Reached
-
ఆరేళ్ల బుడతడు.. వెయ్యి కిలోమీటర్లు పరిగెడుతూ అయోధ్యకు..
భక్తిలో గొప్ప శక్తి ఉందని పెద్దలు అంటారు. దీనికి పలు ఉదాహరణలు కూడా చెబుతారు. అటువంటి భక్తిని మదిలో నిలబెట్టుకున్నవారు అద్భుతాలు చేస్తుంటారు. ఈ కోవలోకే వస్తాడు ఆరేళ్ల బుడతడు మొహబ్బత్. ఈ చిన్నారికి రామ్లల్లాను చూడాలని అనిపించింది. అంతే తాను ఉంటున్న పంజాబ్ నుంచి అయోధ్యకు పరుగున ప్రయాణమయ్యాడు.నెల రోజులకుపైగా సమయంపంజాబ్ నుంచి యూపీలోని అయోధ్య(Ayodhya)కు వెయ్యి కిలోమీటర్ల దూరం ఉంది. ఇంతదూరం ప్రయాణించేందుకు మొహబ్బత్ ఎటువంటి బస్సు,రైలును ఉపయోగించలేదు. పరిగెడుతూనే గమ్యాన్ని చేరుకున్నాడు. ఇందుకోసం మొహబ్బత్కు నెల రోజులకుపైగా సమయం పట్టింది. ఎలాగైతేనేం చివరకు జనవరి 7 నాటికి అయోధ్య చేరుకుని, సరికొత్త రికార్డు సృష్టించాడు. ఫజిల్కా నుంచి ప్రయాణంపంజాబ్లోని ఫజిల్కా నుంచి మొహబ్బత్(mohabat) తన పరుగును ప్రారంభించాడు. తొలుత ఓ సైనికాధికారి ఆ చిన్నారి ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీని తరువాత మొహబ్బత్ ఒక నెలా ఇరవై మూడు రోజులు పరిగడుతూ అయోధ్యకు చేరుకున్నాడు. ఈ ప్రయాణంలో మొహబ్బత్ తల్లిదండ్రులు కూడా అతని వెంట ఉన్నారు. వారు ఈ ప్రయాణ సమయంలో అయోధ్య ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్తో టచ్లో ఉన్నారు. మొహబ్బత్ను పరుగును చూసి దారిలోని పలు గ్రామాల ప్రజలు ఆశ్చర్యపోయారు. అలాగే ఆ చిన్నారికి స్వాగతం పలుకుతూ, ప్రశంసలు కురిపించారు.పర్యావరణాన్ని కాపాడాలంటూ సందేశంమొహబ్బత్ తాను పరుగుసాగిస్తూ మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహించాడు. అలాగే పర్యావరణాన్ని కాపాడాలంటూ సందేశమిచ్చాడు. ఈ సందర్భంగా మొహబ్బత్ తండ్రి రింకూ కుమార్ మాట్లాడుతూ తమ కుమారుడు యూకేజీ చదువుతున్నట్లు తెలిపారు. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలను చూశాక, మెహబ్బత్ అయోధ్యకు పరిగెత్తుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నాడన్నారు. బాలల దినోత్సవం(Children's Day) సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మొహబ్బత్ అయోధ్యకు పరుగు ప్రారంభించాడన్నారు.ప్రతిరోజూ 20 కిలోమీటర్ల దూరం..మొహబ్బత్ రాముని భక్తుడని, ప్రతిరోజూ 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం పరిగెడుతూ, అయోధ్యకు చేరుకున్నాడన్నారు. గతంలో మొహబ్బత్ పంజాబ్లోని అబోహర్ నుండి లూథియానాకు పరుగుసాగించాడన్నారు. అప్పుడే అయోధ్యకు పరిగెత్తాలని నిర్ణయించుకున్నాడని రింకూ కుమార్ తెలిపారు. కాగా తమ కుమారుడిని అందరూ రన్ మెషిన్ మొహబ్బత్ అని పిలుస్తున్నారన్నారు. తమ కుమారుడు భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడాకారుడు అవుతాడని చాలామంది అంటున్నారని రింకూ కుమార్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: డెలివరీ బాయ్.. జడ్జిగా మారితే.. యాసిన్ షా సక్సెస్ స్టోరీ -
హైదరాబాద్లో కవిత.. బీఆర్ఎస్ శ్రేణుల ఘనస్వాగతం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆమె వెంట భర్త, అనిల్, సోదరుడు కేటీఆర్ ఉన్నారు. ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్కు కవిత వచ్చారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఐదున్నర నెలలు తిహార్ జైలులో ఉన్న ఆమె మంగళవారం బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే.ఎయిర్పోర్ట్, కవిత ఇంటి వద్ద బీఆర్ఎస్ నేతల కోలాహలం నెలకొంది. కవితకు స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుంచి నేరుగా బంజారాహిల్స్ నందినగర్లోని తన నివాసానికి కవిత చేరుకున్నారు. కవితకు దిష్టి తీసి ఇంట్లోకి కుటుంబ సభ్యులు ఆహ్వానం పలికారు. ఆమె బంధువులు, అభిమానులు పూలవర్షం కురిపించారు.కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకు వస్తా..ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందన్నారు. ‘‘నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి.. కచ్చితంగా ఒక రోజు న్యాయం గెలుస్తుంది. కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకు వస్తా’’ అని కవిత పేర్కొన్నారు.నోటీసులు, అరెస్టు నుంచి విడుదల దాకా..⇒ 08–03–2023న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కవితకు సమన్లు జారీ చేసింది ⇒ 11–03–2023న ఢిల్లీలో ఈడీ విచారణకు కవిత హాజరు ⇒ 15–03–2023న ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత ⇒ 21–03–2023న తన ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత ⇒ 14–09–2023న కవితకు మళ్లీ నోటీసులు జారీ చేసిన ఈడీ ⇒ 15–09–2023న సమన్ల జారీని పదిరోజులు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ⇒ 15–03–2024న లిక్కర్ స్కామ్లో కవితను అరెస్టు చేసిన ఈడీ ⇒ 16–03–2024న ఢిల్లీలోని కోర్టులో హాజరు, రిమాండ్ ⇒ 05–04–2024న కవి తను విచారించేందుకు సీబీఐ పిటిషన్ ⇒ 08–04–2024న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన ట్రయల్ కోర్టు ⇒ 11–04–2024న తీహార్ జైల్లో కవితను అరెస్టు చేసిన సీబీఐ ⇒ 12–04–2024న సీబీఐ కోర్టును ఆశ్రయించిన కవిత.. ఆ పిటిషన్పై తీర్పు రిజర్వు ⇒ 15–04–2024న కవితకు 9 రోజులు జ్యుడీషియల్ కస్టడీ ⇒ 16–04–2024న బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా ⇒ 23–04–2024న మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు ⇒ 14–05–2024న జ్యుడీషియల్ కస్టడీ మే 20 వరకు పొడిగింపు ⇒ 03–06–2024న జూలై 3 వరకు రిమాండ్ కొనసాగింపునకు ఆదేశం ⇒ 01–07–2024న కవిత బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు ⇒ 03–07–2024న జ్యుడీషియల్ కస్టడీ జూలై 25 వరకు పొడిగింపు ⇒ 22–07–2024న బెయిల్ పిటిషన్పై ట్రయల్ కోర్టు విచారణ వాయిదా ⇒ 05–08–2024న బెయిల్ పిటిషన్పై ట్రయల్ కోర్టు విచారణ మళ్లీ వాయిదా ⇒ 07–08–2024న సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత ⇒ 12–08–2024న బెయిల్ పిటిషన్పై సుప్రీంలో విచారణ వాయిదా ⇒ 20–08–2024న బెయిల్ పిటిషన్ వి చారణ మళ్లీ వాయిదా ⇒ 22–08–2024న కవితకు అస్వస్థత.. తీహార్ జైలు నుంచి ఆస్పత్రికి తరలింపు ⇒ 27–08–2024న కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. -
ఉత్తరప్రదేశ్: దర్గాలో తొక్కిసలాట.. వృద్ధుని మృతి
జలేసర్: ఉత్తరప్రదేశ్లోని జలేసర్లో బడే మియా- చోటే మియా దర్గాలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆషాఢమాసంలోని మూడో శనివారం ఇక్కడ శని జాతర నిర్వహిస్తుంటారు. ప్రతీసారి మాదిరిగానే ఈసారి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా జనం ఇక్కడికి తరలివచ్చారు. వీధుల్లో ఎక్కడ చూసినా విపరీతమైన జనం ఉన్నారు. కనీసం నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితులు నెలకొన్నాయి.దర్గాకు వచ్చిన ఫిరోజాబాద్ జిల్లా ఫరీహా పోలీస్ స్టేషన్లోని మీట్పురా గ్రామానికి చెందిన బదన్ సింగ్(70) తన కుటుంబం నుండి విడిపోయాడు. జనం మధ్య తిరుగుతూ, విపరీతమైన వేడి, జనం తాకిడి కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో స్థానికులు అతనిని ఇక్కడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు పంపగా, అక్కడి వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. అనంతరం బదన్ సింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.దర్గాకు వచ్చిన వారిలో మహిళలు, చిన్నారులు ఎండ తీవ్రతకు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూజలు చేసేందుకు అక్కడకు వచ్చినవారంతా పోటీ పడ్డారు. దీంతో తోపులాటలు జరిగాయి. అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. -
