Rs 1
-
బంపర్ ఆఫర్ : రూపాయికే బైక్ బుక్
సాక్షి, ముంబై: కరోనా కాలంలో రవాణా సదుపాయాలు తగినంతగా లేక ఇబ్బందులు పడుతూ, ద్విచక్ర వాహనాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్న వారికోసం ఫెడరల్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. కేవలం ఒక్క రూపాయికే బైక్ బుక్ చేసుకోవచ్చంటూ తన కస్టమర్లకు ఊరటనిచ్చింది. బ్యాంక్ కస్టమర్లుఫెడరల్ డెబిట్ కార్డు ద్వారా కేవలం ఒక్క రూపాయి చెల్లించి, మిగిలిన సొమ్మును ఈఎంఐ చెల్లింపు అవకాశంతో కొనుగోలు చేయవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఎంపిక చేసిన హీరో, హోండా, టీవీఎస్ షోరూంలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. మరోవైపు ఫెస్టివల్ ఆఫర్గా ఎంపిక చేసిన హోండా మోటార్ సైకిల్ షోరూంల ద్వారా డెబిట్ కార్డు ఈఎంఐతో బైక్ కొనుగోలు చేసినవారికి 5 శాతం క్యాష్బ్యాక్ను సైతం బ్యాంక్ అందిస్తోంది. 3, 6, 9,12 నెలలకు ఈఎంఐను ఎంచుకునే అవకాశాన్ని ఖాతాదారులకు ఫెడరల్ బ్యాంక్ కల్పిస్తోంది. ఈఎంఐ అర్హతను తెలుసుకోవడానికి ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు ‘DC-SPACE-EMI’ అని టైప్ చేసి 5676762 నంబర్కు ఎస్ఎంఎస్ చేయాలి. అలాగే 7812900900 నంబరుకు మిస్డ్కాల్ ఇచ్చి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. హోండా మోటార్ సైకిల్ షోరూమ్ల నుండి ద్విచక్ర వాహనం కొనుగోలు చేసేవారికి పండుగ ఆఫర్గా5 శాతం క్యాష్ బ్యాక ఆఫర్ కూడా ఉంది. 500సీసీ ఇంజన్ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న బైక్లపై 17 శాతం వడ్డీ రేటు అందిస్తున్నట్లు బ్యాంకు పేర్కొంది. రానున్న పండుగ సీజన్, కరోనా మహమ్మారి ప్రోటోకాల్స్, కార్డ్ల ద్వారా ద్విచక్ర వాహనాల కొనుగోళ్లపై జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో ఈజీ ఫైనాన్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో కస్టమర్లకు ప్రోత్సాహాన్నివ్వాలని భావిస్తున్నట్టు బ్యాంకు తెలిపింది. భారతదేశం అంతటా 36,000 దుకాణాలలో వినియోగదారుల డ్యూరబుల్స్ కొనుగోలు కోసం బ్యాంక్ డెబిట్ కార్డులపై ఈఎంఐ సదుపాయం అందిస్తోంది. కాగా ఈకామర్స్ పోర్టల్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ కొనుగోళ్లపై కూడా ఇటీవలఈఎంఐ ఆఫర్ అందించడం ప్రారంభించింది. -
రూ.1000 నోటుపై ప్రభుత్వం క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాన్ చేసిన రూ.1000 నోటును తిరిగి ప్రవేశపెడుతున్నారని వస్తున్న ఊహాగానాలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టే ఉద్దేశ్యమేమీ ప్రస్తుతానికి లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ స్పష్టంచేశారు. మళ్లీ రూ.1000 నోట్లను కొత్తగా తీసుకువచ్చేందుకు కేంద్రం యోచిస్తోందన్న వార్తలపై ఆయన ఈ విధంగా ట్వీట్ చేశారు. నవంబర్ 8న ప్రభుత్వం పెద్ద నోట్లు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత కొత్త రూ.2000 నోట్లను, రూ.500 నోట్లను ఆర్బీఐ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కానీ కొత్త సిరీస్లో రూ.1000 నోట్లను మాత్రం మార్కెట్లోకి తీసుకురాలేదు. ఇటీవల కాలంలో కొత్త రూ.1000 నోట్లను ప్రజల్లోకి మళ్లీ అందుబాటులోకి రానున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుతం రూ.200, రూ.500, రూ.2,000ల మధ్య ఉన్న అంతరాన్ని పూరించడానికి తిరిగి రూ.1,000 నోటును తీసుకురానున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కానీ వీటిని తిరిగి చలామణిలోకి తెచ్చే ఆలోచనేమీ లేదని ప్రభుత్వం తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన చిల్లర కొరత సమస్యకు పరిష్కారంగా ఇటీవలే ఆర్బీఐ కొత్తగా రూ.200 నోట్లను, రూ.50 నోట్లను ప్రవేశపెట్టింది. -
రిలయన్స్, బీపీకి మరో రూ.1,700 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం కేజీ–డీ6 క్షేత్రాల నుంచి నిర్దేశిత లక్ష్యాలకన్నా తక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసినందుకు గాను రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థలపై కేంద్రం మరో 264 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,700 కోట్లు) జరిమానా విధించింది. దీంతో 2010 ఏప్రిల్ 1 నుంచి దాదాపు ఆరేళ్లుగా లక్ష్యాలను సాధించలేకపోవడం వల్ల విధించిన మొత్తం పెనాల్టీ సుమారు 3.02 బిలియన్ డాలర్లకి(దాదాపు రూ. 19,500 కోట్లు) చేరిందని చమురు శాఖ తెలిపింది. వ్యయాల రికవరీని అనుమతించకపోవడం రూపంలో ఈ జరిమానా ఉంటోంది. వాస్తవానికి ఉత్పత్తిలో వాటాల ఒప్పందం (పీఎస్సీ) ప్రకారం రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థలు బీపీ, నికో రిసోర్సెస్ ముందుగా తమకైన వ్యయాలను గ్యాస్ అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంలోనుంచి తగ్గించుకుని మిగతా లాభాలను ప్రభుత్వంతో పంచుకుంటున్నాయి. అయితే, వ్యయాల రికవరీకి అనుమతించని పక్షంలో లాభాల్లో ప్రభుత్వ వాటా పెరుగుతుంది. 2011–12లో కేజీ–డీ6 బ్లాక్లోని ధీరూభాయ్–1, 3 గ్యాస్ క్షేత్రాల నుంచి రోజుకు 80 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్ ఉత్పత్తి చేయాల్సి ఉండగా 35.33 ఎంసీఎండీ మాత్రమే ఉత్పత్తయ్యింది. ఆతర్వాత నుంచి తగ్గుతూ ప్రస్తుతం 4 ఎంసీఎండీ కన్నా తక్కువకి క్షీణించింది. గడిచిన సంవత్సరాలకు సంబంధించి వ్యయాల రికవరీని అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ ఆర్ఐఎల్, బీపీ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఆర్బిట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది. -
రూపాయికే 51 శాతం వాటా!
♦ ముంద్రా పవర్ ప్రాజెక్టులో ♦ ఆఫర్ చేస్తున్న టాటా పవర్ న్యూఢిల్లీ: నష్టాలు, రుణభారంతో కుదేలవుతున్న ముంద్రా పవర్ ప్రాజెక్టును గట్టెక్కించేం దుకు టాటా పవర్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టులో 51% వాటాలను రూ.1 కే విక్రయిస్తామంటూ తమ దగ్గర్నుంచి విద్యుత్ కొనుగోలు చేసే గుజరాత్ తదితర రాష్ట్రాలకు ఆఫర్ ఇచ్చింది. మరికాస్త అధిక రేటుకు విద్యుత్ను కొనుగోలు చేసే హామీ లభిస్తే కేవలం 49% వాటా మాత్ర మే ఉంచుకుని, నిర్వహణకు మాత్రమే తాము పరిమితం అవుతామని ప్రాజెక్టును నిర్వహిస్తున్న టాటా పవర్ విభాగం కోస్టల్ గుజరాత్ పవర్ (సీజీపీఎల్) పేర్కొంది. గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్కి ఈ మేరకు లేఖ రాసింది.రూ. 2.26కే యూనిట్ను విక్రయించేలా 2006లో ప్రాజెక్టును టాటా దక్కించుకుంది. అయితే, బొగ్గు విషయంలో అంచనాలు తప్పడంతో అధిక ధర కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రస్తుతం ముంద్రా నష్టాలు రూ. 6,457 కోట్లు కాగా, రుణభారం రూ. 10,159 కోట్లు. కంపెనీ చెల్లింపు మూలధనం రూ. 6,083 కోట్లు. -
నష్టాలను తగ్గించుకున్న టాటా స్టీల్
ముంబై: ప్రముఖ స్టీల్ మేకర్ టాటా స్టీల్ విశ్లేషకుల అంచనాలను బీట్ చేసి క్యూ4 ఫలితాలను ప్రకటించింది. నాలుగవ త్రైమాసికంలో నికర నష్టాలను తగ్గించుకుంది. గత ఏడాది ఇదేక్వార్టర్లో రూ.3042కోట్ల నికర నష్టాలతో పోలిస్తే భారీగా పుంజుకుంది. గత ఏడాది మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి రూ.1,168 కోట్ల నికర నష్టాన్ని ఆర్జించింది. ఆదాయం 30.42 శాతం పెరిగి రూ.35,305 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.27,071 కోట్లు. అయితే ఆదాయం రూ .31,618.40 కోట్లగా ఉండనుందని 14 మంది విశ్లేషకులు అంచనా వేశారు. ఈ త్రైమాసికంలో కంపెనీకి భారత వ్యాపారంలో రూ .17,113.13 కోట్లు నష్టపోగా ఐరోపా వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయం రూ .15,243.52 కోట్లు. ఈ త్రైమాసికంలో స్టీల్ సరఫరా 22శాతం పుంజుకోవడంతో ఆదాయంలో 25శాతం పెరుగుదలకు దారితీసిందని సంస్థ తెలిపింది. టాటాస్టీల్ నికర డెట్ రూ .77518 కోట్లుగా ఉంది. -
వెయ్యి కోట్ల పన్ను ఎగవేసిన గోకులం చిట్స్!
