Advertisement
runa mafi farmers
-
సీఎం రేవంత్కు హరీష్ రావు కౌంటర్.. రాజీనామా లేఖలో..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుల రుణమాఫీ సందర్భంగా రాజకీయం మరోసారి వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తే హారీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.మరోవైపు.. సీఎం రేవంత్ కూడా రుణమాఫీ ముందుగానే చేశాం.. కానీ, సవాల్ మేరకు ఎవరూ రాజీనామా చేయాల్సిన పనిలేదని అన్నారు. దీంతో, ఈ ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాను ఏం మాట్లాడానో ఒక్కసారి చూడాలని మాజీ మంత్రి హారీష్ రావు.. కాంగ్రెస్ నేతలకు చూపించారు. తన రాజీనామా లేఖలో కూడా ఏం ఉందో చూడాలని కౌంటరిచ్చారు.సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తాజాగా హరీష్ రావు ట్విట్టర్ వేదికగా కౌంటరిచ్చారు.. ‘సీఎం రేవంత్ రెడ్డి గారూ!తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు. 👉కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది తమరు.👉రేవంత్ రెడ్డి గారు, నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర నాది.👉పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే, మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర నాది.👉నాకు పదవులు కొత్త కాదు, రాజీనామాలు కొత్త కాదు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు నా వల్ల మంచి జరుగుతుంది అంటే నేను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడను.మరోసారి చెబుతున్నా, ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు ( అందులోని 13హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపించు. నేను రాజీనామాకు సిద్ధం. చేయని పక్షంలో నువ్వు సిద్ధమా..?’ అంటూ కామెంట్స్ చేశారు. సిఎం రేవంత్ రెడ్డి గారూ!తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు. 👉కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది తమరు.👉రేవంత్ రెడ్డి గారు, నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన… pic.twitter.com/mghX3v2TES— Harish Rao Thanneeru (@BRSHarish) July 18, 2024 -
రైతు రుణమాఫీ.. కాంగ్రెస్ సంబురాలు దేనికి?: బండి సంజయ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేస్తూ వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రైతులతో కలిసి సంబురాలు చేసుకుంటున్నాయి. కాగా, కాంగ్రెస్ సంబురాలపై బీజేపీ ఎంపీ సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.రైతుల రుణమాఫీపై బండి సంజయ్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..‘ఏం సాధించారని కాంగ్రెస్ పార్టీ సంబురాలు చేసుకుంటుంటోంది. రబీ, ఖరీఫ్లో రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుకా? రుణమాఫీలో కోత పెట్టి రైతులను మోసం చేసినందుకా? నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టినందుకా?’ అని నిలదీశారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రుణమాఫీ డ్రామా ఆడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.ఇదిలా ఉండగా.. తెలంగాణలో లక్ష వరకు రుణాలు ఉన్న రైతులకు ఈరోజులు రుణమాఫీ జరిగింది. వారి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేసింది. మరో విడతల్లో రూ.రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. -
రుణమాఫీకి రేషన్కార్డు కాదు.. పాసుబుక్లే ముఖ్యం: సీఎం రేవంత్
రుణమాఫీ నిధుల సందర్భంగా కాంగ్రెస్ నేతల కామెంట్స్ అప్డేట్స్..రైతులతో కలిసి రాహుల్ సభ..👉సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఎన్ని సవాళ్లు ఎదురైనా రుణమాఫీ చేస్తున్నాం. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయలేదు. మరోసారి 2019లో కూడా అదే హామీ ఇచ్చి రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలాశాసనం అని మరోసారి రుజువైంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రుణమాఫీ చేస్తున్నాం.👉రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్లో భాగంగా రూ.2లక్షల రుణమాఫీ హామీ నెరవేర్చుతున్నాం. నా జీవితంలో ఇది మరపురాని రోజు. రైతు రుణమాఫీ అద్భుతమైన కార్యక్రమం. ప్రభుత్వం తరఫున రైతులందరికీ కృతజ్ఞతలు. దేశానికే ఆదర్శంగా నిలిచే అవకాశం ఇచ్చారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా రూ.లక్ష వరకు తొలివిడతలో రుణమాఫీ చేస్తున్నాం. మూడు విడుతల్లో రూ.31వేల కోట్లు వచ్చే నెలలోపు రుణమాఫీ చేస్తాం. రైతు రుణమాఫీకి పాస్ పుస్తకాలే ముఖ్యం. రేషన్ కార్డు ముఖ్యం కాదు. రుణమాఫీలో సాంకేతిక సమస్యలు వస్తే అధికారులు సరిచేస్తారు. కొందరు రుణమాఫీపై అపోహాలు, అబద్దాలు చెబుతున్నారు వాటిని నమ్మకండి.👉గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది. ప్రతీనెలా రూ.7వేల కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం. ఎల్లుండి ఢిల్లీ వెళ్తాను.. రాహుల్ గాంధీతో సమావేశమవుతాను. వరంగల్లో భారీ సభ పెడతామంటూ రైతులకు రేవంత్ చెప్పారు. ఐదు లక్షల మందితో సభకు ఏర్పాట్లు చేద్దామన్నారు. వరంగల్లో రైతులతో కాంగ్రెస్ సభ జరుగుతుంది. ఈనెలాఖరులో సభకు ఏర్పాట్లు చేసుకుందామని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించి సంబురాలు చేసుకుందామని రైతులను కోరారు. 👉వరంగల్ రైతు డిక్లరేషన్ ఎక్కడ చేసామో అక్కడే సభ జరుగుతుంది. వరంగల్ సభకు రాహుల్ కృతజ్ఞత సభగా నామకరణం చేశారు. రైతు రుణమాఫీ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్లమెంటులో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ సమావేశంలో తీర్మానం చేశారు. రుణమాఫీ జరిగిన పలువురు రైతులకు సీఎం రేవంత్ చెక్లు అందజేశారు.👉ఇక, ఇదే సమయంలో రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నవాళ్ళు ఇప్పటికైనా గుర్తించాలి. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదు. మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం.. మీ విజ్ణతకే వదిలేస్తున్నాం.👉రైతు రుణమాఫీ దేశానికి తెలంగాణ మోడల్ ఆదర్శంగా ఉండబోతుంది. ఎనిమిది నెలల్లో రుణమాఫీ హామీని నెరవేర్చి దేశంలోనే తలెత్తుకునేలా ఉన్నాం. ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క రుణమాఫీ కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఒకటో తారీఖున జీతాలు ఇస్తోంది. సంక్షేమ కార్యక్రమాలకు ఏడు నెలల్లో 29వేల కోట్లు ఖర్చు చేశాం. 👉రైతు రుణమాఫీ నిధులు విడుదల సందర్భంగా రైతువేదికల్లో ఉన్న రైతులతో సీఎం రేవంత్ రెడ్డి ముచ్చటించారు. ఈ సందర్బంగా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పలు జిల్లాల నుంచి రైతులు నేరుగా సీఎం రేవంత్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రతీ జిల్లా నుంచి రైతులు మాట్లాడారు. 👉తెలంగాణ సచివాలయం ముందు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు. పలు జిల్లాలో కూడా కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్క కామెంట్స్..👉రుణమాఫీ నేపథ్యంలో రైతు లోకానికి శుభాకాంక్షలు. రైతన్నకు రుణ విముక్తి, తెలంగాణ ప్రగతికి నాంది. రైతురాజ్యం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికే సాధ్యం. కేసీఆర్ పదేళ్లలో చేయలేనిది..మేము కేవలం నెలన్నరలో చేస్తున్నాం. విపక్షాలకు మాట్లాడే నైతిక అర్హత లేదు. జై కిసాన్ జై తెలంగాణ అంటూ కామెంట్స్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్.. 👉నల్లగొండలో రైతువేదికలో రైతులతో కలిసి మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సీఎం రేవంత్తో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ చేస్తూ చరిత్ర సృష్టించాం. రైతులు అప్పులాపాలు కాకుండా ఉండేందుకు రుణమాఫీ చేశాం. రూ.481 కోట్ల రూపాయల మాఫీ నల్లగొండ జిల్లాలో జరిగింది. బ్యాంకు వాళ్లు ఇబ్బందులు పెడితే అధికారులు, నా దృష్టికి తీసుకురండి. త్వరలో లక్షన్నర, రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తాం. డిండి, ఎస్సెల్బీసీ సొరంగ మార్గం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను పూర్తిచేస్తాం. డిప్యూటీ సీఎం భట్టి కామెంట్స్..👉డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతులకు ఇది పండుగ రోజు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ హామీని నెరవేర్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఆ హామీని నెరవేర్చలేదు. ప్రతీ రూపాయి పోగేసి.. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని అమలు చేస్తున్నాం. ఒకేసారి రూ.31వేల కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేస్తున్నాం. తుమ్మల నాగేశ్వర రావు కామెంట్స్..👉రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఇది చారిత్రాత్మకరోజు.. రైతులకు పండుగరోజు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఎంత మంది అపహాస్యం చేసినా.. రైతుల రుణమాఫీ చేస్తున్నాం. ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అత్యంత కష్టతరమైన ఈ బృహత్తర కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేసి చూపిస్తోంది. ఆర్దిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాం. రాహుల్ గాంధీ మాట ఇచ్చారు.. మేము నెరవేరుస్తున్నాం. భవిష్యత్లో రైతులకు ఉపయోగపడే మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తాం. రుణమాఫీ నిధుల విడుదల..👉తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమ అయ్యాయి. ప్రభుత్వం రుణమాఫీ నిధులను విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా 11.42 లక్షల మంది రైతుల ఖాతాలోకి ఏడు వేల కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. నేడు లక్ష రూపాయల వరకు రుణమాఫీ కానుంది.👉కాగా, తెలంగాణ సచివాలయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.. పలుచోట్ల రైతువేదికల్లో ఉన్న రైతులతో మాట్లాడనున్నారు. ఇదే సమయంలో ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి సంబురాల్లో పాల్గొననున్నారు. మరోవైపు.. రుణమాఫీ నిధులు ఇతర ఖాతాల్లోకి మళ్లించకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంది. 👉ఇక, ఈ నెలాఖరులోగా రెండో విడత, ఆగస్టు మొదటి వారంలో మూడో విడతతో మిగిలిన రుణాలను మాఫీ చేయనున్నారు. రైతుల రుణమాఫీ కోసం మొత్తం రూ.31వేలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కాగా, ఆగస్టు దాటకముందే ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తోంది. కాసేపట్లో రైతులతో సీఎం రేవంత్ మాట్లాడనున్నారు. -
రుణమాఫీపై మార్గదర్శకాలు.. అది కాంగ్రెస్కు అలవాటే: హరీష్ రావు సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ వాళ్లు చెప్పేదొకటి.. చేసేదొకటి.. ఇది వారికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.కాగా, తెలంగాణలో రైతుల రుణమాఫీ మార్గదర్శకాలపై హరీష్రావు కౌంటరిచ్చారు. కాగా, హరీష్ రావు ట్విట్టర్ వేదికగా.. రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టం. సంబంధిత వార్త: రుణమాఫీపై బిగ్ ట్విస్ట్.. ప్రభుత్వం మార్గదర్శకాలు ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారింది. రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టం.ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారింది.…— Harish Rao Thanneeru (@BRSHarish) July 15, 2024 డిసెంబర్ 12, 2018 వరకు ముందున్న రైతులకు వర్తించదు అనే నిబంధన అసమంజసం. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనపడుతున్నది. ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికం అని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే. ఎన్నికలప్పుడు మభ్య పెట్టారు, అధికారం వచ్చిన తర్వాత ఆంక్షలు పెట్టారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఈ రుణమాఫీ..!
కరీంనగర్: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అన్నదాతల ఆశలు ఫలించాయి. లక్షలోపు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా సదరు ప్రక్రియ నాలుగేళ్ల అనంతరం తుదిదశకు చేరుకోవడం గమనార్హం. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రధానమైంది సాగురంగమే. ఉభయ గోదావరి జిల్లాలతో పోటీపడే ఉమ్మడి కరీంనగర్ది ప్రత్యేక ముద్ర. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, పసుపు, చెరకు పంటలకు ప్రసిద్ధి కాగా చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. ఈక్రమంలో బ్యాంకు రుణంతోనే ఏటా రెండు పంటలను సాగు చేస్తుంటారు. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తుండగా దిగుబడులు ఒక్కోసారి దిగదుడుపే. ఈ నేపఽథ్యంలో ప్రభుత్వం ప్రకటించే రుణమాఫీ ప్రకటనే రైతులకు ధైర్యాన్నిస్తుండగా మాఫీ అమలు ఆగుతూ సాగింది. 2018 డిసెంబర్ 11 వరకు రూ.లక్షలోపు రుణం తీసుకున్నవారికి రుణమాఫీ ప్రకటించగా ఉమ్మడి జిల్లాలో 3,49,474 మంది లబ్ధి చేకూరనుంది. రూ.1200 కోట్ల మేర రుణమాఫీ జరగనుంది. ఆగుతూ సాగిన ప్రక్రియ టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించగా నాలు గు విడతలుగా మాఫీ చేస్తామని గతంలో ప్రకటించింది. రూ.25 వేలలోపు రుణం తీసుకున్న రైతులకు ఒకసారి, రూ.50 వేలలోపు మరోసారి, రూ.75 వేలు, రూ.లక్ష చివరిసారి ఇలా నాలుగు విడతలుగా మాఫీ ఇలా 2019లోనే సదరు ప్రక్రియ పూర్తికావాలి. కానీ.. కేవలం రూ.25 వేల లోపు రుణం తీసుకున్నవారికి మాత్రమే మొదటి విడత మాఫీ చేశారు. ఆ త ర్వాత మిగతా ప్రక్రియ ఆగిపోయింది. ఓసారి సమాచారం సేకరించడం మళ్లీ అటకెక్కించడం చేశారు. మొదటి విడతలో కరీంనగర్ జిల్లాలో 15,200 మంది లబ్ధిపొందగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,663, పెద్దపల్లి జిల్లాలో 14,636, జగిత్యాల జిల్లాలో 27 వేల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. వడ్డీ డబ్బులు తిరిగొచ్చేనా? ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కర్శకులు రుణమాఫీ కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం నాలుగు విడతల్లో మాఫీ చేస్తుందని ప్రకటించడంతో చాలామంది రుణాలు తిరిగి చెల్లించలేదు. వడ్డీ డబ్బులు కడుతూ వచ్చారు. మొత్తంగా రూ.400ల కోట్ల వరకు వడ్డీ చెల్లించినట్లు సమాచారం. ధాన్యం డబ్బులు ఖాతాలో జమైతే చాలు బ్యాంకర్లు వాటిని రుణానికి మిత్తికింద జమచేశారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో 50 శాతానికి పైగా రైతులది ఇదే పరిస్థితి. 2019లోనే పూర్తిగా రుణమాఫీ జరగాల్సి ఉండగా నాలుగేళ్లుగా వడ్డీ డబ్బులు చెల్లించి రెన్యువల్ చేసుకున్నారు. ఈ క్రమంలో సదరు డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమచేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే మాఫీ చేసినా పెద్దగా రైతులకు ఒరిగిందేమి లేదని అభిప్రాయపడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో 76,791 మందికి ఇంకా రుణమాఫీ కావాల్సి ఉండగా రాజన్న సిరిసిల్ల 57,210, పెద్దపల్లి 78,064, జగిత్యాల జిల్లాలో 76 వేల మంది రైతులు ఇప్పటికీ రెన్యువల్ కింద వడ్డీ చెల్లిస్తూ రుణాలు తీసుకుంటున్నారు. రైతుబాంధవుడు సీఎం దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా, రైతాంగ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కరోనా వంటి విపత్కర పరిస్థితులు, ఎప్ఆర్బీఎం పరిమితులు, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కేంద్ర అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయం పడిపోయినా తెలంగాణలో రైతుల కోసం కృషి చేస్తున్నారు. నేడు రూ. 19 వేల కోట్ల భారాన్ని భరిస్తూ తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయం విప్లవాత్మకం. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్, విత్తనాలు, ఎరువులు, కాళేశ్వరం జలాలతో రాష్ట్రాన్ని ధాన్యగారంగా తీర్చిదిద్దారు. – గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి -
టీడీపీ హయాంలో దగాపడ్డ రైతన్న
సాక్షి, చిత్తూరు రూరల్: తెలుగుదేశం రుణమాఫీ హామీ మాయలో రైతులు ఓడిపోయారు. చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంకుల్లో పరపతి కోల్పోయారు. 2014 ఎన్నికల ముందు అన్ని రకాల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామన్న బాబు .. ఆ తర్వాత మాట మార్చి సవాలక్ష నిబంధనలతో నాలుగున్నరేళ్లు దాటినా అరకొర రుణమాఫీతో చుక్కలు చూపించారు. 2019 ఎన్నికలు సమీపిం చడంతో రైతుల ఓట్లను దండుకోవడానికి రూట్ మార్చారు. అన్నదాత సుఖీభవ అంటూ నారా మంత్రంతో మళ్లీ రైతులను నట్టేట ముంచడానికి సిద్ధమయ్యారు. అయితే మట్టిని నమ్ముకున్న రైతన్నలు నిన్ను నమ్మం బాబూ.. ఈ సారీ రైతు బిడ్డ, ప్రతిపక్ష నేత వై.ఎస్ జగన్మోహన్రెడ్డికే మా మద్దతు అని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం 2013 డిసెంబర్ నాటికి అన్ని రకాల వ్యవసాయ రుణాలు 5,800 మంది ఖాతాల్లో రూ. 78.2 కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయి. ఎన్నికల హామీ మేరకు ఇవన్నీ బేషరతుగా మాఫీ చేయాలి. కానీ అలా చేయలేదు. కమిటీలు, నిబం ధనలు, షరతుల పేరుతో ఏడాది పాటు కాలయాపన చేసి మాఫీ సొమ్ముపై కొర్రీలు వేశారు. ఆంక్షల కారణంగా 4,296 మంది రైతులు మాత్ర మే రుణమాఫీకి అర్హులయ్యారు. 1,504 మంది అనర్హులని వేటు వేశారు. దీంతో వారందరూ చంద్రబాబు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతులెత్తేశారు... అంతంతమాత్రంగా చేసిన మాఫీ రుణాన్ని విడతల వారీగా అంటూ మాఫీ పత్రాలతో మాయ చేశారు. ఇవన్నీ చూసి రైతులు కంగుతున్నారు. మాఫీ కోసం బ్యాంకులు వ్యవసాయశాఖ, కలెక్టరేట్, కార్యాలయాలు తిరిగి అలసిపోయారు. ఇందుకోసం రోజుల తరబడి పనులు మానేసి వేలాది రూపాయలు ఖర్చు చేశారు. అయినా చాలా మంది రైతులకు నయాపైసా రుణమాఫీ కాలేదు. వేలాది మంది రైతులు అరకొర మాఫీకి నోచుకున్నారు. నాలుగు, ఐదు విడతలకు గాను రూ. 345 లక్షలు విడుదల కావాల్సి ఉంది. అదిగో ఇదిగో అంటూ ఏడాదిగా ఊరిస్తున్నా అతీగతీ లేకపోయింది. ఎన్నికల మాయ.. రుణమాఫీని గాలికొదిలేసిన చంద్రబాబు తర్వాత ఎన్నికల కొత్తమాయకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మళ్లీ రైతులను మోసం చేయడానికి అన్నదాత సుఖీభవ పేరుతో ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టారు. రైతుల ఖాతాలోకి రూ. 1000 చొప్పున జమ చేసి రైతుల కంట్లో కారం చల్లుతున్నారు. ఇదీ కూడా అరకొరగానే జమ కావడంతో రైతాంగం చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. రైతులకు నేనున్నా.. ‘రైతులకు పెట్టుబడులు తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటాం. పగటి పూటే 9 గంటల పాటు ఉచితంగా కరెంటు ఇస్తాం. ప్రతి రైతు ఆదాయం పెంచడం కోసం బ్యాంకు రుణాలపై వడ్డీ లేకుం డా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. మే నెలలోనే రైతన్నకు పెట్టుబడి కోసం రూ.12, 500 ఇస్తాం. రైతులందరకీ బోర్లు ఉచితంగా వేయిస్తాం. పంట ఇన్సూరెన్స్ల కోసం రైతులు ఇక ఆలోచించనక్కర్లేదు. అధికారంలోకి రాగానే ఇన్సూరెన్స్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. గిట్టుబాటు ధర కోసం రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ తీసుకొస్తాం’ అంటూ ప్రతిపక్ష నేత వై.ఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. న్యాయం లేదు.. ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గోవిందరెడ్డి. చిత్తూరు మండలంలోని తాళంబేడు గ్రామం. ఇతనికి 2.33 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 2012లో ఈ పొలంపై బ్యాంకులో రూ. 60 వేలు రుణం తీసుకున్నా రు. ఇందుకు గాను అతనికి వడ్డీతో కలిపి ఇప్పటి వరకు రూ. 97.50 వేలకు అప్పు చేరింది. చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇతనికి రుణం పూర్తిగా మాఫీ అవుతుందని సంబరపడ్డారు. తీరా ఒక్కపైసా కూడా మాఫీ కాలేదు. బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు. ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చిన న్యాయం జరగడం లేదని గోవిందరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి రుణం తీర్చుకున్నా.. ఈ ఫొటోలో ఉన్న రైతు పేరుమొగిలిరెడ్డి. ఇతనిది మండలంలో టీ.వేపనపల్లి గ్రామం. ఎకరా పొలంకు రూ. 47 వేలు బ్యాంకులో అప్పు తీసుకున్నారు. చంద్రబాబు అమలు చేసిన రుణమాఫీ నుంచి ఇతనికి ఒక్క పైసా రాలేదు. బ్యాంకు అధికారులు కోర్టు నుంచి నోటీసులు పంపారు. చేసేదీ లేక వారి సమక్షంలో వడ్డీకి అప్పు చేసి బ్యాంకు రుణం తీర్చుకున్నారు. దీనిపై ఎన్నిసార్లు ప్రశ్నించినా సమాధానం చెప్పేవారు లేరు. ఆశలు అడియాసలు చేశారు టీ. వేపనపల్లె గ్రామానికి ఈయన పేరు మునిరత్నం రెడ్డి ఇతనికున్న 2 ఎకరాలకు గాను రూ. 65 వేలు బ్యాంకులో అప్పు చేశారు. 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు అధికారంలోకి వస్తే రుణమాఫీ అవుతుందని భావించారు. బ్యాంకుకు వడ్డీ, అసలు కట్టడం మానేశారు. చివరకు వారి నిరాశే మిగిలింది. రుణమాఫీకి వీరు అర్హులు కారని ప్రభుత్వం పక్కనబెట్టింది. బ్యాంకు నుంచి ఒత్తిడి రావడంతో తీసుకున్న రుణాన్ని ఏడాది క్రితమే వడ్డీతో కలిపి చెల్లించారు. -
చేతకాకపోతే తప్పుకోండి
సాక్షి, విజయవాడ: రైతులకు న్యాయం చేయలేకపోతే గద్దె దిగండి.. మీకంటే చక్కగా పాలించే వారు చాలామంది ఉన్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి సీఎం చంద్రబాబుకు చురకలంటించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతును రాష్ట్రానికి రాజుగా చేద్దామని నినాదాలు చేస్తున్నారు.. నిజానికి రైతులను రోడ్డుపాలు చేస్తున్నారని విమర్శించారు. ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారన్నారు. రూ.5వేల కోట్ల తో ధరల స్థిరీకరణ అన్నారు.. రూ.85 వేల కోట్లు రుణమాఫీ చేస్తామన్నారు.. నాలుగేళ్లు గడుస్తున్నా రూ.12 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ అన్నారు.. కనీసం అవికూడా చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు రైతులను రుణగ్రస్తులను చేశారని, సహకార సొసైటీలను తెలుగు తమ్ముళ్లు అవినీతిమయం చేశారని ఆయన విమర్శించారు. రైతుల పేరుతో మిల్లులకు ధాన్యం అమ్మినట్లు తప్పుడు లెక్కలు చూపుతున్నారని, కోట్ల రూపాయల మేర మిల్లర్లతో కలిసి జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యాన్ని మిల్లర్లు రీసైకిల్ చేసి తిరిగి ప్రభుత్వానికే లెవీగా ఇస్తున్నారన్నారు. ఈ అక్రమార్కులకు మంత్రులే అండగా నిలుస్తున్నారని, కృష్ణాజిల్లా ముస్తాబాద్ సొసైటీలో జరిగిన అవినీతే ఇందుకు నిదర్శనమని పార్థసారథి అన్నారు. -
రైతులు చస్తుంటే షోకులా?
సచివాలయంపై జీవన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ లేక, ఇన్పుట్ సబ్సిడీ అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మూఢవిశ్వాసాల కోసం సచివాలయాన్ని కూల్చేసి, కొత్త భవనాలతో షోకులు చేసుకుంటారా అని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాల పేరిట దారిమళ్లిస్తోందని ఆరోపించారు. కేంద్రం నిధులు ఆయా పథకాలకు, లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు జీవన్రెడ్డి లేఖ రాశారు. కరువు మండలాల్లోని రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ నిధులను వెంటనే పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ కూలీలకు, మధ్యాహ్న భోజన కార్మికులకు వేతన బకారుులను వెంటనే చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రుణమాఫీకి, ఫీజు రీరుుంబర్స్మెంటుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయడం లేదన్నారు. రూ.720 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి 8 నెలలు దాటుతున్నా రైతులకు అందించలేదని విమర్శించారు. 4 నెలలుగా ఉపాధి కూలీలకు చెల్లింపుల్లేవని, మధ్యాహ్న భోజన పథకానికి నిధులను ఇవ్వడం లేదని చెప్పారు. అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల అయ్యాయా, లేదా చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.