కాశీ కారిడార్లో సరికొత్త రికార్డు.. 16 కోట్లు దాటిన భక్తులు
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసి దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది. గడచిన 30 నెలల్లో మహాశివుని భక్తులు కాశీ కారిడార్లో సరికొత్త రికార్డు సృష్టించారు. డిసెంబర్ 2021లో ఈ కారిడార్ ప్రారంభమైన తరువాత నాటి నుంచి ఇప్పటివరకు 16 కోట్ల 46 లక్షల మంది భక్తులు కాశీ విశ్వేశ్వరుణ్ణి సందర్శించుకున్నారు. ఇది మాత్రమే కాదు 2023తో పోలిస్తే 2024 ఆరు నెలల కాలంలో అధికంగా 48 శాతం మంది భక్తులు కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్నారు.రికార్డు స్థాయిలో శివభక్తులు కాశీకి తరలివస్తున్న కారణంగా ఇక్కడి పర్యాటక పరిశ్రమకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. ఇక్కడి హోటళ్లకు మంచి గిరాకీ వస్తుండగా, బనారసీ చీరలు, హస్తకళా వస్తువులు విరివిగా విక్రయమవుతున్నాయి. స్థానిక వ్యాపారులు కారిడార్ నిర్మాణం తరువాత మంచి లాభాలను అందుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిరకూ రెండు కోట్ల 86 లక్షల 57 వేల 473 మంది భక్తులు కాశీ విశ్వనాథ ధామానికి తరలివచ్చారు. రికార్డు స్థాయిలో భక్తుల రాకతో థామ్ ఆదాయం 33 శాతం మేరకు పెరిగింది. -
తిరుమల చేరుకున్న రామ్ చరణ్ దంపతులు.. పోటోలు వైరల్!
-
బాలరాముణ్ణి దర్శించుకున్న గాయని కవితా కృష్ణమూర్తి!
అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముడు ప్రతిష్ఠితుడయ్యాక రామభక్తులంతా రామ్లల్లాను దర్శించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి కూడా ప్రతిరోజూ లక్షలాది మంది రామభక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. తాజాగా ప్రముఖ గాయకురాలు, పద్మశ్రీ కవితా కృష్ణమూర్తి అయోధ్యకు వచ్చి బాలరాముణ్ణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్యకు వచ్చి, ఇక్కడ పాటలు పాడే అదృష్టం తనకు దక్కిందని, ఇందుకు దేవునికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. అయోధ్య అభివృద్ధిపై సంతోషం వ్యక్తం చేసిన ఆమె రానున్న ఐదేళ్లలో అయోధ్య ను కొత్త కోణంలో చూడనున్నామన్నారు. ఇక్కడికి కళాకారులు తరలి రావడం సంతోషంగా ఉందన్నారు. -
13కు చేరిన మృతులు
ఆరిలోవ(విశాఖతూర్పు)/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/తాటిచెట్లపాలెం(విశాఖఉత్తర): విజయనగరం జిల్లా భీమాలి–ఆలమండ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కి చేరింది. మొత్తం 50 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో 34 మందిని విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించగా.. మిగిలిన వారిని విశాఖ కేజీహెచ్, రైల్వే, ఇతర ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. ఇదిలా ఉండగా, విశాఖ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన పలాస ప్యాసింజర్లో స్పెషల్ గార్డుగా ఉన్న మరిపి శ్రీనివాసరావు(53) ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. విశాఖ ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతిచెందాడు. రైల్వే అధికారులు కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాన్ని సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆయనకు తల్లితో పాటు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న భార్య అమల, పీజీ చదువుతున్న కుమార్తె హర్షప్రియ, బీటెక్ చదువుతున్న కుమారుడు చంద్రదీప్ ఉన్నారు. మృతిచెందిన లోకో పైలట్ మధుసూదనరావు(ఫైల్), మృతిచెందిన పలాస ప్యాసింజర్ గార్డు శ్రీనివాసరావు(ఫైల్) శ్రీనివాసరావుది పార్వతీపురం కాగా, ఉద్యోగ రీత్యా విశాఖలో స్థిరపడ్డారు. అలాగే, రాయగడ ప్యాసింజరుకు లోకో పైలట్గా ఉన్న విశాఖ జిల్లా తంగేడు గ్రామానికి చెందిన శింగంపల్లి మధుసూదనరావు(53) ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య సూర్యలత, ఇద్దరు కుమార్తెలున్నారు. ఉద్యోగరీత్యా మధుసూదనరావు కుటుంబం సహా విశాఖలో ఉంటున్నారు. విశాఖ కేజీహెచ్లో ఇద్దరికి శస్త్ర చికిత్స విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడ్డవారిలో నలుగురిని కేజీహెచ్కు తరలించగా.. వారిలో ఇద్దరికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. విజయనగరం జిల్లా జామి మండలానికి చెందిన నల్ల కుమారి, విశాఖ జిల్లా గాజువాక దయాల్నగర్ ప్రాంతానికి చెందిన ముర్రు లక్ష్మిలకు సోమవారం శస్త్ర చికిత్స నిర్వహించారు. నల్ల కుమారికి ఆర్థోపెడిక్ వార్డులో శస్త్ర చికిత్స అనంతరం ప్లాస్టిక్ సర్జరీ వార్డుకు తరలించినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్కుమార్ తెలిపారు. లక్ష్మికి సాయంత్రం అత్యవసరంగా శస్త్ర చికిత్స చేశామన్నారు. శ్రీకాకుళం జిల్లా సింగపురం గ్రామానికి చెందిన మోహిద వరలక్ష్మి, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం నడగాం గ్రామానికి చెందిన గొట్ట కమలమ్మలు చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా, రైలు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్సలు అందించడానికి, పోస్టుమార్టం నిర్వహించడానికి ముగ్గురు ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులను విజయనగరం పంపినట్లు ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.బుచ్చిరాజు తెలిపారు. అలాగే ఆర్థోపెడిక్ వైద్యుడు భగవాన్ను క్షతగాత్రులకు వైద్య సేవలు అందించడానికి విజయనగరం పంపినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ చెప్పారు. విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో గాయపడినవారిలో 8మందిని విశాఖ తరలించారు. వీరిలో నలుగురు కేజీహెచ్లో, మరొకరు ఆరిలోవ హెల్త్ సిటీలో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురిని రైల్వే హాస్పిటల్లో చేర్పించారు. వీరిలో పలాస పాసింజర్ స్పెషల్ గార్డు మరిపి శ్రీనివాసరావు ఆదివారం రాత్రే మృతిచెందారు. మిగిలిన బి.తేజేశ్వరరావు, పి.శ్రీనివాసరావు రైల్వే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరు కూడా రైల్వే ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ఆదివారం విధులు ముగించుకుని గోపాలపట్నం నుంచి పలాస రైలులో తమ సొంత ఊరు శ్రీకాకుళం వెళ్తూ ప్రమాదంలో గాయపడ్డారు. మృతుల వివరాలు 1. కె.రవి (గొడికొమ్ము, జామి మండలం, విజయనగరం జిల్లా) 2. గిడిజాల లక్ష్మి (ఎస్పీ రామచంద్రాపురం, జి.సిగడం మండలం, శ్రీకాకుళం జిల్లా) 3. కరణం అప్పలనాయుడు (కాపుశంభాం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా) 4. చల్లా సతీష్ (తోటపాలెం, విజయనగరం) 5. శింగంపల్లి మధుసూదనరావు (లోకో పైలట్, ఎన్ఏడీ, విశాఖపట్నం) 6. చింతల కృష్ణమనాయుడు (గ్యాంగ్మన్, కొత్తవలస, విజయనగరం జిల్లా) 7. పిల్లా నాగరాజు (కాపుశంభాం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా) 8. మరిపి శ్రీనివాసరావు (పలాస ప్యాసింజర్ గార్డ్, ఆరిలోవ, విశాఖపట్నం) 9. టెంకల సుగుణమ్మ (మెట్టవలస, జి.