచ జనాభా ఆహార అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ సమతుల ఆహారం తీసుకుంటేనే పర్యావరణం పరిరక్షణ జరుగుతుందని ఆయన వివరించారు. ఈ పరిశోధనల ఆధారంగా వీరు రూపొందించిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. - మనం ఎలాంటి ఆహారాన్ని తింటున్నాం అనేదే కాదు, అదెక్కడి నుంచి వచ్చిందో అన్నది కూడా ముఖ్యమే. - మాంసం, పాల ఉత్పుత్తుల వాడకాన్ని తగ్గించి, శాకాహారాన్ని అధికంగా తీసుకుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు.. భూగోళం కూడా పచ్చగా ఉంటుంది. - మొక్కల నుంచి వచ్చే గింజలు, కూరగాయలు, పండ్ల వినియోగం 100% పెంచాలి. మాంసం, షుగర్ వాడకాన్ని 50%తగ్గించాలి. - మాంసం వినియోగం పెరిగే కొద్దీ గ్రీన్ హౌస్ ఉద్గారాలు పెరుగుతాయి. - మాంసాహారం తినడం వల్ల వచ్చే వ్యాధుల్ని అరికట్టేందుకు యాంటీబయాటిక్స్ను ఎక్కువగా వినియోగించాల్సి వస్తుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. - ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ఆకలితో మాడుతుంటే.. ఆహారపు అలవాట్లు సరిగా లేని వారు 200 కోట్ల వరకు ఉన్నారు. - కేవలం ఆహారపు అలవాట్ల కారణంగానే ఏటా ప్రపంచవ్యాప్తంగా కోటి మందికిపైగా చనిపోతున్నారు. - గత ఏభై ఏళ్లుగా ఆహార అలవాట్లలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. - కేలరీలు ఎక్కువగా ఉన్న తిండి తింటున్నాం. ప్రతీ రోజూ సగటున 2,500 కేలరీల ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి తీసుకోవడం వల్ల ప్రపంచ దేశాలు ఊబకాయం సమస్యని ఎదుర్కొంటున్నాయి. - ఉత్తర అమెరికా వంటి దేశ్లాలో మాంసాన్ని అవసరమైన దాని కంటే 6 రెట్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. అదే దక్షిణాసియా దేశాల్లో తినాల్సిన దానికంటే 50% తక్కువగా మాంసం తింటున్నారు. - 2050కి జనాభా 1000 కోట్లకు చేరుకోవచ్చు నని అంచనా, వారందరి కడుపు నిండాలంటే ప్రస్తుతం ఉన్న ఆహార అలవాట్లను అందరూ తప్పనిసరిగా మార్చుకోవాల్సిందే. - ఆహారపు అలవాట్లు మారేలా ప్రభుత్వాల విధానాలు కూడా మారాలి. ప్రజల ఆరోగ్యానికి హాని చేసే ఆహారాపదార్థాలపై కొత్త పన్నులు విధించాలి. వాటి అమ్మకంలో పరిమితులు విధించాలి. ఇంకా అవసరమైతే వాటిని నిషేధించాలి. -
కేన్సర్పై పోరాటానికి ప్రొటీన్ సిద్ధమైంది
దుష్ప్రభావాలు ఏమీ లేకుండానే కేన్సర్కు చికిత్స కల్పించాలన్న శాస్త్రవేత్తల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇందుకోసం ఒక ప్రొటీన్ను కృత్రిమంగా సిద్ధం చేశారు. రోగ నియంత్రణ వ్యవస్థలో కీలకమైన ఇంటర్ల్యూకిన్ –2 (ఐఎల్–2) కేన్సర్తోపాటు మధుమేహం, ఆర్థరైటిస్ వంటి అనేక ఆటోఇమ్యూన్ వ్యాధులకు చికిత్స కల్పించగలదు. అయితే దుష్ప్రభావాలు చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన ప్రొటీన్ డిజైన్ విభాగం కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా ఐఎల్–2 ను పోలిన కృత్రిమ ప్రొటీన్ను డిజైన్ చేశారు. జంతువుల్లో జరిగిన ప్రయోగాల్లో ఈ కృత్రిమ ప్రొటీన్ కేన్సర్ కణాలపై దాడి చేయగల టీ– కణాలను చైతన్యవంతం చేసినట్లు స్పష్టమైంది. అంతేకాదు.. నియో –2/15 అని పిలిచే ఈ కృత్రిమ ప్రొటీన్ ఇంటర్ల్యూకిన్ –15 ప్రొటీన్లా కూడా పనిచేస్తుంది. శాస్త్రవేత్తలు దాదాపు 30 ఏళ్లుగా ఐఎల్–2ను సురక్షితంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. నియో –2/15 ద్వారా ఇది సాధ్యమవుతోందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డేయిన్ అడ్రియానో సిల్వా తెలిపారు. అన్నీ సవ్యంగా సాగితే నియో –2/15 ద్వారా కేన్సర్కు మరింత మెరుగైన, దుష్ప్రభావాలు ఏవీ లేని చికిత్స అందుతుందని అంచనా -
రెండు మందులతో కేన్సర్కు చెక్!
కేన్సర్ చికిత్సకు వాడే రెండు మందులను వేర్వేరుగా కాకుండా కలిపి వాడటం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందని అంటున్నారు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. ఈ రెండు మందుల్లో ఒకటి రైబోన్యూక్లియస్కు సంబంధించింది.. రెండోది ప్రొటీన్ కైనేస్ ఇన్హిబిటర్. కేన్సర్కు సమర్థమైన చికిత్సగా భావిస్తున్న రైబో న్యూక్లియస్ మందులు మానవ కణాల నుంచి తయారవుతాయి. వీటి పని చాలా సింపుల్. మనకు అవసరం లేని కణాల పోగులను, వైరస్లను బయటికి పంపించడమే! ఈ సామర్థ్యాన్ని కేన్సర్కు విరుగుడుగా వాడేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకోవైపు ప్రొటీన్ కైనేస్ ఎంజైమ్లు కణ విభజన ప్రక్రియ నెమ్మదించేలా చేస్తాయి. ఈ రెండు మందులు వేర్వేరుగా కేన్సర్పై ప్రభావం చూపుతున్నప్పటికీ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ రెండింటిని కలిపి కొన్ని రకాల కేన్సర్లకు వాడారు. తక్కువ మోతాదుతోనే మెరుగైన ఫలితాలు కనపడటంతో ప్రస్తుతం వారు ఎలుకలపై ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
ఆ ప్రొటిన్తో కొవ్వు ఖాళీ!
ఊబకాయాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి ఓ శుభవార్త. సహజసిద్ధమైన ప్రొటిన్ సాయంతోనే శరీరంలోని కొవ్వులను మూడొంతుల వరకూ తగ్గించవచ్చునని జార్జ్టౌన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిరూపించడం దీనికి కారణం. ఎలుకలపై జరిగిన పరిశోధనల్లో బీపీ3 అని పిలిచే ఈ ప్రొటిన్ కేవలం 18 రోజుల్లో కొవ్వులను కరిగించినట్లు తెలిసింది. కొవ్వులను తగ్గించడంతోపాటు జీవక్రియలకు సంబంధించిన ఇతర జబ్బులకూ సహజసిద్ధమైన ప్రొటీన్ ద్వారా మెరుగైన చికిత్స కల్పించేందుకు ఈ పరిశోధన ఉపకరిస్తుందని అంచనా. బీపీ3 సహజమైన ప్రొటిన్ కావడం వల్ల దీనిపై నేరుగా పరిశోధనలు నిర్వహించేందుకు అవకాశముందని, తద్వారా ఈ ప్రొటిన్ ఆధారిత మందు వేగంగా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆంటన్ వెల్స్టీన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. కేన్సర్పై పరిశోధనలు చేస్తూండగా తమకు ఈ ప్రొటీన్ కొవ్వులను కరిగించేందుకు ఉపయోగపడుతుందని తెలిసిందని ఆయన చెప్పారు. -
ఫ్యాట్కిన్స్ డైట్
1972లో ఒక పుస్తకం సంచలనం రేపింది.డాక్టర్ ఆట్కిన్ అనే ఆయన ‘ఆట్కిన్స్ డైట్’ పేరుతో ఆ పుస్తకం రాసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. బరువు తగ్గడానికి ఇది శ్రేష్టమైన మార్గమనిసూచించాడు.ఆచరించినవాళ్లు అవునని అన్నారు.మీరూ ఆచరించి చూడండి... ఫ్యాట్తో ఫ్యాట్ని కిల్ చేసే ఈ డైట్ని పరిశీలించి చూడండి. బరువు తగ్గడానికి సమర్థంగా సహకరించే డైట్ ప్రక్రియల్లో ఆట్కిన్స్ డైట్ ఒకటి. ఇది తక్కువ పిండిపదార్థాలు ఎక్కువ ప్రొటీన్లు, కొవ్వులు ఉన్న డైట్ ప్రక్రియ. డాక్టర్ రాబర్ట్ సి. ఆట్కిన్ అనే ఫిజీషియన్ 1972లో రాసిన ఒక పుస్తకంలో దీన్ని పొందుపరచాడు. ఆ పుస్తకం ఆనాటి బెస్ట్ సెల్లర్గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఈ ఆహార ప్రక్రియలను అంతో ఇంతో తమ తమ ప్రాంతాలకు అనుగుణంగా, అనువుగా మార్చుకుని ప్రయోజనం పొందారు. ఈ ఆహార ప్రక్రియలోని ప్రధాన ప్రిన్సిపుల్ స్వాభావికమైన కొవ్వులైన నెయ్యి వంటి శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ను ఎంతైనా తీసుకోమని చెప్పడం. ఎందుకంటే అవి అంత హానికరం కాదు. మార్కెట్ లో దొరికే లో–ఫ్యాట్ డైట్స్ కంటే ఇలాంటి శాచ్యురేటెడ్ కొవ్వులే రక్తంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచడం, చెడు కొలెస్ట్రాల్ను పరిమితం చేయడం ద్వారా గుండెజబ్బులను నివారిస్తాయి. బరువును తగ్గిస్తాయి. ఈ ఆహార విధానంలోని మరో ముఖ్యాంశం పిండిపదార్థాలను తగ్గించడం. దీని వల్ల బరువు తగ్గుతారు. ఎందుకంటే పిండిపదార్థా లతో ఎంతోసేపటికి గానీ తృప్తి కలగదు. అదే ప్రొటీన్లు తినడం వల్ల త్వరగా తృప్తి కలుగుతుంది. దాంతో కార్బోహైడ్రేట్లను తగ్గించడం వల్ల ప్రొటీన్లను ఒంటికి అవసరమైనంతే తినడంతో ఆటోమేటిగ్గా బరువు తగ్గుతారు. ఆట్కిన్స్ ౖడైట్ అనుసరించేవారు నాలుగు దశల్లో దీన్ని అమలు పరచవచ్చు. అవి... ►మొదటి దశలో (దీన్ని ఇండక్షన్ దశ అంటారు): రోజుకు కేవలం 20 గ్రాముల కంటే తక్కువ పిండిపదార్థాలను (అంటే ఆకుకూరలు, కాయ గూరలను) మాత్రమే తీసుకుంటూ రెండు వారాలు కొనసాగించాలి. ఈ సమయంలో ఎక్కువ ప్రొటీన్, ఎక్కువ కొవ్వులు ఉండే మాంసాహారాలు రోజుకు మూడుపూటలా తీసు కోవచ్చు. ►రెండో దశలో (దీన్ని బ్యాలెన్సింగ్ దశ అంటారు) : ఇప్పుడు రెండువారాలుగా తీసుకునే ఆహారానికి మెల్లగా నట్స్, డ్రైఫ్రూట్స్, పండ్లు వంటి వాటిని జతచేయవచ్చు. ఇలా మరో రెండు వారాలు కొనసాగించాలి. ►మూడో దశలో (దీన్ని ఫైన్–ట్యూనింగ్ దశ అంటారు) : ఇందులో మీరు కోరుకున్న లక్ష్యానికి చేరువ అవుతూ చాలావరకు బరువు తగ్గుతారు. అప్పుడు మీ ఆహారానికి మరికొన్ని కార్బో హైడ్రేట్లను చేర్చవచ్చు. ►నాలుగో దశలో (దీన్ని నిర్వహణ దశ లేదా మెయింటెనెన్స్ దశ అంటారు): ఇక ఇప్పటి నుంచి మీరు ఆరోగ్యకరమైన పిండిపదార్థాలను మాత్రమే తీసుకుంటూ ఉన్నప్పటికీ ఎలాంటి పైన పేర్కొన్న మూడు దశల్లోని హై–ప్రొటీన్లు, ఎక్కువ కొవ్వులు తీసుకుంటున్నా బరువు పెరగకుండా స్థిరంగా ఉంటారు. ఒక సూచన : ఇక్కడ పేర్కొన్న దశలు పాటించడానికి కాస్త సంక్లిష్టంగానే ఉంటాయి. అందుకే కొంతమంది ఇండక్షన్ దశలోకి వెళ్లకుండానే నేరుగా రెండో దశ నుంచి ప్రారంభిస్తారు. అయితే కొంతమంది మాత్రం ఎంతకూ ఇండక్షన్ దశలోనే ఉండిపోతారు. ఈ ఆట్కిన్స్ డైట్ ప్రభావవంతంగా పనిచేసే ప్రక్రియే. ఇది ఇంచుమించూ కాస్త కీటోజెనిక్ డైట్ ప్రక్రియకు దగ్గరగా ఉంటుంది. ఆట్కిన్స్ ప్రక్రియలో దూరంగా ఉండాల్సిన ఆహారాలు : ►చక్కెరలు : శీతల పానీయాలు, పళ్లరసాలు, కేకులు, క్యాండీలు, ఐస్క్రీములు. ► ధాన్యాలు : గోధుమలు, రే, బార్లీ, వరి. ► వెజిటెబుల్ ఆయిల్స్ : సోయా నూనె, మొక్కజొన్న నూనె, పత్తిగింజల నుంచి తీసిన నూనె (కాటన్ సీడ్ ఆయిల్)... ఇలాంటివే మరికొన్ని. ► కొవ్వులు / ట్రాన్స్ఫ్యాట్స్ : హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ అని పిలిచే ప్రాసెస్ చేసిన నూనెల నుంచి దూరంగా ఉండాలి. ► కార్బ్ డైట్ : ఎక్కువ చక్కెరలు ఉండే కార్బోహైడ్రేట్ డైట్. ► హై–కార్బ్ వెజిటెబుల్స్ : క్యారెట్లు, టర్నిప్లకు దూరంగా ఉండాలి. ► హై–కార్బ్ పండ్లు : అరటిపండ్లు, ఆపిల్స్, నారింజ, పియర్స్, ద్రాక్ష పండ్లకు దూరంగా ఉండాలి. ► పిండి పదార్థాలు (స్టార్చ్) : బంగాళదుంప (ఆలూ), చిలగడదుంపలకు దూరంగా ఉండాలి. (వీటిని ఇండక్షన్ దశలో మాత్రమే తీసుకోవచ్చు) ► లెగ్యూమ్లు : చిక్కుళ్లు, బీన్స్, చిక్పీస్ వంటివాటికి దూరంగా ఉండాలి. (వీటిని ఇండక్షన్ దశలో మాత్రమే తీసుకోవచ్చు) తీసుకోదగిన ఆహారాలు : ఆట్కిన్స్ డైట్లో భాగంగా ఈ కింద పేర్కొన్న ఆహారాలను తీసుకోవచ్చు. ►మాంసాహారాలు : వేట మాంసం, చికెన్ ►చేపలు / సీఫుడ్ : సాల్మన్, సార్డిన్ చేపలు. ► గుడ్లు : ఒమెగా 3– ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న అన్ని ఆరోగ్యకరమైన గుడ్లు. ►తక్కువ పిండిపదార్థాలు ఉండే కూరగాయలు / ఆకుకూరలు : పాలకూర, బ్రాకలీ, అస్పారగాస్ వంటివి. ► కొవ్వులు ఎక్కువగా ఉండేవి: వెన్న, చీజ్, మీగడ, కొవ్వులు తీయని పెరుగు. ►ఎండుఫలాలు / నట్స్ : బాదం, మాకడామియా నట్స్, వాల్నట్, పొద్దుతిరుగుడు గింజలు... మొదలైనవి. ►ఆరోగ్యకరమైన నూనెలు : ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె, అవకాడో నూనె. మీ ఆహారంలో పిండిపదార్థాలు తక్కువగానూ, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, నట్స్ ఎక్కువ గానూ ఉన్నంతకాలం మీరు బరువు పెరిగేందుకు అవకాశం ఉండదు. తీసుకోదగిన పానీయాలు : ఆట్కిన్స్ డైట్ తీసుకుంటున్నప్పుడు తీసుకో దగిన పానీయాలు ఇవి. ►నీళ్లు: మీరు ఎప్పుడు తాగినట్టుగానే నీళ్లు తాగవచ్చు. ►కాఫీ : కొన్ని అధ్యయనాల ప్రకారం కాఫీలో ఆరోగ్యాన్నిచ్చే కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందువల్ల పరిమితంగా కాఫీ తీసుకోవచ్చు. ►గ్రీన్ టీ : ఇది ఎంతో ఆరోగ్యకరమైన పానీయం. మొత్తం మీద ఇలా ఆట్కిన్స్ డైట్ అన్నది బరువు తగ్గడానికి ఒక నమ్మకమైన ప్రక్రియ అనీ, అది చాలావరకు నిరాశ పరచదన్నది నిపుణుల మాట. ఆట్కిన్స్ డైట్లో తీసుకోదగ్గ కూరలతో తమకు ఇష్టమైన రీతిలోనూ తమ సౌలభ్యాన్నీ, తినుబండారాల లభ్యతను బట్టి ఆయా వ్యక్తులు తమ డైట్ తీసుకోవచ్చు. లేదా నిపుణులతో చర్చించి తమకు అనువైన వ్యక్తిగతమైన డైట్ను రూపొందించుకోవచ్చు. అలా చేయలేనప్పుడు ఈ కింద పేర్కొన్న సాధారణ డైట్ ప్లాన్ను అనుసరించవచ్చు. ఈ ప్లాన్లో భాగంగా వారం రోజుల పాటు తీసుకోవాల్సిన డైట్ ఇలా... శాకాహారులకు డైట్ – డైట్ ప్లాన్ ఇక శాకాహారులైతే ఈ కింద పేర్కొన్న ఆహారా లను తమ డైట్ ప్లాన్గా చేసుకోవచ్చు. వీటిని లంచ్ / డిన్నర్ ఆప్షన్గా లేదా ఏ కాంబినేషన్లతో నైనా, ఎలాగైనా ఎంచుకొని మార్చుకుంటూ తీసుకోవచ్చు. అవి... ► రాజ్మా టొమాటో కర్రీ/దీనికి చాలా రకాల ఆకు కూరలు కలుపుకొని సలాడ్గా తీసుకో వచ్చు. ► ఉడికించిన శనగలు / చిక్ పీస్ను రాగి రొట్టెలు లేదా రాగి జావతో తీసుకోవచ్చు. ► ఆలివ్నూనెలో టొమాటోలతో పాటు కాస్తంత వేపిన మొలకెత్తిన పెసర్లు ►అన్ని రకాల గింజల మొలకలను రుబ్బుకొని దోశలా వేసుకోవచ్చు. ఈ దోశను కొబ్బరినూనె లేదా వెన్నలో వేసుకోవచ్చు. ► శనగపిండిలో పాలకూర కలుపుకొని వెన్నలో తేలిగ్గా వేపుకోవచ్చు. ► సజ్జరొట్టె / జొన్నరొట్టెలను సోయాబీన్ టొమాటో కర్రీతో పాటు తీసుకోవచ్చు. ► పనీర్ బుర్జీ ► పాలకూరతో పాటు పెసరతో చేసిన చట్నీ లేదా పెసర పప్పు ► శనగపప్పు + పాలకూర ► పనీర్ టిక్కా (ఇంట్లో చేసుకున్నది) డా. సుధీంద్ర ఊటూరి లైఫ్స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
శాకచక్యంగా తగ్గండి