సాక్షి, చెన్నై: తమిళనాడుకు చెందిన గోకులం చిట్స్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్లో ఆదాయ పన్ను సిబ్బంది గత 4 రోజులుగా జరిపిన సోదాల్లో రూ.1,100 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు తెలిసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత తమిళనాడు ఆదాయ పన్ను విభాగం దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళనాడులోని పలువురు ప్రముఖులపై పంజా విసిరిన ఆదాయ పన్ను అధికారులు.. ఇటీవల గోకులం చిట్స్ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు ఐదు వందల మంది సిబ్బంది బుధవారం నుంచి చెన్నై, పుదుచ్చేరిల్లోని గోకులం చిట్స్ కార్యాలయాలు, ఆస్తులపై దాడులు నిర్వహించగా.. పలు విలువైన రికార్డులు లభించాయి. -
భారీ ఆర్డర్ దక్కించుకున్నజెఎంసీ
ముంబై: ప్రముఖ దేశీయ రియల్ఎస్టేట్ సంస్థ జెఎంసీ ప్రాజెక్టు ఇండియా భారీ ఆర్డర్ను దక్కించుకుంది. రూ.1,058కోట్ల విలువైన ఆర్డర్ను సాధించింది. మహారాష్ట్ర ధానేలో రూ 531 కోట్ల విలువైన నివాస భవనం ప్రాజెక్ట్ ఆర్డర్, బెంగుళూరులో రూ. 527 కోట్ల రెండు వాణిజ్య భవన నిర్మాణ ప్రాజెక్టును సాధించినట్టు బీఎస్ఈ ఫైలింగ్ లోతెలిపింది. డీమానిటైజేషన్ ప్రభావం ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు సంస్థ డైరెక్టర్ , సీఎఫ్వో మనోజ్ తులసియాన్ తెలిపారు. రియల్ ఎస్టేట్ ఆర్డర్ తీసుకునేటపుడు అప్రమత్తంగా ఉన్నామన్నారు. అలాగే 2018 ఆర్థిక సంవత్సరానికిగాను 15-20 వృద్ధి సాధించనున్నట్టు చెప్పారు. ఈ ప్రకటనతో మార్కెట్లో ఈ కౌంటర్ ఒకదశలో4 శాతం లాభపడింది. కాగా దేశీయ ఇంజనీరింగ్ మరియు నిర్మాణ సేవల సంస్థ జెఎంసీ భవనాలు, ఇతర కట్టడాల నిర్మాణంతోపాటు, నిర్మాణం రంగంలోని డిజైన్, సేకరణ, సరఫరా, సంస్థాపన, టెస్టింగ్ లాంటి ఇతర ప్రాజెక్టులను నిర్వహిస్తుంది. -
పెంపుడు జంతువులతో రోడ్లపైకి వస్తే బాదుడే !
-
వేదాంత లాభం నాలుగు రెట్లు జంప్
ముంబై: ప్రముఖ మైనింగ్ సంస్థ వేదాంత లిమిటెడ్ ఆకర్షణీయమైన ఫలితాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో గణనీయమైన వృద్ధిని సాధించింది. నాలుగురెట్ల పెరుగుదలతోమ రూ. 1,866 కోట్లు నికర లాభాలను ప్రకటించింది. అంతకు ముందు సంవత్సరంలో ఇదే క్వార్టర్ నికరలాభం రూ 412 కోట్లుగా ఉంది. ఆపరేషన్ల నుండి మొత్తం ఆదాయం 30 శాతం పెరిగి రూ. 20,393 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇది రూ. 15,731 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం(ఇబిటా) 77 శాతం దూసుకెళ్లి రూ. 5879 కోట్లకు చేరగా.. ఇబిటా మార్జిన్లు 21.1 శాతం నుంచి 28.8 శాతానికి బలపడ్డాయి. ఈ కాలంలో పన్ను వ్యయాలు కూడా రూ. 49 కోట్ల నుంచి రూ. 897 కోట్లకు పెరిగాయి. డిసెంబర్ త్రైమాసికంలో జింక్ ఇండియా మెటల్ ఉత్పత్తి క్వార్టర్ ఆన్ క్వార్టర్ 44 శాతంపెరిగినట్టు తెలిపింది. బాక్సైట్ మరియు కంకర మైనింగ్ ప్రారంభ కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. క్వార్టర్ 3లో కాపర్ ఇండియా ఉత్పత్తి 102 కేటీ గా నమోదైనట్టు వేదాంత తెలిపింది. -
‘ఒంటరి మహిళల భృతి’పై కొలిక్కిరాని కసరత్తు
వయోపరిమితి నిర్ధారణపై సర్కారు తర్జన భర్జన సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళలకు ఆర్థికభృతి పథకం మార్గదర్శకాలపై కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఒంటరి మహిళలకు ఆసరా పథకం ద్వారా నెలకు రూ.1,000 చొప్పున ఆర్థిక భృతిని అందిస్తామని సర్కారు గత శాసనసభ సమావేశాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమలులోకి రావాల్సి ఉన్నందున లబ్ధిదారుల ఎంపికకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గత పక్షం రోజులుగా కసరత్తు చేస్తోంది. వివాహం చేసుకోని మహిళలు, వివాహమైనప్పటికీ నాలుగేళ్లుగా విడిగా ఉంటున్నవారు, విడాకు లు తీసుకున్న మహిళలు, జోగినులను ఒంటరి మహిళలుగా పరిగణించాలని అధికా రులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆయా కేటగిరీల మహిళలకు కనీస వయసును 35గా నిర్ణయిస్తే మేలని ప్రభుత్వానికి సూచించారు. అయితే.. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన సమావేశంలో మరో రెండు కేటగిరీల మహిళలను ఒంటరి మహిళలుగా పరిగణించాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. అత్యాచారం, యాసిడ్దాడులకు గురైన మహిళలను కూడా దీనికింద పరిగణించాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. తదుపరి సమావేశంలో తుది నిర్ణయం సెర్ప్ ప్రతిపాదించిన విధంగా కనీస వయ సు 35గా నిర్ణయిస్తే, అంతకన్నా తక్కువ వయసున్న మహిళల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో కనీస వయో పరిమితిని 21, 30, 35 ఏళ్లుగా నిర్ణయిస్తే, ఎంతమందికి లబ్ధి చేకూర్చవచ్చనే విషయమై అంచనాలు సిద్ధం చేయాలని సెర్ప్ అధికారులకు ప్రభుత్వం సూచించినట్లు తెలిసింది. ప్రతిపాదనలలో మార్పులు చేసి, తదుపరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని సెర్ప్ అధికా రులు భావిస్తున్నారు. -
‘జీవాల ఫెడరేషన్’కు రూ.1000కోట్లు
ఖమ్మంరూరల్: గొర్రెల, మేకల పెంపకందారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50కోట్లు కేటాయించిందని రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ ఫెడరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ అన్నారు. ఆదివారం యల్లారెడ్డి ఫంక్షన్హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గొర్రెల కాపరులను కాపరులుగా కాకుండా యజమానులుగా చేసేందుకు సీఎం కేసీఆర్ 20శాతం సబ్సిడీతో రుణాలు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 14లక్షల గొర్రెల, మేకల పెంపకందారుల కుటుంబాలు ఉన్నాయని, మూడు వేల సంఘాలతో మూడు లక్షల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. భవిష్యత్లో కొత్తగా 4లక్షల మంది సభ్యులను చేర్పించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో రూ.450 కోట్లు గొర్రెల కాపరులకు రుణాలు అందించేందుకు నిధులు మంజూరైయినట్లు, మరో రూ.600 కోట్లు త్వరలో మంజూరు అవుతాయని తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రూ.50కోట్లు మంజూరయ్యాయన్నారు. సభ్యులకు రూ.లక్ష రుణం ఇస్తే అందులో 20శాతం లబ్ధిదారుని వాటా, మిగిలిన రూ.60వేలు రుణం అని చెప్పారు. గొర్రెలకు రూ.173తో ఇన్సూరెన్స్ చేయిస్తే ప్రమాదవశాత్తు మృతి చెందిన ఒక్కో గొర్రెకు రూ.5వేల బీమా సొమ్ము వస్తుందన్నారు. రాష్ట్రంలో గతంలో ఉన్న గొర్రెల, మేకల సంతలను, మాంసం విక్రయించే మార్కెట్లను ఆధునీకరించి ప్రతి 50కిలోమీటర్లకు ఒక అంగడిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో గొర్రెలు, మేకలు పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షుడు, మేకల మల్లిబాబుయాదవ్, సంఘం నాయకులు కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పాత నోట్లుంటే జైలే!
‘ఆర్డినెన్స్’కు కేంద్ర కేబినెట్ ఆమోదం ♦ పెద్ద మొత్తంలో పాత నోట్లు కలిగి ఉంటే నాలుగేళ్ల జైలు? ♦ పదికి మించి పాత నోట్లు ఉంటే రూ.పది వేలు లేదా దొరికిన మొత్తానికి ఐదింతలు.. ఏది ఎక్కువైతే అది జరిమానా ♦ జనవరి 1–మార్చి 31 తేదీల మధ్య తప్పుడుసమాచారంతో నగదు డిపాజిట్ చేస్తే రూ.5 వేలు లేదా ఆ డిపాజిట్ మొత్తానికి ఐదింతల జరిమానా ♦ రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాత అమలులోకి.. ఆ నోట్లుంటే నేరం.. మార్చి 31 తర్వాత రద్దయిన పాత నోట్లు కలిగి ఉండడం క్రిమినల్ నేరం రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు రూ.పది వేలు అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నా.. వాటిని బదిలీ చేసినా.. స్వీకరించినా శిక్షార్హం. ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్లకే అనుమతి జరిమానా.. ఈ నేరానికి పాల్పడిన వారికి రూ.10 వేలు లేదా దొరికిన మొత్తానికి ఐదింతలు ఏది ఎక్కువైతే అది జరిమానాగా విధిస్తారు. జైలు శిక్ష కూడా.. మార్చి 31 తర్వాత రద్దయిన పెద్ద నోట్లను పెద్ద మొత్తంలో కలిగి ఉన్న వారికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం? జనవరి 1 – మార్చి 31 వరకు పాత నోట్లను డిపాజిట్ చేసే సమయంలో తప్పుడు సమాచారాన్ని సమర్పించిన వారికి రూ.5 వేలు లేదా సదరు మొత్తానికి ఐదు రెట్లు జరిమానా నోట్ల డిపాజిట్ల లెక్క రూ.15.4 లక్షల కోట్ల రద్దు చేసిన నోట్లలో ఇప్పటి వరకు బ్యాంకులు, పోస్టాఫీసులకు చేరింది.. రూ. 14 లక్షల కోట్లు న్యూఢిల్లీ: పాత రూ.500, రూ.1,000 నోట్లను డిపాజిట్ చేసేందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. మార్చి 31 తర్వాత రద్దయిన నోట్లు కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రూపొందించిన ఈ ఆర్డినెన్స్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు రూ.పది వేలు అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నా.. వాటిని బదిలీ చేసినా.. స్వీకరించినా శిక్ష విధించదగ్గ నేరంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్లను మాత్రమే అనుమతిస్తారు. పెద్ద నోట్లు ఉంటే భారీగా జరిమానా.. మార్చి 31 తర్వాత రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లు పెద్ద మొత్తంలో కలిగి ఉండటాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి పాల్పడిన వారికి రూ.10 వేలు లేదా దొరికిన మొత్తానికి ఐదింతలు ఏది ఎక్కువైతే అది జరిమానాగా విధిస్తారు. అలాగే జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య పాత నోట్లను డిపాజిట్ చేసే సమయంలో తప్పుడు సమాచారాన్ని సమర్పించిన వారికి రూ.5 వేలు లేదా సంబంధిత మొత్తానికి ఐదు రెట్లు జరిమానా విధిస్తారు. అయితే పెద్ద నోట్లను కలిగి ఉండటం నేరంగా పరిగణించడం డిసెంబర్ 30 తర్వాతా లేదా మార్చి 31 తర్వాతా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. పెద్దనోట్లను డిపాజిట్ చేసేందుకు డిసెంబర్ 30 వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే. అలాగే కొన్ని నిర్దిష్ట రిజర్వ్బ్యాంకు కార్యాలయాల్లో నిర్దేశిత పత్రాలను సమర్పిం చి మార్చి 31 వరకు నగదు డిపాజిట్ చేసేం దుకు అవకాశం ఇచ్చిన విషయం విదితమే. విదేశాల్లో ఉన్న వారికి.. మారు మూల ప్రాంతాల్లో పనిచేసే భద్రతా బలగాల్లో పని చేసే వారికి.. సరైన కారణం చూపించే ఇతరు లకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తోంది. నాలుగేళ్ల జైలు శిక్ష!: మార్చి 31 తర్వాత పెద్ద మొత్తంలో రద్దయిన పెద్ద నోట్లను కలిగి ఉన్న వారికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించే ప్రతిపాదన కేబినెట్ ముందుకొచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే దీనికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందా? లేదా? అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. బ్యాంకులకు తిరిగి చేరని రద్దయిన నోట్లను రప్పించడానికి చట్టబద్ధమైన మద్దతును అందించేందుకు ఆర్బీఐ చట్టానికి సవరణలు చేయడానికి తాజా ఆర్డినెన్స్ ఉపకరించనుంది. అలాగే నోట్ల రద్దుకు సంబంధించి నవంబర్ 8న జారీ చేసిన నోటిఫికేషన్ సరిపోదని, ఆర్బీఐకి జవాబుదారీతనం కల్పించేందుకు.. భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు ఈ ఆర్డినెన్స్ సహకరించనుంది. ఈ ఆర్డినెన్స్ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపనుంది. ఆయన ఆమోదం లభించిన తర్వాత ఇది అమలులోకి వస్తుంది. ఆర్డినెన్స్కు ఆమోదం లభించిన తర్వాత ఆరు నెలల కాలంలో పార్లమెంట్ దీనిని చట్టంగా ఆమోదించాల్సి ఉంటుంది. 1978లో అప్పటి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం రూ.1,000, రూ.5,000/10,000 నోట్లను రద్దు చేసినప్పు డు కూడా ఇలాంటి ఆర్డినెన్స్నే తెచ్చారు. తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో ‘ప్రధాన మంత్రి గ్రామీణ రోడ్ల పథకం’కింద రూ.11,724.53 కోట్ల వ్యయంతో 5,400 కి.మీ రోడ్లు, 126 చిన్న వంతెనల నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.7034.72 కోట్లను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఆర్థిక శాఖ కేటాయిస్తుంది. రుణాల చెల్లింపునకు మరో 30 రోజుల గడువు ముంబై: పెద్ద నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మరికొంత వెసులుబాటు ఇచ్చింది. రుణాలు తిరిగి చెల్లించేం దుకు ఇప్పటికే 60 రోజుల అదనపు గడువు ఇచ్చిన ఆర్బీఐ తాజాగా దానిని మరో 30 రోజులు పొడిగించి 90 రోజులు చేసింది. రూ.కోటి లోపు విలువైన, నవంబరు 1 నుంచి డిసెంబరు 31 మధ్యన తిరిగి చెల్లించాల్సి ఉన్న పంట, గృహ, వాహన తదితర రుణాలకు ఇది వర్తిస్తుంది. నోట్ల రద్దు వల్ల అనేక మంది వ్యాపారులు, ప్రజలు తమకు రావాల్సిన నగదును పొందలేకపోయారు. బ్యాంకు ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగిపోవడంతో చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్ల వంటి లావాదేవీలు కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో అదనపు గడువిచ్చారు. -
కేరళలో ‘కొబ్బరి’ రోడ్లు!
రోడ్ల నిర్మాణంలో కొబ్బరి ఉత్పత్తులు కొబ్బరి పట్టాలతో మట్టి కట్టలు కాసులు కురిపిస్తున్న వైనం ఏకంగా రూ.1,500 కోట్ల ఎగుమతులు రెండేళ్లలో రెట్టింపు చేసే ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: కేరళ. ఈ పేరు వింటూనే టక్కున గుర్తొచ్చేది కొబ్బరి. ఎటు చూసినా దట్టంగా కొబ్బరిచెట్లతో కళకళలాడుతూ ఉంటుందా రాష్ట్రం. కొబ్బరితో పసందైన వంటలకు పెట్టింది పేరైన కేరళ ఇప్పుడు దాన్ని భారీగా ఆదాయం సమకూర్చి పెట్టే పరిశ్రమగా కూడా మార్చుకుంటోంది. అందులో భాగంగా ఏకంగా రోడ్ల నిర్మాణంలో కూడా ‘కొబ్బరి’ని వాడుతోంది! కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది వాస్తవమే. కొబ్బరి ఉత్పత్తులను రోడ్ల నిర్మాణంలో విరివిగా వాడుతోంది కేరళ ప్రభుత్వం. ఎంతగా అంటే, వాటిని విదేశాలకూ ఎగుమతి చేస్తూ భారీగా ఆదాయం పొందేంతగా! ప్రసుతం ఏటా దాదాపు రూ.1,500 కోట్ల విలువైన కొబ్బరి ఉత్పత్తులు రోడ్ల నిర్మాణం నిమిత్తం కేరళ నుంచి ఎగుమతి అవున్నాయి. ఈ ఆదాయాన్ని వచ్చే రెండేళ్లలో రెట్టింపు చేసే ప్రయత్నంలో ఉంది కేరళ!! ఏం చేస్తారంటే... రోడ్ల నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తారు, కాంక్రిట్ మిక్స్ మాత్రమే నాణ్యంగా ఉంటే చాలదు. రోడ్డు నిర్మాణానికి తోడ్పడే మట్టి కట్ట కూడా బలంగా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా వాన నీటికి మట్టి జారిపోయి రోడ్డు కుంగిపోవటమో, భారీ కోతకు గురవడమో జరుగుతుంది. ఈ సమస్యకు కొబ్బరినే తిరుగులేని పరిష్కారంగా మార్చుకుంది కేరళ. రోడ్డు నిర్మాణం చేపట్టినప్పుడు ముందుగా ఎత్తుగా మట్టికట్ట వేసి దాని మీద తారో, కాంక్రిట్ మిక్సో వేస్తారు. ఆ కట్ట బలహీనపడకుండా కేరళ కొబ్బరి ఉత్పత్తులు కాపుకాస్తాయన్నమాట. అదెలాగంటే... మట్టికట్ట వేసేముందే దానికి రెండువైపులా కొబ్బరి నారతో చేసిన పట్టాలను పరుస్తారు. వాటిపై వట్టి వేర్లు, ప్రత్యేక రకం గడ్డి విత్తనాలు చల్లుతారు. వాటిపై వారం పాటు నీటిని పిచికారి చేస్తారు. తర్వాత దానిపై కొన్ని మట్టి పొరలు వేసి మిగతా రోడ్డు నిర్మాణాన్ని మామూలుగానే పూర్తి చేస్తారు. తర్వాత కొద్ది రోజుల్లోనే కొబ్బరి నార పట్టాల లోపలి నుంచి వట్టి వేర్లు, గడ్డి బయటకు చొచ్చుకుని వస్తాయి. వాటి వేర్లు మాత్రం లోలోపలికి బలంగా పాకిపోతాయి. అలా మట్టికట్టకు చక్కని పటుత్వం ఏర్పడుతుంది. నాలుగేళ్లలో కొబ్బరి నార పట్టాలు జీర్ణమై మట్టిలో కలిసిపోతాయి. వేర్లు మాత్రం మరింత బలంగా మారతాయి. ఈ పరిజ్ఞానం విదేశీయులను బాగా ఆకట్టుకుంది. ఎంతగా అంటే... ప్రస్తుతం జర్మనీ, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ దేశాలకు కేరళ నుంచి భారీగా కొబ్బరి నార పట్టాలు ఎగుమతవు తున్నాయి. రోడ్డు వేసే ప్రాంతంలో ఉన్న నేల స్వభావం ఆధారంగా ఈ పట్టాల డిజైన్ కూడా పలు రకాలుగా ఉంటుంది!! ప్రస్తుతం కేరళలో ఏకంగా 90 కంపెనీలు ఈ పట్టాల తయారీలో నిమగ్నమయ్యాయి. ఇటీవల ఢిల్లీ, హర్యానా తదితర ప్రాంతాల్లో కూడా రోడ్ల నిర్మాణంలో ‘కేరళ’ పట్టాల వాడకం బాగా పెరిగింది. ఈ వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయడమే లక్ష్యంగా, ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్లో కేరళకు చెందిన ‘చరన్కట్ట కాయర్’ కంపెనీ తన ఉత్పత్తులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది.‘రోడ్ల నిర్మాణంలో మట్టికట్టలను పరిరక్షించేందుకు ప్రస్తుతం సింథటిక్ వస్తువులు అందుబాటులో ఉన్నా అవి పర్యావరణానికి హాని చేసేవి. అందుకే వాటి బదులు పర్యావరణహితమైన కొబ్బరి నార పట్టా విధానానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. మున్ముందు మా ఎగుమతులు బాగా పెరుగుతాయి. దీనికి భారత కాయర్ బోర్డు సహకారం కూడా బాగుంది’ అని చరన్కట్ట కాయర్ సంస్థ ప్రతినిధి అరుణ్ తెలిపారు. పాపం పంచాయతీరాజ్! సాధారణంగా ఎగ్జిబిషన్ స్టాల్లో ఉత్పత్తుల గురించి, తమ విజయాల గురించి తెలిపే పుస్తకాలు, ఫొటోలు ఏర్పాటు చేస్తారు. సందర్శకులకు వాటిని పంచిపెడతారు. అలాగే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్లో పంచాయితీరాజ్ శాఖ కూడా ఓ స్టాల్ ఏర్పాటు చేసింది. తెలంగాణలో పంచాయితీరాశ్ శాఖ విజయాలు, రోడ్ల నిర్మాణానికి సూచనలు, సలహాలు, అనుభవాలతో కూడిన పుస్తకాలు, బ్రోచర్లను ప్రత్యేకంగా ముద్రించింది. కానీ ప్రతిదానికీ కేవలం ఒక్కో కాపీని మాత్రమే స్టాల్లో ఉంచింది. సందర్శకులంతా తమకో కాపీ కావాలంటుండటంతో సిబ్బందికి పాలుపోవడం లేదు. ‘పై అధికారులు మాకు అదనపు పుస్తకాలు, బ్రోచర్లు ఇవ్వలేదు. డిస్ప్లే కోసం ఒక్కో ప్రతే ఇచ్చారు. దయచేసి చూసి వెళ్లండంతే’ అని బదులిస్తున్నారు. కానీ సందర్శకుల బాగా పెరగడంతో అందరికీ సమాధానం చెప్పలేక ‘పుస్తకాలు, ఇతర ప్రచురణలు కేవలం డిస్ప్లే కోసం మాత్రమే’ అని కాగితాలపై రాసి స్టాల్ చుట్టూ అంటించారు! -
‘నోట్ల’ కష్టాలకు నెల..
రూ.500, 1,000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ నవంబర్ 8న అకస్మాత్తుగా ప్రక టన చేశారు. ఆ రోజు అర్ధరాత్రి తర్వాత ఆ నోట్లేవీ చెల్లబోవంటూ షాకిచ్చారు. ఈ నిర్ణ యం అమల్లోకి వచ్చి నెల రోజులు పూర్తయింది. నల్లధనం వెలికితీత, నకిలీ కరెన్సీ కట్టడి కోసమంటూ నోట్లను రద్దు చేసినా.. సాధారణ ప్రజలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకులు, ఏటీఎంల ఎదుట గంటలకొద్ది క్యూలైన్లు. ‘నోట్ల’ సమస్య వల్ల దేశవ్యాప్తం గా వంద మందికిపైగానే ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. నవంబర్ 8 500, 1,000 నోట్లను రద్దు చేస్తున్నటు ప్రధాని ప్రకటన. ఆ రోజు అర్ధరాత్రి నుంచే ఆ నోట్లు చెల్లబోవని వెల్లడి. డిసెంబర్ 30 వరకు పాత నోట్లు మార్చుకోవడానికి అవకాశం. ‘నోట్ల’లెక్కలు తేల్చడానికి మరుసటి రోజున బ్యాంకులకు సెలవు, రెండు రోజులపాటు ఏటీఎంల మూసివేత ప్రకటన. పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, ఆసుపత్రులు, మెడికల్ షాప్లు, విమాన- రైల్వే టిక్కెట్లు, శ్మశాన వాటికలు, ప్రభుత్వ సేవలకు మూడు రోజులపాటు (11వ తేదీ వరకు) పాత నోట్లతో చెల్లింపులకు అవకాశం. బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా ఒక్కొక్కరు రోజుకు రూ.4 వేలు పాత నోట్ల మార్పిడికి అవకాశం. ఏటీఎంలలో రోజుకు రూ.2 వేలు, బ్యాంకుల్లో రోజుకు రూ.10 వేలు విత్డ్రా పరిమితులు. మొత్తంగా వారానికి రూ.20 వేలే తీసుకోగలిగేలా ఆంక్షలు. చెక్కులు, డీడీలు, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలు, ఆన్లైన్ లావాదేవీలపై పరిమితి విధించలేదు. నవంబర్ 9 బ్యాంకులు,ఏటీఎంలు పనిచేయలేదు. ప్రజల్లో ఆందోళన. బ్యాం కుల్లో నగదు మార్పిడి కోసం ఏదైనా గుర్తింపుకార్డు ప్రతి సమ ర్పించాలంటూ నిబంధనలు. 11వ తేదీ అర్ధరాత్రి వరకూ టోల్ వసూలు నిలిపివేత. రూ.2.5 లక్షలు దాటిన, లెక్కలు చూపని డిపాజిట్లపై పన్ను, జరిమానా వసూలు చేస్తామని ప్రకటన. నవంబర్ 10 కష్టాలు షురూ. డిపాజిట్లు, నగదు మార్పిడి కోసం బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు. కొత్త రూ.2 వేల నోట్లు జనంలోకి వచ్చాయి. ఏటీఎంల మూత. నవంబర్ 11 తొలిసారిగా తెరుచుకున్న ఏటీఎంలు. భారీ క్యూలైన్లు. కొత్త రూ.2 వేల నోట్లకు అనుగుణంగా ఏటీఎంలు లేకపోవడంతో.. అన్నీ వంద నోట్లే నింపిన అధికారులు. కొంత సేపటికే ఖాళీ. ప్రజలకు ఇబ్బందులు. పలు రంగాల్లో పాత నోట్ల వినియోగానికి ఇచ్చిన అవకాశాన్ని, టోల్ వసూలు నిలిపివేతను నవంబర్ 14 అర్ధరాత్రి వరకూ పొడిగిస్తూ నిర్ణయం. నవంబర్ 12 బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల వద్ద జనం అవస్థలు. నల్లధనం నియంత్రణకు మరిన్ని చర్యలుంటాయన్న ప్రధాని. నవంబర్ 13 ఆదివారం పనిచేసిన బ్యాంకులు. పెరిగిన క్యూలైన్లు. ఏటీఎం, బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో జనంలో ఆగ్రహావేశాలు. నగదు మార్పిడి పరిమితి రూ.4,500కు, ఏటీఎంల నుంచి విత్డ్రా పరిమితి రూ.2,500కు, బ్యాంకుల్లో రోజుకు రూ.10వేల విత్డ్రా పరిమితిని ఎత్తివేస్తూ... వారానికి విత్డ్రా పరిమితి రూ.24,000కు పెంపు. కొత్త రూ.500 నోట్లు మార్కెట్లోకి. నవంబర్ 14 పెట్రోల్ బంకులు, ప్రభుత్వ సేవలు సహా పలు రంగాల్లో పాత నోట్లతో చెల్లింపులను నవంబర్ 24 వరకు పొడిగిస్తూ నిర్ణయం. కరెంట్ ఖాతాల నుంచి విత్డ్రా పరిమితి వారానికి రూ.50 వేలకు పెంపు. గురునానక్ జయంతి సందర్భంగా మూసి ఉన్న బ్యాంకులు. ఏటీఎంల వద్ద క్యూలైన్లు. పలు చోట్ల ఆందోళనలు వ్యక్తం చేసిన ప్రజలు ఠి ఏటీఎం ట్రాన్సాక్షన్ చార్జీలను డిసెంబర్ 30వ తేదీ వరకూ ఎత్తివేస్తూ నిర్ణయం. నవంబర్ 15 కొనసాగిన క్యూలైన్లు. తొలి వారంలో ఏకంగా రూ.1,14,139 కోట్లు డిపాజిట్లు వచ్చినట్లు ఎస్బీఐ ప్రకటన. నవంబర్ 17 నగదుమార్పిడి పరిమితి రూ.2,000కు కుదింపు. వివాహాల కోసం రూ.2.5 లక్షల వరకు విత్డ్రా చేసుకోవచ్చంటూ ప్రకటన. రైతులకు విత్డ్రా పరిమితి వారానికి రూ.50 వేలకు పెంపు. టోల్ వసూళ్ల నిలిపివేతను నవంబర్ 24 వరకు పొడిగిస్తూ నిర్ణయం. ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో డెబిట్ కార్డుల ద్వారా రూ.2 వేల వరకు తీసుకునే అవకాశం. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఒకశాతం తగ్గించిన పలు బ్యాంకులు నవంబర్ 18 ‘నోట్ల రద్దు’తో 55 మంది మరణించారంటూ పార్లమెంటులో విపక్షాల గొడవ. ఢిల్లీలో ఆందోళనలు. నవంబర్ 22 బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పాత నోట్ల మార్పిడి నిలిపివేత. డిపాజిట్లకే అవకాశం. టోల్ వసూళ్ల నిలిపివేతను డిసెంబర్ 2 అర్ధరాత్రి వరకూ పొడిగిస్తూ ప్రకటన. పలు రంగాల్లో పాత నోట్లతో చెల్లింపులు డిసెంబర్ 15 వరకు పొడిగింపు. నవంబర్ 25 రిజర్వుబ్యాంకు శాఖల్లో మాత్రం నోట్ల మార్పిడి కొనసాగిస్తూ ప్రకటన. అటు జన్ధన్ ఖాతాల్లోకి కేవలం 14 రోజుల్లో రూ.27,200 కోట్లు డిపాజిట్ అయినట్లు 26న కేంద్రం వెల్లడి నవంబర్ 28 మూడు వారాల్లో రూ.8.45 లక్షల కోట్లు పాత నోట్లు డిపాజిట్ అరుునట్లు ఆర్బీఐ ప్రకటన. కొనసాగిన క్యూలైన్లు. నవంబర్ 30 జన్ధన్ ఖాతాల్లోంచి నెలకు రూ.10 వేల విత్డ్రా పరిమితి విధించిన ఆర్బీఐ. డిసెంబర్ 1 తార స్థాయికి కష్టాలు. వేతనాలు తీసుకోవడానికి ఉద్యోగులకు ఇబ్బందులు. ఒక్కొక్కరికి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకే ఇచ్చిన బ్యాంకులు. పెట్రోల్ బంకులు, విమాన టికెట్లు వంటి వాటిలో పాత నోట్ల చెల్లుబాటు గడువును 2వ తేదీ అర్ధరాత్రి వరకు కుదింపు (తొలుత డిసెంబర్ 15 వరకు గడువిచ్చారు). డిసెంబర్ 6 నోట్ల రద్దు’ తర్వాత రూ.2 వేల కోట్ల లెక్కల్లో చూపని ధనాన్ని వెల్లడించినట్లు ఆదాయ పన్ను శాఖ ప్రకటన. తమ దాడుల్లో రూ. 130 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు గుర్తించినట్లు వెల్లడి. డిసెంబర్ 7 బ్యాంకుల్లోకి రూ.11.55 లక్షల కోట్లు డిపాజిట్ అయినట్లు ప్రకటించిన రిజర్వు బ్యాంకు. డిసెంబర్ 8 ‘నోట్ల’ ఇబ్బందులను తట్టుకునేందుకు నగదు రహిత లావా దేవీలను ప్రోత్సహిస్తూ పలు ఉపశమన చర్యల ప్రకటన -
నోట్ల రద్దుకు ప్రజామోదం..
ఈ నిర్ణయం జనశక్తి ప్రాముఖ్యతను తెలియజేసింది ప్రతిపక్షాలకు చర్చలో పాల్గొనే ఉద్దేశం లేదు పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: పాత రూ.500, రూ.1,000 నోట్ల రద్దుకు ప్రజలంతా మద్దతిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం.. ‘జనశక్తి’ ప్రాముఖ్యతను తెలియజెప్పిందని అన్నారు. ఢిల్లీలో బుధవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెం ట్లో నోట్ల రద్దుపై చర్చ జరగాలని విపక్షాలు భావించడం లేదని, రాజ్యసభలో ఈ విషయం స్పష్టమవుతోందని ఆరోపించారు. తాను రెండుసార్లు రాజ్యసభకు హాజరైనా చర్చకు వారు అంగీకరించలేదని విమర్శించారు. గత ప్రభుత్వాలు తీసుకున్న అనేక నిర్ణయాలు ఘర్షణలకు, ఉద్రిక్తతలకు దారి తీశాయని, అయినా వాటిపై పార్లమెంట్లో చర్చ నడిచిం దన్నారు. అయితే ఇప్పుడు అత్యంత కీలకమైన నోట్ల రద్దు నిర్ణయంపై చర్చకు మాత్రం ప్రతిపక్షాలు అంగీకరించడం లేదని అన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేయాలి పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. నగదు రహిత లావాదేవీలు, డిజిటల్ ఎకానమీలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రధాని మోదీ ఎంపీలకు సూచించారని చెప్పారు. ఓట్ల నమోదు, ఈవీఎంల వినియోగంపై ప్రజలకు ఎలా అవగాహన కల్పిస్తామో అదే విధంగా దీనిపై వారిలో చైతన్యం తీసుకురావాలని సూచించారన్నారు. పార్టీలకతీతంగా అందరు ఎంపీలు ఇందులో భాగస్వాములు కావాలని మోదీ కోరారని అనంత్కుమార్ చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రజలు నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ‘రాజ్యశక్తి’ కంటే ‘జనశక్తి’కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, ప్రస్తుతం తమ ప్రభుత్వం దీని ప్రాముఖ్యతను తెలియజెప్పిందన్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు నోట్ల రద్దుపై చర్చ జరగాలనే ఉద్దేశం లేదని, అందువల్ల దీనిపై ప్రజల్లో చైతన్యం తెచ్చేలా పార్టీ సభ్యులు నడుచు కోవాలని సూచించారని చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏ పార్టీ డిమాండ్ చేయలేదని, అందువల్ల విపక్షాలు చర్చలో పాల్గొని విలువైన సలహాలు అందజేయాలని మోదీ సూచించారన్నారు. -
7రోజుల్లో రూ.1,487 కోట్లు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి జన్ ధన్ యోజన్ ఖాతాల్లో నగదు డిపాజిట్ల వర్ద క్రమంగా తగ్గుముఖంపడుతోంది. ముఖ్యంగా గత వారం రోజుల కాలంలో స్పల్పంగా తగ్గింది. ఏడు రోజుల్లో సుమారు రూ.1,487కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఇది నవంబరు 30 నాటికి వీటి విలువ 8,283కోట్లు డిపాజిట్ కాగా ఈ వారంలో డిపాజిట్ల విలువ క్రమంగా తగ్గుముఖం పట్టినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం నవంబరు 30నాటికి 25.85 కోట్ల ఖాతాల్లోరూ. 74,321.55కోట్లు నమోదయ్యాయి. నవంబరు 23 నాటికి 25.68 కోట్ల ఖాతాల్లో మొత్తం విలువ రూ.72,834.72 కోట్లు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నవంబరు 9 నాటికి సుమారు రూ.45,637 కోట్ల డిపాజిట్లు పెరిగాయి. కాగా 2014 ఆగస్టులో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన్ పథకాన్ని ప్రారంభించారు. జన్ ధన్ ఖాతాల్లో గరిష్ట డిపాజిట్ పరిమితి 50 వేలుగా నిర్ణయించారు. అయితే డీమానిటైజేషన్ తర్వాత విత్ డ్రా పరిమితిని 10 వేలకు కుదించిన సంగతి తెలిసిందే. -
ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి
నల్లగొండ : భారత ప్రభుత్వం ఇటీవల రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసినందున ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సలో నోట్ల రద్దు వల్ల ఆయా జిల్లాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ప్రజలు నోట్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు తగ్గించి ఆన్లైన్, స్మార్ట్ఫోన్, స్వైప్ మిషన్స ద్వారా జరిపే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. డిజిటల్ అక్షరాస్యతను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ, సహకార సంఘాలు, మార్కెట్యార్డులు, ఎరువులు, విత్తనాల విక్రయ కేంద్రాలు, మెడికల్షాపులు, పెట్రోల్బంకులు, గ్యాస్ డీలర్లు వంటి ప్రజా వినియోగ ఆర్థిక లావాదేవీలను నగదు రూపంలో కాకుండా డెబిట్కార్డుల ద్వారా నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో 204 ఏటీఎంల ద్వారా ప్రజలకు సేవలు అందించడానికి సుమారు వంద కోట్లు అవసరముంటుందన్నారు. ప్రస్తుతం 128 ఏటీఎంలలో రూ.100 నోట్లను ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో నగదు రహిత (క్యాష్లెస్) లావాదేవీలను జరిపేందుకు పెద్ద వ్యాపార సంఘాలు, పెట్రోల్ బంకు యజమానుల నుంచి స్వైప్మిషన్ల కోసం 179 దరఖాస్తులు వచ్చాయన్నారు. అదే విధంగా నూతన ఖాతాలు తెరిచేందుకు 861 అప్లికేషన్లను వివిధ బ్యాంకుల ద్వారా పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వి.రామకృష్ణారావు, లీడ్బ్యాంకు మేనేజర్ సూర్యం, డీఆర్వో అంజయ్య, అటవీశాఖాధికారి శాంతారామ్, బ్యాం కు అధికారులు పాల్గొన్నారు. -
వేలూరు, తిరువణ్ణామలైలో డీఎంకే ధర్నా