సిగడం మండలం, శ్రీకాకుళం జిల్లా) 10. రెడ్డి సీతంనాయుడు (రెడ్డిపేట, చీపురుపల్లి మండలం, విజయనగరం జిల్లా) 11. మజ్జి రాము (గదబవలస, గరివిడి మండలం, విజయనగరం జిల్లా) 12. సువ్వారి చిరంజీవి (లోకో పైలట్, కుశాలపురం, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా) 13. ఒక మృతదేహం ఆచూకీ తెలియాల్సి ఉంది. రైలు ఒక్కసారిగా కుదుపునకు గురైంది.. నేను విజయనగరం జిల్లా రాజాంలో తృతీయ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్నా. రెండు రోజుల సెలవులకు విశాఖ వచ్చి తిరుగు ప్రయాణంలో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్లో ఆదివారం సాయంత్రం పలాస ట్రైన్ ఎక్కా. చీపురుపల్లిలో దిగాలి. ఆఖరి చివరి నుంచి రెండో బోగీలో ఉన్నాను. సాయంత్రం వేళలో రైలు ఒక్కసారిగా కుదుపునకు గురైంది. రైల్లోని లగేజ్ షెల్ఫ్లో ఉన్న సామాన్లు నాపై పడ్డాయి. దీంతో కంగారుపడ్డాను. ఒక్కసారిగా బోగీ 45 డిగ్రీల కోణంలో ఒరిగిపోయింది. నేను, నా స్నేహితుడు కలిసి బోగీలోని రాడ్లను పట్టుకుని బయటకు వచ్చేశాం. – వి.అవినాష్, ఇంజినీరింగ్ విద్యార్థి, మునగపాక -
'భారత్ చంద్రున్ని చేరితే.. పాక్ పక్క దేశాలను అడుక్కుంటోంది'
ఇస్లామాబాద్: భారత్ చంద్రమండలంపైకి వెళ్తుంటే.. పాక్ పక్క దేశాలను అడుక్కుంటోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్థాన్ను పాలించిన గత ప్రధానులు అవినితీకి పాల్పడి.. దేశాన్ని గందరగోళ పరిస్థితుల్లో నెట్టివేశారని ఆరోపించారు. ' పాకిస్థాన్ ప్రధాని నిధులు సమకూర్చండని పక్క దేశాలను అడుక్కుంటున్నారు. మన పక్కనే ఉన్న భారత్.. చంద్రమండలంపైకి వెళ్లింది. జీ20 వంటి ప్రపంచ సమ్మిట్లకు వేదికగా మారింది. పాక్ ఎందుకు సాధించలేదు. ఈ దుస్థితికి కారణం ఎవరు..? వాజ్పేయీ కాలంలో భారత్ వద్ద నిల్వలు చాలా తక్కువగా ఉండేవి. అదే ప్రస్తుతం వారి నిల్వలు 600 బిలియన్ డాలర్ల వరకు చేరాయి.' అని లాహోర్ వేదికగా జరిగిన బహిరంగ సభలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లండన్ నుంచి మాట్లాడారు. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్లుగా దిగజారిపోతోంది. పేద ప్రజలకు తిండి పెట్టలేని దుస్థితికి చేరింది. ద్రవ్యోల్భణం రెండంకెల సంఖ్యకు చేరింది. పాకిస్థాన్లో పరిస్థితుల్ని చక్కదిద్దడానికి జులైలో ఐఎంఎఫ్కు 1.2 బిలియన్ అమెరికా డాలర్లను సమకూర్చింది. నవంబర్ 2019లో, నవాజ్ షరీఫ్కు అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. వైద్య కారణాలతో దేశం విడిచి యూకేలో నివసిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 21న ఆయన పాకిస్థాన్కు తిరిగి వస్తానని ప్రకటించారు. లాహోర్కు రాకముందే ఆయనకి రక్షిత బెయిల్ మంజూరు చేస్తామని PML-N పార్టీ చెబుతోంది. యూకే నుంచి తిరిగి వచ్చి వచ్చే ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించనున్నారని పార్టీ నాయకులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదీ చదవండి: భారత్పై కెనడా ప్రధాని ఆరోపణల వెనక ఆంతర్యం ఇదే! -
మెగా వారసురాలు అంటూ.. వీడియోలు షేర్ చేస్తున్న ఫ్యాన్స్
ప్రముఖ నటుడు రామ్చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. నేడు (జూన్ 20)న పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చింది. దీంతో ఇరు కుటుంబాల్లో ఆనందం వెల్లువిరిసింది. హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్ అందుకు వేదిక అయింది. ఇప్పటికే అక్కడకు చిరంజీవి చేరుకున్నారు. మరోవైపు మెగా ఫ్యాన్స్ కూడా సంబరాలు మొదలుబెట్టారు. చిరంజీవి మరోసారి తాత అయ్యారు. పెళ్లైన పదకొండు ఏళ్ల తర్వాత రామ్చరణ్, ఉపాసన దంపతులు తల్లితండ్రులు అయ్యారు. ఇంకేముంది మెగా వారసురాలు వచ్చేసింది అంటూ.. ట్వీట్స్తో తమ ఆనందాన్ని సోషల్మీడియా ద్వారా ఫ్యాన్స్ పంచుకుంటున్నారు. కొణిదెల ఇంట మూడో తరం రావడంతో ఆ బిడ్డకు దేవుడి ఆశీర్వాదం ఉండాలని పలు దేవాలయాల్లో వారు పూజలు చేయడం ప్రారంభించారు. పండంటి బిడ్డ పుట్టడంతో రామ్ చరణ్ రెండు నెలలు షూటింగ్కు కూడా బ్రేక్ ఇచ్చేశాడు. తన కూతురితో ఆయన ఆనందంగా గడపనున్నారు. (ఇదీ చదవండి: మహేష్ బాబుతో గొడవలు.. థమన్ రియాక్షన్ ఇదే) కంగ్రాట్స్ అన్న వదిన అంటూ చిరంజీవి సినిమాకు సంబంధించిన ఒక వీడియోను అభిమానులు షేర్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా అపోలో ఆస్పత్రి వద్ద హార్ట్ సింబల్లో ఉండే బెలూన్స్ ఎగురవేశారు. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: తమన్నా చేసిన పనితో ఆందోళనలో జైలర్ యూనిట్) Biggest Mega Festival of #MegaPrincess Kick starting 🥁🥁#RamCharanUpasanaBabyGirl@AlwaysRamCharan @upasanakonidela ✨️💕 pic.twitter.com/h7ZX5JXPTG — Trends RamCharan™ (@TweetRamCharan) June 20, 2023 మెగా వారసురాలు 👧❤️ Congratulations @AlwaysRamCharan & @upasanakonidela garu ❤️#RamCharanUpasanaBabyGirl pic.twitter.com/SpK2q0LZKJ — RC CELEBRATIONS™ (@RC_celebrations) June 20, 2023 Congratulations @AlwaysRamCharan & @upasanakonidela anna and Vadina ❤️... #MegaPrincess pic.twitter.com/qfKm3l6Ty4 — Thodagottina TELUGODU ⚡ (@jashwanthvamsi) June 20, 2023 -
బేగంపేట్ చేరుకున్న ప్రధాని మోదీ
-
పొలిటికల్ కారిడార్ : టీడీపీ అధినేత చంద్రబాబులో పీక్స్ కు చేరిన అసహనం
-
నరసాపురం చేరుకున్న సీఎం వైఎస్ జగన్
-
విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ
-
ఢిల్లీలో తీవ్ర స్థాయికి చేరిన వాయు కాలుష్యం
-
హైదరాబాద్ చేరుకున్న భారత్ ,ఆస్ట్రేలియా జట్లు
-
కోనసీమ చేరుకున్న సీఎం జగన్
-
రామాయపట్నం చేరుకున్నసీఎం జగన్
-
60 వేల 657 డాలర్లకు చేరిన బిట్ కాయిన్ విలువ
-
డాక్టర్ సమేతంగా...
న్యూఢిల్లీ: భారత్తో మూడు వన్డేల సిరీస్లో తలపడేందుకు దక్షిణాఫ్రికా జట్టు సోమవారం నగరానికి చేరుకుంది. ఇక్కడి నుంచి సఫారీ ఆటగాళ్లు నేరుగా తొలి మ్యాచ్ వేదిక అయిన ధర్మశాలకు వెళ్లిపోయారు. సఫారీ జట్టు వెంట క్రికెట్ సౌతాఫ్రికా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షుయబ్ మన్జ్రా కూడా ఉన్నారు. కోవిడ్–19 వైరస్ సమస్యల నేపథ్యంలో టీమ్ తమ వెంట వైద్యుడిని తెచ్చుకుంది. ముందు జాగ్రత్తగా ఈ సిరీస్ సమయంలో తమ ఆటగాళ్లెవరూ కరచాలనాలు కూడా చేయరని కోచ్ మార్క్ బౌచర్ వెల్లడించాడు. భారత క్రికెటర్లు మాత్రం మంగళవారం ధర్మశాల వెళతారు. అంతకుముందు బోర్డు కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లందరూ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్, వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. ఈ సిరీస్లో భాగంగా ఈ నెల 12న (ధర్మశాల), 15న (లక్నో), 18న (కోల్కతా) మూడు వన్డేలు జరుగుతాయి. -
పట్టుదల, కృషితోనే లక్ష్య సాధన: హంపి
సాక్షి, గన్నవరం: వర్ధమాన క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేస్తే తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని ప్రపంచ ర్యాపిడ్ మహిళల చెస్ చాంపియన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. మహిళల విభాగంలో భారత నంబర్వన్గా ఉన్న 32 ఏళ్ల హంపి రష్యాలో గతవారం జరిగిన ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్షిప్లో మహిళల ర్యాపిడ్ విభాగంలో విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన హంపి బుధవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ చేరుకుంది. ఆమెకు గన్నవరం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్), ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం (ఏపీఓఏ) అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ‘శాప్’ నుంచి స్పోర్ట్స్ డైరెక్టర్ రమణ, ఓఎస్డీ రామకృష్ణ, ఎయిర్పోర్టు డైరెక్టర్ జీ.మధుసూదనరావు... ఏపీఓఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేపీ రావు, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు శ్రీహరి, నామిశెట్టి వెంకటేశ్వరరావు, ధనియాల నాగరాజు, చెరుకూరి సత్యనారాయణ, అర్జా పాండురంగారావు, ఆర్చరీ క్రీడాకారిణి చెరుకూరి డాలీ, హంపి భర్త దాసరి అన్వేష్, తల్లిదండ్రులు కోనేరు అశోక్, లత తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో హంపి మీడియాతో మాట్లాడింది. ‘తండ్రి అశోక్ నిరంతరం ఇచ్చే విలువైన సూచనలతో చెస్లో ఉన్నతస్థితికి చేరుకున్నాను. ఆయన శిక్షణలో మరింతగా రాటుదేలి భవిష్యత్లో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకుంటాను. భర్త అన్వేష్ ఎల్లవేళలా ప్రోత్సహిస్తున్నారు. కుటుంబసభ్యుల సంపూర్ణ సహకారంతోనే చెస్లో పునరాగమనం చేయగలిగాను. ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్గా అవతరించాను. క్లాసికల్ విభాగంలో విశ్వవిజేతగా నిలువడమే తదుపరి లక్ష్యం’ అని హంపి వ్యాఖ్యానించింది. -
విశాఖ చేరిన భారత్, విండీస్ జట్లు
విశాఖ స్పోర్ట్స్: రెండో వన్డే మ్యాచ్లో తలపడేందుకు భారత్, వెస్టిండీస్ క్రికెట్ జట్లు సోమవారం విశాఖపట్నం చేరుకున్నాయి. మంగళవారం రెండు జట్లు నెట్ ప్రాక్టీస్లో పాల్గొననున్నాయి. మ్యాచ్ నిర్వహణ సజావుగా సాగేందుకు అపెక్స్ కమిటీ సోమవారం సమీక్ష నిర్వహించింది. నిర్వహణ కమిటీలు సమావేశమై ఏర్పాట్లపై చర్చించాయి. అనంతరం కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ... క్రీడాకారుల భద్రత, టిక్కెట్ల విక్రయాలు, స్టేడియంలో ఆహార పదార్థాలు తదితర విషయాలపై తీసుకున్న చర్యలను వివరించారు. స్థానిక ఆటగాడు, భారత మాజీ క్రికెటర్ వై.వేణుగోపాల్ రావు పేరిట స్టేడియంలో ఓ గేట్ను ఏర్పాటు చేయనున్నామని... దానిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి దుర్గాప్రసాద్, కోశాధికారి గోపీనాథ్ రెడ్డిలతో పాటు డీసీపీ రంగారెడ్డి, జేసీ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెస్టిండీస్కు భారీ జరిమానా తొలి వన్డేలో భారత్ను ఓడించిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఓవర్రేట్లో మాత్రం భారీగా వెనుకబడింది. దాంతో ఆ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఏకంగా 80 శాతం కోత పడింది. భారత బ్యాటింగ్ సమయంలో 50 ఓవర్లకు నిర్దేశించిన సమయం ముగిసినా దానిని పూర్తి చేయలేక విండీస్ మరో నాలుగు ఓవర్లు వెనుకబడింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక్కో ఓవర్కు 20 శాతం జరిమానా చొప్పున విండీస్ జట్టు సభ్యులపై 80 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధిస్తున్నట్లు రిఫరీ డేవిడ్ బూన్ ప్రకటించారు. -
హెచ్1 బీ దరఖాస్తుల కోటా ముగిసింది..కానీ
వాషింగ్టన్: హెచ్1బీ వీసాల దరఖాస్తులు కోటాకు సరిపడా స్వీకరించినట్టు అమెరికా పౌర, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) వెల్లడించింది. 2019 సంవత్సరానికి సంబంధించి హెచ్1 బీ వీసాలకు స్పందన భారీగా వచ్చిందని తెలిపింది. ఈ ఏడాది కోటా 65వేల దరఖాస్తులను స్వీకరించినట్టు తెలిపింది. లాటరీ నిర్వహించి అనంతరం వీసాకు అర్హులైన అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని చెప్పింది. అయితే ఎప్పుడు లాటరీ పద్ధతి నిర్వహిస్తారు, దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందనే దానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు. మరోవైపు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టతనిచ్చింది. అమెరికా ప్రభుత్వం జారీ చేసే భారతీయ ఐటి నిపుణులకు పాపులర్ అయిన హెచ్1బీ వీసాలపై ప్రభుత్వ కోటాను మించి ఎక్కువగానే దరఖాస్తులు వచ్చాయి. వీటితో పాటు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి మంజూరు చేసే 20వేల వీసా క్యాప్కు సంబంధించి సరిపడా దరఖాస్తులు వచ్చినట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది. ‘హెచ్1బీ వీసాల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే విషయాన్ని చెప్పలేం. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా లాటరీ పద్ధతి అనుసరించే వీసాలు జారీ చేస్తాం’ అని యూఎస్సీఐఎస్ ప్రతినిధి తెలిపారు. అలాగే వీసాకుఎంపిక కాని దరఖాస్తుదారులు చెల్లించిన రుసుమును తిరిగి ఇచ్చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 2 నుంచి హెచ్1 వీసాల దరఖాస్తుల ప్రకియ ప్రారంభమైన విషయం తెలిసిందే. -
పదేళ్ల తర్వాత తల్లి చెంతకు..
గద్వాల అర్బన్ : పదేళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లిన ఆ కుటుంబానికి అప్పట్లో విషాదం ఎదురైంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త చనిపోయిన కొన్నాళ్లకే కూతురు కూడా కనిపించకుండా పోయింది. అలా పదేళ్లుగా ఆ తల్లి కూతురి కోసం దుఖిస్తుండగా ఇప్పుడు బిడ్డ ఆచూకీ తెలిసిన వైనమిది. గద్వాలలోని వడ్డెగేరికి చెందిన పద్మ, రాముడు భార్యాభర్తలు. భర్త మరణం తర్వాత పొత్తిళ్లలో ఉన్న కుమారుడు, ఆరేళ్ల కుమార్తెతో కలిసి పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్ వెళ్లింది. హైదరాబాద్లోని ఉప్పల్ ప్రాంతంలో అడ్డా కూలీగా మారింది. ఇదే క్రమంలో పద్మ తల్లి చనిపోయిందని సమాచారం రాగానే కాచిగూడ రైల్వేస్టేషన్కు ఆమె వచ్చింది. అక్కడ రద్దీ ఉండడంతో ఆరు నెలల కుమారుడిని కుమార్తె హైమావతి చేతిలో పెట్టి టికెట్ తెచ్చేందుకు వెళ్లి వచ్చే సరికి కుమారుడు మాత్రమే ఉన్నాడు. దీంతో అప్పటి నుంచి కుమార్తె కోసం వెతుకుతున్నా ఫలితం కనిపించలేదు. కాగా, అప్పట్లో హైమావతిని చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది సికింద్రాబాద్లోని నవజీవన హోంకు, ఆతర్వాత నింబోలి అడ్డాలోని ప్రత్యేక చిల్డ్రన్ హోం(బాలికల), రాజేంద్రనగర్లోని కేజీబీవీ పాఠశాలకు తరలించారు. 6, 8వ తరగతి వరకు చదవిన హైమావతి తన తల్లి గద్వాలలో ఉన్నారని నిర్వాహకులకు చెప్పగా వారు జిల్లా బాలల సంరక్షణ అధికారి రాములుకు మహబూబ్నగర్ అధికారులు ఫొటోతో పాటు సమాచారం ఇచ్చారు. ఆయన ఇచ్చిన సమాచారంతో వడ్డేగేరి అంగన్వాడీ కార్యకర్త ఫొటోలో ఉన్న బాలికను గుర్తు పట్టి ఆమె తల్లి పద్మకు చూయించింది. తన కుమార్తెను ఆమె గుర్తించగా.. మహబూబ్నగర్ స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలిక హైమావతిని తల్లి పద్మకు గురువారం అప్పగించారు. -
హైదరాబాద్ చేరుకున్న 150 దేశాల ప్రతినిధులు
-
చెరుకులపాడు చేరుకున్న వైఎస్ జగన్ పాదయాత్ర