Sushanth Singh Rajputh
-
Christmas 2024 నింగికెగిసిన తారలు, కళ్లు చెమర్చే AI ఫోటోలు
-
డ్రగ్స్ కేసులో హీరోయిన్కు బిగ్ రిలీఫ్
బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో నటి రియా చక్రవర్తి బెయిల్పై ఉన్న విషయం తెలిసిందే. రియాకు మంజూరైన బెయిల్ను సవాలు చేయడం లేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇదీ ఆమెకు ఓ రకంగా శుభవార్తనే చెప్పవచ్చు. అయితే.. ఆమెపై ఇప్పటికే ఉన్న నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టంలోని సెక్షన్ 27-ఎకి సంబంధించిన చట్టాన్ని తెరిచే ఉంచాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్లతో కూడిన ధర్మాసనానికి తెలిపారు. (ఇదీ చదవండి: సర్జరీ చేయించుకోనున్న మెగా హీరో, అప్పటిదాకా సినిమాలకు దూరం!) రియాపై నమోదైన సెక్షన్ 27-ఎ అంటే ఇదే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తిపై అక్రమ మాదకద్రవ్యాలతో పాటు అక్రమ రవాణాకు సంబంధించి ఫైనాన్సింగ్ చేయడమే కాకుండా అలాంటి వారికి ఆశ్రయం కల్పించడం వంటి వాటికి సంబంధించిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టంలోని కఠినమైన సెక్షన్ 27-ఎ కింద అభియోగాలు మోపింది. ఇది గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు బెయిల్ మంజూరుపై నిషేధాన్ని కలిగి ఉంటుంది. అయితే.. చక్రవర్తి కేసులో డ్రగ్స్కు సంబంధంచి ఆమె ఫైనాన్సింగ్ లేదా ఆశ్రయం కల్పించినట్లు ఆధారాలు లేనందున సెక్షన్ 27-A వర్తించదని హైకోర్టు పేర్కొంది. అప్పట్లో జరిగింది ఇదీ 2020లో కలకలం రేపిన దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ డ్రగ్ కేసు కేసులో నటి రియా చక్రవర్తి డ్రగ్ కోనుగోలు చేసి సుశాంత్కు ఇచ్చినట్లు ఆరోపిస్తూ నేషనల్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఆమెతో మరో పాటు 34 మంది పేర్లను ఎన్సీబీ చార్జీషీట్లో పేర్కొంది. కాగా రియా డ్రగ్స్ కొనుగోలు చేసి సుశాంత్కు ఇవ్వడం వల్లే అతడు ఈ అలవాటుకు బానిసయ్యాడని, సుశాంత్ మరణానికి రియా ఇచ్చిన డ్రగ్సే కారణమని ఎన్సీబీ తమ చార్జిషీట్లో వెల్లడించింది. ఈ కేసులో సుమారు నెలరోజుల పాటు జైల్లో ఉన్న రియా బెయిల్పై విడుదల అయింది. (ఇదీ చదవండి: జీవిత, రాజశేఖర్కు ఏడాది జైలుశిక్ష.. బెయిల్) -
సుశాంత్ది హత్యే!.. ఇప్పటికైనా న్యాయం చేయండి : సుశాంత్ సోదరి ఆవేదన
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయి రెండేళ్లు దాటినా, అతడి మృతికి గల కారణాలు ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఇక సుశాంత్ది ఆత్మహత్య కాదు, హత్యేనంటూ పోస్టుమార్టం చేసిన బృందంలోని రూప్కుమార్ షా అనే వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ కేసు మరోసారి తెరమీదకి వచ్చింది. సుశాంత్ బాడీపై పలు గాయాలు ఉన్నాయని పేర్కొన్న రూప్కుమార్.. పోస్టుమార్టం జరిగేటప్పుడు వీడియో రికార్డు చేయకుండా కేవలం ఫోటోలు మాత్రమే తీశారని, పైఅధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు త్వరగా పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేశామని వెల్లడించారు. దీంతో సుశాంత్ మరణంపై మరోసారి అనుమానాలు రేకెత్తుతున్నాయి. తాజాగా ఇదే విషయమై ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ సుశాంత్ సోదరి ట్వీట్ చేసింది. రూప్కుమార్ చేసిన వ్యాఖ్యలను స్క్రీన్షాట్స్లో జోడించి.. సుశాంత్ కేసును సీబీఐ విచారణ జరిపి నిజనిజాలు ఏంటో బయటకు వెల్లడిస్తారని ఎప్పటినుంచో మేం ఎదురుచూస్తున్నాము. సుశాంత్కు న్యాయం జరగాలి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కాగా 2020 జూన్14న ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్లో సుశాంత్ మరణించిన సంగతి తెలిసిందే. If there is an ounce of truth to this evidence, we urge CBI to really look into it diligently. We have always believed that you guys will do a fair investigation and let us know the truth. Our heart aches to find no closure as yet. 🙏 CBI Make SSRCase TimeBound pic.twitter.com/g58mj2F37q — Shweta Singh Kirti (@shwetasinghkirt) December 26, 2022 We have to make sure safety of RoopKumar Shah is insured. 🙏 CBI Make SSRCase TimeBound @narendramodi @AmitShah #SushantSinghRajput https://t.co/suY8sCuwrU — Shweta Singh Kirti (@shwetasinghkirt) December 26, 2022 -
కోర్టుపై నమ్మకం పోయింది: కంగనా రనౌత్
ముంబై: బెయిల్ వచ్చే అవకాశమున్న కేసుల్లోనూ ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందేనని, లేదంటే వారెంట్లు పంపుతానంటూ కోర్టు పరోక్షంగా బెదిరిస్తోందని, కోర్టుపై నమ్మకం పోయిందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై ఓ ఇంటర్వ్యూలో నటుడు హృతిక్ రోషన్, ప్రముఖ గీత రచయిత జావెద్ అక్తర్లను పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘బాలీవుడ్లో కోటరీ వ్యవస్థ వేళ్లూనుకుంది’ అని కంగన అన్నారు. దీంతో కంగనపై జావెద్ అక్తర్ గతంలో పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో తమ ముందు హాజరుకావాలంటూ ముంబైలోని అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కంగనకు ఫిబ్రవరి నుంచి పలుమార్లు సమన్లు జారీచేశారు. దీంతో ఎట్టకేలకు సోమవారం కంగన కోర్టుకొచ్చారు. బెయిల్ వచ్చే అవకాశమున్న కేసుల్లోనూ ప్రత్యక్షంగా హాజరవ్వాల్సిందే, లేదంటే వారెంట్ జారీచేస్తామని కోర్టు రెండుసార్లు పరోక్షంగా బెదిరించిందని ఆమె వ్యాఖ్యానించారు. కేసు దర్యాప్తు తమకు వ్యతిరేకంగా సాగుతోందని, వేరే కోర్టుకు కేసును బదలాయించాలని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు ఆమె సోమవారం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై కోర్టు అక్టోబర్ ఒకటిన విచారించనుంది. -
సుశాంత్కి న్యాయం జరగాలి!
జూన్ 14.. 2020.. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ తుది శ్వాస విడిచిన రోజు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుశాంత్ చనిపోయి జూన్ 14కి సరిగ్గా ఏడాది పూర్తయింది. అయినప్పటికీ ఆయన మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. బాలీవుడ్లో నెపోటిజం కారణంగా సుశాంత్కి అవకాశాలు రాకుండా చేసి, ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సుశాంత్ మరణంపై అనుమానాలున్నాయని ఆయన కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన మృతిపై ముంబై పోలీసులే కాకుండా బీహార్ పోలీసులు కూడా దర్యాప్తు చేశారు. ఆ తర్వాత ఈ కేసుని సీబీఐకి అప్పగించారు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి సహా పలువురు అనుమానితుల్ని అరెస్ట్ చేయడం, బెయిల్ మీద బయటకు రావడం తెలిసిందే. సుశాంత్ మరణించి ఏడాది పూర్తయినా కేసు ఓ కొలిక్కి రాకపోవడంతో అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా మరోసారి ‘వియ్ మిస్ యు’, 'JusticeForSushantSinghRajput' అని ట్రెండ్ చేశారు. వెబ్సైట్ ప్రారంభం... సుశాంత్ సింగ్ మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన సినీ, వ్యక్తిగత వివరాలతో www.ImmortalSushant.com పేరుతో వెబ్సైట్ ఆరంభమైంది. సుశాంత్ కుటుంబ సభ్యుల సహాయంతో ప్రారంభమైన ఈ సైట్లో సుశాంత్ జీవిత విశేషాలు, సినిమాల వివరాలు, ఆయన వీడియోలు, ఫోటోలు ఉంటాయి. నీ జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి – అంకితా లోఖండే సుశాంత్ సింగ్ మొదటి వర్ధంతి సందర్భంగా అతడి మాజీ ప్రేయసి, నటి అంకితా లోఖండే పదేళ్ల క్రితం సుశాంత్తో కలిసి దీపావళి వేడుకల్లో డ్యా¯Œ ్స చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘‘ఇది 2011 దీపావళి నాటి వీడియో. నీ జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి సుశాంత్.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’ అని రాశారు. ‘పవిత్ర్∙రిష్తా’ సీరియల్ షూటింగ్ సమయంలో అంకిత, సుశాంత్ సింగ్ల మధ్య ప్రేమ చిగురించింది. ఆరేళ్లపాటు ప్రేమించుకున్న వీరు 2016లో విడిపోయారు. ఆ తర్వాత రియా చక్రవర్తిని ప్రేమించారు సుశాంత్ సింగ్. ఇంకా సుశాంత్తో సినిమాలు చేసినవారు, అతని కుటుంబ సభ్యులు కూడా ట్వీట్ చేశారు.| సహాయం, సలహా లేదా నవ్వు.. ఇవి నాకెప్పుడు కావాలన్నా నువ్వు (సుశాంత్ సింగ్ రాజ్పుత్) నాతో ఉన్నావు. ఈ నటనా ప్రపంచానికి నీతోనే (సారా తొలి చిత్రం ‘కేదార్నాథ్’లో సుశాంత్ హీరో) పరిచయం అయ్యాను నేను. కలలు నిజమవుతాయనే నమ్మకాన్ని నాలో కలిగించిన నువ్వు లేవన్న నిజాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కానీ ఈ మండుతున్న సూర్యుణ్ణి, వెలుగుతున్న చంద్రున్ని, ప్రకాశిస్తున్న నక్షత్రాలను చూస్తున్న ప్రతిసారీ నువ్వు మాతోనే ఉన్నావని మాకు అనిపిస్తుంటుంది. – సారా అలీఖాన్ నీ ప్రశ్నలు, మనం మాట్లాడుకున్న సంభాషణలతో పాటు నిన్ను కూడా మిస్ అవుతున్నాను. నాకు తెలియని ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన వ్యక్తివి నువ్వు. నీ ఊహల్లో ఉన్న ప్రశాంతత నీకు దొరికిందనే ఆశిస్తున్నాను. – భూమీ పెడ్నేకర్ మన జీవితాలను రెండు భాగాలుగా చూసే కొన్ని çఘటనలు ఉంటాయి. సుశాంత్ మరణం మా జీవితాల్లో అలాంటిదే. మా కుటుంబసభ్యుల జీవితాలు సుశాంత్ మరణానికి ముందు, ఆ తర్వాత అన్నట్లుగా మారాయి. జీవించడానికి సంపాదించుకుంటున్నాం, మా పెద్దలను బాగానే చూసుకుంటున్నాం. ఇలా కొన్ని సాధారణ పనులు అందరి జీవితాల్లో జరిగినట్లుగానే మాకూ జరుగుతున్నాయి. కానీ మా అందరి ఆలోచనల్లో భర్తీ కానీ ఏదో శూన్యత దాగి ఉంది. అది మా జీవితాలను మార్చివేసింది. సుశాంత్ చాలామందికి దానాలు చేశాడు – సుశాంత్ బావ విశాల్ కృతి. జూన్ నెల అంతా పర్వత ప్రదేశాల్లో ఒంటరిగా గడపాలనుకుంటున్నాను. అక్కడ ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉండవు. నా సోదరుడికి చెందిన జ్ఞాపకాలను ఆ నిశ్శబ్ద వాతావారణంలో నెమరువేసుకుంటాను’’ అని ఈ ఏడాది మే 26న సుశాంత్సింగ్ సోదరి శ్వేతాసింగ్ కృతి ట్వీట్ చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదు – శేఖర్ సుమన్ ‘‘సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసును త్వరితగతిన పూర్తి చేయమని సంబంధిత అధికారులను, ఏజెన్సీలను కోరుకుంటున్నాను. అనుమానాస్పద రీతిలో సుశాంత్ మనకు దూరమై ఏడాది అవుతోంది. ఓ మంచి వ్యక్తి సమాజంలోని కొన్ని కారణాల్ల ఒత్తిళ్లకు లోనయ్యాడు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని నమ్ముతున్నాను. అతని కేసు విషయంలో న్యాయం ఎందుకు ఆలస్యం అవుతోంది? కేసును ఎందుకు క్లోజ్ చేయలేకపోతున్నారు? ఇలా సమాధానాలు కావాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఆ జవాబులు ఆశిస్తున్నాను’’ అన్నారు శేఖర్ సుమన్. నీ గురించి ఆలోచించని క్షణం లేదు. నువ్వు మాకు దూరమయ్యావన్న నిజాన్ని ఇంకా మర్చిపోలేకపోతు న్నాను. కాలం కొన్ని విషయాలను మర్చిపోయేలా చేస్తుందని కొందరు అన్నారు. కానీ నా కాలం, సర్వస్వం నువ్వు. నాకు తెలుసు.. నువ్వొక గార్డియన్ ఏంజిల్లా నీ టెలిస్కోప్ కళ్ళతో నన్ను చూస్తూ, కాపాడుతూనే ఉంటావని! నువ్వు వచ్చి నన్ను తీసుకుని వెళతావని ప్రతిరోజూ ఎదరుచూస్తూనే ఉన్నాను. అన్నిచోట్లా వెతుకున్నాను. నీ గురించి ఇది రాస్తున్నప్పుడు నా మనసులో ఎంత బాధ ఉందో చెప్పలేను. నువ్వు లేకుండా నా జీవితమే లేదు. నా జీవితంలో నెలకొని ఉన్న శూన్యం భర్తీ చేయలేనిది. – రియా చక్రవర్తి మన లుక్టెస్ట్ కోసం తొలిసారి నేను నిన్ను చూశాను. ఆలోచనల పరంగా రెండు విభిన్న ప్రపంచాలకు చెందిన ఇద్దరు వ్యక్తులం మనమని అనుకున్నాను. తర్వాత మనం ఇద్దరం కలిసి చేసిన ఓ సినిమా మన ఇద్దరి ప్రపంచాల్లో ఉన్న చాలా సంగతులు ఒకటేనని తెలిసేలా చేసింది. కానీ ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ ప్రపంచంలో నువ్వు లేవని బాధగా ఉంది. నువ్వు దూరమవ్వడాన్ని నేనింకా మర్చిపోలేకపోతున్నాను. నువ్వింకా మా మధ్యనే ఉన్నావనే అనుకుంటున్నాను. – కృతీసనన్ -
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక ట్విస్ట్
-
యూట్యూబర్కు భారీ షాక్ ఇచ్చిన అక్షయ్
ముంబై : బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఓ యూట్యూబర్కు భారీ షాక్ ఇచ్చారు. అతడి యూట్యూబ్ ఛానల్లో తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు 500 కోట్లరూపాయలకు పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు బీహార్కు చెందిన సిద్ధిఖీ అనే సివిల్ ఇంజనీర్పై కేసు నమోదైంది. దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసుతో సంబంధం ఉందంటూ తనపై ఫేక్ వార్తల్ని ప్రచారం చేశాడని అక్షయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, సుశాంత్ కేసుతో అక్షయ్ని ముడిపెడుతూ సిద్ధిఖీ పలు వీడియోలు చేశాడు. సుశాంత్ ధోనీ లాంటి పెద్ద సినిమాలు చేయటం అక్షయ్కు ఇష్టం లేదని, అక్షయ్.. ఆధిత్య ధాక్రే, ముంబై పోలీసులతో పలుమార్లు రహస్య సమావేశాలు జరిపారని ఆరోపిస్తూ ఓ వీడియో. ( తల్లి రాలేదని గుండెలవిసేలా ఏడ్చిన మోనాల్ ) సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి కెనడాకు పారిపోవటానికి అక్షయ్ సహాయం చేశాడంటూ మరో వీడియో చేశాడు. ఇలా సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించిన వీడియోలు చేయటం ద్వారా సిద్ధిఖీ యూట్యూబ్ ఛానల్ ఒక్క సారిగా ఫేమస్ అయిపోయింది. నాలుగు నెలల కాలంలో దాదాపు 2 లక్షల సబ్స్క్రైబర్లతో పాటు 15 లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదించాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన కుమారుడ్ని సుశాంత్ కేసులోకి లాగి గతంలో ఇతడు ఓ సారి జైలు పాలయ్యాడు. -
అర్నబ్కు దక్కని ఊరట
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్–ఇన్–చీఫ్ అర్నబ్ గోస్వామికి న్యాయస్థానం నుంచి ఊరట దక్కలేదు. 2018 నాటి కేసులో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై బాంబే హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. అయితే, ఈ విచారణ అసంపూర్తిగా ముగియడంలో అర్నబ్కు బెయిల్ లభించలేదు. శనివారం విచారణ కొనసాగిస్తామని బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చిచెప్పింది. ఆర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసులో అర్నబ్ను బుధవారం ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య విషయంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ను కించపర్చేలా టీవీలో చర్చ నిర్వహించారని, అందుకే సభా హక్కుల ఉల్లంఘన చర్యలు ప్రారంభిస్తామంటూ అర్నబ్కి మహారాష్ట్ర శాసనసభ గతంలో నోటీసిచ్చింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టుకెక్కారు. నోటీసుపై కోర్టుకు వెళ్లడం చెల్లదని, జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ అసెంబ్లీ సెక్రెటరీ గతంలో అర్నబ్కి లేఖ రాశారు. విచారణ సందర్భంగా కోర్టు.. ‘పిటిషనర్ను బెదిరించేలా లేఖ ఎందుకు రాశారు? రెండు వారాల్లోగా వివరణ ఇవ్వండి’ అని అసెంబ్లీ సెక్రెటరీకి షోకాజ్ నోటీసు ఇచ్చింది. -
రియాకు బెయిలు..
-
మరిన్ని కోడ్ వర్డ్లు బయటపెట్టిన దీపికా!
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత బాలీవుడ్ను డ్రగ్స్ కేసు వెంటాడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తి పలువురి పేర్లను వెలువరించింది. అందులో దీపికా పదుకొనే, ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాశ్ పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికే వారిని ఎన్సీబీ అధికారులు ప్రశ్నించగా వారు సరదగా మాట్లాడుకొనే అనేక కోడ్ లాంగ్వేజ్ల గురించి వివరించారు. 2017లో వారి వాట్సాప్ చాట్ గురించి ప్రశ్నించగా వారు వీడ్, మాల్, డబ్ అనే పేర్లతో సిగరెట్లను పిలుచుకుంటామని తెలిపారు. ఇరువురిని వేరువేరుగా ప్రశ్నించగా వారిద్దరూ కూడా సరైన సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఇంకా ఏం ఏం కోడ్ భాషలో మాట్లాడుకుంటారు అని ప్రశ్నించగా తాము పన్నీర్, క్విక్కర్, మ్యారేజ్ అనే కోడ్లో మాట్లాడుకుంటామని దీపికా తెలిపింది. పన్నీర్ అనే పదాన్ని చాలా సన్నగా ఉండేవారి కోసం ఉపయోగిస్తామని, క్విక్కర్ అనే పదాన్ని షార్ట్ టర్మ్ రిలేషన్షిప్లో కోసం, మ్యారేజ్ అనే పదాన్ని లాంగ్టర్మ్ రిలేషన్షిప్లో ఉండే వారి కోసం ఉపయోగిస్తామని దీపికా తెలిపింది. అయితే వారి సమాధానాలతో ఎన్సీబీ అధికారులు తృప్తి చెందారని, వారికి త్వరలోనే ఈ డ్రగ్స్ కేసు నుంచి విముక్తి కలిగే అవకాశాలు ఉన్నాయని ఎన్సీబీ అధికారి ఒకరు వెల్లడించిన విషయం తెలిసిందే. చదవండి: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ భామలకు క్లీన్ చిట్? -
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ భామలకు క్లీన్ చిట్?
సాక్షి, న్యూఢిల్లీ: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. మాదకద్రవ్యాల కేసులో ఇప్పటికే రియా చక్రవర్తితో పాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొంతమందిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకొని వారి నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. విచారణలో రియా వెల్లడించిన కొన్ని విషయాల ఆధారంగా కొంతమంది హీరోయిన్లు రకుల్, దీపికా పదుకొణే, సారా అలీ ఖాన్ , శ్రద్ధా కపూర్ వంటివారికి ఎన్సీబీ బృందం విడివిడిగా విచారించడం మొదలుపెట్టింది. అయితే వీరిని విచారించిన అనంతరం బాలీవుడ్ భామలకు ఊరట లభించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఎన్సీబీ అధికారి ఒకరు తెలిపారు. దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్ , శ్రద్ధా కపూర్లతో పాటు దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్ లకు ఎన్సీబీ దాదాపు క్లీన్ చిట్ ఇచ్చినట్టే అని ఎన్సీబీ అధికారి ఒకరు వెల్లడించారు. 2017 వాట్సప్ చాట్లో దీపికా, ఆమె మేనేజర్ వాల్, మాల్, వీడ్, హాష్, డూంబ్ అనే పదాలను ఉపయోగించారని ఎన్సీబీ విచారణలో వెల్లడయ్యింది. అయితే అవి వివిధ రకాల సిగరెట్ల కోసం సరాదాగా కోడ్తో పిలుచుకున్నామని దీపికా, ఆమె మేనేజర్ విచారణలో తెలిపినట్లు తెలిసింది. . స్లిమ్ సిగరెట్స్ కోడ్గా హ్యాష్, మందపాటి సిగరెట్లకు కోడ్గా వీడ్, తక్కువ నాణ్యత గల సిగరెట్లను మాల్ ఇలా పలు రకాలుగా వారు పిలుచుకునే వారని తెలిపారు. దీపికా, ప్రకాశ్లను వేర్వేరు గదులలో ఉంచి విచారించగా, వారి ఇచ్చిన సమాధానాలు ఒకేలా ఉన్నాయని వీటితో ఎన్సీబీ అధికారులు సంతృప్తి చెందినట్లు ఒక అధికారి తెలిపారు. మరి కొద్ది రోజులలో వీరికి క్లీన్ చీట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుందని చెప్పారు. అదే జరిగితే ఇక బాలీవుడ్ భామలకు డ్రగ్స్ కష్టాలు తప్పినట్లే. చదవండి: 3 వేలు ఉన్న రియా ఖాతాలోకి లక్షలు? -
దీపికకు నోటీసుల వెనుక ఇంత కుట్రనా..
సాక్షి, ముంబై : బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో మొదలైన వివాదం చిత్రపరిశ్రమలో పెను దుమారాన్ని రేపుతోంది. మొదట నెపోటిజం చుట్టూతిరిగిన కథఅంతా.. డ్రగ్స్వైపు మళ్లింది. ప్రస్తుతం విచారణ అంతా సుశాంత్ ఆత్మహత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి వాంగ్మూలం చుట్టు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఆమె వెల్లడించిన పేర్ల ప్రకారం.. హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్లకు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు నోటీసులు జారీచేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా డ్రగ్స్ కేసులో బాలీవుడ్ టాప్ బ్యూటీ దీపికా పదుకొనెకు కూడా నోటీసులు పంపడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లోనూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దీపికపై కక్షసారింపు చర్యగా ఈ కేసులో ఇరికించారనీ, సుశాంత్ ఆత్మహత్య కేసులో వాస్తవాలను కప్పిపుచ్చేందుకు డ్రగ్స్ కేసు తెరపైకి తీసుకువచ్చారనీ పలువురు అభిప్రాయపడుతున్నారు. (రకుల్, దీపిక, సారా, శ్రద్ధలకు సమన్లు) అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈనెల 25న దేశ వ్యాప్త బంద్కు రైతు సంఘాలు పిలుపునిచ్చిన తరుణంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే దీపికతో పాటు ఇతర నటీమనుల పేర్లును డ్రగ్స్ కేసు జాబితాలో చేర్చారని సోషల్ మీడియా వేదికగా పలువురు విశ్లేషిస్తున్నారు. వ్యవసాయంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు దేశంలో ఆగ్రహావేశాలకు దారితీస్తున్న విషయం తెలిసిందే. దీనిపై విపక్షాల నిరసనలతో పార్లమెంట్ రణరంగాన్నే తలపించింది. బిల్లులపై ఓటింగ్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణాకం ఏకంగా సభ్యుల సస్పెన్సన్కు దారితీసింది. అంతేకాకుండా బిల్లులను ఉపసంహించుకోవాలని కోరుతు విపక్ష పార్టీలు సమావేశాలను సైతం బహిష్కరించాయి. (డ్రగ్ కేసు: దీపికాకు కంగనా చురకలు) ఈ క్రమంలోనే ఈనెల 25(శుక్రవారం) దేశ వ్యాప్తంగా బంద్కు అఖిల భారత రైతు కూలీసంఘం పిలుపునివ్వగా దీనికి దేశంలోని రైతు సంఘాలన్నీ మద్దతు ప్రకటించాయి. వీటితో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సైతం మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని బంద్పై పడనీయకుండా కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగంగా రెండు రోజుల ముందు నోటీసులు జారీచేశారని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. మీడియా దృష్టిని సైతం మళ్లించే విధంగా బీజేపీ పెద్దలు రచించిన వ్యూహంలో దీపికను పావుగా ఉపయోగించుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 25న జరిగే బంద్ను ఏమాత్రం కవర్ చేయకుండా మీడియా మొత్తం దీపిక చుట్టే తిరుగుతుందని పోస్టులు పెడుతున్నారు. దీపికపై ఎందుకింత కుట్రఅని నిలదీస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో విద్యార్థులు, టీచర్లపై జరిగిన దాడిని ఖండిస్తూ దీపిక వర్సిటీని సందర్శించిన విషయం తెలిసిందే. బీజేపీ మద్దతుదారులు చేసిన దాడికి నిరసనగా అక్కడి విద్యార్థులు చేపట్టిన దీక్షకు ఆమె సంఘీభావం తెలిపారు. ఈ పరిణామం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కొందరు దీపిక చర్యలను సమర్థించగా.. బీజేపీ పెద్దలు మాత్రం విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా డ్రగ్స్ కేసులో ఆమెకు జారీచేసిన నోటీసులు జేఎన్యూ సందర్శనకు కక్షసారింపేనని విశ్లేషిస్తున్నారు. మరోవైపు డ్రగ్స్ కేసులు ఇంకా పలువురు నటీమనులు ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. (విమర్శలు... వ్యంగ్యాస్త్రాలు) దీనిపై సీనియర్ నటీ నగ్మా తాజాగా ట్విటర్ వేదికగా స్పందించింది. డ్రగ్స్ కేసులో చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయని, కంగనా రనౌత్కు ఎందుకు నోటీసులు పంపడంలేదని ప్రశ్నించారు. తాను డ్రగ్స్కు బానిసగా మారాను అంటూ ఓ టీవీషోలో తానే స్వయంగా ప్రకటించిందని అలాంటప్పుడు కంగనాను ఎందుకు అరెస్ట్ చేయరని నగ్మా నిలదీసింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన నటీనటులను కేసుల్లో ఇరికించి ప్రతీకారం తీర్చుకుంటున్నారని.. అదే అనుకూలంగా మాట్లాడినప్పుడు తప్పు చేసినా సరే, వారికి ఎలాంటి శిక్ష ఉండబోదని ప్రభుత్వమే స్వయంగా చెప్తున్నట్లు ఉందని వ్యంగ్యంగా విమర్శనాస్గ్రాలు సందించింది. ఇక తాజా వివాదంపై ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ సైతం స్పందించారు. ‘ఈ నెల 25 శుక్రవారం దీపికని విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ ఆదేశించింది. ఓవైపు భారత్ బంద్కు రైతులు పిలుపునివ్వగా దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని కేంద్రం భావిస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు. So @deepikapadukone summoned on September 25 by @narcoticsbureau . Farmers all India protest on Sept 25. Samajh mein aaya?🙏 — Rajdeep Sardesai (@sardesairajdeep) September 23, 2020 -
టాలీవుడ్ను షేక చేస్తోన్న బాలీవుడ్ డ్రగ్స్ కేసు
-
మలుపులు తియుగుతున్న సుశాంత్ మృతి కేసు
-
డ్రగ్స్తో బాలీవుడ్ డ్యాన్సర్ పట్టివేత
యశవంతపుర: మత్తు పదార్థాలను తరలిస్తున్న బాలీవుడ్కు చెందిన నటుడు కిశోర్ శెట్టిని మంగళూరులో సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలీవుడ్లో ఎబీసీడీ అనే సినిమాలో నటించిన కిశోక్శెట్టి ఒక డ్యాన్సర్. బాలీవుడ్లో సంచలనం రేకెత్తించిన సుశాంత్సింగ్ రాజ్పుత్ మృతి, డ్రగ్స్ లింక్పై ముమ్మర దర్యాప్తు నేపథ్యంలో కిశోర్శెట్టి పోలసులకు చిక్కాడు. కిశోర్ మిత్రుడు ప్రతీక్శెట్టిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి రాగిణి ద్వివేది బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదాపడింది. -
సుశాంత్ ఫామ్హౌస్లో తరచూ పార్టీలు
ముంబై: సారా అలీ ఖాన్, రియా చక్రవర్తి తరచుగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఫామ్హౌస్ లోనావాలాకు వస్తుండేవారని, ఫామ్హౌస్ మేనేజర్ రీస్ ఒక న్యూస్ ఏజెన్సీ జరిపిన ఇన్వెస్టిగేషన్లో తెలిపారు. రియా చక్రవర్తి, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ వంటి బాలీవుడ్ మిత్రులు సుశాంత్తో కలిసి ఫామ్హౌస్లోనే పార్టీలు చేసుకునేవారని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకు సుశాంత్ వద్ద పనిచేసే జగదీష్ అనే వ్యక్తి తెలిపారు. డ్రగ్-పెడ్లింగ్ కేసులో నిందితుడిగా ఉన్న జైద్ విలాత్రా తదితరులు పార్టీ చేసుకున్న వారిలో ఉన్నారని వెల్లడించారు. సుశాంత్ పార్టీలలో గంజా, మద్యం సర్వసాధారణమని ఫామ్హౌస్ మేనేజర్ రీస్ వ్యాఖ్యానించారు. దీంతో లోనవాలా ఫామ్హౌస్ డ్రగ్ కేసుకు సంబంధించి ప్రధాన అంశంగా మారింది. ఎన్సీబీ ప్రస్తుతం దీనిపై దృష్టి సారించింది. సెప్టెంబర్ 2018 నుంచి సుశాంత్ ఫామ్హౌస్లో రీస్ మేనేజర్గా పని చేస్తున్నారు. సారా ఆలీఖాన్, రియా చక్రవర్తి తరచూ ఆ ఫామ్ హౌస్ను సందర్శిస్తూ ఉండేవారని ఆయన తెలిపారు. పార్టీల కోసం వారు స్మోక్ పేపర్లను కూడా ఆర్డర్ చేసేవారని, అయితే వాటిని ఎందుకు ఉపయోగించేవారో తనకు తెలియదని రీస్ పేర్కొన్నారు. లాక్డౌన్కు ముందు వారానికి ఒకటి, రెండుసార్లు రాజ్పుత్ ఈ ఫామ్హౌస్కు వచ్చేవారని రీస్ తెలిపారు. అతనితో పాటు ఎవరు ఉంటారు అని రిపోర్టర్ ప్రశ్నించగా, మొదట్లో సారా అలీఖాన్ వచ్చేవారు. అప్పుడు రియా కూడా వారితో కలిసి వచ్చేది అని చెప్పారు. గత ఏడాది జూలైలో రియా తన పుట్టిన రోజు వేడుకలను తల్లిదండ్రులు, తన సోదరుడు షోవిక్తో కలిసి ఆ ఫామ్ హౌస్లో జరుపుకుంది అని రీస్ తెలిపారు. పార్టీలలో స్మోక్ పేపర్ వాడేవారని, ఖరీదైన వోడ్కాను అందించేవారని వెల్లడించారు. లాక్డౌన్లో ఫామ్హౌస్లో గడపాలని సుశాంత్ కోరుకున్నారని అయితే ఏవో కారణాల వల్ల ఆయన రాలేకపోయాని తెలిపారు. చదవండి: జయా బచ్చన్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు -
జయా బచ్చన్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
-
జయా బచ్చన్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్లో మొదలైన విమర్శల ప్రకంపనలు తాజాగా పార్లమెంట్ను తాకాయి. సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్పై ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ విమర్శలు ఎక్కుపెట్టారు. రాజ్యసభలో జయా మంగళవారం చేసిన ప్రసంగంపై అభ్యంతరం చెబుతూ.. మీ కుమారుడు అభిషేక్ బచ్చక్ కూడా సుశాంత్లా ఆత్మహత్యకు పాల్పడితే ఇలానే మాట్లాడుతారా అంటూ నిలదీశారు. ఈ మేరకు కంగనా ఓ ట్వీట్ చేశారు. ’రాజ్యసభలో జయాబచ్చన్ మాట్లాడిన తీరు సరైనది కాదు. నాకు మాదిరిగా మీ కుమార్తె స్వేతా బచ్చన్ కుడా టీనేజ్లో వేధింపులు గురైతే ఇలానే స్పందిస్తారా. కొందరు వ్యక్తుల మూలంగా మానసిక ఒత్తిడి గురై సుశాంత్ సింగ్ రాజ్పుత్లా మీ కుమారుడు అభిషేక్ కూడా ఆత్మహత్యకు పాల్పడితే ఇలానే మాట్లాడుతారా. మాపైన కాస్త జాలి చూపండి’ అని మండిపడ్డారు. (కొడుకు కోసమే కక్షసాధింపు) కాగా చిత్రపరిశ్రమపై ఎంపీలు రవికిషన్ మాట్లాడిన తీరుపై జయా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో ఉంటూ డ్రగ్స్ మాఫీయా అంటూ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా జయా బచ్చన్ రాజ్యసభలో ప్రసంగిస్తూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై కౌంటర్గా కంగనా ట్వీట్ చేశారు. రాజ్యసభలో జీవో అవర్ సందర్భంగా బాలీవుడ్ డ్రగ్స్ కేసు అంశాన్ని లేవనెత్తారు సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్. డ్రగ్స్ పేరుతో సినిమా ఇండస్ట్రీకి చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా సినీ నటులను వేధిస్తున్నారని... సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారు కూడా బాలీవుడ్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. (రవి కిషన్ వ్యాఖ్యలు సిగ్గు చేటు) -
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్
-
ఏ తండ్రీ భరించలేడు.. నేను చచ్చిపోవాలి
ముంబై : సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతికి సంబంధించి మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి బెయిల్ పిటీషన్ను తిరష్కరించటంపై ఆమె తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన వరుస ట్వీట్లతో స్పందిస్తూ.. ‘‘ కూతురి విషయంలో ఇలాంటి తీర్పును ఏ తండ్రీ భరించలేడు. నేను చచ్చిపోవాలి... రియా చక్రవర్తి బెయిల్ రిజెక్ట్ అయ్యింది. ఇక గురువారం సెషన్ కోర్టులో తదుపరి విచారణ... ఇక్కడో జీర్ణించుకోలేని నిజం ఏంటంటే. సుశాంత్ బ్రతికున్నట్లయితే డ్రగ్స్ కేసులో అతడే ప్రధాన ముద్దాయి. ( రియా చక్రవర్తి అరెస్ట్ ) అందరూ అతడికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ‘ప్రచారం’ చేసిన పని కూడా ఇదే. ఓ గొప్ప నటుడి జీవితం డ్రగ్స్ వినియోగంతో ముడిపడి ఉంది’’ అని పేర్కొన్నారు. బుధవారం మరో ట్వీట్లో ‘‘ ఏలాంటి ఆధారాలు లేకుండా దేశం మొత్తం రియాను జైలుకు పంపటానికి పూనుకుందని’’ ఆవేదన వ్యక్తం చేశారు. ( సస్పెన్స్ థ్రిల్లర్కు ఏమాత్రం తీసిపోని కేసు ) -
రియా రియల్ స్టోరీ
-
రియాపై 10 గంటలు ప్రశ్నల వర్షం
ముంబై: బాలీవుట్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు ప్రేరేపించిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి శుక్రవారం తొలిసారిగా సీబీఐ ముందు హాజరైంది. సీబీఐ ఆమెను 10 గంటలపాటు విచారించింది. సుశాంత్ను ప్రియురాలు రియా మానసికంగా వేధించారని, అతని అకౌంట్ల నుంచి డబ్బు తీసుకున్నారని రాజ్పుత్ కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఏడాది జూన్ 14వ తేదీన సుశాంత్ బాంద్రాలోని తన ఫ్లాట్లో ఉరికి వేలాడుతూ కనిపించిన విషయం తెలిసిందే. గురువారం రియా సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా ప్రశ్నించిన సీబీఐ... ఇద్దరి వాంగ్మూలాల్లో తేడాలను పరిశీలించనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రియాను సీబీఐ అడిగిన ప్రశ్నలిలా ఉన్నాయి. ► సుశాంత్ మరణం గురించి మీకెవరు చెప్పారు. అప్పుడు మీరెక్కడ ఉన్నారు. ► మరణవార్త తెలిసిన వెంటనే బాంద్రా ఫ్లాట్కు వెళ్లారా? లేకపోతే... ఎందుకు వెళ్లలేదు? ఎప్పుడు, ఎక్కడ సుశాంత్ మృతదేహాన్ని సందర్శించారు. ► అంతకుముందు వరకు కలిసి నివసించిన మీరు జూన్ 8వ తేదీన సుశాంత్ ఫ్లాట్ను వదిలి ఎందుకు వెళ్లారు? ► మీరు అలా వెళ్లిపోవడానికి ఏదైనా గొడవ కారణమా? ► వెళ్లిపోయిన తర్వాత జూన్ 9 – 14 మధ్యలో సుశాంత్తో మాట్లాడారా? ఏ విషయంపై మాట్లాడారు. ఒకవేళ మాట్లాడకపోతే ఎందుకు అతనితో కాంటాక్ట్లో లేరు? ► మరోవైపు సుశాంత్ ఈ రోజుల్లో మీకేమైనా కాల్స్, మెసేజ్లు చేశాడా? మీరు వాటిని పట్టించుకోలేదా? కాల్స్కు బదులివ్వకపోతే... ఎందుకలా చేశారు? ► సుశాంత్ ఆరోగ్య సమస్యలేమిటి? ఏ డాక్టర్లు, మానసిక నిపుణుల వద్ద చికిత్స తీసుకున్నాడు? ఏయే మందులు వాడుతుండేవాడు? -
సుశాంత్ జీవితంతో శశాంక్
నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణ వార్త బాలీవుడ్ను కుదిపేసింది. ఊహించని షాక్లా అనిపించింది. ఎన్నో వివాదాలకు, చర్చలకు దారి తీసింది. సుశాంత్ జీవితం మీద ఆల్రెడీ ఓ సినిమా (సూసైడ్ ఆర్ మర్డర్?) ప్రకటించింది బాలీవుడ్. తాజాగా మరో సినిమా కూడా తెరకెక్కనుంది. సనోజ్ మిశ్రా దర్శకత్వంలో ‘శశాంక్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఓ యంగ్ సినిమా స్టార్ అనుకోకుండా హత్యకు గురికావడం, సినిమా ఇండస్ట్రీలో ఉన్న బంధుప్రీతి వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో ఆర్య బబ్బర్, రాజ్వీర్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. పాట్నా, లక్నో, ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ జరపనున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్స్ను విడుదల చేశారు. -
సీబీఐకి సుశాంత్ సింగ్ మృతి కేసు
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు విచారణను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. సేకరించిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను సుప్రీంకోర్టు సూచించింది. దీంతో పాటు సీబీఐ విచారణకు సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అలాగే సుశాంత్ సన్నిహితురాలు రియా పాత్రపైనా ఆరోపణలు వెల్లువెత్తిన విషయం విదితమే. దీంతో రియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం న్యాయబద్దమైనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో సింగిల్ బెంచ్ జస్టిస్ హృషికేశ్ రాయ్ ఇచ్చిన తీర్పును సుశాంత్ కుటుంబసభ్యులు స్వాగతించారు. సుశాంత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సీబీఐ దర్యాప్తు చేయనుంది. కాగా జూన్ 14లో సుశాంత్ తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మొదటి నుంచి అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసు బాలీవుడ్లోనే కాకుండా రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం తెలపగా.. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. (‘సుశాంత్ కేసు సాక్ష్యులకు భద్రత కల్పించాలి’) సుశాంత్ మృతి కేసుపై సీబీఐ విచారణకు బిహార్ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కేంద్రం అంగీకరించింది. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు బిహార్ సీఎం సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. అయితే, ఈ కేసులో తనపై పట్నాలో దాఖలైన కేసు విచారణను ముంబయికి బదిలీ చేయాలని కోరుతూ సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆగస్టు 11 నాటి విచారణ సందర్భంగా.. రియా తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ... నిజం కంటే రాజకీయ జోక్యం ఎక్కువగా మారిందని స్పష్టమవుతోందన్నారు. అసంబద్ధమైన వాదనలతో బీహార్లో ఎన్నికల సందర్భంగా రాజకీయంగా ఈ కేసును వాడుకుంటున్నారని రియా చక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు. (రూ.4.5 కోట్ల ప్లాటు.. రియా కోసం కాదు) సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడలేదని, హత్యకు గురయ్యారంటూ పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఆరోపిస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న నెల రోజుల తర్వాత ఆయన తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు చేశారు. రియా చక్రవర్తి, ఆమె కుటుంబం తన కుమారుడ్ని మోసం చేసిందని, ఆర్ధికంగా, మానసికంగా వేధించారని ఆయన ఆరోపించారు. కేసుకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి ఒక్కక్కరూ బయటకు వస్తున్నారని, వారికి భద్రత కల్పించాలని సుశాంత్ సింగ్ బంధువు, బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ కుమార్ సింగ్ బబ్లు వ్యాఖ్యానించారు. ఈ కేసులో నిజాలు బయటపెట్టేందుకు చాలామంది సాక్ష్యులు ఉన్నారని, వారు ప్రాణ భయంతో బయటకు రావడం లేదన్నారు. కాబట్టి ఇప్పటికే ముందుకు వచ్చిన సాక్ష్యులకు భద్రత కల్పించాలన్నారు. రీల్ లైఫ్లో లాగానే... సుశాంత్ మృతి రియల్ లైఫ్లోనూ అనేక మలుపులు తిరుగుతూ చివరకూ సుప్రీంకోర్టుకు చేరింది. (అప్పుడే అందరికీ ప్రశాంతత: సుశాంత్ సోదరి) -
అలియాకు షాక్.. డిస్లైక్ల వరద
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య భారతీయ చిత్రసీమను ఒక కుదుపు కుదిపేసింది. ఎంతో టాలెంట్.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ నటుడు అకాల మరణం చెందడం అభిమానులు నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. బాలీవుడ్లో ఉన్న నెపోటిజం(బంధుప్రీతి) వల్లే సుశాంత్ చనిపోయాడని బలంగా విశ్వసిస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య వెనక కారణాలు వెలికి తీయాలని ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దాంతో కేంద్ర ప్రభుత్వం సుశాంత్ మరణంపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కరణ్ జోహార్, అలియా భట్, ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు మహేష్ భట్ వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నడాని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ప్రభావం మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన ‘సడక్ 2’పై పడింది. సంజయ్ దత్, ఆలియా భట్ ముఖ్యపాత్రల్లో నటించిన ‘సడక్ 2’ ట్రైలర్ కాసేపటి క్రితమే విడులైంది. అయితే ఈ ట్రైలర్కు రికార్డు స్థాయిలో డిస్లైక్ల వరద కొనసాగుతోంది. ఇప్పటివరకు 2.5 మిలియన్ల మంది దీన్ని డిస్లైక్ చేశారు. (ఆకట్టుకుంటున్న సడక్ 2 ట్రైలర్) ఈ ట్రైలర్ థ్రిల్లర్ కథాంశంతో ఆకట్టుకునేలా మహేష్ భట్ తీర్చిదిద్దినా.. సుశాంత్ ఆత్మహత్యకు మహేష్ భట్ ఫ్యామిలీనే పరోక్ష కారణం అంటూ .. చాలా మంది సుశాంత్ అభిమానులు.. ఈ ట్రైలర్ను డిస్లైక్ చేస్తున్నారు. ఇప్పటివరకు 88వేల మంది ట్రైలర్ను లైక్ చేస్తే.. 2.5మిలయన్ల మంది డిస్లైక్ చేశారు. దీన్ని బట్టి ఈ సినిమాపై ఎంత నెగిటివిటి ఉందో అర్ధమవుతోంది. అంతేకాదు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడొద్దని.. అసలు ఆ సినిమా ప్రసారం అయ్యే హాట్స్టార్ యాప్ను అన్ ఇన్స్టాల్ చేయాలనీ సుశాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు. #UninstallHotstar అనే హ్యాష్ ట్యాగ్ పేరుతో ట్రెండింగ్ చేస్తున్నారు. 1991లో వచ్చిన సడక్కు సీక్వెల్గా సడక్2 తెరకెక్కింది. దీనిలో సంజయ్ దత్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.(ఓటీటీలో సడక్ 2) సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో నెపోటిజంపై భారీ చర్చ జరుగుతున్నది. బాలీవుడ్లో హీరోల పిల్లలకు లేదా నిర్మాతల పిల్లలకు మాత్రమే ప్రోత్సాహం అందిస్తున్నారని.. బయట నుంచి వచ్చే వాళ్లను ఎదగనివ్వకుండా, ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు అభిమానులు. ఈ కారణంగానే.. ఆ ఒత్తిడి భరించలేక సుశాంత్ లాంటి వాళ్లు ఎందరో బలైపోతున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సడక్ 2’ వంటి ట్రైలర్కు డిస్ లైక్ల వరద కొనసాగుతోంది. ఇక డిస్నీ హాట్ స్టార్లో సడక్ 2 ఈ నెల 28న విడుదల కానుంది. ఇక దాని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు. -
‘నా కొడుకు ఉరి వేసుకోడాన్ని ఎవరూ చూడలేదు’
ముంబై : సుశాంత్ సింగ్ రాజ్పుత్ సోదరి మీతూ సింగ్ మంగళవారం ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. సుశాంత్ మరణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. కాగా ఈడీ కార్యాలయానికి చేరుకున్న సుశాంత్ కుటుంబ సభ్యుల్లో ఈమె మొదటి వ్యక్తి. మీతూ సింగ్ను ఇప్పటికే ముంబై పోలీసులు అయిదు సార్లు విచారణకు పిలవగా..ఈమె ఇప్పటి వరకు తన వాంగ్మాలాన్ని నమోదు చేసేందుకు హాజరు కాలేదు. మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితురాలైన సుశాంత్ గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తికి, తన సోదరుడికి సంబంధించిన ఆర్థిక లావాదేవాలపై కొన్ని కీలక విషయాలు తెలుసుకునేందుకు ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించేందుకు పిలిచినట్లు ఈడీ వర్గాల నుంచి సమాచారం. (‘సుశాంత్ మరణించే ముందు రోజు మాట్లాడినా’) కాగా జూన్ 14న సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ముందుగా అతని ఇంటికి చేరుకున్న కొద్ది మందిలో మీతూ సింగ్ కూడా ఉన్నారు. మీతూ సింగ్తో పాటు, సుశాంత్ మాజీ మేనేజర్, రియా చక్రవర్తి ప్రస్తుత మేనేజర్ శ్రుతి మోదీ, సుశాంత్ స్నేహితుడు, రూమ్మేట్ సిద్దార్థ్ పిథానీని కూడా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక రియా ఆస్తులు, ఆదాయం, ఖర్చులు, వ్యాపార పెట్టుబడులపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ముంబైలోని ఆమె ఆస్తుల వివరాలు, సుశాంత్తోపాటు ఏర్పాటు చేసిన కంపెనీల వ్యవహారాల వివరాలు సూతం ఈడీ పరిశీలిస్తోంది. (అన్ని విషయాల్లో రియాదే నిర్ణయం) మరోవైసు సుశాంత్ తండ్రి కేకే సింగ్ మంగళవారం విచారణ నిమిత్తం సుప్రీంకోర్టులో హాజరయ్యారు. జస్టిస్ హృషికేస్తో కూడిన ధర్మాసనం ముందు కేకే సింగ్ మాట్లాడుతూ.. తన కొడుకును కోల్పోవడంతో తన చితికి మంట పెట్టేందుకు కూడా ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తన కొడుకు ఉరి వేసుకోవడాన్ని ఎవరూ చూడలేదని, తన కుమార్తె చేరుకోగానే సుశాంత్ మంచం మీద పడుకున్నాడని తెలిపారు. దీనిపై ఖచ్చితంగా దర్యాప్తు జరపాలని కోరాడు. (ట్విన్స్ రాకతో సంతోషం: అంకిత) కేకే సింగ్ తరపు న్యాయవాది వికాస్ సింగ్ మాట్లాడుతూ.. రియా సుశాంత్కు తన తండ్రి, సోదరిని దూరం చేసిందని ఆరోపించారు. అంతేగాక సుశాంత్ మరణించిన సమయంలో అతని మెడపై ఉంది తాడు గుర్తులు కావని బెల్ట్ గుర్తులు అని పేర్కొన్నారు. సుశాంత్ను హత్య చేశారని ఆరోపిస్తూ ఈ కేసుపై దర్యాప్తు చేయాలిన అవసరం ఉందని కోర్టులో పేర్కొన్నారు. కాగా పాట్నాలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను ముంబైకి బదిలీ చేయాలని కోరుతూ రియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణ కేసు తీర్పును సుప్రీంకోర్టు రిజర్వు చేసింది. రియా అభ్యర్ధనను ఆగష్టు 13న విచారించనుంది. (‘సుశాంత్ సోదరి నన్ను వేధించారు’) -
‘సుశాంత్ మరణించే ముందు రోజు మాట్లాడినా’
ముంబై : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించే ఒక్క రోజు ముందు తనతో ఫోన్ కాల్లో మాట్లాడినట్లు నిర్మాత రమేష్ తౌరాని తెలిపారు. ఓ సినిమా గురించి చర్చించేందుకు మరో నిర్మాత నిఖిల్ అద్వానితో కలిసి జూన్ 13న మధ్యాహ్నం 2.15 నిమిషాలకు సుశాంత్తో కన్ఫరెన్స్ కాల్లో సంభాషించినట్లు మంగళవారం ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు. రేస్, అజాబ్ ప్రేమ్ కి గజాబ్ కహానీ వంటి చిత్రాలకు రమేష్ తరౌరీ నిర్మాతగా వ్యవహరించారు. కాగా సుశాంత్ జూన్ 14న ముంబైలోని తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. (సుశాంత్ అన్ని విషయాల్లో రియాదే నిర్ణయం) ‘జూన్ 13న మధ్యాహ్నం నేను నిఖిల్ కలిసి సుశాంత్కు ఒక స్టోరీ గురించి వివరించాము. సుశాంత్తో పాటు అతని మేనేజర్ ఉదయ్ కూడా మాతో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడాడు. అయితే వృతిపరంగా చేసిన కాల్ ద్వారా సుశాంత్ భావాలను అర్థం చేసుకోవలేకపోయాను’ అని నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. తమ మధ్య సంభాషణ సుమారు 15 నిమిషాలు కొనసాగిందని తౌరాని పేర్కొన్నారు. అయితే కేవలం సినిమా చర్చల గురించే సంభాషించినట్లు ఆయన స్పష్టం చేశారు. సుశాంత్ మరణంపై వాస్తవాలు వెలువడే దాకా అందరూ ఓపికతో ఉండాలని, అంతేగాని ఇండస్ట్రీ గురించి తప్పుగా ప్రచారం చేయోద్దని విజ్ఞప్తి చేశారు. (ఈడీ ముందుకు రియా: అరెస్ట్ చేస్తారా?) View this post on Instagram I have been getting numerous calls from various journalists over the past few days and want to set the record straight about a few facts. 1. A journalist from @timesnow called me asking about a call on 13th June at about 2.15pm that I had with Sushant. I confirmed the same but did not want to comment on anything else. He recorded the call without informing me and therefore it is essential that I talk about what happened. After exchanging pleasantries, Nikhil Advani and I had narrated a story idea to Sushant. And yes we were on a conference call with him and his manager Uday. 2. This journalist also asked me how he sounded on the phone and I’m not aware as to how you can deduce anything about a persons feeling over a professional phone call. Our call was brief for approximately 15 minutes and he liked the idea and we were in preliminary talks. That’s about it. 3. Instead of encouraging wrongful theories about the industry and about his associations, I am requesting everyone to have faith in the system and let the authorities do the needful. And I request everyone to stop calling as we need to refrain from commenting any further on this unbelievable and tragic loss. I sincerely hope he’s resting in peace. Thank you. A post shared by Ramesh Taurani (@rameshtaurani) on Aug 10, 2020 at 9:29pm PDT -
బాంద్రా డీసీపీ- రియా ఫోన్ కాల్స్
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తి కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాల్ లిస్ట్కు సంబంధించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. బాంద్రా డీజీపీ అభిషేక్ త్రిముఖితో రియా పలుమార్లు మాట్లాడినట్లు తెలుస్తోంది. రియాకు అభిషేక్ రెండు సార్లు కాల్ చేసినట్లు, రియా అభిషేక్కు రెండు పర్యాయాలు కాల్ చేసినట్లు ఉంది. కాల్స్తో పాటు ఒక మెసేజ్ కూడా చేశారు. దీనిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముంబై పోలీసులు మాత్రం రియాను మొదట కేసుకు సంబంధించి విచారించగా తాను షాక్లో ఉన్నానని ఇప్పుడు ఏం చెప్పలేనని అన్నట్టు తెలిపారు. మరో సారి కేసుకు సంబంధించి మెసేజ్ చేసినప్పుడు రియా స్పందించలేదని తెలిపారు. ఇక రియాతో పాటు సుశాంత్ ఆత్మహత్య విషయంలో నిందుతులుగా ఉన్న అందరితోనూ అభిషేక్ టచ్లో ఉన్నారని ముంబై పోలీసులు తెలిపారు. (దిశ మరణించిన రాత్రి ఏం జరిగింది?) ఇదిలా వుండగా బిహార్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు ప్రభుత్వం కేసును సీబీఐకు అప్పగించిన సంగతి తెలిసిందే. రియా చక్రవర్తి మీద కేసు నమోదు చేసిన సీబీఐ ఆమెను విచారిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె కాల్ డేటాపై విచారణ మొదలు పెట్టారు. వీటిలో ఎక్కువ సార్లు రియా తన తమ్ముడుకి కాల్ చేసింది. తరువాత తన తండ్రితో ఎక్కువసార్లు మాట్లాడినట్టు తేలింది. చదవండి: రియా వచ్చిన కారు ఎవరిదో తెలుసా! -
సుశాంత్ కేసు: అసలు ఎవరీ శ్రుతి మోదీ
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఇప్పటికే సుశాంత్ కేసులో బిహార్ ప్రభుత్వం, కేంద్రం. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించామని సుప్రీంకోర్టుకు తెలపడంతో సర్వోన్నత న్యాయస్థానం సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. దీంతో ఈ కేసులోని మిస్టరీని ఛేదించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో సుశాంత్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరుగురిని నిందితులుగా చేర్చుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రియా చక్రవర్తిని ఏ1 నిందితురాలుగా ప్రకటించింది. ఆమెతో పాటు ఈ కేసులో ఏ2గా రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, ఏ3గా తల్లి సంధ్య చక్రవర్తి, ఏ4గా సోదరుడు షోవిక్ చక్రవర్తి, ఏ5గా సుశాంత్ ఇంటి మేనేజరు శామ్యూల్ మిరిండా, ఏ6గా సుశాంత్ బిజినెస్ మాజీ మేనేజరు శ్రుతి మోదీతో పాటు పలువురును ఈ కేసులో నిందితులుగా చేర్చింది. (సీబీఐ దర్యాప్తు: రియా స్పందన) కాగా ఈ కేసును సుశాంత్ కుటుంబం బీహార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయగా, తాజాగా ఈ రోజు(శుక్రవారం) తమ ఎదుట హాజరు అవ్వాలని సుషాంత్ మాజీ మేనేజర్ శ్రుతికి ఈడీ సమన్లు జారీ చేసింది. అలాగే రేపటిలోగా సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పిథాని కూడా హాజరు కావాలని ఈడీ పేర్కొంది. ఇదిలా ఉండగా ఎఫ్ఐఆర్లో కొత్తగా శ్రుతి మోదీ పేరు వినిపించడంతో అసలు ఈ శ్రుతి ఎవరే ప్రశ్న ప్రతి ఒక్కరి ఆలోచనల్లో మెదులుతోంది. (సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ ప్రారంభం) సుశాంత్, రియా ఇద్దరికి బాగా తెలిసిన వ్యక్తి. శ్రుతి మోదీ.. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తికి మాజీ మేనేజర్ అని తెలుస్తోంది. అలాగే ఈమె సుశాంత్ మాజీ బిజినెస్ మేనేజర్ అని వెల్లడైంది. సుశాంత్ మరణంపై దర్యాప్తులో భాగంగా ముంబై పోలీసులు శ్రుతి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. శుత్రి ముంబై పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం.. ఆమె జూలై 2019 నుంచి 2020 ఫిబ్రవరి వరకు సుశాంత్తో కలిసి పనిచేసినట్లు తెలిపింది. సుశాంత్ ఆర్థికంగా ఉన్నవాడని, బాంద్రాలోని తన ఇంటి అద్దె సుమారు రూ. 4.5 లక్షలతోపాటు నెలకు దాదాపు 10 లక్షలు ఖర్చు చేసేవారని శ్రుతి ముంబై పోలీసులకు తెలిపింది. (ఈడీ దర్యాప్తు: షాకిస్తున్న రియా ఆస్తుల లిస్ట్) -
‘అప్పుడే ముంబై పోలీసులను అప్రమత్తం చేశా’
ముంబై : తన కొడుకు ప్రమాదంలో ఉన్నాడని ఫిబ్రవరిలోనే ముంబై పోలీసులను సంప్రదించినట్లు దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ తండ్రి కేకే సింగ్ పేర్కొన్నారు. తన కుమారుడి ప్రాణానికి ప్రమాదం ఉందని ఫిబ్రవరి 25న ముంబై పోలీసులను అప్రమత్తం చేసినట్లు వీడియో స్టేట్మెంట్ విడుదల చేశారు. ఈ వీడియోలో అతను మాట్లాడుతూ. ‘ఫిబ్రవరి 25 న బాంద్రా పోలీసులకు సుశాంత్ ప్రమాదంలో ఉన్నాడని తెలియ జేశాను. ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులపై చర్య తీసుకోమని నేను వారిని కోరాను. సుశాంత్ జూన్ 14న మరణించాడు. తను మరణించిన 40 రోజుల తరువాత కూడా ముంబై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే నేను పట్నాలో ఎఫ్ఐఆర్ దాఖలు చేశాను. వాళ్లు వెంటనే స్పందించారు’. అని పేర్కొన్నారు. దీంతో ఈ కేసు విచారణలో బిహార్, మహారాష్ట్ర పోలీసుల మధ్య వివాదం నడుస్తోంది. (సూసైడ్ ముందు సుశాంత్ ఏం సెర్చ్ చేశాడంటే..) #WATCH: #SushantSinghRajput's father in a self-made video says, "On Feb 25, I informed Bandra Police that he's in danger. He died on June 14 & I asked them to act against people named in my Feb 25 complaint. No action taken even 40 days after his death. So I filed FIR in Patna." pic.twitter.com/tnn9XN1XlB — ANI (@ANI) August 3, 2020 అంతేగాక సుశాంత్ ఆత్మహత్య కేసులో వాస్తవాలను వెలికి తీయడంలో పట్నా పోలీసులు సాయం చేయాలని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను కూడా విజ్ఞప్తి చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కేకే సింగ్ తన ఫిర్యాదులో.. సుశాంత్ ముంబై బ్యాంక్ ఖాతా నుంచి రూ .15 కోట్లను అక్రమంగా స్నేహితురాలు రియా చక్రవర్తికి బదిలీ చేసినట్లు, తనను మానసికంగా వేధించినట్లు ఆరోపించారు. కాగా చనిపోవడానికి ముందు సుశాంత్ .. మరణం గురించి ఇంటర్నెట్లో వెతికినట్లు ముంబై పోలీసులు తెలిపారు. కాగా జూన్ 14న సుశాంత్ ముంబైలోని బాంద్రా నివాసంలో ఉరికి వైలాడుతూ కనిపించిన సంగతి తెలిసిందే. మరోవైపు సోమవారం ముంబై పోలీస్ చీఫ్ పరంవీర్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. సుశాంత్ అకౌంట్ నుంచి రియా చక్రవర్తికి చట్ట విరుద్ధంగా డబ్బును బదిలీ చేశారనే వాదనలకు ఆధారాలు లేవన్నారు. (రక్షాబంధన్ : సుశాంత్ సోదరి భావోద్వేగం) -
సుశాంత్, అలియా మధ్య పోటీ, గెలిచేదెవరు?
మరోసారి కంగనా టీం అలియాభట్ను టార్గెట్ చేసింది. అలియాభట్ ఇన్స్టాగ్రామ్లో తన చిన్నప్పటి ఫోటోలను షేర్ చేసింది. అయితే దీనికి ఆమె ఫ్యాన్స్తో పాటు దీపికా పదుకొనే, హృతిక్ రోషన్, జోయా అక్తర్, మనీష్ మల్హోత్రా లాంటి వాళ్లు లైక్ కొట్టారు. ఆమె ఫ్యాన్స్ ఎంత క్యూట్గా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీటిపై స్పందించిన కంగనా రనౌత్... సుశాంత్ మరణించడంతో దేశం మొత్తం దు:ఖంలో మునిగిపోయి ఉంటే బాలీవుడ్ స్టార్లు మాత్రం అలియా క్యూట్నెస్ను పొగడటంలో బిజీగా ఉన్నారు అని ట్విట్ చేశారు. ఇలా చేయడం వలన ఆమె క్రిమినల్ పాదర్ చేసినవి, బయట వారి పట్ల ఆమె ఉండేతీరును తుడిచేయగలరా అని ప్రశ్నించింది. View this post on Instagram spread some love 🤍 A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on Jul 27, 2020 at 8:53am PDT కంగనా టీం సుశాంత్ రాజ్పుత్ చిన్నప్పటి ఫోటోలను షేర్ చేసి ఇప్పుడు ఎవరికి ఎక్కువ లైక్లు వస్తాయో చూద్దాం. 10వ తరగతి ఫెయిల్ అయిన మొద్దుకా లేదా ఫిజిక్ ఒలంపియాడ్ విన్నర్కా అని పోస్ట్ చేసింది. సుశాంత్వాళ్ల అక్క అతని చిన్నప్పటి ఫోటోలను షేర్ చేసినప్పుడు బాలీవుడ్ స్టార్లు ఎవరు లైక్ కొట్టలేదు. ఇప్పుడు సుశాంత్ ఫ్యాన్స్ అందరూ అలియాను, లైక్ కొట్టిన సెలబ్రెటీలను మరోసారి టార్గెట్ చేస్తున్నారు. సుశాంత్ బతికున్నప్పుడు ఏవిధంగా అయితే అతనిని చిన్న చూపు చూశారో అదే విధంగా ఇప్పుడు కూడా చూస్తున్నారు అని కామెంట్స్ పెడుతున్నారు. దీపిక పై కూడా సుశాంత్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. Filmi media is circulating dumb alia’s kid pictures & all A listers are hailing her cuteness, is this a way of white washing her criminal father and her own insensitive approach to outsiders ?https://t.co/jDplZACBeN — Team Kangana Ranaut (@KanganaTeam) July 28, 2020 చదవండి: నేను ఉరేసుకుని కనిపిస్తే: హీరోయిన్ -
సుశాంత్ సింగ్ కేసులో మరో ట్విస్ట్
ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రియా చక్రవర్తి పాత్రపై దర్యాప్తు చేయాల్సిందిగా సుశాంత్ తండ్రి కేకే సింగ్ పట్నా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రియాకు వ్యతిరేకంగా తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వాలని సుశాంత్ కుటుంబసభ్యులు ఒత్తిడి చేస్తున్నారని అతడి స్నేహితుడు, క్రియేటివ్ కంటెంట్ మేనేజర్ సిద్ధార్థ్ పిథాని ఆరోపించాడు. (రియాతో బంధం తెంచుకోవాలనుకున్నాడు: అంకిత) ఈ విషయంపై బాంద్రా పోలీసులకు ఈ మెయిల్ చేసిన పిథాని మాట్లాడుతూ జూలై 22న సుశాంత్ సోదరి మీతు సింగ్, ఆమె భర్త, సీనియర్ ఐపీఎస్ అధికారి ఓపి సింగ్ నుంచి తనకు కాన్ఫరెన్స్ కాల్ వచ్చిందని తెలిపాడు. రియా, సుశాంత్ కలిసి ముంబైలోని మౌంట్ బ్లాంక్లో నివాసం ఉన్న సమయంలో ఆమె ఖర్చుల గురించి పలు ప్రశ్నలు అడిగారని, దీనికి సంబంధించి రియాకు వ్యతిరేకంగా పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు తెలిపాడు. వాస్తవానికి రియాకు సంబంధించిన విషయాలపై పెద్దగా తెలియదని చెప్పినా వాళ్లు తనను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నట్లు ఆరోపించాడు. జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో పలు సంచలన విషయాలు బయట పడుతున్నాయి. సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి 15 కోట్ల రూపాయలు రియా కాజేసిందంటూ సుశాంత్ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో రియా ముందస్తు బెయిల్ సంప్రదించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ కేసు విచారణను బిహార్ నుంచి ముంబై పోలీసులకు అప్పగించాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. (సుశాంత్ బ్యాంక్ ఖాతాలు పరిశీలిస్తున్న ఈడీ) -
బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు
-
పదహారేళ్ల సుశాంత్
అయ్యో పాపం.. ధైర్యంగా ఉండాల్సింది. పోరాడాలి కానీ ప్రాణాలు తీసుకుంటారా!ఇంత సున్నితమైతే ఎలా బతుకుతారబ్బా.ఎంత మరణానంతర సానుభూతి!! తట్టుకోలేకపోవడమే తప్పయిపోయిందా! మరి.. చావుకు కారణమౌతున్న వారిని ఏం చేద్దాం?వాళ్లకు కదా ముందు ఇవ్వాల్సింది కౌన్సెలింగ్?! నొప్పించొద్దని వాళ్లను కదా చెవి మెలిపెట్టాలి. ఇప్పుడు మరో ‘సుశాంత్’ చనిపోయాడు. ‘రెస్ట్ ఇన్ పీస్’ అని ఆకాంక్షించి ఏం లాభం? నికృష్టపు టీజింగ్ల కాష్టం.. కాలనిదే! ఇంట్లో ముగ్గురూ మగవాళ్లే. ఈ మాటనే ఇంకోలా చెప్పాలి. ఇంట్లో ఆడవాళ్లెవరూ లేరు. ఉహూ.. ఇలాక్కూడా కాదు. ఇల్లు వట్టిపోయింది! అవును. తల్లి లేని ఇల్లు. తల్లిలాంటి అక్క లేని ఇల్లు. తండ్రి, ఇద్దరు కొడుకులు.. ఈ ముగ్గురే మిగిలారు. తల్లి నాలుగేళ్ల క్రితం చనిపోయింది. అక్క పెళ్లయ్యాక మెట్టినింటికి వెళ్లిపోయింది. సోమవారం రాత్రి ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుకు లేకుండా పోయాడు. పదిహేనూ పదహారేళ్లవాడు. ఉరి వేసుకున్నాడు. తండ్రి కూరగాయల కోసం బజారుకెళ్లాడు. తమ్ముడు తన గదిలో చదువుకుంటున్నాడు. ఎయిత్ క్లాస్. పదమూడేళ్ల వాడు. ఆ పదమూడేళ్ల తమ్ముడికి, పదహారేళ్ల అన్నకు ఫ్రెండ్షిప్. అన్నీ షేర్ చేసుకుంటారు. ఉరి వేసుకునే ముందు రోజు అన్న తమ్ముడి ముందు సుశాంత్ మాట తెచ్చాడు. ‘‘సుశాంత్ అంతటివాడే ఆత్మహత్య చేసుకుంటే నేనెందుకు చేసుకోకూడదు’’ అన్నాడు. ఆ మాట తండ్రితో అని ఉంటే ఇంకోలా ఉండేది. తప్పకుండా ఇంకోలా ఉండేది. టెన్త్ తర్వాత కొడుకును ఏ కోర్సు చదివించాలన్న దానిపై చక్కటి ప్రణాళికలే వేస్తున్నాడు ఆ తండ్రి. కొడుకు బ్రిలియంట్. ఈ నెల 27న యూపీ టెన్త్ రిజల్ట్స్. మంచి ర్యాంకే వస్తుండేది. అయితే తండ్రికి అసలేమీ చెప్పకుండా, తమ్ముడికి మాత్రం చెప్పి వెళ్లిపోయాడు ఆ కుర్రాడు. తను చనిపోయాక తండ్రి చదువుకోడానికి మాత్రం చిన్న నోట్ పెట్టాడు. ‘‘నాన్నా నన్ను క్షమించు. నేనొక మంచి కొడుకును కాలేకపోయాను. నేను అమ్మాయిలా ఉంటానని, నా ముఖం ఆడపిల్లల ముఖంలా ఉంటుందని అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. తట్టుకోలేకపోతున్నాను నాన్నా. ‘కిన్నర్’ అని కూడా పిలుస్తున్నారు. నా జీవితం నీ జీవితాన్ని కూడా చీకటి చేసేయకూడదు. అందుకే చచ్చిపోతున్నాను. నన్ను దీవించు నాన్నా. మళ్లీ జన్మలో మనింట్లోనే ఆడపిల్లగా పుట్టాలని దీవించు’’.. అని సూసైడ్ నోట్లో రాశాడు. కన్నర్ అంటే ట్రాన్స్జెండర్. బంధువులు, వాళ్ల పిల్లలు అతడిని మరీ నేరుగా కిన్నర్ అని పిలవలేదు కానీ, కిన్నర్ని చూసినట్లే చూశారు. అలా అంటున్న విషయం, అలా చూస్తున్న విషయం తండ్రికి చెప్పలేదు. తల్లి ఉన్నా, అక్క ఉన్నా చెప్పుకునేవాడేమో. కొడుకు సూసైడ్ నోట్ చూడగానే తండ్రి చెట్టులా కూలిపోయాడు. ఉత్తరాఖండ్లోని చంపావత్ నుంచి వచ్చి ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఉంటోంది ఆ కుటుంబం. తండ్రిది మొబైల్ బిజినెస్. లాక్డౌన్లో తండ్రీకొడుకులు ఇంట్లోనే ఉంటున్నారు. అప్పుడైనా అతడు కొడుకు మనోవేదనను గ్రహించి ఉండాల్సింది. కొన్నింటిని గ్రహించాల్సిందే. తప్పదు. వేదన పడేవాళ్లు పైకి చెప్పుకోలేరు. ఒక్క సంకేతాన్నయినా ఆయన గుర్తించవలసింది. ‘‘నా కొడుకు నార్మల్గానే ఉంటాడు. శారీరకంగా సున్నితంగా ఉన్నంత మాత్రాన కామెంట్ చేసేయడమేనా! ఎంత వయసని?! వాడిలో çపసితనమింకా పోలేదు. మాటలతో చంపేశారు’’ అని ఆ తండ్రి ఇప్పుడు దుఃఖపడుతున్నాడు. మనసును పొడిచి చంపడానికి లోకం మీద మాటల కత్తులు అనేకం మనుషుల మధ్య తిరుగుతుంటాయి. వేరు చేసి, వేరుగా చూసే కత్తుల ‘రక్తయ్య’లూ ఉంటారు. వారిని తట్టుకునే నిరోధక కణాలు మృదు మనస్కులలో ఉండవు. బాలీవుడ్ యువ నటుడు 34 ఏళ్లవాడు. అతడే కిందామీద అయ్యాడు. అతణ్ణయితే ఒక్క మాట అనకుండా చంపేశారు. కోట్ల రూపాయల్ని కాకుండా గుర్తింపును కోరుకున్నాడు అతను. ‘నువ్వు బాగా చేస్తున్నావ్’ అని నోరు తెరిచి ఒక్క మాట అనకుండా చంపేశారు. అనే మాటల్ని, అనని మాటల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లడమే జీవితంలోని అసలైన గెలుపు అని సైకియాట్రిస్టులతో చెప్పించే పరిస్థితి వచ్చేవరకు తల్లిదండ్రులు ఆగకూడదు. -
బ్యాక్గ్రౌండ్ అలా వర్కవుట్ అవుతుంది
నెపోటిజమ్ గురించి మాట్లాడాలంటే... ప్రతి ఇండస్ట్రీలోనూ వారసులు ఉన్నారు. కొత్తవారూ వస్తున్నారు. తెలుగు పరిశ్రమలో మూడు నాలుగు తరాలకు సంబంధించిన వారసులు ఉన్నారు. హిందీ పరిశ్రమలో కొందరు చెబుతున్నట్లుగా తెలుగు ఇండస్ట్రీలో ‘నెపోటిజమ్’ ఉందా? ఇదే విషయం గురించి సినిమా నేపథ్యంలేనివాళ్లను, ఉన్నవాళ్లను అడిగి తెలుసుకుందాం... ßæరో రాజశేఖర్, నటి జీవిత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి, సక్సెస్ అయ్యారు. అయితే వారి ఇద్దరు కుమార్తెలు శివాని, శివాత్మిలకు ఈ ఇద్దరూ మంచి బ్యాక్గ్రౌండ్. ఈ తేడా గురించి జీవిత మాట్లాడుతూ– ‘‘బ్యాక్గ్రౌండ్ ఉందా? లేదా అనేది కాదు.. ఇక్కడ లక్ చాలా ముఖ్యం. ప్రతిభ చాలా చాలా ముఖ్యం. మా అప్పుడు మా అమ్మానాన్నల కష్టాలు తెలుసుకుంటూ పెరిగాం కాబట్టి కష్టాలను అధిగమించి, నిలదొక్కుకున్నాం. అయితే నాకిప్పటికీ ఏమనిపిస్తుందంటే.. బ్యాక్గ్రౌండ్ ఉండి ఉంటే రాజశేఖర్గారు ఇంకా మంచి స్థాయిలో ఉండి ఉండేవారని. అయితే బ్యాక్గ్రౌండ్ లేనంత మాత్రాన ఇక్కడ ఉండలేం అని కాదు. బ్యాక్గ్రౌండ్ ఎలా వర్కవుట్ అవుతుందంటే.. ఫస్ట్ సినిమా సక్సెస్ కాకపోయినా మూడు నాలుగు సినిమాలు చేసుకునే పరిస్థితి వాళ్లకి ఉంటుంది. డబ్బులు ఉంటాయి, సపోర్ట్ ఉంటుంది. కానీ బ్యాక్గ్రౌండ్ లేనివాళ్లకు ఆ చాన్స్ తక్కువ. టాలెంట్ ఉన్నా పైకి రానివ్వని పరిస్థితి ఇక్కడ లేదు. రానివ్వగలుగుతారు. ఒక్కోసారి బ్యాక్గ్రౌండ్ ఉన్నా అవకాశాలు ఇవ్వరు. జీవితారాజశేఖర్ కూతుళ్లు అని అవకాశాలు ఇచ్చేయడం లేదు. తెలుగమ్మాయిలు లేరంటారు. ఉన్నవారికి ఇవ్వరు. ఏ గైడ్లైన్స్తో చాన్స్ ఇస్తారన్నది చెప్పలేను. కానీ బ్యాక్గ్రౌండ్లో మా సపోర్ట్ ఉం టుంది కాబట్టి వాళ్లకి ఏ ఇబ్బందీ ఉండదు’’ అన్నారు. – నటి, దర్శక–నిర్మాత జీవితా రాజశేఖర్ శివాని, జీవిత,శివాత్మిక నా గాయాలు చాలా లోతైనవి హీరోగా కొన్ని చిత్రాలు, విలన్గా బోలెడన్ని చిత్రాలు, దర్శక–నిర్మాతగా కొన్ని... ఇలా ప్రకాశ్ రాజ్ ఎప్పుడూ బిజీ. ఇటు సౌత్ అటు నార్త్కి కావాల్సిన నటుడు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వశక్తితో పైకొచ్చిన నటుడు. ‘‘నెపోటిజమ్ నాకు అనుభవమే. దీంతోనే నేను జీవితాన్ని కొనసాగించాను. నా గాయాలు నా రక్తమాంసాలకన్నా లోతైనవి. కానీ ఈ కుర్రాడు (సుశాంత్ సింగ్ రాజ్పుత్) నిలబడలేకపోయాడు. ‘మనం నేర్చుకుంటామా? కలలు కన్నవాళ్లు చనిపోకుండా వాళ్ల కోసం నిజంగా మనం నిలబడగలమా? జస్ట్ అడుగుతున్నాను’’ అని ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్. – నటుడు, దర్శక–నిర్మాత ప్రకాశ్ రాజ్ మాకు రెడ్ కార్పెట్ ఉంటుంది కానీ... విలక్షణ నటుడు మంచు మోహన్బాబు కుమార్తెగా లక్ష్మీ మంచుది పెద్ద బ్యాక్గ్రౌండ్. మరి.. ఇది ఎంతవరకు ఉపయోగపడిందో లక్ష్మీని అడుగుదాం... అవును.. బ్యాక్గ్రౌండ్ ఉన్న మాకు రెడ్ కార్పెట్ ఉంటుంది. మాకు ఈజీగా అవకాశాలు వస్తాయి. వాళ్ల అభిమాన హీరో లేక హీరోయిన్ కూతురనో, కొడుకు అనో మమ్మల్ని ఆదరించడానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారు. అయితే ఇవన్నీ ఉన్నా మమ్మల్ని మేం నిరూపించుకోవాలి. నెపోటిజమ్ ఉన్నప్పటికీ ఏ డైరెక్టర్ పిల్లలైనా, హీరోల పిల్లలైనా వారి సత్తా చూపించలేనప్పుడు కళామతల్లి ఆదరించదు. కళామతల్లికి అందరూ ఒకటే. బ్యాక్గ్రౌండ్ ఉన్న మాలాంటివాళ్లకు ఫస్ట్ చాన్స్ ఈజీగా వస్తుంది. ఆ తర్వాత మాత్రం మేం నిరూపించుకోవాలి. చెప్పాలంటే చాలా చాలా కష్టపడాలి. ఎందుకంటే అప్పటికే శిఖరాన్ని చేరుకున్న మా పెద్దలు ఉంటారు. మేం వారి స్థాయిని అందుకోవాలని ఎదురు చూస్తారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేవారి మీద అంచనాలు ఉండవు. సొంత పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవచ్చు. మేం మా తల్లిదండ్రుల పోరాటాన్ని, మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి. బయటినుంచి వచ్చినవాళ్లకు, మాకు అదే తేడా. – నటి, నిర్మాత లక్ష్మీ మంచు బ్యాక్గ్రౌండ్ లేనివాళ్లూ సక్సెస్ అయ్యారు ‘అలా మొదలైంది’తో దర్శకురాలు కాకముందు నందినీ రెడ్డి సహాయ దర్శకురాలిగా చేశారు. సినిమా నేపథ్యం లేని మహిళ. స్వశక్తితో పైకి వచ్చిన నందనీ రెడ్డి ఏమంటున్నారో చూద్దాం. ఏ ఇండస్ట్రీలో అయినా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లూ ఉంటారు.. బయటినుంచి వచ్చినవాళ్లు కూడా ఉంటారు. అయితే అవుటర్స్ కూడా ఇక్కడ స్థిరపడే పరిస్థితులు ఉన్నాయి. నానీని తీసుకుందాం. తనకు బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ మంచి కథలు ఎన్నుకుని, నటుడిగా వాటికి న్యాయం చేయడంలో సక్సెస్ అయ్యాడు. విజయ్ దేవరకొండ కూడా అంతే. ఇంకా నిఖిల్, నాగశౌర్య.. ఇలా బ్యాక్గ్రౌండ్ లేనివాళ్లు హ్యాపీగా సినిమాలు చేసుకోగలుగుతున్నారు. అయితే బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినవారికి ఉండే లాభం ఏంటంటే.. వాళ్లకు ఈజీగా ఎంట్రీ దొరుకుతుంది. అయితే బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లంతా సక్సెస్ అవుతున్నారా? అంటే లేదు. మన కళ్లముందే బ్యాక్గ్రౌండ్ ఉన్న చాలామంది ఫెయిల్యూర్లో ఉన్నారు. సో.. ఇక్కడ ప్రతిభ ముఖ్యం. – దర్శకురాలు నందినీ రెడ్డి – డి.జి.భవాని -
బాయ్కాట్ సల్మాన్
‘‘నా శత్రువులు చాలా చురుకైనవాళ్లు. చాకచక్యంగా నా వెనక నుంచి నాపై దాడి చేస్తారు. కానీ పదేళ్ల తర్వాత నా శత్రువులు ఎవరో నేను తెలుసుకోగలిగాను. వాళ్లెవరంటే సలీం ఖాన్ (రచయిత–నటుడు, సల్మాన్ ఖాన్ తండ్రి), సల్మాన్ ఖాన్, సల్మాన్ సోదరులు అర్భాజ్ ఖాన్, సొహైల్ ఖాన్. ఇంకా వెన్నుపోటు పొడిచినవాళ్లు ఉన్నారు. కానీ ఈ విషపూరిత సర్పానికి సల్మాన్ కుటుంబం అధిపతి. డబ్బు, రాజకీయ పలుకుబడి, అండర్వరల్డ్ కనెక్షన్లతో వాళ్లు ఎవరినైనా ఏమైనా చేయగలుగుతారు. దురదృష్టం ఏంటంటే నావైపు ‘నిజాయితీ’ మాత్రమే ఉంది. అయితే నేను సుశాంత్ సింగ్ రాజ్పుత్లా జీవితాన్ని చాలించను. తలవంచేది లేదు. ఎదురు నిలబడి పోరాడతా. ఒకటీ వాళ్ల అంతం చూస్తా.. లేకపోతే నా అంతం అయినా చూస్తా. ఇక భరించింది చాలు. మళ్లీ పోరాడే సమయం ఆసన్నమైంది’’ అని హిందీ దర్శకుడు అభినవ్ కశ్యప్ మంగళవారం తన ఫేస్బుక్లో సుదీర్ఘంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకోవడానికి హిందీ పరిశ్రమలో అతనికి ఎదురైన చేదు అనుభవాలు ఒక కారణం అనేది పలువురి అభిప్రాయం. అభినవ్ కశ్యప్ కూడా ఆ మాటే అంటున్నారు. ఇది ‘మీటూ’ ఉద్యమం అంత పెద్దది ‘‘ప్రభుత్వానికి ఓ విన్నపం. సుశాంత్ మరణానికి గల కారణాలను సునిశితంగా పరిశోధించాలి. మేం చాలామంది ఎదుర్కొంటున్న చాలా సమస్యలను సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య బయటకు తీసుకొస్తోంది. ఒక వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించే సమస్యలవి. సుశాంత్ మరణం అనేది ఒక మచ్చు తునక అనే భయం వేస్తోంది. ఇది (నెపోటిజమ్ – బంధుప్రీతి) ‘మీటూ’ ఉద్యమం అంత పెద్దది. సుశాంత్ మరణానికి ‘వైఆర్ఎఫ్’ టాలెంట్ మ్యానేజ్మెంట్ ఏజెన్సీ ముఖ్య కారణం. ఈ టాలెంట్ ఏజెన్సీ వాళ్లు మన కెరీర్ని బిల్డ్ చేయరు.. కెరీర్తో పాటు జీవితాలను కూడా నాశనం చేసేస్తారు. పదేళ్లుగా ఇబ్బందిపడుతున్న వ్యక్తిగా చెబుతున్నా.. బాలీవుడ్కి చెందిన ప్రతి టాలెంట్ మ్యానేజర్, టాలెంట్ మ్యానేజ్మెంట్ ఏజెన్సీలు ఆర్టిస్ట్లకు ఓ ‘డెత్ ట్రాప్’లాంటివి. ఈ మ్యానేజర్లు, ఏజెన్సీలు అవకాశాలిప్పిస్తామని ఇండస్ట్రీకి సంబంధంలేనివాళ్లను నమ్మిస్తారు. బాలీవుడ్లో జరిగే పార్టీలకు వాళ్లను ఆహ్వానిస్తారు. అయితే అక్కడ వీరిని చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు. అప్పుడు వీళ్లకు ఓ అభద్రతాభావం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. అప్పుడు ఈ క్యాస్టింగ్ డైరెక్టర్లు మేం కాపాడతామంటూ కొన్నేళ్ల పాటు తమ ఏజెన్సీతో కలిసి పని చేస్తామని ఒప్పందపత్రంలో సంతకం పెట్టమని ఒత్తిడి చేస్తారు. ఆ తర్వాత ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అప్పుడు భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఒక్కసారి ఒప్పందం కుదిరాక ఇక వాళ్లకు ఏ హక్కూ ఉండదు. కెరీర్కి సంబంధించిన నిర్ణయాలు వాళ్ల చేతిలో ఉండవు. కాంట్రాక్ట్ కుదుర్చుకున్న కార్మికుడిలా తక్కువ పారితోషికానికి పని చేయాలి. పోనీ ఎలాగోలా ఈ ఏజెన్సీ నుంచి తప్పించుకుని ‘రేపు’ బాగుంటుందనే నమ్మకంతో వేరే ఏజెన్సీ దగ్గరికి వెళితే ఆ ‘రేపు’ఎప్పటికీ రాదు. ఇలాంటి అనుభవాలు నేను చాలా ఎదుర్కొన్నాను. అర్బాజ్ ఖాన్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను. ‘దబాంగ్’ (2010) సినిమాకి దర్శకత్వం వహించిన పదేళ్లకు నా అనుభవాలను ఇప్పుడు చెప్పబోతున్నాను. ‘దబాంగ్’ తర్వాత ‘దబాంగ్ 2’ ఒప్పుకుని ఆ సినిమా నుంచి నేను తప్పకోడానికి కారణం అర్భాజ్ ఖాన్, సొహైల్ ఖాన్ మరియు అతని కుటుంబం. నా కెరీర్ని కంట్రోల్ చేయడానికి వాళ్లు ట్రై చేశారు. నా రెండో చిత్రాన్ని శ్రీ అష్టవినాయక ఫిలింస్ సంస్థతో చేయడానికి సైన్ చేశాను. కానీ ఆ సంస్థ అధినేత రాజ్ మెహతాకి ఫోన్ చేసి, ‘అతనితో సినిమా చేస్తే జాగ్రత్త’ అని బెదిరించారు. దాంతో నేను తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వయాకామ్తో ఒప్పందం కుదుర్చుకుంటే ఆ సంస్థ అధినేత విక్రమ్ మల్హోత్రాకి ఫోన్ చేసి, బెదిరించారు. దాంతో తీసుకున్న 7 కోట్ల రూపాయల అడ్వాన్స్ తిరిగి ఇవ్వడంతో పాటు 90 లక్షలు వడ్డీ కూడా ఇవ్వాల్సి వచ్చింది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సపోర్ట్ వల్ల ‘బేషరమ్’ (2013) సినిమాకి దర్శకత్వం వహించగలిగాను. అయితే ఆ సినిమా విడుదలకు ముందు సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులు నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. దాంతో డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనడానికి భయపడ్డారు. కానీ రిలయన్స్, నేను ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉన్నవాళ్లం కాబట్టి సొంతంగా సినిమాని విడుదల చేయాలనుకున్నాం. అప్పుడు అసలు యుద్ధం మొదలైంది. నా శత్రువులు బాక్సాఫీస్ దగ్గర నా సినిమా పరాజయం పాలు కావడానికి సినిమా గురించి నెగటివ్ ప్రచారం చేశారు. అయితే థియేటర్ల నుంచి ఎత్తేసే నాటికి నా సినిమా 58 కోట్లు వసూలు చేసింది. శాటిలైట్ రైట్స్ విషయంలో ఇబ్బందిపెట్టారు. ఇక ఆ తర్వాత నా ప్రతి ప్రయత్నాన్ని చెడగొట్టే పనులు చేశారు. నన్ను బెదిరించారు. నా కుటుంబంలో ఉన్న స్త్రీలను అత్యాచారం చేస్తామని బెదిరించారు. దాంతో నా మానసిక ఆరోగ్యం దెబ్బతింది. చివరికి 2017లో నా భార్య, నేను విడాకులు తీసుకున్నాం. ఆ తర్వాత కూడా నన్ను వదిలిపెట్టలేదు. బెదిరిస్తూ మెసేజ్లు పంపించారు. పోలీస్ స్టేషన్కి వెళితే ఫిర్యాదు నమోదు చేయడానికి నిరాకరించారు. నా శత్రువులు చాలా చురుకైనవాళ్లు. వెనక నుండి నాపై దాడి చేస్తున్నారు. నేను పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను. ఇక సహించేది లేదు. ఓపెన్గా చాలెంజ్ చేస్తున్నాను. అమాయకులు బలి కాకూడదు సుశాంత్ సింగ్ వెళ్లిపోయాడు. కానీ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటాడని అనుకుంటున్నాను. కానీ అలాంటి అమాయకులు ఇక బాలీవుడ్లో బలి కాకూడదు. ఇబ్బంది పడుతున్న నటీనటులు, క్రియేటివ్ పీపుల్ నా ఈ పోస్ట్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తారని అనుకుంటున్నాను. దయచేసి షేర్ చేయండి’’ అంటూ ‘మీటూ బాయ్కాట్ సల్మాన్ఖాన్’ అనే హ్యాష్ట్యాగ్తో ముగించారు అభినవ్ కశ్యప్. కాగా నో స్మోకింగ్, బాంబే వెల్వెట్, రమణ్ రాఘవ్, మన్మర్జియాన్.. ఇలా ఓ 20 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సోదరుడు అభినవ్ కశ్యప్. తన సోదరుడు అభినవ్, సల్మాన్ ఖాన్కి మధ్య జరుగుతున్న వివాదం గురించి తాను స్పందించదలచుకోలేదని అనురాగ్ తన ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. ‘‘ఈ విషయం గురించి మాట్లాడటానికి మీడియావారు నాకు ఫోన్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితమే తన విషయంలో నన్ను జోక్యం చేసుకోవద్దని అభినవ్ చాలా స్పష్టంగా చెప్పేశాడు. అందుకని తను చేస్తున్నవాటికి, చెబుతున్నవాటి గురించి నేను స్పందించలేను’’ అని అనురాగ్ ట్వీట్ చేశారు. చిత్రపరిశ్రమ మేల్కొనాల్సిన సమయం ఇది – నటుడు వివేక్ ఒబెరాయ్ ‘‘సుశాంత్ తండ్రి కళ్లల్లో బాధ చూస్తుంటే భరించలేని విధంగా ఉంది’’ అంటూ నటుడు వివేక్ ఒబెరాయ్ తన ట్వీటర్ ద్వారా కొన్ని విషయాలు పంచుకున్నారు. చిత్రపరిశ్రమ మేల్కొనాల్సిన సమయం ఇది అని వివేక్ చెబుతూ – ‘‘ప్రతిభను ప్రోత్సహించే దిశగా సినిమా పరిశ్రమ అడుగులు వేయాలి కానీ ప్రతిభను నాశనం చేసే దిశగా కాదు. నా ఈ ప్రయాణంలో నేను కూడా ఎన్నో బాధలు అనుభవించాను. ఆ బాధలు చెప్పి సుశాంత్ బాధని తగ్గించి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది. మన ప్రయాణం చీకటిలో కొనసాగవచ్చు లేదా ఒంటరి ప్రయాణం కావొచ్చు. కానీ మరణం దానికి పరిష్కారం కాదు. ఆత్మహత్య పరిష్కారం కానే కాదు. సుశాంత్ తన కుటుంబం, స్నేహితులు, లక్షలాది మంది అభిమానుల గురించి ఆలోచించడం మానేశాడనుకుంటున్నాను. అందుకే ఈరోజు అతన్ని మనం కోల్పోయాం. అతని తండ్రి బాధ వర్ణనాతీతం. ఇక సుశాంత్ అక్క అయితే ‘వెనక్కి వచ్చెయ్’ అంటూ కన్నీటి పర్యంతం కావడం నన్ను కలచివేసింది. సుశాంత్ మరణం సినిమా పరిశ్రమకు ఓ మేలుకొలుపు లాంటిది’’ అన్నారు. – డి.జి.భవాని -
సుశాంత్ సింగ్ రాజ్పుత్... 50 కలలు
బంగారంలాంటి కెరీర్, మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ సింగ్ రాజ్పుత్ చాలా తొందరపడ్డాడు. 34 ఏళ్లకే జీవితాన్ని ముగించుకున్నాడు. ఏడాది క్రితం తనకు 50 కలలు ఉన్నట్లు ట్వీటర్ ద్వారా తెలిపాడు. ఆ 50 కలలను ఓ పేపర్లో ‘50 డ్రీమ్స్ ఆఫ్ మై లైఫ్ అండ్ కౌంటింగ్’ అని రాసి షేర్ చేశాడు కూడా. ఆయనకున్న 50 కలల్లో 11 కలలు నెరవేరాయి కూడా. సుశాంత్ ఆత్మహత్యతో మిగిలిన కలలు మాత్రం కల్లలుగానే మిగిలిపోయాయి.. ఆయన కన్న కలల్లో ప్రధానమైనవి కొన్ని... ► విమానాన్ని నడపడం నేర్చుకోవడం ఆయన మొదటి కల ► ఐరన్ మ్యాన్ ట్రయథ్లాన్కు సిద్ధం కావడం ► ఎడమ చేతితో క్రికెట్ మ్యాచ్ ఆడటం ► మోర్సె కోడ్ నేర్చుకోవడం ► చిన్నారులు అంతరిక్షం గురించి తెలుసుకునేందుకు సహాయం చేయడం ► ఒక టెన్నిస్ ఛాంపియన్ పాత్రలో నటించడం ► నాలుగు క్లాప్ పుషప్లు చేయడం ► ఒక వారం పాటు చంద్రుడు, అంగాకరుడు, బృహస్పతి, శని గ్రహాలను పర్యవేక్షించడం ► ఒక బ్లూ హోల్లో ఈత కొట్టడం ► డబుల్ స్లిట్ ప్రయోగం చేసేందుకు ప్రయత్నించడం ► కొన్ని వేల మొక్కలు నాటడం ► ఇంజినీరింగ్ చదివిన ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించి స్నేహితులతో ఓ సాయంత్రం సరదాగా గడపడం ► ఇస్రో లేదా నాసా వర్క్షాపులకు వంద మంది పిల్లల్ని పంపించడం. ► కైలాశ్ (పర్వతం)పై ధ్యానం చేయడం ► ఒక పుస్తకం రాయడం ► యూరోపియన్ న్యూక్లియర్ రీసెర్చి సంస్థ అయిన సీఈఆర్ఎన్ను సందర్శించడం ► ఆరు నెలల్లోనే సిక్స్ ప్యాక్స్ శరీరాన్ని పొందడం ► చూపులేని వారికి కోడింగ్ నేర్పించడం ► అడవిలో ఒక వారం రోజుల పాటు గడపడం ► వైదిక జ్యోతిష్య శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం ► డిస్నీలాండ్కి వెళ్లడం ► అమెరికాలోని లిగోని సందర్శించడం ► ఒక గుర్రాన్ని పెంచుకోవడం ► కనీసం పది రకాల నృత్యాలను నేర్చుకోవడం ► ఉచిత విద్య కోసం కృషి చేయడం. సుశాంత్ ఫర్ ఎడ్యుకేషన్ పేరిట ఆయన విద్యార్థులకు సహాయం కూడా చేసేవారు. ► అండ్రొమేడా అనే పాలపుంతను ఒక శక్తివంతమైన టెలిస్కోప్ సాయంతో పరిశీలించడం ► మంచుతో నిండిపోయిన అంటార్కిటికా ఖండాన్ని సందర్శించడం ► మహిళలు స్వీయ రక్షణ నైపుణ్యాలు నేర్చుకునేలా సహాయం చేయడం ► వ్యవసాయం నేర్చుకోవడం ► పిల్లలకు డ్యాన్స్ నేర్పించడం ► రెండు చేతులతో బాణాలు వేసేలా శిక్షణ పొందడం ► తనకు ఇష్టమైన 50 పాటలకు గిటార్ నేర్చుకోవడం ► ఒక ఛాంపియన్తో చెస్ ఆడటం ► లాంబోర్గిని కారును సొంతం చేసుకోవడం ► సైమాటిక్స్ ప్రయోగాలు చేయడం ► భారత సైన్యంలో చేరేలా విద్యార్థులు సిద్ధమయ్యేందుకు సహాయం చేయడం ► సముద్ర అలలపై సర్ఫింగ్ చేయడం ► యూరప్ మొత్తం రైలులో ప్రయాణించడం ఆయన చివరి కల సుశాంత్ కలల్లో తీరినవి... విమానాన్ని నడపడం నేర్చుకోవడం, ఐరన్ మ్యాన్ ట్రయథ్లాన్కు సిద్ధం కావడం, ఎడమ చేతితో క్రికెట్ మ్యాచ్ ఆడటం, యూరోపియన్ న్యూక్లియర్ రీసెర్చి సంస్థ అయిన సీఈఆర్ఎన్ను సందర్శించడం, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీని సందర్శించడం, బ్లూ హోల్లో ఈత కొట్టడం, సెనోట్లో ఈదడం (సున్నపురాయి భూమి కుంగిపోవడంతో సహజంగా ఏర్పడిన నీటి కొలను), డిస్నీల్యాండ్కి వెళ్లడం, అండ్రొమేడా అనే పాలపుంతను ఒక శక్తివంతమైన టెలిస్కోప్ సాయంతో పరిశీలించడం, రెండు చేతులతో బాణాలు వేసేలా శిక్షణ పొందడం, సైమాటిక్స్ ప్రయోగాలు చేయడం (ప్రకంపనలకు సంబంధించి). -
ముసుగులు తొలగించండి
‘‘ఇక చాలు నీ మాటలు.. మనిషి పోయాక ఈ మొసలి కన్నీరు ఎందుకు? నెపోటిజమ్ జీర్ణించుకుపోయిన మనిషివి నువ్వు. నీ ముసుగుని తొలగించు. ఆలియా.. నువ్వు కూడా?’’ అంటూ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, కథానాయిక ఆలియా భట్లపై సోషల్ మీడియా వేదికగా పలువురు మండిపడ్డారు. వారి ఆగ్రహానికి కారణం హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం. ‘‘నువ్వు (సుశాంత్) ఒంటరితనం ఫీలవుతున్నావని, నీ చుట్టూ మనుషులు ఉంటే బాగుంటుందని నేనో సందర్భంలో గ్రహించాను. అయితే ఏడాదిగా నీతో టచ్లో లేనందుకు ఇప్పుడు నన్ను నేను నిందించుకుంటున్నాను. ఇక ఎప్పటికీ ఇలా చేయకూడదనుకుంటున్నాను. నిన్ను మిస్ అయినందుకు నన్ను నేను తిట్టుకుంటున్నాను’’ అని కరణ్ ట్వీట్ చేశారు. అయితే ఇదంతా ఉత్తుత్తి బాధ అనేది పలువురి అభిప్రాయం. సినిమా నేపథ్యం లేని కుటుంబాన్నుంచి వచ్చిన సుశాంత్ సింగ్కి బాలీవుడ్లో వారసులకు దక్కినంత ప్రేమాభిమానాలు దక్కలేదని పలువురు ట్వీటర్లో పోస్ట్ చేశారు. పైగా సుశాంత్ హీరోగా కరణ్ జోహార్ ప్రొడక్షన్లో ‘డ్రైవ్’ అనే సినిమా రూపొందింది. ఆ సినిమా విడుదల గత ఏడాది పలుమార్లు వాయిదా పడింది. కరోనాలాంటి మహమ్మారి కారణంగా థియేటర్ల మూత లేనప్పుడు గత ఏడాది ఈ సినిమాని డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేశాడు కరణ్ జోహార్. ‘‘అదే బాలీవుడ్లో సుశాంత్కి మంచి బ్యాగ్రౌండ్ ఉండి ఉంటే ఇలా చేసేవాడివా?’ అంటూ ఇప్పుడు పలువురు విరుచుకుపడ్డారు. కథానాయిక ఆలియా భట్ని కూడా విమర్శిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్వహిస్తున్న ‘కాఫీ విత్ కరణ్ షో’లో ఓసారి ఆలియా పాల్గొన్నారు. అప్పుడు రణ్వీర్సింగ్, సుశాంత్ సింగ్ రాజ్పుత్, వరుణ్ ధావన్లలో ఎవరు మంచి నటుడు? అని ఆలియాని కరణ్ అడిగితే, ‘సుశాంత్ అంటే ఎవరు?’ అంది. ఇద్దరూ నవ్వుకున్నారు కూడా. ఇక ఆదివారం సుశాంత్ మృతికి సంతాపంగా ‘‘నువ్వు మమ్మల్ని ఇంత తొందరగా వదిలి వెళ్లిపోయావ్. ఎంతో షాక్లో ఉన్నాను. మాటలు రావడంలేదు. నీ కుటుంబ సభ్యులకి, నిన్ను ప్రేమించేవారికి, నీ ఫ్యాన్స్కి సంతాపం ప్రకటిస్తున్నాను’’ అని ఆలియా ట్వీట్ చేసింది. అప్పుడు ‘సుశాంత్ ఎవరు న్నావు? ఇప్పుడు సంతాపం ప్రకటిస్తున్నావు’ అని మండిపడుతున్నారు. వాస్తవానికి రెండు మూడేళ్లుగా హిందీ పరిశ్రమలో ‘బంధుప్రీతి’ అనే వివాదం చాలా ఎక్కువగా సాగుతోంది. ‘నన్ను బాలీవుడ్లో జరిగే వేడుకలకు పెద్దగా పిలవరు’ అని ఓ సందర్భంలో సుశాంత్ సింగ్ అన్న దాఖలాలు కూడా ఉన్నాయి. హిందీ పరిశ్రమలో తాను ఒంటరిని అనే భావనలో అతను ఉండిపోయాడని, డిప్రెషన్కి ఇదొక కారణం అయ్యుంటుందన్నది కొందరి అభిప్రాయం. ఇక కంగనా రనౌత్, తాప్సీ, హ్యూమా ఖురేషీ లాంటివాళ్లు ఈ బంధుప్రీతి గురించి బాహాటంగానే స్పందించారు. కంగనా అయితే కరణ్ని ఉద్దేశించి ‘బాలీవుడ్ మాఫియా, ‘ఫ్లాగ్ బ్యారర్‡ఆఫ్ నెపోటిజమ్’ (బంధుప్రీతిని ముందుండి నడిపించేవాడు), స్నూటీ అండ్ ఇన్టాలరెంట్ (ఇండస్ట్రీలోని స్టార్స్ను తప్ప బయటవాళ్లను భరించలేడు) అన్నారు. ‘‘సుశాంత్ సినిమాలను అవార్డు షోలకు ఎందుకు అనుమతించలేదు? ‘కాయ్ పోచె, ఎం.ఎస్. ధోని, చిచోరే’ వంటి అద్భుత సినిమాలు చేశాడు. కానీ ఎన్ని అవార్డులు ఇచ్చారు?’’ అని కూడా స్పందించారు కంగనా. ‘రంగీలా’ ఫేమ్ ఊర్మిళ అయితే ‘‘బంధుప్రీతి’ రూల్ చేస్తున్న ఈ ఇండస్ట్రీలో ప్రతిభను, హార్డ్వర్క్ని నమ్ముకుని నీలా ఒక గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం. ఇంత సాధించిన నువ్వు త్వరగా వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం బాధాకరం’’ అని సుశాంత్ మరణం పట్ల తన ఆవేదన వ్యక్తం చేశారు. -
సుశాంత్ తన చేత్తో రాసుకున్న కోరికల జాబితా ఇదే!
ముంబై: యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ (34) మరణవార్త బాలీవుడ్ను కుదిపేస్తోంది. సుశాంత్ బాంద్రాలోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకుని మరణించడం అందరిని షాక్కు గురిచేసింది. ఈ నేపథ్యంలో సుశాంత్కు సంబంధించిన ప్రతి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇందులో భాగంగా సుశాంత్ 50 'కలల' జాబితా వైరల్ అయ్యింది. దీనిని సుశాంత్ 2019 సెప్టెంబర్లో తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. తన చేతితో రాసిన కలల పుస్తకాన్ని అభిమానాలతో పంచుకున్నాడు. (రియా చక్రవర్తిని విచారించిన పోలీసులు) విమానం నడపడం నేర్చుకోవడం, ఎడమ చేతితో క్రికెట్ మ్యాచ్ ఆడటం, రైలులో యూరప్ ప్రయాణించడం, 100 మంది పిల్లలను ఇస్రో, నాసా వర్క్షాపులకు పంపడం ఇలా చాలానే కోరికలను ఆ పుస్తకంలో సుశాంత్ రాసుకొచ్చాడు. ఈ జాబితాలో సుశాంత్ వ్యక్తిగతం.. అతడు ఎలాంటివాడో, పరులకు ఎలాంటి సాయం చేయాలనుకునే వాడో అన్ని కలిసి ఉన్నాయి. వీటితో పాటు, ఆత్మరక్షణలో మహిళలకు శిక్షణ ఇవ్వడం, పిల్లలకు నృత్యం ఎలా చేయాలో నేర్పించడం, ఛాంపియన్తో చెస్ ఆడటం, యోగా నేర్చుకోవడం కూడా సుశాంత్ కోరికల జాబితాలో ఉన్నాయి. సుశాంత్ది ఆత్మహత్య కాదని, అతని మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని, అతడు హత్య చేయబడ్డాడని అతని మేనమామ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోమవారం వచ్చిన సుశాంత్ పోస్ట్ మార్టం రిపోర్టు ఈ ఆరోపణలు తప్పని తేల్చింది. అతడు ఆత్మహత్య చేసుకొనే చనిపోయాడని శవ పరీక్ష ఫలితాలలో తేలింది. సుశాంత్ మరణించడంతో అతని బృందం అభిమానులకు కొన్ని విజ్ఞప్తులు చేసింది. "సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇకపై మనతో లేరని పంచుకోవడం మాకు చాలా బాధ కలిగిస్తోంది. ఇటువంటి బాధాకర సమయంలో మా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని మీడియాను అభ్యర్థిస్తున్నాం’ అని పేర్కొంది. ముంబై పోలీసు ప్రతినిధి డిసిపి ప్రణయ్ అశోక్ కూడా ఆదివారం సుశాంత్ ఆత్మహత్య చేసుకొని మరణించారనే వార్తను ధ్రువీకరించారు. (ఆ ‘దెయ్యమే’ సుశాంత్ను పీడించింది!) The heartbreaking end of a dreamer: the 50 dreams of #SushantSinghRajput pic.twitter.com/VPgR8Tr0qJ — Mahim Pratap Singh (@mayhempsingh) June 14, 2020 -
తొందరగా వెళ్లిపోయావ్ మిత్రమా!
న్యూఢిల్లీ: సుశాంత్ సింగ్ రాజ్పుత్ బాలీవుడ్ నటుడే కానీ క్రికెట్ చూసే ప్రతీ ఒక్కరికీ అతనో ‘బాలీవుడ్ ఎంఎస్ ధోని’. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధారంగా నిర్మించిన ‘ఎంఎస్ ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’ సినిమాలో మహి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అతను క్రికెట్ వర్గాలకు సుపరిచితుడయ్యాడు. డిప్రెషన్ కారణంగా 34 ఏళ్ల సుశాంత్ ముంబైలోని తన ఇంట్లో ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడటంతో క్రికెట్ వర్గాలు విస్తుపోయాయి. పలువురు క్రికెటర్లు సుశాంత్ విషాదాంతంపై విస్మయానికి లోనయ్యారు. చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయావు మిత్రమా అంటూనే... ఈ వార్త అబద్ధమైతే బావుండంటూ సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు. సుశాంత్ మరణం కలిచి వేస్తోంది. అతనో ప్రతిభావంతుడైన యువ నటుడు. వారి కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. –సచిన్ టెండూల్కర్ ఈ వార్త విని షాకయ్యా. ఇది జీర్ణించుకోవడం కష్టం. దేవుడు వారి కుటుంబానికి ధైర్యాన్నివ్వాలి. – కోహ్లి దీన్ని నమ్మాలనిపించట్లేదు. చాలా బాధగా ఉంది. నీ ఆత్మకు శాంతి కలగాలి బ్రదర్. –రోహిత్ శర్మ షాకింగ్, నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. సుశాంత్ కుటుంబం కోసం ప్రార్థిస్తా. –శిఖర్ ధావన్ జీవితం సున్నితమైనది. ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందరితో దయతో మెలగండి. ఓం శాంతి. –వీరేంద్ర సెహ్వాగ్ నిజంగా దీన్ని నమ్మలేను. ఓ ప్రతిభావంతుడైన యువకుడి జీవితం ఇలా ముగుస్తుందనుకోలేదు. లోపలి సంఘర్షణను ఎవరూ తెలుసుకోలేరు. –యువరాజ్ సింగ్ మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన సందర్భమిది. సుశాంత్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. –వీవీఎస్ లక్ష్మణ్ నీకు ఇంకా చాలా అందమైన జీవితం ఉంది. చాలా తొందరగా వెళ్లిపోయావు సుశాంత్. –షోయబ్ మలిక్ (పాక్ క్రికెటర్) షాకింగ్. చాలా తొందరగా వెళ్లిపోయావు. ఆన్స్క్రీన్ ధోనిని కోల్పోయాం. –సైనా నెహ్వాల్ (స్టార్ షట్లర్) సుశాంత్ మనం ఇద్దరం కలిసి టెన్నిస్ ఆడదామని చెప్పావ్. నువ్వున్న చోటల్లా సంతోషం, నవ్వులు పంచావ్. చివరకు ఇంత బాధపెడతావ్ అనుకోలేదు. హృదయం బద్ధలవుతోంది. –సానియా మీర్జా (టెన్నిస్ స్టార్) ఆ అందమైన నవ్వు వెనక ఎంత సంఘర్షణ దాగుందో తెలుసుకోలేకపోయాం. చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నావు. మేం నిన్ను కోల్పోయాం. –మిథాలీ రాజ్ ఎవరైనా ఇది అబద్ధమని చెప్పండి. సుశాంత్ లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. –హర్భజన్ ఈ విషాదాంతం షాకింగ్గా ఉంది. కుటుంబానికి, అభిమానులకు నా సంతాపం. –రవిశాస్త్రి మనం ఒక అందమైన పిల్లాడిని, విద్యావంతుణ్ని, కష్టపడి విజయాన్ని సాధించిన వ్యక్తిని కోల్పోయాం. ధోని సినిమా కోసం 9 నెలలు ప్రొఫెషనల్ క్రికెటర్లా ప్రాక్టీస్ చేశాడు. హెలికాప్టర్ షాట్లో పరిపూర్ణత సాధించాడు. ఎన్ని గాయాలు తగిలినా వికెట్కీపింగ్ కోసం సిద్ధంగా ఉండేవాడు. అద్భుతమైన తన ప్రయాణాన్ని అర్ధాంతరంగా ముగించాడు. నమ్మలేకపోతున్నా. –కిరణ్ మోరే (ధోని బయోపిక్ కోసం భారత మాజీ వికెట్ కీపర్ మోరే వద్ద సుశాంత్ శిక్షణ తీసుకున్నాడు) -
షారుక్ఖాన్ శిష్యుడు
గురువులకు శిష్యులు దొరకడం విశేషం కాదు. శిష్యులకు గురువు దొరకడమే విశేషం. ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ చూసి చిన్నప్పుడు హీరో కావాలనుకున్నాడు సుశాంత్. షారుక్లా ఢిల్లీలో చదువుకున్నాడు. షారుక్లా థియేటర్ చేశాడు. షారుక్లా టీవీల్లో యాక్ట్ చేశాడు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి షారూక్లా హీరో అయ్యాడు. సినిమాలు కుర్రాళ్లను పాడు చేస్తాయని కొందరు అనొచ్చు. సినిమాలు సుశాంత్ సింగ్ రాజ్పుత్లను కూడా ఇస్తాయి. మహేంద్ర సింగ్ ధోని బయో పిక్ తీయాలి. కుర్రాడు చాకులా ఉండాలి. తెర మీద బ్యాట్ పట్టుకుని నిలుచుంటే ఖడ్గం పట్టుకున్న వీరుడిలా ఉండాలి. చూపు నిశితంగా ఉండాలి. దృష్టి లగ్నమై ఉండాలి. అతడు అచ్చు క్రీడాకారుడిలా ఉండాలి. అదే సమయంలో అందరికీ నచ్చే హీరోలా కూడా ఉండాలి. ఇన్ని అర్హతలు ఉన్నవాడు ఎవరు? అని వెతికితే వచ్చిన పేరు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అని తేలింది. ‘నాకు ఇంకో అర్హత కూడా ఉంది’ అన్నాడు సుశాంత్. ‘ఏమిటది?’ అని అడిగితే ‘ధోని బిహారి. నేనూ బిహారి. మాది పాట్న’ అని జవాబు. ఒక ప్రాంతపు ఆత్మ ఆ ప్రాంతం వాడికే తెలుస్తుంది అన్నట్టుగా సుశాంత్ ఆ పాత్రలో అద్భుతంగా నటించాడు. సూపర్ హిట్ కొట్టాడు. అయితే ఆ హిట్ ఊరికే వచ్చి చేతుల్లో పడింది మాత్రం కాదు. తల్లి మరణం జీవితం ఒక దెబ్బ కొట్టడానికి ఎంచుకునే క్షణాలు అనూహ్యంగా ఉంటాయి. సుశాంత్ జూనియర్ ఇంటర్లో ఉండగా తల్లి చనిపోయింది. తండ్రి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఐదు మంది సంతానం. మొదటి నలుగురు ఆడపిల్లలు. చివర పుట్టింది సుశాంత్. నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన అబ్బాయి కనుక సహజంగానే అమ్మ ముద్దునంతా ప్రేమనంతా పొందుతూ పెరిగాడు. తల్లిదండ్రులు ఐదుమందినీ సమానంగా పెంచారు. సుశాంత్ అక్క నీతు సింగ్ స్టేట్ లెవల్ క్రికెట్ ప్లేయర్గా ఎదిగింది. ఒక అక్క క్రిమినల్ లాయర్. సుశాంత్ కూడా ఏదైనా ప్రత్యేకమైనది సాధిస్తాడని తల్లి అనుకునేది. ఆమె ఆశించినట్టే సుశాంత్ చిన్నప్పటి నుంచి స్టేజ్ ఎక్కి డాన్సులు చేయడం, సినిమా యాక్టర్లని ముఖ్యంగా షారుక్ఖాన్ని ఇమిటేట్ చేయడం చేసేవాడు. తాను భవిష్యత్తులో ఏం చేసినా తల్లి గర్వపడేలా చేస్తానని అనుకునేవాడు. అటువంటిది ఆమె మరణం అతనికి, కుటుంబానికి పెనుఘాతంలా మారింది. ఎంతగా అంటే ఆమె జ్ఞాపకాలు ఉన్న పాట్నా నగరాన్నే వాళ్లు విడిచిపెట్టి వెంటనే ఢిల్లీకి మారిపోయారు. సుశాంత్ సీనియర్ ఇంటర్ ఢిల్లీలో చదివాడు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో 7వ ర్యాంక్ సాధించి ఢిల్లీ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. అన్నీ సరిగ్గా జరిగి ఉంటే అతడిప్పుడు ఏ అమెరికాలోనో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మిగిలి ఉండేవాడు. కాని విధి కొందరి నుదుటన లిఖించేది వేరు. డాన్స్ సుశాంత్ డాన్స్ సుశాంత్కు చిన్నప్పటి నుంచి డాన్స్ పిచ్చి. ఢిల్లీలో ఇంజనీరింగ్ చదువుతూనే కొరియోగ్రాఫర్ షమిత్ దగ్గర డాన్స్ క్లాసులకు చేరాడు. చాలా వెంటనే డాన్స్ నేర్చుకున్నాడు. 2006లో ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫంక్షన్లో గ్రూప్ డాన్సర్లలో ఒకడిగా డాన్స్ చేశాడు. చాలా షోస్లో పాల్గొన్నాడు. షమిత్ ఇతణ్ణి గమనించి నీలో ఏదో టాలెంట్ ఉంది యాక్టింగ్లో ట్రయ్ చెయ్ అని చెప్పాడు. వెంటనే సుశాంత్ ఢిల్లీలో యాక్టింగ్ నేర్పించే బేరీ జోన్స్ దగ్గర యాక్టింగ్ క్లాసుల్లో చేరాడు. మెల్లగా ఇదే తన చోటని అతనికి అర్థమైపోయింది. థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్లో ఉండగా తండ్రికి చెప్పేశాడు– నాన్నా ఇంక చదవను.. ముంబై వెళ్లిపోతాను అని. తండ్రి ఎస్ చెప్పలేదు. అలాగని నో కూడా చెప్పలేదు. సుశాంత్ ముంబై చేరుకున్నాడు. కొనసాగిన భిక్షాటన విద్యను అర్థించాలి. గురువు నుంచి భిక్షలా పొందాలి. సుశాంత్ ముంబై చేరగానే స్టుడియోల చుట్టూ తిరక్కుండా మళ్లీ అక్కడి థియేటర్ గ్రూప్ అయిన ‘ఏక్జుటా’లో చేరాడు. ఒకటిన్నర సంవత్సరం నాటకాలు వేస్తూనే ఉన్నాడు. అప్పుడు అతడు టీవీవాళ్ల దృష్టిలో పడ్డాడు. అది కూడా బాలాజీ టెలిఫిల్మ్స్ వారి దృష్టిలో. తన హీరో షారుక్ ఖాన్లానే సుశాంత్ కూడా మొదట టీవీ హీరో అయ్యాడు. అతడు నటించిన ‘పవిత్ర రిష్టా’ పెద్ద హిట్. 300 ఎపిసోడ్స్లో నటించి ఇంటింటి హీరో అయ్యాడు. ఆ తర్వాత రెండు డాన్స్ షోలలో పాల్గొన్నాడు. కాని ఆ అనుభవమంతా కెమెరాను అర్థం చేసుకోవడానికి అతనికి పనికొచ్చింది. ఒక్కసారి అది తెలిసిపోయాక ఇక అక్కడ నేర్చుకోవాల్సింది ఏమీ లేదని గ్రహించి సినిమాల వైపు దృష్టి పెట్టాడు. అలా అతడికి వచ్చిన తొలి సినిమా ‘కాయ్ పొ చె’. భిన్నమైన ఎంపిక సుశాంత్ చేసిన భిన్నమైన ఆలోచన ఏమిటంటే ఆడే పాడే కమర్షియల్ హీరోలాగా కనిపించాలని అనుకోకపోవడం. అందుకే అతడు ‘కాయ్ పొ చె’లో అతడొక పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. క్రికెట్ రంగంలో రాజకీయాల వల్ల బలైన ఒక బ్యాట్స్మెన్లా అతడి నటన అందరికీ నచ్చింది. ఆ వెంటనే యువత ఒక ప్రయోగంగా చూస్తున్న లివ్ఇన్ రిలేషన్ను చర్చించే ‘సుద్ధ దేశీ రొమాన్స్’లో హీరోగా నటించాడు. ఆ సినిమా హిట్ అయ్యింది. అప్పుడు అతనికి రాజ్ కుమార్ హిరాణి రూపంలో జాక్పాట్ తగిలింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన ‘పికె’లో ముఖ్యపాత్రకు అంటే అనుష్కకు ప్రియుడిగా నటించాడు. ఆ సినిమా అతడి ప్రెజెన్స్ను బాలీవుడ్లో స్థిరపరిచింది. మిస్టర్ ధోని విజయం అతడికి పదేళ్ల కెరీర్ ఇచ్చింది. ఫ్లాపుల తర్వాత సుశాంత్ నటించిన ‘రాబ్తా’, ‘కేదార్నాథ్’, ‘సోంచరియా’ సరిగ్గా ఆడలేదు. కాని అతడు ధైర్యం చేసి ముసలిపాత్రలో కనిపించడానికి సిద్ధపడి నటించిన తాజా చిత్రం ‘చిచోరే’ సూపర్హిట్ అయ్యింది. వంద కోట్లు వసూలు చేసింది. అందులో అతడు ఆత్మహత్య ప్రయత్నం చేసిన కుమారుడికి తాను జీవితంలో ఎన్ని ఫెయిల్యూర్ ఎదుర్కొన్నాడో చెప్పి ధైర్యం నింపుతాడు. అది ప్రేక్షకులకు నచ్చింది. సుశాంత్ సోలో హీరోగా నటించిన రెండు సినిమాలు ‘డ్రైవ్’, ‘దిల్ బేచారా’ 2020లో ప్రేక్షకులను పలకరించనున్నాయి. సుశాంత్ మితభాషి. ప్రొఫెషనల్ యాక్టర్. తన పని తాను చూసుకొనే స్వభావం ఉన్నవాడు. టీవీలో తనతో కలిసి నటించిన అంకితా లోఖండేతో ఆరేళ్లు సహజీవనం చేశాడు. అయితే వారు విడిపోయారు. బాలీవుడ్ యువసైన్యంలో సుశాంత్ ఒక ముఖ్యమైన యోధుడుగా ఉన్నాడు. ఇతడు మరిన్ని జైత్రయాత్రలు తప్పక చేస్తాడు. – సాక్షి ఫీచర్స్ డెస్క్ -
గన్ టు గన్
బందిపోటుగా తుపాకీ పట్టిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ నెక్ట్స్ చిత్రం కోసం ఆర్మీ ఆఫీసర్గా గన్ను పట్టనున్నారు. ఆర్మీ డే సందర్భంగా ‘రైఫిల్ మేన్’ అనే సినిమాలో సోల్జర్గా నటించనున్నట్లు అనౌన్స్ చేశారు సుశాంత్ సింగ్ రాజ్పుత్. ఈ సినిమాకు విక్రమ్ మల్హోత్రా, వసు భగ్నానీ నిర్మాతలు. ‘‘ఆధునిక శత్రుత్వం.. కాపాడుకోవాల్సిన సరిహద్దు.. ధైర్యవంతుడైన సైనికుడు’’ అంటూ ఈ సినిమా మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసి ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘కిజీ ఔర్ మన్నీ’ షూటింగ్ను ఇటీవలే కంప్లీట్ చేసుకున్న సుశాంత్ ఇప్పుడు తన బర్త్ డే కోసం ‘సంచిరియా’ షూట్ నుంచి బ్రేక్ తీసుకుంటారని సమాచారం. ఈ సినిమాలో సుశాంత్ బందిపోటుగా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ఈ ఏడాదే విడుదల కానుంది. -
మరో వేటు
బాలీవుడ్లో ‘దంగల్, చెన్నై ఎక్స్ప్రెస్...’ వంటి బడా బడా సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్గా పని చేశారు ముఖేష్ చాబ్రా. తాజాగా హాలీవుడ్ హిట్ చిత్రం ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ బాలీవుడ్ రీమేక్ ‘కిజీ అవుర్ మ్యానీ’తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ‘మీటూ’ ఉద్యమంలో ఈ దర్శకుడి మీద కూడా వేధింపులకు సంబంధించిన ఆరోపణలు వినిపించాయి. దాంతో దర్శకత్వ బాధ్యతల నుంచి చిత్ర నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియో తప్పించింది. తన మీద వచ్చిన ఆరోపణలను లీగల్గా ఎదుర్కొని తన పాపులారిటీని కాపాడుకుంటానని దర్శకుడు చాబ్రా పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రకథానాయిక సంజన సంఘీని హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ సెట్లో ఇబ్బందిపెట్టారు అని సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వచ్చినప్పట్టికీ అవన్నీ అసత్యపు ప్రచారాలంటూ సుశాంత్ కొట్టిపారేశారు. -
మరో కొత్త ప్రయాణం
నితేష్ తివారీ దర్శకత్వంలో వచ్చిన ‘దంగల్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఆమిర్ ఖాన్, ఫాతిమా సనా షేక్, జైరా వసీమ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం చైనా, జపాన్ దేశాల్లో కూడా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఇప్పుడు నితేష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం చిత్రీకరణ ముంబైలో ఆదివారం మొదలైంది. ఈ చిత్రానికి ‘ఛిచ్చోరే’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ‘‘ఈ రోజు నా జీవితంలో ప్రత్యేకమైనది. ఎందుకుంటే నా తాజా సినిమా షూటింగ్ మొదలైంది. కొత్త ప్రయాణం’’ అని పేర్కొన్నారు తివారీ. సాజిద్ నడియాద్వాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లుగా ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని నితేష్ బయటపెట్టలేదు. కానీ సుశాంత్సింగ్ రాజ్పుత్, శ్రద్ధాకపూర్, ప్రతీక్ బబ్బర్, వరుణ్ శర్మ పేర్లు వినిపిస్తున్నాయి. -
పాంచ్ పటాకా!
ధోని బయోపిక్తో బాలీవుడ్లో మంచి బ్రేక్ అందుకున్నారు యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్. ఈ హీరో వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు కానీ ఈ ఏడాది ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా స్క్రీన్పై కనిపించలేదు. సోనాక్షి సిన్హా కథానాయికగా నటించిన ‘వెల్కమ్ న్యూయార్క్’లో చిన్న గెస్ట్ రోల్ చేశారంతే. ఈ ఏడాది కనిపించని గ్యాప్నంతా వచ్చే ఏడాది పూర్తి చేయడానికి ఫిక్స్ అయినట్లున్నారు సుశాంత్. వచ్చే ఏడాది ఏకంగా ఐదు రిలీజ్లతో బాక్సాఫీస్ వద్ద పాంచ్ పటాకా పేల్చనున్నారు. వచ్చే ఏడాది ‘డ్రైవ్, కేథార్నాథ్, సోంచిరియా, కిజీ ఔర్ మ్యానీ, చిచోరా’ సినిమాలతో సందడి చేయనున్నారు. -
స్త్రీలోక సంచారం
ఇండోనేషియాలోని జకార్తాలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్కి అర్హత పొందినప్పటికీ ‘అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎ.ఎఫ్.ఐ.) తనను ఎంపిక చెయ్యకపోవడంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఉత్తరప్రదేశ్ మిడిల్–డిస్టెన్స్ రన్నర్ మోనికా చౌదరికి ఊరట లభించింది. ఏషియన్ గేమ్స్లో అర్హత కోసం గువాహతిలో జరిగిన ఇంటర్స్టేట్ మీట్లో రజత పతకాన్ని పొందినప్పటికీ మీట్ మధ్యలో జ్వరపడి తేరుకున్న కారణంగా తనను ఏషియాడ్కు పంపే క్రీడాకారుల జాబితా నుంచి తొలగించడంతో ఆవేదన చెందిన మోనికా.. కోర్టు తనకు ట్రయల్గా మళ్లీ ఒక పోటీ పెట్టి తన సామర్థ్యం నిరూపించుకోడానికి బుధవారం నాడు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఒక అవకాశం ఇవ్వాలని ఎ.ఎఫ్.ఐ.కి సూచించడంతో భూటన్లో తనిప్పుడున్న నేషనల్ క్యాంప్ నుంచి హుటాహుటిన బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు. పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ కూతురు, ఇరవై ఏళ్ల మోడల్, నటì .. పారిస్ జాక్సన్.. ‘హార్పర్ బజార్’ పత్రిక (సింగపూర్ ఎడిషన్) సెప్టెంబర్ సంచిక ముఖచిత్రంగా ప్రత్యక్షమవడంపై ఆ దేశంలోని ఎల్.జి.బి.టి. హక్కుల ఉద్యమకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆమెనొక ‘కపటి’గా అభివర్ణించడంతో పారిస్ జాక్సన్ క్షమాపణలు చెప్పి, ఇన్స్టాగ్రామ్లో తను పెట్టిన ఆ ముఖచిత్రం ఫొటోలను తొలగించారు. ‘బైసెక్సువల్’ (స్త్రీ,పురుషులిద్దరి ఆకర్షణకూ లోనయ్యే వ్యక్తి) అయిన పారిస్ హిల్టన్.. గే హక్కుల ఉద్యమకారిణి అయి ఉండి కూడా, సేమ్ సెక్స్ ‘భావ’బంధాలను నేరంగా పరిగణించే సింగపూర్ దేశం నుండి వెలువడిన హార్పర్ బజార్ పత్రికకు మోడలింగ్ చెయ్యడంపై విమర్శలు రావడంతో.. తను మరీ అంత లోతుగా అంతగా ఆలోచించలేదని, ఫ్యాషన్పై తనకున్న ఇష్టంతోనే కవర్ పేజీ మోడలింగ్కి అంగీకరించానని వివరణ కూడా ఇచ్చారు. 76 ఏళ్ల వయసులో ఈ ఏడాది ఆగస్టు 16న కన్నుమూసిన ప్రముఖ అమెరికన్ సింగర్, పియానిస్టు అరెథా ఫ్రాంక్లిన్ నివాళి సందర్భంగా ఎం.టి.వి. వీడియో మ్యూజిక్ అవార్డు ఫంక్షన్లో మాట్లాడుతూ పాప్ స్టార్ మడోన్నా.. ఆ పెద్దావిడకన్నా కూడా తన గురించే ఎక్కువగా చెప్పుకున్నారని విమర్శలు వచ్చాయి. దీనిపై మడోన్నా స్పందిస్తూ, ‘‘నిజానికది అరెథా నివాళి కార్యక్రమం కాదని, ‘వీడియో ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ ప్రకటించే వేడుకలో నిర్వాహకులు తనను అరెథాతో ఉన్న జ్ఞాపకాలను పంచుకోమని అడగడంతో తామిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి రెండు నిముషాల్లో ముగించలేకపోయానని’’ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. కేరళ వరద బాధితులను టీవీలో చూసి చలించిన 12 ఏళ్ల తమిళనాడు బాలిక అక్షయ.. రెండున్నర లక్షల రూపాయలు ఖర్చయ్యే తన హార్ట్ సర్జరీ కోసం సోషల్ మీడియా ద్వారా ఇప్పటి వరకు సేకరించిన 20 వేల రూపాయలలోంచి ఐదు వేల రూపాయలను కేరళకు విరాళంగా అందజేసింది! కరూర్ జిల్లా కుమారపాళ్యంలో తల్లితో పాటు ఉంటున్న అక్షయ.. ఆరేళ్ల వయసులోనే రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోగా, ఆమె తల్లి జ్యోతిమణి.. కూతురి గుండె జబ్బుకు వేరే ఆర్థిక ఆసరా లేక.. నవంబరులో జరగవలసిన ఆమె సర్జరీ కోసం తెలిసినవాళ్ల ద్వారా అనేక మార్గాల్లో దాతల్ని ఆశ్రయిస్తోంది. ఉత్తరకాశిలో గతవారం 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, హత్య జరిగిన ఘటనపై స్వచ్ఛందంగా స్పందించిన ఉత్తరాఖండ్ హైకోర్టు.. బాలికలు, యువతులు, మహిళలపై జరుగుతున్న నేరాలను త్వరితగతిన విచారించేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రాగల 48 గంటల్లో శాశ్వత ప్రాతిపదికపై ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’ (సిట్) లను ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. అలాగే ఉత్తరకాశి మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసు విచారణను ప్రభుత్వం తక్షణం ‘సిట్’కు అప్పగించాలని, ‘సిట్’ నాలుగు వారాల్లోపు ఈ కేసులో చార్జిషీటును దాఖలు చేయాలని ఆదేశించింది. బిహార్. భోజ్పూర్ జిల్లాలో బిమలేశ్ అనే 16 ఏళ్ల దామోదర్పూర్ గ్రామ విద్యార్థి, పన్నెండవ తరగతిలో చేరేందుకు దగ్గర్లోని బిహియా గ్రామానికి వెళ్లి, అక్కడి రెడ్ లైట్ ఏరియాలో.. మర్మావయవాల దగ్గర తీవ్ర గాయాలతో నిర్జీవంగా పడి ఉన్న ఘటనలో అక్కడి ఒక మహిళను అనుమానించి, ఆమెను నగ్నంగా ఊరేగించిన మూక ఘటనలో ఆర్.జె.డి. (రాష్ట్రీయ జనతా దళ్) కార్యకర్త సహా 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళను వివస్త్రను చేసి వీధుల్లో తిప్పుతున్నప్పుడు సమయానికి వెళ్లి నిరోధించలేకపోయిన ఆరుగురు పోలీసులు కూడా సస్పెండ్ అయ్యారు. ఆఖరి నిముషంలో ప్రాజెక్టు నుండి తప్పుకున్నందుకు ప్రియాంకా చోప్రాపై ‘భారత్’ సినిమా డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ ఆగ్రహంతో ఉన్నారని వస్తున్న వార్తలపై ఎట్టకేలకు అలీ నోరు విప్పారు. ‘‘ఆమె నా స్నేహితురాలు. తనపై నాకేం కోపం లేదు. ఆమె చేసిన పనికి బాధా లేదు. ‘భారత్’ సినిమా నుంచి చివరి నిముషంలో ప్రియాంక తప్పుకోవడం వల్ల టీమ్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే అయినప్పటికీ, తను తప్పుకోడానికి ప్రియాంక చెప్పిన కారణాలన్నీ సబబుగానే ఉన్నాయి’’ అని ఆయన అన్నారు. ముఖేష్ ఛబ్రా డైరెక్ట్ చేస్తున్న రొమాంటిక్ ‘ట్రాజీకామెడీ’ ఫిల్మ్.. ‘కీజీ అవుర్ మ్యానీ’ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోడానికి హీరో సుశాంత్ సింగ్ రాజ్పు™Œ .. ఆ సినిమా హీరోయిన్ (ఫీల్డులోకి కొత్తగా వచ్చిన అమ్మాయి) అయిన సంజనా సంఘీతో మితిమీరిన చనువు ప్రదర్శించడమే కారణం అని తెలుస్తోంది. గత నెలలో జంషెడ్పూర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సుశాంత్ ‘ఎక్స్ట్రా–ఫ్రెండ్లీ’ ప్రవర్తనకు అసౌకర్యానికి గురయిన సంజనా ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారని, వెంటనే వారు ‘నీకు ఇష్టమైతేనే చెయ్యి’ అనడంతో.. అప్పట్నుంచీ ఆమె షూటింగ్కి అందుబాటులో లేరని బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. -
ధోని బయోపిక్ సీక్వెల్..!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు ఉత్సాహం కలిగించే వార్త ఒకటి బాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది. ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'ఎంఎస్ ధోని - ద అన్టోల్డ్ స్టోరీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో ఎంఎస్ ధోని చిత్రానికి సీక్వెల్ రూపొందించనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ధోని పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి.. ఫ్యాన్స్తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న సుశాంత్ సింగ్ రాజ్పుత్, ఈ చిత్ర సీక్వెల్ కోసం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. 2011లో ప్రపంచకప్ విజయం తర్వాత ధోని జీవితంలోని ముఖ్య ఘట్టాలను సీక్వెల్లో చూపెట్టనున్నట్టు సమాచారం. ధోని వ్యక్తిగత జీవితాన్ని కూడా తెరపై అవిష్కరించే విధంగా సీక్వెల్ను రూపొందించాలని సుశాంత్ భావిస్తున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. మొదటి పార్ట్ మాదిరిగానే ఇందులో కూడా ధోని జీవితంలోని వాస్తవాలను చూపించేలా స్రిప్ట్ వర్క్ జరుగుతుందని వారు వెల్లడించారు. సీక్వెల్కు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ఇంకా ఖారారు కాలేదని పేర్కొన్నారు. ఈ చిత్ర షూటింగ్ వచ్చేడాది ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. కాగా, 2016లో విడుదలైన ఎంఎస్ ధోని చిత్రానికి నీరజ్ పాండే దర్శకత్వం వహించగా, దిశా పటాని, కైరా అద్వానీ ఇతర ముఖ్య పాత్రలో నటించారు. -
'ఎమ్ ఎస్ ధోని' సెంచరీ
భారత క్రికెట్ వీరుడు ఎమ్ ఎస్ ధోని వెండితెర మీద కూడా సెంచరీ కొట్టేశాడు. ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎమ్ ఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరి వంద కోట్ల కలెక్షన్ మార్క్ను అందుకుంది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధోని ఇప్పటికీ డిసెంట్ కలెక్షన్లతో సత్తా చాటుతోంది. ఇప్పటికే 103 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ధోని ముందు ముందు మరిన్ని రికార్డ్లను సాధించే దిశగా సాగుతోంది. ధోని పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించిన ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకుడు. అనుపమ్ ఖేర్, భూమిక, కైరా అద్వానీ, దిశాపఠానీలు ఇతర ప్రధాన పాత్రల్లోనటించిన ధోని సినిమాను అరుణ్ పాండే, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు.