sultanabad
-
సాయంత్రాల్లేని గ్రామం.. ‘క’ సినిమాతో మరోసారి వార్తల్లోకి..
ఈ ఊరేంటి చాలా విచిత్రంగా ఉంది.. మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి పడిపోతోంది’.. అని హీరో ప్రశ్నిస్తాడు.. ‘మా ఊరు చుట్టూతా ఎత్తయిన కొండలున్నాయి.. కొండల మధ్య మా ఊరు ఉంది.. మధ్యాహ్నం మూడు అయ్యేసరికి సూర్యుడు కొండల వెనక్కి వెళ్లిపోయి ఆ నీడ మా ఊరి మీద పడి.. మూడింటికల్లా చీకటి పడిపోతుంది అబ్బాయి..‘ఒక పెద్దాయన సమాధానమిస్తాడు. ఈ సంభాషణ ‘క’సినిమాలోనిదని మీకీ పాటికే అర్థమై ఉంటుంది. దీంతో అలాంటి ఊరు ఎక్కడుందంటూ సోషల్మీడియాలో ట్రెండింగ్గా మారింది. ఆ ఊరే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురపాక గ్రామం. రీల్స్, వీడియోలతో ఇప్పుడా ఊరు నెట్టింట సందడి చేస్తోంది. – సాక్షి, పెద్దపల్లినాలుగు గుట్టల మధ్య.. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ గ్రామం నాలుగు గుట్టల మధ్య.. హుస్సేనిమియా వాగు చెంత.. పచ్చని ప్రకృతి నిలయంగా ఉంటుంది. ఈ గ్రామానికి తూర్పున గొల్లగుట్ట, పడమరన రంగనాయకులు గుట్ట, ఉత్తరాన నంబులాద్రి గుట్ట, దక్షిణాన పాంబండ గుట్టలున్నాయి. ఇక్కడి వైవిధ్య భౌగోళిక పరిస్థితులను గమనించిన శాతవాహనులు ఈ ఊరు వెలుపల నంబులాద్రీశ్వరస్వామి, రాజరాజేశ్వరస్వామి ఆలయాలు నిర్మించారు. గ్రామ ప్రత్యేకతను శిలాఫలకంపై చెక్కించారు. ఆలస్యంగా ఉదయం.. తొందరగా సాయంత్రం.. సాధారణంగా 3 గంటలకు ఒక్కజాము చొప్పున రోజులో మొత్తం 8 జాములుంటాయి. పగటిపూట నాలుగు, రాత్రిపూట నాలుగు జాములుగా లెక్కిస్తారు. తూర్పున ఉన్న గొల్లగుట్ట ఈ గ్రామానికి అడ్డుగా ఉండటంతో ఇక్కడ ఆలస్యంగా సూర్యోదయం అవుతుంది. ఇక సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సూర్యుడు గ్రామ పడమర దిక్కునున్న రంగనాయకులు గుట్ట వెనక్కి వెళ్తాడు. దీంతో కొండల నీడతో ఈ గ్రామాన్ని చీకటి తొందరగానే అలుముకుంటుంది. ఇలా ఉదయం, సాయంత్రం రాత్రితో కలిసిపోతుండటంతో పగటి సమయం తగ్గిపోతోంది. దీంతో ఈ గ్రామాన్ని మూడు జాముల కొదురుపాకగా పిలుస్తున్నారు. ఆ ఊరికి సాయంత్రం జాము లేకపోవడంతో.. సాయంత్రం 4 గంటలకే ఇళ్లలో దీపాలు, వీధి దీపాలు వెలిగించాల్సి వస్తోంది. దేవుడు లేని ఆలయం ఈ గ్రామానికి మరో ప్రత్యేకత ఉంది. రంగనాయకులు గుట్టకు దిగువన నిర్మించిన ఆలయంలో దేవుడి విగ్రహం ఉండదు. దీంతో ప్రతీ దసరాకు పక్కనే ఉన్న దేవునిపల్లి గ్రామం నుంచి నంబులాద్రి నరసింహస్వామిని రథయాత్రతో తీసుకొచ్చి.. ఈ ఆలయంలో ఒకరోజు ఉత్సవాలు జరుపుతారు. ఆ తర్వాత తిరిగి దేవునిపల్లికి తీసుకెళ్తారు. దీంతో ఏడాదిలో ఆ ఒక్కరోజే ఆ గుడిలో వేడుకలు నిర్వహిస్తారు.పర్యాటకంగా అభివృద్ధి చేయాలి మా గ్రామాన్ని చూడటానికి ఎంతోమంది ఎక్కడినుంచో వచ్చి పోతున్నారు. వచ్చిపోయే వారికి గ్రామంలో సౌకర్యాలు కల్పించి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. – బాలాజీరావు, స్థానికుడు నలుదిక్కులా గుట్టలు మా ఊరుకు నలుదిక్కులా గుట్టలు ఉండటంతో ఉదయం ఆలస్యంగా సూర్యుడు వస్తాడు. తొందరగానే సూర్యుడు అస్తమిస్తాడు. దీంతో సాయంత్రం 4 గంటలు దాటిందంటే ప్రతీ ఇంట దీపం వెలిగించుకోవలసిందే. – రాజగౌడ్, స్థానికుడు -
కేటీఆర్: 55 ఏళ్ల ఏమీ చేయని వారు ఇప్పుడు ఏం చేస్తారు?
-
అన్నా.. నేను రాఖీ ఎవరికి కట్టాల్నే..
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): ‘అన్నా.. నువు నన్ను వదిలి వెళ్లిపోయావు.. నేను రాఖీ ఎవరికి కట్టాల్నే.. ఈ రోజే రాఖీ కొని తీసుకువచ్చాను.. ఒక్కగానొక్క అన్నవు.. నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోతే ఎలా.. అన్నా..’ అంటూ మృతుడి సోదరి ఉపాసన రోదించిన తీరు కంటతడి పెట్టిచ్చింది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఎస్సై ఉపేందర్రావు వివరాల ప్రకారం.. సుల్తానాబాద్లో పని ఉండడంతో.. కరీంనగర్ నగరంలోని మధీరనగర్(బొమ్మకల్)కు చెందిన నగపూరి ప్రదీప్కుమార్–స్వాత్విక దంపతులకు కుమారుడు సంకీర్త్(16), ఉపాసన సంతానం. సంకీర్త్, హౌసింగ్బోర్డుకు చెందిన చీయజ్ ఓం, మల్యాల శివమణి ముగ్గురూ మంచి స్నేహితులు. చీయజ్ ఓంకు సుల్తానాబాద్లో పని ఉండటంతో ముగ్గురూ కలిసి గురువారం ద్విచక్రవాహనంపై బయలుదేరారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామశివారులో రాజీవ్రహదారిపై వీరి బైక్ను ట్రాలీవ్యాన్ ఢీకొనడంతో సంకీర్త్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఓం, శివమణిలకు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయింది. చదవండి: (వాట్సాప్లో న్యూడ్ కాల్.. బ్లాక్మెయిల్) గాయపడినవారిని పోలీసులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. రాఖీ పండుగకు ఒకరోజు ముందుగానే సోదరుడు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో మృతుడి చెల్లి గుండలవిసేలా రోదించింది. సంకీర్త్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మానవత్వం చాటిన పోలీసులు రోడ్డు ప్రమాద సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న కానిస్టేబుళ్లు తిరుపతినాయక్, అశోక్, రమేశ్, రాజు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఓం, శివమణిలను పోలీసువాహనంలోనే కరీంనగర్కు తీసుకెళ్లి ఆస్పత్రి లోపలికి ఎత్తుకొని తీసుకెళ్లారు. సంకీర్త్ మృతదేహాన్ని మోసుకొచ్చి పోస్టుమార్టం రూంలో పెట్టడంతో వారిని పలువురు అభినందించారు. -
దారుణం: కుల బహిష్కరణ.. మాట్లాడితే రూ.50వేల జరిమానా
సాక్షి, పెద్దపల్లి: సాంకేతికకాలంలోనూ కుల బహిష్కరణ సంస్కృతి కొనసాగుతోంది. తమ మాట వినడం లేదంటూ మూడు కుటుంబాలను కుల పెద్దలు వెలివేసిన సంఘటన సుల్తానాబాద్ మండలం గట్టెపల్లెలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బహిష్కరణకు గురైన వారిలో ఇద్దరు దివ్యాంగులు కావడం విశేషం. బాధితుల కథనం ప్రకారం.. సుల్తానాబాద్ మండలం గట్టెపల్లిలో నల్లవెల్లి సమ్మయ్య, నల్లవెల్లి మల్లయ్య, నల్లవెల్లి రాజయ్య అన్నదమ్ములు. అదే గ్రామానికి చెందిన అబ్దుల్ అలీ వద్ద గతంలోనే గంపగుత్తగా ఆరు గుంటల భూమిని సాదాబైనామాపై కొనుగోలు చేశారు. సదరు స్థలాన్ని కుల సంఘానికి కావాలని వారి కులానికే చెందిన పెద్దలు కోరడంతో ముగ్గురు అన్నదమ్ములు అంగీకరించారు. సదరు స్థలాన్ని అబ్దుల్ అలీతో 2008లో రిజిస్ట్రేషన్ చేయించారు. కొన్నాళ్లక్రితం అబ్దుల్అలీ చనిపోయాడు. ఈనేపథ్యంలో సదరు భూమికి కొలతలు వేయగా.. తక్కువగా ఉంది. దీనికి సమ్మయ్య కుటుంబమే కారణమని, కొనుగోలు చేసిన సమయంలోనే భూమికి హద్దులు వేయిస్తే సమస్య ఉండేది కాదని, దీనికి బాధ్యత వహించి మొత్తం స్థలం చూపించాలని కుల పెద్దలు పంచాయితీ పెట్టారు. అయితే తాము కొనుగోలు చేసిన భూమిని అలాగే కుల సంఘానికి విక్రయించామని, ఇందులో తాము తప్పు చేయలేదని ముగ్గురు అన్నదమ్ములు అంటున్నారు. ఈ విషయమై కొద్దిరోజులుగా పంచాయితీ నడుస్తోంది. చదవండి: (సాగర్ కాల్వలో ముగ్గురి గల్లంతు.. వీరంతా కేరళ ఆయుర్వేదిక్ సిబ్బంది) సమస్య పరిష్కారం చూపే వరకూ ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలను కులం నుంచి బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. వారితో మాట్లాడిన వారికి రూ.50వేల జరిమానా విధిస్తామని హెచ్చరించడంతో అప్పటినుంచి వీరితో కులానికి చెందిన వారెవరూ మాట్లాడడం లేదు. ఈనెల ఒకటో తేదీన బాధితుల పినతల్లి నల్లవెల్లి మల్లమ్మ (75) అనారోగ్యంతో చనిపోయింది. ఆమెను చివరిచూపు చూసేందుకు సమ్మయ్య, మల్లయ్య, రాజయ్య వెళ్తే కుల పెద్దలు అడ్డుచెప్పారు. గత్యంతరం లేక బాధితులు అక్కడి నుంచి వచ్చాక అంత్యక్రియలు పూర్తిచేశారు. తమను కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పేర్కొంటూ సమ్మయ్య మూడు రోజుల క్రితం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన సోదరులు మల్లయ్య, రాజయ్య దివ్యాంగులు అని, కుల సభ్యులు ఎవరూ కనీసం పాలు పోయడం లేదని, సుల్తానాబాద్ నుంచి తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజులుగా న్యాయం కోసం స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసుల వివరణ కోరగా.. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని, కుల సంఘానికి విక్రయించిన భూమి ప్రస్తుతం లేదని కుల సంఘం పెద్దలు, ప్రతినిధులు చెబుతున్నారని తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేపడుతామని పేర్కొన్నారు. -
20 లక్షలు ఖర్చు: వారం వ్యవధిలో భార్యాభర్తలు మృతి
సాక్షి, పెద్దపల్లి: ‘పిల్లలూ త్వరలోనే ఆరోగ్యంగా ఇంటికి వస్తా.. భయపడొద్దు’.. అంటూ ధైర్యం చెప్పిన తల్లిని కరోనా కాటేసింది. కరోనాతో నాన్న చనిపోయిన విషయం అమ్మకు తెలియనివ్వలేదని, చికిత్సకు రూ.20లక్షలు పెట్టినా అమ్మానాన్న తమకు దక్కలేదని ఇద్దరు కూతుళ్లు బోరున విలపించారు. వారం వ్యవధిలో కరోనా భార్యాభర్తలను బలి తీసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట గ్రామానికి చెందిన అయిల సాంబమూర్తి (48) హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతడికి కరోనా సోకడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత నెల 27న మృతిచెందాడు. ఈక్రమంలో అతడి భార్య మహిమలత (46) కూడా వైరస్ బారినపడింది. కూతుళ్లు సుశ్మిత, హర్షిత కొన్ని రోజులు ఇంట్లోనే ఉంటూ మందులు వాడింది. పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతిచెందింది. వీరి ఇద్దరు కూతుళ్లు సుశ్మిత, హర్షిత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వైద్య ఖర్చులకు తోటి ఉద్యోగులు, హైదరాబాద్లో నివాసం ఉంటున్న కాలనీ వాసులు డబ్బులు సమకూర్చారని, దంపతులిద్దరికీ దాదాపు రూ.20లక్షలు ఖర్చు పెట్టినా బతకలేదని బంధువులు తెలిపారు. అనాథలైన ఇద్దరు పిల్లలను ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా గత మార్చి 14న సాంబమూర్తి–మహిమలత వివాహ వార్షికోత్సవాన్ని ఓదెల మండలం కొలనూర్ హైస్కూల్లో క్లాస్మెట్స్ ఘనంగా జరిపారు. దీనిని స్మరించుకుంటూ క్లాస్మెంట్స్ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోవిడ్కు మరో ముగ్గురు బలి రామగిరి మండలం సెంటినరికాలనీకి చెందిన చిరు వ్యాపారి మంచాల శ్రీనివాస్ కరోనాతో బుధవారం మృతిచెందాడు. గోదావరిఖని ప్రశాంత్నగర్కు చెందిన యాదగిరి గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో, సంజయ్నగర్కు చెందిన కృష్ణ కరీంనగర్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. చదవండి: Lockdown: కష్టాలు.. ట్రక్ డ్రైవర్గా మారిన నటి -
పరిచయం: మహిళ వేధింపులతో యువకుడి ఆత్మహత్య
సాక్షి, పెద్దపల్లి : ఒక పరిచయం నిండు ప్రాణాన్ని తీసింది. మహిళ వేధింపుల కారణంగా గోదావరిఖని కేకేనగర్కు చెందిన కొయ్యాడ రమేశ్(33) సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల మానేరు సమీపంలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఉపేందర్రావు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గోదావరిఖని కేకేనగర్కు చెందిన కొయ్యాడ రమేశ్ ఫొటోగ్రాఫర్. ఏడాదిక్రితం ఓ వివాహ వేడుకలో పెద్దపల్లికి చెందిన చింతల రమాదేవితో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి ఇద్దరిమధ్య ఫోన్లు, సందేశాలు నడిచాయి. ఈ క్రమంలో రమేశ్ నుంచి రమాదేవి రూ.6లక్షలు, రెండు తులాల బంగారం తీసుకుంది. కొద్దిరోజుల క్రితం రమేశ్ బంగారం, నగదు తిరిగి ఇమ్మని అడిగాడు. దీంతో రమాదేవి ఫోన్కాల్స్, చాటింగ్ సందేశాలు బయటపెడతానని బ్లాక్మెయిల్ చేసింది. మార్చి 28న పెద్దపల్లి పోలీసుస్టేషన్లో రమేశ్పై కేసు పెట్టింది. తాను నివాసం ఉంటున్న చోట పరువుపోయిందని, వేరే ప్రాంతంలో అద్దెకు ఇళ్లు చూస్తానని భార్యకు చెప్పి మార్చి 30న రమేశ్ బయటకు వెళ్లాడు. సాయంత్రంవరకు రాకపోవడంతో అతడి భార్య లావణ్య ఫోన్ చేసింది. రమాదేవి వేధింపులు భరించలేక చనిపోతున్నానని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. వెంటనే లావణ్య తన భర్త కనిపించడం లేదని గోదావరిఖని వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజుల తరువాత శుక్రవారం సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామ సమీపంలోని మానేరువాగు వద్ద రమేశ్ మృతదేహం కనిపించింది. లావణ్య ఫిర్యాదుతో రమాదేవిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చదవండి: ప్రేమ పేరుతో మోసం; యువతిని లైంగికంగా వాడుకొని.. -
అస్తమించిన క్రీడా దిగ్గజం..
సాక్షి, కరీంనగర్ : దివ్యాంగ క్రీడాకారులకు ఆయన ఓ స్ఫూర్తి.. ఆదర్శం. దివ్యాంగుడైనా పట్టుదల.. సడలని ఆత్మవిశ్వాసం.. మనోధైర్యంతో ప్రపంచ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచాడు. ఆటే శ్వాసగా ప్రతీ పోటీలో పతకాలు సాధిస్తూ జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాడు. ఆయన క్రీడా ప్రతిభ ముందు వైకల్యం తలవంచింది. చివరికి క్యాన్సర్తో ఆయన సాగించిన పోరాటంలో పరాజితుడై తుది శ్వాస విడిచాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన అర్జున అవార్డు గ్రహీత మాదాసు శ్రీనివాస్రావు(67) హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో మృతిచెందారు. కార్సినోమా క్యాన్సర్తో చికిత్స పొందుతూ కొంతకాలంగా కోమాలో ఉన్న ఆయన బుధవారం రాత్రి తుదిశ్వాస వదిలారు. స్వగ్రామంలో అంత్యక్రియలు.. శ్రీనివాసరావు స్వగ్రామం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో క్రీడాభిమానుల అశ్రునయనాల మధ్య గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీనివాస్రావు మృతదేహం వద్ద సర్పంచ్ వీరగోని సుజాత, ఎంపీటీసీ పులి అనూష నివాళులర్పించారు. ఆయనకు భార్య రమాదేవి, ఇద్దరు కుమారులు, రోహిత్, రోహన్, కూతురు ధృవి ఉన్నారు. మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన శ్రీనివాస్రావు వృత్తి రీత్యా ఆర్టీసీలో మెకానిక్గా చేరారు. ఉత్తమ దివ్యాంగ ఉద్యోగిగా 1994లో జాతీయ స్థాయి అవార్డును అప్పటి రాష్ట్రపతి శంకర్దయాల్ శర్మ చేతుల మీదుగా అందుకున్నారు. దివ్యాంగుల జాతీయ క్రీడా సంఘానికి అనుబంధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ సంఘం ఏర్పాటు చేశారు. 2003లో అర్జున అవార్డు.. 1996లో లండన్లో జరిగిన దివ్యాంగుల ప్రపంచ షూటింగ్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకాన్ని సాధించారు. 2002లో బెంగళూరులో జరిగిన వరల్డ్ పారా బ్యాడ్మింటన్లో స్వర్ణం సాధించారు. దీంతో భారత ప్రభుత్వం 2003లో అర్జున అవార్డు ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పారా అథ్లెట్ల విభాగంలో అర్జున పురస్కారాన్ని పొందిన తొలి శ్రీడాకారుడిగా రికార్డ్ సాధించారు. 2010లో చైనాలోని గ్వాంగ్ జూలో జరిగిన ఏసియన్ పారా ఫెన్సింగ్లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. 2004లో మలేసియాలో జరిగిన మెన్స్ డబుల్స్ ఏసియన్ పారా బ్యాడ్మింటన్లో కాంస్య పతకం, 2006లో ఇజ్రాయిల్లో జరిగిన సింగిల్స్ ఓపెన్ బ్యాడ్మింటన్లో కాంస్యం, 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో బ్యాటన్ రిలేలో ప్రతిభ కనబరిచారు. 2006 నుంచి ముంబయి మారథాన్ రన్లో వరుసగా పాల్గొన్నారు. చివరగా 2018లో బెంగళూర్ జరిగిన రన్లో పాల్గొని కాంస్య పతకం సాధించారు. వైఎస్సార్ పాదయాత్రలో.. దివంగత సీఎం వైఎస్సార్ జిల్లాలో చేపట్టిన పాదయాత్రలో ఆయనతో కలిసి అడుగులు వేశారు. జమ్మికుంట నుంచి పరకాల వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. అర్జున అవార్డు అందుకున్న మాదాసు కు అప్పటి ఏపీ సీఎం వైఎస్సార్ రూ.లక్ష నజరానా అందించారు. 2017లో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం దివ్యాంగ స్ఫూర్తి అవార్డు ప్రదానం చేసింది. ఇంటి స్థలం కోసం.. అర్జున అవార్డు గ్రహీతలకు ప్రభుత్వాలు ఇంటి స్థలాలివ్వడం పరిపాటి. తిమ్మాపూర్ సమీపంలో తనకు 3 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించాలని ప్రభుత్యాలను విన్నవించినా నేటికీ కేటాయింపులు జరగలేదు. పద్మశ్రీ పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయడం గమనార్హం. 2004లో జిల్లా కేంద్రంలో మాదాసు శ్రీనివాస్రావు కాలనీని ఏర్పాటు చేసింది. తన అంతర్జాతీయ ప్రతిభతో ఎంతోమంది దివ్యాంగులు క్రీడల్లో భాగస్వాములను చేస్తూ వారికి స్ఫూర్తినిచ్చారు. దీంతో అంజనారెడ్డి, రఘురాం వంటి దివ్యాంగ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. శ్రీనివాస్రావు మృతదేహానికి నివాళులరి్పస్తున్న సర్పంచ్ సుజాత -
రెప్పపాటులో ఘోరం
సాక్షి, సుల్తానాబాద్/మంథని : రెప్పపాటులో ఘోరం జరిగింది. అతివేగం, నిర్లక్ష్యం నలుగురిని బలిగొంది. రామగుండం– హైదరాబాద్ రాజీవ్ రహదారి మరోసారి రక్తమోడింది. కాసింత ఏమరపాటు కుటుంబాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని కారు వెనకనుంచి ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. దీంతో మంథని, సుల్తానాబాద్లో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సుల్తానాబాద్ మండల కేంద్రానికి చెందిన చదువాల అరుణ్కుమార్(37) మంథని పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఆరేళ్లుగా ప్రిన్సిపాల్గా పని చేస్తున్నాడు.భార్య సౌమ్య(30), కొడుకు అఖిలేశ్(9), కూతురు శాన్వి(5)తో కలిసి మంథనిలోనే నివాసం ఉంటున్నాడు. తన సోదరుడు సాయికుమార్, బావమరిది ఓం ప్రకాశ్ను హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలతో చేర్పించేందుకు కారులో భార్య, పిల్లలతో కలిసి గురువారం వెళ్లారు. వారిని అక్కడ దింపేసి, ఓ శుభకార్యానికి హాజరయ్యారు. రాత్రి 9గంటలకు మంథనికి బయల్దేరారు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత వీరు ప్రయాణిస్తున్న కారు సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ఆగిఉన్న లారీని వెనకనుంచి ఢీకొట్టింది. ఘటనలో అరుణ్, సౌమ్య, శాన్వీ అక్కడికక్కడే మృతిచెందారు. అఖిలేష్ కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. నాలుగు గంటల శ్రమ.. రోడ్డుపై భారీ శబ్ధం వినిపించడంతో చుట్టుపక్కల వారు తరలివచ్చారు. ప్రమాదాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.పెద్దపల్లి డీసీపీ తాళ్లపల్లి సుదర్శన్గౌడ్, ఏసీపీలు హబీబ్ఖాన్, వెంకటరమణ, సీఐ రాములు, ఎస్ఐ రాజేశ్ అక్కడికి చేరుకున్నారు. లారీని కారు వేగంగా ఢీకొట్టడంతో నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలన్నీ ఇరుక్కుపోయాయి. వాటిని తీసేందుకు పోలీసులు, స్థానికులు సుమారు నాలుగు గంటలు శ్రమించారు. గ్యాస్కట్టర్ తెప్పించి, కారు భాగాలు విడదీసి బయటకు తీశారు. లారీ డ్రైవర్ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ను వద్దని.. కారులో ప్రయాణం చేసిన ప్రతి సమయంలో అరుణ్కుమార్ డ్రైవర్ను వెంట తీసుకెళ్లేవాడని కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిపారు. గురువారం హైదరాబాద్కు వెళ్లిన సమయంలోనూ డ్రైవర్ అందుబాటులో ఉన్నప్పటికి కారులో ఎక్కు వ మంది వెళ్తున్నామని, డ్రైవర్ అవసరం లేదని తానే స్వయంగా కారు నడిపినట్లు తెలిపారు. డ్రైవర్ ఉంటే ప్రాణాలు దక్కేవని రోదించారు. మళ్లొస్తానని.. హైదరాబాద్కు వెళ్లే ముందు అరుణ్కుమార్ రామగుండంలో నివాసముంటున్న తల్లిదండ్రులు లక్ష్మినారాయణ, రాజేశ్వరీ వద్దకు వెళ్లాడు. నాన్న ఆరోగ్యం బాగా లేక పోవడంతో రూ. 20వేలు, బియ్యం అప్పజెప్పాడు. హైదరాబాద్ వెళ్లి మళ్లొస్తానని చెప్పిన కొడుకు తెల్లవారేసరికి అనంతాలకు వెళ్లాడని తల్లి రోదిస్తూ తెలిపింది. పలువురి పరామర్శ.. మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిరుదు రాజమల్లు, చింతకుంట విజయరమణారావు, కాంగ్రెస్ నాయకులు గొట్టిముక్కుల సురేశ్రెడ్డి, మున్నూరు కాపు సంఘం నాయకులు రౌతు కనకయ్య, ఆకుల నర్సయ్య, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు అన్నయ్యగౌడ్, ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేశవరెడ్డి, కార్యదర్శి బుచ్చిరెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్, రమణారావు, ప్రసాద్ సుల్తానాబాద్ ప్రభుత్వాస్పత్రి వద్ద మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. అతివేగమే కారణమా..? ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కారు ప్రమాద సమయంలో 130 స్పీడ్తో వెళ్లడంతోపాటు అలసటతో నిద్రమత్తు ఉండడం కూడా మరో కారణమవుతుందని ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం పేర్కొన్నారు. ఘటనపై పరిశీలన చేసేందుకు రోడ్లు భవనాల శాఖ అధికారి, తహసీల్దార్, ఎస్ఐ, గ్రామసర్పంచ్లతో ప్రత్యేక టీమ్ ఏర్పాటుచేశామని డీసీపీ తాళ్లపల్లి సుదర్శన్గౌడ్ తెలిపారు. పెను విషాదం అరుణ్కుమార్ కుటుంబం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో సుల్తానాబాద్, మంథనిలో పెను విషాదం అలుముకుంది. సుల్తానాబాద్ ట్యాంకువీధికి చెందిన అరుణ్కుమార్ మొదట గోదావరిఖని 8వకాలనీలో కష్ణవేణి హైస్కూల్లో పనిచేశారు. తరువాత ప్రిన్సిపల్ హోదాలో అదే పాఠశాల మంథనిశాఖకు వచ్చారు. అప్పటి నుంచి పాఠశాలను ఎంతో అభివృద్ధి చేశారు. ఎవరైనా ఆపదలో ఉంటే ఆపన్నఅస్తం అందించేవారు. అరుణ్ భార్య సౌమ్య బోధనారంగంలో స్థిరపడాలని బీఈడీ రెండో సంవత్సరం చదువుతోంది. కొడుకు నాలుగు, కూతురు యూకేజీ చదువుతున్నారు. వీరి మరణవార్త తెలుసుకున్న మంథని, సుల్తానాబాద్లోని స్నేహితులు, బంధువులు సుల్తానాబాద్లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. -
జాతర మిగిల్చిన విషాదం
సుల్తానాబాద్(పెద్దపల్లి) : పండుగపూట పెద్దపల్లి జిల్లాలో విషాదం అలుముకుంది. సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట గ్రామంలోని సబ్స్టేషన్ సమీపంలో జాతరకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ మ హిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో 12 మంది గాయపడ్డారు. సీఐ రాములు వివరాల ప్రకారం.. ఓదెల మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కనుకుంట్ల నారాయణ, స్వామి కుటుంబసభ్యులు గురువారం ట్రాక్టర్లో ఓదెల మండలం కొలనూర్ సమ్మక్క, సారలమ్మ జాతరకు బయల్దేరారు. సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంటకు చేరుకోగానే అతివేగంగా వెళ్తూ ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా పడింది.ట్రాలీలో కూర్చున్న వారిలో చిలుక అరుణ(38) అక్కడికక్కడే మృతి చెందింది. కనుకుంట్ల స్వరూప, కనుకుంట్ల లచ్చమ్మ, కనుకుంట్ల అక్షిత, కనుకుంట్ల మల్లమ్మ, కస్తూరి, కంకటి శ్రీలత, రాజమ్మ, లలిత, పుష్ప, తిరుమల, లక్ష్మి, సాత్విక, శివకుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గొట్టె ముక్కుల సురేష్రెడ్డి తనవాహనంలో సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమచికిత్స అందించి కరీంనగర్ తరలించారు. ఘటనాస్థలాన్ని సీఐ రాములు పరిశీలించి వివరాలు సేకరించారు. కుటుంబంలో విషాదం చిలుక అరుణ మృతి చెందడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. అరుణకు భర్త వెంకటస్వామి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోస్ట్మార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.కాగా మృతురాలి కుటుంబానికి రూ.లక్ష ఎక్స్గ్రేషియా అందిస్తామని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రకటించారు. -
గుడిలోకి వచ్చిన ఎలుగుబంటి
సాక్షి, సుల్తానాబాద్: మండలంలోని కనుకుల గ్రామపంచాయతీ రాములపల్లె శ్రీ రామాలయంలో శనివారం రాత్రి 10 గంటలకు భల్లూకం దూసుకురావడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. గణపతి నవరాత్రులు కావడంతో భక్తులు పూజలు చేస్తుండగా సమీపంలోని గుట్టల నుంచి భల్లూకం గ్రామంలోకి వచ్చి ఆలయంలోని నవగ్రహాల మందిరంలోకి చొరబడింది. దీంతో మొదట భయపడ్డప్పటికీ ధైర్యం చేసిన యువకులు తలుపులు గడియ పెట్టారు. అనంతరం పోలీసులు, అటవీ శాఖాధికారులకు సమాచారం అందించగా సుల్తానాబాద్ ఎస్సై రాజు, ఆటవీ శాఖాధికారులు వచ్చి చాకచక్యంగా ఎలుగుబంటిని పట్టుకున్నారు. -
రామక్కా... మజాకా..!
గొలుసు దొంగను తన్ని తరిమిన వృద్ధురాలు సుల్తానాబాద్ రూరల్: మెడలోని బంగారు గొలుసు ను చోరీ చేసేందుకు యత్నించిన దొంగను ఓ వృద్ధు రాలు ప్రతిఘటించి తన్ని తరిమిన సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానా బాద్లో గురువారం చోటుచేసుకుంది. సుల్తానాబాద్లోని గాంధీనగర్ కు చెందిన గోలి రామక్క(80) భర్త చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఈమెకు నలుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. రామ క్క ఒంటరిగా ఇంట్లో ఉంటోంది. ఎప్పటిమాదిరిగానే వేకువజామున 5.30 గంటలకే నిద్రలేచి తలుపులు తెరిచింది. ఇదే అదనుగా పొంచి ఉన్న ఓ దొంగ ఆమెపై దాడి చేశాడు. మంచంపై ఉన్న దుప్పటిని ఆమె ముఖంపై కప్పి పిడిగుద్దులు గుద్దాడు. పక్కనే ఉన్న బకెట్లోని నీళ్లు పోశాడు. నోటిని అదిమిపట్టా డు. తలను గోడకు కొట్టగా ఆమె కిందపడిపోయింది. మెడలోని 3 తులాల బంగారు గొలుసును లాగగా తెగి కిందపడింది. వెంటనే తేరుకున్న రామక్క కాళ్లతో దొంగను తన్ని గట్టిగా అరిచింది. కంగుతిన్న దొంగ ఖాళీ చేతులతో పరారయ్యాడు. స్థానికులు, కుటుంబసభ్యులు రామక్కను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె ధైర్యాన్ని పలువురు మెచ్చుకున్నారు. -
కరెన్సీ గణేషుడు
రూ.9,99,999లతో అలంకరణ సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని స్వప్నకాలనీలోని వినాయకుడిని రూ.9,99,999 కరెన్సీతో ఉత్సవ కమిటీ సభ్యులు అలంకరించారు. కరెన్సీ నోట్లతో దండలు పేర్చి గణేషునితోపాటు మండపాన్ని చూడముచ్చటగా ముస్తాబు చేశారు. సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రైస్మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నగునూరి అశోక్కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మాడూరి ప్రసాద్, మండల రైస్మిల్లర్స్ ప్రతినిధులు చకిలం మారుతి పలువురు పాల్గొన్నారు. -
సుల్తానాబాద్లో ఉద్రిక్తత
సుల్తానాబాద్: కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్లో ఎస్సారెస్సీ నీళ్ల కోసం టీడీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. టీడీపీ జిల్లా అధ్యక్షులు విజయరమణారావు ఆధ్వర్యంలో రైతులు, తెలుగు తమ్ముళ్లు రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఎండిపోతున్న పంటలను కాపాడటానికి కాలువకు నీటిని విడుదల చేయాలని రెండు గంటలపాటు రాస్తారోకో చేయడంతో అధికారుల నుంచి స్పందన కనిపంచక పోవడంతో ఆగ్రహానికి గురైన తెలుగు తమ్ముళ్లు ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పాటు ఎస్సారెస్సీ సీఈ కార్యాలయం పై దాడి చేసి ఫర్నీచర్ ధ్వసం చేశారు. -
ప్రేమికుడి ఆత్మహత్య
సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మండల కేంద్రంలోని పాత జెండాకు చెందిన కోటగిరి నాగరాజు (28) ఆదివారం మృతి చెందినట్లు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం వరంగల్కు చెందిన యువకునితో నిశ్చితార్థం ఉండగా మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చనిపోయే ముందు నాలుగు పేజీల లేఖను రాసి మంచం పక్కన పెట్టినట్లు వారు తెలిపారు. నాగరాజు ఐదేళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన యువతిని తాను ప్రేమించానని.. మూడేళ్ల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తుండగా ప్రేమికులిద్దరు కుటుంబసభ్యులకు పెళ్లి విషయం చెప్పినట్లు లేఖలో పేర్కొన్నాడు. యువతి కుటుంబసభ్యులు తనపై దాడి చేశారని మృతుడు తెలిపాడు. సోదరుడు వినోద్ సైతం పోలీసులకు తన అన్న నాగరాజు చనిపోయేందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. -
ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి
టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు సుల్తానాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి డీ–86, డీ–83 కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలంటూ సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు మాట్లాడుతూ ఎస్సారెస్పీ ప్రస్తుతం 20 టీఎంసీల నీరు నిలువ ఉందన్నారు. కాలువల ద్వారా నీటిని విడుదల చేసి గ్రామాల్లో చెరువులు, కుంటలను నింపాలని కోరారు. నీటి విడుదలలో జాప్యం చేస్తే తమ ఆందోళను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. రైతులకు రుణమాఫీ వర్తించడం లేదని.. ప్రభుత్వం హరితహారం పేరిట కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో మహేందర్, ప్రకాశ్రావు, డీసీఎంస్ జిల్లా డైరెక్టర్ కల్లెపల్లి జాని, మండల నాయకులు అబ్బయ్యగౌడ్, కిశోర్, చిలుక సతీష్, తిరుపతి, రాజలింగం, మహేష్, మల్లయ్య. రామన్న, తాహేర్, మ«ధు, గణేష్, శంకర్గౌడ్, నిరంజన్ పాల్గొన్నారు. -
పాపం.. పసిగుడ్డు
♦ పుట్టుకతోనే క్యాన్సర్ ♦ ఏడు నెలలుగా మృత్యువుతో పోరాటం ♦ ఆపన్నహస్తం కోసం తల్లిదండ్రుల వేడుకోలు సుల్తానాబాద్: చూడముచ్చటగా ఉన్న ఈ చిన్నారికి క్యాన్సర్ వ్యాధిసోకి మృత్యువుకు చేరువలో ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబం గడవడమే కష్టం కావడంతో పెద్ద రోగానికి చికిత్స చేరుుంచేందుకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. దాతల కోసం ఎదురుచూస్తున్నారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంటకు చెందిన ఏరుకొండ వేణు-ఉమాదేవి దంపతుల కుమార్తె విరోనిత. అమ్మారుు పుట్టినప్పటి నుంచి తరచూ అస్వస్థతకు గురవుతుండటంతో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్లోని పలు ఆస్పత్రులు తిరిగారు. పాప పట్టుకతోనే క్యాన్సర్తో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. కూలీ చేసుకొని బతికే వేణు దంపతులు ఇప్పటికే సుమారుగా రూ. మూడు లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. చికిత్సకు మరో ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని వైద్యులు పేర్కొన్నారు. రెండు రోజుల నుంచి పాప పరిస్థితి విషమించడంతో శనివారం మీడియా ముందుకు వచ్చారు. ప్రభుత్వం గాని, దాతలు గాని స్పందించి తమ బిడ్డను బతికించాలని వేడుకున్నారు. అనంతరం పాపను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక సహాయం చేయదల్చినవారు వేణును 9000448052, 9701671365 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. లేదా ఏరుకొండ వేణు, ఎస్బీఐ అకౌంట్ నంబరు 20168418439, ఐఎఫ్ఎస్ఐ కోడ్ 0012904లో డబ్బులు వేయూలని కోరుతున్నారు. -
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్: నలుగురికి తీవ్రగాయాలు
సుల్తానాబాద్ (కరీంనగర్) : ఆగివున్న లారీని ఆర్టీసీ బస్ ఢీకొనడంతో నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్లో ఆదివారం ఉదయం జరిగింది. సుల్తానాబాద్లోని సంగ్లంపల్లి వద్ద ఆగి ఉన్న లారీని కరీంనగర్ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన చుక్కల భూలక్ష్మీ (40), భూపతిపూర్కు చెందిన చంద్రయ్య(70), ఆయన భార్య సాయమ్మ(65)తో పాటు మరో మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. -
పది లక్షల కోసం ప్రాణం తీశారు
హత్య కేసును ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితుల అరెస్టు మరో ముగ్గురి కోసం గాలింపు ధర్మపురి : ధర్మపురి శివారులోని రామయ్యపల్లెలో గత నెల 25న జరిగిన హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. రూ.10 లక్షల కోసం ఇద్దరు వ్యక్తులు సుల్తానాబాద్కు చెందిన పాలాజి రామయ్య(59)ను కిరాతకంగా హత్య చేశారు. అనంతరం అనుమానం రాకుండా మృతదేహాన్ని పెట్రోల్ పోసి దహనం చేసినట్లు నిర్ధారించారు. నిందితులు గర్రెపెల్లి శ్రీనివాస్, పరశురాములును ధర్మపురి సీఐ వెంకటరమణ గురువారం అరెస్ట్ చూపారు. ఆయన కథనం ప్రకారం.. సుల్తానాబాద్కు చెందిన రామయ్య గ్రామంలో వడ్రంగి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతడికి రాజీవ్ రహదారిని అనుకుని ఉన్న స్థలాన్ని పెట్రోల్ బంక్ కోసం గర్రెపెల్లి శ్రీనివాస్కు లీజుకు ఇచ్చాడు. సుమారు రూ.10 లక్షల లీజు డబ్బులు బకాయి పడడంతో ఈ విషయమై రామయ్య, శ్రీనివాస్కు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం శ్రీనివాస్ రూ.10 లక్షల చెక్కును రామయ్యకు ఇచ్చాడు. అది బౌన్స కావడంతో మళ్లీ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో విసుగు చెందిన శ్రీనివాస్ రామయ్యను హత్య చేయాలని పథకం పన్నాడు. ఈ మేరకు ఇద్దరు కిరాయి రౌడీలను మాట్లాడి వారికి రూ.25 వేల చొప్పున రూ.50 వేలు ముట్టజెప్పాడు. అయితే ఈ ప్లాన్ బెడిసికొట్టింది. డబ్బులు తీసుకున్నవారు హత్య చేయకపోగా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో శ్రీనివాస్ రంగంలోకి దిగాడు. గత నెల 25న డబ్బులు ఇస్తానని రామయ్యకు చెప్పాడు. అదే రోజు కరీంనగర్ మండలం చింతకుంటకు చెందిన పరశురాములుతో కారులో ఇంటికి వచ్చి రామయ్యను తీసుకెళ్లాడు. కారు కరీంనగర్ శివారుకు రాగానే పరశురామ్ రామయ్యకు క్లోరోఫాం ఉన్న చేతిరుమాలు వాసనచూపడంతో స్పృహ కోల్పోయాడు. అనంతరం స్థానిక చల్మెడ ఆనందరావు ఆస్పత్రి సమీపంలో పరశురాములు వెంటతెచ్చుకున్న కత్తితో రామయ్య గొంతుకోశాడు. మృతదేహాన్ని ధర్మపురి శివారులోని రామయ్యపల్లెకు తీసుకెళ్లి ముళ్లపొదల్లో పడేసి పెట్రోల్పోసి దహనం చేశారు. 29వ తేదీన గుర్తించి గుర్తుతెలియని వ్యక్తి హత్యగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గూడెంగుట్ట వద్ద గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన శ్రీనివాస్, పరశురాములును అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా రామయ్యను హత్య చేసినట్లు అంగీకరించారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ తెలిపారు. రామయ్యను హత్యచేసేందుకు డబ్బులు తీసుకున్న అనిల్, సమ్మయ, అమర్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. హత్య కేసును ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితుల అరెస్టు మరో ముగ్గురి కోసం గాలింపు ధర్మపురి : ధర్మపురి శివారులోని రామయ్యపల్లెలో గత నెల 25న జరిగిన హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. రూ.10 లక్షల కోసం ఇద్దరు వ్యక్తులు సుల్తానాబాద్కు చెందిన పాలాజి రామయ్య(59)ను కిరాతకంగా హత్య చేశారు. అనంతరం అనుమానం రాకుండా మృతదేహాన్ని పెట్రోల్ పోసి దహనం చేసినట్లు నిర్ధారించారు. నిందితులు గర్రెపెల్లి శ్రీనివాస్, పరశురాములును ధర్మపురి సీఐ వెంకటరమణ గురువారం అరెస్ట్ చూపారు. ఆయన కథనం ప్రకారం.. సుల్తానాబాద్కు చెందిన రామయ్య గ్రామంలో వడ్రంగి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతడికి రాజీవ్ రహదారిని అనుకుని ఉన్న స్థలాన్ని పెట్రోల్ బంక్ కోసం గర్రెపెల్లి శ్రీనివాస్కు లీజుకు ఇచ్చాడు. సుమారు రూ.10 లక్షల లీజు డబ్బులు బకాయి పడడంతో ఈ విషయమై రామయ్య, శ్రీనివాస్కు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం శ్రీనివాస్ రూ.10 లక్షల చెక్కును రామయ్యకు ఇచ్చాడు. అది బౌన్స కావడంతో మళ్లీ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో విసుగు చెందిన శ్రీనివాస్ రామయ్యను హత్య చేయాలని పథకం పన్నాడు. ఈ మేరకు ఇద్దరు కిరాయి రౌడీలను మాట్లాడి వారికి రూ.25 వేల చొప్పున రూ.50 వేలు ముట్టజెప్పాడు. అయితే ఈ ప్లాన్ బెడిసికొట్టింది. డబ్బులు తీసుకున్నవారు హత్య చేయకపోగా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో శ్రీనివాస్ రంగంలోకి దిగాడు. గత నెల 25న డబ్బులు ఇస్తానని రామయ్యకు చెప్పాడు. అదే రోజు కరీంనగర్ మండలం చింతకుంటకు చెందిన పరశురాములుతో కారులో ఇంటికి వచ్చి రామయ్యను తీసుకెళ్లాడు. కారు కరీంనగర్ శివారుకు రాగానే పరశురామ్ రామయ్యకు క్లోరోఫాం ఉన్న చేతిరుమాలు వాసనచూపడంతో స్పృహ కోల్పోయాడు. అనంతరం స్థానిక చల్మెడ ఆనందరావు ఆస్పత్రి సమీపంలో పరశురాములు వెంటతెచ్చుకున్న కత్తితో రామయ్య గొంతుకోశాడు. మృతదేహాన్ని ధర్మపురి శివారులోని రామయ్యపల్లెకు తీసుకెళ్లి ముళ్లపొదల్లో పడేసి పెట్రోల్పోసి దహనం చేశారు. 29వ తేదీన గుర్తించి గుర్తుతెలియని వ్యక్తి హత్యగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గూడెంగుట్ట వద్ద గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన శ్రీనివాస్, పరశురాములును అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా రామయ్యను హత్య చేసినట్లు అంగీకరించారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ తెలిపారు. రామయ్యను హత్యచేసేందుకు డబ్బులు తీసుకున్న అనిల్, సమ్మయ, అమర్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. -
ఆటో, అంబులెన్స్ ఢీ: 8 మందికి గాయాలు
సుల్తానాబాద్ (కరీంనగర్) : సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి స్టేజీ వద్ద ఆగి ఉన్న ఆటోను పెద్దపల్లి వైపు వెళ్తున్న ఓ అంబులెన్స్ ఢీకొట్టింది. మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 8 మందికి తీవ్రగాయాలయ్యాయి.స్థానికులు గమనించి 108 అంబులెన్స్కు సమాచారాన్ని అందించారు. హుటాహుటిన క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. -
యువతి ఆత్మహత్య
సుల్తానాబాద్ (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామపంచాయతీ పరిధిలోని దేవునిపల్లికి చెందిన కొండపాక రమ్య(20) అనే యువతి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. రమ్య కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నప్పటికీ నయం కాలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బెడ్రూంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు గమనించి కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందినట్లు ఆయన తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి లక్ష్మణాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ఆలయంలో చోరీ
సుల్తానాబాద్ (కరీంనగర్) : మండలంలోని కాట్నపల్లి రామలింగేశ్వరాలయంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు హుండీని ఎత్తుకెళ్లారు. కొంతదూరం తీసుకువెళ్లి హుండీని పగులగొట్టి అందులోని సొమ్ముతో ఉడాయించారు. స్థానిక ఆలయ కమిటీ చైర్మన్ చీటి కేశవరావు మంగళవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై ఇంద్రసేనారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
'ప్రకటన సరే.. ఆచరణలో పెట్టండి'
సుల్తానాబాద్ (కరీంనగర్) : రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6 లక్షలు ఇస్తామని ప్రకటన చేయడం బాగానే ఉన్నప్పటికీ.. దాన్ని వెంటనే ఆచరణలో పెట్టాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల సూర్యప్రకాశ్ ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత నేత వైఎస్సార్ మరణించారనే సమాచారం విని తట్టుకోలేక మృతిచెందినవారి కుటుంబసభ్యులను పరామర్శించడం కోసం జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పరామర్శ యాత్రను జయప్రదం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. -
వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ
కరీంనగర్ (సుల్తానాబాద్) : సుల్తానాబాద్ కూరగాయల మార్కెట్ వద్ద కాసర్ల మల్లమ్మ(80) అనే వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. వృద్ధురాలు గట్టిగా అరిచినా దగ్గర ఎవరూ లేకపోవడంతో లాభం లేకపోయింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
11క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
సుల్తానాబాద్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు నుంచి రెండు ట్రాలీలలో అక్రమంగా తరలిస్తున్న 11 క్వింటాళ్ల పీడీఎస్(రేషన్) బియ్యాన్ని మంగళవారం పట్టుకున్నట్లు డీటీసీఎస్ మల్లికార్జున్రెడ్డి తెలిపారు. రేషన్బియ్యాన్ని తరలిస్తున్న చింతల కనకయ్య, తూర్పాటి నరేష్, చింతల సత్యనారాయణలపై 6ఎ కేసు నమోదు చేసి ఆటోలను పోలీస్స్టేషన్కు తరలించారు. బియ్యాన్ని ఎంఎల్ఎస్ గోదాము పాయింట్కు తరలించినట్లు వివరించారు. -
గుడుంబా స్థావరాలపై దాడులు
సుల్తానాబాద్ (కరీంనగర్) : గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్, పోలీసుశాఖ దృష్టిసారించింది. సర్కార్ ఆదేశాలతో స్పీడును పెంచాయి. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎక్సైజ్ కమీషనర్ అతుల్ సబర్వాల్ దాడులు చేయాలని వీడియో కాన్ఫరెన్స్లో ఎక్సైజ్ అధికారులను ఆదేశించడంతో.. రంగంలోకి దిగిన ఎక్సైజ్ అధికారులు సోమవారం చిన్నరాతుపల్లి, పెద్దరాతుపల్లి, పందిల్ల, ముప్పిరితోట గ్రామాలతో పాటు నర్సాపూర్, కొదురుపాక, పూసాల, గర్రెపల్లి, రేగడిమద్దికుంట, తొగర్రాయి, మంచరామి గ్రామాల్లో స్థావరాలపై దాడులు చేసి వందలాది లీటర్ల గుడుంబా, నాటుసారాను ధ్వంసం చేసి 20 మందికిపైగా కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. -
'పర్యావరణాన్ని పరిరక్షిద్దాం'
సుల్తానాబాద్ (కరీంనగర్) : పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సమిష్టిగా గణేషుని మట్టి ప్రతిమలనే ఏర్పాటు చేసుకోవాలని సీఐ తులా శ్రీనివాస్రావు అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో శనివారం పీస్కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17 నుంచి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నందున మైక్సెట్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని కోరారు. మతసామరస్యాన్ని పాటించాలని సూచించారు. రాత్రి వేళల్లో మండపాల వద్ద మద్యం, అశ్లీలతకు తావివ్వరాదని సూచించారు. -
రోడ్లను శుభ్రం చేసి నిరసన
సుల్తానాబాద్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో శనివారం ఆశావర్కర్ల సమ్మె 11వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆశావర్కర్లు రోడ్లను శుభ్రం చేసి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
'సీఎం హామీని రెండు నెలల్లో పూర్తి చేశా'
సుల్తానాబాద్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ వచ్చిన సందర్భంగా 8 కొత్త మార్కెట్లు ఇస్తామని హామీ ఇచ్చారని, రెండు నెలల్లో 13 వ్యవసాయ మార్కెట్లు జిల్లాకు ఇచ్చామని మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలో సోమవారం రూ. 3 కోట్లతో నిర్మించే గోదాములకు హరీష్రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికి 25 వ్యవసాయ మార్కెట్లు ఉండగా మరో 13 నూతనంగా మంజూరు చేశామన్నారు. అందులో పెద్దపల్లి నియోజకవర్గంలో జూలపెల్లి, కాల్వశ్రీరాంపూర్ ఉందన్నారు. నియోజకవర్గంలో పదిన్నర కోట్లతో శంకుస్థాపన చేస్తున్నట్లు చెప్పారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు గోదాముల్లో ధాన్యాన్ని ఆరు నెలల వరకు నిల్వ చేసినా వడ్డీ లేని రూ. 2లక్షల వరకు రుణాలను బ్యాంకు ఇస్తుందన్నారు. మార్కెట్కు వచ్చిన రైతులకు ప్రమాదబీమా సైతం రూ. లక్ష ఇవ్వడం జరగుతుందన్నారు. రైతు బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఎస్సారెస్పీ కాలువల మరమ్మత్తు చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల పెన్షన్లు గత ప్రభుత్వం అందిస్తే మా ప్రభుత్వం 37లక్షల మందికి పెన్షన్లు అందించామన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న రైస్మిల్లులు కరెంట్ లేకుండా జనరేటర్తో నడిచి నెలకు రూ. 3 లక్షలు నష్టం వాటిల్లుతుందని తమ దృష్టికి తేగా నేడు కరెంట్ కొరత లేని విధంగా అందిస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ 2 ఫేస్లో నెల రోజుల్లో టెండర్ పిలుస్తామని చెప్పడంతో పాటు మినీ ట్యాంకుబండ్, సీసీ రోడ్లు, మూత్రశాలలు, రైతులకు విశ్రాంతి గది నిర్మిస్తామని చెప్పారు. -
రాఖీ కట్టి వెళుతుండగా చైన్ స్నాచింగ్
(కరీంనగర్) సుల్తానాబాద్ : రాఖీ కట్టి స్వగ్రామానికి వెళుతుండగా శనివారం సుల్తానాబాద్ బస్టాండ్లో వివాహిత మహిళ మెడలో నుంచి పుస్తెల తాడును గుర్తుతెలియని యువకులు అపహరించారు. వివరాల్లోకి వెళితే.. నల్లవెల్లి సత్తమ్మ అనే మహిళ మండలంలోని రేగడిమద్దికుంట గ్రామంలో ఉన్న సోదరునికి రాఖీ కట్టి తిరిగి ఇంటికి వెళుతుండగా సుల్తానాబాద్ బస్టాండ్లో గుర్తు తెలియని యువకులు పుస్తెలతాడును అపహరించారు. వరంగల్ జిల్లా జనగాంకు చెందిన సత్తమ్మ బస్టాండ్లో బస్సు ఎక్కుతుండగా వెనుక నుంచి రెండున్నర తులాల పుస్తెల తాడును గుర్తుతెలియని యువకులు లాక్కుని పరారయ్యారు. బస్సును పోలీస్స్టేషన్కు తరలించి పోలీసులు పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమ కట్టడాల కూల్చివేత
సుల్తానాబాద్ (కరీంనగర్) : రోడ్డు పక్కన ఉన్న స్థలాలను ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు నిర్మించుకున్న వారిపై అధికారులు కొరడా ఝళిపించారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రత్న కాలనీలో రోడ్డు పక్కన ఉన్న స్థలాలను ఆక్రమించుకొని కట్టుకున్న ఇళ్లను ఎంపీడీవో వినోద్ ఆధ్వర్యంలో మంగళవారం తొలగించారు. -
మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు సస్పెండ్
సుల్తానాబాద్ (కరీంనగర్) : ఓ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం సరిగా అమలు కాకపోవడంతో నిర్వహకురాలిని అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని అశోక్నగర్ ప్రాథమిక పాఠశాలలో 45 మంది విద్యార్థులకు వండేందుకు హెచ్ఎం 4.5 కేజీల బియ్యాన్ని నిర్వహకురాలికి ఇచ్చారు. అయితే ఆమె అందులో సగం బియ్యాన్ని వండి మిగతా వాటిని మాయం చేసింది. దీంతో విద్యార్థులు అర్ధాకలితోనే భోజనం ముగించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు విచారణ చేపట్టి నిర్వాహకురాలిని సస్పెండ్ చేశారు. సాంబారు, కొడుగుడ్డు కూడా భోజనంలో వడ్డించడం లేదని విద్యార్థులు ఈ సందర్భంగా అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. -
చెట్టుపై నుంచి పడి గీతకార్మికుడు మృతి
సుల్తానాబాద్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల గ్రామానికి చెందిన ఆకుల రాములు(45) అనే గీత కార్మికుడు తాటిచెట్టుపై నుంచి పడి మృతిచెందినట్లు ఎస్సై తిరుమల్గౌడ్ తెలిపారు. శుక్రవారం చెట్టు నంచి కల్లు తీసి దిగుతుండగా మోకుజారడంతో ఒక్కసారిగా వెనుకవైపుకు కిందపడ్డాడు. స్థానికులు, గీతకార్మికులు గమనించి హుటాహుటిన ప్రైవేట్ వాహనంలో కరీంనగర్ తరలించారు. అయినప్పటికీ చికిత్స ప్రారంభం కాగానే అతను మృతిచెందినట్లు తెలిపారు. మృతునికి భార్య సారమ్మ, నలుగురు కూతుళ్లు ఉన్నారు. వారిలో ఇద్దరు వికలాంగులు ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
గాంధీ విగ్రహం ముందు కార్మికుల వినూత్న నిరసన
కరీంనగర్ (సుల్తానాబాద్) : జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ముందు పంచాయతీ కార్మికులు గురువారం వినూత్న నిరసన చేపట్టారు. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం ముందు చెవులు, కళ్లు, నోరు మూసుకుని నిరసన తెలియజేశారు. 44 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా మొండి వైఖరి అవలంబించడం సరికాదన్నారు. గాంధీ మార్గాన్ని అవలంబిస్తున్న పంచాయతీ కార్మికులకు స్వాతంత్ర్య దినోత్సవం రోజైనా శుభవార్త అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. చర్చలు జరిపి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. -
గుడుంబా స్థావరాలపై దాడులు
సుల్తానాబాద్ (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రేగడిమద్దికుంట గ్రామంలో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2600ల లీటర్ల బెల్లం పానకం, 35 లీటర్ల నాటుసారా ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సీఐ రాకేష్ తెలిపారు. ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గుడుంబా తయారీకి ఉపయోగించే డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. -
పట్టపగలే దోచేశారు
సుల్తానాబాద్ (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని బ్యాంకు కాలనీలో ఆకుల సరిత- శ్రీనివాస్ దంపతుల ఇంట్లో శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటి వెనుక తాళాన్ని పగులగొట్టి దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. తాము తెచ్చుకున్న రాడ్డుతో వంటగది, పూజగది, బెడ్రూమ్లలో సోదాలు చేశారు. ఇల్లంతా చిందరవందర చేశారు. 5 తులాల బంగారం (నెక్లెస్, చైన్, రెండు రింగులు)తో పాటు రూ. 58 వేల నగదును ఎత్తుకెళ్లారు. కాగా సరిత ఓదెల మండలం మడక గ్రామంలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. విధుల కోసం వెళ్లగా, భర్త ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ పని ఉండడంతో పెద్దపల్లికి వెళ్లాడు. పెద్దపల్లికి వెళ్లగానే దొంగలు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో సుమారుగా 16 తులాల బంగారం ఉందని, రోల్డ్గోల్డ్గా భావించి వదిలి వెళ్లుంటారని బాధితులు చెబుతున్నారు. దొంగతనం జరిగిందని స్థానికులు బాధితులకు ఫోన్చేసి సమాచారం అందించడంతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీం వచ్చి నమూనాలను సేకరించింది. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ తులా శ్రీనివాస్రావు, ఎస్సై ఇంద్రసేనారెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రమే టార్గెట్ దొంగతనాలకు సుల్తానాబాద్ మండల కేంద్రాన్నే టార్గెట్గా దొంగలు ఎంచుకున్నట్లు కనబడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 15 రోజుల్లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు కనబడుతుంది. ఎస్సై తిరుమల్ నివాసం ఉండే ఇంటి యజమాని ఇంట్లో పట్టపగలే దొంగతనం జరిగి 5వేల నగదు ఎత్తుకుని వెళ్లారు. స్థానిక వైశ్యభవన్లో లక్ష రూపాయల విలువ చేసే టెంట్హౌజ్ సామాగ్రిని ఎత్తుకుని వెళ్లారు. వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వీఆర్ఏలను విస్మరించడం తగదు
కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం అందరి వేతనాలు పెంచి వీఆర్ఏలను విస్మరించడం తగదని కరీంనగర్ జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్ అన్నారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు వారధిగా పని చేస్తున్న వీఆర్ఏలను సర్కారు గుర్తించకపోవడం బాధాకరమన్నారు. 010 పద్దుతో జీతాలు ఇవ్వడంతో పాటు ప్రమోషన్ల జాబితాను అసెంబ్లీ సమావేశాల్లోపే పూర్తి చేయాలని కోరారు. (సుల్తానాబాద్) -
జీవనోపాధికి వెళ్లి శవమై వచ్చాడు
సుల్తానాబాద్(కరీంనగర్) : కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్ మండలంలో గర్రెపల్లి గ్రామానికి చెందిన కల్లెపల్లి మల్లేశం(48) అనే వ్యక్తి గతనెల 21వ తేదీన దుబాయ్లో మృతి చెందాడు. అతని మృతదేహం దుబాయ్ నుండి శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరింది. దుబాయ్లోని అబుదాబిలో రోజూ మాదిరిగానే విధులకు వెళ్లి వచ్చి రూమ్లో నిద్రిస్తుండగా షాట్ సర్య్కూట్ అయ్యింది. ఆ ప్రమాదంలో మల్లేశం అక్కడికక్కడే మృతిచెందాడు. 2011 మే నెలలో జీవనోపాధి కోసం గ్రామం వదిలి వెళ్లాడు మల్లేశం. మరికొద్ది రోజుల్లో ఇంటికి తిరిగి వస్తానని చెప్తూ ఉత్సాహంగా గడుపుతోన్న మల్లేశం.. ప్రమాదశాత్తూ విద్యుత్షాక్ తగిలి మృతిచెందడంతో అతని కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. మృతునికి భార్య రజని, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కాగా మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు గ్రామస్థులు చంద్రయ్యతో పాటు పలువురు సహకారం అందించారు. మల్లేశం మృతితో గర్రెపల్లి గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. -
లంచాల ఎస్టీవో
సుల్తానాబాద్, న్యూస్లైన్: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలలో మరో రెండు అవినీతి చేపలు చిక్కాయి. శుక్రవారం లంచం తీసుకుంటూ సుల్తానాబాద్ ఎస్టీ వో వీ.రమేశ్కుమార్, సీనియర్ అకౌంటెంట్ నక్క తిరుమలేశ్ పట్టుబడ్డారు. మండలకేంద్రానికి చెందిన మస్తాన్ నాగరాజు తండ్రి డెత్ రిలీ ఫ్ఫండ్, డీఏ, ఏరియర్స్ ఇచ్చేందుకు ఆయన వద్ద రూ.15వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ తాళ్లపెల్లి సుదర్శన్గౌడ్ రెడ్హ్యాండ్గా పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. నాగరాజు తండ్రి బాలయ్య ఎస్సారెస్పీలో లస్కర్గా పని చేస్తూ 2005లో ఉద్యోగ విరమ ణ పొందాడు. ఈఏడాది జనవరిలో అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో ఆయనకు వచ్చే పింఛన్ కోసం ఆయన కొడుకు నాగరాజు ఎస్టీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నా డు. కుటుంబ సభ్యుల ధ్రువీకరణపత్రం, డెత్ సర్టిఫికెట్ సమర్పించారు. బాలయ్య కు రావాల్సిన డెత్ రిలీఫ్ ఫండ్, డీఏ, ఏరి యర్స్ కలిపి రూ.1.9లక్షలు రావాల్సి ఉంది. ఈడబ్బుల కోసం నాగరాజు కాళ్లరిగేలా తిరిగా డు. అధికారులు రేపు మాపని తిప్పుకుంటున్నారు. సహ నం కోల్పోయిన బాధితుడు నిల దీయగా రూ. 30వేలు ఇస్తేనే రావాల్సిన డబ్బులు ఇస్తామన్నారు. ఉన్నత చదువులు చదువుతున్న తాను పేదరికంలో మగ్గుతున్నానని, తన తండ్రి పిం ఛన్ మంజూరు చేయాలని కళ్లావేళ్లాపడ్డా కనికరించలేదు. రాజకీయ నాయకులతో చెప్పిం చి నా ప్రయోజనం లేకపోయింది. దీంతో బాధితుడు ముందుగా రూ.15వేలు ఇస్తానని, డబ్బు లు మంజూరైన తరువాత మిగితా రూ. 15వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నా డు. ఎస్టీవో రమేశ్కుమార్, అకౌంటెంట్ తిరుమలేశ్ చెప్పిన ప్రకారం శుక్రవారం రూ.15 వేలు తెచ్చి ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్గౌడ్, సీఐలు రమణమూర్తి, విజయభాస్క ర్, శ్రీనివాస్రాజు, హెచ్సీలు ఆనంద్, వెం కటస్వామి దాడి చేసి పట్టుకున్నారు. సంబంధిత రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎస్టీవో, అకౌం టెంట్ను శనివారం హైదరాబాద్లోని ఏసీబీ కోర్డులో హాజరు పర్చనున్నట్లు డీఎస్పీ సుదర్శన్గౌడ్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు, రెవెన్యూ, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లంచం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నట్లు చెప్పారు. విచారణ జరిపి పట్టుకుం టున్నామన్నారు. -
తెల్లారిన బతుకులు
సుల్తానాబాద్, న్యూస్లైన్ : పొట్ట చేత పట్టుకొని రాష్ట్రం రాష్ర్టం వచ్చిన ముగ్గురు వలస జీవుల బతుకులు తెల్లాయిపోయాయి. పొద్దంతా పనిచేసిన అలసటతో ఆదమరిచి నిద్రపోతున్న వారిని లారీ తొక్కడంతో శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. ఈ విషాద సంఘటన సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ శివారులోని రవిశంకర్ రైస్మిల్లులో శనివారం వేకువజామున జరిగింది. బీహార్ రాష్ట్రం మస్తాపూర్ జిల్లా రోసేరా మండ లం కల్యాణ్పూర్ గ్రామానికి చెందిన పదిహేను మంది కార్మికులు వారం రోజుల క్రితం రైస్మిల్లులో పనిచేసేందుకు ఇక్కడికి వచ్చారు. శుక్రవారం పని ముగిసిన తర్వాత భోజనాలు చేసి మిల్లు ఆవరణలో అందరూ ఒకేచోట వరుసగా పడుకున్నారు. రాత్రి 2.15 గంటల ప్రాంతంలో మేడిపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్ నుంచి ఓ లారీ మిల్లుకు ధాన్యం తీసుకొచ్చింది. హనుమాన్ దీక్ష స్వీకరించిన డ్రైవర్ మాల విరమణకు వెళ్లగా, క్లీనర్ సాయిలుకు లారీని అప్పగించాడు. అతడు నిద్రిస్తున్న కార్మికులను గమనించకుండా లారీని రివర్స్ తీసుకోగా వెనుక చక్రాల కింద ముగ్గురు నలిగిపోయారు. పొట్ట, ఛాతి భాగం మీదుగా లారీ ఎక్కింది. తీవ్రగాయాలైన సుకేందర్సదా(22) ఆర్తనాదాలు చేయడంతో మిగతా వారికి మెళకువ వచ్చింది. ప్రాణభయంతో అందరూ గట్టిగా అరవడంతో సాయిలు లారీని నిలిపివేసి అక్కడినుంచి పరారయ్యాడు. అప్పటికే దీప్సదా(20), శ్యాంసుందర్ సదా(25) మృతి చెందారు. సుకేందర్సదాను 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. అతడు ఆర్తనాదాలు చేయడం వల్లే తమకు మెళకువ వచ్చిందని, లేకుంటే తామంతా ప్రాణాలు కోల్పోయేవారమని ప్రత్యక్ష సాక్షులు రంజిత్సదా, మంజులసదా, శ్యామ్సావ్, అనిల్సదా బోరున విలవిస్తూ చెప్పారు. లారీ క్లీనర్ సాయిలు మద్యం సేవించి నిర్లక్ష్యంగా లారీ నడపడం వల్లే ముగ్గురు వలస జీవుల ప్రాణాలు గాలిలో కలిశాయని భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే సిహెచ్.విజయరమణారావు, రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు, మాజీ ఎంపీపీలు పాల రామారావు, గంట రాములు, కార్మిక సంఘ నేతలు రాములుగౌడ్, కృష్ణారెడ్డి సందర్శించి కార్మికులకు సంతాపం తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ కార్యదర్శి కల్వల శ్రీనివాస్ అన్నారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై రామకృష్ణగౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని ఘటన వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. రైస్మిల్లు నిర్వాహకులు మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించడంతో పాటు అంత్యక్రియల కోసం రూ.50వేలు ఇచ్చారు. -
డీఈ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
సుల్తానాబాద్, న్యూస్లైన్ : చివరి భూముల్లో వేసిన ఆరుతడి పంటలకు సైతం నీరందడం లేదంటూ స్థానిక ఎస్సారెస్పీ డీఈ కార్యాలయాన్ని శనివారం రైతులు ముట్టడించారు. డీ86 కెనాల్ ఆయకట్టు రైతులు ధర్నాకు దిగారు. రైతుల ధర్నా విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులు వచ్చే వరకు కార్యాలయానికి చేరుకోలేదు. పోలీసులు చేరుకున్నాక వచ్చిన డీఈ రాముతో రైతులు వాగ్వాదానికి దిగారు. నీరందక పంటలు ఎండిపోయేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చొప్పదండిలో 1050 క్యూసెక్కుల నీరు వదిలి అన్ని డీపీలు మూసివేస్తే చివరి భూములకు నీర ందుతుందన్నారు. ఉప కాలువలు మూసివేయకపోవడంతో హుస్సేమియా, మానేరువాగులోకి నీరు వృథాగా పోతుందన్నారు. 72 గంటల పాటు 1050 క్యూసెక్కుల నీరు వదులుతామని డీఈ హామీతో రైతులు ఆందోళన విరమించారు. ఆందోళనలో రైతులు పడాల కుమారస్వామి, ఎం.లింగయ్య, కె.మల్లారెడ్డి, రఘుపతి, సమ్మారావు, రవీందర్రెడ్డి, మాదన్న, రాజు, రమేశ్, సది, శంకర్, కొమురయ్య, మొండయ్య, రాయమల్లు, కుమార్, శ్రీను, రవి, ఓదేలు పాల్గొన్నార -
నిండా ముంచిన ‘మైత్రి ప్లాంటేషన్’
సుల్తానాబాద్, న్యూస్లైన్ : ‘మైత్రి ప్లాంటేషన్’ పేరిట భారీ మోసానికి పాల్పడిన సంఘటన మండలంలోని కాట్నపల్లిలో శనివారం వెలుగుచూసింది. సుమారు 28 మంది నుంచి రూ.20లక్షలకు పైగా దినసరి.. ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో వసూలు చేసి చేతులెత్తేశారు. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సీత సంపత్ తాను ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన మాధవరెడ్డి స్థాపించిన మైత్రి ప్లాంటేషన్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఏజెంట్గా పనిచేస్తున్నానని, ఆయన ఖమ్మ జిల్లా ఏరుపాలెం మండలం రాజుపాలెం గ్రామంలోని సర్వేనంబర్ 81లో భూములు కొనుగోలు చేశాడని, పాలసీ చేస్తే రెండున్నరేళ్ల అనంతరం ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు ప్లాంటేష న్ ద్వారా వచ్చిన లాభాలు పంచుతామని నమ్మించాడు. సంస్థ మోసం చేస్తే తన పొలాన్ని విక్రయించి డబ్బు తిరిగి ఇస్తానని పేర్కొనడంతో నమ్మామని బాధితులు ఆడెపు లక్ష్మీనారాయణ, కోడూరి విజయ, అంజయ్య, శంకరయ్య, పూసాల తిరుపతి, వెంకటేశం, శారద, రాజయ్య, సంపత్, రంగయ్య తెలిపారు. ఇలా 28మంది నుంచి రూ.20లక్షలు వసూలు చేశాడు. చెప్పిన సమయం దాటిపోవడంతో భూములు రిజిస్ట్రేషన్ చేయాలని గ్రామస్తులు సంపత్పై ఒత్తిడి తెచ్చారు. చేతులెత్తేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సంప త్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వసూలు చేసిన డబ్బును సంస్థకే చెల్లించానని, సంస్థ నుంచి రాగానే ఇస్తాన ని సంపత్ మొండికేశాడు. బాధితులు అతడిని పంచాయతీ కార్యాలయానికి పిలిపించారు. సంస్థలకు సంబంధించిన ఎలాంటి గుర్తింపు కాగితాలు సంపత్ వద్ద లేకపోవడంతో బాధితులకు డబ్బులు ఇవ్వాల్సిందేనని వార్డు సభ్యులు మోరపల్లి తిరుపతిరెడ్డి, కొల్లూరి శంకరయ్య, మాజీ ఎంపీపీ పాలరామారావు సూచించారు. అయినా సంపత్ వినిపించుకోకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు సంపత్ను పోలీస్స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు.