railway tracks
-
అరే..ఇలా ఉన్నారేంట్రా.. పోతార్రా..! (ఫొటోలు)
-
రైల్వే ట్రాక్పై మహిళ ఆత్మహత్యాయత్నం
బాలానగర్: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ మహిళ రైల్వే ట్రాక్పై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిపై సమాచారం అందడంతో సకాలంలో స్పందించిన బాలానగర్ పోలీసులు ఆమెను రక్షించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజు కాలనీకి చెందిన మంగమ్మ (45) బుధవారం ఫిరోజ్గూడ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్పై కూర్చుని ఆత్మహత్యకు యత్నించింది. దీనిపై సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న కానిస్టేబుళ్లు రవీందర్, సుధాకర్ రెడ్డి ఆమెను రక్షించారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు అభినందించారు. -
కూ.. చకచకా..
సాక్షి, మహబూబాబాద్: భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లాలో కొట్టుకుపోయిన రైల్వే లైన్ల పనులను రైల్వే అధికారులు, సిబ్బంది, కార్మీకులు శరవేగంగా పూర్తి చేశారు. మొత్తంగా 52 గంటల్లో పనులు పూర్తి చేసి ట్రయల్రన్ నడిపించారు. అంతా సవ్యంగా ఉండడంతో బుధవారం మధ్యాహ్నం విజయవాడ– సికింద్రాబాద్ మధ్య నడిచే గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలు కదిలింది. పగలూ.. రాత్రి తేడా లేకుండా...: వరద ఉధృతి పెరిగి తాళ్లపూసపల్లి– కేసముద్రం రైల్వేలైన్లోని 432, 433 కిలోమీటరు మార్కు వద్ద 200 మీటర్ల మేర పట్టాల కింద కంకర, మట్టి, సిమెంట్ దిమ్మెలు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఇంటికన్నె– కేసముద్రం మార్గంలో 418 కిలోమీటర్ రాయి వద్ద 200 మీటర్ల మేర, మరో నాలుగు చోట్ల పాక్షికంగా లైన్లు కూడా దెబ్బతిన్నాయి. దీంతో శనివారం అర్ధరాత్రి 2 గంటల నుంచి రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. ఆదివారం కూడా వరద ఉధృతి తగ్గకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి కార్మీకులను తీసుకొచ్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పనులు వేగంగా..: దేశంలోని ప్రధాన పట్టణాలను కలుపుతూ నడిచే రైలుమార్గం దెబ్బతినడంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోగా, దీంతో మరమ్మతుల పనుల్లో అధికారులు వేగం పెంచారు. ముందుగా డౌన్లైన్ పనులు తాళ్లపూసపల్లి– కేసముద్రం మధ్యలో ఏడు జేసీబీలు, 300 మంది కార్మీకులు, 100 మంది సూపర్వైజర్లు, 100 మంది వివిధ కేటగిరీకి చెందిన రైల్వే ఉద్యోగులు ఇలా మొత్తంగా 500 మంది పనిచేశారు. – ఇంటికన్నె– కేసముద్రం మార్గంలో 13 జేసీబీలు, 150 మంది సూపర్వైజర్లు, 300 మంది రైల్వేస్టాఫ్, 550మంది కార్మికులు మొత్తం కలిసి 1000 మందితో పనులు ప్రారంభించారు. పనులకు వరద ప్రవాహం అడ్డురావడంతో బండరాళ్లు, ఇసుక బస్తాలతో వరదను కట్టడి చేసి పనులు వేగవంతం చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే అప్లైన్ (సికింద్రాబాద్–విజయవాడ) లైన్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు.. కదిలిన రైళ్లు రైల్వే ట్రాక్ పనులు పూర్తి కావడంతో ముందుగా తాళ్లపూసపల్లి– మహబూబాబాద్ మధ్య ట్రయల్ రన్గా గూడ్సు రైలును నడిపారు. ఇంటికన్నె–కేసముద్రం మధ్య కేసముద్రం రైల్వేస్టేషన్లో నిలిచిన సంగమిత్ర ఎక్స్ప్రెస్ రైలును ట్రయల్ రన్గా నడిపారు. ఆ తర్వాత నాలుగు గూడ్స్ రైళ్లను అప్లైన్లో పంపించారు. ఇక ప్రయాణికులతో గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలు మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో కేసముద్రం–ఇంటికన్నె మధ్య 418 కిలోమీటర్ మీదుగా వేగాన్ని తగ్గించి 5 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా నడిపించారు. రైల్వేట్రాక్ మరమ్మతులు చేసిన చోట కొంతవరకు కుంగిపోయింది. కాగా ట్రాక్ కుంగిపోయిన చోట జాకీలతో పైకి లేపి మరమ్మతు పనులు చేశారు. వర్షం కురుస్తున్నా, పనులను మాత్రం ఆపకుండా వేగవంతంగా చేస్తున్నారు. -
గాలిలో రైలు పట్టాలు..
సాక్షి, మహబూబాబాద్/ డోర్నకల్/ మహబూబా బాద్ రూరల్/ కేసముద్రం: మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో నాలుగు చోట్ల రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి. వరద తాకిడికి పట్టాల కింద సిమెంట్ దిమ్మెలు, కంకరరాళ్లు, మట్టి కొట్టుకుపోయి ఊయలలా పట్టాలు వేలాడుతున్న విషయాన్ని రైల్వే సిబ్బంది పసిగట్టడం.. అప్రమత్తమైన అధికారులు ఎక్కడిక క్కడ రైళ్లను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయోధ్య పెద్దచెరువు కట్ట తెగడంతో..మహబూబాబాద్ రూరల్ మండలం అయోధ్య పెద్ద చెరువు కట్ట తెగడంతో వరద నీరు ఉధృతంగా తాళ్లపూసపల్లి సమీపంలో రైల్వేట్రాక్ కిందినుంచి వెళ్లింది. దీంతో కొత్తగా వేస్తున్న విజయవాడ– సికింద్రాబాద్ లైన్తోపాటు, పాత లైన్ల కింద ఉన్న మట్టి, కంకర రాళ్లతోపాటు, సిమెంట్ దిమ్మెలు కూడా కొట్టుకుపోయాయి. దీంతో ఆరు నుంచి పది అడుగుల మేరకు గొయ్యిపడి పట్టాలు గాలిలో వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. అదేవిధంగా కేసముద్రం విలేజీ పెద్ద చెరువు, దామర చెరువు, ఇంటికన్నె చెరువుల వరదతో ఇంటికన్నె, కేసముద్రం మధ్యలో వరద తీవ్రత పెరిగి ట్రాక్ అడుగు భాగం అంతా కొట్టుకుపోయింది. దీంతో ఇంటికన్నె–కేసముద్రం మధ్య 200 మీటర్ల మేర, తాళ్లపూసపల్లి–మహబూబాబాద్ మధ్యలో ఒక చోట 50 మీటర్లు, మరోచోట 10 మీటర్ల మేరకు పట్టాల కింద మట్టి కొట్టుకుపోయి ట్రాక్ తీవ్రంగా దెబ్బతిన్నది. అదేవిధంగా నెక్కొండ– వరంగల్ మధ్య రెండు మీటర్ల మేర గొయ్యి పడింది. వేలాది మంది ప్రయాణికులతో ఉక్కిరి బిక్కిరిట్రాక్లు దెబ్బతిన్న విషయాన్ని ముందుగానే గుర్తించిన అధికారులు కేసముద్రంలో సంఘమిత్ర రెండు రైళ్లు, మహబూబాబాద్లో సింహపురి, మచిలీపట్నం, డోర్నకల్లో పద్మావతి, అప్, డౌన్ రెండు గౌతమి రైళ్లు నిలిపి వేయడంతో సుమారు పదివేలకు పైగా ప్రయాణికులు ఒక్కసారిగా మూడు స్టేషన్లలో దిగారు. రైళ్లు ఎప్పుడు వెళ్తాయో తెలియకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. కొందరు ప్రైవేట్ వాహనాలలో వెళ్లగా, మరికొందరు లాడ్జీలు తీసుకొని ఉన్నారు. ఎటూ వెళ్లలేని వారు స్టేషన్లలోనే ఉండటంతో మహబూబాబాద్, కేసముద్రం, డోర్నకల్ ప్రాంతాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు వారికి పండ్లు, బిస్కెట్లు, టిఫిన్, మధ్యాహ్న భోజనం, మంచినీరు, మందులు అందజేశారు.సార్లకు సమాచారం ఇచ్చాను..నేను కేసముద్రం– ఇంటికన్నె లైన్లోని 550 ఆర్ఏ ఎఫ్టీ వద్ద ఉన్నా. పైనుంచి వరద పెరిగింది. అప్ప టికే నా వద్దకు వచ్చిన పెట్రోలింగ్ టీమ్తో మాట్లాడి విషయం ముందుగా ఎస్ఎస్ఏ శ్రీనివాస్కు, తర్వాత రాజమౌళికి ఇచ్చాం. ట్రైన్ల వేగం తగ్గించారు. తర్వాత కూడా వరద పెరగడంతో కాషన్ ఆర్డన్ ఇవ్వాలని కోరాం. – మోహన్, ట్రాక్మన్, ఇంటికన్నెవారిద్దరి సమాచారంతో రైళ్లు ఆపేశాంగతంలో జరిగిన వరద అనుభవాల దృష్ట్యా రైల్వే లైన్లకు ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వాచ్మెన్లను పెట్టాం. ట్రాక్మన్ సమాచారంతో అప్రమత్తమై రోడ్డు మార్గంలో నేను 575 రైల్వే ఎఫెక్టెడ్ ట్యాంక్ వద్దకు వెళ్లాను. అప్పటికే పరిస్థితి విషమించింది. వరద పెరిగింది. విషయాన్ని పై అధికారులకు చేరవేశా. దీంతో ఎక్కడి రైళ్లు అక్కడ ఆపేశారు. – రాజమౌళి, సీనియర్ రైల్వే సెక్షన్ ఇంజనీర్ప్రమాద స్థాయి గమనించానునేను తాళ్లపూసపల్లి– కేసముద్రం లైన్లోని 575 ట్యాంకు వద్ద ఉన్నా. సాయంత్రంనుంచి గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. ప్రమాద స్థాయికి చేరుతుందని గమనించి రాత్రి 12 గంటల సమయంలోనే మా ఎస్ఎస్ఈ రాజమౌళికి చెప్పా. గస్తీ వాళ్లకు సమాచారం ఇచ్చి ఆయన వచ్చారు. రైళ్లు ఆపేశాం. – జగదీశ్, ట్రాక్మన్, తాళ్లపూసపల్లి -
రైలు పట్టాలపై ఇనుప స్తంభాలు.. ధర్మవరంలో తప్పిన ప్రమాదం
శ్రీసత్యసాయి, సాక్షి: జిల్లాలో గత అర్ధరాత్రి లోకో పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ధర్మవరం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై ఇనుప స్తంభాలు ఉంచారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆకతాయిల పనిగా భావిస్తున్న రైల్వే పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
రైలుబోగీల్లోనే 10 గంటలు..
మహబూబాబాద్: ఎడతెరిపిలేని వర్షాలతో కాజీపేట టౌన్ రైల్వేస్టేషన్ సమీపంలోని వడ్డేపల్లి చెరువు రిజర్వాయర్పై నిర్మించిన రైల్వే వంతెన ట్రాక్పైకి వరద నీరు ఉధృతంగా చేరడంతో గురువారం రైల్వే అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. దీంతో సుమారు 10గంటలపాటు ప్రయాణికులు రైలు బోగీల్లోనే నిరీక్షించారు. వడ్డెపల్లి చెరువు కట్టపై 364/27–25 కి.మీ నంబర్ వద్ద రైల్వే ట్రాక్ డేంజర్గా మారడంతో కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్లో తిరుపతి–కరీంనగర్, ఎర్నాకులం–బిలాస్పూర్, యశ్వంత్పూర్–లక్నో, బెంగళూర్–నిజాముద్దీన్ వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లను ఉదయం 10:30 గంటల నుంచి నిలిపివేశారు. కాజీపేట–ఢిల్లీ, వరంగల్–ఢిల్లీ అప్ అండ్ డౌన్ రూట్లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు. సికింద్రాబాద్ బ్రిడ్జి, ట్రాక్ ఇంజనీర్స్, కాజీపేట జంక్షన్కు చెందిన అధికారులు వడ్డెపల్లి రైల్వే ట్రాక్ వద్ద నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. ట్రాక్ సామర్థ్యం టెస్టింగ్ కోసం ట్రాక్పై గూడ్స్ రైలును నిలిపి ఉంచారు. రాత్రి 8 గంటల వరకు ఇదే పరిస్థితిలో రైల్వే అధికారులు సెక్యూరింగ్ చేశారు. కాగా కాజీపేట రైల్వే చరిత్రలో వడ్డెపల్లి చెరువు రైల్వే ట్రాక్పైకి వరద నీరు చేరడం ఇదే మొదటిసారి. అయితే రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు రైలు పట్టాలపై నడుచుకుంటూ సమీప దుకాణాల వద్దకు వెళ్లి తిను బండారాలు కొనుగోలు ఆకలితీర్చుకున్నారు. వరంగల్ సమీప గ్రామాల ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లిపోయారు. సుమారు 10గంటల తర్వాత గురువారం రాత్రి రైళ్ల రాకపోకలకు రైల్వే అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ట్రాక్ వద్ద వరద ప్రవాహం తగ్గడంతో రైల్వే ఇంజనీరింగ్ అధికారులు ట్రాక్ కెపాసిటిని పరిశీలించి మొదటి, రెండో లైన్లకు రాత్రి 8:30 గంటలకు క్లీయర్ ఇచ్చారు. ముందుగా లైట్ ఇంజన్ నడిపించి ఆతర్వాత 10 నుంచి 30 కెంఎంపీహెచ్ స్పీడ్తో ఢిల్లీ వైపు యశ్వంత్పూర్– బిలాస్పూర్, తర్వాత రాజధా, లక్నో, తమిళనాడు ఎక్స్ప్రెస్లను పంపించినట్లు తెలిపారు. కాజీపేట జంక్షన్ జలమయం వర్షపునీరు కాజీపేట జంక్షన్లోని టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్దకు, ఎంట్రెన్స్ ఎదుట, ప్లాట్ఫాం పైకి చేరడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ► న్యూ ఢిల్లీ వెళ్లే ఏపీ, తమిళనాడు ఎక్స్ప్రెస్ రైళ్లను అధికారులు గురువారం ఉదయం 11.30 గంట ల సమయంలో వరంగల్ రైల్వే స్టేషన్ రెండు, మూడు ప్లాట్ ఫాంలలో నిలిపివేశారు. రైళ్లలో శు క్రవారం ఐఐటీ ఢిల్లీ కళాశాలలో చేరేందుకు వెళ్తు న్న విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం చైన్నె నుంచి న్యూఢిల్లీ వెళ్లే గ్రాండ్ ట్రంక్(జీటీ) ఎక్స్ప్రెస్కు వరంగల్ రైల్వే స్టేషన్లో ప్లా ట్ ఫాం రేకు తగలడంతో రైలు ఆగిపోయింది. ► రఫ్తీసాగర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (గోర్కపూర్– కొచువేలి) రైలు నెక్కొండ రైల్వేస్టేషన్లో గురువారం ఉదయం 11గంటలకు నిలిచిపోయింది. స్టేషన్లో ఎలాంటి సౌకర్యాలు లేక పోవడం.. తినుబండారులు సైతం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యామని ప్రయాణికులు తెలిపారు. -
మంచుకొండల్లో మహాముప్పు.. తక్షణం అడ్డుకట్ట వేయకుంటే విధ్వంసమే
అందమైన మంచుకొండలైన హిమాలయాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఉత్తరాఖండ్లో జోషిమఠ్ కుంగిపోవడం కంటే మించిన విధ్వంసాలు ఎదురుకానున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. హిమానీ నదాలు కరిగిపోవడం, సరస్సులు మాయమవడం, శాశ్వత మంచు ప్రాంతాలపై ప్రభావం పడడం వంటి విపత్తులు ఎదురు కానున్నాయి. దీనికి ముఖ్య కారణం వాతావరణంలో వస్తున్న మార్పులు కాదు, భారత్, చైనా పోటాపోటీగా హిమాలయాల్లో నిర్మాణాలు సాగించడం కూడా ప్రధాన కారణమవుతోంది..వాణిజ్య అవసరాలు, సైనిక అవసరాల కోసం రెండు దేశాలు హిమాలయాల్లో కొండల్ని తొలుస్తున్నారు. రైల్వే ట్రాకులు, రహదారులు నిర్మిస్తున్నారు. సొరంగాలను తవ్వుతున్నారు. హిమాలయాలకి రెండు వైపులా ఈ కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతూ ఉండడం పెను ప్రమాదానికి దారి తీయబోతోందన్న ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి. 2020లో గల్వాన్లో ఘర్షణల తర్వాత ఇరు దేశాలు సైనిక అవసరాల కోసం హిమాలయాల వెంబడి వంతెనలు, ఔట్పోస్టులు, హెలిప్యాడ్లు విస్తృతంగా నిర్మిస్తున్నాయి. చైనా ఏకంగా చిన్న చిన్న నగరాలనే కట్టేస్తున్నట్టు ఉపగ్రహఛాయాచిత్రాల ద్వారా వెల్లడవుతోంది. ఎల్ఏసీ వెంట అధిక ముప్పు.. భారత్, చైనా మధ్య 3,500 కి.మీ. పొడవునున్న వాస్తవాధీన రేఖ వెంబడి ముప్పు అధికంగా ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఉత్తరాఖండ్లో సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఎన్హెచ్–7 జాతీయ రహదారిపై ప్రతీ కిలోమీటర్కి ఒక కొండచరియ విరిగిపడి రహదారులు మూతపడడం సర్వసాధారణంగా మారింది. ‘‘భారత్లోని హిమాలయాల్లో ఉత్తరాఖండ్లోనూ, అటు చైనా వైపు హిమాలయాల్లోనూ అత్యధిక ముప్పు పొంచి ఉంది. మౌలిక సదుపాయాల పేరిట చేపడుతున్న కార్యక్రమాలు శాశ్వత మంచు పర్వతాలను సైతం కుదేలు చేసే రోజులొచ్చేస్తున్నాయి. అవలాంచ్లు (హిమ ఉత్పాతం), కొండచరియలు విరిగిపడడం, భూకంపాలు అత్యంత సాధారణంగా మారతాయి’’అని క్రయోస్ఫియర్ జర్నల్ ఒక నివేదికలో వెల్లడించింది. చైనా నిర్మాణాలు టిబెట్ పీఠభూమిలో ► 9,400 కి.మీ. మేరకు రోడ్డు నిర్మాణం. ళీ 580 కి.మీ. పొడవున రైల్వేలు చెంగ్డూ నుంచి లాసా వరకు రైల్వే నిర్మాణం ► సముద్రానికి 13 వేల అడుగుల ఎత్తులో పూర్తిగా మంచుతో నిండి ఉన్న 21 పర్వతాల మీదుగా 14 అతి పెద్ద నదుల్ని దాటుకుంటూ సియాచిన్–టిబెట్ రైల్వే లైన్ నిర్మాణం ► 2,600 కి.మీ. పొడవున విద్యుత్ లైన్లు ళీ వేలాది సంఖ్యలో భవనాలు ► అస్సాంలో బ్రహ్మపుత్ర నది నుంచి ఉత్తర చైనాకు నీటిని మళ్లించడానికి డ్యామ్లు ► 2050 నాటికి మంచుకొండల్లో 38.14%రోడ్లు, 38.76% రైల్వేలు ► 39.41% విద్యుత్ లైన్లు, 20.94% భవనాలే కనిపిస్తాయి. ► సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం 624 భవనాల నిర్మాణం నేపాల్ వైపు ► చైనా బెల్డ్ అండ్ ఓడ్ ఇనీషియేటివ్ కింద రాసువగాఢి హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు ► ఉద్యాన వనాలు ► హైడ్రోపవర్ ప్రాజెక్టులు ► 240 కోట్ల డాలర్ల విలు వైన ప్రాజెక్టులు ► పాంగాంగ్ సరస్సుపై సైనిక అవసరాల కోసం వంతెన భారత్ నిర్మాణాలు ► హిమాలయాల్లో 30 అతి పెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టులు ► అరుణాచల్ప్రదేశ్, సిక్కిమ్లలో వాయువేగంతో సాగుతున్న హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణాలు ► 900 కి.మీ. పొడవునా గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బదిరీనాథ్లను కలిపేలా చార్ధామ్ ప్రాజెక్టు ► 283 కి.మీ. పొడవునా నిమ్ము–పదమ్–దర్చా (ఎన్పీడీ)హైవే ► చైనాతో వివాదంలో ఉన్న 3,500 కి.మీ. సరిహద్దుల పొడవునా రోడ్లు, టన్నెల్స్, వంతెనలు, ఎయిర్ఫీల్డ్స్, హెలిప్యాడ్స్ నిర్మాణం ► చైనాతో వ్యూహాత్మకంగా ప్రాధాన్యం కలిగిన 73 ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ? ► అరుణాచల్ ప్రదేశ్, సిక్కిమ్ రాష్ట్రాల్లో వర్షాకాలాలు బీభత్సంగా మారనున్నాయి. ► సింధు నదికి సమీపంలో చిలాస్లో డ్యామ్లు కట్టడంతో ఒక నెలలో దాని పరిసర ప్రాంతంలో 300 సార్లు భూకంపం సంభవించింది. ► సరిగ్గా అలాంటి ముప్పే హిమాలయాల్లో కూడా జరిగే అవకాశం ఉంది. ► అవలాంచ్లు ముంచెత్తి సరస్సులు విస్ఫోటనం చెందుతాయి ► కొండచరియలు విరిగిపడి నిర్మాణంలో ఉన్నవన్నీ కూడా ధ్వంసమయ్యే ప్రమాదముంది. టిబెట్లోని బొమి ప్రాంతంలో దశాబ్దాల క్రితం కట్టిన వంతెనలు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ కొండచరియలు విరిగిపడి ధ్వంసమయ్యాయి. ► ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవన్నీ పూర్తవకుండానే భూకంపాలు, కొండచరియలు, అలవాంచ్లతో అవన్నీ ధ్వంసమయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయని, మరింత ప్రమాదంలోకి హిమాలయాలు వెళ్లిపోయాయని ఓల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్ అండ్రూస్ కాబ్ అంచనా వేస్తున్నారు. ► భారత్లో 23 హిమానీనదాలతో అత్యంత ప్రమాదముందని నిపుణులు గుర్తించారు. ► భారత్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదాల్లో 85% హిమాలయాల్లోనే సంభవిస్తున్నాయి. కొండచరియలు ముప్పు కలిగిన టాప్–5 దేశాల్లో చైనా, భారత్లు ఉన్నాయి. ► హిమాలయాల్లో ఉన్న హిమానీ నదాలు 2035 నాటికి మాయమైపోయే ఛాన్స్ ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వందే భారత్ రైలు.. హైదరాబాద్ ట్రాక్లపై నడిచేనా!
సాక్షి, హైదరాబాద్: వందే భారత్ రైళ్ల రాకపోకలకు హైదరాబాద్ ట్రాక్లు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రతిరోజూ ఎంఎంటీఎస్లు, ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు తీసే ట్రాక్లోనే వచ్చే ఏడాది నుంచి వందేభారత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖ, ముంబై, బెంగళూరు నగరాలకు ఈ అధునాతన రైళ్లను నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రహరీలు, ఫెన్సింగ్ వంటి ఎలాంటి రక్షణ చర్యలు లేని నగరంలోని రైల్వేలైన్లు వందేభారత్ రైళ్ల నిర్వహణకు సవాల్గా మారాయి. ట్రాక్ల వెంట అనేక చోట్ల మలుపులు, ప్రమాదకరమైన స్థలాలు ఉన్నాయి. మనుషులు ఒకవైపు నుంచి మరోవైపునకు ట్రాక్లు దాటుతుంటారు. ఈ క్రమంలో గంటకు 150కిపైగా కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే వందేభారత్ రైళ్లకు ఏ చిన్న అవాంతరం ఏర్పడినా భారీ నష్టం వాటిల్లుతుందని రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకే ట్రాక్లో రెండు ప్రమాదాలు.. ► ఇటీవల అహ్మదాబాద్– ముంబై ట్రాక్లో ఏకంగా రెండుసార్లు వందేభారత్ రైళ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. మొదటిసారి అడ్డుగా వచ్చిన అయిదు గేదెలను ఢీకొనడంతో అవి అక్కడిక్కడే చనిపోయాయి. ఈ ఉదంతంలో రైలు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదం మరిచిపోకముందే మరో సంఘటనలో ట్రాక్కు అడ్డుగా వచ్చిన ఆవును ఢీకొట్టడంతో రెండోసారి వందేభారత్ రైలుదెబ్బతిన్నది. ట్రాక్లకు ఇరువైపులా కంచె లేకపోవడం వల్ల పశువులు యథేచ్ఛగా సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ► మరోవైపు సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఇంజిన్లు దెబ్బ తినకుండా క్యాటిల్ గార్డ్లను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల రైళ్లు పశువులను ఢీకొట్టినప్పటికీ ఇంజిన్లు దెబ్బ తినకుండా సురక్షితంగా ఉంటాయి. కానీ వందేభారత్ రైళ్లకు ఇలాంటి గార్డ్లను ఏర్పాటు చేసే అవకాశం లేదు. సురక్షితమైన ట్రాక్ల నిర్వహణ ఒక్కటే పరిష్కారం. అహ్మదాబాద్– ముంబై మార్గంలో చోటుచేసుకున్న ఈ రెండు ఘటనల నుంచి హైదరాబాద్లో వందేభారత్ రైళ్ల నిర్వహణపై పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రమాదకరంగా పట్టాలు.. నగరంలో సుమారు 45 కిలోమీటర్ల మార్గంలో రెండు వైపులా వందల కొద్దీ బస్తీలు, కాలనీలు ఉన్నాయి. అనేక చోట్ల ప్రహరీ గోడలు కానీ, ఫెన్సింగ్ కానీ లేకపోవడం వల్ల మనుషులు రాత్రింబవళ్లు ఒక వైపు నుంచి మరోవైపు వెళ్తారు. దీంతో ఎంఎంటీఎస్ రైళ్లు, కొన్ని చోట్ల ఎక్స్ప్రెస్లు ఢీకొని తరచుగా మృత్యువాత పడుతున్నారు. పశువులు చనిపోతున్నాయి. భరత్నగర్, హఫీజ్పేట్, డబీర్పురా, ఫలక్నుమా, ఉప్పుగూడ, విద్యానగర్, సీతాఫల్మండి వంటి అనేక చోట్ల పెద్ద సంఖ్యలు మలుపులు ఉన్నాయి. కొన్ని చోట్ల వార్నింగ్ అలారమ్లు ఏర్పాటు చేశాను. కానీ ఫెన్సింగ్ లేకపోవడం వల్ల రాకపోకలను మాత్రం నియంత్రించలేకపోతున్నారు. ఫెన్సింగ్లు ఏర్పాటు చేయడం, అవసరమైన చోటప్రహరీలు నిర్మించడం వంటి పనులు ఇప్పటికీ ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. రైల్వే చట్టం ప్రకారం మనుషులు, పశువులు ట్రాక్లు దాటడం నేరం. ఈ నేరాలు జరగకుండా అరికట్టేందుకు ఎలాంటి రక్షణ చర్యలు లేవు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ సహా అన్ని రైళ్లకు క్యాటిల్ గార్డ్లు ఉండడం వల్ల రైలు ఇంజిన్లు దెబ్బతినడం లేదు. భవిష్యత్లో వందేభారత్ రైళ్లు ఈ మార్గంలో నడిస్తే ఇంజిన్లు దెబ్బతిని అపారమైన నష్టం జరిగే ప్రమాదం ఉంది. చదవండి: సిటీ@431 ఏళ్లు.. హైదరాబాద్లో తొలి కట్టడం ఏంటో తెలుసా! -
పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఆదివారం పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇక్కడి రైల్వే అధికారులు శనివారం ప్రకటించారు. రద్దు చేసిన రైళ్లలో విజయవాడ–గుంటూరు(17783), గుంటూరు–మాచర్ల (07779), మాచర్ల–నడికుడి (07580/07579), మాచర్ల–విజయవాడ (07782), డోర్నకల్లు–విజయవాడ (07755), భద్రాచలం రోడ్డు–విజయవాడ (07278/07979) ఉన్నాయి. -
Viral Video: అదృష్టం బాగుండి బతికిపోయాడు.. లేకుంటే ఎంత పనై ఉండేది
రైలు ప్రమాదాలకు గురై ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. కొంతమంది కావాలనే రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడుతుంటే.. మరికొందరు అనుకోకుండా రైలు ప్రమాదం బారిన పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి పట్టాలపై పడిపోగా అతనిపై నుంచి రైలు దూసుకెళ్లింది. అయితే అదృష్టం బాగుండి మృత్యువును జయించి వీరుడిలా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని భర్తన రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. దీనిని ప్లాట్ఫామ్పై ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశారు. వ్యక్తి పట్టాలపై పడిపోగా అతనిపై నుంచి రైలు వెళ్లింది. ప్లాట్ఫామ్పై రైలు వేగంగా వెళ్తుండటం వల్ల పట్టాలపై పడిన వ్యక్తి ముందుగా కనిపించలేదు. నిమిషం తరువాత ట్రైన్ వెళ్లిపోయాక చూస్తే అతను ఎటు కదలకుండా ప్లాట్ఫామ్కు అనుకొని కింద ఒకేచోట ఉండిపోయాడు. అంతేగాక అద్భుతంగా అతని ఒంటిపై కనీసం ఒక్క గీత కూడా పడకుండా సురక్షితంగా బయటకొచ్చాడు. రైలు స్టేషన్ దాటిన తర్వాత సదరు వ్యక్తి తనను బతికించినందుకు దేవుడికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఘటనలో బాధితుడు ప్రాణాలతో బయటపడటంతో అక్కడ గుమిగూడిన వారంతా హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు. వీడియో ఆధారంగా రైలు వచ్చే కొద్ది క్షణాలముందే వ్యక్తి ట్రాక్పై పడినట్లు తెలుస్తోంది. అతని వస్తువులు కూడా పట్టాలపై చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. Viral Video : Train passed over a man at Bharthana railway station in Etawah as death..., watch breath-taking video pic.twitter.com/eHtn1LcN1A — santosh singh (@SantoshGaharwar) September 6, 2022 -
సాహసం చేసి ప్రాణం కాపాడాడు.. అడి కార్ అందుకున్నాడు
ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవడం గొప్ప విషయం. అలాంటిది తన ప్రాణం పోతుందని తెలిసి కూడా కాపాడాలనుకోవడం సాహసమే కదా!. అలాంటి సాహస వీరుడికి ఘనంగా సన్మానం చేశారు. ఖరీదైన అడి కార్తో సత్కారం అందుకున్నాడు. కానీ, అంతకన్నా విలువైందే తనకు దక్కిందని అంటున్నాడు 20 ఏళ్ల ఆ కుర్రాడు. ఇంతకీ ఆ కుర్రాడికి దక్కిన విలువైన వస్తువు ఏంటో తెలుసా?.. ఒక ప్రాణం కాపాడాననే ఆత్మసంతృప్తి. యస్.. చికాగోకు చెందిన 20 ఏళ్ల టోనీ పెర్రీ తన ప్రాణాన్ని రిస్క్ చేసి ఓ వ్యక్తిని కాపాడాడు. అందుకే అతన్ని మెచ్చుకుంటోంది సోషల్ మీడియా. ఉమ్మి కారణంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరు తన్నుకుంటూ ఎలక్ట్రిక్ రైల్వే ట్రాక్స్ మీద పడిపోయారు. దాడికి దిగిన వ్యక్తి వెంటనే తప్పించుకోగా.. మరోవ్యక్తి మాత్రం ఎలక్ట్రిక్ ట్రాక్స్ మీద పడిపోవడంతో షాక్ కొట్టింది. 600 వోల్ట్స్ కరెంట్తో విలవిలలాడిపోయాడు అతను. ప్లాట్ఫామ్ మీద ఉన్నవాళ్లంతా భయంతో అలా చూస్తూ ఉండిపోయారు. ఈ లోపు అక్కడే ఉన్న టోనీ పట్టాల మీదకు దూకి అతి జాగ్రత్త మీద ఆ వ్యక్తి పక్కకు జరిపాడు. ఆ సమయంలో అంతా టోనీని హెచ్చరిస్తున్నా.. పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఒకవేళ అదే ప్లేసులో నేనుంటే?.. జనాలు నా గురించి ఏమనుకుంటారు? నన్ను రక్షిస్తారా? అలాగే వదిలేస్తారా? అనే ఆలోచన నన్ను భయపెట్టింది. అందుకే ముందు వెళ్లాను. ఆ వ్యక్తి ప్రాణాలు నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతా హీరో అంటున్నారు. కానీ, నిజాయితీ అనిపిస్తోంది. టోనీని స్థానికంగా అంతా కలిసి ఘనంగా సన్మానించారు. స్థానికంగా ఉన్న ఓ వ్యాపారవేత్త ఆడి ఏ6 కార్ను టోనీకి సర్ప్రైజ్గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ కారు ప్రారంభ ధరే మన కరెన్సీలో రూ.60 లక్షలకు పైనే ఉంది. -
రైల్వే ట్రాక్లను పేల్చేసేందుకు ఐఎస్ఐ కుట్ర
న్యూఢిల్లీ: మనదేశంలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రయత్నిస్తోందని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించాయి. పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు ఐఎస్ఐ పెద్ద కుట్ర పన్నిందని తెలిపాయి. ఈ మేరకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరిక జారీ చేశాయి. గూడ్స్ రైళ్లే టార్గెట్ సరకు రవాణా రైళ్లను ధ్వంసం చేయడానికి పంజాబ్తోపాటు పరిసర రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్లను పేల్చివేయాలని ఐఎస్ఐ ప్లాన్ చేసిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం భారతదేశంలోని తన కార్యకర్తలకు ఐఎస్ఐ పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తోందని వెల్లడించాయి. భారత్లో ఉన్న పాక్ స్లీపర్ సెల్స్కు తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తోందని వివరించాయి. ఖలిస్తాన్ ఉగ్రవాదుల ఎగదోత ఖలిస్తాన్ ఉగ్రవాదులను కూడా దాడులకు ఐఎస్ఐ ఉసిగొల్పుతోందని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. లాహోర్లో దాక్కున్న ఖలిస్తాన్ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండాను ఇందుకోసం వాడుకుంటోందని వెల్లడైంది. పంజాబ్లో శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు భారత వ్యతిరేక శక్తులు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నట్టు నిఘా సంస్థలు సేకరించిన ఆధారాలు రుజువు చేస్తున్నాయి. భద్రత కట్టుదిట్టం నిఘా వర్గాల సమాచారంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. రైల్వే ట్రాకుల వెంట భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు గస్తీని ముమ్మరం చేశాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని రైలు మార్గాల్లో నిఘా పెంచారు. (క్లిక్: నాన్నా! భయమేస్తోంది.. వచ్చేయాలనుంది) పంజాబ్పై గురి జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఆటలు సాగకపోవడంతో పంజాబ్పై గురిపెట్టారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘జమ్మూకశ్మీర్లో ఐఎస్ఐ విజయం సాధించలేకపోవడంతో సరిహద్దు రాష్ట్రంలో మిలిటెన్సీని పునరుద్ధరించడానికి పంజాబ్ను లక్ష్యంగా చేసుకుంది. ఇందుకోసం సిక్కు తీవ్రవాద సంస్థలైన సిక్కు ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) బబ్బర్ ఖల్సా కూడా పనిచేస్తున్నాయి. కుట్రలో భాగంగా పంజాబ్లోని యువతను పెడదోవ పట్టించి సాయుధ దాడులు చేసేలా ఉసిగొల్పేందుకు ప్రయత్నిస్తున్నాయ’ని వివరించారు. ఖలిస్తాన్ ఉగ్రవాదులు తమ నెట్వర్క్ను ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు. ఇటీవల హరియాణలోని కర్నాల్ జిల్లాలో నలుగురు సిక్కు తీవ్రవాదులను అరెస్టు చేయడంతో ఈ విషయం వెల్లడైందన్నారు. (క్లిక్: దేశంలో ఒమిక్రాన్ సబ్వేరియెంట్ కేసుల కలకలం) -
రైలు పట్టాలే యమపాశాలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ వల్ల 2020లో వలస కార్మికుల వెతలు వర్ణనాతీతం. చాలామంది నగరాలు, పట్టణాల నుంచి కాలినడకన సొంతూళ్లకు పయనమయ్యారు. రైలు పట్టాలపై నడక సాగించారు. రైళ్లు ఢీకొట్టడం వల్ల, అనారోగ్యంతో వలస కార్మికులు పట్టాలపైనే ప్రాణాలు విడిచారు. గత ఏడాది దేశవ్యాప్తంగా రైలు పట్టాలపై 8,733 మంది మృతి చెందారని, వీరిలో అత్యధిక శాతం మంది వలస కార్మికులేనని రైల్వే బోర్డు ప్రకటించింది. మధ్యప్రదేశ్కు చెందిన సామాజిక ఉద్యమకారుడు చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు రైల్వే బోర్డు తాజాగా సమాధానమిచ్చింది. పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు 2020లో జనవరి నుంచి డిసెంబర్ వరకు రైలు పట్టాలపై 8,733 మంది మరణించారని, 805 మంది గాయపడ్డారని పేర్కొంది. రోడ్లతో పోలిస్తే రైల్వే మార్గాలపై ప్రయాణం తక్కువ దూరం కావడంతో వలస కార్మికులు వీటినే ఎంచుకున్నారని, పట్టాలపై కాలిన నడకన వెళ్తూ చాలామంది మార్గంమధ్యలో వివిధ కారణాలతో మృతి చెందారని అధికార వర్గాలు వెల్లడించారు. లాక్డౌన్ సమయంలో రోడ్లపై పోలీసుల నిఘా అధికంగా ఉండడంతో చాలామంది రైల్వే ట్రాకులపై నడుస్తూ సొంతూళ్లకు పయనమయ్యా రని అన్నారు. దేశవ్యాప్తంగా 70 వేల కిలోమీటర్ల మేర రైల్వే ట్రాకులు విస్తరించి ఉన్నాయి. నిత్యం 17 వేల రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తుంటాయి. 2016, 2017, 2018, 2019తో పోలిస్తే 2020లో రైలు పట్టాలపై చోటుచేసుకున్న మరణాలు తక్కువేనని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. 2016లో 14,032 మంది, 2017లో 12,838 మంది, 2018లో 14,197 మంది, 2019లో 15,204 మంది రైలు పట్టాలపై ప్రాణాలు విడిచారు. (చదవండి: భార్యను చంపి నాటకం.. ఘరానా ఎస్సై అరెస్ట్) -
రైలు పట్టాలపై ఆహారం.. 12 పులులు మృతి!
ఢిల్లీ: రైళ్లలోని ప్యాంట్రీ కార్ల నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల గత ఐదేళ్లలో 100కు పైగా జంతువులు మృతి చెందాయని మధ్యప్రదేశ్ అటవీ విభాగం ఓ నివేదికను రూపొందించింది. రైళ్లలోని ప్యాంట్రీ కార్ల నిర్వాహకులు వ్యర్థ ఆహారాన్ని రైలు పట్టాలపై పారేస్తుండడం వల్ల వాటిని తినడానికి వచ్చిన దాదాపు 100కు పైగా జంతువులు గత ఐదేళ్లలో మృతి చెందాయని పేర్కొంది. తాజాగా 12 పులులు చనిపోయాయని.. వాటిలో 5 పులులు, 7 చిరుతలు ఉన్నాయని తెలిపింది. సెహోర్ జిల్లాలో ఉన్న రతపాని టైగర్ రిజర్వ్ స్టేషన్ వద్దే ఈ పులులు చనిపోయాయని నివేదికలో పేర్కొంది. ఈ అటవీ ప్రాంతం గుండా 20 కిలోమీటర్లు రైలు పట్టాలు ఉన్నాయి. రైలు పట్టాలపై పడి ఉండే ఆహారం కోతులను, ఇతర జంతువులను ఆకర్షిస్తోందని, వాటి కోసం పులులు కూడా అక్కడకు వస్తున్నాయని తెలిపింది. అలా రైళ్ల కింద పడి చనిపోతున్నాయని తెలిపింది. చదవండి: హృదయవిదారకం: కరోనా మృతదేహాలను పీక్కుతింటున్నాయి -
కాపాడాడు, కానీ చెంప చెళ్లుమనిపించాడు
ముంబై: ఓ పెద్ద మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడుతూ రైలు పట్టాల మీద తచ్చాడాడు. ఇది చూసిన పోలీసు వెంటనే పరుగుపరుగున వచ్చి అతడిని పైకి లాగి రక్షించిన ఘటన శుక్రవారం నాడు ముంబైలోని దహీసర్ రైల్వే స్టేషన్లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అరవై ఏళ్ల పెద్దాయన రైల్వే పట్టాల మీదకు ఎక్కాడు. ఇంతలో రైలు కూత వినపడటంతో కంగారుగా వెనక్కు రాబోయాడు. ఈ క్రమంలో అతడి చెప్పు ఊడిపోయింది. అయితే తన ప్రాణం కన్నా కింద పడిన చెప్పే ముఖ్యమన్నట్లుగా వెళ్లి దాన్ని తీసుకున్నాడు. దూరం నుంచి ఇదంతా చూస్తున్న పోలీసు వెంటనే పరుగెత్తుకొచ్చి.. "పట్టాల మీదకు ఎక్కకుండా అక్కడే ఉండు, లేదంటే ఎడమ వైపు దూకేయ్" అని సలహా ఇచ్చాడు. దీన్ని పెద్దగా పట్టించుకోని వ్యక్తి రైలు వచ్చేలోగా ప్లాట్ఫామ్ మీదకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. (చదవండి: అదృష్టం: చెత్త కుప్పనుంచి మంత్రి ఆఫీసుకు..) వెంటనే పట్టాల మీదుగా పరుగెత్తగా సరిగ్గా అప్పుడే ట్రెయిన్ వేగంగా దూసుకొచ్చింది. దీంతో అక్కడ ఉన్న పోలీసు అతడిని ప్లాట్ఫామ్ మీదకు లాగి కాపాడాడు. కానీ తన సూచన పాటించకుండా నిర్లక్క్ష్యంగా వ్యవహరించిన సదరు వ్యక్తి చెంప చెళ్లుమనిపించాడు. ఈ ఘటన అంతా అక్కడి కెమెరాలలో రికార్డవగా, ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. రైల్వే ట్రాక్ మీద నడవద్దన్న నిబంధనను ఆ వ్యక్తి తుంగలో తుక్కాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే ప్రాణాలతో చెలగాటం ఆడిన వ్యక్తిని పోలీసు కొట్టడాన్ని కొందరు సమర్థిస్తుండగా మరికొందరు మాత్రం హెచ్చరిస్తే సరిపోయేదని అభిప్రాయపడుతున్నారు. (చదవండి: ఆశ్చర్యం.. చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడు!) -
పెళ్లైన నెల రోజులకే పట్టాలపై ప్రేరణకర్త !
భువనేశ్వర్(ఒడిశా): స్థానిక లింగరాజ్ ఆలయం సమీపంలోని రైల్వే ట్రాక్పై యువకుడు ఆదిత్యదాస్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆయన ప్రేరణాత్మక వక్త(మోటివేషనల్ స్పీకర్)గా ఇటీవల పేరొందిన ఆయన.. పీపుల్ ఫర్ సేవా పేరుతో వృద్ధాశ్రమం ఏర్పాటు చేశారు. అనతి కాలంలో ఈ కేంద్రంలో 100 మంది వయో వృద్ధులకు ఆశ్రయం కల్పించారు. అయితే మంగళవారం ఉదయం ఆయన మృతదేహం పట్టాలపై పడి ఉన్నట్లు గమనించిన స్థానికులు.. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్యాపిటల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పూర్వాపరాల పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మానసిక స్థైర్యం పట్ల పలు ప్రేరణాత్మక సందేశాలను సాంఘిక మాధ్యమాల్లో ప్రసారం చేసి, ఉత్తమ వక్తగా పేరొందిన వ్యక్తి.. ఇలా ఆత్మహత్యకు పాల్పడే అవకాశం లేదని స్థానికులు భావిస్తున్నాయి. గత నెల 9న ఆదిత్య దాస్కు వివాహం జరిగింది. -
మార్చిలో గజ్వేల్కు.. కూ.. చుక్చుక్
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్–గజ్వేల్ మధ్య నడపనున్న రైలు మార్చిలో పట్టాలెక్కబోతోంది. తొలుత పుష్పుల్ ప్యాసింజర్ సేవలను ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసిన రైల్వే, రామాయపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై వంతెన నిర్మాణ పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈనెల 20 నుంచి ఆ పనులు మొదలుకానున్నా యి. వాటిని రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం గా పెట్టుకుంది. ఫిబ్రవరి చివరినాటికి ఆ పనులు పూర్తి చేసి మార్చి మొదటి వారంలో రైలును నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్టేషన్లు... ట్రాక్ సిద్ధం సికింద్రాబాద్తో కరీంనగర్ను రైల్వే లైన్ ద్వారా అనుసంధానించే మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజె క్టులో తొలి దశ పనులు దాదాపు పూర్తయ్యాయి. మనోహరాబాద్ స్టేషన్ నుంచి ఈ కొత్త లైన్ ప్రారం భమైంది. అక్కడికి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్వేల్ పట్టణం వరకు పనులు పూర్తి చేయటం ప్రాజెక్టు తొలిదశ. ఇందులో మనోహరాబాద్ వద్ద కొత్త స్టేషన్ భవనం సిద్ధమైంది. ఆ తర్వాత నాచారం, అప్పాయిపల్లి, గజ్వేల్లలో స్టేషన్లు ఉంటా యి. జనవరి నాటికి పనులన్నీ పూర్తవుతాయి. జాతీయ రహదారిని కట్చేసి... ఇక ఈ 32 కిలోమీటర్ల మార్గంలో ఆరు రోడ్ ఓవర్ బ్రిడ్జీలు మూడు రోడ్ అండర్ బ్రిడ్జీ, నాలుగు చోట్ల పెద్ద వంతెన పనులు పూర్తయ్యాయి. ఇక నిజామాబాద్ మీదుగా సాగే 44వ నంబర్ జాతీయ రహదారిని రైల్వే లైన్ క్రాస్ చేసే చోట వంతెన నిర్మించాల్సి ఉంది. జాతీయ రహదారిని కట్ చేసి పని చేపట్టాల్సి ఉన్నందున అనుమతి కోసం వేచి చూడాల్సి వచ్చింది. ఈనెల 20 నుంచి అక్కడ పనులు చేసుకోవచ్చంటూ తాజాగా జాతీయ రహదారుల విభాగం అనుమతించడంతో పనులు చకచకా సాగనున్నాయి. ఫిబ్రవరిలో ట్రయల్ రన్ పూర్తి చేసి మార్చి తొలివారంలో ప్రారంభించనున్నట్లు అధికారులు చెప్పారు. -
నాడు నిలిపివేసి..నేడు ప్రయాణం సా..గదీసి
సాక్షి, కొత్తగూడెం : భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) రైల్వే స్టేషన్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్ వరకు వెళ్లే సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ రైలు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఈ బండి తెల్లవారుజామున 05:45 గంటలకు కొత్తగూడెం నుంచి బయల్దేరేది. ప్రస్తుతం ఉదయం 06:45 గంటలకు షురూ అవుతోంది. డోర్నకల్ సమీపంలోని స్టేషన్ల మధ్యలో జరుగుతున్న రైల్వే ట్రాక్ పనులు, సాంకేతిక లోపాల మరమ్మతుల కారణంగా రైలు నడిచే సమయాల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అయితే..ఈ ఆలస్యంతో నిత్యం రాకపోకలు సాగించేవారు చాలా అసౌకర్యం చెందుతున్నారు. ఈ రైలు ఎక్కి డోర్నకల్ స్టేషన్కు వెళ్లి..అక్కడి నుంచి హైదరాబాద్, విజయవాడలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో 05:45 గంటలకు రైలు వెళ్లినప్పడు డోర్నకల్ స్టేషన్లో హైదరాబాద్, విజయవాడలకు వెళ్లే రైళ్లు ఉండేవి. ప్రస్తుతం మార్పు చేసిన సమయంతో..ఆ ట్రెయిన్లు దొరకట్లేదు. ముఖ్యంగా శాతవాహన, గోల్కొండ, చార్మినార్ ఎక్స్ప్రెస్ రైళ్లు..అందట్లేదని వాపోతున్నారు. కొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి వెళ్లేందుకు ప్రయాస పడాల్సి వస్తోంది. రైల్వే అధికారులు చర్యలు చేపట్టి, పాత సమయంలోనే సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ రైలును కొనసాగించాలని పలువురు కోరుతున్నారు. మార్చి దాకా ఇంతేనా? డోర్నకల్ సమీపంలో రైల్వే ట్రాక్ పనులు, సాంకేతిక లోపాల మరమ్మతులు చేస్తున్నారు. అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 2020 మార్చి వరకు అని భావిస్తున్నారు. అయితే..మే వరకు కూడా పనులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రయాణీకుల ఇబ్బందులు సింగరేణి కార్మికులు ఉండే ప్రాంతాలను కలుపుతూ నడిచే సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ను ఈ ఏడాది మార్చి 26న రద్దు చేశారు. దీని స్థానంలో పుష్పుల్ రైలును వేశారు. అందులో టాయిలెట్లు లేక, సామగ్రి పెట్టుకునే ఏర్పాట్లు లేక ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, అఖిలపక్ష నాయకులు చేసిన పోరాటాలు, రైల్వే అధికారులకు ఇచ్చిన వినతుల ఫలితంగా మళ్లీ గత అక్టోబర్ 8వ తేదీన సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ను అధికారులు పున:ప్రారంభించారు. తాజాగా గంట ఆలస్యం ఆంక్షలతో ప్రయాణికులు మళ్లీ మదన పడుతున్నారు. ఇతర రైళ్లను సరైన సమయంలో అందుకోలేకపోతున్నామని అంటున్నారు. రైల్వే ట్రాక్ పనులతో ఆలస్యం.. డోర్నకల్ సమీప ప్రాంతాల్లో ప్రస్తుతం నడుస్తున్న రైల్వే ట్రాక్ పనుల వలన సింగరేణి ప్యాసింజర్ గంట ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే టైం షెడ్యూల్ 2020 మార్చి వరకు కొనసాగనుంది. అయితే ఆ తర్వాత కూడా ఉన్నతాధికారులు కొనసాగించమంటే..అదే షెడ్యూల్ను కొనసాగిస్తాం. – కనకరాజు, రైల్వే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, కొత్తగూడెం ఇబ్బంది పడుతున్నాం.. సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ రైలు ప్రయాణ సమయాన్ని గంట లేటు చేయడంతో మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. గతంలో తెల్లవారుజామున 5:45కు బయల్దేరినప్పుడు సరైన టైంకు చేరేవాళ్లం. ఇప్పుడు అలా వెళ్లలేకపోతున్నాం. – బొల్లం రమేష్, ప్రయాణికుడు చాలా క్రాసింగ్లు పెట్టారు.. రైల్వే అధికారులు చేసిన మార్పుల వలన సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్కు చాలా క్రాసింగ్లు ఎదురవుతున్నాయి. సింగరేణి రైలును ఆపి, ఎదురుగా వచ్చే ఇతర ట్రెయిన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. డోర్నకల్లో ఇతర రైళ్లను అందుకోలేకపోతున్నాం. – రఘు, ప్రయాణికుడు -
వైరల్ : ప్రాణాలు కాపాడుతానంటున్న యమరాజు
ముంబయి : సాధారణంగా మన ప్రాణాలను హరించేందుకు యముడి రూపంలో వస్తాడని మన పురాణాలు చెబుతుంటాయి. కానీ అదే యముడు ప్రాణాలు కాపాడడానికి వస్తే ఎలా ఉంటుందనేది ఒక్కసారి ఇక్కడ చూడండి. రైల్వే ట్రాక్ దాటుతూ ప్రమాదాల భారీన పడుతున్న వారికి అవగాహన కల్పించడానికి పశ్చిమ రైల్వే విభాగం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా ఒక వ్యక్తికి యముని వేషదారణ వేసి రైల్వే ట్రాక్ దాటుతున్న కొంతమందిని ఎత్తుకొని ప్లాట్పామ్ మీదకు తీసుకువచ్చి ప్రమాదాల పట్ల అవగాహన కల్పించారు. పశ్చిమ రైల్వే విభాగం చేసిన వినూత్న ప్రయత్నానికి అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. 'తరచూ రైల్వే పట్టాలు దాటుతూ ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో తెలిసిన విషయమే. వీటి వల్ల జరుగుతున్న ప్రమాదాలపై అవగాహన కల్పించడానికే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇక మీదట ఎవరు ప్రమాదాల భారీన పడకుండా సబ్వే లేదా రైల్వే బ్రిడ్జిని ఉపయోగించేలా ప్రయాణికులను ప్రోత్సహిస్తామని' పశ్చిమ రైల్వే విభాగం ట్విటర్లో పేర్కొంది. 'ప్రయాణికులు ప్రమాదాల భారీన పడకుండా పశ్చిమ రైల్వే విభాగం చేస్తున్న వినూత్న కార్యక్రమం చాలా బాగుంది అంటూ' నెటిజన్లు తమ సంతోషాన్నివ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాల భారీన పడకుండా కాపాడుతున్న యమరాజు రూపంలో ఉన్న వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ మరికొందరు పెదవి విరుస్తున్నారు. అయితే గతంలోనూ బెంగుళూరు, గుర్గావ్ నగరాల్లో ప్రయాణికులకు రోడ్ సేప్టీ అవేర్నెస్ కల్పించడానికి ఆయా రాష్ట్రాల ట్రాపిక్ విభాగం ఇలాంటి వినూత్న కార్యక్రమాలనే చేపట్టింది. This Yamraj ji saves lives. He catches people who are endangering their lives by trespassing the railway tracks, but to save them. This Yamraj picks people to release them safely. Please do NOT cross tracks, it's dangerous. pic.twitter.com/PT81eYVajL — Western Railway (@WesternRly) 7 November 2019 -
‘ట్రాక్’లోకి వచ్చేదెలా.!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ఔటర్ రింగ్ రోడ్డు విభాగం అధికారుల నిర్లక్ష్యం వాహనదారుల పాలిట శాపంగా మారుతోంది. ఓఆర్ఆర్ సమీపంలోని రైల్వే ట్రాక్లను సాకుగా చూపుతూ కొన్నేళ్లుగా సర్వీసు రోడ్ల పనులు నిలిపివేశారు. ఆయా ప్రాంతాల్లో బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉన్నా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోవాలాల అవస్థలు పడుతున్నారు. ఫలితంగా రెండు, మూడు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. 2012లోనే ఓఆర్ఆర్తో పాటు సర్వీసు రోడ్డు నిర్మాణాలన్నీ పూర్తి కావాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంపై వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈదుల నాగులపల్లి, శంషాబాద్, ఘట్కేసర్, మేడ్చల్ సమీపంలో ఓఆర్ఆర్ను తాకుతూ వెళుతున్న రైల్వే ట్రాక్లకు అనుబంధంగా ఉన్న సర్వీసు రోడ్లు అసంపూర్తిగా ఉండటంతో నరకం చూస్తున్నారు. ఈదులనాగలపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతిచ్చినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ఇబ్బందులు అప్పటి కమిషనర్ జనార్దన్రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయా ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అయినా పనుల్లో ఆశించినంత పురోగతి కనిపించడం లేదు. ఇబ్బందులు పడుతున్నాం.. పెద్దఅంబర్పేట్ వైపు నుంచి కీసర వెళ్లాలంటే యంనంపేట్ గ్రామం మీదుగా సర్వీస్ రోడ్డుకు చేరుకోవడానికి రెండు కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. రైల్వే ట్రాక్ కారణంగా సర్వీస్ రోడ్డు నిర్మించకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నాం.–సిద్దూ, ఘట్కేసర్ వాసి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలి మేడ్చల్ మండల పరిధిలో సుతారిగూడ నుంచి గౌడవెళ్ళి వరకు సర్వీసు రోడ్డు లేకపోవడంతో వాహనదారులు, గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. పాత జంక్షన్ సుతారిగూడ వరకు సర్వీసు రోడ్డు నిర్మించి వదిలిపెట్టారు. గౌడవెళ్ళి వద్ద రైల్వె ట్రాక్ ఉండటంతో అండర్పాస్ బ్రిడ్జి లేకపోవడంతో ఔటర్ ప్రయాణికులు గౌడవెళ్ళి మీదుగా మూడు కిలో మీటర్లు తిరిగి జ్ఞానాపూర్ చౌరస్తా నుంచి దుండిగల్ వైపు వెళ్ళాల్సి వస్తోంది. సమస్యను రైల్వే అధికారులు, హెచ్ఎండీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. –సురేందర్ ముదిరాజ్, గౌడవెళ్లి సర్పంచ్ నిలిచిన సర్వీస్ రోడ్డు పనులు శంషాబాద్: ఔటర్ రింగు రోడ్డు మార్గంలో తొండుపల్లి జంక్షన్ నుంచి పెద్దగోల్కొండ వైపు సుమారు రెండు కిలోమీటర్ల మేరకు ఇరువైపులా సర్వీసు రోడ్డు అసంపూర్తిగా ఉంది. ఈ దారి మధ్యలో ఉందానగర్–తిమ్మాపూర్ స్టేషన్ల రైల్వే ట్రాక్ ఉండడంతో సర్వీసు రోడ్డు పనులను నిలిపివేశారు. పెద్దగోల్కొండ వైపు నుంచి సర్వీసు రోడ్డులో శంషాబాద్ వచ్చే వాహనదారులు హమీదుల్లానగర్ సమీపంలో దారి మళ్లాల్సి వస్తుంది. చెన్నమ్మ హోటల్ సమీపంలోని కొత్వాల్గూడ ప్రాంతంలో సైతం రెండు కిలోమీటర్ల దూరం వరకు సర్వీసు రోడ్డు పనులు నిలిచి పోవడంతో వాహదారులు హిమాయత్సాగర్ జలాశయం వెంబడి ఉన్న ఇరుకు దారి గుండా వెళ్లాల్సి వస్తోంది. వయా యంనంపేట్ ఘట్కేసర్: కీసర నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో పెద్దఅంబర్పేట్ వైపు వెళ్లాలంటే శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాల వరకు సర్వీస్ రోడ్డులో ప్రయాణించి అక్కడి నుంచి యంనంపేట్ గ్రామం మీదుగా ఘట్కేసర్ బైపాస్ రోడ్డు నుంచి సర్వీస్ రోడ్డుకు చేరుకోవాలి. రైల్వే ట్రాక్ కారణంగా సర్వీస్ రోడ్డు నిర్మించకపోవడంతో అదనంగా మూడు కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తోంది. పెద్దఅంబర్పేట్ వైపు నుంచి కీసర వెళ్లాలంటే యంనంపేట్ గ్రామం మీదుగా సర్వీస్ రోడ్డుకు చేరుకోవడానికి రెండు కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించవలసి వస్తోంది. 3.5 కి.మీ. నరకం మేడ్చల్: గౌడవెళ్లి రైల్వే ట్రాక్ పై బ్రిడ్జి ఏర్పాటు చేయకపోవడంతో ఔటర్రింగు రోడ్డు సర్వీసు అసంపూర్తిగా ఉండటంతో సర్వీసు రోడ్డులో వెళుతున్న వాహనదారులు 3.5 కిలోమీటర్లు చుట్టు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఘట్కేసర్ వైపు నుంచి వచ్చే రోడ్డులో సుతారిగూడ టోల్ప్లాజా వరకు సర్వీస్ రోడ్డు నిర్మించి వదిలేశారు. పటాన్చెరు వైపు నుంచి వచ్చే రోడ్డులో గౌడవెళ్ళి పరిధిలోని రాంరెడ్డి గార్డెన్ సమీపం వరకు సర్వీసు రోడ్డు నిర్మించి వదిలేశారు. దీంతో వాహనదారులు సుతారిగూడ టోల్ ప్లాజా నుండి గౌడవెళ్ళి గ్రామం మీదుగా 3.5 కిలో మీటర్లు తిరిగి జ్ఞానాపూర్ బ్రిడ్జి వద్ద ఉన్న సర్వీసు రోడ్డు మీదుగా వెళ్లాల్సి వస్తుంది. పటాన్చెరు వైపు నుంచి వచ్చే వాహనదారుల ఇదే పరిస్థితి. పొలాలకు వెళ్లేందుకు దారి లేదు.. ఈదులనాగులపల్లి: రామచంద్రపురం మండలం పరిధిలోని ఈదులనాగులపల్లి గ్రామ శివార్లలోని ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు లేకపోవడంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈదులనాగులపల్లి, వెలమల శివార్లలో రైల్వేట్రాక్ కారణంగా సర్వీసు రోడ్డు అసంపూర్తిగా మిగిలింది. దీంతో రైతులు పొలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగులపల్లి రావాలంటే కిలోమీటర్ చుట్టు తిరిగి రావాల్సి వస్తోంది. -
రైలు పట్టాలపైనే టెంట్ వేసి ఆందోళన
ఢిల్లీ/రాజస్థాన్ : రిజర్వేషన్ల కోసం గుజ్జర్ల ఆందోళన రైల్వే వ్యవస్థపై ప్రభావం చూపింది. గుజ్జర్ల ఆందోళన నేపథ్యంలో 15 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేయగా, మరో అయిదు రైళ్లను దారి మళ్లించింది. రాజస్థాన్ ప్రభుత్వం అయిదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ గుజ్జర్లు రైలు పట్టాలపై టెంట్లు వేసి నిరసన తెలుపుతున్నారు. విద్యా, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ గుజ్జర్లు నిన్నటి నుంచి సవాయి మాదోపూర్ జిల్లాలో మలర్నా దుంగార్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్లపై టెంట్లు వేసుకుని ధర్నాకు దిగారు. దీంతో వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో కొన్ని రైళ్లు రద్దు కాగా, మరికొన్ని రద్దు అయ్యాయి. ఐదు శాతం రిజర్వేషన్ కోసం తాము చాలా కాలంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తాము తిరిగి ఆందోళన చేపట్టామని, తమ కోటాను ప్రభుత్వం ఎలాగైనా ఇచ్చి తీరాల్సిందేనని గుజ్జర్ల నేత కిరోరి సింగ్ భైంస్లా స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం గుజ్జర్లు సహా గొదియా లొహర్, బంజారా, రైకా, గదారియా కులాల వారికి 50 శాతం కోటాలోనే అత్యంత వెనుకబడిన వర్గాల కింద ప్రత్యేకంగా ఒక శాతం రిజర్వేషన్ అమలవుతోంది. అయితే తమ కులాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్ధల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ గుజ్జర్లు జనవరిలో రాజస్ధాన్ సర్కార్కు ఇరవై రోజుల గడువిస్తూ అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వానికి ఇచ్చిన డెడ్లైన్ ముగియడంతో సవాయి మధోపూర్ జిల్లాలో గుజ్జర్లు ఆందోళన బాట పట్టారు. -
బుల్లెట్ ట్రైన్నూ ఇలాగే నడిపిస్తారా..?
సాక్షి, ముంబై : చినుకు పడితే రైల్వే ట్రాక్లపై నీరు నిలిచి రైలు సర్వీసులకు బ్రేక్ పడుతుండటంపై బాంబే హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ముంబై నగరంలో ఇటీవల వరదలతో రైల్వే ట్రాక్లపైకి నీరు నిలిచిపోవడంతో పలు రైళ్ల రాకపోకలు రద్దయిన క్రమంలో ప్రయాణీకుల ఇబ్బందులను ప్రస్తావించింది. నీటిలో మునిగిన ట్రాక్లపైనా రైళ్లు నడిచే సాంకేతికత అంతర్జాతీయంగా అందుబాటులో ఉందా..?..త్వరలో నిర్మించే బుల్లెట్ ట్రైన్ను వరద నీటిలో నడిపిస్తారా..? అంటూ హైకోర్టు అధికారులను ప్రశ్నించింది. కాంగ్రెస్ నేత స్మితా మయాంక్ ధ్రువ దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తూ జస్టిస్ నరేష్ పాటిల్, జస్టిస్ గిరీష్ కులకర్ణిలతో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. వరదలతో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు పశ్చిమ, మధ్య రైల్వే అధికారులతో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. పశ్చిమ, మధ్య రైల్వే జనరల్ మేనేజర్ల భేటీ త్వరలో జరుగుతుందని, ఈ సమావేశంలో రైల్వే బ్రిడ్జిలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, ఫ్లాట్ఫాం ఎత్తు, మహిళల భద్రత వంటి పలు అంశాలపై చర్చిస్తారని కేంద్రం తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ చెప్పారు. ఇటీవల అంథేరి బ్రిడ్జి కూలిన అంశాన్ని ప్రస్తావించిన బెంచ్ అన్ని బ్రిడ్జిల స్థితిగతులపై రైల్వేలు తక్షణమే వ్యవస్ధాగత ఆడిట్ నిర్వహించాలని కోరింది. -
మెట్రో ట్రాక్పై నడిచిన మహిళ
సాక్షి, న్యూఢిల్లీ : స్టేషన్లలో పౌరుల భద్రతకు, ఆత్మహత్యలను నిరోధించేందుకు ఢిల్లీ మెట్రో అధికారులు పలు చర్యలు చేపడుతున్నా ఈ తరహా ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో ఓ మహిళ ఏకంగా పలు స్టేషన్లకు మెట్రో ట్రాక్లపైనే నడిచి వెళుతున్న వీడియో వైరల్గా మారింది. నోయిడా సెక్టార్ 15 మెట్రో స్టేషన్ నుంచి సెక్టార్ 16 మెట్రో స్టేషన్కు ట్రాక్పై నుంచి మహిళ నడిచివెళుతున్న దృశ్యాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి. ఆమె మెట్రోలో వెళ్లకుండా ట్రాక్ల పైనుంచి వెళ్లడం గమనార్హం. మహిళ ట్రాక్లపై నడవడాన్ని గుర్తించిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) అధికారులు ఇరు స్టేషన్ల మధ్య రైళ్లను నిలిపివేశారు. ట్రాక్పై నడుస్తున్న మహిళను స్ధానికులు వారించినా ఆమె వినిపించుకోకపోవడం గమనార్హం.మెట్రో స్టేషన్లో ఆత్మహత్యకు పాల్పడాలనే ఉద్దేశంతోనే ఆమె ఇలామ వ్యవహరించారని భావిస్తున్నారు. ట్రాక్పై నడుస్తున్న మహిళను అధికారులకు డీఎంఆర్ఆసీ అప్పగించింది. -
దొంగలు బాబోయ్ దొంగలు..
న్యూఢిల్లీ : రైల్వే సమాన్ల దొంగతనం జరగడం కొత్తకాకపోయిన చోరికి గురౌతున్న వస్తువుల గురించి తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతకు ముందు రైలు పట్టాలను ఎత్తుకెళ్లెవారు. ప్రస్తుతం బాత్రూంలో ఉన్న సమాన్లను కూడా దొంగలు వదలట్లేదని రైల్వే అధికారులు వాపోతున్నారు. బాత్రూంలో ఉండే మగ్గులు, వాష్బెసిన్లు, బోగిలో ఫ్యాన్లను చోరి చేస్తున్నారని అధికారులు తెలిపారు. కిటికిలకు ఉండే ఇనుప కడ్డీలు, పట్టాలు ఎక్కువగా చోరి అవుతున్నట్టు వెల్లడించారు. 2017-18 సంవత్సరానికి గాను చోరి అయిన దాదాపు రూ. 2.97 కోట్ల విలువైన వస్తువులను రైల్వే పోలీసులు పట్టుకున్నారు. దీనికి రెండింతలు గత సంవత్సరం స్వాధీనం చేసుకున్నట్టు తెలపారు. కొన్ని సార్లు ప్రయాణికులు సీట్ల నారను, మగ్గులను వారి బ్యాగులలో తీసుకెళ్లడం తాము గమనిస్తామని, అవి సాధారణంగా జరిగేవే. కానీ రైలు పట్టాల చోరీ మాత్రం భారీ రైలు ప్రమాదాలకు దారి తీస్తుందని అన్నారు. దొంగలు ఎక్కువగా రైలు పట్టాలు, ఫిష్ ప్లేట్స్, వాష్ బెసిన్, అద్దాలు, ట్యాబులు, కేబుల్స్, సోలార్ ప్లేట్స్, టెలిఫోన్లు, బ్యాటరీలు, ఫ్యాన్లు, స్విచ్లను లక్ష్యంగా చేసుకుని దొంతనాలకు పాల్పడుతుంటారని తెలిపారు. 2016-17 సంవత్సరానికి గాను 5,219 దొంగతనం కేసులు నమోదు కాగా, వాటికి సంబంధించి 5,458 మందిని రైల్వే పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిపారు. 2017-18 గాను 5,239 కేసులు నమోదు అయ్యాయి. ఆర్పీఎఫ్ సిబ్బంది కొరత వల్లే దొంగతనాలను అరికట్టలేకపోతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. 74,456 మందికి గాను కేవలం 67,000 మంది సిబ్బందే ఉన్నట్టు తెలిపారు. వారిలో ఎక్కువ శాతం పోలీసు స్టేషన్లకే పరిమితమవ్వడం వల్ల యాంటీ తెఫ్ట్ డ్రైలను నిర్వహించలేక పోతున్నామని అన్నారు. -
రైలు పట్టాలపై సిమెంట్ బ్రిక్స్
రైల్వేగేట్ : రైలు పట్టాల మధ్య సిమెంట్ బ్రిక్స్ పెట్టిన సంఘటనపై బుధవారం రైల్వే ఎస్పీ అశోక్కుమార్ పరిశీలించారు. వరంగల్ జీఆర్పీ సీఐ జూపల్లి వెంకటరత్నం తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల15న ఉదయం 11.25 గంటల సమయంలో చింతలపల్లి, వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య 386/25–23 అప్లైన్ మైలు రాయివద్ద ట్రాక్పై గుర్తు తెలియని వ్యక్తులు 10 నుంచి 15 కిలోల బరువున్న సిమెంట్ బ్రిక్స్ పెట్టారు. అదే సమయంలో గుంటూర్ నుంచి సికింద్రాబాద్కు వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్ (17201) వస్తుంది. ఈ క్రమంలో రైలును కాసేపు నిలిపారు. అనంతరం బ్రిక్స్ తొలగించాక రైలు కదిలింది. ఈ సంఘటనపై బుధవారం రైల్వే ఎస్పీ అశోక్కుమార్, డీఎస్పీ రాజేంద్రప్రసాద్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ట్రాక్ల మధ్య సిమెంట్ బ్రిక్స్పెట్టిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జీఆర్పీ సీఐ జూపల్లి వెంకటరత్నం, సిబ్బంది ఉన్నారు. -
రైల్వే ట్రాక్ ఎక్కితే ఏనుగైనా పీనుగే
బరంపురం : రాష్ట్రంలో మూగజీవాలకు రక్షణ లేకుండా పోతోంది. రైల్వేట్రాక్లపై గజరాజులు మృత్యువాత పడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని జంతు ప్రేమికులు, రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. రాష్ట్రంలో గల రైల్వే ట్రాక్పై వివిధ ప్రాంతాల్లో గత 7 ఏళ్లలో జరిగిన దుర్ఘటనల్లో ఇప్పటి వరకు సుమారు 22 ఏనుగులు మృతి చెందిన సంఘటనలు జంతు ప్రేమికులను కలిచివేస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఝార్సుగుడ జిల్లాలోని బగ్గిధి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గల రైల్వే ట్రాక్పై గూడ్స్ రైలు ఢీ కొన్న దుర్ఘటనలో 4 ఏనుగులు మృతి చెందిన సంఘటన జాతీయ స్థాయిలో సంచలనం రేపింది. ముఖ్యంగా ఏనుగుల రక్షణపై చేపట్టవలసిన చర్యలపై భారత రైల్వే విభాగం, అటవీ శాఖ, వన్యప్రాణుల సంరక్షణ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత 2011 నుంచి 2018 ఏప్రిల్ వరకు 7 ఏళ్లలో 22 ఏనుగులు దుర్మరణం చెందాయి. 2012–2013 మధ్య కేవుంజర్ జిల్లా పరిధి చంపువా అటవీ రేంజ్లో గల రైల్వే ట్రాక్పై రైలు ఢీ కొన్న దుర్ఘటనలో 5 ఏనుగులు మృతిచెందాయి. ఇదేవిధంగా 2012 డిసెంబర్ 29వ తేదీ అర్ధరాత్రి గంజాం జిల్లా కళ్లికోట్ అటవీ రేంజ్ రంబా జంగిల్ పరిధిలో గల సుబలియా రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీ కొట్టడంతో 6 ఏనుగులు మృతి చెందిన సంఘటన జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో జరిగిన సంఘటనలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించి కేంద్ర వన్యప్రాణుల సంరక్షణ విభాగం, కేంద్ర అటవీ విభాగం అధికారులతో ఒక ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసింది. ఆ టీమ్ సభ్యులు ఏనుగులు మృతి చెందిన సంఘటన స్థలాలకు వచ్చి పరిశీలించి ప్రత్యేకంగా అరా తీసి కేంద్రానికి నివేదిక అందజేశారు. మూణ్ణాళ్ల ముచ్చటగా రక్షణ చర్యలు అనంతరం కేంద్రం ఆదేశంతో ఒడిశా రాష్ట్రం రైల్వే ట్రాక్ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల రక్షణ కోసం పలు విధాలా చర్యలు చేపట్టారు. ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతంలో గల రైల్వేట్రాక్పై వెళ్లే రైళ్లు 20 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా నడపాలని కేంద్ర రైల్వే విభాగం అదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి అటవీ శాఖ, వన్యపాణ సంరక్షణ విభాగం, రైల్వే అధికారులు అప్రమత్తమై సాయంత్రం 6గంటల నుంచి (రాత్రంతా) ఉదయం 5గంటల వరకు రంబా సుబలియా రైల్వే లైన్ వచ్చేసరికి సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకు వచ్చి పోయే ట్రైన్ల స్పీడ్ తగ్గించారు. ఇరువైపులా ట్రైన్లు 20 నుంచి 30 కిలోమీటర్ల స్పీడ్ మాత్రమే నడిచేవి. కొన్నాళ్ల తరువాత రక్షణ చర్యలు అటకెక్కాయి. తాజాగా దుర్ఘటనలు గత 2016–17 మధ్య ఒడిశాలో జరిగిన రైలు దుర్ఘటనలో 7 ఏనుగులు మృతి చెందగా 2018 ఏప్రిల్ 16వ తేదీ రాత్రి ఝార్సుగుడ జిల్లా బగ్గిధి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గల రైల్వే ట్రాక్పై తాజాగా రైలు ఢీకొన్న దుర్ఘటనలో 4 ఏనుగులు మృతి చెందిన సంఘటన జాతీయ స్థాయిలో సంచలనం రేపింది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది రాష్ట్రంలో రైల్వే ట్రాక్లపై ఏనుగుల దుర్మరణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టి ఏనుగులకు రక్షణ కల్పించాలి. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లపై తక్కువ వేగంతో రైళ్లు నడిపించాలి. ఇదే విధంగా అయా ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ వైర్లు అమర్చాలి. రైలు వచ్చిన సమయంలో ఈ సోలార్ విద్యుత్ వైబ్రేషన్ వచ్చేలా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాల్లో ఉన్న రైల్వేట్రాక్ సైడ్లలో రైళ్లు స్లోగా నడపాలని సూచన బోర్డులు అమర్చాలి. ముఖ్యంగా ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో వన్యపాణి సంరక్షణ అధికారులు, అటవీశాఖ అధికారులు స్థానిక పోలీసులు సయుక్తంగా అయా ప్రాంతాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్ జరపాలని జంతు ప్రేమికులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. -
లైన్లు రెడీ...రైళ్లేవీ?
ఎంఎంటీఎస్ రెండో దశను నిధుల గండం వెంటాడుతోంది. లైన్లు సిద్ధమైనప్పటికీ కొత్త రైళ్లు పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. సికింద్రాబాద్ నుంచి బొల్లారం మార్గంలో కొద్ది రోజుల క్రితమే రైల్వే భద్రతా కమిషన్ తనిఖీలు నిర్వహించింది. రైళ్లు నడిపేందుకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నట్లు అనుమతులు కూడా ఇచ్చేసింది. కానీ కొత్త లైన్లలో ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు బోగీలు మాత్రం లేవు. దీంతో వందల కోట్లు వెచ్చించి నిర్మించిన లైన్లు వినియోగంలోకి రాకుండాఉండిపోతున్నాయి. రాష్ట్రప్రభుత్వం గత బడ్జెట్లో తమ వంతు వాటాగా రూ.430 కోట్లు కేటాయించినా..ఇప్పటికీ విడుదల చేయలేదు. దీంతో రెండో దశ రూట్లలో రైళ్లు పట్టాలెక్కడం లేదని తెలుస్తోంది. సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదలలో తీవ్ర జాప్యం నెలకొంది. దీంతో రైల్వే లైన్ల పనులు పూర్తయినప్పటకీ రైళ్లు పట్టాలెక్కే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో వందల కోట్లు వెచ్చించి నిర్మించిన లైన్లు వినియోగంలోకి రాకుండా ఉండిపోతున్నాయి. ఒక్క 12.5 కిలోమీటర్ల పొడవైన సికింద్రాబాద్–బొల్లారం లైన్లు మాత్రమే కాకుండా 14 కిలోమీటర్ల పొడవైన మౌలాలి–ఘట్కేసర్, మరో 10 కిలోమీటర్ల పొడవైన పటాన్చెరు–తెల్లాపూర్ లైన్లు కూడా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ మిగతా మార్గాల్లో పనులు పూర్తి చేయడంతో పాటు, కొత్త రైళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. నిధుల కొరత కారణంగా రైళ్ల కొనుగోళ్లు, స్టేషన్ల నిర్మాణం, మరికొన్ని లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ వంటి పనుల్లో జాప్యంనెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి... నగర శివార్లను కలుపుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశకు మొదటి నుంచి నిధులు కేటాయించడంలో రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. సకాలంలో నిధులు అందజేయకపోవడం వల్ల పనులు నత్తనడక నడుస్తున్నాయి. సుమారు రూ.850 కోట్లతో చేపట్టిన ఈ సంయుక్త ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రం తన మూడు వంతుల నిధులను అందజేయాల్సి ఉంది. మరో 1/4 వంతు నిధులను రైల్వేశాఖ కేటాయిస్తుంది. సుమారు రూ.630 కోట్లకు పైగా రాష్ట్రప్రభుత్వం నుంచి అందాల్సి ఉండగా ఇప్పటి వరకు దశల వారీగా రూ.200 కోట్ల వరకే అందజేశారు. వీటితో పాటు, రైల్వేశాఖ నిధులతో కొన్ని లైన్ల విద్యుదీకరణ, డబ్లింగ్ వంటి పనులు పూర్తయ్యాయి. మిగతా పనుల్లో నిధుల కొరత తలెత్తింది. సకాలంలో ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు రాకపోవడం వల్ల పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రం నుంచి రైల్వేకు అందాల్సిన నిధులను రాబట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్కుమార్ యాదవ్ రెండు రోజుల క్రితం రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషిని కలిశారు. ఎంఎంటీఎస్ రెండో దశకు ఇవ్వాల్సిన సుమారు రూ.430 కోట్ల నిధులను అందజేయాల్సిందిగా కోరారు. అలాగే చర్లపల్లి టర్మినల్ కోసం భూమిని కేటాయించాలని, అప్రోచ్ రోడ్డు వేయించాలని కోరారు. నిధులొస్తేనే రైళ్లు.... ఇప్పటికిప్పుడు ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు సిద్ధంగా ఉన్న సికింద్రాబాద్–బొల్లారం మార్గంలో ప్రతి రోజు కనీసం 20 ట్రిప్పులు నడపాలన్నా ఒక ట్రిప్పుకు 3 బోగీల చొప్పున 15 అవసరమవుతాయి. అలాగే సికింద్రాబాద్ –ఘట్కేసర్, పటాన్చెరు–తెల్లాపూర్ మార్గంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ రెండు మార్గాల్లోనూ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు నడపాలంటే కొత్తబోగీలు అవసరమే. మొత్తంగా ఎంఎంటీఎస్ రెండో దశ మార్గాల్లో రైళ్లు నడిపేందుకు ఇంజన్లు, బోగీల కోసం కనీసం రూ.200 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. రాష్ట్రప్రభుత్వం తన వాటా నిధులు అందజేస్తే తప్ప కొత్త బోగీలు కొనే పరిస్థితి లేదని, రైల్వేశాఖ తన వంతు నిధులను ఇప్పటికే పూర్తిగా ఖర్చు చేసిందని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో రైల్వే ఉన్నతాధికారులు జరిపిన సంప్రదింపుల్లో ఎంఎంటీఎస్ రెండో దశతో పాటు చర్లపల్లి టర్మినల్పై చర్చించారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై పెరిగిన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని సుమారు రూ.80 కోట్లతో చర్లపల్లి టర్మినల్ విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఇక్కడ భూమి కొరత ఉంది. ఈ అంశంపైన అధికారులు చర్చలు జరిపారు. మరో టర్మినల్ కోసం సర్వే... చర్లపల్లితో పాటు రెండో టర్మినల్గా గతంలో వట్టినాగులపల్లిని ప్రతిపాదించారు. కానీ నగరానికి చాలా దూరంలో ఉన్న వట్టినాగులపల్లి కంటే సమీపంలో ఉండి ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా ఉండే మరో చోట రైల్వే టర్మినల్ కట్టించాలని దక్షిణమధ్య రైల్వే భావిస్తోంది. నాగులపల్లి నుంచి నగరానికి రావడానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావలసి ఉంటుంది. అలాగే రైళ్ల రాకపోకలకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. పైగా రోడ్డు రవాణా మార్గాలను విస్తృతంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. మరోవైపు ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రతిపాదించిన హైటెక్సిటీ వద్ద కానీ లేదా భూమి లభ్యతను బట్టి మరో చోట కానీ టర్మినల్ నిర్మిస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సంయుక్త సర్వే చేపట్టాలని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్కుమార్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. -
ఎఫ్బీలో చూసి ఆ పిచ్చిపని చేశా.. వైరల్
సాక్షి, శ్రీనగర్: రైలు వస్తుండగానే దాని ముందు నిల్చుని సెల్ఫీలు తీసుకోవాలన్న యత్నంలో ఇప్పటికే కొందరు వ్యక్తులు మృతిచెందారు. కొన్ని సందర్భాల్లో తీవ్ర గాయాలపాలవుతూ కాళ్లు, చేతులు కోల్పోతుంటారు. అయితే తాజాగా జమ్మూకశ్మీర్కు చెందిన మెడిసిన్ విద్యార్థి చేసిన డేరింగ్ ఫీట్పై తీవ్ర విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. రైలు పట్టాలపై పడుకుని రైలు వెళ్తుండగా స్నేహితుడితో ఈ తతంగాన్ని వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఆ యువకుడి చర్యలను పిచ్చి చేష్టలుగా మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఇలాంటివి చేయకూడదంటూ యువతను హెచ్చరించారు. పోలీసుల కథనం ప్రకారం.. కశ్మీర్లోని బిజ్బెహ్రా ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల అదిల్ అహ్మద్ మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయితే అదిల్ ఇటీవల ఫేస్బుక్లో ఓ ప్రమాదకర వీడియో చూశాడు. తాను కూడా అలాగే చేయాలని ప్లాన్ చేసుకున్న అదిల్ తన స్నేహితుడు మొహమ్మద్ ఖాసీం(19)తో కలిసి రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. తాను పట్టాలపై పడుకుంటానని, ఆ సమయంలో ట్రాక్పై రైలు వెళ్తుండగా వీడియో తీయాలని ఖాసీంకు సూచించాడు. రైలు వెళ్తుండగా పట్టాలపై అదిల్ ధైర్యంగా పడుకోవడం, రైలు వెళ్లిపోయాక తనకు ఏమీ కాలేదంటూ గంతులేయడాన్ని ఖాసీం వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దంటూ పోలీసులు యువతను హెచ్చరించారు. తాను తప్పు చేశానని ఒప్పుకున్న అదిల్.. మరోసారి తాను ఇలాంటి పనులు చేయనని, ఎవరూ ఇలాంటి ప్రమాదకర స్టంట్లకు ఉపక్రమించవద్దని సూచించాడు. -
పట్టాలపై గ్యాంగ్స్టర్ కొడుకు శవం
సాక్షి, ముంబై : ప్రముఖ గ్యాంగ్స్టర్లకు, మోస్ట్ వాంటెడ్ నేరస్థులకు ఆశ్రయం కల్పించిన ముఠాకు సంబంధించిన వ్యక్తి మరణం ముంబైలో ఒక్కసారిగా కలకలం రేపింది. బాగా పాపులర్ అయిన గోల్డెన్ గ్యాంగ్కు చెందిన 32 ఏళ్ల గితేశ్ ఖోపడే సెవర్రి రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై శవంగా కనిపించాడు. గోల్డెన్ గ్యాంగ్ నాయకుడు చంద్రకాంత్ ఖోపబే అలియాస్ బబ్య ఖోపడే కొడుకే గితేశ్ ఖోపడే. ఓవైపు మిల్ కాంపౌండ్ను నిర్వహిస్తూనే తండ్రి ముఠాకి సాయం చేస్తుండేవాడన్న ఆరోపణలు గితేశ్పై వినిపించేవి. హాజీ మస్తాన్, వరదరాజన్ ముదలియర్ లాంటి ఫేమస్ డాన్లకు గోల్డెన్ గ్యాంగ్ రక్షణ కల్పించేదని అప్పట్లో చెప్పుకునే వారు. అలాంటి గ్యాంగ్ ప్రధాన నేత తనయుడు సోమవారం ఉదయం పట్టాలపై శవమై తేలాడని స్థానిక పోలీసులు చెబుతున్నారు. అయితే తండ్రికి గితేశ్ ఎలాంటి సాయం చేశాడన్నదానిపై స్పష్టత లేదని పోలీసులు అంటున్నారు. గత కొంతకాలంగా అల్లర్లకు, గొడవలకు దూరంగా ఉంటున్న గితేశ్, లోవర్ పరేల్ ప్రాంతంలోని షాపుల మీద వచ్చే అద్దెతో జీవనాన్ని వెల్లదీస్తున్నాడు. గితేశ్ను ఎవరో హత్య చేసి పట్టాలపై పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
చెన్నైలో కోరవానిపల్లె యువకుడు మృతి
తొండూరు : మండలంలోని కోరవానిపల్లె గ్రామానికి చెందిన యువకుడు చెన్నైలో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కోరవానిపల్లె గ్రామానికి చెందిన కొప్పల పరుశురాముడు(19) అనే యువకుడు చెన్నైలోని ప్రయివేట్ కంపెనీలో డ్యూటీ ముగించుకొని తిరిగొస్తుండగా రైల్వే ట్రాక్ దాటే సమయంలో రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వెంటనే పరుశురాముడు స్నేహితులు, రైల్వే పోలీసులు అంబులెన్స్లో చెన్నై సెంట్రల్లోని రాజీవ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధులు పరుశురాముడు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా.. వారు చెన్నైకి వెళ్లి ప్రమాద స్థలాన్ని పరిశీలించి పరుశురాముడు మృతదేహాన్ని స్వగ్రామమైన కోరవానిపల్లెకు తీసుకొచ్చారు. ఉద్యోగం కోసం వెళ్లి మృత్యువాత.. : కొప్పల పరుశురాముడు మూడు నెలల క్రితం కడప డీఆర్డీఏ సంస్థలో శిక్షణ పొంది అనంతరం ఉద్యోగం నిమిత్తం డీఆర్డీవో అధికారుల ఆదేశాల మేరకు చెన్నైలోని ఓ ప్రయివేట్ కంపెనీలో 6 రోజులక్రితం చేరాడు. శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని సమీపంలోని అద్దె గదికి వెళ్లేందుకు. నలుగురు స్నేహితులతో కలిసి రైల్వే ట్రాక్ దాటుతుండగా మెట్రో రైలు ఢీకొనడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కోరవానిపల్లెలో విషాదం కొప్పల పరుశురాముడు రైల్వే ట్రాక్ దాటుతుండగా మృతి చెందాడన్న విషయం తెలియగానే కోరవానిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెండు నెలల క్రితం పులివెందుల మండలం ఆర్.తుమ్మలపల్లె వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని 150 గొర్రెలు, ముగ్గురు మృతి చెందిన సంఘటన జరగడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పట్లో రోడ్డుప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబీకులకు పరుశురాముడు సమీప బంధువు కావడంతో వారి కుటుంబాలలో తిరిగి విషాదం అలుముకుంది. -
రైలు పట్టాకు పగుళ్లు...సరి చేసిన సిబ్బంది
ప్రకాశం జిల్లా చినగంజాం వద్ద రైలు పట్టాకు పగుళ్లు వచ్చాయి. బుధవారం ఉదయం గమనించిన వెంటనే సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు పట్టాకు మరమ్మతులు చేశారు. దీంతో ఈ మార్గంలో రైలు రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలుగలేదు. -
ప్రమాదమని తెలిసినా...
సాక్షి, చెన్నై: రైల్వే ట్రాక్ల వెంబడి నడవరాదు అన్న తాటికాయంత అక్షరాలు రైల్వే స్టేషన్లలో, రైల్వేమార్గాల్లో బోర్డుల రూపంలో ఉన్నా, పదే పదే హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకునే వారు కరువు అవుతున్నారు. ట్రాక్ మార్గాలు ప్రమాదకరం అని తెలిసినా, ఆ బాటను అనుసరించే వాళ్లు అనుసరిస్తూనే ఉన్నారు. చివరకు రైలు ఢీకొని మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. వందలాది మంది విగతజీవులుగా మారుతుంటే, మరెందరో దివ్యాంగులుగా మారాల్సిన పరిస్థితి. రాజధాని నగరం చెన్నై, శివార్లలో రైలు ఢీకొని...మృత్యు ఒడిలోకి చేరే వారి సంఖ్య ఇటీవల కాలంగా పెరుగుతున్నది. రాజధాని నగరం చెన్నైలోని రవాణా మార్గాల్లో ఈఎంయూ, ఎంఆర్టీఎస్ రైల్వే సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చెన్నై బీచ్ నుంచి తాంబరం- చెంగల్పట్టు వైపుగా , బీచ్ - గుమ్మిడిపూండి, సెంట్రల్ నుంచి అరక్కోణం వైపుగా, గుమ్మిడిపూండి వైపుగా నిత్యం ఎలక్ట్రిక్(ఈఎంయూ) రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఇక బీచ్ నుంచి వేళచ్చేరి వరకు ఎంఆర్టీఎస్ సేవలు అందుతున్నాయి. ఎంఆర్టీసీ పయనం వంతెన మీదుగా, ఈఎంయూ రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఈఎంయూ రైళ్ల ట్రాక్లు వేరుగా, ఎక్స్ప్రెస్ రైళ్ల రాకపోకలకు వేరుగా ట్రాక్లు ఉన్నాయి. ఈ దృష్ట్యా, రైల్వే ట్రాక్లపై రైళ్ల ట్రాఫిక్ నిత్యం ఎక్కువే. అదే సమయంలో ఈ ట్రాక్ల వెంబడి విద్యుత్ సరఫరా సైతం అవుతున్నాయి. ఈ ట్రాక్ల వెంబడి నడవకూడదని, ఫుట్ఓవర్ బ్రిడ్జిలను ఉపయోగించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎదురయ్యే అనర్థాలను వివరిస్తూ రైల్వే స్టేషన్లలో అక్కడక్కడ బోర్డుల రూపంలో హెచ్చరికలు ఉన్నా, వాటిని ఖాతరు చేయని వారు ఎక్కువే. ఫుట్ఓవర్ బ్రిడ్జి ఎక్కేందుకు కష్ట పడాల్సి ఉంటుందని, చటుక్కున ట్రాక్లను దాటే ప్రయత్నం చేసి చివరకు ప్రమాదాల బారిన పడే వాళ్లు ఎక్కువే. ఇక, రైల్వేస్టేషన్లకు త్వరితగతిన చేరుకోవాలని ఆ మార్గాల్లోని వాళ్లు ట్రాక్ల వెంబడి పయనం సాగించి చివరకు మృత్యు ఒడిలోకి చేరడం చోటు చేసుకుంటున్నాయి. చెన్నైలో రైల్వే ట్రాక్ల వెంబడి నివాసాలు ఎక్కువే. నివాసాల మధ్య రైలు పయనం అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది. అలాగే, అనేక చోట్ల రైల్వేట్రాక్లకు కూత వేటు దూరంలోని స్థలాల్లో గుడిసె వాసుల సంఖ్య కూడా ఎక్కువే. వీరంతా రైల్వేట్రాక్లను బహిర్భూమిగా ఉపయోగిస్తున్నారని చెప్పవచ్చు. అలాగే, కొన్నిచోట్ల రైల్వే క్రాసింగ్లలో గేట్లు వేసి ఉన్నా, వాటిని దాటి దూసుకెళ్లే వాళ్లు మరీ ఎక్కువే. ఈ చర్యలు ప్రమాదకరం అని జనానికి తెలిసినా, ఆ బాటనే అనుసరించి చివరకు ప్రమాదం అంచున పడి మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. చెన్నైలో రైల్వే ట్రాక్ల వెంబడి సాగుతున్న ఈ మరణ ఘోష అటు రైల్వే పోలీసుల్ని ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. కొన్ని రైల్వేస్టేషన్లలో ఎక్స్ప్రెస్లు సైతం నిమిషాల పాటు ఆగుతుంటాయి. ఈ రైళ్ల కోసం పరుగులు తీసి ఏ ట్రాక్లో ఏ రైలు వస్తున్నదో గుర్తించ లేక చివరకు ప్రమాదాలకు గురి అవుతున్నారు. తాజాగా, నుంగంబాక్కంలో చోటుచేసుకున్న ఘటన సర్వత్రా ఆందోళనలో పడేసింది. ఈ కేసుల్లో మృతుల వివరాల గుర్తింపు పోలీసులకు ఓ సవాలుగానే మారుతోంది. 24 కిమీ దూరంలో మరీ ఎక్కువే: నిత్యం రైలు ఢీ పలాన చోట ఒకరు మృతి, ఇద్దరు మృతి అన్న వార్తంటూ లేని రోజు పత్రికల్లో ఉండదని చెప్పవచ్చు. ఏడాదికి వందలాది మంది విగతజీవులుగా మారుతుంటే, ప్రధానంగా 24 కిమీ దూరంలో ప్రమాదాలు మరీ ఎక్కువే. ఇందుకు ఇటీవల కాలంగా చోటు చేసుకున్న ప్రమాదాలు స్పష్టం చేస్తున్నాయి. వ్యాసార్పాడి -జీవా- ఆవడి మార్గం అత్యధికంగా ప్రమాదాలు చోటు చేసుకున్న రైల్వే మార్గంగా తేలింది. ఈ మార్గం వెంబడి గుడిసె వాసులు ఎక్కువే. వీరంతా బహిర్భూమిగా రైల్వే ట్రాక్లను ఉపయోగిస్తూ ప్రమాదం అంచున పడుతున్నారు. అలాగే, వీరికి రోడ్డు మార్గాల కన్నా, రైల్వే ట్రాక్ల మీదుగా పయనాన్ని ఎంచుకుని మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. ఈ మార్గంలో 2014లో 216 మంది, 2015లో 204 మంది రైలు ఢీకొని మృత్యు ఒడిలోకి చేరారు. ఈ ఏడాది రెండు నెలల్లో 99 మంది మరణించారంటే ఏ మేరకు ప్రజలు హెచ్చరికల్ని బేఖాతరు చేస్తున్నారో అర్థం అవుతోంది. ఈ విషయంగా ఓ రైల్వే అధికారి పేర్కొంటూ వ్యాసార్పాడి -జీవా- ఆవడి- హిందూ కళాశాల మార్గంలో అయితే, గుడిసె వాసులు రైలు వస్తున్నా చూసి చూడ నట్టుగా ట్రాక్లను దాటడం సాగుతున్నదని పేర్కొన్నారు. రైల్వే ట్రాక్ మార్గాలను బహిర్భూమిగా వాడడం వలన, ఆ సమయంలో రైలు రావడం, ప్రమాదాలు చోటు చేసుకోవడం పరిపాటిగా మారి ఉన్నదన్నారు. అత్యధికంగా ఈ మార్గంలో ఎక్స్ప్రెస్ల కింద పడి మరణించిన వారే ఉన్నారని, ఇక్కడి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని, మరుగు దొడ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
మహానగరంలో మహావర్షం!
ముంబై ఒకప్పుడు షాంఘై, హాంకాంగ్ లేదా సింగపూర్గా మారాలని కలలు కనేది. కానీ నగర నిర్వహణను సమర్థంగా చేపట్టాలని ఎవరూ భావించనందున, అది ముంబైలాగే ఉండిపోవాలనుకున్నట్లుంది. స్విట్జర్లాండ్లో రైలు గమ్యస్థానం చేరుకుని ప్లాట్ఫాంపై ఆగివున్నట్లు నిర్ధారించుకోకుండానే, ప్రయాణికులు తమ గడి యారంకేసి చూసు కుంటూ రైల్లోంచి దిగే వారని చెబుతుంటారు. స్విస్ రైల్వేకి అంత సామర్థ్యం ఉండేది కాబట్టే రైలు రాకపోకలపై అంత స్పష్టమైన అంచనా ఉండేది. ఏదేమైనా, ఒక దేశ విశిష్ట లక్షణం గురించి మంచిగా లేదా చెడుగా ఈ స్థాయిలో వర్ణించడంవల్ల ఆ వర్ణనలో ఎంతో కొంత అతిశయోక్తి ఉండే ఉంటుంది. ముంబై నగరంలో వర్షం కురుస్తోందని తెలు సుకోవడానికి మీరు వర్షంలో తడవవలసిన అవసరం లేనే లేదు. నగరం స్థితి, ప్రత్యేకించి అస్తవ్యస్తంగా మారిన నగర జీవితం మీకు ఆ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. రహదారులు పొంగి పొరలుతాయి. రైలు పట్టాలు కాస్త మెరుగ్గా ఉంటాయి. పైగా, ప్రతి ఏటా తన రాకకు గుర్తుగా వర్షం నగరాన్ని గుంతలమయం చేస్తుంది. కొద్ది రోజుల్లోనే అవి పెద్ద పెద్ద నీటి బిలాలుగా మార తాయి. అయితే ఇది మాత్రం అతిశయోక్తి కాదు. భూమ్మీది నుంచి చంద్రుడిపైకి వెళ్లి ఆ గ్రహంపై నడిచిన తొలి మానవుడిగా చరిత్రకెక్కిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఆయన తర్వాత అక్కడికి వెళ్లిన ఇతర రోదసీ యాత్రికులు అక్కడ తమకు తార సపడిన బిలాల కారణంగా చంద్రుడిని తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు. అయితే ముంబైలోని బిలాలు చంద్రుడిమీదలాగా శాశ్వతంగా ఉండకపో యినా, స్విస్ రైలులాగా ప్రతి వర్షరుతువులోనూ క్రమం తప్పకుండా నగరంలో కనిపిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితులకు అలవాటుపడక తప్ప దని ముంబై వాసులు ఇప్పటికే ఒక అభిప్రాయా నికి వచ్చేసినప్పటికీ, ముంబై ఏదో ఒక నాటికి భారతీయ వెనిస్ నగరంగా మారుతుందని వారు తరచుగా జోకులేసుకుంటున్నప్పటికీ, దీంట్లో గర్వ పడాల్సిందేమీ లేదు. నగరంలో కార్లకు బదులుగా పడవలు ఉండవచ్చు. నీటి గుంతలకు బదులుగా ప్రతిచోటా నీరే ఉండవచ్చు. నగర వాసుల ఆరా టాన్ని శాంతపర్చేందుకు వర్షాకాలంలో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. దైనందిన వ్యవహారాలను సంక్లిష్టం చేస్తున్న నగరం తక్షణ స్వభావం ఇదే మరి. ఏడు దీవులను వేరు చేస్తున్న చిత్తడి నేలలనుంచే నగరంలో చాలా భాగం నివాస యోగ్యంగా మారింది. ముంబై నగరంలో చాలా భాగం సముద్ర మట్టానికి కేవలం అయిదు మీటర్ల ఎత్తులో మాత్రమే ఉంటుంది. నగ రానికి జీవధాతువుగా నిలిచిన రైలు పట్టాలు కాస్త ఎత్తులో ఉంటున్నాయి. వర్షం, సముద్రం పోటు రెండూ కాకతాళీయంగా ఒకేసారి వస్తే, యథా విధిగా నగర జీవితం విచ్ఛిన్నమవుతుంది. వర్షపు నీరు అలా సముద్రంలోకి సజావుగా వెళ్లిపోలేదు. ప్రతి వర్షరుతువూ తక్కువ ప్రదేశంలో అతి వృష్టికి దారితీయదు. అతివృష్టి అంటే ఏమిటి? ముంబై నగరంపై కొన్ని కిలోమీటర్ల పొడవునా వర్ష మేఘం నిలువునా ఏర్పడి ఏకధాటిగా వర్షం కురు స్తుంది. దాని వెంటనే వరద పోటెత్తుతుంది. 2005 జూైలై 25న ఇలాగే జరిగింది. మురికికాలువ ఎలా ఉండాలని తాను భావిస్తోందో అస్సలు బోధపడని నగరం ముంబై. నగరంలోని కాలువలను ఆక్రమ ణలు అడ్డుకోవటంతో వాటి వైశాల్యం కుదించుకు పోయింది. నిజానికి అది ఒకప్పుడు మిథీ నది. ఒక నది కాలువగా మారిపోవడమే విచిత్రం మరి. ఇంకా ఆశ్చర్యపడాల్సిన విషయమేమిటంటే, ఈ కాలువలు పూర్తిగా పూడిపోయాయి అన్నట్లుగా నగరవాసులు నానా చెత్తనూ వాటిలోకి విసిరేస్తుం టారు లేదా నగర మురికివాడల నుంచి రైలు పట్టాల పొడవునా చెత్త పోగేస్తుంటారు. ఈ మురికి వాడలకు, పట్టాలకు మధ్యన ఉన్న గోడలు మాత్రమే వీటిని వేరుచేస్తుంటాయి. రైల్వే శాఖ పథకం ప్రకటించి డబ్బు ఖర్చు పెడుతుంది. కానీ వర్షం రాకముందే, పట్టాలపై పూర్తిగా చెత్త పేరుకుపోతుంది. దీంతో నీరు పారే మార్గాలు మూసుకుపోతాయి. ఈ సంక్షోభానికి వివేకరహితంగా తమవంతు దోహదం చేసే నగర పౌరులు కూడా ‘మన నగరం ఎలా నడుస్తుందో చూడండి’ అంటూ శోకన్నాలు తీస్తుంటారు. ఇలాంటి వాతావరణంలో కార్లను వినియో గించేవారినే నీటి గుంతలు ఇబ్బందిపెడుతుం టాయి. ఇతర ప్రజానీకం లేదా సగటు పౌరులకు రైలు సర్వీసులు సజావుగా కొనసాగితే చాలు పనికి వెళ్లి తిరిగి వచ్చే వెసులుబాటు ఉంటుంది. ఈ నీటి గుంతలు కాంట్రాక్టర్ల నాసి రకం పనులను తేట తెల్లం చేస్తాయి. గత మూడేళ్లుగా వారికి అప్ప గించిన పనులకేసి చూస్తే వీరు మోసానికి పాల్ప డుతూనే ఉన్నారని స్పష్టమవుతుంది. కాంట్రాక్టర్ల విశ్వాసఘాతుకం పట్ల నిఘా పెట్టని నగర పాలనా యంత్రాంగం నిర్వాకం వల్ల వీరి హవా నడుస్తూనే ఉంటుంది. ఈ జూదంలో కాంట్రాక్టర్లు మాత్రమే కాదు.. నగర బాధ్యతలు చూస్తున్న రాజకీయ నేతలు, అధికారులు కూడా డబ్బు చేసుకుంటూనే ఉంటారు. ముంబై ఒకప్పుడు షాంఘై, హాంకాంగ్ లేదా సింగపూర్గా మారాలని కలలు కనేది. కానీ నగర నిర్వహణకు సంబంధించిన భారీ కృషిని సమ ర్థంగా చేపట్టాలని అది కోరుకోనందున, అది ముంబైలాగే ఉండిపోవాలని నిర్ణయించుకున్న ట్లుంది. ఇదేమంత చెడ్డ విషయం కూడా కాదు. ఎందుకంటే ఇతర మహా నగరాలతో ముంబై తన్ను తాను పోల్చి చూసుకున్నట్లయితే, కారణం లేకుండా తమకు ప్రతిరూపంగా పోల్చుకుంటు న్నందుకు ఆ మహానగరాలు ముంబైపై దావా వేసినా వేయవచ్చు. కాబట్టి ప్రతి వర్షరుతువు లోనూ ఒకే తీరుతో ఉంటున్న ముంబైని నగర వాసులు ప్రేమించాలా? లేక ఈ మహా నగరానికి ఆ దుస్థితి కలిగిస్తున్నందుకు రుతువపనాలను ద్వేషించాలా? ఇప్పుడు ఈ విషయాన్ని ఎవరు పట్టించుకుంటారు? వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు - మహేష్ విజాపుర్కార్ ఈమెయిల్: mvijapurkar@gmail.com -
రైలు ‘మాట’ తప్పింది
- కాపలా లేని లెవల్ క్రాసింగ్స్ ఎత్తివేత గడువు తూచ్ - 2017 కల్లా వాటిని తొలగిస్తామంటూ గతంలో హామీ - తాజాగా దాన్ని 2019కు పెంచుతున్నట్టు - ద.మ. రైల్వేకు సమాచారం - ‘మాసాయిపేట’ ఘోర దుర్ఘటన జరిగినప్పుడు హడావుడి - స్వయంగా పార్లమెంటులో స్పందించిన ప్రధాని - ఇప్పుడు చల్లబడ్డాక చేతులెత్తేసిన తీరు సాక్షి, హైదరాబాద్: 2014 జూలై 24.. మెదక్ జిల్లా మాసాయిపేట శివారులో కాపలాదారు లేని లెవల్ క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతున్న పాఠశాల బస్సును నాందెడ్ ఎక్స్ప్రెస్ ఢీకొనటంతో 20 మంది మృతి.. కొద్దిరోజులకే బీహార్లో వేగంగా వస్తున్న రైలు పట్టాలు దాటుతున్న ఆటోరిక్షాను ఢీకొనటంతో 18 మంది దుర్మరణం... వెంటవెంటనే జరిగిన ఈ రెండు ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపాయి. కేంద్రప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తటంతో స్వయంగా ప్రధానమంత్రి పార్లమెంటులో ప్రకటన చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత రైల్వే శాఖ అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహించి కాపలా లేని లెవల్ క్రాసింగ్స్ అన్నింటినీ 2017 నాటికి తొలగించనున్నట్టు ప్రకటించింది. కానీ... 2017 నాటికి వాటి తొలగింపు సాధ్యం కాదని తాజాగా చేతులెత్తేసింది. మరో రెండేళ్ల గడువు పెంచుకుని 2019 నాటికి వాటిని తొలగించనున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీ ఎం రవీంద్రగుప్తాకు సమాచారం అందించింది. దీంతో ఆయన హడావుడిగా అధికారులతో సమీక్ష ఏర్పాటు చేసి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. నిధులు పుష్కలం.. పనుల్లో జాప్యం..: దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే ఎక్కువ ఆదాయం పొందుతున్న రైల్వే జోన్లలో మూడో స్థానంలో ఉంది. ఏటా దాదాపు రూ. 18 వేల కోట్ల ఆదాయం వస్తోంది. కానీ.. కాపలా లేని గేట్ల తొలగింపునకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జోన్కు నిధులను ఇవ్వడం లేదు. వాస్తవానికి దక్షిణ మధ్య రైల్వే కొత్త జీఎం రవీంద్రగుప్తా వాటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కానీ ఆయనకు రైల్వే బోర్డు నుంచి సరైన సహకారం అందకపోవటంతో సమస్య పరిష్కారం కావటం లేదు. ‘అనిల్ కకోడ్కర్’ నివేదిక ఏమైంది?: రైల్వేలలో భద్రతా వ్యవస్థను పటిష్టం చేసేందుకు 2011 సెప్టెంబర్లో కేంద్రం అనిల్ కకోడ్కర్ కమిటీని నియమించింది. ఈ కమిటీ 2012లో నివేదికను అందజేసింది. దేశవ్యాప్తంగా 32వేల రైల్వే లెవల్ క్రాసింగ్లు ఉంటే వాటిలో 11వేల కాపలాలేని గేట్లు ఉన్నట్లు ఈ కమిటీ గుర్తించింది. 5 ఏళ్ల వ్యవధిలో వీటిని తొలగించాలని సూచించింది. ఇందుకో సం రూ. 50 వేల కోట్లు ఖర్చు అవుతాయని.. ఖర్చు మొత్తా న్ని ఏడేళ్లలో రాబట్టుకోవచ్చునని ఈ కమిటీ పేర్కొంది. గేట్లు ఏర్పాటు చేయడం, వాటి నిర్వహణ కోసం సిబ్బందిని నియమించడం వంటి ఖర్చులు మిగులుతాయని, సరుకు రవాణా, ప్రయాణికుల రవా ణా రైళ్ల స్పీడ్ పెరుగుతుందని పేర్కొంది. తద్వారా రైల్వేల ఆదాయం కూడా పెరుగుతుందని కమిటీ వివరించింది. కానీ ఈ నివేదిక అమలులో పెద్దగా పురోగతి లేదు. ఇదీ పరిస్థితి.. దక్షిణమధ్య రైల్వే పరిధిలో కాపలాదారున్న లెవల్ క్రాసింగ్స్ : 1,454 కాపలాదారులు లేని లెవల్ క్రాసింగ్స్: 453 వీటిలో పరిష్కారం చూపే పరిస్థితి/ అవసరం లేదన్న ప్రాంతాలు: 68 అండర్పాసులు/ఆర్వోబీ/ఆర్యూబీలను నిర్మించే ప్రాంతాలు: 133 గేట్లను ఏర్పాటు చేసి కాపలాదారులను నియమించే ప్రాంతాలు: 202 క్రాసింగ్స్ను మూసేసి రోడ్లను వేరే ప్రాంతం మీదుగా మళ్లించేవి: 43 క్రాసింగ్స్ వద్ద వాహన ట్రాఫిక్ లేనందున మూసేసే రోడ్లు: 7 -
మరణించినా.. హీరోగా మారాడు!
ఒకవైపు మృత్యువు దూసుకొస్తోంది. ఆ విషయం విమానంలో ఉన్నవాళ్లెవరికీ తెలియదు.. పైలట్కు మాత్రం తెలుసు. అయినా ఎలాగోలా ఇతరుల ప్రాణాలు కాపాడాలని చివరి క్షణం వరకు ప్రయత్నించాడు. దగ్గర్లోనే ఆయిల్ ట్యాంకర్, రైల్వే ట్రాక్ ఉన్నా.. విమానం వాటి మీదకు పడకుండా దూరంగా చెట్ల మీద పడేలా చూశాడు. బీఎస్ఎఫ్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఆ పైలట్.. హీరోగా నిలిచాడు. సూపర్ కింగ్ బి200 విమాన ప్రమాదంలో 10 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది మరణించిన ఘటనలో పైలట్.. నష్టాన్ని తగ్గించేందుకు తీవ్రంగా కృషిచేశాడు. టేకాఫ్ తర్వాత కొన్ని సెకన్లకే విమానంలో ఒక ఇంజన్ ఫెయిల్ అవ్వడాన్ని గుర్తించిన అతడు.. విమానాశ్రయం సరిహద్దు గోడ దగ్గర ఉన్న చెట్టుపై పడేలా చేసి భారీ నష్టాన్ని తగ్గించాడు. ఉదయం బయలుదేరిన క్షణంలోనే పైలట్ కెప్టెన్ భగవతి ప్రసాద్ ఇంజన్లో సమస్య ఉందని గ్రహించాడు. ఇంతలోనే కూలిపోతున్న పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించి భారీ నష్టాన్ని నియంత్రించగలిగాడు. కానీ కేవలం 60 సెకన్లలోనే పైలట్ ప్రసాద్, కో పైలట్ రాజ్ దేశ్ సహా పదిమంది బీఎస్ఎఫ్ సిబ్బంది జీవితాలు ఆహుతైపోయాయి. ప్రమాదం జరుగుతోందని తెలిసినా సిబ్బందిని రక్షించే సమయం లేకపోయింది. ఇంజన్లో సాంకేతిక లోపం రావడంతో నేలపై పడబోయిన విమానాన్ని 180 డిగ్రీల్లో యు టర్న్ తీసుకొన్నాడు. భారీనష్టం వాటిల్లకుండా చూసేందుకు పైలట్ తీవ్రంగా ప్రయత్నించి, విమానాన్ని బలవంతంగా చెట్టుకు గుద్దించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. విమానంలో సాంకేతిక లోపం వచ్చిందని గమనించగానే పైలట్ ఏటీసీ అనుమతితో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించాడని కొందరు అధికారులు, ఇతర ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే ఢిల్లీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొనసాగుతున్న గుజ్జర్ల ఆందోళన
న్యూఢిల్లీ: గుజ్జర్లు తమ డిమాండ్ నెరవేర్చేదాకా ఆందోళన వీడేది లేదంటూ కదం తొక్కుతున్నారు. గత వారం రోజులుగా పలు రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గురువారం రాజస్థాన్ లోని మూడు జిల్లాల్లో తమ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పలు చోట్ల రైల్వే ట్రాక్లపై ఆందోళన చేపట్టి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు. ఢిల్లీ - ముంబై దారిని గురువారం స్థంబింపజేశారు. వందల కొద్ది పట్టాలపైకి చేరి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనంటూ గుజ్జర్లు ఆందోళన ప్రారంభించిన విషయం తెలిసిందే. గుజ్జర్ల ఆందోళన ప్రాంతాలకు 4500 మంది పారా మిలిటరీ బలగాలను పంపేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. -
రైలు పట్టాల వద్ద బీజేపీ నేత మృతదేహం
హూగ్లీ: పశ్చిమ బెంగాల్లో ఓ బీజేపీ నేత అనుమానాస్పదంగా మృతిచెందాడు. అతడి మృతదేహం హుగ్లీ జిల్లాలోని ఓ రైలు పట్టాల సమీపంలో పడి ఉంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అతడు ప్రచారం చేయడం వల్ల ఆ పార్టీ నేతలే కిడ్నాప్ చేసి తీసుకెళ్లి హత్య చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. హుగ్లీ జిల్లాలో కనైపూర్ గ్రామ పంచాయతీకి చెందిన బీజేపీ నేత నందగోపాల్ ఠాకూర్(53) కొన్ని గంటలపాటు కనిపించకుండా పోయాడు. అయితే, అతడు షిరాపులి, దిరా రైల్వే స్టేషన్ల మధ్య విగత జీవిగాపడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శరీరంపై బలమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై బీజేపీ నేత ఒకరు స్పందిస్తూ గత ఏప్రిల్ 25న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఠాకూర్ ప్రచారం చేశాడని, అందుకే కక్ష కట్టి ఆ పార్టీ నేతలే హత్య చేసి ఉంటారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. అవన్నీ ఆధారం లేని మాటలని తోసిపుచ్చింది. -
రైల్వేట్రాక్ల పక్కనే.. ఇళ్ళు..!
-
ప్రమాదమని తెలిసినా..
కుర్యాతండా(మిర్యాలగూడ రూరల్) : మిర్యాలగూడ మండలం వాటర్ట్యాంకు తండా గ్రామ పరిధిలోని కుర్యాతండాలో 120 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. మిర్యాలగూడకు 10 కిలో మీటర్ల దూరంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ అవతలివైపున ఉంది తండా. ఈ తండా వాసులు మిర్యాలగూడకు రావాలంటే ముందుగా కాపలా లేని రైల్వే క్రాసింగ్ దాటి, సాగర్ ఎడమకాల్వపై ఉన్న రైల్వే వంతెన మీదుగా ప్రయా ణం సాగించాల్సి వస్తోంది. కాగా తండాకు మరో డొంకదారి ఉంది. కానీ ఈ మార్గం గుండా వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి రావడంతో తండావాసులంతా రైల్వే వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. తండాలో 50మంది విద్యార్థులు నిత్యం మిర్యాలగూడ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలకు వచ్చి వెళ్తున్నారు. వీరంతా సాగర్ కాల్వపై ఉన్న రైల్వే వంతెన మీదుగా వచ్చి ఆటోలలో పట్టణానికి చేరుకుంటున్నారు. నడిచి వెళ్లేటప్పుడు ట్రాక్పైకి రైలు వచ్చినా, పట్టుతప్పినా కాల్వలో పడిపోయే ప్రమాదం ఉండడంతో ఉదయం, సాయంత్రం పిల్లలను వంతెన దాటించడం తల్లిదండ్రులకు దినచర్యగా మారింది. ఎడమకాల్వపై బ్రిడ్జి నిర్మాణం అయ్యేనా... ప్రయాణ కష్టాలు తీర్చాలని తండా వాసులు పలుమార్లు ప్రజాప్రతినిధులకు విన్నవించారు. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ఆధునికీకరణలో భాగంగా కుర్యాతండాకు వెళ్లేందుకు వీలుగా ఎడమ కాల్వపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.65 లక్షలు మంజూరయ్యాయని, త్వరలో నిర్మాణం చేపడతామని ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రకటించారు. కానీ నేటి వరకు పనులు ప్రారంభం కాలేదు. అధికారులు వెంటనే స్పందించి బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని తండావాసులు కోరుతున్నారు. -
నేటి నుంచి పూర్తి స్ధాయిలో రైళ్లు
-
ప్రమాదమని తెలిసినా..!
సీతాఫల్మండి: తొందరగా గమ్యం చేరాలనే తపనతో ప్రాణాలను కూడా లెక్కచేయడంలేదు కొంతమంది ప్రయాణికులు. సెల్ ఫోన్ మాట్లాడుతూ..ఇయర్ ఫోన్లో పాటలు వింటూ ...రైలు పట్టాలను దాటడం వీరికి ఫ్యాషనైంది. ఆనక తమ నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకోక తప్పడంలేదు. పట్టాలు దాటుతూ మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోవడం చూస్తునే ఉన్నాం. తరచుగా ఇలాంటి వి జరుగుతున్నా ప్రజల్లో మార్పు రావడంలేదు. దీనికి తోడు రైల్వే పోలీసుల నిర్లక్ష్యం. ఫుట్ బోర్డు బ్రిడ్జిలను ఉపయోగించుకోవాలనే విషయాన్ని ప్రయాణికులకు అవగాహన కలిగించలేకపోతున్నారు. దీంతో పట్టాలు దాటేవారి ప్రాణాలు గాలిలో క లిసి పోతున్నాయి. రైల్వే అధికారులు వివిధ రైల్వే స్టేషన్లలో ఫుట్బోర్డు బ్రిడ్జిలను నిర్మించినప్పటి కీ వాటి ఉపయోగం అంతంతా మాత్రంగానే ఉంది. తక్కువ సమయంలో పట్టాలు దాటి అవతలికి వెళ్లిపోవచ్చనే ఆతృతతో ప్రమాదాలను సైతం లెక్క చేయడంలేదు. దీనికి తోడు పట్టాలు దాటుతున్న సమయంలో సెల్ఫోన్లో మాట్లాడడం తో వెనుక నుంచి వచ్చే రైలును గమనించక పోవడం తో క్షణకాలంలో ప్రాణాలు కోల్పోతున్నాయి. ము ఖ్యంగా జామైఉస్మానియా, సీతాఫల్మండి, ఆర్ట్స్ కా లేజ్ రైల్వే స్టేషన్లలో నిత్యం జరుగుతున్న తంతు ఇది. ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి రైలు పట్టాల వెంబడి స్థానికులు నివాసం ఉంటుండటం కూడా ఈ ప్రమాదాలకు కార ణంగా మారుతున్నాయి. రైల్వే స్టేషన్ల సమీపంలో నివాసం ఉంటున్న వారు రైల్వే పట్టాలపై రాకుండా ఫెన్సింగ్ వేస్తే ప్రమాదాలు చాలా వరకు నివారించవచ్చని ప్రజలు అంటున్నారు. గతంలో ఈ రైల్వే స్టేషన్లలో పట్టాలు దాటుతున్న మృతి చెందిన వారు అనేకమంది ఉన్నారు. ఇప్పటికైనా రైల్వే పోలీసులు ఫుట్ బోర్డు బ్రిడ్జిలను ఉపయోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. -
నేడు పలు మార్గాల్లో మెగాబ్లాక్
కొన్ని రైళ్ల రద్దు: మరికొన్నింటి దారి మళ్లింపు ముంబై, సెంట్రల్, న్యూస్లైన్: సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గాల్లో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో రైల్వే ట్రాక్లు, ఓవర్ హెడ్ వైర్ల మరమ్మతు పనులు చేపడతారు. తత్ఫలితంగా కొన్ని లోకల్ రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని ఇతర మార్గాల మీదుగా మళ్లించనున్నారు. అలాగే కొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ విషయాన్ని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలోు రైల్వే ప్రజాసంబంధాల అధికారులు తెలియజేశారు. సెంట్రల్మార్గంలో... ములుండ్-మాటుంగా స్టేషన్ల మధ్య అప్ స్లో లైన్లో మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఠాణే తర్వాత రైళ్లను మాటుంగా వరకు ఫాస్ట్ ట్రాక్పైకిమళ్లిస్తారు. ఈ కారణంగా ఇరు స్టేషన్ల మధ్య ములుండ్, భాండుప్, విక్రోలి, ఘాట్కోపర్, కుర్లా, సైన్ స్టేషన్లలో మాత్రమే రైళ్లు ఆగుతాయి. మాటుంగా తర్వాత మళ్లీ స్లో లైన్లో నడుపుతారు. అదేవిధంగా డౌన్ ఫాస్ట్ లైన్లో రైళ్లు ఘాట్కోపర్, విక్రోలి, భాండుప్, ములుండ్ స్టేషన్లలో కూడా ఆపుతారు. అప్ స్లో మార్గంలో నాహుర్, కాంజుర్మార్గ్, విద్యావిహార్ స్టేషన్లలో రైళ్లు ఆగనున్నాయి. ఈ మార్గంలో రైళ్లన్నీ 15 నిమిషాలమేర ఆలస్యంగా నడుస్తాయి. హార్బర్మార్గంలో... హార్బర్ మార్గంలో పన్వెల్-నెరూల్ స్టేషన్ల మధ్య లోకల్ రైలు సేవలను రద్దు చేయనున్నారు. అదేవిధంగా ట్రాన్స్హార్బర్ మార్గంలో పన్వెల్-నెరూల్ స్టేషన్ల మధ్య కూడా రద్దు చేయనున్నారు. పన్వెల్-అంధేరీల మధ్య సేవలు ఉండవు. అయితే ప్రయాణికులు అసౌకర్యానికి గురి కాకుండా ఉండకూడదనే ఉద్దేశంతో సీఎస్టీ-నెరూల్, ఠాణే-నెరూల్ సెక్షన్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతారు. -
పలు మార్గాల్లో నేడు మెగాబ్లాక్
ముంబై సెంట్రల్, న్యూస్లైన్: సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గాలపై ఆదివారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో రైల్వే ట్రాక్లు, ఓవర్ హెడ్ వైర్ల మరమ్మతు పనులు చేపడతారు. తత్ఫలితంగా కొన్ని లోకల్ రైళ్ల సేవలను రద్దు చేయగా, మరికొన్నింటిని ఇతర మార్గాల మీదుగా మళ్లిస్తారు. అలాగే కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా నడపనున్నారు. ఈ విషయాన్ని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో సెంట్రల్, హార్బర్ రైల్వే ప్రజాసంబంధాల అధికారులు వెల్లడించారు. సెంట్రల్మార్గంలో... ములుండ్-మాటుంగా స్టేషన్ల మధ్య అప్ స్లో లైన్లో మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. దీంతో ఠాణే తర్వాత రైళ్లను మాటుంగా వరకు ఫాస్ట్ ట్రాక్పై మళ్లిస్తారు. ఈ కారణంగా ఈ మార్గంలో ములుండ్, భాండుప్, విక్రోలి, ఘాట్కోపర్, కుర్లా, సైన్ స్టేషన్లలో మాత్రమే రైళ్లు ఆగుతాయి. మాటుంగా తర్వాత మళ్లి స్లో లైన్లో నడుపుతారు. అదేవిధంగా డౌన్ ఫాస్ట్ లైన్లో రైళ్లు ఘాట్కోపర్, విక్రోలి, భాండుప్, ములుండ్ స్టేషన్లలో నిలుపుతారు. అప్ స్లో లైన్లో నాహుర్, కాంజుర్మార్గ్, విద్యావిహార్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లన్నీ 15 నిమిషాలమేర ఆలస్యంగా నడుస్తాయి. హార్బర్మార్గంలో... హార్బర్ మార్గంలో పన్వెల్-నెరూల్ స్టేషన్ల మధ్య లోకల్ రైలు సేవలను రద్దు చేయనున్నారు. అదేవిధంగా ట్రాన్స్హార్బర్ లైన్లో పన్వెల్-నెరూల్ స్టేషన్ల మధ్య కూడా రద్దు చేయనున్నారు. పన్వెల్-అంధేరీ మధ్య సేవలు ఉండవు. అయితే ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకూడదనే ఉద్దేశంతో సీఎస్టీ-నెరూల్, ఠాణే-నెరూల్ సెక్షన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతారు. -
దెబ్బతిన్న రైల్వే ట్రాక్లు పునరుద్దరణ
విశాఖ : పై-లిన్ తుపాను కారణంగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్ల పునరుద్దరణ పనులను రైల్వే అధికారులు సోమవారం ప్రారంభించారు. విశాఖ నుంచి భువనేశ్వర్, కోల్కతా రైలు మార్గంలో మరమ్మతులు చేపట్టారు. అలాగే ఈ మార్గంలో పరిమిత వేగంతో రైళ్లు నడపాలని నిర్ణయించారు. కాగా పై-లీన్ తుపాను ప్రభావం తగ్గడంతో కొన్ని రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే నిన్న ప్రకటించింది. పలు స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడిపినట్లు తెలిపింది. హౌరా- పూరి మధ్య రైలు సర్వీసులను పునరుద్ధరించినట్లు పేర్కొంది. భువనేశ్వర్-రూర్కెలా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, పూరి- సంబల్పూర్ ఎక్స్ప్రెస్, భువనేశ్వర్-న్యూఢిల్లీల మధ్య సంపర్క్క్రాంతి, రాజధాని ఎక్స్ప్రెస్లు నిన్న సాయంత్రం షెడ్యూల్ సమయం కన్నా ఆలస్యంగా భువనేశ్వర్ నుంచి బయల్దేరాయి. పూరి నుంచి బయల్దేరనున్న కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను షెడ్యూల్ ప్రకారమే నడిపిస్తున్నామని, మరికొన్ని ఆలస్యంగా బయల్దేరుతాయని పేర్కొంది. -
రైల్వే ట్రాకులను పరిశీలిస్తున్న అధికారులు