వేలూరు: పెద్ద నోట్లు చెల్లవని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో డీఎంకే ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకోలు నిర్వహించారు. రూ.500, రూ.1000 నోట్లు చెల్లవని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వంపై నిరసనగా డీఎంకే, కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు. అందులో భాగంగా వేలూరు ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట డీఎంకే ఎమ్మెల్యేలు నందకుమార్, కార్తికేయన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద నోట్లు చెల్లవని రాత్రికి రాత్రి ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా అనంతరం చెన్నైలో నిర్వహించిన ధర్నాలో ముకా స్టాలిన్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని తెలుసుకున్న కార్యకర్తలు అన్నారోడ్డులో అడ్డంగా కూర్చొని రాస్తారోకో చేశారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్న తమను పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదని నినాదాలు చేశారు. పోలీసులు ఎంత చెప్పినప్పటికీ రాస్తారోకోను విరమించక పోవడంతో పోలీసులు చేసేది లేక రాస్తారోకోలో పాల్గొన్న ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అదే విధంగా తిరుపత్తూరు,రాణిపేట, గుడియాత్తం వంటి ప్రాంతాల్లో రాస్తారోకో చేసిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువణ్ణామలైలో... తిరువణ్ణామలై జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద డీఎంకే జిల్లా కార్యదర్శి, మాజీ మంత్రి ఏవా వేలు అద్యక్షతన ధర్నా నిర్వహించారు. పెద్ద నోట్లు చెల్లవని ఈ నెల 8వ తేదిన ప్రధాని మోదీ ప్రకటించినప్పటి నుంచి దేశంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే పిచ్చాండి, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
రూ.వెయ్యికి వీడ్కోలు
► చెలామణికి ముగిసిన గడువు ►బ్యాంకుల్లో నోట్ల మార్పిడికీ స్వస్తి ► డిపాజిట్ చేయూల్సిందే.. ►రూ.500 చెలామణికి పరిమితులు ► బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రూ.కోట్లలో డిపాజిట్లు ఆదిలాబాద్ అర్బన్ : రూ.1000 నోట్లకు కాలం చెల్లింది. గురువారం నాటితో ఆ కరెన్సీ చెలామణి గడువు ముగిసింది. రూ.500 నోట్లు పరిమితులతో కూడిన చెలామణికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గురువారం వరకు ప్రభుత్వ రంగ సంస్థలు, కరెంటు బిల్లు, పన్నులు, పెట్రోల్ బంకులు, ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్వే, బస్ టికెట్ల బుకింగ్ కోసం రూ.500, రూ.1000 నోట్ల చెలామణికి అవకాశం కల్పించారు. ఇక ఆ గడువు ముగిసిపోవడంతో గురువారం ముగియడంతో కేంద్ర ప్రభుత్వం రూ.500 నోట్ల చెలామణిని డిసెంబర్ 15వరకు పొడిగించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు, కరెంటు, నీటి బిల్లులు, రూ.500 లోపు మొబైల్ రీచార్జీకి చెల్లుబాటు అవుతుంది. డిసెంబర్ 2వ తేదీ వరకు టోల్ట్యాక్స్కు మినహాయింపు ఇచ్చారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రూ.500 నోట్లు టోల్ప్లాజాల్లో చెల్లుబాటు అవుతాయి. ఒక్కసారి రూ.5వేల విలువైన వస్తువులను వినియోగదారులు సహకార స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు. బ్యాంకుల్లో నోట్ల మార్పిడికీ అవకాశం లేదని ఆర్బీఐ ప్రకటించింది. ఇక రూ.వెరుు్య నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేయూల్సిందే. డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లో డిపాజిట్కు ఆయూ నోట్లను స్వీకరిస్తారు. పెద్ద నోట్ల రద్దుతో పన్నులు, మొండి బకాయిల వసూలుకు గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలు, విద్యుత్ సంస్థల పంట పండింది. భారీ మొత్తంలో పన్నులు, బకారుులు వసూలయ్యూరుు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రూ.కోట్లలో డిపాజిట్లు వచ్చి చేరాయి. మున్సిపాలిటీలు, పంచాయతీలకు నిధుల వరద మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ పరిధిలో వివిధ రకాల పన్నుల వసూలకు పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కలిసొచ్చింది. ఏళ్లు గడిచినా వసూలు కాని చెల్లింపులు కేవలం 15 రోజుల్లో రూ.2.80 కోట్లు వసూలైనట్లు అధికారులు తెలిపారు. రద్దు తర్వాత 30 శాతం మేర పన్ను వసూలైంది. పంచాయతీల్లో పన్ను వసూళ్లు రూ.3.50 కోట్లు ఉండగా, నోట్ల రద్దుకు ముందు రూ.60 లక్షలు వసూలు చేయగా, జిల్లా వ్యాప్తంగా రద్దు నుంచి ఇప్పటి వరకు రూ.35 లక్షలు వసూలు అయ్యాయి. నోట్ల రద్దు వ్యవహారంతో ప్రజలు పన్ను చెల్లించేందుకు ముందుకు రావడంతో అధికారులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దీంతో పంచాయతీలకు నిధుల వరద పారింది. పెట్రోల్ బంకులకు కాసుల గలగల పెట్రోల్ బంకుల్లో పాతనోట్ల చెల్లుబాటుతో ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.11 కోట్ల విలువైన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరిగినట్లు అంచనా. ఆదిలాబాద్ పరిధిలో మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన పెట్రోల్ బంక్లు ఉన్నాయి. ప్రతి రోజు సుమారుగా 5 నుంచి 6 లక్షల లీటర్ల పెట్రోల్, 4 నుంచి 5 లక్షల లీటర్ల డిజిల్ అమ్మకాలు సాగుతుంటాయి. పెద్ద నోట్ల రద్దుతో వాహనదారులు ట్యాంకులు నింపుకోవడంతో ఒకేసారి 30 శాతం మేర అమ్మకాలు పెరిగాయి. వీటిపై ప్రభావం.. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో జనజీవనం అతలాకుతలమైంది. చిల్లర దొరకకా, ఉన్న నోట్లు బ్యాంకుల్లో మార్చుకునేందుకు అప్పగించడంతో చిల్లిగవ్వ లేక వ్యాపారాలు స్తంభించిపోయాయి. గత నెల వరకు కాసులు కురిపించిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కార్యాలయాలు ప్రస్తుతం నోట్ల రద్దు ప్రభావంతో కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. నోట్ల రద్దు ప్రభావంతో ప్రజలు, రైతులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడగా, నిర్మాణ, వ్యాపారం, ఆబ్కారీ, రియల్ ఎస్టేట్పై తీవ్ర ప్రభావం చూపించింది. ఇరవై రోజులు గడుస్తున్నా బ్యాంకుల వద్ద నోట్లు మార్చుకునేందుకు, ఏటీఎంల వద్ద డబ్బులు తీసుకునేందుకు క్యూ కట్టక తప్పడం లేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బ్యాంకులకు వెళ్తే ఒక రోజు మొత్తం కేటాయించేయాలి. ప్రస్తుతం ఆ ప్రభావం కొద్దిగా తగ్గింది. సరిపడా నోట్లు అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం రద్దు వ్యవహారానికి ముందు సరిపడా నోట్లు అందుబాటులో ఉంచి రద్దు చేసినట్లైతే ఇంత ఇబ్బందులు ఎదురయ్యేవి కావు. ఎక్కువ డబ్బులు అవసరమున్నా రద్దు ప్రభావంతో బ్యాంకు అధికారులు ఇస్తలేరు. చేతిలో డబ్బులు లేక ఏమి చేయాలన్న తోచడం లేదు. - షేక్ ఖలీమ్, ఓ బ్యాంక్ ఖాతాదారు, ఆదిలాబాద్ ప్రభుత్వం గడువు పెంచాలి ప్రజలకు ఇంకా చిల్లర కష్టాలు తీరలేదు. చిల్లర కష్టాలు తీరిన తర్వాత పెద్ద నోట్లను తీసుకోకున్నా ఫర్వాలేదు. చిల్లర దొరకకముందే పెద్ద నోట్లను వాడుకలోంచి తీసేయడం సరికాదు. ఇంకా చాలామంది దగ్గర పాత నోట్లు కన్పిస్తున్నాయి. వీటిని సమర్పించేందుకు ప్రభుత్వం పెద్ద నోట్లు చెలామణికి గడువును పొడిగించాలి. కొత్తగా రూ.500, రూ.100 నోట్లు సరిపడా అందుబాటులోకి వచ్చాక పెద్ద నోట్ల చెలామణికి చెక్ పెట్టిన సరిపోతది. - కె.విక్కీ, పొన్నారి, తాంసి -
చేతికొచ్చేనా..?
సాక్షి, నల్లగొండ : ఒకటో తేదీకి ఎనిమిది రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల నవంబర్ నెల వేతనాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత బ్యాంకింగ్ పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకురావడంతో వేతనాలు పొందేందుకు ఎలాంటి సమస్యా లేకపోయినా, పొందిన వేతనాలను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి నెలా ఒకటో తేదీన వచ్చే వేతనాల కోసం 10 రోజుల ముందు నుంచే ప్రణాళికలు వేసుకుని ఉండే ఉద్యోగులు వేతనాలు వచ్చిన 10 రోజుల్లోనే తమ అవసరాల కోసం ఆ వేతనాన్ని ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది. కానీ, ఈ క్రమంలో ప్రస్తుతమున్న నిబంధనల కారణంగా తాము ఇబ్బంది పడాల్సి వస్తుందనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది, పింఛన్దారులు కలిసి కనీసం లక్ష మందికి పైగా ఉంటారని అంచనా. ఈ ఉద్యోగుల పరిస్థితి ఒకటో తేదీ తర్వాతేంటనే దానిపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కానీ స్పష్టత నివ్వకపోవడం మరింత గందరగోళానికి దారి తీస్తోంది. రోజుకు రూ. 2వేలేనా? జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో నాలుగో తర గతి ఉద్యోగుల నుంచి శాఖాధిపతుల వరకు 35 వేల వరకు ఉద్యోగులున్నారు. వీరితో పాటు ఆరువేల మందికి పైగా టీచర్లు కూడా ఉన్నారు. పోస్టల్, బీఎస్ఎన్ఎల్, ఎఫ్సీఐ, ఎల్ఐసీ తదితర సంస్థల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 5 వేల వరకు ఉంటారు. లెక్చరర్లు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో, ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారు, పింఛన్దారులు కలిపి మొత్తం లక్ష మంది వరకు ఉంటారు. వీరే కాకుండా వివిధ ప్రైవేటు సంస్థలు, అన్ని రకాల దుకాణాల్లో పనిచేస్తున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. వీరంతా ప్రతి నెల ఒకటి నుంచి పదో తేదీ లోపు వేతనాలను తీసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులక యితే ఠంచన్గా ఒకటో తేదీన జీతం వస్తుంది. అయితే, జీతం పొందే విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి అనుమానం లేకపోయినా, పొందిన వేతనాన్ని తమ అవసరాలకు ఎలా వినియోగించుకోవాలన్నదే సమస్యగా మారింది. బ్యాంకుల్లో గంటల తరబడి ఉన్నా.. ఏటీఎంల వద్ద క్యూలలో పడిగాపులు కాసినా రోజుకు రూ.2 వేల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేకపోవడంతో నెలసరి ఖర్చులెలా అన్నది ఇప్పుడు ఉద్యోగులకు పెద్ద ప్రశ్నగా మారింది. ఇంటి కిరాయిలు, పాలు, కిరాణా దుకాణం ఖర్చులు, చిట్టీలు, పిల్లల ఖర్చులు... ఇలా అన్ని రకాల అవసరాల కోసం 5-10 తేదీల్లోపే చెల్లింపులు చేయాల్సి ఉంటుందని, రోజుకు రూ.2 వేల చొప్పున ఇస్తే వీటికి ఎప్పటికి చెల్లింపులు చేయాల్సి ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సామాన్య ప్రజల్లాగా గంటల తరబడి ఏటీఎంల వద్ద ఉండే అవకాశం కూడా తమకు లేదని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తమకు వెసులుబాటు కల్పించకపోతే సాధారణ జీవనానికి ఇబ్బందులు తప్పవనే చర్చ ఉద్యోగ వర్గాల్లో జరుగుతోంది. అయితే, ఈ వెసులు బాట్ల విషయంలో ఎలాంటి స్పష్టత లేకపోవడం, ఒకటో తేదీ సమీపిస్తుండడం మరింత సమస్యగా మారుతోంది. బ్యాంకుల్లోనే? వాస్తవానికి, ప్రస్తుత పరిస్థితులు సర్దుమణిగేంత వరకు తమ నగదు రూపంలో వేతనాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే పరిమితులతో పాటు, ఉద్యోగుల వేతనాల నుంచి కొన్ని రకాల మినహాయింపులు చేసుకుని మిగిలిన జీతం చెల్లించాల్సి ఉండడం, నగదు రూపంలో ఇవ్వాలంటే ప్రతి ఒక్కరి దగ్గరా సంతకాలు తీసుకోవాల్సి రావడం సమస్యగా మారింది. దీనికి తోడు బ్యాంకర్లు కూడా అంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వానికి ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఎప్పటిలాగే బ్యాంకుల్లోనే నవంబర్ నెల వేతనాలు జమవుతాయని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. అయితే, నవంబర్ నెల వేతనంలో రూ.10 వేలను ప్రతి ఉద్యోగికి అడ్వాన్స్గా ఇస్తారని, లేదంటే సగం జీతం నగదు రూపంలో ఇస్తారని మొదట్లో చర్చ జరిగినా అది సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో జమ అయిన వేతనాలను తమకు ఇచ్చే విషయంలో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ముఖ్యంగా తమ వేతనాల ఉపసంహరణ కోసం బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలనేది వారి ప్రధాన డిమాండ్గా కనిపిస్తోంది. దీంతో పాటు బ్యాంకులు, ఏటీఎంల నుంచి ఉపసంహరణ చేసుకునే పరిమితిని కూడా పెంచాలని వారు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో.. బ్యాంకర్లు ఏ విధంగా సహకరిస్తారో వేచి చూడాల్సిందే. నగదు ఇస్తేనే బాగుంటుంది.. పెద్ద నోట్ల రద్దు ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం నల్ల ధనాన్ని అరికట్టే విషయంలో మంచిదే అనుకున్నా.. ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఇక, ఉద్యోగుల పరిస్థితి సామాన్య ప్రజల కంటే భిన్నమైనది. ఉద్యోగులకు ఈనెల వేతనాలు నగదు ఇస్తేనే బాగుంటుంది. ఈ మేరకు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాం. మంగళ, బుధ వారాల్లో స్పష్టత వస్తుంది. - పందిరి వెంకటేశ్వరమూర్తి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఎవర్నీ ఇబ్బంది పెట్టవద్దు. జిల్లాలో 6 వేలకు మందికి పైగా టీచర్లున్నారు. వీరికి నెలసరి వేతనాలే జీవనాధారం. ఈ పరిస్థితుల్లో వేతనాలు డ్రా చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు బ్యాంకుల్లో జమ చేస్తే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలి. ఉపసంహరణ పరిమితిని పెంచాలి. మాతో పాటు సామాన్య ప్రజలకు కూడా కౌంటర్లు పెంచాలి. ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు. - పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, -
అప్పుతో ఆపరేషన్లు..!
రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో రోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అప్పుతో శస్త్ర చికిత్సలు నిర్వహించడానికి బళ్లారిలోని అరుణోదయ ఆస్పత్రి ముందుకు వచ్చింది. అప్పుతో శస్త్ర చికిత్సలు, మోకాలి చిప్పలను మార్పిడి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అరుణోదయ ఆస్పత్రి మేనేజింగ్ డెరైక్టర్, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సతీష్ కందుల పేర్కొన్నారు. సోమవారం ఆయన నగరంలోని రాయల్ ఫోర్ట్లో విలేకరులతో మాట్లాడారు. పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల అత్యవసరంగా చికిత్సలు చేయించుకునేందుకు పలువురు రోగులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో తమ పరిధిలో చేసే ఆర్థోపెడిక్ సంబంధిత శస్త్రచికిత్సలు మూడు నెలల పాటు రోగులకు అప్పుగా చేస్తున్నట్లు చెప్పారు. రోగికి అత్యవసరంగా మోకాలి చిప్పల మార్పిడి లేదా ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆర్థోపెడిక్ శస్త్ర చికిత్సలను కూడా అప్పుతో చేయనున్నట్లు తెలిపారు. దీని కోసం రోగులు ఆధార్ కార్డు అందజేస్తే చాలని, ఎలాంటి పూచీకత్తు లేకుండా అప్పుగా ఆపరేషన్లు చేస్తామని పేర్కొన్నారు. - సాక్షి, బళ్లారి -
అక్కడ ఫెడ్ భయం... ఇక్కడ నోట్ల రద్దు నీరసం!
ముంబై/న్యూయార్క్: సమీప కాలంలో పసిడి అడుగులు తడబాటేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే... అమెరికా ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.25-0.50 శాతం శ్రేణి) పెంపు భయాలు ఒకవైపు... దేశీయంగా రూ.500, రూ.1,000 నోట్ల రద్దు ప్రభావం పసిడి బలహీనతకు కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి . డిసెంబర్ 13-14 తేదీల్లో వాషింగ్టన్లో జరగనున్న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం రేట్ల పెంపు నిర్ణయం తీసుకుంటుందన్న అంచనాలు వినబడుతున్నాయి ఈ పరిణామం పసిడి గమనానికి ఒక దిశా నిర్దేశం చేస్తుందన్న వాదనలు ఉన్నాయిఇక దేశీయంగా చూస్తే... పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా డిమాండ్ ఉన్నప్పటికీ, పెద్ద నోట్ల రద్దు ప్రభావం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయిపలు ఆంక్షలు, ఐటీ దాడుల నేపథ్యంలో ఈ వారంలో అసలు ఢిల్లీ, ముంబైలలో బంగారం షాపులు అసలు తెరవకపోవడం గమనార్హం. ధరల జారుడు...: శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి ధరలు భారీగా పడిపోయాయిఅంతర్జాతీయంగా ఔన్స (31.1గ్రా) ధర దాదాపు 17 డాలర్లు పడిపోకయి 1,207 డాలర్ల వద్ద ముగిసింది. దేశీయంగానూ ఇదే పరిస్థితి. ముంబై స్పాట్ మార్కెట్లో ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.1,205 తగ్గి రూ.29,310కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర సైతం ఇదే స్థాయిపడిపోయి.29,160 వద్ద ముగిసింది. ఇక వెండి కేజీ ధర రూ.3,655 పడిపోయి.41,765 వద్దకు చేరింది. -
ఆర్దిక ప్రణాళికను మార్చండి
పొదుపు, మదుపునకు అవకాశం భవిష్యత్తులో ఈక్విటీల్లోకి అధిక నిధులు నల్లధనంపై చర్యలతో బంగారం, రియల్టీలో తగ్గనున్న డిమాండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్తో క్లిష్ట సమయాలను ఎదుర్కోవడం ఈజీ ఊహించని సందర్భాలు జీవితంలో ఎదురవుతుండడం సర్వ సాధారణం. ప్రస్తుత నోట్ల రద్దు కూడా ఇటువంటిదే. సరైన ఆర్థిక ప్రణాళిక ఉంటే సందర్భం ఎలాంటిది అయినా నిర్భయంగా, ధైర్యంగా... తొణకకుండా, బెణకకుండా ఉండవచ్చు. అంతేకాదు... మదుపరి తన ఆలోచనకు పదును పెడితే ఇలాంటి సందర్భాలను ఇన్వెస్ట్మెంట్కు అనువుగా మలుచుకోవచ్చు. ఇందుకు ఏం చేయాలన్నది చూద్దాం... పొదుపు దిశగా.... ఈ నెల 8వ తేదీ రాత్రి ప్రధానమంత్రి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ అవి చెల్లుబాటు కావని, బ్యాంకుల్లో మార్చుకోవాలని లేదా ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాలని సూచించారు. మరుసటి రోజు బ్యాంకులకు సెలవు. ఏటీఎంలు పనిచేయలేదు. ఆ తర్వాత కూడా ఎక్కువ శాతం ఏటీఎంలలో నగదు అందుబాటులోకి రాలేదు. దీంతో చేతిలో డబ్బుల్లేక, ఉన్న డబ్బులకు విలువ లేక ప్రతి ఒక్కరూ తమ ఖర్చులకు చెక్ పెట్టేశారు. ప్రతి రూపాయి ఖర్చుకూ లెక్కలేయడం ప్రారంభించారు. ఖర్చులను ఎలా తగ్గించుకోవచ్చో తాజా సందర్భం ప్రతీ ఒక్కరికీ నేర్పించింది. దీన్నే నిత్య జీవితంలో ఆచరణగా మార్చుకుంటే... పొదుపరులుగా మారిపోతారు. ఆ పొదుపును మంచి రాబడులను ఇచ్చే పథకాల్లోకి మళ్లించినట్లయితే చక్కటి ఫలితం ఉంటుంది. కంటింజెన్సీ ప్లాన్ అత్యవసరమైతే గట్టెక్కేందుకు సరిపడా నగదు ప్రతి ఒక్కరి వద్దా అందుబాటులో ఉండాలి. అనుకోని అవాంతరం వచ్చి నగదు ప్రవాహం ఆగిపోతే... అత్యవసరంగా నగదుతో అవసరం ఏర్పడితే... గట్టెక్కేందుకు సిద్ధంగా ఓ ఫండ్ ఉండాలి. కనీసం ఆరు నెలల అవసరాలకు సరిపడా మొత్తాన్ని తక్షణమే నగదుగా మార్చుకునే సాధనాల్లో పెట్టుబడి పెట్టుకోవాలని నిపుణుల సలహా. ఇందుకోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స అందించే లిక్విడ్ ఫండ్స అనువుగా ఉంటాయని వారు సూచిస్తున్నారు. మిక్స్డ్గా ఉండాలి ప్రతీ ఒక్కరి పోర్ట్ఫోలియో ఫిజికల్, ఫైనాన్స అసెట్స్ కలబోతగా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఊహించని సందర్భాల్లో రాబడులను కోల్పోకుండా సరైన ఆసరాగా ఉంటుంది. ఉదాహరణకు రియల్ ఎస్టేట్పై పెట్టుబడులను అవసరమైతే వెంటనే నగదుగా మార్చుకోవాలంటే దాదాపుగా అసాధ్యం. భూమిని నమ్మకున్నవారు ఎప్పు డూ నష్టపోరు అన్న సూత్రంతో తమ పొదుపునంతా రియల్టీ మార్కెట్పైనే పెట్టిన వారు అత్యవసర సమయాల్లో వాటిని ఎంతో కొంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే పెట్టుబడులు ఎప్పుడూ కలబోతగా ఉండేలా చూసుకోవాలి. డీమోనిటైజేషన్ అంటే..? డీమోనిటైజేషన్ అంటే చెలామణిలో ఉన్న నగదుకు చట్టబద్ధ చెల్లుబాటును రద్దు చేయడం. పాత నోట్లను అదే విలువ గల కొత్త కరెన్సీ నోట్లతో మార్పిడి చేయడం ఈ ప్రక్రియలో భాగం. స్వాతంత్య్రానంతరం 1978లోనూ ఓసారి డీమోనటైజేషన్ జరిగింది. నల్లధనం కట్టడికి అప్పట్లో చెలామణిలో ఉన్న రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను రద్దు చేశారు. పన్నుకు ప్లాన్ చేసుకోండి... నిజానికి పన్ను తప్పించుకునే వారి కంటే పన్ను చెల్లించే వారే తమ పెట్టుబడుల విషయంలో స్వేచ్ఛగా ఉండగలరు. చెల్లించాల్సినంత పన్ను చెల్లించేస్తే సంపాదనలో మిగులును ఆర్జన పరులు తమ రిస్క్కు తగిన రాబడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే, తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు దోహదపడే సాధనాల్లో పెట్టుబడి పెట్టాలి. దీని కంటే ముందు పన్ను కట్టాల్సిన ఆదాయం ఉంటే పన్ను చెల్లించడమే మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ పన్ను ఎగ్గొట్టేందుకు ప్రయత్నం చేయవద్దు. పెట్టుబడులపై రాబడుల్లో మార్పులు ఇప్పటి వరకూ ఎక్కువ మంది లెక్కల్లో చూపని పన్ను ఆదాయాన్ని బంగారం, స్థలాలు, ఇళ్లు వంటి వాటిపై పెట్టుబడిగా పెట్టడం తెలిసిందే. నిధుల రాక ఎక్కువగా ఉండడం వల్ల ఈ సాధనాల్లో రాబడులు మంచిగానే ఉండేవి. కానీ, పన్ను ఎగ్గొట్టే అవకాశాలకు కేంద్రం కత్తెర వేస్తోంది. దీంతో భవిష్యత్తులో మరింత మంది ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్సలో పెట్టుబడి పెట్టే అవకాశాలున్నాయన్నది నిపుణుల విశ్లేషణ. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఈక్విటీ మార్కెట్లు 5 శాతం పడిపోయాయిమిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స విలువలు 7-8 శాతం వరకు, లార్జ్ క్యాప్ ఫండ్స 5 శాతం వరకు తగ్గాయిముఖ్యంగా రియల్ ఎస్టేట్ సూచీ 20 శాతం వరకు నష్టపోయి. మంచి స్టాక్స్లో, ఫండ్స పథకాల్లో పెట్టుబడులకు ఇదొక అవకాశమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆరోగ్య బీమా ఎప్పుడు, ఏ సమయంలో ఆస్పత్రి పాలవ్వాల్సి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇలాంటి సమయాల్లో వైద్య ఖర్చులు ఎంత అవుతాయో కూడా ఊహించడం కష్టమే. అందుకే ప్రతి ఒక్కరూ తమకు, తమ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య బీమా ఉండేట్టు చూసుకోవాలి. దీంతో నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండానే వైద్య సాయం పొందవచ్చు. ధన సాయం కోసం ఇతరుల వద్ద చేయిచాల్సిన పని పడదు. అత్యవసర నిధిని కూడా కదిలించే అవసరం కూడా రాకుండా ఉంటుంది. సొంతిల్లుకు సరైన తరుణం నోట్ల రద్దుతో రియల్టీ మార్కెట్లో లావాదేవీలు భారీగా పడిపోయాయిధనం రాక ఆగిపోవడంతో డిమాండ్ వాస్తవిక స్థాయికి చేరడం వల్ల ధరలు దిగివస్తాయన్నది పరిశీలకుల అంచనా. సొంతిల్లు సమకూర్చుకోవాలని అనుకునే వారు ప్రస్తుత తరుణంలో తక్కువ ధరకు డీల్ అందుబాటులో ఉంటే రుణంపై కొనుగోలు చేయడం సరైన నిర్ణయమే అవుతుంది. దాని వల్ల ఒకవైపు పన్ను ప్రయోజనం, మరోవైపు తక్కువ ధరకు సొంతిల్లు రెండు రకాలుగా లబ్ధి పొందవచ్చు. పైగా బ్యాంకుల్లోకి భారీగా వచ్చి చేరుతున్న నిధులతో సమీప కాలంలో రుణాలపై రేట్లు కూడా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయిపన్ను ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే రుణంపై వడ్డీ కూడా సున్నాగా మారిపోతుంది. బంగారం బాండ్లు బెటరు పసిడిపై పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. నల్లధనం కట్టడి చేయడం వల్ల దేశీయంగా బంగారానికి డిమాండ్ తగ్గనుంది. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే సమీప కాలంలో బంగారం ధర 10 గ్రాములు రూ.26 వేలకు పడిపోతుందని ఒక అంచనా. అయితేదే సమయంలో డాలర్తో రూపాయిరకం విలువ క్షీణించకుండా ఉంటేనే ఇది సాధ్యం అవుతుందని తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నేరుగా బంగారం కంటే ప్రభుత్వ బంగారం బాండ్లను కొనుగోలు చేయడం వల్ల 2.5-2.75 వరకు వడ్డీ లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే... డీమోనిటైజేషన్ వల్ల వడ్డీ రేట్లు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్నుల ఆదాయం సైతం పెరుగుతుందంటున్నారు. అయితే నగదు కొరత కారణంగా ప్రజలు కనీస అవసరాలపైనే వినియోగం చేస్తారని, దాంతో నిత్యావసరాల ధరలు పెరగడం వల్ల స్వల్ప కాలంలో వడ్డీ రేట్ల కోత అనుకున్న మేర ఉండకపోవచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఈ అభిప్రాయాల నేపథ్యంలో తక్కువ రిస్క్ కోరుకునే వారు లిక్విడ్, స్వల్ప కాలిక డెట్ ఫండ్సలో, రిస్క్ భరించే వారు దీర్ఘకాల ఫండ్స లో ఇన్వెస్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన, దీర్ఘకాల బ్యాంకు డిపాజిట్లు, పన్ను రహిత బాండ్లు, కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్లు ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉన్నాయి -
నేపాల్పై పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్
-
నోట్ల రద్దుపై విచారణ ఈ నెల16కు వాయిదా
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ ఈనెల 16వ తేదీకి వాయిదా పడింది. నోట్ల రద్దుపై అనేక పిటిషన్లు వస్తున్నాయన్న న్యాయస్థానం వాటన్నింటినీ ఒకేసారి విచారణ చేస్తామని తెలిపింది. కాగా సామాన్య జనాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించాలంటూ న్యాయవాది పీవీ కృష్ణయ్య ఈ పిటిషన్ దాఖలు చేశారు. కాగా రూ.500,1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం గత మంగళవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు.