shiva sena
-
మిహిర్ షా : కటింగ్,షేవింగ్ చేసి.. రూటు మార్చి..పోలీసుల్ని ఏమార్చి!
ముంబై బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు హిట్ అండ్ రన్ కేసు నిందితుడు మిహిర్ షా (24) పచ్చి తాగుబోతని (Habitual Drinker) పోలీసులు నిర్ధారించారు. హిట్ అండ్ రన్ కేసులో అరెస్టైన మిహిర్షాను విచారించగా ఈ విషయాన్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. జులై 7 ఆదివారం ఉదయం 5.30 గంటలకు ముంబైలోని వర్లీ ప్రాంతంలో మిహిర్ షా మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందువెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 45 ఏళ్ల కావేరీ నఖ్వా మృతి చెందగా.. ఆమె భర్త ప్రదీప్ నక్వా తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడు పరారయ్యాడు.నిందితుడు తండ్రి మహరాష్ట్ర పాల్ఘర్ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన డిప్యూటీ లీడర్గా ఉన్న రాజేష్ షా కావడంతో ఈ ప్రమాదంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మహరాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే రంగంలోకి దిగారు. నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అతడి ఆచూకీ కోసం 11 పోలీస్ శాఖ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రమాదం జరిగిన 72 గంటల అనంతరం ప్రధాన నిందితుడు మిహిర్ షాను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.నేను పెద్ద తప్పే చేశాతాజాగా, కేసు విచారణలో మిహిర్షా హిట్ అండ్ రన్లో మహిళ ప్రాణాలు తీసినందుకు పశ్చాతాపపడుతున్నట్లు సమాచారం. మహిళ ప్రాణం తీసి నేను పెద్ద తప్పే చేశా. నా కెరియర్ ఇక ముగిసిందని విచారణలో పోలీసుల ఎదుట విచారం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.కటింగ్, షేవింగ్ చేసిఇక కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితుడు విశ్వప్రయత్నాలు చేశాడు. పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు మీసాలు, గడ్డాలు తొలిగించాడు. కటింగ్ కూడా చేయించుకున్నాడని బార్బర్ షాపు యజమాని ఇచ్చిన స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నారు పోలీసులు. రాజేష్ షా అరెస్ట్.. బెయిల్పై విడుదలహిట్ అండ్ రన్ కేసు నిందితుడు మిహిర్ షా తండ్రి రాజేశ్ షాను పోలీసులు అరెస్ట్ చేసి ముంబై కోర్టులో హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు రాజేష్ షా, డ్రైవర్ రాజరిషి బిదావత్లకు వరుసగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ, ఒకరోజు పోలీసు కస్టడీ విధించింది. అయితే ఈ కేసులో రాజేష్ షాకు బెయిల్ లభించగా, బిదావత్ పోలీసు కస్టడీని జూలై 11 వరకు పొడిగించింది.కుమారుడు చేసిన ఘన కార్యం.. ముగిసిన తండ్రి పొలిటిక్ కెరియర్కుమారుడు మిహిర్ షా చేసిన ప్రమాదంతో రాజేష్ షా పొలిటికల్ కెరియర్ ఓ రకంగా ముగిసినట్లేనని శివసేన నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన అన్ని పదవుల నుంచి తొలగించినట్లుగా శివసేన వర్గాలు వెల్లడించాయి. పాల్ఘర్లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన డిప్యూటీ లీడర్గా ఉన్న రాజేష్ షా హిట్ అండ్ రన్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. -
ముంబై హిట్ అండ్ రన్ కేసు: ఒళ్లు గగుర్పొడిచేలా.. వెలుగులోకి సంచలన విషయాలు
ముంబై : ముంబై బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు హిట్ అండ్ రన్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు మిహిర్ షా బాధితురాలు కావేరీ నక్వాను కారు బానెట్పై సుమారు 1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.గత ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో ముంబై వ్రోలి అనే ప్రాంతంలో బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. స్థానిక కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హిట్ అండ్ రన్ ఎలా జరిగిందో పోలీసులు కోర్టుకు వివరాలు అందించారుఈ కేసులో ప్రధాన నిందితుడైన శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా.. పూటుగా మద్యం సేవించి ఉదయం చేపల మార్కెట్కి వెళ్లి తిరిగి వస్తున్న కావేరీ నక్వా, పార్ధిక నక్వా ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టాడు. బలంగా ఢీకొట్టడంతో కావేరీ నక్వా ఎగిరి కారు బానెట్పై పడ్డారు. అలాగే కిలోమీటర్ దూరం పైగా ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత కారుమీదున్న బాడీని కిందకు దించాడు. అనంతరం అదే కారు రివర్స్ చేసి ఆమె శరీరం మీద నుంచి పోనిచ్చినట్లు సీసీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయని స్థానిక పోలీసులు కోర్టులో వెల్లడించారు. స్థానికుల సమాచారం, బాధితురాలి భర్త ఫిర్యాదు, సీసీటీవీ పుటేజీ వీడియోల ఆధారంగా ప్రమాదం తర్వాత మిహిర్ షా కారును వదిలేసి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. తప్పించుకునేందుకు అక్కడి నుంచి మరో ప్రాంతానికి పరారయ్యాడని పోలీసులు గుర్తించారు. మిషిర్ షా ప్రియురాల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.కాగా ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు మిహిర్ జుహూ ప్రాంతంలోని ఓ బారులో పీకల వరకు మద్యం సేవించినట్టు దర్యాప్తులో తేలింది. అక్కడి సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. ఆ బార్లో నిందితుడు రూ.18వేల బిల్లు చేసినట్లు తేలింది.ప్రమాద సమయంలో కారులో మిహిర్తో పాటు అతడి డ్రైవర్ కూడా ఉన్నాడు. బార్ నుంచి ఇంటికి వెళ్తూ కారు తానే నడుపుతానని పట్టుబట్టి నిందితుడు డ్రైవర్ సీట్లోకి మారినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతుంది. కాగా,ఇదే కేసులో మిహిర్ మిషిర్ షా తండ్రి శివసేన నేత రాజేష్ను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు సోమవారం సాయంత్రం రాజేష్ షాకు కోర్టు బెయిల్ రూ.15వేల పూచీకత్తుతో ప్రొవిజినల్ బెయిల్ను మంజూరు చేసింది. -
మద్యం మత్తులో బీభత్సం.. కేసు నుంచి అధికార పార్టీ నేత కుమారుణ్ని తప్పిస్తున్నారా?