ఫుడ్డు విషయంలో ప్రపంచంబాగా ఫాస్ట్ అయిపోయింది!అదృష్టం.. మనిమింకా స్లోగా మూవ్ అవుతున్నాం.ఫాస్ట్ అంటే యన్వీ. స్లో అంటే వెజ్. వెజ్ మన ఆరోగ్యానికే కాదు..బరువు తగ్గడానికీ పనికొస్తుంది.ఎలాగంటారా?! శాకల్ని కాస్త చాకచక్యంగా తినాలంతే. బరువు తగ్గడానికి ఉపయోగపడే ఆహారాల్లో ‘వెజిటేరియన్ డైట్’ ఒకటి. మాంసాహారంలో ప్రొటీన్లు ఉన్నా దానివల్ల కొవ్వులు పేరుకుంటాయని రెడ్మీట్ వంటి వాటివల్ల బరువు పెరుగుతుందని, అందుకే శాకాహారమే మంచిదని, దాని వల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యమూ సమకూరుతుందని నిపుణులు చెబుతుంటారు. ఇక ప్రస్తుతం శాకాహారం తినడం సాంస్కృతిక జీవనశైలిగా మారింది. సాటి జీవులను చంపే అధికారం, హింసించే హక్కు లేదంటూ చాలామంది పూర్తిగా శాకాహారానికి మారిపోతున్నారు. మాంసాహరం తామస గుణాన్ని పెంపొందిస్తుందనీ, అదే శాకాహారం అమృతాహారమని చాలామంది పేర్కొంటుంటారు. ‘వెజిటేరియనిజమ్’ను పాటించే మరికొందరైతే జంతువుల నుంచి వచ్చే ఉత్పాదనలైన పాలు, పెరుగులను కూడా నిరసిస్తూ ఉంటారు. ఇలాంటి వారినే ‘వేగన్స్’ అని, వారు ఆచరించే శాకాహార ప్రియత్వాన్ని వేగనిజమ్ అని వ్యవహరిస్తుంటారు. ఈ ధోరణి ఎలా ఉన్నా బరువు తగ్గించడానికి శాకాహారం బాగా ఉపయోగపడుతుందని మాత్రం నిపుణులు చెబుతున్నారు. శాకాహారులలో రకాలు శాకాహారం తినేవాళ్లలో కూడా కొన్ని గ్రూపులు ఉన్నాయి. వీళ్ల ధోరణిని బట్టి వీళ్లకు పేర్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు... లాక్టో–వెజిటేరియన్స్: వీరు మాంసం, చేపలు, చికెన్, గుడ్లు వంటి వాటిని మాత్రమే మాంసాహారంగా పరిగణిస్తుంటారు. జంతువుల నుంచి వచ్చే ఉత్పాదనలైన పాలు, వెన్న, పెరుగు వంటి వాటిని శాకాహారంగా పరిగణిస్తుంటారు. లాక్టో–ఓవో వెజిటేరియన్స్: వీరు పాలను శాకాహారంగా పరిగణిస్తారు. ఓవో–వెజిటేరియన్స్: వీరు గుడ్లను శాకాహారంగా పేర్కొంటారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న గుడ్లలో పిండం ఉండదు కాబట్టి వాటిని శాకాహారంగానే పరిగణిస్తారు. గుడ్లలోని ల్యూటిన్తోబరువు తగ్గుతుందన్నది తెలిసిందే. వేగన్స్: వీరు జంతువుల నుంచి లభించే ఎలాంటి ఉత్పాదననైనా మాంసాహారంగానే పరిగణిస్తారు. మాంసం, చేపలు, గుడ్లను మాత్రమేగాక పాలు, పెరుగు వంటి వాటిని కూడా మాంసాహారంగానే చూస్తారు. వాటిని ముట్టుకోరు. ఫ్లెక్సిటేరియన్స్: వీరు వీలైనంత వరకు జంతువులను చంపకుండా, హింసించకుండా లభ్యమయ్యే జంతు ఉత్పాదనలను మాత్రం తీసుకుంటూ, వాటికి హాని చేకూర్చడం వల్ల లభ్యమయ్యే ఆహారాన్ని పూర్తిగా పరిహరిస్తున్నారు. వీరికి శాకాహార ప్రియత్వం ఉన్నా వీలును బట్టి జంతువుల నుంచి లభ్యమయ్యే ఉత్పాదనలను తింటారు కాబట్టి తమను తాము ఫ్లెక్సిటేరియన్స్గా పేర్కొంటున్నారు. వీరిలో కొందరు చేపలను శాకాహారంగానే పరిగణిస్తారు. చేపల్లో ఉండే తక్కువ కొవ్వుతో పాటు ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ బరువు పెరగకుండా తోడ్పడతాయి. శాకాహారం బరువును ఎలా తగ్గిస్తుందంటే... కాయగూరల్లో (ఉదాహరణకు సొరకాయ, బీరకాయ వంటివి) నీటిశాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరల్లో పీచు పాళ్లు ఎక్కువ. మాంసాహారంతో పోలిస్తే శాకాహారం త్వరగా కడుపు నిండిపోతుంది. నీరు ఎక్కువగా ఉండటం వల్ల, తక్కువ క్యాలరీలను కలిగి ఉండటం వల్ల చాలా ఎక్కువగా తిన్నా కొద్ది క్యాలరీలు మాత్రమే ఒంటిలోకి చేరతాయి. మాంసాహారాన్ని తినాలంటే ఎంతో కొద్దిపాళ్లలో మసాలాలు (స్పైసెస్) వాడాల్సిందే. మసాలాల కారణంగా కడుపు నిండాక కూడా ఇంకాస్త తినాలని అనిపిస్తుంటుంది. శాకాహారం అలా కాదు. తిన్న వెంటనే సంతృప్తభావన వచ్చేస్తుంది. ఇలా పీచు, నీటి పాళ్లతో పాటు, మసాలాలు తక్కువ అనే అంశాల కారణంగా శాకాహారాన్ని తక్కువే తింటాం. పైగా మాంసాహారంలోలా శాకాహారంలో కొవ్వులు ఉండనే ఉండవు. ఫలితంగా తిన్న క్యాలరీలను ఖర్చు చేయగలిగితే శాకాహారంతో అసలు స్థూలకాయం వచ్చే అవకాశమే దాదాపుగా ఉండదు. ఖనిజాలూ బరువు తగ్గిస్తాయి: మాంసాహారాలతో పోలిస్తే శాకాహారంలో ఖనిజాలు, లవణాలు ఎక్కువ. ఈ ఖనిజ లవణాలూ బరువు తగ్గించడానికి తోడ్పడతాయి. ఎలాగంటే...శాకాహారంలోని ఖనిజాలు, లవణాలు, విటమిన్లు సమతులంగా అందడం వల్ల జీవక్రియలు మెరుగుపడతాయి. చురుకైన జీవక్రియల వల్ల బరువు పెరగడానికి ఆస్కారం ఉండదు. శాకాహరంలోని ఖనిజాలన్నింటిలోనూ బరువు తగ్గించడంలో క్రోమియం భూమిక అగ్రస్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. అది రక్తంలోని చక్కెరలను సమతౌల్యం చేస్తుంది. ఇన్సులిన్ను తగిన పాళ్లలో విడుదలయ్యేలా చేస్తుంది. ఈ ఆరోగ్య అంశాల ద్వారా అది బరువు తగ్గించడంలో తోడ్పడుతుంది. నట్స్, గింజలు, అన్ని ఆకుకూరలు, కాయగూరల్లో క్రోమియం పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గించడంలో ఉపయోగపడే ఖనిజాల్లో క్రోమియం తర్వాతి స్థానం మెగ్నీషియమ్ది. ఇది నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరచడం, రక్తంలోని చక్కెర సమతౌల్యంగా ఉండేలా చూడటం, ఎముకలను పటిష్టపరచడం, వాటి ఆరోగ్యం బాగుండేలా చూడటంతో పాటు జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేసేలా, జీర్ణక్రియ వేగవంతమయ్యేలా చూస్తూ క్యాలరీలను త్వరగా దహనమయ్యేలా చేస్తుంది. ఈ మెగ్నీషియమ్ ముదురాకుపచ్చ ఆకుకూరలు, కాయగూరలు, నట్స్, పెరుగు, ఇతర పాల ఉత్పాదనల్లో ఎక్కువగా ఉంటుంది. జింక్ హార్మోన్ల సమతౌల్యతకు తోడ్పడటంలో భాగంగా బరువును నియంత్రిస్తుంది. జింక్ కూడా ఆకుకూరలు, కాయగూరలు, నట్స్తో పాటు పుట్టగొడుగులు, చిక్కుళ్లలో ఎక్కువ. ఐరన్ రక్తప్రవాహాన్ని సాఫీగా జరపడం, జీవక్రియలను మెరుగుపరచడం ద్వారా బరువును నియంత్రిస్తుంది. ఇది నట్స్, పాలకూర, డార్క్ చాకొలేట్స్, సబ్జా గింజలు (చియా సీడ్స్),, స్పిరులినాలో ఎక్కువ. లవణాల విషయానికి వస్తే పొటాషియమ్ అనేక జీవక్రియలను వేగవంతం చేయడం ద్వారా బరువును నియంత్రిస్తుంది. ఇది ఆకుకూరలు, కాయగూరలతో పాటు పెరుగు, సబ్జాగింజలు, పొట్టుధాన్యాలు, కొబ్బరినీళ్లు, బాదాం వంటి నట్స్లో ఎక్కువ. క్యాల్షియమ్ కూడా జీవక్రియలను మెరుగుపరుస్తూ బరువును నియంత్రిస్తుంది. ఇది పాలు, పాల ఉత్పాదనలతో పాటు బాదాం, సబ్జాగింజలలో ఉంటుంది. ఇవే గాక సల్ఫర్, సెలీనియమ్, చాలా కొద్ది పరిమితిలో సోడియమ్ కూడా అవసరమవుతాయి. బరువు తగ్గడానికి థెర్మోజెనిక్ శాకాహారాలు: ఒంట్లో వేడిని మరింత పెంచే శాకాహారాలను థెర్మోజెనిక్ శాకాహారాలు అనవచ్చు. థెర్మోజెనిక్ శాకాహారాలతో బరువు తగ్గడం మరింత సులువు. ఇవి తీసుకోవడం వల్ల మన ఆహారాల్లోని క్యాలరీలు మరింత వేగంగా దహనం అవుతాయి. ఆ వివరాలు:మిరియాలు (రెడ్ హాట్ పెప్పర్స్ / బ్లాక్ పెప్పర్) ఒంట్లో వేడిని పెంచి (థెర్మోజెనెసిస్ ద్వారా) క్యాలరీలను త్వరగా దహనం చేస్తాయి. గ్రీన్ టీలోని క్యాటెచిన్, పాలీఫీనాల్స్లో థెర్మోజెనిక్ గుణాలు ఉన్నాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్–టీ ఒక వరప్రదాయిని. పసుపులోని కార్క్యుమిన్ స్థూలకాయం నివారించడమే కాదు... స్థూలకాయ సంబంధిత అనేక వ్యాధులను నివారిస్తుంది. కాలీఫ్లవర్, బ్రాకోలీ, క్యారెట్లు, దోస వంటి వెజిటబుల్స్ కూడా తమ థెర్మిక్ గుణంతో బరువును నియంత్రిస్తాయి. శాకాహారంతో ఇతర ప్రయోజనాలివే... ఇటీవలి పరిశోధనలు మాంసాహారం కంటే శాకాహారం ఎన్నో రకాల ప్రయోజనకారి అని తెలుపుతున్నాయి. ఉదాహరణకు... శాకాహారంలో ఎలాంటి కొవ్వులూ ఉండవు. ముదురు ఆకుపచ్చ ఆకుకూరలలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. పొట్టు తీయని ధాన్యాల్లోనూ అంతే. ఇవి బరువు తగ్గడానికి గణనీయంగా తోడ్పడతాయి. మాంసాహారం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండెజబ్బులు, పక్షవాతం, కంటి జబ్బులు, హైబీపీకి దారితీస్తున్నాయి. మాంసాహారం తిన్నప్పుడు చాలాసేపు మనిషి మందకొడిగా మారతాడు. శాకాహారంలో కొవ్వులు లేకపోవడం అన్న ప్రయోజనం బరువు పెరగకుండా ఉండటానికి, బరువును నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. శాకాహారం మనలో పేరుకున్న చాలా విష పదార్థాలను స్వాభావికంగా తొలగిస్తుంది. అందుకే దీన్ని స్వాభావికమైన డిటాక్స్ (విష–హరిణి)గా చెప్పవచ్చు. వెజిటేరియన్ డైట్లో పీచు ఎక్కువగా ఉంటుంది, విటమిన్లు, ఖనిజలవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభ్యమవుతాయి. ఈ డీటాక్సిఫైయింగ్ కూడా బరువు తగ్గడానికి చాలావరకు తోడ్పడుతుంది. రంగుల మిలమిలలు: మాంసాహారం సాధారణంగా ఒకేరంగుతో కంటికి అంత ఇంపుగా ఉండకపోవచ్చు. శాకాహారంలోని రకరకాల పదార్థాలు అనేక రకాల రంగులీనుతూ ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ స్వాభావికమైన అనేక రంగుల ఆహారపదార్థాలతో ఆరోగ్యం బాగుంటుంది. చాలా రకాల పోషకాలు సమకూరడం కూడా మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. తేలిగ్గా జీర్ణం: శాకాహారంలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మొలలు, స్థూలకాయం, డయాబెటిస్, మలబద్ధకం, హయటస్ హెర్నియా, డైవర్టిక్యులైటిస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, పిప్పి పళ్లు (డెంటల్ కేరిస్), పిత్తాశయంలో రాళ్లు వంటి అనేక వ్యాధుల నివారణ స్వాభావికంగానే జరుగుతుంది. ఆకుకూరలతో మేలు అంతా ఇంతా కాదు: ఆకుకూరలతో ఆరోగ్యానికి ఒనగూరే మేలు అంతా ఇంతా కాదు. ఇందులోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల బరువు నియంత్రణలో ఉండటం, బీపీ నియంత్రణలో ఉండటం, గుండెజబ్బులకు ఆస్కారం లేకపోవడం వంటివి జరుగుతాయి. ఆకుకూరలు, పండ్లలో కాపర్, మెగ్నీషియమ్ వంటి ఖనిజాలు, లవణాలు ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఫ్లేవనాయిడ్స్ లభిస్తాయి. కొవ్వుల్లోనూ ఒమెగా 3, మ్యూఫా, ప్యూఫా వంటి ఆరోగ్యవంతమైన కొవ్వులు లభ్యమవుతాయి. మాంసాహారం తినేవారితో పోలిస్తే శాకాహారం తినేవాళ్లలో టైప్–2 డయాబెటిస్ (మధుమేహం) వచ్చేందుకు అవకాశాలు తక్కువ. అదే మాంసాహారం ఎక్కువ తినేవారిలో స్థూలకాయం వస్తుంది. ఈ స్థూలకాయం మళ్లీ మధుమేహం, రక్తపోటు వంటి అనేక వ్యాధులకు ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఇక శాకాహార ఆకుకూరలు తినేవాళ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మానికి ఎప్పటికప్పుడు మంచి పోషణ, విటమిన్స్ లభిస్తాయి కాబట్టి వాళ్లలో మేని మెరుపు చాలా బాగుంటుంది. శాకాహారం పరిమితులు: బరువు తగ్గించుకోడానికి శాకాహారాన్ని ఒక మార్గంగా అనుసరించే వారు కొన్ని పరిమితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. శాకాహారం ఆరోగ్యానికి మంచిదే అయినా కేవలం అది మాత్రమే పూర్తి పోషకాలను అందించలేదు. ఉదాహరణకు ప్రొటీన్ల లభ్యత. ప్రొటీన్లు కావాలంటే: ప్రొటీన్లు శాకాహారం కంటే మాంసాహారంలోనే ఎక్కువ. అయితే శాకాహారంతోనే ప్రొటీన్లు లభ్యం కావాలంటే పప్పులు, చిక్కుళ్లు, సోయా ఉత్పాదనలైన... సోయా బీన్స్, సోయా చీజ్, సోయా మిల్క్, టోఫూ వంటి ఆహార పదార్థాలపై ఆధారపడాలి. క్యాల్షియం కోసం: యుక్తవయసు వచ్చిన నాటి నుంచి అంటే... 19 ఏళ్ల యువకుడు మొదలుకొని 50 ఏళ్ల వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికీ 1000 ఎం.జీ. క్యాల్షియం అవసరం. ఇది డెయిరీ ఉత్పాదనల్లో పుష్కలంగా లభ్యమవుతుంది. అయితే వేగనిజమ్ అవలంబించే వారికి అదే మొత్తంలో క్యాల్షియం లభ్యం కావాలంటే వాళ్లు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు అంటే పాలకూర, బ్రకోలీ, పొద్దుతిరుగుడు గింజలు, సోయా మిల్స్ ఉత్పాదనల వంటి వాటిపై ఆధారపడాలి. వాటిని రోజూ తీసుకోవాలి. వెజిటేరియనిజమ్ పేరిట పాలను పరిహరించి, ప్రత్యామ్నాయాలను తగినంతగా తీసుకోలేకపోతే ఎముకలకు నష్టం వాటిల్లుతుంది. విటమిన్ డి: మన శరీరంలోకి క్యాల్షియం చక్కగా ఇంకిపోవాలంటే విటమిన్–డి అవసరం. ఇది పాల ఉత్పాదనలో, సూర్యకాంతిలో లభ్యమవుతుంది. సాధారణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ (ఐయూ) విటమిన్–డి అవసరం. జంతువుల నుంచి కాకుండా వెజిటేరియన్ ఉత్పాదనల ద్వారానే అది లభ్యం కావాలంటే సోయా మిల్క్ ఉత్పాదనలపై ఆధారపడాలి. ఐరన్: మనలో రక్తహీనత రాకుండా ఉండటానికి ఐరన్ చాలా అవసరం. ఇది మాంసాహారంలో తక్షణం లభిస్తుంది. అయితే శాకాహారం ద్వారానే ఇది లభ్యం కావాలంటే ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు (పాలకూర, బ్రకోలీ), డ్రైఫ్రూట్స్, గుమ్మడి గింజలు, నువ్వులు, సోయాబీన్ నట్స్ వంటివి పుష్కలంగా తీసుకోవాలి. విటమిన్–సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లు టమాటాలు తినడం వల్ల కూడా ఐరన్ తేలిగ్గా శరీరంలోకి ఇంకుతుంది. విటమిన్ బి12: ఇది మాంసాహారంలోనే పుష్కలంగా లభిస్తుంది. ఆ తర్వాత పాలలో అధికంగా ఉంటుంది. శాకాహారం నుంచే దీన్ని తీసుకోవాలంటే సోయామిల్ వంటి వాటిపై ఆధారపడాలి. దీని లోపం వల్ల మెదడు నరాల నుంచి అవయవాలకు ఆదేశాలు అందడంలో ఆటంకాలు, స్పృహతప్పడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఎండలో తగినంతగా తిరగకుండా ఇన్డోర్స్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, కేవలం శాకాహారాన్ని మాత్రమే తీసుకునే వారిలో విటమిన్–డి, విటమిన్–బి12 లోపంతో వచ్చే నరాల సమస్యలు ఇటీవల చాలా పెరిగాయి. అందుకే కేవలం వెజిటేరియన్ ఆహారంపైనే ఆధారపడే వారు విటమిన్–డి, విటమిన్–బి12, ఐరన్ వంటి కీలకమైన పోషకాల కోసం ప్రత్యామ్నాయాలపై మరింత ఎక్కువ దృష్టిపెట్టాలి. పైన పేర్కొన్న ప్రత్యామ్నాయాలు ఆచరిస్తూ, శాకాహారం వైపు మళ్లితే అది బరువు తగ్గడానికి బాగా తోడ్పడటంతో పాటు... ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. శుభ్రం చేయడం చాలా ముఖ్యం ఆకుకూరలు /కాయగూరలపై రకరకాల పురుగుమందులు, మట్టి, బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉన్నందున వాటిని శుభ్రంగా కడగాలి. అన్ని కూరగాయలు / ఆకుకూరలను ధారగా పడే నీళ్లలో కడగాలి. పలుచటి చర్మం ఉన్న కూరగాయలను కాస్తంత వైట్ వెనిగర్ కలిపిన నీళ్లలో కడుక్కోవడం మంచిది. ఆకుకూరలను ముందుగా కోసి ఆ తర్వాత కడగటం కంటే బాగా శుభ్రంగా కడిగాక మాత్రమే కోయాలి. నేలనుంచి తీసే వెజిటబుల్స్ను మట్టి అంతా శుభ్రమయ్యేలా బాగా కడగాలి. సుజాతా స్టీఫెన్, చీఫ్ న్యూట్రిషనిస్ట్ యశోద హాస్పిటల్స్, మలక్పేట, హైదరాబాద్ -
కొవ్వు పదార్థాలు తినొచ్చా?
గర్భిణులు కొవ్వు పదార్థాలు తినడం వల్ల పుట్టబోయే బిడ్డల్లో మానసిక సమస్యలు తలెత్తుతాయని చదివాను. ఇది ఎంత వరకు నిజం? ఏయే పదార్థాల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుందనే విషయం మీద నాకు పెద్దగా అవగాహనలేదు. కాస్త వివరంగా తెలియజేయగలరు. – జి.మయూరి, నెల్లిమర్ల గర్భిణీగా ఉన్న సమయంలో సాధారణంగా తీసుకునే ఆహారం కంటే 300 క్యాలరీల ఆహారం ఎక్కువగా తీసుకోవడం మంచిది. అధిక క్యాలరీలు తల్లిలో మార్పులకు, బిడ్డ పెరుగుదలకు ఉపయోగపడతాయి. తల్లి ఆహారంలో 50 శాతం కార్బోహైడ్రేట్లు, 25 శాతం ప్రొటీన్లు, 25 శాతం కొవ్వు ఉంటే, బిడ్డ పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుంది. తల్లి తీసుకునే ఆహారంలో కొవ్వు బిడ్డలోని నాడీ వ్యవస్థ, కళ్లు ఏర్పడటానికి, హార్మోన్ల ఉత్పత్తికి ఉపయోగపడతాయి. తల్లి మరీ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల బిడ్డలోని కాలేయం(లివర్) కణాలు పాడయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశోధకుల అంచనా. దానివల్ల బిడ్డలో రోగనిరోధకశక్తి తగ్గడం, ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే బిడ్డ అధిక బరువు, తర్వాతి కాలంలో షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లి ఎక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల, కొంతమంది పిల్లల్లో మెదడు ఎదుగుదలపై ప్రభావం పడి, వారిలో ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు అని పరిశోధకుల విశ్లేషణ. జంక్ఫుడ్స్, వేపుడ్లు, గుడ్లు, మాంసం, చీజ్, బటర్, డ్రై ఫ్రూట్స్, నూనె వస్తువులు, కొన్ని రకాల చేపలు, వంటి ఆహారంలో కొవ్వు అధికంగా ఉంటుంది. వీటిలో పాలు, పెరుగు, గుడ్లు, కొద్దిగా మాంసం, డ్రై ఫ్రూట్స్ వంటివి మితంగా తీసుకోవడం మంచిది. అంతేకాని అసలు తీసుకోకుండా ఉండకూడదు. ఎందుకంటే బిడ్డ ఎదుగుదలకు 25 శాతం ఆహారంలో కొవ్వు ఉండాలి. మా కజిన్ చాలా చురుకైన అమ్మాయి. ప్రస్తుతం తను ప్రెగ్నెంట్. కారణం తెలియదుగానీ తన స్వభావానికి విరుద్దంగా మూడీగా ఉంటోంది. ఒంటరితనాన్ని ఇష్టపడుతోంది. దీన్ని ప్రెనెటెల్ డిప్రెషన్ అంటారని, సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాదని కొందరంటున్నారు. మరికొందరేమో దీని వల్ల పుట్టబోయే బిడ్డకు తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. నాకు ఆందోళనగా ఉంది. సలహా ఇవ్వగలరు. – పి.సంతోషి, మచిలీపట్నం కొంతమంది గర్భం దాల్చిన తర్వాత శారీరకంగా, మానసికంగా వచ్చే మార్పులతో, హార్మోన్లలో మార్పులతో డిప్రెషన్లోకి వెళ్లడం జరుగుతుంది. దీన్నే ప్రెనెటెల్ డిప్రెషన్ అంటారు. మొదటి మూడునెలలు వికారం, వాంతులు, నీరసం, నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలతో ఆందోళన చెందడం జరుగుతుంది. అలాగే, శారీరక మార్పులు, బరువు పెరగడం, ఆయాసం, ఓపిక లేకపోవడం, నడుం నొప్పులు, వంటి ఇబ్బందులు, కొందరిలో ఆర్థిక పరిస్థితులు, కొందరిలో భర్తకి తనమీద శ్రద్ధ తగ్గుతుందేమోనని ఆందోళన వంటి అనేక కారణాల వల్ల కొంతమంది గర్భిణీలు ప్రెనెటెల్ డిప్రెషన్లోకి వెళ్లడం జరుగుతుంది. కొందరిలో వాళ్లు వీళ్లు చెప్పిన మాటలు వినడం, వేరే వాళ్లకు వారి గర్భంలో వచ్చిన సమస్యలు వినడం, ఇంటర్నెట్ ఎక్కువగా వాడటం, అందులో ఉన్న కాంప్లికేషన్స్ తమకూ వస్తాయేమోని ఆందోళన, బిడ్డకి ఏమైనా సమస్యలు వస్తాయేమోనని భయం, బిడ్డని ఎలా చూసుకోవాలి, వంటి ఆలోచనలు, భయాలతో కూడా కొందరు డిప్రెషన్లోకి వెళ్లడం జరుగుతుంది. దీనివల్ల వీరు ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, డల్గా ఉండటం, ఒంటరిగా ఉండటం, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకపోవడం, ఏడుపు రావడం, వంటి అనేక లక్షణాలు ఏర్పడుతుంటాయి. దీనివల్ల బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలలో కూడా సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి చికిత్సలో భాగంగా కౌన్సిలింగ్, కుటుంబ సభ్యుల సహకారం, భర్త ప్రేమగా తనతో మాట్లాడటం, సమయం కేటాయించడం, బయటకు తీసుకువెళ్లడం వంటివి చెయ్యడం వల్ల వీరు చాలావరకు డిప్రెషన్ నుంచి బయటపడతారు. అలాగే యోగా, మెడిటేషన్, నడక వంటివి చెయ్యడం వల్ల చాలావరకు డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు. ఇన్ని విధాల ప్రయత్నించినా, ఉపశమనం లేనప్పుడు యాంటి డిప్రెసంట్స్ మందులు డాక్టర్ పర్యవేక్షణలో అతి తక్కువ డోస్లో కొద్దిగా రిస్క్ తీసుకుని వాడవచ్చు. నా వయసు 33. ముప్ఫై దాటాక పెళ్లి చేసుకున్నాను. తర్వాత ఏడు నెలలకే గర్భం దాల్చాను. స్కానింగ్లో ఫెయింట్ ఫీటల్ అని రావడంతో అబార్షన్ చేశారు. మళ్లీ ఆరు నెలలకు గర్భం దాల్చాను. అప్పుడూ అంతే. రెండో అబార్షన్ తర్వాతి నుంచి కడుపులో నొప్పి వస్తోంది. మరో డాక్టర్ని కలిస్తే అబార్షన్ చేసినప్పుడు గర్భసంచికి గీత పడింది అంటున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? అసలు నాకు ఆరోగ్యకరమైన గర్భం ఎందుకు రావడం లేదు? నాకు బిడ్డ కావాలి. సలహా ఇవ్వండి.– రత్నం, అడ్డతీగల గర్భం గర్భసంచిలో మొదలయ్యి అందులో పిండం ఏర్పడుతుంది. ఆరు వారాలకు దాని గుండె కొట్టుకో వడం మొదలవుతుంది. కొందరికి హార్మోన్ల అసమ తుల్యత లేదా జన్యుపరమైన కారణాల వల్ల పిండం సరిగ్గా ఏర్పడదు. గర్భంలో పిండం పెరగదు. దీనినే ఆ జీజజ్టి ౖఠ్చిఝ అంటారు. కొందరిలో పిండం ఏర్పడు తుంది కానీ గుండె కొట్టుకోదు. లేదా కొన్నిరోజుల తర్వాత గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. కొన్నిసార్లు అండం నాణ్యత సరిగ్గా లేకపోయినా, తల్లిదండ్రుల్లో జన్యు సమస్యలు ఉన్నా కూడా పిండం పెరగకపోవచ్చు. థైరాయిడ్తో పాటు ఇతరత్రా హార్మోన్ల సమస్య, అధిక బరువు, పీసీఓ, మధుమేహం, రక్తంలో యాంటీ ఫాస్పాలిపిడ్ యాంటిబాడీస్ వంటివి ఉన్నా కూడా మొదటి మూడు నెలల్లో పిండం సరిగ్గా ఏర్పడక అబార్షన్లు అవుతుంటాయి. అబార్షన్ చేసేటప్పుడు కొన్నిసార్లు గర్భసంచికి చిల్లుపడే అవకాశం ఉంటుంది. మీరు గీత పడింది అన్నదానికర్థం ఇదే అనుకుంటు న్నాను. అలాంటివి మెల్లగా మానిపోతాయి. కాకపోతే మళ్లీ వెంటనే గర్భం దాల్చకుండా కొన్ని నెలలు ఆగితే మంచిది. కొంతమందికి 30, 35 యేళ్లు దాటిన తర్వాత అండాల నాణ్యత తగ్గడం వల్ల కూడా పిండం సరిగ్గా ఏర్పడక అబార్షన్లు జరుగుతుంటాయి. బరువు ఎక్కు వుంటే తగ్గడానికి ట్రై చేయండి. రెండుసార్లు అబార్షన్ తప్పలేదు కాబట్టి మీలో ఇంకేమైనా సమస్యలున్నా యేమో తెలుసుకోవడం మంచిది. కాబట్టి ఇఆ్క, ఉ ఖ, ౖఎఖీఖీ, ఊ ఏ, ఖీ ఏ, అ్కఅ, ట. అ్కఖీఖీ పరీక్షలతో పాటు షుగర్, ప్రొలాక్టిన్ వంటి హార్మోన్ టెస్టులు కూడా చేయించుకోండి. ఏదైనా తేడా ఉంటే ముందు నుంచే చికిత్స తీసుకుంటూ గర్భం కోసం ప్రయత్నించండి. అవసరమైతే భార్యాభర్తలిద్దరూ ఓ్చటy్టౌypజీnజ అనే జన్యుపరీక్ష చేయించుకుని, ఏవైనా జన్యు సమస్యలుంటే కౌన్సెలింగ్కి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే గర్భం దాల్చ డానికి మూడు నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలు రోజుకొకటి చొప్పున తీసుకోండి. - డా‘‘ వేనాటి శోభ బర్త్రైట్ బై రెయిన్బో హైదర్నగర్ హైదరాబాద్ -
శిశువులు – ఆరోగ్యకర ఆహారం
‘ఆషోడశాత్ భవతే బాలః కుమారః’ అంటుంది ఆయుర్వేదం. 16 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలు వివిధ దశల్లో పరిణతి చెందుతారనేది దీనర్థం. వారి ఆరోగ్య పరిరక్షణకు ఇది చాలా విశిష్టమైన సమయం. తల్లిదండ్రులు సూచించే ఆహారవిహారాల పైనే పెరిగే వయసులో ఉన్న పిల్లల శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. శారీరక వ్యాయామం, వినయవిధేయతలు, సామాజిక సాంస్కృతిక స్పృహ... వీటి మీద కూడా పిల్లల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ‘లోకో భిన్న రుచిః’ అన్న ఆర్యోక్తి వాస్తవమే అయినా, పెరిగే వయసులో ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు నేర్పే ఆహారపుటలవాట్లు వారిపై జీవితాంతం ప్రభావం చూపుతాయన్నది శాస్త్ర సమ్మతం. మనం చేసే అలవాటుని బట్టే మన నాలుక రుచుల్ని కోరుతుందన్నది మరచిపోకూడదు. శరీర పోషణకు ఎలాంటి ఆహారం అవసరమన్నది తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఇది కల్తీ పదార్థాల వ్యాపారంతో నిండిన కాలమని అర్థం చేసుకుని, పిల్లలకు ఇచ్చే ఆహారపదార్థాలను నిర్ణయించుకోవాలి. వీటిని తీసుకోకూడదు... ఉప్పుని అతి తక్కువ ప్రమాణంలోనే అంటే రోజు మొత్తం మీద మూడు గ్రాములు దాటి సేవించకూడదు. నూనెను మరిగించి (డీప్ ఫ్రై) చేసే వంటకాలు (పూరీలు, గారెలు, సమోసా, చిప్స్ వంటివి) నెలకు రెండు సార్లకు మించి ఎక్కువగా తినకూడదు. పంచదార నిషేధం. (దానికి బదులు బెల్లం, తేనె, ఖర్జూరం వాడుకోవచ్చు). రిఫైన్డ్ ఆయిల్స్ బదులు నువ్వులనూనె వాడటం మంచిది. బజారులో అమ్మే తినుబండారాలను విడిచిపెట్టడం ఉత్తమం. ఐస్క్రీములు, చాకొలేట్లు, లాలీపాప్, స్వీట్స్, భుజియా, సేవ్, నూడుల్స్, పిజ్జా, బర్గర్, శీతల పానీయాలు, బిస్కెట్లు, బ్రెడ్ మొదలైనవి. మైదాపిండి వాడకం మానేస్తే మంచిది. ఎందుకు తినకూడదు... పైన చెప్పిన పదార్థాలలో పోషక విలువలకి సంబంధించి ‘విటమిన్లు, ఖనిజలవణాలు, ప్రొటీన్లు ఉండవు. పైగా కొవ్వులు, శర్కర కలిగిన పిండి పదార్థాలు అధిక స్థాయిలో ఉండి, అక్కర్లేని అధిక క్యాలరీలను మాత్రం అందిస్తాయి. వీటి తయారీలో వాడే కృత్రిమ రంగులు, తీపికోసం + నిల్వ కోసం వాడే కెమికల్స్, అధిక ఉప్పు, చౌకబారు కారం, నూనెలు మొదలైనవన్నీ రోగాలు కలిగిస్తాయి. బయట అమ్మే చెరుకురసం, పానీపూరీ వంటి వాటిలో కల్తీతో పాటుగా ఇన్ఫెక్షన్ సమస్య ప్రధానమైనది. వాంతులు, విరేచనాలు, వివిధ జ్వరాలు, పచ్చకామెర్ల వంటివి చాలా తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువ. వీటిని తినొచ్చు... ∙ఇంట్లో వండుకుని తయారుచేసుకున్నవి మాత్రమే పిల్లల ఆరోగ్యానికి మంచిది. ∙ఇడ్లీ, దోసెలు, పెసరట్లు లేదా రకరకాల ఇతర అట్లు చక్కగా తినొచ్చు. ∙రాగులు కంద కూడా వాడుకోవచ్చు ∙సాధారణంగా వరి అన్నంతో పులిహోర తయారుచేస్తాం. కొర్రల వంటి ఇతర బియ్యాలను కూడా వాడుకుంటే మంచిది. ∙అటుకులు, నిమ్మరసం, కొత్తిమీర ఉపయోగించి వంటకాలు చేసుకుంటే అధిక పోషక విలువలు లభిస్తాయి. ∙బొంబాయిరవ్వతో చేసే ఉప్మా కంటే బియ్యపురవ్వతో చేసుకునే ఉప్పుడు పిండి మంచిది. ఇందులో ఇంగువ కూడా వాడితే రుచితోపాటు ఆరోగ్యానికి కూడా మంచిది. ∙కిచిడీ, పులగం, బిరియానీలలో పోషకాలు లభిస్తాయి. ∙మినపరొట్టె, పప్పు బియ్యపు రొట్టె వంటివి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మొదలైన తాజా చట్నీలతో తింటే బలకరం. ∙సేమ్యా ఉప్మా అప్పుడప్పుడు తింటే పరవాలేదు.∙కాయగూరలతో చేసిన సూప్స్లో కొంచెం మిరియాల పొడి, నిమ్మరసం కలుపుకోవాలి. అలాగే క్యారట్, టొమాటో, పచ్చి జ్యూస్, గ్రీన్ సలాడ్స్ తినడం మంచిది. ∙బెల్లానికి బదులు పచ్చి ఖర్జూరాల్ని వాడుకుని, వేరుసెనగ పలుకుల ఉండలు, చక్కీలు, మరమరాల ఉండలు, అటుకుల ఉండలు, నువ్వుల ఉండలు, డ్రైఫ్రూట్స్ ఉండలు పిల్లలకు ఇస్తే పోషక విలువలు సమృద్ధిగా ఉండటమే కాకుండా, అధిక క్యాలరీలు, కల్తీల సమస్య ఉండదు. ∙బెల్లంతో చేసే మినపసున్ని, కొబ్బరి ఉండలు కూడా మంచిది. ∙సేమ్యాపాయసం, బియ్యం పాయసం, జున్ను మొదలైనవాటిని తేనెతో చేస్తే పోషకాలు బావుంటాయి. గుమ్మడి, టొమాటో, ఆకుకూరలతో చేసిన వడియాలు, పిండి వడియాలు, పేల వడియాలు అప్పుడప్పుడు తినడం ప్రయోజనకరం. ∙అరటిపండ్లు, సీతాఫలం, సపోటా, మామిడి, పనసతొనలు లభించడాన్ని బట్టి తినడం మంచిది. ∙దానిమ్మ, జామ, బొప్పాయి పండ్ల వలన చాలా పోషకాలు లభిస్తాయి. ∙బత్తాయి, కమలా, పుచ్చకాయలు ‘రస’ ప్రధానమైనవి. ఇవి కూడా మంచిది. ∙ద్రాక్ష, ఆపిల్ వంటివి అత్యధిక క్రిమిసంహారక మందుల ప్రభావానికి గురవుతాయి కనుక వాటి జోలికి పోవకపోవడమే మంచిది. ∙డ్రైఫ్రూట్స్ని తగు ప్రమాణంలో ప్రతిరోజూ పిల్లలకు ఇవ్వాలి. ∙ చెరకుని నమిలి తినడం, కొబ్బరినీళ్లు, అల్లం, కరివేపాకులతో చేసిన పలుచని మజ్జిగ మొదలైనవి మంచిది. ∙పళ్ల రసాల కంటే పండుని మొత్తంగా తినడం మంచిది. గమనిక: కార్బైడ్, పెస్టిసైడ్స్ వంటి విషాలు చాలా ప్రమాదకరం. ప్రస్తుతం ఇది ఒకసామాజిక సమస్యగా మారింది. పండ్ల వలన కలిగే లాభాల కన్నా, ఈ విషాల వల్ల కలిగే హాని అధికంగా ఉంది. వీటి గురించి వైద్యులు వివరించగలరే కాని ‘నివారణ/నిర్మూలన’ వారి చేతుల్లో లేదని గమనించాలి. డ్రైఫ్రూట్స్: తగు ప్రమాణంలో మితంగా తినడం మంచిది. ప్రతిరోజూ కొంచెం కొంచెం పిల్లలకివ్వాలి. పానీయాలు: చెరకుని నమిలి తినడం, కొబ్బరినీళ్లు, అల్లం, కరివేపాకులతో చేసిన పలుచని మజ్జిగ మొదలైనవి మంచిది. పళ్ల రసాల కంటే పండుని మొత్తంగా తినడం మంచిది. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు -
పిప్పి పళ్లకు పెపై్టడ్ టూత్ పేస్ట్తో చెక్!
పిప్పి పళ్లకు రోజూ వాడే టూత్ పేస్ట్ ద్వారానే చెక్ పెట్టేందుకు వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. మన పంటి దృఢత్వానికి కారణమైన ఒక ప్రొటీన్ అమిలోగెనిన్లో ఉండే పెపై్టడ్లతో ఇది సాధ్యమేనని వారు అంటున్నారు. పెపై్టడ్లు పంటి ఉపరితలానికి అతుక్కుపోయి కాల్షియం, ఫాస్పరస్ అయాన్లను ఉపయోగించుకుని పన్ను గట్టిగా మారేందుకు ఉపయోగపడుతుందని అంచనా. బ్యాక్టీరియా కారణంగా ఏర్పడే పిప్పి (కావిటీ) ని కూడా ఈ పెపై్టడ్లు సమర్థంగా నయం చేయగలవని ఈ పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ మెహ్మెట్ సరికాయ అంటున్నారు. పరిశోధనశాలలో జరిగిన ప్రయోగాల్లో ఈ పెపై్టడ్లు పళ్లపై పది నుంచి 50 మైక్రో మీటర్ల మందంతో ఎనామిల్ను సృష్టించగలిగాయని ఆయన చెప్పారు. వాణిజ్యస్థాయిలో ఈ పెపై్టడ్లతో టూత్పేస్ట్ తయారుచేయగలిగితే పిప్పి పళ్లు అన్న అంశం గతకాలపు విషయమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆరోగ్యానికి ఏ మాత్రం హాని కలగని రీతిలో పిప్పి పళ్ల సమస్యను అధిగమించేందుకు ఈ ఆవిష్కరణ ఉపయోగపడుతుందని సరికాయ తెలిపారు. పరిశోధన వివరాలు ఏసీఎస్ బయోమెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ మ్యాగజైన్లో ప్రచురితమయ్యాయి. -
భూతాపోన్నతికి చెక్ పెట్టేందుకు కొత్త ఆలోచన
నీటిలో పెరిగే నాచును సక్రమంగా వాడుకోవడం ద్వారా భూమి మీద మనిషి మనుగడను సవాలు చేస్తున్న భూతాపోన్నతి ముప్పును తప్పించుకోవచ్చు అంటున్నారు కార్నెల్, డ్యూక్, హవాయి యూనివర్శిటీల శాస్త్రవేత్తలు. నాచును విరివిగా పెంచడం వల్ల వాతావరణంలోని కార్బన్డయాక్సైడ్ను ఆ చిన్ని మొక్కల్లో నిక్షిప్తం చేయవచ్చునని ఇప్పటికే తెలుసు. ఈ నాచును శుద్ధి చేస్తే బయోడీజిల్ను తయారు చేయవచ్చు. అదే సమయంలో మనకు ఆహారంగా ఉపయోగపడగల ప్రొటీన్ను కూడా తయారుచేసుకోవచ్చు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నమాట. దాదాపు ఏడు వేల ఎకరాల్లో నాచును పెంచితే.. ఒకవైపు అంతే స్థలంలో పండేంత సోయా ప్రొటీన్ను అందించడంతోపాటు దాదాపు కోటి 70 లక్షల కిలోవాట్ల విద్యుత్తును అదనంగా ఉత్పత్తి చేయవచ్చునని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త ఛార్లెస్ గ్రీన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఈ చిన్న ప్రాజెక్టు ద్వారా దాదాపు 30 వేల టన్నుల కార్బన్డయాక్సైడ్ను వాతావరణంలో నుంచి తొలగించవచ్చునని వివరించారు. నాచుతో ఉత్పత్తి అయ్యే ప్రొటీన్ మంచి పోషకాలతో కూడి ఉంటుందని, మనుషులకే కాకుండా చేపల పెంపకంలోనూ వాడుకోవచ్చునని చెప్పారు. పర్యావరణానికి హాని జరక్కుండా కార్బన్డయాక్సైడ్ను తొలగించేందుకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుందని వివరించార -
ఆ ప్రొటీన్లతో చిక్కే...!
ఆరోగ్యానికి మాంసాహారం మంచిదా? శాకాహారం మంచిదా? అన్న చర్చ చాలాకాలంగా కొనసాగుతున్నదే. కానీ కాలిఫోర్నియా, ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ద్వారా తేలిందేమిటంటే.. మాంసపు ప్రొటీన్లు హానికారకమైతే, విత్తనాలు, జీడి, బాదం వంటి పప్పుల నుంచి అందే ప్రొటీన్లు గుండెకు మేలు చేస్తాయని! దాదాపు 81 వేల మంది ఆహారపు అలవాట్లు, ఆరోగ్య వివరాలను విశ్లేషించడం ద్వారా తాము ఈ విషయాన్ని తెలుసుకున్నామని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త గ్యారీ ఫేజర్ తెలిపారు. పాడి ఉత్పత్తుల ద్వారా అందే కొవ్వు గుండెజబ్బులకు కొంతవరకూ కారణమని ఇప్పటికే తెలిసినప్పటికీ ప్రొటీన్ల పాత్ర ఏమిటన్న విషయంపై స్పష్టత లేని నేపథ్యంలో తాము ఈ అధ్యయనం చేపట్టామని ఆయన చెప్పారు. దీని ప్రకారం మాంసపు ప్రొటీన్లతో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 60 శాతం ఎక్కువగా ఉండగా.. మొక్కల ఆధారిత ప్రొటీన్ల (బాదం, జీడి, విత్తనాలు వంటివి)తో ఇది గణనీయంగా తగ్గుతుందని వివరించారు. మొక్కల లేదా జంతు ఆధారిత ప్రొటీన్లు అనే రెండేస్థూల వర్గాలుగా కాకుండా తాము మరింత స్పష్టమైన ప్రొటీన్ వర్గీకరణ ద్వారా అధ్యయనం చేశామని, తద్వారా తమ ఫలితాలు మరింత కచ్చితమైనవని అంచనా వేస్తున్నట్లు ఫేజర్ తెలిపారు. మాంసపు ప్రొటీన్లలో ఉండే కొన్ని రకాల అమినో యాసిడ్లు గుండెపై చూపే ప్రభావం, బీపీ, కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి సమస్యలకు ఏ రకమైన ప్రొటీన్లు కారణమవుతున్నాయి? అన్న అంశాలను తెలుసుకోవాల్సిన అవసరాన్ని తమ అధ్యయనం కల్పించిందని ఫేజర్ వివరించారు. -
ప్రొటీన్ పౌడర్లతో జాగ్రత్త!
శక్తి కోసం, కండలు పెంచుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రొటీన్ పౌడర్లు వాడుతున్నారు. కండపుష్టి కోసం సహజసిద్ధమైన ఆహారపదార్థాలే మేలైనవని, ప్రొటీన్ పౌడర్లు సహజమైన ఆహార పదార్థాలకు ప్రత్యామ్నాయం కాలేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు, వివిధ బ్రాండ్ల పేర్లతో ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న ప్రొటీన్ పౌడర్లలో సీసం, ఆర్సెనిక్, కాడ్మియం వంటి ప్రమాదకరమైన భార లోహాలు ఉంటున్నాయని హెచ్చరిస్తున్నారు. ప్రొటీన్ పౌడర్లు వాడటం వల్ల కండపుష్టి సమకూరడం సంగతి అలా ఉంచితే, వాటిలో మోతాదుకు మించి ఉంటున్న భార లోహాల వల్ల తలెత్తే దుష్పరిణామాలు దీర్ఘకాలంలో చాలా తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు. ప్రొటీన్ పౌడర్లలో సీసం, ఆర్సెనిక్ వంటి భార లోహాలతో పాటు పురుగుమందులు తదితర 130 రకాల ప్రమాదకరమైన రసాయనాలు ఉంటున్నట్లు అమెరికాలోని ‘క్లీన్ లేబుల్’ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన పరీక్షల్లో తేలింది. -
కరవును తట్టుకునేందుకు కొత్త టెక్నిక్..
తక్కువ నీటితో ఎక్కువ పంట పండించగలిగితే పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడం సాధ్యమవుతుంది. సరిగ్గా ఇదే దిశగా బిల్ అండ్ మెలిండా గేట్స్తో పాటు కొన్ని అంతర్జాతీయ సంస్థలు చేస్తున్న పరిశోధనలు సత్ఫలితాలు సాధిస్తోంది. మొక్కల్లో సూర్యరశ్మిని ఇంధనంగా మార్చుకునే కిరణజన్య సంయోగ ప్రక్రియను మరింత సమర్థంగా జరిగేలా చేయడం ద్వారా పంటల దిగుబడి పెంచవచ్చునని.. అదేసమయంలో నీటి వాడకాన్ని తగ్గించవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త స్టీఫెన్ లంగ్ ఇకెన్బెర్ర తెలిపారు. మొక్కల్లోని ఒక ప్రొటీన్ మోతాదును పెంచడం ద్వారా అవి ఆకుల్లోని స్టొమాటాను మూసుకునేలా చేయగలిగామని.. తద్వారా నీరు ఆవిరి కాకుండా ఆపగలిగామని ఆయన వివరించారు. ఈ స్టొమాటా తెరుచుకున్నప్పుడు గాల్లోని కార్బన్ డయాక్సైడ్ లోనికి చేరి ఇంధనంగా మారుతుంది. అదేసమయంలో నీరు ఆవిరి రూపంలో బయటకు వెళ్లిపోతుంది. ప్రోటీన్ మోతాదు పెరగడం వల్ల స్టొమాటా పూర్తిగా తెరుచుకోదని.. తగినంత కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకోగలగదని వివరించారు. ఈ క్రమంలోనే దిగుబడి కూడా 20 శాతం వరకూ ఎక్కువవుతుందని గతంలో జరిగిన పరిశోధనలు రుజువు చేశాయని చెప్పారు. తాము పొగాకు మొక్కను నమూనాగా తీసుకుని ప్రయోగాలు చేశామని.. ఫలితాలను ఇతర ఆహార పంటల్లోనూ సాధించగలమని వివరించారు. -
ఆ ప్రొటీన్తో వందేళ్లు, ఆరోగ్యం కూడా!
వందేళ్లు బతకాలని అందరూ కోరుకుంటారుగానీ.. ముసలి వయసులో వచ్చే ఆరోగ్య సమస్యలు గుర్తుకొస్తే మాత్రం.. ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అందుకేనేమో.. బ్రౌన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆయుష్షును పెంచడం కాకుండా, బతికున్నంత కాలమూ ఆరోగ్యం ఉండటం ఎలా? అన్న అంశంపై దృష్టి పెట్టారు. ఈ విషయంపై ఈగలపై కొన్ని ప్రయోగాలు చేస్తే.. సిర్ట్4 అనే ప్రొటీన్తో ఇది సాధ్యమని తెలిసింది. ఈ ప్రొటీన్ అటు జీవక్రియలతోపాటు.. వయసుతోపాటు వచ్చే వ్యాధుల్లోనూ కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలో సిర్ట్4 ప్రొటీన్ను ఆరోగ్యం కోసం ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకునేందుకు ఈగలపై పరిశోధనలు జరిగాయన్నమాట. సిర్ట్4 ప్రొటీన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఈగల ఆయుష్షు 20 శాతం ఎక్కువ కావడంతోపాటు ఆరోగ్యంగానూ ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రొటీన్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసిన ఈగలను పరిశీలిస్తే ఆయుష్షు 20 శాతం వరకూ తగ్గినట్లు తెలిసింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఉపవాసమున్నప్పుడు సిర్ట్4 ప్రొటీన్ కణాలకు అవసరమైన ఇంధనాన్ని అందిస్తూందని.. ఈ ప్రొటీన్ తక్కువ ఉన్న ఈగలు సాధారణ ఈగల కంటే వేగంగా చచ్చిపోయాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త స్టీఫెన్ హెల్ఫాండ్ తెలిపారు. -
గాయాలను త్వరగా నయం చేసే మినుములు!
మినుముల్లో ప్రోటీన్లు ఎక్కువ. అవి కండరాల రిపేర్లకు ఉపయోగపడతాయి. అందుకే గాయాలైనవారిలో అవి త్వరగా తగ్గడానికి మినుములు మంచి ఆహారం. అంతేగాక మినుములు రోగనిరోధకశక్తిని పెంచి, అనేక వ్యాధులను నివారించడంతో పాటు ఒంటికి బలాన్నీ సమకూరుస్తాయి. మినుములతో కలిగే ప్రయోజనాల్లో కొన్ని... ♦ మినుముల్లో 72 శాతం పీచు ఉంటుంది. అందుకే అవి మలబద్దకాన్ని నివారిస్తాయి. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలను తొలగిస్తాయి. డయేరియా, డిసెంట్రీ వంటి సమస్యలు ఉన్న వారు మందులకు బదులు మినుముతో చేసిన వంటకాలు తింటే ఆ సమస్య దూరమవుతుందని ఆహార నిపుణుల సిఫార్సు. ♦ మినుముల్లోని పీచు ఆహారంలోని చక్కెరను మెల్లగా విడుదలయ్యేలా చూస్తుంది. అందుకే డయాబెటిస్ సమస ఉన్నవారికి మినుములు మంచి ఆహారం. ♦ మినుములు కీళ్లనొప్పులనుంచి ఉపశమనం కలిగిస్తాయి. -
డయాబెటిస్ ఉన్న పిల్లలు తీసుకోవాల్సిన ఆహారం
టైప్ 1 డయాబెటిస్తో బాధపడుతున్న పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారం ఇలా ఉండాలి. సమతుల ఆహారంలో తగిన పాళ్లలో పిండిపదార్థాలను (కార్బోహైడ్రేట్స్) సమకూర్చే కాయధాన్యాలు (హోల్గ్రెయిన్స్), మాంసకృత్తులు (వీటినే ప్రోటీన్లు అంటారు. ఇవి పప్పు, కోడి మాసం, వేటమాంసం, చేపలు, చీజ్, పనీర్, చిక్కుళ్ల వంటి వాటిలో ఎక్కువ) తీసుకుంటూ ఉండాలి. అంతేకాదు... ఆరోగ్యకరమైన కొవ్వుపదార్థాలు కూడా తీసుకోవాలి. ఇందుకోసం పొద్దుతిరుగుడుపువ్వునూనె, బాదం, వాల్నట్) తీసుకోవచ్చు. ఇక వీటితో పాటు అన్ని రకాల పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలి. మన భారతీయులు తీసుకునే ఆహారాల్లో పిండిపదార్థాలను సమకూర్చే వరిబియ్యం, గోధుమలు, రాగి, ఓట్స్ వంటివి ఎక్కువ. వాటి ద్వారా ఒంటికి వెంటనే శక్తి సమకూరుతుంది. అంతేకాదు... వాటి వల్ల పిల్లల రక్తంలో చక్కెరపాళ్లు పెరుగుతాయి. అందుకే పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్ల)ను ఇచ్చే ఆహారం విషయంలో కొన్ని పరిమితులు పాటించాల్సి ఉంటుంది. పిల్లల వ్యక్తిగత అవసరాలను దృష్టిలో ఉంచుకొని న్యూట్రీషనిస్టులు వారికి డైట్ ప్లాన్ చెబుతారు. -
కీమోథెరపీలో జుట్టును కాపాడే ఇంజెక్షన్
క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ చికిత్సలో ఉపయోగించే మందుల దుష్ప్రభావం ఫలితంగా జుట్టురాలడం సర్వసాధారణంగా కనిపించే సమస్యే. కీమోథెరపీ కొనసాగుతున్నప్పుడు జుట్టురాలకుండా అరికట్టే మందులేవీ ఇంతవరకు అందుబాటులో లేవు. దీనివల్ల కీమోథెరపీ పొందే రోగులు మానసికంగా కుంగిపోయి నానా యాతన పడుతూ వస్తున్నారు. అలాంటి వారికి ఇప్పుడు ఒక శుభవార్త. కీమోథెరపీ మందులు తీసుకుంటున్నా, జుట్టురాలిపోయే పరిస్థితి తలెత్తకుండా చేసే ఒక ప్రొటీన్ ఇంజెక్షన్ను తైవాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కీమోథెరపీ మందులు ‘పీ–53’ అనే ప్రొటీన్ను ప్రేరేపిస్తాయని, ఇది జుట్టు పెరుగుదలను నిరోధిస్తోందని గుర్తించారు. దీనికి విరుగుడుగా జుట్టు పెరుగుదలకు దోహదపడే ‘డబ్ల్యూఎన్టీ–3’ అనే ప్రొటీన్ను గుర్తించారు. దీనిని ప్రయోగాత్మకంగా ఎలుకలపై పరీక్షించి, సత్ఫలితాలను సాధించామని నేషనల్ తైవాన్ వర్సిటీ శాస్త్రవేత్త సుంగ్ జాన్ లిన్ తెలిపారు. -
గుడ్డట్టు
అదే గుడ్డు.. అదే ఆమ్లేట్! రొటీన్గా గుడ్డుని పెనం మీద పగలగొట్టేస్తుంటే.. ఒంటికి పదమూడు గ్రాముల ప్రోటీన్లు తప్ప.. నోటికేం మిగులుతుంది.. టేస్టూ!! తిన్నామంటే తిన్నాం అనుకోకండి. తినడానికే ఉన్నాం అనుకుని.. ప్రయోగాలు చెయ్యండి. ప్లేటు నిండా గుడ్డట్టు వేసుకోండి. చైనీస్ ఆమ్లెట్ కావలసినవి: క్యారట్ – ఒకటి (చిన్నది), బీన్స్– రెండు(చిన్నవి), కోడిగుడ్లు – రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక టీ స్పూన్, ఉల్లిపాయ – ఒకటి ( చిన్నది), పచ్చిమిర్చి – ఒకటి, ఉప్పు – తగినంత, పెప్పర్ – ఒక టీ స్పూన్, నూనె లేదా నెయ్యి– రెండు టేబుల్ స్పూన్లు. తయారి : క్యారట్ సగం దుంపను పొడవుగా తురిమి గార్నిషింగ్ కోసం పక్కన ఉంచాలి. మిగిలిన సగాన్ని చిన్నగా (ఆమ్లెట్లో కలిసేటట్లు) తురమాలి. బీన్స్, ఉల్లిపాయలను సన్నగ తరగాలి. ఒక కప్పులో ఉల్లిపాయ, బీన్స్ ముక్కలు, తురిమిన క్యారట్, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరప్పొడి, ఉప్పు, పెప్పర్ వేసి కలపాలి. ఇందులో కోడిగుడ్డు సొన వేసి నురగ వచ్చే వరకు బీట్చేయాలి. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత కోడిగుడ్డు మిశ్రమాన్ని పెద్ద గరిటెతో కొంత భాగాన్ని మాత్రమే వేయాలి. దీనిని పలుచగా చేయకుండా మందంగానే ఉంచి సన్న మం మీద కాలనివ్వాలి. అప్పుడే లోపల ఉన్న క్యారట్, బీన్స్ మెత్తబడతాయి. మీడియం లేదా హై ఫ్లేమ్ మీద కాలిస్తే ఇవి ఉడికేలోపుగా ఆమ్లెట్ మాడిపోతుంది. రెండువైపులా కాల్చి తీసేయాలి. ఇలా మరికొంత నూనెను వేసి మిగిలిన మిశ్రమాన్ని కూడా కాల్చాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పొడవుగా తురిమిన క్యారట్తో గార్నిష్ చేయాలి. టొమాటో ఆమ్లెట్ కావలసినవి: టొమాటోలు – రెండు (మీడియం సైజువి), కోడిగుడ్లు – రెండు, పచ్చిమిర్చి – రెండు, ఉప్పు – రుచికి తగినంత, పసుపు – చిటికెడు, నూనె లేదా నెయ్యి – ఒక టేబుల్ స్పూన్. తయారి: ఒక టొమాటోను చిన్న ముక్కలుగా తరగాలి. ఒక టొమాటోను చక్రాలుగా తరగాలి. పచ్చిమిర్చిని సన్నగా తరగాలి. టొమాటో, మిర్చి ముక్కలను ఒక కప్పులో వేసి అందులో ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఇవి సమంగా కలిసిన తర్వాత కోడిగుడ్లను కొట్టి సొన వేయాలి. కోడిగుడ్డు సొనతో టొమాటో, మిర్చి ముక్కలు సమంగా కలిసి, నురగ వచ్చే వరకు ఎగ్బీటర్తో కలపాలి. బీటర్కు బదులుగా ఫోర్క్తో కాని స్పూన్ తో కాని ఎక్కువ సేపు చిలకాలి. బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి కాగిన తర్వాత ముందుగా కలిపి ఉంచిన మిశ్రమాన్ని అందులో వేసి మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత తిరగేసి రెండవ వైపు కాల్చాలి. దీనిని ప్లేట్లోకి తీసుకుని చక్రాలుగా తరిగిన టొమాటో ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. క్యాప్సికమ్ ఆమ్లెట్ కావలసినవి: క్యాప్సికమ్ – ఒకటి, ఉల్లిపాయ – ఒకటి కోడిగుడ్లు – రెండు, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, వైట్ పెప్పర్ – అర టీ స్పూన్, మిరప్పొడి – అర టీ స్పూన్, పసుపు – చిటికెడు, ఉప్పు– రుచికి తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్. తయారి: క్యాప్సికమ్లో సగభాగాన్ని చిన్న ముక్కలుగానూ, మిగిలిన సగాన్ని పొడవుగానూ తరగాలి. ఉల్లిపాయలను సన్నటి ముక్కలుగా తరగాలి. ఒక కప్పులో ఉల్లిపాయ ముక్కలు,చిన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలను వేసి అందులో వైట్పెప్పర్, ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు వేసి కలపాలి. పొడులన్నీ ముక్కలకు సమంగా పట్టిన తర్వాత కోడిగుడ్డు సొన వేసి నురగ వచ్చే వరకు బీట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కాగిన నూనెలో పోసి మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. రెండు వైపులా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పొడవుగా తరిగి ఉంచిన క్యాప్సికమ్తో గార్నిష్ చేయాలి. చీజ్ ఆమ్లెట్ కావలసినవి: చీజ్ – రెండు స్లైస్లు, ఉల్లిపాయ – ఒకటి, వైట్ పెప్పర్ – ఒక టీ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత, కొత్తిమీర – చిన్న కట్ట, కోడిగుడ్లు – రెండు. తయారి: ఉల్లిపాయను సన్నగా తరగాలి. కొత్తిమీరను కాడలు లేకుండా ఆకులను మాత్రమే తీసుకోవాలి. వీటిని సన్నగా తరిగి ఉల్లిపాయ ముక్కలతో కలపాలి. అందులో వైట్ పెప్పర్, ఉప్పు వేసి కలిపిన తర్వాత కోడిగుడ్డు సొన వేసి కలపాలి. చివరగా ఒక చీజ్ స్లైస్ను తురిమి కాని సన్నగా తరిగి కాని అందులో వేసి బీట్ చేయాలి. మరొక చీజ్ స్లైస్ను నాలుగు ముక్కలు చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి కాగిన తర్వాత కలిపిన మిశ్రమాన్ని పోసి కాలనివ్వాలి. ఒక వైపు కాలిన తర్వాత తిరగేసి కాల్చాలి. దీనిని ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచిన చీజ్ ముక్కలతో అలంకరించాలి. పనీర్ ఆమ్లెట్ కావలసినవి: పనీర్ – 25 గ్రా, కోడిగుడ్లు – రెండు, ఉప్పు – రుచికి తగినంత, వైట్పెప్పర్ – ఒక టీ స్పూన్, ఏలకుల పొడి – అర టీ స్పూన్, కొత్తిమీర – చిన్న కట్ట, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్. తయారి: పనీర్ క్యూబ్లో సగాన్ని గార్నిషింగ్ కోసం ఉంచి మిగిలిన సగాన్ని ఆమ్లెట్లో వేయాలి. గార్నిషింగ్ కోసం కొంత డైమండ్ ఆకారంలో కట్ చేసి, కొంత తురిమి పక్కన ఉంచాలి. ఆమ్లెట్లో వేయాల్సిన దానిని సన్నగా (ఆమ్లెట్ కోసం ఉల్లిపాయ ముక్కలు తరిగినంత సన్నగా) తరగాలి. కొత్తిమీరను కాడలు లేకుండా ఆకులు మాత్రమే తీసుకుని సన్నగా తరిగి పనీర్ ముక్కలతో కలపాలి. అందులో ఉప్పు, వైట్పెప్పర్, ఏలకుల పొడి వేసి కలిపిన తర్వాత కోడిగుడ్డు సొన వేయాలి. దీనికి మిరప్పొడి కాని పచ్చిమిర్చి కాని వేయకూడదు. కోడిగుడ్డు సొన నురగ వచ్చే వరకు బీట్ చేయాలి. బాణలిలో నెయ్యి వేసి కాగిన తర్వాత కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసి రెండు వైపులా కాలనివ్వాలి. ప్లేట్లో వేసి తురిమిన పనీర్ను సమంగా పరిచి, పనీర్ ముక్కలతో గార్నిష్ చేయాలి. -
వేరుశెనగ...
గుడ్ఫుడ్ వేరుశనక్కాయల్లో ప్రోటీన్లు చాలా ఎక్కువ. వంద గ్రాముల గింజల్లో 567 క్యాలరీల శక్తి, 25.8 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. అవి శక్తినివ్వడంలోనూ, గాయాలు మాన్పడంలోనూ బాగా ఉపయోగపడతాయి. వీటిల్లో కార్పోహైడ్రేట్లు 13 – 16 శాతమే. వంద గ్రాముల్లో 16.1 గ్రాముల పిండిపదార్థాలు ఉంటాయి. అందుకే డయాబెటిస్ రోగులు చిరుతిండిగా నిర్భయంగా తినవచ్చు.100 గ్రాముల్లో 49.2 గ్రాములు కొవ్వుపదార్థాలే. వాటిల్లో మోనో–అన్శాచ్యురేటెడ్ కొవ్వులు 24.43 గ్రాములు, పాలీ–అన్శాచ్యురేటెడ్ 15.46 గ్రా‘‘, శాచ్యురేటెడ్ కొవ్వులు 6.28 గ్రాములు. కాబట్టి ఇది ప్రధానమైన శక్తివనరు. వీటిల్లో విటమిన్ బి–కాంప్లెక్స్లోని ప్రధాన పోషకం బయోటిన్, ఫోలేట్ చాలా ఎక్కువ. గర్భవతులకు మేలుచేస్తాయి. విటమిన్–బి3గా పరిగణించే నియాసిన్ పుష్కలంగా ఉన్నందున ఇది గుండెజబ్బుల ముప్పును నివారిస్తుంది.మ్యాంగనీస్, కాపర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు చాలా ఎక్కువ. వాటి కారణంగా మంచి రోగనిరోధక శక్తి లభిస్తుంది. -
క్యాన్సర్... ఆహార ప్రణాళిక!
గుడ్ఫుడ్ ⇒ క్యాన్సర్ చికిత్సలో కీమో థెరపీ, క్రమం తప్పకుండా మందుల వాడకం ఎంత అవసరమో... డైట్ చార్ట్ కూడా అంతే అవసరం. ఆహారం తీసుకోవడంలో పాటించే నిడివి తగ్గాలి. అలాగే ఏది తినాలి? ఎలా తినాలి? అనేది ప్రధానమైన అంశం. చికిత్సకు ముందు, చికిత్స సమయంలో, ఆ తర్వాత మంచి ఆహారం తీసుకోవడం రోగులను శారీరకంగా దృఢంగా ఉంచుతుంది. ⇒ క్యాన్సర్ వ్యాధిని మాన్పడం (హీలింగ్), ఇన్షెక్షన్లను ఎదుర్కోవడం, అవసరమైన శక్తిని సమకూర్చడం అనే విషయాల్లో ప్రొటీన్లు, క్యాలరీలదే కీలక భూమిక. కాబట్టి క్యాన్సర్ రోగుల ఆహారం తగినన్ని ప్రొటీన్లు, క్యాలరీలు అందేలా ఉండాలి. రోజూ మూడు పూటల తీసుకునేందుకు బదులుగా ప్రతి గంటా – రెండు గంటలకోమారు ఆహారం తీసుకునేలా ఆహార ప్రణాళిక ఉండాలి. ⇒ శాకాహారులైతే... క్యాలరీలు, ప్రోటీన్లు అధికంగా ఉండే పదార్థాలు, తక్కువ కొవ్వుండే పాల ఉత్పాదనలు (లో ఫ్యాట్ డైరీ ప్రాడక్ట్స్), స్కిమ్డ్ మిల్క్ పౌడర్, తేనె, చక్కెర, నెయ్యి, పెరుగు, పాలతో చేసిన స్వీట్స్, ఫ్రూట్ మిల్క్ షేక్స్, పనీర్ వంటివి ఆహారంలో ఉండాలి. మాంసాహారం తీసుకునే వారైతే... చికెన్, చేపలు, గుడ్లు వంటివి తినవచ్చు. డ్రైఫ్రూట్స్, నట్స్ వంటి వాటి ద్వారా కూడా ప్రోటీన్లు, క్యాలరీలు ఎక్కువగా దొరుకుతాయి. ఈ సాధారణ సూచనలతో పాటు రోగి వ్యక్తిగత అంశాలను పరిగణనలోకి తీసుకొని న్యూట్రిషనిస్ట్ సలహా మేరకు ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ⇒ క్యాన్సర్ పేషెంట్లు... అన్ని పోషకాలు... (విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, నీరు) ఉండే సమతుల ఆహారం తీసుకోవాలనేది మర్చిపోకూడదు. ఎందుకంటే దేహం... చికిత్సను తట్టుకోవాలి, వ్యాధిని అరికట్టాలి... ఇందుకు మానసిక ధైర్యంతోపాటు శారీరక దృఢత్వం ఉండాలి. -
నువ్వూ...నేనూ...నూనె...!
పురుషులందు పుణ్యపురుషుల్లాగే నూనెల్లో మంచినూనెలు వేరు. ఉప్పు కప్పురమ్ము లాగే అమాయకంగా కనిపించే కొవ్వులూ ఉన్నాయి. టేస్టు కోసమే చూసుకుంటే... ఫ్రయ్ లోంచి పొయ్యిలోకి దూకేసినట్లు అనుకుంటారు చాలా వుంది. రోస్ట్లతో ఎందుకీ రొష్టు అనుకొని హేస్టీ నిర్ణయంతో నూనె వస్తువులనే ముట్టరు కొందరు. అసలు నూనె వాడకపోవడం మంచిదేనా? కానే కాదు. శరీరానికి నూనె అవసరం. అవసరమైనంత నూనెను తీసుకుంటూనే ఆరోగ్యం కాపాడుకునే వూర్గాలు ఉన్నాయా? ఉన్నాయి. కాకపోతే మోతాదు మించనివ్వకూడదంతే. ఆ మోతాదేమిటో, నూనె వాడినా కొవ్వు చేరకుండా జాగ్రత్తలెలాగో తెలుసుకునేందుకే ఈ కథనం... నారు పెరగడానికి నీరు ఎలాగో, కూరా, నారా, చారూలో రుచి పెరగడానికి నూనె అలాగ. తాలింపు నుంచి వేయింపు వరకు తన ప్రాధాన్యం చూపుతుంది. కిచిడీ నుంచి పచ్చడి వరకూ మటన్ నుంచి చికెన్ వరకు కిచెన్ను శాసిస్తుంది. అయితేనేం... నూనెకు నిత్యం నీలాపనిందలు. కమ్మదనాన్ని పెంచినా కోప్పడేవారే ఎక్కువ... జబ్బులన్నింటికీ కారణం అదేనంటూ. మనిషి బతకడానికి ఆహారంలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఖనిజాలూ, విటమిన్లతో పాటూ కొవ్వులూ కావాల్సిందే. మిగతావాటన్నింటికీ బోల్డ్డంత గౌరవం ఒక్క నూనెలకు తప్ప. వుహా అదొక్కటే ఆరోగ్యాన్ని పాడుచేసేట్లు అవవూనాలూ, ఆడిపోసుకోవడాలు. అది నిజమేనా? నూనెను నిరసించాల్సిందేనా? ఆరోగ్యం చెడిపోనివిధంగా నూనెల్ని ఉపయోగించుకోలేవూ?... తప్పక ఉపయోగించుకోవచ్చు. శరీరంలో కొవ్వులు పెరక్కుండా కాపాడుకోవచ్చు. అవసరం కూడా... శరీర నిర్వహణకు అన్ని పోషకాలూ అవసరమైన పాళ్లలో కావాలి. అదే సమతులాహారం. ఓ ఆరోగ్యకరమైన వ్యక్తి తన ఆహారంలో 55% కార్బోహైడ్రేట్లు, 25%ప్రోటీన్లు, 20% కొవ్వులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమతౌల్యంలో ఏది లోపించినా అది మనిషి శారీరక, మానసిక ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుంది. అందుకే శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలు సవుకూరేందుకు నూనెలు తీసుకొని తీరాల్సిందే. కాకపోతే అవసరమైన మోతాదుకు మించనివ్వకూడదు. పైగా అవి 20% కావాలంటే వాటి ప్రాధాన్యం ఎంతో గుర్తించి తీరాల్సిందే. నూనెల రకాలివి... శరీరానికి కొవ్వులను సవుకూర్చే నూనెలు 3 రకాలు. శాచురేటెడ్: సాధారణంగా ఇవి గది ఉష్ణోగ్రత వద్ద ఘనరూపంలో ఉంటాయి. తెల్లగా అవూయికంగా కనిపిస్తుంటాయి. అయితే కనిపించేంత అవూయికం కావవి. టేస్టీగా ఉన్నా కాస్తంత ఖతర్నాకే. అవే... నెయ్యి, వెన్న, జున్ను, మీగడ, పామోలిన్ ఆయిల్. (వాటితోపాటు పత్తిగింజల నుంచి తీసే నూనె కూడా శాచురేటెడ్ ఆయిలే. ఇది చాలా చవక కాబట్టి ఎక్కువ వుంది వాడుతుంటారు.) హైడ్రోజనేటెడ్: నెయ్యిలాంటి స్వాభావిక పదార్థాలను కృత్రివుంగా తయారు చేయడం కోసం ఈ ప్రక్రియ ద్వారా నూనెలు చేస్తారు. ఉదాహరణకు డాల్డా, వూర్జరిన్ వంటివి. (చిప్స్ వంటివి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే హైడ్రోజనేటెడ్ ఆయిల్స్లో వేయిస్తారు. పదార్థాలకు ఎక్కువ షెల్ఫ్లైఫ్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి). అన్శాచురేటెడ్: ఇందులో వుళ్లీ రెండు రకాలు ఉన్నాయి. మెుదటివి పాలీ అన్శాచురేటెడ్ నూనెలు. సంక్షిప్తంగా ‘ప్యూఫా’ అంటారు. ఇవి పొద్దుతిరుగుడు నూనె, కుసువు నూనె (సాఫ్ ఫ్లవర్ ఆయిల్) వంటివి. రెండో రకం నూనెలు మోనో అన్శాచురేటెడ్ ఆయిల్స్. సంక్షిప్తంగా ‘వు్యూఫా’ అంటారు. నువ#్వల నూనె, సోయాబీన్ నూనె, ఆలివ్ ఆయిల్... (వీటన్నింటిలోనూ ఆలివ్ ఆయిల్ వుంచిదంటారు నిపుణులు) ఇవన్నీ వు్యూఫా ఆయిల్స్. నిజంగానే ప్రమాదమా..?: కానే కాదు. పైగా వుుందుగా చెప్పినట్లు శరీరంలోని కీలక అవయవాల పరిరక్షణకు అవసరం కూడా. వునలోని కాలేయం కొన్ని కొవ్వులను తయారుచేస్తుంది. అందులో కొలెస్ట్రాల్ ఒకటి. కానీ ఈ ప్యూఫా, మన శరీరంలో తయారుకావలి. కాబట్టి శరీరానికి అవసరమైనవాటిగా ఈ నూనెల్ని ఆహారంలో తీసుకోక తప్పదు. ఇవి తీసుకోక తప్పదు కాబట్టే వీటిని ‘ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్’ అని కూడా అంటారు. పైగా విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ... వంటి కొన్ని విటమిన్లు శరీరంలోకి అబ్జార్బ్ కావాలంటే నూనెలు తీసుకోక తప్పదు. వాటిని ‘ఎసెన్షియల్’ అంటున్నావుంటే అవెంత అవసరమైనవో తెలియడం లేదూ! ఇక చేపల నుంచి అందే నూనెల్లో, అవిసె గింజల నూనెలో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాటితో సుదీర్ఘకాలం ఆరోగ్యంతో పాటు వయసు కనపడకపోవడం వంటి సుగుణాలు ఉంటాయి. అందుకే వూంసాహారం తినేవారైతే వారానికి కనీసం వుూడు, నాలుగు రోజులు చేపలను సిఫార్సు చేస్తుంటారు ఆహారనిపుణులు. ఆరోగ్యాన్ని కాపాడుకోండి... ఇలా! నూనెలు ఎక్కువగా తీసుకుంటే అవి కొవ్గా వూరి రక్తనాళాల్లో పేరుకుపోతాయన్న విషయం తెలిసిందే. గుండెకు వెళ్లే రక్తనాళాల్లో ఈ కవ్వు పేరుకుని గుండె కండరానికి రక్తం సరఫరా కాకపోతే గుండెపోటు వచ్చే ప్రవూదం ఉంటుంది. రక్తపోటూ పెరుగుతుంది. ఇలాంటి ప్రవూదాలెన్నో ఉన్నాయి. అయితే మరోపక్క అవి అత్యవసరం కూడా. మరెలా? అందుకే ప్యూఫా, లను ఒకదానిపై ఒకటి నిఘా ఉంచేలా చేస్తే సరి అంటున్నారు నిపుణులు. శరీర అవయవాలన్నింట్లోనూ వీవీఐపీ గుండె. అంతటి వీఐపీకి ఇద్దరు సెక్యూరిటీ గార్డులను ఉంచితే సరి. ‘ప్యూఫా, మ్యూఫా’ నూనెలు రెంటినీ తీసుకుంటే వీవీఐపీ లాంటి గుండెకు రక్షణగా ఉంటాయవి. ప్యూఫా (పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్) నూనెలైన పొద్దుతిరుగుడు లేదా కుసుమ నూనెలను ఓ పూట తీసుకోవాలి. వురో పూట వు్యూఫా (మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్) నూనెలైన ఆలివ్ లేదా వేరుసెనగ నూనెలను తీసుకోవాలి. షిఫ్ట్ డ్యూటీల్లో ప్యూఫా, మ్యూఫా: ఈ ప్యూఫా, మ్యూఫాలను ఉదయం ఒక వెరైటీ నూనె ఉపయోగిస్తే, సాయంత్రం మరోటి ఉపయోగించాలి. అలా కాకపోతే ఒక నెలంతా ప్యూఫా ఉపయోగిస్తే, వురో నెలలో వు్యూఫా వాడాలన్నవూట. అంటే... ఒకనెల పొద్దుతిరుగుడు నూనె తీసుకుంటే మరో నెల వేరుశెనగ నూనె వాడాలి. దాంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. ఇలా ఉదయం, సాయంత్రం, ఓ నెల అదీ, వురో నెల ఇదీ అంటూ పూట షిఫ్టుల్లోగానీ, నెల, నెలా షిఫ్టుల్లోగానీ ఈ ప్యూఫా, మ్యూఫాలను ఉపయోగిస్తే వీవీఐపీ అయిన గుండె థిలాసా అన్న భరోసా మీ సొంతం. రౌడీ బాబాయిలతో రవ్వంత జాగ్రత్త... ఎలాగూ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు కదా అని హృదయాన్ని రఫ్ ఆడించే రౌడీలను లోనికి పంపడం సరికాదు కదా. అలాగే ఆరోగ్యం కోసం ప్యూఫా, మ్యూఫా తీసుకుంటున్న ధీమాతో నెయ్యీ, వెన్న, మీగడలను తీసుకోవద్దు. గుండెకు హాని చేసే రౌడీబాబాయిలివి. బంధం విషయంలో బాబాయిల్లా – రుచి విషయంలో శాచురేటెడ్ ఆయిల్స్ అయిన నెయ్యి, వెన్న, మీగడలు కమ్మగా ఉంటాయి. మెత్తగా ఉంటూనే గుండెలు కోసే టైపు అవి. నిజానికి ప్యూఫా నూనెలు శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ను బ్యారికేడ్లా అడ్డుకుంటాయి. రక్తనాళాలనుంచి కొలెస్ట్రా్టల్ కవ్వును శుభ్రం అయ్యేలా చేస్తుంటాయి. అయితే ప్యూఫా ఎలాగూ కొలెస్ట్రాల్ను బయటకు పంపేస్తుంది కదా అని నెయ్యి, వెన్న, మీగడలు తీసుకుంటుంటే... ప్యూఫా నూనెలు కొలెస్ట్రాల్ శుభ్రపరిచే వేగం కంటే శాచురేటెడ్ కొవ్వుల వల్ల శరీరంలో పేరుకుపోయే కొవ్వు ఎక్కువ. పరిమితి ఎంత...? నూనెలు ఎక్కువైనా ప్రమాదం. అందుకే మోతాదు మించనివ్వకూడదు. మీ ఇంట్లో ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి మీరు ఉపయోగించే నూనె ఎక్కువా? తక్కువా అన్న విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. తల ఒక్కంటికి నెలకు 500 ఎంఎల్ నూనె వాడితే మంచిది. అంటే... ఐదుగురు సభ్యులున్న ఇంట్లో నెలకు రెండున్నర లీటర్ల నూనె సరైన వినియోగం అన్నమాట. ఇవీ ప్రమాదాలు...: ఆహార పదార్థాలను బాగా ఫ్రై చేసి ఉపయోగించేందుకు నూనెలు వాడుతుంటారు. నిజానికి బాగా ఫ్రై చేయడం వల్ల ఆహారంలోని పోషకాలు వెళ్లిపోతాయి. దాంతో ప్రయోజనం లేదు. పైగా ఆలివ్ ఆయిల్ వంటి నూనెల్లోని రసాయన బంధాలు వేడి చేయడం వల్ల త్వరగా విడిపోతుంటాయి. అందుకే ఆలివ్ ఆయిల్తో డీప్ ఫ్రైస్ చేసుకోవద్దు. మరోవూట... ప్యూఫా, వు్యూఫాలను విడివిడిగానూ వాడుకోవాలి. రెండూ ఉపయోగిస్తే మంచిది కదాని రెండూ కలిపి ఉపయోగించవద్దు. ఎందుకంటే... వేడిచేసే సవుయంలో వాటి వాటి స్మోకింగ్ పాయింట్స్ వేర్వేరుగా ఉంటాయి. అందుకే దేనికదే వాడాలి. ఓసారి ఫ్రై చేయడం కోసం కాచిన నూనెను వురోవూరు ఉపయోగించకూడదు. మెుదటిసారి కాచిన నూనె వురోవూరు ఉపయోగిస్తే అది క్యాన్సర్ కారకం (కార్సినోజెనిక్) అవ#తుంది. కాబట్టి వాటిని పారేయడమే వుంచిది. కత్తికి రెండువైపులా పదునులాగే నూనెల విషయంలోనూ అంతే. కత్తిలాగే నూనె కూడా నిత్యావసరమే. అందుకే విచక్షణతో, జాగ్రత్తతో వాడుకుంటే అదెంతో రుచే కాదు... ఆరోగ్యం కూడా. ఎలాగూ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు కదా అని గుండెను రఫ్ ఆడించే రౌడీలను లోనికి పంపడం సరికాదు కదా. అలాగే ఆరోగ్యం కోసం ప్యూఫా, మ్యూఫా తీసుకుంటున్న ధీమాతో నెయ్యి, వెన్న, మీగడలను తీసుకోవద్దు. గుండెకు హాని చేసే రౌడీబాబాయిలివి. – యాసీన్, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అమ్మకు ఆహారం!
గర్భధారణ ఒక అద్భుతమైన అనుభవం. పండంటి బిడ్డ కావాలనుకోవడం కాబోయే తల్లిదండ్రులు కోరుకునే వరం. అందుకోసం చేయాల్సిందల్లా సమతులమైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం. ఏయే రకాల ఆహారాలు, ఎంతెంత తీసుకోవాలి, ఏయే వేళల్లో తినాలన్న విషయంపై అవగాహన కోసం ఈ వివరాలు... ఎప్పుడూ తీసుకునే దానికంటే గర్భవతిగా ఉన్నప్పుడు పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవడం మరింత ఎక్కువ అవసరం. ఆ సమయంలో ఆహారంలో ప్రోటీన్లు, ఐరన్, క్యాల్షియమ్... అన్ని పోషకాలు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ తీసుకోవడానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. గర్భవతులు ఏయే సమయాల్లో ఏయే ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి. 1 గర్భధారణ సమయంలోని మొదటి మూడు నెలల కాలంలో ఫస్ట్ ట్రైమిస్టర్ ఫోలిక్ యాసిడ్: ఈ పోషకాన్ని గర్భధారణ జరగకమునుపు ఒక నెల ముందునుంచే తీసుకోవడం పుట్టబోయే బిడ్డకు చాలా మేలు చేస్తుంది. ఆకుపచ్చని రంగులో ఉండే పాలకూర వంటి ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఈ పోషకం బిడ్డలో ఆరోగ్యకరమైన వెన్ను అభివృద్ధికి దోహదం చేస్తుంది. కణవిభజన బాగా జరిగేందుకు దోహదం చేస్తుంది. ఆకుపచ్చని కూరల్లో ఉండే హైమెగ్నీషియమ్ పాళ్ల వల్ల దాదాపు 90 శాతం కేసుల్లో వేవిళ్లు తగ్గుతాయని ఒక అధ్యయనంలో తేలింది. ఐరన్: కడుపులోని బిడ్డ త్వరత్వరగా ఎదుగుతుంది. ఆరో వారంలో గుండె స్పందనలు, ఎర్ర రక్తకణాలు మొదలవుతాయి. అందుకే ఈ సమయంలో ఐరన్ ఎక్కువగా అవసరం. ముదురాకుపచ్చరంగులో ఉండే ఆకుకూరల్లో ఐరన్ ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో ఐరన్ రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి హీమ్ ఐరన్ కాగా, మరొకటి నాన్ హీమ్ ఐరన్. ఈ రెండూ కడుపులోని బిడ్డకు మేలు చేసేవే. హీమ్ ఐరన్ చాలావరకు మాంసం, చేపలు... లాంటి మాంసాహారం నుంచి లభిస్తుంది. నాన్–హీమ్ (ఇనార్గానిక్ ఐరన్) ఆకుపచ్చని ఆకుకూరల్లో (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్), డ్రైఫ్రూట్స్లో ఉంటుంది. నాన్ హీమ్ ఐరన్తో పోలిస్తే హీమ్ ఐరన్ మన శరీరంలోకి నేరుగా వేగంగా అబ్సార్బ్ అవుతుంది. అదే నాన్హీమ్ ఐరన్ అబ్సార్బ్ అయ్యేందుకు విటమిన్ ’సి’ సహాయం అవసరం. అందుకే ఆరంజ్ జ్యూస్ వంటివి తాగితే అందులోని విటమిన్ ’సి’ సహాయంతో నాన్హీమ్ ఒంటిలోకి ఇంకిపోతుంది. డీహెచ్ఏ: గర్భధారణ జరిగిన పన్నెండో వారంలో చిన్నారి శరీరంలోని మిగతా అవయవాలతో పోలిస్తే మెదడు ఎదుగుదల చాలా వేగంగా జరుగుతుంది. ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్లో ఒక రకమైన... డొకోజా హెగ్సీనిక్ యాసిడ్ (డీహెచ్ఏ) అనే పోషకం పుష్కలంగా ఉండే చేపలు ఎక్కువగా తినడం వల్ల బిడ్డ మెదడు ఎదుగుదల మరింత ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే డీహెచ్ఏ, ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా దొరికే చేపల వంటి ఆహారాన్ని తీసుకోవాలి. డీహెచ్ఏ ఎక్కువగా తీసుకునేవారి పిల్లల్లో జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో తెలిసింది. 2 నాలుగో నెల నుంచి ఆరో నెల వరకు రెండో ట్రైమిస్టర్ విటమిన్ ఏ: ఈ సమయంలో ‘విటమిన్ ఏ’ పాళ్లు ఎక్కువగా ఉన్న పోషకాహారాన్ని తీసుకోవాలి. క్యారట్, చిలగడదుంప వంటి ఆహారపదార్థాల్లో బీటాకెరోటిన్ ఎక్కువ. ఇది విటమిన్ ఏ ను సమకూరుస్తుంది. ఈ సమయంలో బిడ్డ కళ్లు క్రియాశీలమవుతాయి కాబట్టి విటమిన్ ఏ ను సమకూర్చే బీటాకెరొటిన్ లభ్యమయ్యే ఆహారాలు బిడ్డకు మేలు చేస్తాయి. క్యాల్షియమ్: రెండో ట్రైమిస్టర్లో బిడ్డ ఎముకల ఎదుగుదల, అవి బలంగా రూపొందడం జరుగుతుంది. అందుకే తల్లి ఆ సమయంలో క్యాల్షియమ్ పుష్కలంగా ఉండే ఆహారాలైన పాలు, పెరుగు, చీజ్, టోఫూ, సార్డిన్ చేపల వంటివి తీసుకోవాలి. విటమిన్ డి: ఈ విటమిన్ ఎముకల్లోకి క్యాల్షియమ్ను ఇంకేలా చేసి, ఎముకలకు బలాన్ని సమకూరుస్తుంది. లేత ఎండలో నిలబడటం లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం, పాలు, కొన్ని రకాల పుట్టగొడుగులలో విటమిన్–డి పుష్కలంగా లభిస్తుంది. జింక్: ఈ సమయంలో తీసుకోవాల్సిన మరో ముఖ్యమైన పోషకం జింక్. ఇది డీఎన్ఏలు రూపొందడం, వాటి రిపేర్లు, అవి క్రీయాశీలంగా మారడానికి దోహదం చేస్తుంది. కణవిభజన వేగంగా జరగడానికి తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపకరిస్తుంది. 3 7వ నెల నుంచి తొమ్మిదో నెల నిండాక ప్రసవం వరకు మూడో ట్రైమిస్టర్ గర్భధారణ సమయంలో 30 వారాలు నిండాక విటమిన్ కె పుష్కలంగా అందేలా పాల కూర వంటి ఆకుకూరలు తీసుకోవాలి. ఈ విటమిన్ రక్తం గడ్డకట్టడానికి ఉపకరిస్తుంది. మెగ్నీషియమ్: బిడ్డకు తగినంత మెగ్నీషియమ్ సమకూరేందుకు తల్లి పుష్కలంగా పాలు తాగాలి. ఇక 38వ వారానికి బిడ్డలో ఊపిరితిత్తులు మినహా మిగతా అవయవాలన్నీ పూర్తిగా రూపొందుతాయి. సెలీనియమ్: ఈ పోషకాన్ని పొందడానికి బ్రెజిల్ నట్స్ తీసుకోవడం మేలు చేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల రూపకల్పనకు దోహదపడుతుంది. యాంటీఆక్సిడెంట్స్, ఇంకా విటమిన్ సి, విటమిన్ ఇ.. ఇవి బిడ్డ వ్యాధి నిరోధకశక్తిని మరింత పెంచుతాయి. అందుకే అవి సమకూరడానికి పొట్టుతో ఉన్న ధాన్యాలు, చేపలు, టొమాటోలతో పాటు నారింజ, జామ వంటి పండ్లుతో పాటు ఉసిరిని ఏ రూపంలోనైనా తీసుకోవాలి. సుజాతా స్టీఫెన్ చీఫ్ న్యూట్రిషనిస్ట్ యశోదా హాస్పిటల్స్ మలక్పేట, హైదరాబాద్ -
బాటిల్లో భోజనం!
టెక్ టాక్ ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు రెండు వేల కేలరీల ఆహారం అవసరమని.. ఇందులో అన్ని రకాల విటమిన్లు, ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండాలని శాస్త్రం చెబుతోంది. మరి... ఇలాంటి ఆహారం ఎక్కడ దొరుకుతుందీ అంటే మా సూపర్ డ్రింక్ ట్రై చేయండి అంటోంది శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆంపుల్ మీల్స్’ సంస్థ. ఆహారం పేరు చెప్పి డ్రింక్ గురించి చెబుతున్నారేమిటని ఆశ్చర్యపోకండి. ఇక్కడ అవి రెండూ ఒక్కటే. ఎందుకంటే ఆంపుల్మీల్స్ ఒకపూట భోజనంలో ఉండాల్సినన్ని ఆరోగ్యకరమైన అంశాలన్నింటినీ బాటిల్లోకి చేర్చేసింది మరి! మనం చేయాల్సిందల్లా ఈ బాటిల్లోకి కొన్ని నీళ్లు/పాలు చేర్చుకోవడం... బాగా కదిలించి గొంతులోకి దింపేసుకోవడమే! చిలగడదుంపల నుంచి గుమ్మడి విత్తనాల వరకూ పాలకూర నుంచి అరటిపండు వరకూ అన్ని రకాల ఆహార పదార్థాల్లోని పోషకాలను దీంట్లో మేళవించారు. కొవ్వుల కోసం ఏమేం కలిపారో, ప్రొటీన్ల కోసం వాడినవి ఏమిటో... ఈ బాటిల్పైన ఉంటాయి. మీ శారీరక అవసరాలను బట్టి 400, 600 కిలో కేలరీల విభాగాల్లో దొరుకుతోంది ఈ సూపర్ డ్రింక్. వంట తంటా లేకుండా ఆరోగ్యకరమైన ఆహారమన్నమాట! -
స్కానింగా మజాకా...
మీరు తీసుకునే ఆహారంలో క్యాలరీలు, ప్రొటీన్లు, షుగర్ లాంటివి ఎంతెంత ఉన్నాయో తెలుసా? పోనీ తెలుసుకోవాలని ఉందా? అవి చూస్తే కనపడవు. మరి ఎలా? స్కాన్ చేస్తే సరిపోతుంది. స్కానింగ్లో అవన్నీ ఎలా తెలుస్తాయనేగా మీ సందేహం. ఏమీ లేదండీ.. పక్కన కనిపిస్తున్న పరికరం పేరు ‘టెల్స్పెక్’. దీంతో మీరు తినే ఆహారాన్ని స్కాన్ చేయాలి. అప్పుడు అందులో ఎన్ని క్యాలరీలు, ప్రొటీన్లు ఉన్నాయో చెప్పడమే కాక ఎన్ని రసాయనాలున్నాయో కూడా చెప్పేస్తుంది. ఎలా అంటే, ఆ సమాచారమంతా దానికి అమర్చి ఉన్న బ్లూటూత్ ద్వారా మీ మొబైల్ లేదా ఐప్యాడ్లో కనిపిస్తుంది. దానివల్ల ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ... రసాయనాలతో కూడిన ఆహారానికి దూరంగా ఉండొచ్చు. -
ఇలా తింటే ఎక్కువకాలం జీవిస్తారు...
కొత్త పరిశోధన శరీరానికి మేలు చేసే పిండి పదార్థాలను ఎక్కువగా, ప్రొటీన్లను కాస్త తక్కువగా ఆహారంలో తీసుకుంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొత్తం కేలరీల్లో 40 శాతం తగ్గించుకుంటే ఎలాంటి ఫలితం వస్తుందో, పిండి పదార్థాలను ఎక్కువగా, ప్రొటీన్లను కాస్త తక్కువగా తీసుకున్నప్పుడు కూడా దాదాపు అలాంటి ఫలితమే దక్కుతుందని వారు అంటున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ వర్సిటీ వైద్య నిపుణులు ఎలుకలపై జరిపిన పరిశోధనలో ఈ విషయం తేలింది. డయాబెటిస్, స్థూలకాయం బారిన పడకుండా ఉండేందుకు రోజువారీ ఆహారంలో ఏకంగా 40 శాతం కేలరీలను తగ్గించుకోవడం అంతగా ఆచరణ సాధ్యం కాదని, దాని బదులు పిండి పదార్థాలను బాగా తీసుకుని, ప్రొటీన్లను కొంతమేరకు తగ్గించుకున్నట్లయితే తేలికగా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని సిడ్నీ వర్సిటీ నిపుణుడు డాక్టర్ స్టీఫెన్ సింప్సన్ చెబుతున్నారు. -
బలమైన కండరాలకు విటమిన్-ఇ
కొత్త పరిశోధన ప్రొటీన్లు మాత్రమే కాదు, బలమైన కండరాల కోసం విటమిన్-ఇ కూడా చాలా అవసరం అని నిపుణులు చెబుతున్నారు. కండరాల దారుఢ్యాన్ని కాపాడటంలో విటమిన్-ఇ కీలక పాత్ర పోషిస్తుందని వారు అంటున్నారు. మన శరీరంలో ప్రతి కణం చుట్టూ ప్లాస్మా పొర ఉంటుంది. ఇది బలహీనపడితే, కణం దెబ్బతింటుంది. కణాల చుట్టూ ఉండే ప్లాస్మా పొర దెబ్బతినకుండా కాపాడటమే కాకుండా, బలహీనంగా మారిన ప్లాస్మా పొరను తిరిగి యథాస్థితికి తేవడంలో విటమిన్-ఇ కీలక పాత్ర పోషిస్తుందని జార్జియా మెడికల్ కాలేజీ నిపుణులు ఇటీవల జరిపిన పరిశోధనలో వెల్లడైంది. -
బాదంతో... గుండెజబ్బులకు చెక్
దినుసు ‘ఫలాలు’ బాదం పప్పులో విటమిన్ ‘ఇ’, కాపర్, మెగ్నీషియం, ఎక్కువ మోతాదులో ప్రోటీన్లు ఉంటాయి. బాదం గింజలలోని బయో యాక్టివ్ మాలిక్యూల్స్ (పీచు, ఫైటోస్టెరోల్స్, విటమిన్లు, ఖనిజలవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు) గుండె సంబంధ వ్యాధులను నివారిస్తాయి. * బాదంలోని రిబోఫ్లేవిన్, ఎల్- కామిటైన్లు మెదడుకు పోషకాలుగా పని చేస్తాయి. కాబట్టి ఇవి మెదడును చురుగ్గా ఉంచుతాయి. వార్ధక్యంలో ఎదురయ్యే అల్జీమర్స్ వ్యాధిని నివారిస్తాయి. * బాదం గింజలలోని సూక్ష్మ పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. నరాల వ్యవస్థను శక్తిమంతం చేస్తాయి. రక్తాన్ని వృద్ధి చేస్తాయి. దంతాలు, ఎముకలను గట్టిపరుస్తాయి. కాబట్టి వార్ధక్యంలో వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులను నివారించవచ్చు. చర్మం కాంతివంతమవుతుంది. * పిల్లలకు రోజూ రెండు లేదా మూడు బాదం గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినిపిస్తే మంచిది. * బాదం తింటే దేహంలో కొవ్వు స్థాయులు పెరుగుతాయనే అపోహ చాలా బలంగా ఉంది. కానీ నిజానికి ఇది పూర్తిగా అవాస్తవం. ఇందులోని ఫ్యాటీ యాసిడ్ల వల్ల దేహ నిర్మాణానికి, జీవక్రియలకు అవసరమైన కొవ్వు సమృద్ధిగా లభిస్తుంది. ఇవి దేహంలోని కొలెస్ట్రాల్ స్థాయులను సమన్వయం చేస్తాయి. -
జీవాణువులు.. ముఖ్యాంశాలు
జీవం అనేది పరమాణువులు, సంశ్లిష్ట అణువులతో ఏర్పడింది. వాటిలో ప్రధానమైనవి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, న్యూక్లియిక్ ఆమ్లాలు, లిపిడ్లు మొదలైనవి. వీటిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు మనం తీసుకునే ఆహారంలో ప్రధాన భాగం. అంతేకాకుండా కొన్ని ఖనిజ లవణాలు, విటమిన్లు వంటివి కూడా జీవ క్రియల్లో ముఖ్య పాత్రను పోషిస్తాయి. కార్బోహైడ్రేట్లు: కార్బోహైడ్రేట్లు.. గ్లూకోజ్, చక్కెర (సుక్రోజ్) వంటి తక్షణ శక్తినిచ్చే పదార్థాలు. ఇవి మొక్కల్లో పిండి పదార్థాల (స్టార్చ) రూపంలో, జంతువుల్లో గ్లైకోజెన్, గడ్డి (సెల్యులోజ్) రూపంలో నిల్వ ఉంటాయి. వీటి సాధారణ ఫార్ములా: ఇ్ఠ(ఏ2ై)డ. ఇవి అనేక సంఖ్యలో హైడ్రాక్సీ ప్రమేయాలున్న ఆల్డిహైడ్లు లేదా కీటోనులు. రుచికి తీపిగా ఉండే కార్బోహైడ్రేట్లను చక్కెరలు అంటారు. ఉదాహరణ: నిత్యం మనం ఉపయోగించే చక్కెర. దీని రసాయన నామం సుక్రోజ్ (పాలలోని చక్కెర లాక్టోజ్, తేనెలోని చక్కెర ఫ్రక్టోజ్). పండిన ద్రాక్షలో గ్లూకోజ్ ఉంటుంది. ఇందులోని అత్యంత తియ్యనైన పదార్థం ఫ్రక్టోజ్. గ్రీకు భాషలో శాఖరాన్ అంటే చక్కెర అని అర్థం. అందుకే కార్బోహైడ్రేట్లను శాకరైడ్లు అని కూడా అంటారు. ఒక సంక్లిష్టమైన స్టార్చ (బియ్యం, గోధుమలు, ఆకుకూరల్లో ఉండేది), సెల్యులోజ్ (గడ్డి, పత్తి, కలపలో లభించేది) వంటి కార్బోహైడ్రేట్లను అ చక్కెరలు (ూౌటఠజ్చటట) అంటారు. సాధారణంగా కార్బోహైడ్రేట్లు కార్బన్(ఇ), హైడ్రోజన్ (ఏ), ఆక్సిజన్ (ై) అనే మూలకాలతో నిర్మితమవుతాయి. సెల్యులోజ్, స్టార్చను ‘జలవిశ్లేషణ’ అనే ప్రక్రియ ద్వారా విడగొడితే చివరగా వచ్చేది గ్లూకోజ్. అంటే ఇటుకలతో గోడ నిర్మాణమైనట్లు గ్లూకోజ్ అనే అణువుతో స్టార్చ, సెల్యులోజ్ అనే సంక్లిష్ట అణువులు రూపొందుతాయి. సెల్యులోజ్ అనే ఎంజైమ్ మానవుల్లో ఉండదు. కాబట్టి గడ్డి (సెల్యులోజ్ ) మానవుల్లో జీర్ణం కాదు. స్టార్చను ‘అయోడిన్’ ద్రావణంతో గుర్తిస్తారు. స్టార్చ అయోడిన్తో కలిసి నీలి రంగును ఇస్తుంది. పాలలో చిక్కదనం కోసం స్టార్చ్ (పిండి)ని కలిపితే అయోడిన్ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. చక్కెర పరిశ్రమలో లభించే మొలాసిస్లో సుక్రోజ్ ఉంటుంది. దీన్ని ఉపయోగించి ‘కిణ్వప్రక్రియ’ ద్వారా ఆల్కహాల్ తయారు చేస్తారు. బ్యాక్టీరియా, మొక్కల కణ త్వచాలు(ఇ్ఛ గ్చిట) కార్బోహైడ్రేట్ల ద్వారా నిర్మితమవుతాయి. కాగితం పరిశ్రమలో కూడా సెల్యులోజ్ (కలప)ను ఉపయోగిస్తారు. ప్రోటీన్లు: పప్పు ధాన్యాలు, చిక్కుళ్లు, బఠానీలు, చేపలు, మాంసం, పాలు, చీస్ తదితర ఆహార పదార్థాలలో ప్రధానంగా ఉండే మాంసకృత్తులనే ప్రోటీన్లుగా వ్యవహరిస్తారు. జీవుల నిర్మాణానికి, నిర్వహణకు, ఎదుగుదలకు ఇవి ఎంతో ముఖ్యమైనవి. రసాయనికంగా ఇవి ఎమైనో ఆమ్లాల ద్వారా నిర్మితమవుతాయి (ఎమైనో ఆమ్లాల పాలీమర్లు). వీటిలో ృఇైృూఏృ అనే ఎమైడ్ బంధం పునరావృతమవుతుంది. అందువల్ల వీటిని పాలీ ఎమైడ్లు అంటారు. ఇవి కార్బన్ (ఇ), హైడ్రోజన్(ఏ) నైట్రోజన్(ూ), ఆక్సిజన్ (ై)లతో రూపొందుతాయి. పట్టు (సిల్క్), వెంట్రుకలు, ఉన్నిలో లభించే ప్రోటీన్ను కెరొటిన్ అంటారు. కండరాల్లో ఉండే ప్రోటీన్ మియోసిన్. రక్తంలో ఆక్సిజన్ను మోసుకుపోయే ‘హిమోగ్లోబిన్’ కూడా ఒక రకమైన ప్రోటీన్. లోపభూయిష్ట ప్రోటీన్ ‘సికిల్సెల్ హిమోగ్లోబిన్’ కారణంగా ‘సికిల్సెల్ ఎనీమియా’ అనే రక్త లోప వ్యాధి కలుగుతుంది. మన శరీరంలోని వివిధ రసాయన చర్యల్లో జీవ ఉత్ప్రేరక ఎంజైములుగా కూడా ప్రోటీన్లు వ్యవహరిస్తాయి. జంతు కణజాలం ప్రోటీన్లతో నిర్మితమవుతుంది. చాలా వరకు రోగకారక క్రిముల నుంచి రక్షణ కల్పించే ‘యాంటీ బాడీస్’గా కూడా ప్రోటీన్లు పని చేస్తాయి. వేడి చేసినప్పుడు ప్రోటీన్లు జీవ చర్యా శీలత కోల్పోతాయి. దీన్నే ప్రోటీన్ స్వభావ వికలత (ప్రోటీన్ డీనాచురేషన్) అంటారు. ఉదాహరణ: నీటిలో మరిగించినప్పుడు గుడ్డులోని తెల్లసొన స్కందనం చెందడం. పాలలోని బ్యాక్టీరియా ఏర్పర్చిన లాక్టికామ్లం పాలను పెరుగుగా మార్చడం కూడా స్వభావ వికలత (పాలు పులిసినప్పుడు వచ్చే వాసనకు కారణం లాక్టికామ్లం) కిందకు వస్తుంది. లిపిడ్లు: నూనె గింజలు, నూనెలు, కొవ్వుల్లో లిపిడ్లు ఉంటాయి. ఇవి తక్కువ పరిమాణంలో ఎక్కువ శక్తినిచ్చే పదార్థాలు (ఎక్కువ కెలోరిఫిక్ విలువను కలిగి ఉంటాయి). రసాయనికంగా గ్లిజరాల్, ఫాటీ ఆమ్లాల ట్రైఎస్టర్లు. నీటిలో కరగవు. ఇవి సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో నూనెలుగా, ఘన రూపంలో కొవ్వులుగా ఉంటాయి. అందుకే గది ఉష్ణోగ్రత వద్ద నెయ్యి ఘన రూపంలో ఉంటుంది. చాలావరకు నూనెలు ఒకటి అంతకంటే ఎక్కువ కార్బన్-కార్బన్ ద్విబంధాల (అసంతృప్తత)ను కలిగి ఉంటాయి. వీటిని ‘నెకెల్)’ లోహం సమక్షంలో హైడ్రోజనీకరణం చేస్తే సంతృప్త ‘కొవ్వు’ (ఉదాహరణ: డాల్డా)లుగా రూపాంతరం చెందుతాయి. హైడ్రోజనీకరణం ద్వారా అసంతృప్త నూనెలు సంతృప్త కొవ్వులుగా మారతాయి. ఆరోగ్యానికి అసంతృప్త నూనెలు మేలు చేస్తాయి. నూనెలను సోడియం హైడ్రాక్సైడ్ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ వంటి క్షారాలతో చర్య జరిపి సపోనిఫికేషన్ అనే క్షారజల విశ్లేషణ పద్ధతి ద్వారా సబ్బులను తయారు చేస్తారు. సబ్బు అనేది ఫాటీ ఆమ్లాల సోడియం (బట్టల సబ్బు) లేదా పొటాషియం (స్నానానికి ఉపయోగించే సబ్బు) లవణం. గ్లిజరాల్ అనేది లిపిడ్ల సహ ఉత్పన్నం. కొన్ని ముఖ్యమైన ఫాటీ ఆమ్లాలు: లారిక్ ఆమ్లం (కొబ్బరి నూనె, వెన్న), స్టియరిక్ ఆమ్లం (వెన్న, జంతువుల కొవ్వు). ఇవి సంతృప్త ఫాటీ ఆమ్లాలు. ఓలియిక్ ఆమ్లం(పత్తి, సోయా). ఇది అసంతృప్త ఫాటీ ఆమ్లం. దుర్వాసనను తొలగించే సబ్బులు, సూక్ష్మక్రిమి నాశక సబ్బులలో 3,4,5-ట్రైబ్రోమోసాలిసిలానిలైడ్ ఉంటుంది. మాయిశ్చరైజింగ్ పారదర్శక సబ్బులలో గ్లిజరాల్ ఉంటుంది. సాధారణ సబ్బులు కఠిన జలం (ఉప్పునీరు)తో నురగనివ్వవు. అందువల్ల అవి ఉప్పు నీటిలో తెల్లని అవక్షేపాన్నిచ్చి శుభ్రపరిచే గుణాన్ని కోల్పోతాయి. ఈ విషయంలో డిటర్జెంటులు మెరుగ్గా పని చేస్తాయి. ఇవి కఠిన జలంతో కూడా నురగనిస్తాయి. రసాయనికంగా ఇవి ఆల్కైల్ బెంజీన్ సల్ఫానేట్లు లేదా ఫాటీ ఆల్కహాల్ల సల్ఫేట్ లవణాలు. హార్మోన్లు: జీవ కణాల మధ్య వార్తాహరులుగా పనిచేసేవి హార్మోన్లు. వీటిని ఎండోక్రైన్ గ్రంథులు ఉత్పత్తి చేసి నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయి. హార్మోన్లు పలు రకాలుగా ఉంటాయి. అవి..రసాయనికంగా లభించే స్ట్టెరాయిడ్లు. ఉదాహరణ: ఈస్ట్రోజెన్, ఈ స్వడోల్ ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరోన్. ప్రోటీన్ హార్మోన్లు (పాలీపెప్టైడ్లు). వీటికి ఉదాహరణ: ఇన్సులిన్. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. ఎమైనో ఆమ్లాల ఉత్పన్నాల హార్మోన్. దీనికి ఉదాహరణ-థైరాక్సిన్. ఇది ఎదుగుదలకు దోహదం చేసే హార్మోన్. పాలీమర్లు: అతి చిన్న అణువులను నిర్మాణాత్మక యూనిట్లుగా తీసుకుని పెద్ద అణువులను తయారు చేసే ప్రక్రియను పొలిమరీకరణం అంటారు. చిన్న అణువును మోనోమర్లు అని, పొలిమరీకరణం ద్వారా చివరగా వచ్చే అణువులను పాలిమర్స్ అని అంటారు. సెల్యూలోజ్, రబ్బరు వంటివి సహజ పాలీమర్లు. వేడి లేదా ఒత్తిడికి గురి చేసినప్పుడు అనుకున్న ఆకృతులను పొందితే వాటిని ప్లాస్టిక్ అంటారు. ప్లాస్టిక్ రెండు రకాలు. వేడి చేసినప్పుడు మెత్తగా మారి, చల్లార్చగానే తమ ధర్మాలను తిరిగి పొందే వాటిని థర్మో ఎలాస్టిక్ ప్లాస్టిక్లు అంటారు. ఉదాహరణ-పాలిథీన్, పాలీవినైల్ క్లోరైడ్ (పీవీసీ), నైలాన్, సెల్యూలోజ్ ఎసిటేట్. అలాకాకుండా వేడి చేసినప్పుడు గట్టిగా మారే వాటిని థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ అంటారు. ఉదాహరణ-బెకలైట్. సహజ రబ్బరు ఐసోప్రీన్ పాలీమర్. దీనికి గట్టితనం కోసం నీటిని పీల్చుకునే ధర్మం తగ్గించడానికి సల్ఫర్ను కలిపి వేడి చేస్తారు. ఈ ప్రక్రియనే వల్కనైజేషన్గా వ్యవహరిస్తారు. విటమిన్లు: మన ఆహారంలో తీసుకోవాల్సిన కర్బన పదార్థాలు విటమిన్లు. వీటిని మొక్కలు సంశ్లేషించుకుంటాయి. కాని మానవ శరీరంలో సంశ్లేషం కావు. (కేవలం విటమిన్ ఉ మాత్రం సూర్యకాంతి సమక్షంలో శరీరంలో తయారవుతుంది). అ, ఈ, ఉ, ఓ విటమిన్లు కొవ్వు/నూనెలో.. ఆ, ఇ విటమిన్లు నీటిలో కరుగుతాయి. -
రోగ నివారిణి గోధుమ గడ్డి రసం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: మారిన జీవన శైలివల్ల ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎన్నో వ్యాధులబారిన పడుతున్నాం. నానాటికీ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం వల్ల మనలోని రోగనిరోధక శక్తి క్రమేపీ క్షీణిస్తోందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ప్రకృతి ప్రసాదించిన వివిధ రకాల వైద్య విధానాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గోధుమ గడ్డి రసంతో పలు రకాల వ్యాధులను నివారించవచ్చునని వాడకందారులు చెబుతున్నారు. ఈ గోధుమ గడ్డిలో 13 రకాల విటమిన్లు, 111 రకాల పోషకాలున్నాయని శాస్త్ర పరిశోధనలో తేలిందని ఈ ఔషధం తయారీదారుడు చెబుతున్నారు. వీటిలో ముఖ్యంగా విటమిన్లు, ఎంజైమ్లు, అమినో ఆసిడ్లు, ప్రోటీన్లు ఉన్నాయి. గోధుమ గడ్డి రసాన్ని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా 100 గ్రాముల గోధుమ గడ్డిలో కిలో ఆకు కూరల సత్తువ ఇమిడి ఉంటుందని అనుభవజ్ఞులు చెపుతున్నారు. ప్రాముఖ్యత... గోధుమ గడ్డి మానవాళికి ప్రకృతి ప్రసాదించిన వరం. కొన్ని వేల ఏళ్ల నుంచి మానవుడు ఆరోగ్య సమస్యలకు నివారిణిగి ఉపయోగపడుతోంది. దీన్ని మహా భారతంలో సంజీవనిగా వర్ణించారు. ఈ గోధుమ గడ్డిలో ఆరోగ్య విలువల్ని గుర్తించింది అమెరికాకు చెందిన డాక్టర్ విగ్మొర్. ఐతే ఎల్బీ నగర్కు చెందిన డి.సిరియాల్ రెడ్డి అనే వ్యక్తి ఈ రసాన్ని ప్రతి రోజు బాగ్లింగంపల్లిలోని సుందరయ్య పార్కు వద్ద విక్ర యిస్తుంటారు. దీని ఖరీదు సుమారు 100 గ్రాములకు రూ.20. మంచి ఫలితాలను ఇస్తుందని వాడకందారులు చెబుతున్నారు. రసంతో కలిగే లాభాలు... కాన్సర్, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, బహిష్టు సమస్యల నివారణకు ఉపకరిస్తుంది. మధుమేహం, పైల్స్, గ్యాస్, కడుపులో పుండు తదితర సమస్యలకు పనిచేస్తుంది. రక్తంలో చెక్కర శాతం, కొలెస్ట్రాల్, మల బద్దకాన్ని తగ్గిస్తుంది. రక్తహీనత, శ్వాస, చెమట సమస్యల నివారణ గోధుమ గడ్డి గుజ్జును పసుపు, పాలతో కలిపి ముఖానికి రాస్తే మచ్చలు, మొటిమలు, పగలటం, నల్లబడటాన్ని నివారించవచ్చు. గోధుమ గడ్డిలో పీచు ఉన్నందున జీర్ణం ఎక్కువ అవుతుంది. శరీరం బరువు పెరగటాన్ని తగ్గిస్తుంది శరీరంలో సహజమైన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది. తయారీ విధానం... గోధుమలను 12 గంటలు నానబెట్టాలి. ట్రేలల్లో ఒక ఇంచు వరకు మట్టి పోసి విత్తనం వేయాలి. దానిపై సన్నటి మట్టిని చల్లి నీళ్లు చిలుకరించాలి. 4వ రోజుకు మొలకలు వస్తాయి. 8వ రోజు గడ్డి పెరిగాక వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సిలో వేసి సరిపడ నీళ్లు పోసి రసం తీయాలి. ఆ రసాన్ని పాలిస్టర్ గుడ్డలో వంపి గట్టిగా పిండాలి. వచ్చిన రసాన్ని పరగడుపున తాగితే మంచి ఫలితాల్ని ఇస్తుంది. 20 నిమిషాల తర్వాత ఏమైనా తినవచ్చును. ఈ మందును ప్రజల్లోకి తీసుకెళ్లాలనుంది..ఈ మందును ప్రజల్లోకి తీసుకుపోవాలనుంది. ఆబిడ్స్లోని ఓ పాత పుస్తకాల షాపులో 5 ఏళ్ల క్రితం గోధుమ గడ్డి వల్ల వచ్చే ప్రయోజనాల గూర్చి చదివాను. ప్రయోగించి వాడాను. మంచి ఫలితాలను ఇచ్చింది. నేను ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. మజిల్స్ పెయిన్స్, మొకాళ్ల నొప్పులు రెండు రోజుల్లో తగ్గాయి. ముఖ్యంగా ఇది క్యాన్సర్ రోగులకు, పైల్స్, మధుమేహం ఉన్నవారికి బాగాపనిచేస్తుంది. -డి.సిరియాల్ రెడ్డి, గోధుమ గడ్డి రసం విక్రయదారుడు మంచి ఫలితాలను ఇస్తుంది గోధుమ గడ్డి రసం మంచి ఫలితాలను ఇస్తుంది. ముందుగా ఏదో చూద్దాంలే అని తాగాను. తర్వాత వరుసగా రెండు రోజులు తాగి చూశాను. నాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. 3 నెలలుగా తాగుతున్నాను. నేను ఉల్లాసంగా ఉంటున్నాను. నేను తాగటంతో పాటు మా ఇంటికి కూడ తీసుకొని పోతున్నాను. నాకు షుగర్ కంట్రోల్లో ఉంది. -శ్రీహరి, చిక్కడపలి నాకు నరాల బలహీనత తగ్గింది.... నేను 1959 మొదటి బ్యాచ్కు చెందిన డాక్టర్ను. నరాల బలహీనతతో పూర్తిగా నడవలేక పోయేవాడిని. నారాయణగూడలో న్యూరో సర్జన్కు చూపించినా ప్రయోజనం కలగలేదు. ప్రస్తుతం 45 రోజు లుగా గోధుమగడ్డి రసాన్ని వాడడంతో నేను ఇప్పుడు మంచిగా నడువగల్గుతున్నాను. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. -డాక్టర్ దొరస్వామి రెడ్డి, బీడీఎస్, రిటైర్డ్ డెంటల్ సర్జన్ -
కంటి వ్యాధులను గుర్తించే... మాలిక్యులర్ మ్యాపు!
కరెంటు పోయినప్పుడు టీవీ తెరపై ప్రత్యక్షమయ్యే చారలకు సంబంధించిన ఫొటోలా ఉంది కదూ! కానీ కాదు. అంధత్వానికి కారణమయ్యే కంటి వ్యాధులను గుర్తించేందుకు ఉపయోగపడే అణుస్థాయి చిత్రపటం(మాలిక్యులర్ మ్యాపు) ఇది. కంటిలోని నేత్రపటలంపై ప్రొటీన్లు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఉన్నాయన్నది ఈ మ్యాపు సాయంతో తెలుసుకోవచ్చట. ఈ ప్రొటీన్ల స్థాయిని బట్టి అంధత్వం, కంటి వ్యాధులను కచ్చితత్వంతో గుర్తించడమే కాకుండా.. వాటికి కచ్చితమైన చికిత్సలు కూడా చేయవచ్చట. రెటీనాకు ఆక్సిజన్ను, రక్తాన్ని సరఫరా చేసే నేత్రపటలంలో 4 వేలకు పైగా ప్రొటీన్ల సమాచారాన్ని ఈ హై రిజల్యూషన్ మాలిక్యులర్ మ్యాపు ద్వారా అధ్యయనం చేయవచ్చని, అణుస్థాయిలో ఇలా కంటి వ్యాధులను గుర్తించేందుకు ఉపయోగపడే మ్యాపును రూపొందించడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అన్నట్టూ.. ఈ మ్యాపును తయారు చేసింది మన భారత సంతతి వ్యక్తే. యూనివర్సిటీ ఆఫ్ అయోవా ఆఫ్తాల్మాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ వినీత్ మహాజన్ మరో శాస్త్రవేత్తతో కలిసి దీనిని ఆవిష్కరించారు. ఈ మ్యాపునకు సంబంధించిన పరిశోధన వివరాలు ‘జేఏఎంఏ ఆఫ్తాల్మాలజీ’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
ఆ ‘శక్తి’కీ ఓ లెక్కుంది!
90 నిమిషాల పాటు విశ్రాంతి లేకుండా పరిగెడుతూనే ఉండాలి.... ప్రత్యర్థి ఆటగాళ్లు కావాలని కాళ్లు అడ్డుపెట్టి పడేసినా లేచి బంతిని అందుకోవాలి. నిజానికి ఫుట్బాల్ మైదానంలో ఉన్నంతసేపు ఆటగాళ్లు మొరటుగా, బండల్లా కనిపిస్తారు. మరి వాళ్లకి అంత శక్తి ఎలా వస్తుంది? అంటే... దీనికీ ఓ లెక్కుంది. ఎంత పడితే అంత... ఎలా పడితే అలా తింటామంటే కుదరదు. ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆటగాడిగా మారాలంటే కచ్చితంగా ఓ లెక్క ప్రకారం తినాల్సిందే. ఫుట్బాల్లో రాణించాలంటే శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడంతోపాటు అది తనకు అడ్డంకి కాకుండా కూడా చూసుకోవాల్సివుంటుంది. వేగం, చురుకుదనం కోల్పోకుండా నియంత్రించుకోవాల్సివుంటుంది. మైదానంలో చివరి నిమిషం దాకా పోరాడగలగాలంటే అందుకు తగ్గట్లుగానే ఆహారం తీసుకోవాలి. అందుకే ఈ విషయంలో ఆటగాళ్లు అత్యంత శ్రద్ధతో ఉంటారు. డైటీషియన్ల సూచనలకు అనుగుణంగా నడచుకుంటూ.. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఎక్కువగా లభించే ఆహారం తీసుకుంటుంటారు. అయితే వీరి ఆహారంలో అత్యధికంగా 55 నుంచి 60 శాతం కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. శరీర బరువుకు తగినట్లుగా.. మ్యాచ్ ఆడే రోజైనా, సాధనలో పాల్గొనేందుకైనా ఫుట్బాల్ ఆటగాళ్లు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లను వారి శరీర బరువుకు తగినట్లుగా సమతుల్యంగా తీసుకుంటుంటారు. ఇందుకు ప్రతి పౌండ్ శరీర బరువుకు 2.7 గ్రాముల కార్బోహైడ్రేట్లు లభించేలా ఆహారం తీసుకుంటారు. కఠోర సాధనలో పాల్గొనాల్సిన సందర్భంలో గరిష్టంగా 4 గ్రాముల వరకు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అల్పాహారంగా తీసుకునే తృణ ధాన్యాలు, వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్లలో ఈ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా లభిస్తాయి. వీటితోపాటు స్పోర్ట్స్, సాఫ్ట్ డ్రింక్స్లోనూ, చక్కెర, జామ్, తేనె వంటి తీపి పదార్థాల్లోనూ పళ్లు, పళ్ల రసాల వంటి వాటిలోనూ ఇవి సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఆటగాళ్లు ఇలాంటి పదార్థాలతో కూడిన ఆహారాన్నే ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇక పౌండ్ శరీర బరువుకు రోజుకు 0.7 నుంచి 0.8 గ్రాముల ప్రొటీన్లు, 0.45 గ్రాముల కొవ్వు పదార్థాలు లభించే ఆహార పదార్థాలు తీసుకుంటారు. బ్రేక్ఫాస్ట్.. ఫుట్బాల్ క్రీడాకారుల ఆహార నియమాలు ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి భోజనం దాకా పూర్తిగా వారి డైటీషియన్ల సూచనల మేరకు ఉంటాయి. మ్యాచ్ ఆడాల్సిన రోజు బరిలోకి దిగేందుకు రెండు గంటల ముందే అల్పాహారం చేస్తారు. వేయించిన కేక్లు, ఎగ్ శాండ్విచ్లు, ఉడికించిన గుడ్లు, చక్కెర కలిపిన గోధుమలు వంటి పదార్థాలతోపాటు ద్రాక్ష, అరటి, యాపిల్, నారింజ వంటి పండ్లు, గ్లాసు పాలు తీసుకుంటారు. అయితే అన్నింట్లోనూ కొవ్వు శాతం ఎక్కువ లేకుండా జాగ్రత్త పడతారు. తేలికైన లంచ్ మ్యాచ్లో ఆడాల్సివున్నా, శిక్షణలో పాల్గొనాల్సివున్నా అతిగా భోజనం చేయడం అడ్డంకిగా మారే అవకాశం ఉన్నందున తేలికైన లంచ్ మాత్రమే తీసుకుంటారు. అయితే ఇదే సమయంలో తగినంత శక్తి కూడా అవసరమైనందున కొద్దిమోతాదులో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లతో కూడిన భోజనానికి ప్రాధాన్యత ఇస్తారు. కూరగాయలతోపాటు బీన్స్, బీట్స్, క్యారెట్ వంటి వాటితో చేసిన సలాడ్లు తీసుకుంటారు. శాండ్విచ్లు వెజిటబుల్ సూప్లు, మాంసంతోగానీ, మాంసం లేకుండా గానీ పాస్తాలు, ఉడికించిన మాంసం భుజిస్తారు. ఫాస్ట్ఫుడ్ రెస్టారెంట్లలో భోజనం చేయాల్సివస్తే.. గ్రిల్డ్ చికెన్ శాండ్విచ్లు, రోస్ట్ బీఫ్ శాండ్విచ్లు, బేక్ చేసిన ఆలుగడ్డలు, సలాడ్ బార్స్ వంటివి తీసుకుంటారు. రాత్రి భోజనం పుష్టిగా... మ్యాచ్లో ఆడి అలసిపోయిన శరీరానికి తిరిగి శక్తినిచ్చే విధంగా రాత్రిభోజనం ఉంటుంది. ఉడికించిన లేదా బేక్ చేసిన మాంసం, నత్తలతో కూడిన టమాటో సాస్, చికెన్ వంటి మాంసాహారం తీసుకుంటారు. నూనెలు ఎక్కువగా లేని కూరగాయలతో కూడిన ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తారు. లంచ్కు రాత్రి భోజనానికి మధ్య స్నాక్స్ తీసుకుంటారు. వీటిలో ఎండిన రోస్టెడ్ నట్స్, బ్రెడ్, తాజా పండ్లు, పళ్ల రసాలు ఎక్కువగా ఉంటాయి. -
మన శరీరంలో ప్రోటీన్ ఉత్పత్తి జన్యువులు 19 వేలే!
లండన్: మన శరీరంలో కణాలకు, జీవక్రియలకు అత్యవసరమైన ప్రోటీన్ల ఉత్పత్తికి ఆదేశాలిచ్చే జన్యువులు 19 వేలు మాత్రమే ఉన్నాయట. గతంలో ఇవి సుమారు లక్ష వరకూ ఉండొచ్చని భావించేవారు. కానీ మానవ జన్యుపటం(జీనోమ్)లో ప్రోటీన్ ఉత్పత్తి జన్యువులు 20,700 వరకూ మాత్ర మే ఉండొచ్చని రెండేళ్ల క్రితం తేలింది. అయితే వాటిలో మరో 1,700 జన్యువులకు కూడా ప్రోటీన్ల ఉత్పత్తితో సంబంధం లేదని తాజాగా స్పానిష్ నేషనల్ కేన్సర్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ జన్యువులన్నీ కూడా సుమారు 5 కోట్ల ఏళ్లనాటి ప్రైమేట్ల నుంచే వారసత్వంగా వచ్చాయని, అప్పటి ప్రైమేట్లకు, ప్రస్తుత మానవులకు మధ్య జన్యుపరమైన తేడాలు చాలా స్వల్పమేనని కూడా వారు కనుగొన్నారు. కీలకమైన జన్యువుల సంఖ్య తగ్గేకొద్దీ వాటిపై మరింత విస్తృత పరిశోధనలు చేసేందుకు మార్గం సుగమం కానుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీరి పరిశోధన వివరాలు ‘హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
అమ్మ పాలులో ఎన్నో రకాల పోషకాలు
తల్లిపాలలో ఎన్నో రకాల పోషకాలు, యాంటీబాడీస్, పెరుగుదలకు దోహదపడే అనేకమైన సంక్లిష్ట అంశాలు ఉంటాయి. ఈ పెరుగుదలకు దోహదపడే అంశాలు అటు బిడ్డ భౌతికంగా పెరగడంతో పాటు, మానసిక వికాసానికీ... ఇలా రెండు రకాల ఎదుగుదలకు ఉపయోగపడతాయి. వాటి గొప్పదనాన్ని వివరించాలంటే ఒక్కటే ఒక్కమాట... తల్లిపాలకు బదులు ఇవ్వడానికి మార్కెట్లో చాలా రకాలైన ఫార్ములా ఫీడ్స్ ఉన్నాయి. కానీ అవేవీ తల్లిపాలకు సాటిరావు. స్వాభావికమైన తల్లిపాలు ఇచ్చే పోషకాలు, రక్షణలో వందోవంతు కూడా ఇవ్వలేవు. ఆగష్టు 1 నుంచి 7 వరకు జరిగే తల్లిపాల వారోత్సవాల సందర్భంగా వాటి గొప్పదనాన్ని అర్థం చేసుకుని, అవగాహన కల్పించుకోడానికి ఉపయోగపడేదే ఈ కథనం. తల్లిపాలపై పెరిగే పిల్లలు మిగతా వారితో పోలిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. భౌతికంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారు. రోగాలను స్వాభావికంగానే సమర్థంగా ఎదుర్కొంటారు. తల్లిపాలలో లెక్కకు మించి పోషకాలు ఉన్నా... మన అధ్యయనానికి అందేవి సుమారు 400 రకాల వేర్వేరు పోషకాలు మాత్రమే. వాటన్నింటినీ కృత్రిమంగా తయారు చేయడం అస్సలు సాధ్యం కాదు. కృత్రిమంగా తయారుచేసే ఫార్ములా పాలేవీ తల్లిపాలకు అస్సలు సాటిరావు. ప్రధాన అంశాలేమిటంటే... నీరు: ఈ పాలలో ఎక్కువ భాగం నీరు ఉంటుంది. ప్రోటీన్లు: పాలలో 75 శాతం వరకు ప్రోటీన్లు ఉంటాయి. ఈ ప్రొటీన్లు నైట్రోజన్ను కలిగి ఉంటాయి. ఇక నైట్రోజన్ లేకుండా ఉండే పోషకాలు సైతం ఉంటాయి. యూరియా, న్యూక్లియోటైడ్స్, పెప్టైడ్స్, ఫ్రీ అమైనో ఆసిడ్స్, డీఎన్ఏలు వంటి చాలా రకాలైన పదార్థాలు ఉంటాయి. కొవ్వులు: శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలు (ఎసెన్షియల్ ఫాటీ యాసిడ్స్)తో పాటు సుదీర్ఘమైన గొలుసుల్లా ఉండే లాంగ్ చైన్ పాలీ అన్శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉంటాయి. పిండిపదార్థాలు: ఇందులో కార్బోహైడ్రేట్స్ అని ఇంగ్లిష్లో పిలిచే పిండిపదార్థాలు కూడా ఉంటాయి. ల్యాక్టోజ్ అన్నది తల్లిపాలలో ఉండే ప్రధాన కార్బోహైడ్రేట్. ఇతర పోషకాలు: పైన పేర్కొన్న ప్రధాన అంశాలతో పాటు చాలా రకాల ఖనిజలవణాలు, విటమిన్లు, చాలా అరుదుగా లభ్యమయ్యే కొన్ని విలువైన మూలకాలు కూడా ఉంటాయి. పాలిచ్చే తల్లికి కొన్ని సూచనలు మీరు పాలిచ్చే బిడ్డ తల్లా? అయితే ఈ సూచనలు పాటించండి. ఇవి ఇటు తల్లికీ, అటు బిడ్డకూ మేలు చేస్తాయి. తల్లి తినే ఆహారాన్ని బట్టి బిడ్డకు పట్టే పాల రుచి (ఫ్లేవర్) కూడా మారుతూ కొత్త రుచిని సంతరించుకుంటుంటుంది. అప్పుడు బిడ్డ మరింతగా ఆస్వాదిస్తూ తల్లిపాలను ఇష్టంగా తాగుతుంటాడు. అందుకే తల్లి రకరకాల కాయధాన్యాలు (హోల్గ్రెయిన్స్), పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తినాలి. అయితే ఇక్కడొక చిన్న జాగ్రత్త పాటించాలి. తల్లి తినే పండ్లు, కూరగాయలు వంటి వాటిని బాగా కడిగాకే తినాలి. లేకపోతే వాటిపై ఉండే క్రిమిసంహారక రసాయనాలు తల్లిలోకి, అక్కడినుంచి బిడ్డకు ఇచ్చే పాలలోకీ ప్రవేశించి, బిడ్డ ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతాయి. అందుకే వాటిని బాగా కడిగాక మాత్రమే తినాలని గుర్తుంచుకోండి. పాలిచ్చే తల్లి ఎక్కువగా నీళ్లు తాగాలి. కానీ చాలామంది పెద్దలు తల్లిని ఎక్కువగా నీళ్లు తాగనివ్వరు. తల్లి నీళ్లు ఎక్కువ తాగితే బిడ్డకు జలుబు చేస్తుందంటూ ఆమెను తక్కువ నీళ్లు తాగేలా కట్టడి చేస్తుంటారు. తల్లి ఎక్కువ నీళ్లు తాగితే బిడ్డకు జలుబు చేస్తుందనడం అపోహ మాత్రమే. తల్లికి ఎక్కువగా పాలు ఊరి, బిడ్డకు సరిపడా పాలు పడాలంటే నీళ్లు ఎక్కువగా తాగాల్సిందే. అందుకే దాహమైనా కాకపోయినా తల్లి నీళ్లు తాగుతుండాలి. తల్లి ఎన్ని నీళ్లు తాగాలంటే... ఆమెకు మూత్రం పసుపు రంగులో రానట్లుగా ఉండేలా చూసుకోవాలి. తల్లిపాలలో బిడ్డకు మేలు చేసే ఐరన్ ఎక్కువగా ఉండటానికి బీన్స్, వేరుశనగ పల్లీలు, అలచందలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని విటమిన్-సితో ఇచ్చే పండ్లతో కలిపి తీసుకోవడం మంచిది. అంటే నిమ్మజాతిపండ్లు, స్ట్రాబెర్రీస్ వంటివి. తల్లిపాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటానికి గుడ్లు, పాలు, పాల ఉత్పాదనలు, బఠాణీలు, నట్స్ వంటివి తీసుకోవాలి. క్యాల్షియమ్ బాగా సమకూరేలా బాగా ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, సోయామిల్క్, పెరుగు, టోఫూ వంటి ఆహారపదార్థాలు పుష్కలంగా తీసుకోవాలి. విటమిన్ బి12తో పాటు విటమిన్ డి పుష్కలంగా లభించడానికి వీలుగా పాలు, పాల ఉత్పాదనలతో పాటు మాంసాహారం తీసుకోవాలి. అవి తీసుకోని వారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే విటమిన్ బి12, విటమిన్-డి సప్లిమెంట్స్ మాత్రల రూపంలో తీసుకోవాలి. పాలిచ్చే తల్లి తీసుకోకూడని ఆహారాలు : కెఫిన్ ఉండే పదార్థాలు: పాలిచ్చే సమయంలో కెఫిన్ పుష్కలంగా ఉండే కాఫీలు, కూల్డ్రింక్స్ తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ తీసుకోవాలనిపిస్తే మాత్రం చాలా పరిమితంగా రోజూ రెండు కప్పులకు మించనివ్వవద్దు. సముద్రపు చేపలు: చేపలు మంచి పౌష్టికాహారమే అయినా... కొన్ని రకాల సముద్రపు చేపల్లో మెర్క్యులరీ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ మెర్క్యులరీ బిడ్డలో నాడీవ్యవస్థ ఎదుగుదలపై దుష్ర్పభావం చూపుతుంది. పైగా కొన్ని రకాల సముద్రపు చేపలు తీసుకున్న తర్వాత పట్టే పాలు బిడ్డకు అలర్జీ కలిగించవచ్చు. అందుకే బిడ్డకు పాలుపట్టే సమయంలో సముద్రపు చేపలను ఆహారంగా స్వీకరించకపోవడమే మంచిది. బిడ్డకు పట్టే పాలు... తల్లికీ చేస్తాయి మేలు బిడ్డకు పాలు పట్టడం అటు తల్లికీ అనేక రకాలుగా మేలు చేస్తుంది. బిడ్డకు పాలు పడుతుండటం వల్ల తల్లికి కలిగే ప్రయోజనాల్లో కొన్ని... పాలిచ్చే తల్లుల్లో ఆక్సిటోసిస్ అనే రసాయనం స్రవించి అది ప్రసవం తర్వాత అయ్యే రక్తస్రావాన్ని బాగా తగ్గిస్తుంది. అంతేకాదు... ప్రసవం తర్వాత గర్భసంచి ఆరోగ్యకరంగా ముడుచుకుపోయేలా చేస్తుంది. పాలిచ్చే తల్లుల బరువు స్వాభావికంగా తగ్గుతుంది. అంటే పాలు ఇస్తున్నంత కాలం వాళ్లు లావెక్కరు. ఇది వారిలోని సౌందర్యాన్ని ఇనుమడింపజేసే అంశంతో పాటు బరువు పెరగకపోవడం వల్ల బరువు రిస్క్ ఫ్యాక్టర్గా గల అనేక జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది. పాలిచ్చే తల్లుల్లో పాలు పడుతున్నంతకాలం ప్రకృతి సిద్ధంగానే గర్భధారణ జరగకుండా రక్షణ ఉంటుంది. అంటే పాలు పట్టడం ఒకరకంగా గర్భనిరోధకంగా పనిచేస్తుంది. (అయితే అంతమాత్రాన అసలే గర్భధారణ జరగదని చెప్పలేం. కాబట్టి ఆ టైమ్లో సెక్స్లో పాల్గొనదలచిన దంపతులు గర్భనిరోధక సాధనాలను వాడాల్సిందే). పాలిచ్చే తల్లులకు అనేక రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ ఉంటుంది. పాలిచ్చే తల్లులకు డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువ. పాలివ్వడం వల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు, మానసిక రుగ్మతలకు గురయ్యే అవకాశాలు చాలా తక్కువ పాలిచ్చే తల్లుల్లో మేను కూడా ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా మారుతుంది. పాలివ్వకపోతే ప్రమాదమే... బిడ్డకు తల్లి పాలు పట్టకపోవడం వల్ల తల్లికి చాలారకాల నష్టాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిలో కొన్ని... బిడ్డకు పాలు పట్టని తల్లులకు మూత్రకోశ ఇన్ఫెక్షన్స్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్) వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ మెనోపాజ్ పూర్తయ్యాక (లేదా కొన్ని సందర్భాల్లో మెనోపాజ్ రాకముందే) చాలా రకాల క్యాన్సర్లు, ముఖ్యంగా ఒవేరియన్ క్యాన్సర్కు అవకాశాలు ఎక్కువ. ఎముకలు పెళుసుగా మారి, తేలిగ్గా విరిగిపోయే ఆస్టియోపోరోసిస్ జబ్బు వచ్చేందుకు అవకాశాలు చాలా చాలా ఎక్కువ. తల్లిపాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాలు తల్లిపాలతో అటు బిడ్డకూ, ఇటు తల్లికీ, మరోవైపు సమాజానికీ... ఇలా ఎన్నో రకాలుగా మేలు చేకూరుతుంది. బిడ్డకు ఎన్నో జబ్బులు రావు లేదా డయాబెటిస్ వంటి కొన్ని భవిష్యత్తులో రావాల్సిన జబ్బులు చాలా ఆలస్యమవుతాయి. ఇక తల్లి పాలు తాగే పిల్లలతో పోలిస్తే, తల్లి పాలపై లేని పిల్లల్లో చాలా రకాల జబ్బులు కనిపిస్తాయి. అవి... జీర్ణకోశ సమస్యలు: తల్లిపాలు స్వాభావికంగా ఉండటం వల్ల అవి జీర్ణకోశానికి ఇబ్బంది కలిగించకుండా జీర్ణమవుతాయి. కానీ ఫార్ములా పాలు/ పోతపాలు వంటివి జీర్ణకోశ ఇబ్బందులను కలిగిస్తాయి. ఆస్తమా: తల్లిపాలు బిడ్డకు సరిపడకపోవడం అంటూ ఉండదు. కానీ పోతపాలుగా ఇచ్చే యానిమల్ మిల్క్ చాలావరకు బిడ్డకు సరిపడకపోవడానికి అవకాశాలు ఎక్కువ. అందుకే పోతపాలపై పెరిగే పిల్లల్లో ఆస్తమా వంటి జబ్బులు, ఎగ్జిమా వంటి రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటితోపాటు తల్లిపాలపై పెరిగే బిడ్డలకు శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. బిడ్డకు చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువ. తల్లిపాలపై పెరిగే పిల్లల్లో స్థూలకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. పోతపాలపై పెరిగే పిల్లల్లో చిన్నప్పుడే స్థూలకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ. తల్లిపాలపై పెరిగే పిల్లల్లో చిన్నప్పుడు క్యాన్సర్లు (ఛైల్డ్హుడ్ క్యాన్సర్లు) వచ్చే అవకాశాలు చాలా తక్కువ. నెక్రొటైజింగ్ ఎంటెరోకొలైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలూ తక్కువే. ఒక్కమాటలో చెప్పాలంటే తల్లిపాలపై పెరిగే పిల్లలు చాలా తక్కువగా జబ్బు పడతారు. ఫలితంగా వారి రక్షణ కోసం, వారి ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ఖర్చు చేయాల్సిన డబ్బు చాలా చాలా తక్కువ. కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లిపాలు పట్టడం చాలా అవసరమని ప్రతి తల్లీ, ప్రతి కుటుంబమూ గుర్తెరగాలి. నిర్వహణ: యాసీన్