ముంబై అధికార శివసేన పార్టీ నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా (24) హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ఉదయం మిషిర్ షా బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు ఢీకొట్టడంతో ఓ మహిళ ప్రాణం కోల్పోయింది. అయితే ఈ కేసులో మిషిర్ షాను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో మిహిర్ షా ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు ముంబై వర్లిలోని సాసూన్ డాక్ ఫిష్ మార్కెట్కి వెళ్లి తిరిగి వస్తున్న భార్య కావేరీ నక్వా,ఆమె భర్త పార్థిక్ నక్వా ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బాధితురాలు కావేరీ నక్వా మరణించగా.. భర్త పార్థిక్ నక్వా గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుడున్నాడు.అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగే సమయంలో కారులో కారు డ్రైవర్ రాజేంద్ర సింగ్ బిజావత్తో పాటు మిహిర్ షా ఉన్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే పరారైన మిహిర్ షా కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. డ్రైవర్ను బిజావత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికార పార్టీ నేత కుమారుడికి అనుకూలంగాహిట్ అండ్ రన్ కేసులో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై వివాదం నెలకొంది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద అంటే హత్యతో సమానం కాని నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. హిట్ అండ్ రన్ కేసులో సాధారణంగా నేరపూరిత నరహత్య, ర్యాష్ డ్రైవింగ్,సాక్ష్యాలను ధ్వంసం చేయడం మొదలైన వాటిపై కేసు నమోదు చేస్తారని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మద్యం సేవించిన కారు డ్రైవర్ బిజావత్ నుంచి రక్త నమోనాలకు సేకరించారు.రిపోర్ట్స్ రావాల్సి ఉంది.వాళ్లు సమాజంలో పేరున్న పెద్దోళ్లు.. మనమేం చేయలేంరోడ్డు ప్రమాదంపై తన భార్య కావేరీ నక్వా మరణంపై ఆమె భర్త పార్థిక్ నక్వా కన్నీరు మున్నీరవుతున్నారు. ‘‘ఫిష్ మార్కెట్ నుంచి తిరిగి వస్తున్న తమ వెహికల్ను బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. నా భార్య ఎగిరి 100 మీటర్ల అవతల పడింది. నాకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో నా భార్యను కోల్పోయా. నాకు ఇద్దరు పిల్లలు. వారి సంరక్షణ ఎవరు చూసుకోవాలి. వాళ్లంటే సమాజంలో పేరున్న పెద్ద మనుషులు. వారిని ఎవరు ఏం చేయలేరు. చివరికి బాధపడాల్సి మనమే అంటూ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన కారకుడైన మిహిర్ షా‘‘ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.పోలీసులు వెర్షన్ ఎలా ఉందంటే? బీఎండబ్ల్యూ కారు మిహిర్ షా పేరు మీద రిజిస్టర్ అయినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మిహిర్ షా, డ్రైవర్ ఇద్దరు కారులో ఉన్నారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మిహిర్ షా గత రాత్రి జుహులోని ఓ బార్లో మద్యం సేవించాడు. ఇంటికి వెళుతుండగా, డ్రైవర్ని లాంగ్ డ్రైవ్ చేయమని అడిగాడు. వర్లీ ప్రాంతంలో కారు డ్రైవ్ చేస్తున్న మిహిర్ షా.. కావేరీ నక్వా ప్రయాణిస్తున్న స్కూటీని ఢీ కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సీఎం ఏక్ నాథ్ షిండ్ ఏమన్నారంటే?మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండ్ హిట్ అండ్ రన్ కేసుపై స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంటూ నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితులు ఎంతటివారైనా చట్టం తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమే దేశంలో చట్టం ముందు అందరూ సమానమేనని, ఆ విషయంలో ఎవరి పట్ల వివక్ష చూపబోమని, ఈ కేసులో బాధితులకు న్యాయం జరిగేలా.. నిందితులకు శిక్షపడేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఏక్ నాథ్ షిండ్ వెల్లడించారు. -
హిట్ అండ్ రన్ : మహిళ ప్రాణం తీసిన అధికార పార్టీ నేత కుమారుడు!
ఓ అధికార పార్టీకి చెందిన నేత కుమారుడి నిర్వాకంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు తన లగ్జరీ బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారుతో మహిళ, ఆమె భర్త ప్రయాణిస్తున్న స్కూటీని అతివేగంతో ఢీకొట్టాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ హిట్ అండ్ రన్ ప్రమాదంలో బాధితురాలు గాల్లోంచి ఎగిరి దూసుకెళ్లింది. 100 మీటర్ల అవతల పడిపోయింది. చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఇంతకీ ఆ రాజకీయ నేత ఎవరు?ముంబై వర్లిలోని అట్రియా మాల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 5.30గంటల సమీపంలో బీఎండబ్ల్యూ కారు దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య కావేరీ నక్వా దుర్మరణం చెందగా.. భర్త పార్థిక్ నక్వా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అయితే ఆ బీఎండబ్ల్యూ కారు ముంబై అధికార ఏక్ నాథ్ షిండ్ నేతృత్వంలోని శివసేన పార్టీ నేత రాజేష్ షాకి చెందినదిగా పోలీసులు గుర్తించారు.Hit and run case in Mumbai.A BMW car hit a scooty in the Worli area. One female dead.#Mumbai pic.twitter.com/rFdfir4pjF— Vivek Gupta (@imvivekgupta) July 7, 2024ప్రమాద సమయంలో మహరాష్ట్ర పాల్ఘర్ జిల్లా శివసేన నేత రాజేష్ షా బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారును ఆయన కుమారుడు మిహిర్ షా డ్రైవ్ చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ఆదివారం ఉదయం 5.30గంటల సమయంలో మిహిర్ షా తన బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారుతో వ్రోలి ప్రాంతానికి వెళుతున్నాడు. అదే సమయంలో సాసూన్ డాక్ ఫిష్ మార్కెట్కి వెళ్లి తిరిగి వస్తున్న దంపతులు ప్రయాణిస్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టారు.ఈ కారు ప్రమాదంతో బాధితురాలు గాల్లోకి దూసుకెళ్లింది. సుమారు 100 మీటర్ల అవతల పడిపోవడంతో తీవ్రగాయాల పాలైంది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుల్ని అత్యవసర చికిత్స కోసం నాయర్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న భార్య మరణించగా.. భర్తకు గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. కారు ఎవరిదో.. నిర్ధారించే పనిలో పోలీసులు మరోవైపు రోడ్డు ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారును వ్రోలీ పోలీసులు సీజ్ చేశారు. ఈ కారు ఎవరిది? శివసేన పార్టీ నేత రాజేష్ షాకి చెందినదేనా? ప్రమాదానికి కారకులు ఎవరనేది త్వరలో నిర్ధారిస్తామన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీఎం షిండే ఆగ్రహం.. పోలీస్ శాఖకు ఆదేశాలుతన పార్టీకి చెందిన నేత కుమారుడు హిట్ అండ్ రన్ కేసులో ఓ మహిళ ప్రాణాలు పోయిందంటూ అటు జాతీయ మీడియా, ఇటు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంతో ముంబై సీఎం ఏక్నాథ్ షిండ్ స్పందించారు. ప్రమాదానికి కారకులైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. నిందితుల్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వ్రోలీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. -
Sanjay Raut: టీడీపీ స్పీకర్ పదవికి పోటీ చేస్తే.. ఇండియా కూటమి మద్దతిస్తుంది
ముంబై: లోక్సభ స్పీకర్ పదవికి అధికార ఎన్డీఏ పక్షంలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పోటీ చేస్తే ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలన్నీ మద్దతిచ్చే అవకాశముందని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ చెప్పారు. లోక్సభ స్పీకర్ పోస్టు చాలా కీలకమైందని, ఈ పదవి బీజేపీకి దక్కితే, ప్రభుత్వానికి మద్దతిచ్చే టీడీపీ, జేడీయూలతో పాటు చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరిలకు చెందిన పార్టీలను ముక్కలు చేస్తుందని ఆరోపించారు. బీజేపీని నమ్మి మోసపోయిన అనుభవం తమకు కూడా ఉందని రౌత్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లోక్సభ స్పీకర్ పదవిని టీడీపీ కోరుతున్నట్లుగా విన్నాను. అదే జరిగితే, ఇండియా కూటమి ఈ విషయాన్ని చర్చిస్తుంది. మా భాగస్వామ్య పక్షాలన్నీ టీడీపీకి మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తాయి’అని చెప్పారు. నిబంధన ప్రకారం ప్రతిపక్ష పార్టీకి డిప్యూటీ స్పీకర్ పోస్టు కేటాయించాలన్నారు. లోక్సభ ఎన్నికల అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అగ్ర నేతలు బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై సంజయ్ రౌత్.. గతంలో బీజేపీ చేసిన తప్పిదాలను ఆర్ఎస్ఎస్ సరిచేయాలనుకోవడం మంచి పరిణామమేనని పేర్కొన్నారు. జూన్ 7వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన భేటీలో ప్రధాని మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా, బీజేపీ పార్లమెంటరీ పార్టీ, లోక్సభలో బీజేపీ నేతగా ఎన్నికయ్యారని రౌత్ అన్నారు. ‘బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రత్యేకంగా జరగలేదు. అలా జరిగిన పక్షంలో నేత ఎవరనే ప్రశ్న ఉదయిస్తుంది, అప్పుడిక పరిణామాలు వేరుగా ఉంటాయి’అని అభిప్రాయపడ్డారు. మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా మాత్రమే ఎన్నికవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని రౌత్ వ్యాఖ్యానించారు. -
ఈవీఎంల ట్యాంపరింగ్తో ఎన్నికల్లో విజయం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ప్రముఖ బిలియనీర్ ఎలోన్ మస్క్ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల భద్రతను ప్రశ్నిస్తూ ఎలోన్ మస్క్ చర్చకు తెర లేపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. మానవులు, లేదా ఏఐ ద్వారా ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రమాదం చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికి వాటి పర్యవసానాలు భారీ స్థాయిలో ఉంటాయని ట్వీట్లో పేర్కొన్నారు. భారత్లో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు తలెత్తుతున్న తరుణంలో మస్క్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరోక్షంగా స్పందించారు. EVMs in India are a "black box," and nobody is allowed to scrutinize them. Serious concerns are being raised about transparency in our electoral process.Democracy ends up becoming a sham and prone to fraud when institutions lack accountability. https://t.co/nysn5S8DCF pic.twitter.com/7sdTWJXOAb— Rahul Gandhi (@RahulGandhi) June 16, 2024 దేశంలోని ఈవీఎంలను‘బ్లాక్ బాక్స్’అని అభివర్ణించారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ స్థానం ఫలితాలపై దుమారం రేపిన వార్తా కథనాల్నిఉదహరిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘భారత్లో ఈవీఎంలు ఒక బ్లాక్ బాక్స్. వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి లేదు.మా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయి’అని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు.సంస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం బూటకంగా మారుతుంది. మోసానికి గురవుతుందన్నారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్సభలో గెలిచిన అభ్యర్థి బంధువులు ఈవీఎంలకు కనెక్ట్ చేసిన ఫోన్ను ఉపయోగిస్తున్నారంటూ వచ్చిన కథనాల్ని ట్వీట్ చేశారు.ఫోన్తో ఈవీఎంను అన్ల్యాక్ చేసిన ఎన్డీఏ అభ్యర్థి!ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ శివసేన ఎంపీ రవీంద్ర వైకర్ లోక్సభ ఎన్నికల్లో 48 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పుడు ఆయన గెలుపుపై వివాదం నెలకొంది. అందుకు జూన్ 4న రెస్కో పోలింగ్ కౌంటింగ్ సెంటర్ బయట ఎంపీ రవీంద్ర వైకర్ బావ మంగేష్ పన్హాల్కర్ ఫోన్ వినియోగించారు. ఆ ఫోన్ వినియోగించడం వల్లే రవీంద్ర వైకర్ 48 ఓట్ల తేడాతో గెలుపొందారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.కౌంటింగ్ సెంటర్లో ఉన్న ఈవీఎం మెషిన్కు మంగేష్ పన్హాల్కర్కు ఫోన్కు మధ్య కనెక్టివిటీ ఉందని, ఫోన్లో ఓటీపీ సాయంతో కౌంటింగ్ సెంటర్లో ఉన్న ఈవీఎం మెషిన్ ఓపెన్ అయ్యేలా టెక్నాలజీని వినియోగించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మంగేష్ ఫన్హాల్కర్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిజానిజాలు తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈవీఎంలను నిషేధించాలంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. భారత్లోని ఈవీఎంల తయారీ చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. వాటిని ఎవరు కనెక్ట్ చేయలేరు. కనెక్టివిటీ లేదు, బ్లూటూత్, వైఫై,ఇంటర్నెట్ను వినియోగించలేరని అన్నారు.We should eliminate electronic voting machines. The risk of being hacked by humans or AI, while small, is still too high. https://t.co/PHzJsoXpLh— Elon Musk (@elonmusk) June 15, 2024 -
Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
మహారాష్ట్రలో ‘మహా’ కూటముల కొట్లాట కాక రేపుతోంది. యూపీ తర్వాత అత్యధికంగా ఇక్కడ 48 లోక్సభ స్థానాలుండగా తొలి మూడు దశల్లో 24 సీట్లలో పారీ్టల భవితవ్యం ఈవీఎంలలోకి చేరిపోయింది. నాలుగో అంకంలో 13న రాష్ట్రంలో మరో 11 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్డీఏ (మహాయుతి), ఇండియా (మహా వికాస్ అగాడీ) కూటములు హోరాహోరీగా తలపడుతున్న కీలక నియోజకవర్గాలపై ఫోకస్... ఔరంగాబాద్... మజ్లిస్ మేజిక్! కాంగ్రెస్, శివసేనలకు కంచుకోటగా నిలిచిన ఈ స్థానంలో గత లోక్సభ ఎన్నికల్లో సంచలనం నమోదైంది. శివసేన నుంచి వరుసగా నాలుగుసార్లు విక్టరీ కొట్టిన చంద్రకాంత్ ఖైరే మజ్లిస్ అభ్యర్థి సయ్యద్ ఇంతియాజ్ జలీల్ చేతిలో అనూహ్యంగా ఓటమి చవిచూశారు. 97 ఏళ్ల మజ్లిస్ చరిత్రలో తెలంగాణ వెలుపల ఇదే తొలి ఎంపీ స్థానం! 1980 తర్వాత ఔరంగాబాద్లో మైనారిటీ గెలుపొందడం అదే ప్రథమం. స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ జాధవ్కు ఏకంగా 2.8 లక్షల ఓట్లు పోలవడం ఖైరే ఓటమికి ప్రధాన కారణం. మజ్లిస్ మళ్లీ జలీల్నే బరిలోకి దించింది. విపక్ష మహా వికాస్ అగాడీ తరఫున శివసేన (ఉద్దవ్) అభ్యరి్థగా ఖైరే కూడా పోయిన చోటే వెతుక్కుంటున్నారు. ఇక అధికార మహాయుతి కూటమి తరఫున శివసేన (షిండే) అభ్యర్థి సందీపన్రావ్ భూమ్రే బరిలో ఉన్నారు. ఆయన బలమైన మరాఠ్వాడా నేత. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగానూ చేశారు. మరాఠా రిజర్వేషన్ల పోరుతో మరాఠ్వాడా ప్రాంతంలో ఎంతో పేరు సంపాదించిన హర్షవర్ధన్ ఈసారి కూడా ఇండిపెండెంట్గా ప్రధాన పార్టీలకు సవాలు విసురుతున్నారు. ప్రకాశ్ అంబేద్కర్ వంచిత బహుజన్ అగాడీ నుంచి అఫ్సర్ ఖాన్ పోటీలో ఉన్నారు. 32 శాతం ముస్లిం జనాభా ఉన్న ఔరంగాబాద్లో ఈసారి చతుర్ముఖ పోరులో ఎలాంటి సంచలనం నమోదవుతుందోనన్న ఆసక్తి నెలకొంది.జాల్నా... రావ్సాహెబ్ డబుల్ హ్యాట్రిక్ గురి ఇది బీజేపీకి మరో కంచుకోట. 1999 నుంచి వరుసగా ఐదుసార్లు విజయ ఢంకా మోగించిన రావ్సాహెబ్ దన్వే పాటిల్ డబుల్ హ్యాట్రిక్ లక్ష్యంగా మరోసారి బరిలో నిలిచారు. మోదీ రెండు విడతల్లోనూ కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న దన్వే గత ఎన్నికల్లో 3.3 లక్షల పైగా మెజారిటీతో గెలిచారు. గత రెండు పర్యాయాలూ బీజేపీని ఢీకొన్న విలాస్ ఔతాడేను కాంగ్రెస్ ఈసారి పక్కనపెట్టింది. 2009లో బీజేపీకి గట్టిపోటీ ఇచ్చి కేవలం 8,482 ఓట్ల తేడాతో ఓడిన కల్యాణ్ విజినాథ్ కాలేను రంగంలోకి దించింది.పుణె.. మాజీ మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే ఇక్కడ గత రెండుసార్లూ బీజేపీదే విజయం. అయితే సిట్టింగ్ ఎంపీ గిరీశ్ బాపట్ గతేడాది మరణించడంతో పుణె మాజీ మేయర్ మురళీధర్ కిశాన్ మాహోల్కు ఈసారి బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్ను బరిలో నిలిపింది. పుణె లోక్సభ స్థానం పరిధిలోని కస్బాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో గతేడాది జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యరి్థని ధంగేకర్ మట్టికరిపించడం విశేషం. 28 ఏళ్లుగా కాషాయ జెండా ఎగురుతున్న ఈ సీటు చేజారడం కమలనాథులకు భారీ షాకే. ఇదే జోరుతో పుణె లోక్సభ స్థానాన్నీ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయతి్నస్తోంది.షిర్డీ... శివసేన కుస్తీ 2009లో ఉనికిలోకి వచి్చనప్పటి నుంచీ ఇది శివసేన ఖాతాలోనే పడుతోంది. గత రెండు ఎన్నికల్లో నెగ్గిన సదాశివ లోఖండే ఇప్పుడు శివసేన (షిండే) వర్గం నుంచి మహాయుతి అభ్యరి్థగా హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తున్నారు. షిర్డీ తొలి ఎంపీ, శివసేన (ఉద్ధవ్) నేత భావుసాహెబ్ రాజారామ్ వాక్చౌరే ఎంవీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. రెండు శివసేన వర్గాలకు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఈ స్థానం కోసం పట్టుబట్టినా సీఎం షిండే మోకాలడ్డారు. అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ పార్టీ వీబీఏ అభ్యర్థి ఉత్కర్‡్ష రూపవతి ఎవరి ఓట్లకు గండి పెడతారన్నది ఆసక్తికరం! బీడ్.. పంకజకు రిజర్వేషన్ సెగ ఈ స్థానం బీజేపీ దుర్గం. దివంగత గోపీనాథ్ ముండే కుటుంబానికి గట్టి పట్టున్న స్థానం. ఈసారి అదే కుటుంబం నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రీతం ముండే బదులు అక్క, మాజీ మంత్రి పంకజా ముండేను బీజేపీ బరిలోకి దించింది. అయితే మారాఠా రిజర్వేషన్లపై అట్టుడుకుతున్న ఈ నియోజకవర్గంలో మహాయుతి కూటమిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దాంతో పంకజ ఎదురీదాల్సిన పరిస్థితి! అయితే 2019లో పర్లీ అసెంబ్లీ స్థానంలో పంకజను ఓడించిన సోదరుడు ఎన్సీపీ (అజిత్) నేత ధనంజయ్ ముండే దన్నుగా నిలవడం ఆమెకు కలిసొచ్చే అంశం. 2019లో 5 లక్షల పై చిలుకు ఓట్లతో ప్రీతం మెజారిటీకి భారీగా గండికొట్టిన భజరంగ్ మనోహర్ సోన్వానే ఎంవీఏ కూటమి నుంచి ఎన్సీపీ (శరద్) టికెట్పై బీజేపీకి మళ్లీ సవాలు విసురుతున్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న దంగర్ సామాజిక వర్గం ఎప్పటి నుంచో ఎస్టీ రిజర్వేషన్లు డిమాండ్ చేస్తోంది. మరాఠా కోటా, ఈ ఎస్టీ హోదా డిమాండ్లు ఎవరిని ముంచుతాయన్నది ఆసక్తికరం. జల్గావ్... టఫ్ ఫైట్ రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడ పాతుకుపోయిన కమలనాథులకు ఈసారి మహా వికాస్ అగాడీ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ నేత ఉన్మేశ్ పాటిల్ 4 లక్షల పైగా బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టారు. అయినా ఈసారి ఆయన్ను కాదని స్మితా వాఘ్కు బీజేపీ టికెటిచ్చింది. ఎంవీఏ నుంచి శివసేన (ఉద్దవ్) నేత కరన్ బాలాసాహెబ్ పాటిల్ పోటీ చేస్తున్నారు. గతంలో గట్టి పోటీ ఇచి్చన ఎన్సీపీ (శరద్) దన్నుండటం కరన్కు కలిసొచ్చే అంశం. ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లూ మహాయుతి కూటమి చేతిలోనే ఉన్నాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
జూన్ 4 తర్వాత జరిగేది ఇదే.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
లోక్సభ ఎన్నికల తరుణంలో ప్రధాని మోదీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్), శివసేనలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్4 లోక్సభ ఎన్నికల ఫలితాలు విడుదల అనంతరం డూబ్లికేట్ ఎన్సీపీ, డూబ్లికేట్ శివసేన తమ పార్టీలను కాంగ్రెస్లో విలీనం చేయాలని చూస్తున్నాయని ఎద్దేవా చేశారు.నార్త్ మహరాష్ట్ర నందూర్బర్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును ప్రస్తావించకుండా ఆయనపై సెటైర్లు వేశారు.ఓ పెద్దాయన 40-50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఓ పెద్దాయన జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదల అనంతరం.. రాజకీయ ఉనికి కోసం తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలని చూస్తున్నారని అన్నారు.నకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన మనసులోనకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన మనసులో తమ పార్టీలను కాంగ్రెస్లో విలీనం చేయాలనే ఉందనే కదా దీనర్ధం. కాంగ్రెస్లో విలీనం చేసిన రాజకీయ నిరుద్యోగులుగా మిగిలే బదులు.. వచ్చి అజిత్ పవర్, ఎక్నాథ్ షిండ్తో చేతులు కలిపితే బాగుంటుందని ప్రధాని మోదీ సలహా ఇచ్చారు. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కుఇంతకు ముందు ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో శరద్ పవార్ విలీనంపై మాట్లాడారు. రానున్న సంవత్సరాల్లో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కు దగ్గర కానున్నాయి. అంతేకాదు తమ రాజకీయ భవిష్యత్ బాగుండాలంటే కాంగ్రెస్లోనే విలీనం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు వ్యాఖ్యానించారు. తాజా ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ విలీనం వ్యాఖ్యలపై మోదీ స్పందించినట్లు తెలుస్తోంది. -
బీజేపీ కూటమి.. ఆ ఆరు స్థానాల్లో ఎవరు?
లోక్సభ ఎన్నికల మొదటిదశ పోలింగ్ మరో నాలుగు రోజులున్నా.. ఇంకా మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో మరో ఆరు సీట్ల అభ్యర్థుల కేటాయింపు పెండింగ్లో ఉంది. ఆ ఆరు కీలక స్థానాల్లో మహాయుతి కూటమి పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఏ సీట్లు ఇవ్వాలో నిర్ణయం తీసుకోలేకపోతోందని పార్టీల్లో తీవ్ర చర్చ జరగుతోంది. ఇవే ఆ ఆరు స్థానాలు.. దక్షిణ ముంబై, థానే, పాల్ఘర్, రత్నగిరి-సింధుదుర్గ్ సీటు, నాసిక్ ఔరంగాబాద్. నాసిక్ సీటులో ఎన్సీపీ( అజిత్ పవార్) పార్టీ తరఫున మాజీ మంత్రి ఛగన్ భుజబల్ను ప్రతిపాధించగా.. సీఎం ఏక్నాథ్ షిండే(శివసేన) ఆ స్థానాన్ని వదులకోవడానికి సిద్ధం లేనట్టు తెలుస్తోంది. నాసిక్ స్థానం శిశసేన సిట్టంగ్ స్థానం. అక్కడ ఎంపీగా హేమంత్ గాడ్సే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఔరంగాబాద్ నుంచి బీజేపీ ఎంపీ పార్లమెంట్లో అడుగుపెడతారని ఇటీవల కేంద్రహోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. సీఎం ఏక్నాథ్ షిండే సోమవారం పార్టీ కార్యకర్తల మీటింగ్ మాట్లాడుతూ.. ఔరంగాబాద్ నుంచి శివసేన అభ్యర్థి బరిలోకి దిగుతారని వ్యాఖ్యానించటం గమనార్హం. థానే, రత్నగిరి-సింద్దుర్గ్ రెండు స్థానాల్లో బీజేపీనే పోటీ చేయాలని భావించినప్పటికీ.. తర్వాత తన ఆలోచనను విరమించుకొని థానే సీటును శివసేన( షిండే)కు కేటాయించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ ఉమ్మడి శివసేన అభ్యర్థిగా 2019లో రాజన్ విచారే గెలుపొందారు. శివసేన పార్టీ చీలిన తర్వాత ఆయన ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో ఉన్నారు. అయితే శివసేనకు కంచుకోట అయిన థానే స్థానాన్ని షిండే వదలుకుకోవడాని సిద్ధంగా లేరని సమాచారం. అయితే థానేకు బదులు రత్నగిరి-సింద్దుర్గ్ను శివసేన బీజేపీకి ఇవ్వడానికి ఆసక్తి చూపుతోంది. ఇక ఈ స్థానంలో బీజేపీ నారాయణ రాణేను బరిలోకి దించాలని యోచిస్తోంది. పాల్ఘర్ స్థానం బీజేపీ దక్కే అవకాశం ఉంది. 2019లో శివసేన గెలిచే వరకు పాల్ఘర్ బీజేపీ పట్టున్న స్థానం. ఇప్పటికే పలు స్థానాలను వదులుకున్న శవసేన.. సౌత్ ముంబై స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధం లేదు. సీఎం షిండే శివసేన మొదట్లో ముంబైలో మొత్తం 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ అందులో ఇద్దరిని మార్పు చేశారు. నాలుగురికి టికెట్ తిరస్కరించింది. సీట్ల విషయంలో శివసేన ఒత్తిడిలో ఉన్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శివసేనకు బలం ఉన్న ముంబై, ఇతర సీట్లను వదులుకోవడాని సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈసారి సౌత్ ముంబై, థానే, రత్నగిరి సింద్దుర్గ్, నాసిక్ స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు బీజేపీ భావిస్తోంది. అయితే శివసేన ఈ సీట్లను వదులుపోవడానికి సిద్ధంగా లేదు. ఒకట్రెండు రోజుల్లో ఈ సిట్లలో ఎవరికి దక్కుతాయో కొలిక్కి రానుంది. ఇక.. అజిత్ పవార్ ఎన్సీపీ ఆశిస్తున్న నాసిక్ సీటు సైతం షిండే(శివసేన) దక్కించుకోనున్నట్లు సమాచారం.థానే సీటును ఏక్నాథ్ షిండే దక్కించుకునే అవకాశం ఉందని.. రత్నగిరి-సింధుదుర్గ్ సీటు బీజేపీకి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. -
‘శివసేన, ఎన్సీపీ పార్టీల చీలికకు కారణం వారిపై ప్రేమ’
ముంబై: లోక్సభ ఎన్నికల వేళ శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీల చీలికపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలు తమ సొంత పార్టీల నుంచి చీలిపోవడానికి కోడుకు, కూతురి మీద చూపించిన ప్రేమే కారణమని అన్నారు. ఆదివారం భండారా జిల్లాలోని సకోలి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొని మాట్లాడారు. మహా వికాస్ ఆఘాడీ కూటమిలో శివసేన( ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్), కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకంలో విభేదాలు ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ పార్టీలను విభజిస్తుందన్న ఆరోపణలపై అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. ‘శివసేన, ఎన్సీపీల్లో చీలికలు రావడానికి కారణం ఉద్ధవ్కు కొడుకు మీద, శరద్ పవార్కు కూతురు మీద ప్రేమే కారణం. కూటమిలోని మూడు పార్టీ మహారాష్ట్రకుఘ ఏం మంచి చేశారు’ అని అమిత్ షా ధ్వజమెత్తారు. మరోవైపు.. ఇటీవల ప్రధాని నరేంద్ర ఎన్నికల ప్రచారం పాల్గొని శివసేన(ఉద్ధవ్) పార్టీపై నకిలీ శివసేన అంటూ విమర్శలు గుప్పించారు. ఇటీవల అమిత్ షా.. మహా వికాస్ ఆఘాడీను సరిపోలని విడి భాగాలతో కూడిన ఆటో రిక్షాతో పోల్చుతూ విమర్శలు చేశారు. ఇక.. మహా వికాస్ ఆఘాడీ కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సాంగ్లీ, భీవండి, ముంబై సౌత్ సెంట్రల్ స్థానాలను కాంగ్రెస్ వదులుకున్న విషయం తెలిసిందే. సీట్ల పంపకంలో భాగంగా శివసేన(ఉద్ధవ్) 21 స్థానాలు,ఎన్సీపీ 10 స్థానాలు, కాంగ్రెస్ పది స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
శివసేన మోదీ డిగ్రీలా నకిలీ కాదు: ఉద్ధవ్ ఠాక్రే
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ చేసిన నకిలీ శివసేన ఆరోపణలపై శివసేన( ఉద్ధవ్) పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కౌంటర్ ఇచ్చారు. మరాఠా భూమి పుత్రుల హక్కుల కోసం పోరాడటానికి బాలా సాహేబ్ ఠాక్రే శివసేన పార్టీని స్థాపించారని అన్నారు. ‘మరాఠా భూమి పుత్రుల హక్కుల పోరాటం కోసం దివంగత నేత బాల్ ఠాక్రే శివసేనను స్థాపించారు. శివసేన పార్టీనే నకిలీ అంటే.. నరేంద్ర మోదీకి ఉన్న డిగ్రీ కూడా నకిలీనే’ అని ఉద్ధవ్ మండిపడ్డారు. అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఇండియా కూటమి 300 సీట్లను గెలుచుకుందన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల మహారాష్ట్రలోని ఓ ర్యాలీలో పాల్గొని ఉద్ధవ్ (శివసేన)పై విమర్శలు చేశారు. ఉద్ధవ్ శివసేన.. నకిలీ శివసేన పార్టీ అని అన్నారు. ‘ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన భాగస్వామ్య పార్టీ డీఎంకే సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చింది. కాంగ్రెస్, నకిలీ శివసేన(ఉద్ధవ్) కూడా మహారాష్ట్రలో ర్యాలీల్లో ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు’ అని ప్రధాని మండిపడ్డారు. ఇక..2022లో శివసేన పార్టీ రెండుగా చీలిపోయిన విషయం తెలిసింది. ఏక్నాథ్ షిండే పలువురు రెబల్ ఎమ్మెల్యేలతో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. అతనోపాటు వచ్చిన కొందరికి మంత్రి పదవులు కూడా కేటాయించారు. అసలైన శివసేన పార్టీ ఎవరిదని ఉద్ధవ్, షిండే వర్గాలు పిటిషన్లు వేశాయి. దీంతో కోర్టు అనుమతిలో ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ ప్రకటించారు. -
రాజ్ఠాక్రేపై ఏ ఫైల్ ఓపెన్ చేశారు: సంజయ్ రౌత్
ముంబై: లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ఠాక్రేపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్ ఠాక్రేపై ఏదో ఫైల్ ఓపన్ చేశాని.. అందుకే ఒక్కసారిగా బీజేపీకి తన మద్దతు ప్రకటించారని సంజయ్ రౌత్ అన్నారు. ‘ఒక్కసారిగా ఏదో విచిత్రం జరిగింది. మేము ఈ విషయాన్ని రాజ్ఠాక్రేను అడగదలుచుకున్నాం. ఒక్కసారిగా మారిపోయి మహారాష్ట్ర శత్రువుల(ప్రత్యర్థుల)వైపు చేరి పూర్తి మద్దతు ఇస్తున్నారు. మీరు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? ఇలా చేయటం వెనక ఉన్న బలమైన కారణం ఏంటీ? మీ మీద ఏ ఫైల్ ఓపెన్ చేశారు?’ అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు సోదరుడైన రాజ్ ఠాక్రే... తన పార్టీ బీజేపీ, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ (ఎన్సీపీ) కూటమికి సంపూర్ణ మద్దత ఇస్తుందని ప్రకటించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ ఠాక్రే.. తన పార్టీ కేవలం ప్రధాని నర్రేందమోదీ, ఎన్డీయే కూటమికే మాత్రమే మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తనకు 1990 నుంచి బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. మొదటి నుంచి నరేంద్ర మోదీ.. ప్రధాని అవుతారన్న వారిలో తాను ఒకరినని చెప్పారు. ఇక.. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం మహావికాస్ ఆఘాడీ కూటమి మధ్య సీట్లు పంపిణీ ఖరారైన విషయం తెలిసిందే. శివసేన (యూబీటీ)కి -21,కాంగ్రెస్- 17, ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్)-10 సీట్లుతో లోక్సభ ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. -
మహారాష్ట్రలో కూటమి సీట్ల పంపిణీ ఖరారు.. ఏ పార్టీకి ఎన్ని?
ముంబై: లోక్సభ ఎన్నికల వేళ ఎట్టకేలకు మహారాష్ట్రలో ప్రతిపక్షాల ఇండియా కూటమి సీట్ల పంపిణీ ఒప్పందం కుందిరింది. ఈ మేరకు మంగళవారం మహావికాస్ఆఘాడీ నేతలు సంయుక్తంగా ప్రకటించారు. శివసేన(యూబీటీ) 21 సీట్లు, కాంగ్రెస్పార్టీ 17 సీట్లు, ఎన్సీపీ(శరద్ చంద్ర పవార్) 10 సీట్లతో లోక్సభ ఎన్నికల బరిలో దిగనున్నారు. మొదటి నుంచి ఆశించిన సంగాలి లోక్సభ నియోజకవర్గాన్ని శివసేన(యూబీటీ) దక్కించుకోగా.. భీవండి స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. మరోవైపు శివసేన(యూబీటీ)కి పట్టు ఉన్న ముంబై నార్త్ స్థానాన్ని సీట్ల పంపిణీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవటం గమనార్హం. సీట్ల పంపిణీ అనంతం శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. ‘ప్రతిఒక్కరు అన్ని సీట్లలో గెలవడానికి తీవ్రంతా పోరాడాలి. పోరాడటంలో ఎలాంటి తప్పు లేదు. ఖచ్చితంగా అన్ని సీట్లలో గెవడానే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి’ అని ఉద్ధవ్ అన్నారు. మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. అయితే కొన్ని కీలకమైన సీట్ల విషయంలో మహా వికాస్ ఆఘాడీ కూటమి సీట్ల పంపకం కొంత జాప్యమైన విషయం తెలిసిందే. -
‘కళ్యాణ్’ స్థానంలో మళ్లీ సీఎం కుమారుడే పోటీ
ముంబై: లోక్సభ ఎన్నికల్లో కళ్యాణ్ నియోజకవర్గంలో ఎట్టకేలకు సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు సిట్టింగ్ ఎంపీ శ్రీకాంత్ షిండే మరోసారి బరిలో దిగనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ శనివారం ప్రకటించారు. కళ్యాణ్ పార్లమెంట్ స్థానంలో శ్రీకాంత్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ నేతలు వ్యతిరేకించారు. అయితే ఇవాళ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్వయంగా కళ్యాణ్ స్థానంలో శ్రీకాంత్ షిండే పోటీ చేస్తారని ప్రకటించటం ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్సభ ఎన్నికల్లో శ్రీకాంత్ షిండే గెలుపు కోసం బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. నాగ్పూల్లో బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సం సందర్భంగా ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడారు. ‘కళ్యాణ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మళ్లీ శ్రీకాంత్ షిండే బరిలో దిగుతున్నారు. ఆయన్ను ఓడించేందుకు తమకూటమకి ప్రతిపక్షమే లేదు. కళ్యాణ్ స్థానంలో శవసేన (ఏక్నాథ్ షిండే) పార్టీ బరిలోకి దిగుతుంది. అభ్యర్థిగా ఏక్నాథ్ షిండే కుమారుడు సిట్టింగ్ ఎంపీ శ్రీకాంత్ షిండే పోటీ చేస్తారు’ అని దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. శ్రీకాంత్ షిండే.. ఇప్పటికే కళ్యాణ్ పార్లమెంట్ స్థానంలో రెండుసార్లు (2014, 2019) పోటిచేసి విజయం సాధించారు. ఇక.. ఇప్పటికే ‘జ్వలించే టార్చ్’ గుర్తును సొంతం చేసుకున్న శివసేన (యూబీటీ) ఇప్పటికే 21 స్థానాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అదే వింధంగా షిండే వర్గం 9 స్థానాలు, బీజేపీ 24 స్థానాలు, ఎన్సీపీ( అజిత్ పవార్)- 4, రాష్ట్రీయా సమాజ్ పక్షా-1 ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కూటమి మరో 10 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి మే 20 పోలింగ్ జరిగి.. జూన్ 4ను ఫలితాలు విడుదల కాన్నాయి. -
Sanjay Nirupam: కొంప ముంచిన విమర్శలు.. ఆరేళ్లపాటు బహిష్కరణ
ముంబై: లోభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా సొంత పార్టీపై విమర్శలు చేస్తున్న మాజీ ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు, సీనియర్ నేత సంజయ్ నిరూపమ్పై వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. ‘సంజయ్ నిరూపమ్ క్రమశిక్షణారాహిత్యం, పార్టీ వ్యతిరేక ప్రకటనలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆరేళ్లపాటు బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు’ అని కాంగ్రెస్ పార్టీ జనరల్సెక్రటరీ కేసీ వేణు గోపాల్ వెల్లడించారు. అదేవిధంగా స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి కూడా పేరును కాంగ్రెస్ పార్టీ తొలగించింది. మాజీ లోక్సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ పనిచేసిన సంజయ్ నిరూపమ్.. ఇటీవల సీట్ల పంపిణీ విషయంలో ‘మహావికాశ్ ఆఘాడీ కూటమి’లోని శివసేన(యూబీటీ) పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. చదవండి: అభ్యర్థుల ప్రకటన.. ఉద్ధవ్ వర్గంపై కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు కాంగ్రెస్ పార్టీ ఆయన్ను బహిష్కరించిన తర్వాత ఎక్స్ వేదికగా సంజయ్ నిరూపమ్ స్పందించారు. ‘ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ తనను తాను రక్షించుకోవడానికి మరింత శక్తిని కూడదీసుకోవాలి. నేను పార్టీకి ఇచ్చిన గడువు ముగిసిపోయింది. తదుపరి నా కార్యాచరణను తెలియజేస్తాను’ అని ట్వీట్ చేశారు. మహావికాశ్ ఆఘాడీ కూటమిలో భాగంగా ముంబైలోని ఆరు స్థానాల్లో నాలుగు సీట్లను శివసేన (యూబీటీ)కి కేటాయించటంపై కాంగ్రస్ పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తాను పోటీ చేద్దామని భావిస్తున్న ముంబై నార్త్ వెస్ట్ స్థానం శివసేన (యూబీటీ) దక్కటంపై సొంతపార్టీపైనే విమర్శల దాడికి దిగారు. అయితే 2014 లోక్సభ ఎన్నికలో పోటీ చేసిన సంజయ్ నిరూపమ్ సమీప బీజేపీ అభ్యర్థి గోపాల్శెట్టి చేతిలో ఓటమిపాలయ్యారు. -
శివసేన(యూబీటీ) తొలి జాబితా విడుదల.. 17 మందికి చోటు
ముంబై:లోక్సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ శివసేన (యూబీటీ) తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే.. 17 మంది అభ్యర్థులను శివసేన(యూబీటీ) బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు ఆ పార్టీనేత సంజయ్ రౌత్ జాబితాను ఎక్స్లో పోస్ట్ చేశారు. కీలకమైన ముంబై సౌత్ సెంట్రల్ పార్లమెంట్ స్థానాన్ని శివసేన (యూబీటీ) అనిల్ దేశాయ్కి కేటాయించింది. ఐదు సిట్టింగ్ అభ్యర్థులకు శివసేన(యూబీటీ) మళ్లీ అవకాశం కల్పించింది. ముంబై సౌత్- అరవింద్ సావంత్, ముంబై నార్తీస్ట్- సంజయ్ పాటిల్, ముంబై నార్ట్ వెస్- అమోల్ కిర్తికార్, థానే- రాజన్ విచారే, వినాయక్ రౌత్- రత్నగిరి సింధ్దుర్గ్, పర్బానీ-సంజయ్ జాదవ్, ఉస్మానాబాద్- ఓంరాజే నింబాల్కర్ పోటీలో ఉన్నారు. అదేవిధంగా శివసేన (యూబీటీ) ఔరంగాబాద్లో మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరేను బరిలోకి దింపుతోంది. మాజీ కేంద్ర మంత్రులు అనంత్ గీతే( రాయ్గఢ్), అరవింద్ సావంత్(దక్షిణ ముంబై) నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.మహావికాస్ ఆఘాడీ భాగస్వామి కాంగ్రెస్ పట్టుబట్టిన సాంగ్లీ స్థానం నుంచి ఇటీవల పార్టీలో చేరిన రెజ్లర్ చంద్రహర్ పాటిల్ను పోటీకి దింపింది శివసేన(యూబీటీ). ముత్తం 48 లోక్ సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమై.. ఐదు విడతల్లో పోలింగ్ జరగనుంది. हिंदूहृदयसम्राट शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे यांच्या आशीर्वादाने आणि शिवसेना पक्ष प्रमुख श्री.उद्धवजी ठाकरे यांच्या आदेशाने शिवसेनेच्या 17 लोकसभा उमेदवारांची यादी जाहीर करण्यास येत आहे.. *मुंबई दक्षिण मध्य:श्री अनिल देसाई यांच्या उमेदवारीची घोषणा करण्यात येत आहे. इतर 16 उमेदवार… pic.twitter.com/nPg2RHimSF — Sanjay Raut (@rautsanjay61) March 27, 2024 -
‘అవును.. ఆ రెండు పార్టీలను చీల్చే మేం అధికారంలోకి వచ్చాం’
సాక్షి,ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన 2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచార స్లోగన్ ‘ఐ విల్ బి బ్యాక్’ గురించి ప్రస్తావించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఓ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న దేవేంద్ర ఫడ్నవీస్ రచయిత ప్రియమ్ గాంధీ-మోదీతో 2019 ఎన్నికల గురించి మాట్లాడారు. తాను ఐ విల్ బి బ్యాక్ అంటూ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిచ్చాను. రెండోసారి అధికారంలోకి వస్తామని భావించాం. కానీ అది సాధ్యపడలేదు. మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆ కూటమిని చీల్చి అధికారంలోకి వచ్చాం. ఇదంతా చేయడానికి రెండున్నరేళ్లు పట్టిందని అన్నారు. అదే ఎన్నికల్లో ‘బీజేపీ గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకుంది.శివసేన (2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉద్ధవ్ ఠాక్రే మాకు ద్రోహం చేశారు. ఫలితంగా మేం ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది’ అని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. రాజకీయ పరిణామాలతో ఆ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్లు మహా వికాస్ అఘాడీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా ఉద్దవ్ ఠాక్రే ఎంపికయ్యారు. అయితే, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో మహా వికాస్ అఘాడీ కూటమి కుప్పకూలింది. ఆ తర్వాత బీజేపీ, శివసేనలోని ఏక్నాథ్ షిండే వర్గం, ఎన్సీపీలోని అజిత్ పవార్ వర్గాలు ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఆ కూటమిలో మహరాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలుగా దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు కొనసాగుతున్నారు. -
ఎలక్టోరల్ బాండ్లపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. ఈడీ, సీబీఐ దాడులు జరిపిన సంస్థలే ఈ ఎలక్టోరియల్ బాండ్లను కొనుగోలు చేయడంపై ఆయా పార్టీలకు చెందిన నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఎలక్టోరల్ బాండ్పై శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గేమింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలు కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల ప్రధాన లబ్ధిదారుగా బీజేపీ ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు. దేశంలోనే ఇదే అతిపెద్ద కుంభకోణమని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ ద్వారా గేమింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయడం, నిధులను నేరుగా ఆయా పార్టీల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా..గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్ కార్పొరేషన్ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. అవి అధికార పార్టీ బీజేపీ అకౌంట్లలో జమవుతాయి. ఇలాంటివి గతంలో చాలానే జరిగాయి. ఎలక్టోరల్ బాండ్లలో డబ్బును కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు బదిలీ చేసిన కంపెనీలకు ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కంపెనీలపై ఇటీవల జరిగిన ఈడీ దాడులకు, ఆ తర్వాత బాండ్ల కొనుగోలుకు మధ్య సంబంధాన్ని సూచించారు. ప్రజలు ఇలాంటి వాటిని నిత్యం గమనిస్తూనే ఉన్నారు. ఈడీ దాడులు చేస్తుంది. కొన్ని గంటల తర్వాత, ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేస్తారని మండిపడ్డారు. -
ఉద్ధవ్ ఠాక్రేకు రాహుల్ గాంధీ ఫోన్.. సీట్ల పంపకంపై చర్చ!
ముంబై: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీట్ల పంపకం కసరత్తు విషయంలో వేగం పెంచుతోంది. ఈ క్రమంలో శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసిన సుమారు గంటసేపు మాట్లడినట్లు తెలుస్తోంది. భారత్ జోడో న్యాయ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఉద్ధవ్ ఠాక్రేకు ఫోన్ మాట్లాడటంపై ఇరు పార్టీల్లో సీట్ల పంపంకంపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ముంబైలోని ఆరు లోక్సభ స్థానాల్లో.. ముంబై సౌత్ సెంట్రల్, ముంబై నార్త్ సెంట్రల్, ముంబై నార్త్ వెస్త్ సగ్మెంట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే ముంబై సౌత్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై నార్త్ ఈస్ట్, ముంబై సౌత్ సెంట్రల్ సీట్లను కలుపుకొని మొత్తం 18 లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఈ సీట్ల సర్దుబాటు ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, శివసేన (యూబీటీ) మధ్య సీట్ల పంపకంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ సీట్ల పంపకంపై మాట్లాడినట్లు సమాచారం. మహారాష్ట్రలోని 48 సీట్లలో 8 సీట్ల విషయంలో ఉన్న ప్రతిష్టంభనపై స్పష్టత ఇవ్వడానికి రాహుల్ గాంధీ ఉద్ధవ్కు కాల్ చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి శివసేన గత 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో 48 సీట్లకు గాను 22 స్థానాల్లో పోటీ చేసి 18 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక.. శివసేనలో చీలిక వచ్చి కొంత మంది ముఖ్యనేతలు ఏక్నాథ్షిండే వర్గంలో ఉండి బీజేపీలో చేరారు. అదే విధంగా మహాఘట్బంధన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఎన్సీపీలో సైతం చీలికలు వచ్చి అజిత్ పవార్ వర్గం బీజేపీలో చేరింది. మరోవైపు ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అశోక్ చవాన్, మిలింద్ దేవరా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శివసేనతో సీట్ల పంపకం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ, ఢిల్లీలో ఆప్తో సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఠాక్రేకు రాహుల్ కాల్ చేయటం చర్చనీయాంశంగా మారింది. -
విధేయతే లేదు.. కేవలం రాజకీయమే: సంజయ్ రౌత్
ముంబయి: కాంగ్రెస్ పార్టీని వీడిన మిలింద్ దేవరాపై శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. ప్రస్తుత రోజుల్లో అధికారం కోసం మాత్రమే రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. పార్టీకి విధేయత అనేది ఉనికిలో లేదని చెప్పారు. మిలింద్ దేవరా తండ్రి మురళీ దేవరా గురించి కూడా ప్రస్తావిస్తూ.. పార్టీ కోసం ఏం చేయాలో తెలిసిన గొప్ప నాయకుడని కొనియాడారు. " విధేయత, భావజాలం వంటి అంశాలు ఇప్పుడు లేవు. రాజకీయాలు ఇప్పుడు కేవలం అధికారం గురించి మాత్రమే నడుస్తున్నాయి. నాకు మిలింద్ దేవరా తెలుసు.. ఆయన పెద్ద నాయకుడు. కాంగ్రెస్తో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు." అని కాంగ్రెస్కు మిలింద్ దేవర రాజీనామా చేయడంపై రౌత్ మాట్లాడారు. లోక్సభ ఎన్నికలకు ఇంకా నెలరోజుల ముందు మహారాష్ట్రలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ నాయకుడు మిలింద్ దేవరా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, శివసేన (యుబిటి)ల మధ్య సీట్ల పంపకాల చర్చలపై ఆయన కలత చెందినట్లు సమాచారం. 'రాజకీయ ప్రయాణంలో ముఖ్యమైన ముగింపు. నేను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. పార్టీతో నా కుటుంబానికి 55 ఏళ్ల బంధాన్ని ముగించాను. ఇన్ని ఏళ్లుగా పార్టీ నుంచి నాకు మద్దతు తెలిపిన నాయకులు, సహచరులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.'అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా మిలింద్ దేవరా పంచుకున్నారు. Congress leader Milind Deora resigns from the primary membership of Congress "Today marks the conclusion of a significant chapter in my political journey. I have tendered my resignation from the primary membership of Congress, ending my family’s 55-year relationship with the… pic.twitter.com/iCAmSpSVHH — ANI (@ANI) January 14, 2024 ముంబయి సౌత్ లోక్సభ స్థానం నుంచి మిలింద్ కాంగ్రెస్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో శివసేన నేత ప్రమోద్ సావంత్ చేతిలో ఓటమిపాలయ్యి రన్నరప్గా నిలిచారు. ఈ సారి ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా సౌత్ ముంబయి లోక్ సభ స్థానాన్ని శివసేన(యూబీటీ)కి కేటాయించారు. దీంతో అసంతృప్తికి లోనైన మిలింద్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్కు సీనియర్ నేత గుడ్ బై.. 55 ఏళ్ల పాటు పార్టీకి సేవలు.. చివరకు.. -
ఆ సమయంలో ఏది సరైందో అదే చేశా! మహారాష్ట్ర మాజీ గవర్నర్
మహారాష్ట్రలో శివసేన సంక్షోభం కేసులో సుప్రీంకోర్టు నాటి మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ బలపరీక్ష నిర్ణయాన్ని తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాటి గవర్నర్ 80 ఏళ్ల భగత్ సింగ్ కోష్యారీని మీడియా ప్రశ్నించగా..నన్ను శిక్షించిందని అనుకోవడం లేదని తెలివిగా సమాధానమిచ్చారు. కారణం తాను రాజీనామా చేశానని, మాజీ గవర్నర్కు శిక్ష విధిస్తారని తాను అనుకోవడం లేదంటూ కప్పిపుచ్చుకునే యత్నం చేశారు. ఒక వేళ శిక్ష విధిస్తే తాను అప్పీల్ చేసి ఉండేవాడినంటూ తన రాజకీయ చతురతను ప్రదర్శించారు కోష్యారీ. ఐతే తాను ఆ సమయంలో ఏది సరైనదో అదే చేశానని అన్నారు. అయినా సుప్రీం కోర్టు తీర్పుపై చర్చించడం జర్నలిస్టులు, లాయర్ల పని అని సెటైరికల్ సమాధానమిచ్చారు. పైగా సుప్పీంకోర్టు ఆయన నిర్ణయాన్ని తప్పు పట్టిన విషయానికి నేరుగా సమాధానం ఇవ్వకుండా ఇలా తప్పించుకునే థోరణితో సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా, నాటి ఘటనలో ఉద్ధవ్ థాక్రే మెజారిటీ కోల్పోయారని గవర్నర్ నిర్ధారణకు వచ్చేయడం కూడా సరికాదని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. పైగా గవర్నర్ అలా నిర్ణయించడం రాజ్యంగ విరుద్ధమని, పార్టీ వ్యవహారాల్లో ఆయన జోక్యం కూడా రాజ్యాంగ సమ్మతం కాదని తేల్చి చెప్పింది. మాజీ సీఎం థాక్రే బలపరీక్షకు వెళ్లకుండానే రాజీనామా చేశారని అందువల్లే ప్రభుత్వాన్ని పునురుద్ధరించలేమని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. కాగా, నాటి గవర్నర్ కోష్యారీ మాత్రం తన నిర్ణయం గురించి ఎటువంటి విచారం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. (చదవండి: థాక్రే రాజీనామా చేయకపోయి ఉంటే.. ప్రభుత్వాన్ని పునరుద్దరించి ఉండేవాళ్లం: సుప్రీం కోర్టు) -
మేఘాలయలో బీజేపీ బిగ్ ప్లాన్.. ఉద్దవ్ థాక్రే సంచలన కామెంట్స్!
ముంబై: ఇటీవల జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. దీంతో ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)కి బీజేపీతో సహ ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాయి. ఇక, అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీంతో, మేఘాలయలో రాజకీయాలపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు. కాగా, ఉద్దవ్ థాక్రే ఆదివారం.. మహారాష్ట్రలోని ఖేడ్ పట్టణంలో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా థాక్రే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో నేను ముఖ్యమంత్రిని కావడం కోసం నేను ఎన్సీపీ, కాంగ్రెస్ బూట్లు నాకానని పుణెలో అమిత్ షా అన్నారు. ఇప్పుడు వాళ్లు మేఘాలయాలో ఏం చేస్తున్నారు? అంటూ విమర్శలు చేశారు. గో మూత్రం చల్లడం వల్ల మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందా?. స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పిస్తే మనకు స్వాతంత్య్రం వచ్చిందని ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పటేల్.. ఆర్ఎస్ఎస్ను నిషేధించారని అన్నారు. కానీ, ఆయన పేరును కూడా బీజేపీ వాడుకుంటోంది. అదే విధంగా సుభాష్ చంద్రబోస్, బాలాసాహెబ్ థాక్రే పేర్లను కూడా వాళ్లు దొంగిలించారు. వాళ్లు శివసేన పేరు, బాలాసాహెబ్ ఫొటోతో కాకుండా మోదీ పేరుతో ఓట్లు అడగాలని నేను సవాల్ చేస్తున్నా అంటూ కౌంటర్ ఇచ్చారు. శివసేన బాణం-విల్లు గుర్తుపై స్పందిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తప్పు. మా నుంచి పార్టీ పేరు, గుర్తును లాగేసుకున్నారు. కానీ, శివసేనను నా నుంచి ఎవరూ తీసుకోలేరు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
ఏక్నాధ్ షిండేకే విల్లు-బాణం
-
కూటమికి బీటలు..
-
మహారాష్ట్రకు కొత్త సీఎం.. ఫోటోలు వైరల్!
ముంబై: ఏక్నాథ్ శిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాల్లో మొదలైన రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. మాజీ సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే వర్గంతో మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో కొన్ని ఫోటోలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి కుర్చీలో.. ఏక్నాథ్ షిండే కుమారుడు, లోక్సభ ఎంపీ శ్రీకాంత్ షిండే కూర్చోవటం వివాదానికి దారి తీసింది. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సూపర్ సీఎం: ఎన్సీపీ శివసేన వ్యవస్థాపకులు బాలా సాహేబ్ థాక్రే ఫోటో ముందు ఉన్న కుర్చీలో శ్రీకాంత్ షిండే కూర్చున్న చిత్రాలను ట్వీట్ చేశారు ఎన్సీపీ అధికార ప్రతినిధి రవికాంత్ వార్పే. ఆ కుర్చి వెనకాలే ఉన్న బోర్డుపై ‘మహారాష్ట్ర ప్రభుత్వం- ముఖ్యమంత్రి’ అని రాసి ఉంది. ఈ క్రమంలో సూపర్ సీఎం అంటూ పేర్కొన్నారు రవికాంత్. ఇది ఎలాంటి రాజధర్మమని ప్రశ్నించారు. మరోవైపు.. సీఎం కుర్చీపై జోకులు వేసిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు తన సానుభూతి తెలుపుతున్నట్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు శివసేన నాయకురాలు ప్రియాంక ఛతుర్వేది. ఆధిత్య థాక్రే ఒక మంత్రిగా ప్రభుత్వ వ్యవహారాలు చూసుకుంటే వారికి సమస్య అనిపించిందని, కానీ, శ్రీకాంత్ షిండే కనీసం ఎమ్మెల్యే కాకపోయినా ఎలాంటి సమస్య లేదని ఎద్దేవా చేశారు. खा.श्रीकांत शिंदे यांना सुपर सीएम झाल्याबद्दल हार्दिक शुभेच्छा. मुख्यमंत्र्यांच्या गैरहजेरीत त्यांचे चिरंजीव मुख्यमंत्री पदाचा कारभार सांभाळतात.लोकशाहीचा गळा घोटण्याचे काम सुरूय.हा कोणता राजधर्म आहे?असा कसा हा धर्मवीर?@mieknathshinde @DrSEShinde pic.twitter.com/rpOZimHnxL — Ravikant Varpe - रविकांत वरपे (@ravikantvarpe) September 23, 2022 తిప్పికొట్టిన షిండే.. ఈ క్రమంలో విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు శ్రీకాంత్ షిండే. ఆ ఫోటో తన నివాసంలో తీసుకున్నదని, తన తండ్రి కోసం అధికారికంగా కేటాయించిన కుర్చీలో కూర్చోలేదని స్పష్టం చేశారు. అలాగే.. అది ముఖ్యమంత్రి అధికారిక నివాసం సైతం కాదని, థానేలోని ప్రైవటు నివాసం, ఆఫీసుగా వెల్లడించారు. వెనకాల ఉన్న బోర్డును తరుచూ తరలిస్తుంటారని, తన నివాసం నుంచే వర్చువల్గా సమావేశాలు నిర్వహిస్తున్నందున అక్కడ ఉందని వివరణ ఇచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఈ ఆఫీసును సీఎం, తానూ ఉపయోగిస్తానని వెల్లడించారు. ఇదీ చదవండి: సీఎంగా నా వారసుడిని వారే నిర్ణయిస్తారు: గెహ్లాట్