Tarun Bhaskar
-
గీతాభాస్కర్ సమర్పించు సంక్రాంతికి సకినాలు
గీతాభాస్కర్ సినిమాలలో నటిస్తే నటన ఎక్కడా కనిపించదు. పూర్తిగా సహజత్వమే. ఆమె ఏ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లోనూ శిక్షణ తీసుకోలేదు. ‘డెస్టినీస్ చైల్డ్’ అనే పుస్తకం రాస్తే.... ‘పుస్తకం అంటే ఇలా ఉండాలి నాయనా’ అనిపిస్తుంది. ఆమె పెద్ద పుస్తకాలు రాసిన పెద్ద రచయిత్రి కాదు. నటన అయినా రచన అయినా వంట అయినా... ఏదైనా ఇట్టే నేర్చుకోగల సామర్థ్యం గీతమ్మ సొంతం. గీత పుట్టి పెరిగింది చెన్నైలో. అయినప్పటికీ... ఆమె సకినాలు చేస్తే తెలంగాణ పల్లెకి చెందిన తల్లి చేసినంత రుచిగా ఉంటాయి. పెళ్లయిన తరువాత గీత... దాస్యం గీతాభాస్కర్ అయింది. అత్తగారిది పక్కా తెలంగాణ. తెలంగాణ అంటే ది గ్రేట్ సకినాలు. ఇక నేర్చుకోకుండా ఉంటారా! సకినాలు ఎలా చెయ్యాలి... నుంచి ఫ్యామిలి ముచ్చట్ల వరకు ‘సాక్షి’తో పంచుకున్నారు గీతాభాస్కర్. ఆమె మాటల్లోనే.. అరిసెల పిండిలానే సకినాల పిండి కూడా తయారు చేసుకోవాలి. మామూలుగా వరి పిండి అయితే గట్టిగా అయిపోతుంది. పైగా అంతకుముందు వేరే గోధుమ పిండిలాంటివి పట్టి ఉంటే... అదే గిర్నీలో ఈ పిండి పడితే సరిగ్గా ఉండదు. అదే తడి పిండి అనుకోండి వేరే పిండి ఏదీ పట్టరు... బియ్యం పిండి మాత్రమే పడతారు. అయితే అరిసెల పిండికి రోజంతా బియ్యం నానబెట్టాలి. కానీ సకినాలకి నాలుగు గంటలు నానబెడితే సరిపోతుంది.మా ఆయన ఉన్నప్పుడు ముగ్గుల పోటీకి తీసుకుని వెళ్లేవారు. ఒకసారి గవర్నర్ చేతుల మీదగా బహుమతి కూడా అందు కున్నాను. పండగ రోజున మంచి మంచి ముగ్గులు వేస్తుంటాను. నా ముగ్గులన్నీ డిఫరెంట్గా ఉంటాయి. దసరా, సంక్రాంతి అంటే ముగ్గుల పోటీలో నేను పాల్గొనాల్సిందే. ఆయన అలా తీసుకువెళ్లేవారు.– గీతాభాస్కర్ గీతా భాస్కర్ వేసిన ముగ్గునువ్వులు ఎక్కువ వేస్తాసకినాల పిండికి కొలతలు అంటూ ఉండవు. ఒక గ్లాసు పిండికి నేను పావుకిలో నువ్వులు వేస్తాను. నువ్వులు ఎక్కువ వేస్తే గ్యాప్ ఎక్కువ వస్తుంది... పైగా నువ్వుల నుంచి కూడా నూనె వస్తుంది కదా.. బాగా ఉడుకుతుంది. దాంతో సకినం కరకరలాడుతుంది. కొంతమందైతే పచ్చి నువ్వులు వేసేస్తారు. నేను చెన్నై నుంచి వచ్చినదాన్ని కదా... మాకు అక్కడ మురుకులు అలవాటు. అక్కడ వేయించిన నువ్వులు వేస్తారు. నేను సకినాల్లో అలానే వేస్తా. అసలు ఇక్కడికి వచ్చాకే నేను సకినాలు వండటం నేర్చుకున్నాను. సకినాలకి దొడ్డు బియ్యం బాగుంటుంది. నేను దాదాపు రేషన్ బియ్యమే వాడతాను. అవి ఎక్కువ పాలిష్ ఉండవు కాబట్టి సకినాలకి బాగుంటుంది. అలాగే వేరు శెనగ నూనె వాడతాను.అమ్మ వైపు... నాన్న సైడుమా తండ్రి, తల్లివైపు వాళ్లందరూ చెన్నైలో సెటిల్ అయ్యారు. నేను పుట్టింది, పెరిగిందీ అక్కడే. రెండు కుటుంబాల వాళ్లు బిగ్ బిజినెస్ పీపుల్. ఇక మా అమ్మగారివైపు అయితే పూర్తిగా కాస్మోపాలిటన్. ఆవిడ హార్స్ రైడ్ చేసేవారు. చెన్నైలో శివాజీ గణేశన్లాంటి స్టార్స్ ఉండే మలోని స్ట్రీట్లో మా తాత ఉండేవారు. పొలిటికల్గా ఆయనకు చాలా స్ట్రాంగ్ కనెక్షన్స్ ఉండేవి. నెహ్రూగారితో పరిచయం ఉండేది. మా అమ్మ బట్టలన్నీ సినిమా కాస్ట్యూమర్స్ కుట్టేవారు. ఇక నాన్నవైపు పూర్తిగా భిన్నం. వాళ్లు కూడా వ్యాపారవేత్తలే. నాన్న వాళ్లది పప్పుల వ్యాపారం. నాన్నగారి కుటుంబంలో అమ్మాయిలు బయటకు వెళ్లకూడదు... మగవాళ్లతో మాట్లాకూడదు... అలా ఉండేది. నేను ఇటు అమ్మవైపు అటు నాన్నవైపుఇలాంటి కాంబినేషన్లో పెరిగా. మా అమ్మ ఒక్కతే కూతురు. ఆమెకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఒక్కతే కూతురు కావడంతో రాణిలా పెంచారు. నాన్నవాళ్లు పదమూడుమంది. నాన్నమ్మ వాళ్లు బాగా ట్రెడిషనల్. ఇంటికి పెద్ద కోడలిగా అమ్మకి చాలా బాధ్యతలు ఉండేవి. అయితే అమ్మ ఎక్కడిది అక్కడే అన్నట్లుగా తనను మలచుకుంది. అత్తింటి విషయాలు పుట్టింటికి, అక్కడివి ఇక్కడ ఎప్పుడూ చెప్పలేదు. మా నాన్నమ్మ సైడ్లో పూర్తి ట్రెడిషనల్ పిండి వంటలు వండేవాళ్లు. అమ్మ సైడ్ కొంచెం డిఫరెంట్. అలా నాకు అమ్మ వల్ల, నాన్నమ్మ వల్ల వంటలు చేయడం అలవాటైంది. ఇక నేను పెళ్లి చేసుకుని ఇక్కడికి (తెలంగాణ) వచ్చాక పూర్తి భిన్నమైన వంటలు వండాల్సి వచ్చింది.అత్తింట్లోనే సకినాలు నేర్చుకున్నాఅత్తింటికి వచ్చాకే సకినాలు చేయడం నేర్చుకున్నాను. మా అత్తగారైతే అన్ని వంటలు బాగా వండుతావు... ఈ సకినాలు ఎందుకు చేయలేకపోతున్నావు... ఇవి కూడా చేయడం వస్తది అనేవారు. మా పెద్ద ఆడబిడ్డ, చిన్న ఆడబిడ్డ సకినాలు నేర్పించారు. మామూలుగా సకినాలకు ఉల్లికారం బాగుంటుంది. మా తరుణ్ (హీరో–దర్శకుడు– రచయిత తరుణ్భాస్కర్) కాస్త కారంగా తింటాడు. ఉల్లికారం తనకి తగ్గట్టుగా చేస్తాను. అయితే మా అత్తవాళ్లు ఉప్పు, కారం నూరి దానిమీద పచ్చి నూనె వేసేవారు. నేను కాస్త చింతపండు వేస్తాను. పండగకి అరిసెలు కూడా వండుతాను. యాక్చువల్లీ మా అమ్మ బాగా వండేది. నాకు కుదిరేది కాదు. అత్తింటికి వచ్చాక కూడా సరిగ్గా వండలేక΄ోయేదాన్ని. అయితే నా ఫ్రెండ్ వాళ్ల అమ్మ నేర్పించారు. అప్పట్నుంచి అరిసెలు చక్కగా మెత్తగా వండటం నేర్చుకున్నాను. ఇట్లు... బొబ్బట్లుఒకప్పుడు బుట్టలు బుట్టలు పిండివంటలు వండేవాళ్లు. మా ఇంట్లో మా అమ్మమ్మ, నాన్నమ్మ అలా వండటం చూశా. కానీ ఇప్పుడు ఒకట్రెండు కేజీలు వండటానికే కష్టపడిపోతున్నాం. అప్పట్లో పిండి దంచి వండేవాళ్లు. ఇప్పుడు అన్నింటికీ మిషన్ ఉంది. అయినా చేయలేకపోతున్నాం. కానీ బయట కొనుక్కుని తింటే అంత సంతృప్తి ఉండదు. ఇంట్లో వండితే పండగకి ఇంట్లో వండాం అనే తృప్తి ఉంటుంది. కానీ ఎందుకింత శ్రమ తీసుకుంటున్నావని తరుణ్ అంటుంటాడు. ఇప్పుడు తను కూడా బిజీ కాబట్టి హెల్ప్ చేసే వీలుండదు. కానీ నాకు పండగకి ఇంట్లో వండితేనే మనసుకి బాగుంటుంది. పోయిన గురువారం నాకు స్కూల్లో ఓ వర్క్షాప్ ఉంది. అలాగే కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్లు గవర్నమెంట్ సపోర్ట్తో ఓ నాలుగైదు ప్రోగ్రామ్స్ చేయమన్నారు. ఇంకా ‘ఇట్లు బొబ్బట్లు’ అని పిల్లలు తయారు చేస్తుంటారు. వాళ్లు పిలిస్తే వెళ్లాను. మా నాన్నగారు మాతోనే ఉంటారు. ఆయనకు 90 ఏళ్లు. ఆయన్ని చూసుకుంటూ, బయట పనులు చూసుకుని, ఇంటికొచ్చాక పిండి వంటలు మొదలుపెట్టా. ఇలా ఇంట్లో వండుకుంటే ఫీల్గుడ్ హార్మోన్తో మనసు హాయిగా ఉంటుంది. అది మన హెల్త్కి మంచిది. సకినాలు ఈ తరానికి నేర్పుదాంమన యంగర్ జనరేషన్కి మనం స్ఫూర్తిగా ఉండాలనుకుంటాను. ఇప్పుడు మనం వండితే భవిష్యత్తులో అప్పట్లో మన అమ్మ అలా వండేది కదా అనుకుంటారు. సో... యంగర్ జనరేషన్కి మన కల్చర్ అలవాటు చేయాలి. అందుకే మనం ఇంట్లోనే వండాలి. అమ్మ కష్టపడి వంట చేస్తుంటే పిల్లలకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. మా తరుణ్ ఈ మధ్య ఓ రెండు రోజులు ఇంటికి రావడానికి కూడా కుదరలేదు. ఒక సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు. ఆ స్ట్రెస్లో ఉన్నాడు. ఇంటికి వచ్చాక ఒక గిల్ట్తో ‘ఇంకో రెండు మూడు పేజీలు రాయాలమ్మా... అయిపోతుంది’ అన్నాడు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సకినాలు చేయడంలో నాకు హెల్ప్ చేశాడు (నవ్వుతూ). స్ట్రెస్ ఉంటే తరుణ్ ‘చెఫ్’మా తరుణ్కి కూడా వంటలంటే ఇష్టం. నేను చేస్తుంటే వచ్చి చేస్తుంటాడు. నేనేదైనా బాగా వండితే, ఎలా వండావు అని అడిగి తెలుసుకుంటాడు. మా ఇంటి పక్కనే మాకు బాగా పరిచయం ఉన్న ఫ్యామిలీ ఉంది. అలాగే మా ఆఫీసు ఒకటి క్లోజ్ చేశాం... ఆ ఆఫీసులో ఉన్న ఇద్దరు పిల్లలు మా ఇంట్లో ఉంటారు. ఇక ఆ ఫ్యామిలీ, ఈ పిల్లలు అందరూ కలిసి చేస్తుంటాం. మా నాన్న కూడా సలహాలు ఇస్తుంటారు. మా తరుణ్కి చాలా స్ట్రెస్ ఉండిందనుకోండి... అప్పుడు వంట చేస్తాడు. నా వంటిల్లు మొత్తం హైజాక్ అయి΄ోతుంది (నవ్వుతూ). వాడి బర్త్డేకి వాడికి తెలియకుండా వంటల బుక్ రాసి, గిఫ్ట్గా ఇచ్చాను. ఈ తరానికి నేర్పుదాంమన యంగర్ జనరేషన్కి మనం స్ఫూర్తిగా ఉండాలనుకుంటాను. ఇప్పుడు మనం వండితే భవిష్యత్తులో అప్పట్లో మన అమ్మ అలా వండేది కదా అనుకుంటారు. సో... యంగర్ జనరేషన్కి మన కల్చర్ అలవాటు చేయాలి. అందుకే మనం ఇంట్లోనే వండాలి. అమ్మ కష్టపడి వంట చేస్తుంటే పిల్లలకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. మా తరుణ్ ఈ మధ్య ఓ రెండు రోజులు ఇంటికి రావడానికి కూడా కుదరలేదు. ఒక సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు. ఆ స్ట్రెస్లో ఉన్నాడు. ఇంటికి వచ్చాక ఒక గిల్ట్తో ‘ఇంకో రెండు మూడు పేజీలు రాయాలమ్మా... అయిపోతుంది’ అన్నాడు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సకినాలు చేయడంలో నాకు హెల్ప్ చేశాడు (నవ్వుతూ). -
Vijay Devarakonda: మాది ఎయిర్ఫోర్స్ బ్యాచ్
‘ఎయిర్ఫోర్స్ బ్యాచ్’ నుంచి ఎయిర్ బస్ దాకా... ఆఫర్లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్న రోజుల నుంచి, ఫైవ్స్టార్ ఫుడ్ ఆర్డర్ చేసుకునే రోజుల దాకా... రెండు ఐదు రూ΄ాయల కాయిన్స్ కోసం వెతికిన రోజుల నుంచి కోట్లు లెక్క పెట్టుకునే రోజుల దాకా... ఇద్దరూ విజయప్రయాణాలు చేశారు. ఇండస్ట్రీలో నిలిచారు. విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్... ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ‘ఫ్రెండ్షిప్ డే’ సందర్భంగా వీరి స్నేహంలోని ముచ్చట్లను ‘సాక్షి’తో తరుణ్ భాస్కర్ ప్రత్యేకంగా పంచుకున్నారు.→ విజయ్తో మీ స్నేహం మొదలైన రోజులను షేర్ చేసుకుంటారా? తరుణ్ భాస్కర్: మహేశ్వరి చాంబర్స్లో నాకో ఆఫీస్ ఉండేది. వెడ్డింగ్ ఫిల్మ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్లం. 2011 అనుకుంటా. ఆ టైమ్లో థియేటర్ ఆర్టిస్ట్స్ని కలిసేవాడిని. అప్పుడే విజయ్ని కలిశా. పరిచయం బాగా పెరిగింది. ‘డబ్బులు ఉన్నా లేక΄ోయినా ఫర్వాలేదు... షార్ట్ ఫిల్మ్స్ చేసేద్దాంరా’ అని విజయ్ కాన్ఫిడెంట్గా అనేవాడు. ఒక షార్ట్ ఫిల్మ్ కూడా అనుకున్నాం కానీ కుదరలేదు. ఫైనల్లీ ‘పెళ్ళి చూపులు’ సినిమా చేశాం. అప్పట్లో మాది ఎయిర్ఫోర్స్ బ్యాచ్ (ఖాళీగా తిరిగేవాళ్లను అలా అంటుంటారు). ఇక ‘పెళ్ళి చూపులు’ని ఒక ΄్యాషన్తో చేశాం. నా వల్ల విజయ్కి హిట్ వచ్చింది.. విజయ్ వల్ల నాకు అనే ఫీలింగ్ లేదు. సాధించాం అనే ΄÷గరు లేదు. మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసుకుంటూ చేశాం. మా ΄్యాషన్కి దక్కిన సక్సెస్ అనుకుంటాను. → మీ జర్నీ ఇంతదాకా వచ్చిన విషయాన్ని అప్పుడప్పుడూ మాట్లాడుకుంటారా?కోవిడ్ టైమ్లో విజయ్ ఫోన్ చేసి, ‘అరేయ్... మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం... ఇంత దూరం వచ్చాం.. అస్సలు అనుకోలేదు కదరా... లైఫ్లో ఒక్కో ΄ాయింట్ ఎలా టర్న్ అయిందో కదా. దీన్నే డెస్టినీ అంటారు’ అని మాట్లాడుకున్నాం. → అప్పట్లో మీ ఇద్దరూ డబ్బులు లేక ఇబ్బంది పడేవారా? డబ్బులు ఇచ్చి పుచ్చుకునేవారా? డబ్బులంటే... ఒకరికొకరు ఇచ్చుకునే రేంజ్ ఎవరికీ ఉండేది కాదు. అయితే కలిసి బిజినెస్ చేద్దామని అనుకునేవాళ్లం. నాకు బాగా గుర్తున్న ఇన్సిడెంట్ ఏంటంటే... ఒకసారి ఏదో కొనడానికి విజయ్ని పది రూ΄ాయలు అడిగాను. అప్పుడు ‘పెళ్ళి చూపులు’ సినిమా ట్రైల్ జరుగుతోంది. కారులో రెండు ఐదు రూ΄ాయల బిళ్లల కోసం ఇద్దరం బాగా వెతికాం... దొరకలేదు (నవ్వుతూ). ఆ పరిస్థితి ఎప్పటికీ గుర్తుంటుంది. → మీ ఇద్దరి కుటుంబాల మధ్య అనుబంధం? మేమంతా ఒక ఫ్యామిలీ అని మా ఇద్దరి ఇంట్లోనూ అనుకుంటారు. విజయ్ నాన్న ఎలాంటి ఫిల్టర్ లేకుండా నాతో మాట్లాడతారు... టైమ్ వేస్ట్ చేస్తున్నావని తిడుతుంటారు. ఆ ప్రేమ నాకు నచ్చుతుంది. అలాగే మా అమ్మ చేసే బిర్యానీ విజయ్కి చాలా ఇష్టం. మా ఇంటికి వచ్చినప్పుడు డైట్ అంతా గడప దగ్గరే పెట్టి లోపలికి వస్తాడు. → మీరు, విజయ్ గొడవలు పడిన సందర్భాలు... ‘పెళ్ళి చూపులు’ అప్పుడు గొడవపడేవాళ్లం. నాకు ఎవరైనా సలహాలిస్తే నచ్చేది కాదు. ఇలా చేస్తే బాగుంటుందని క్రియేటివ్గా కొన్ని చెప్పేవాడు విజయ్. అక్కడ గొడవలు పడేవాళ్లం. ఫైనల్గా విజయ్ నాన్న సాల్వ్ చేశారు. రేయ్.. వాడు చెప్పిన మాట విను అని విజయ్తో వాళ్ల నాన్న అంటే, ఓకే డాడీ అన్నాడు. నీ డైరెక్షన్ నీది.. నా యాక్టింగ్ నాది అని ఫిక్స్ అయి, గొడవలు మానేశాం. ఇప్పుడు కూడా ఎలాంటి కథలతో సినిమాలు చేయాలి? కమర్షియల్గా ఎలా చేయాలి? అని చర్చించుకుంటాం. విజయ్ బాలీవుడ్ వరకూ వెళ్లాడు కాబట్టి తన ఫీడ్బ్యాక్ బాగుంటుంది. తనకు చాలా అవగాహన ఉంది. → ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం... బాధలో పెట్టుకున్నవి చాలా ఉన్నాయి. కానీ ‘పెళ్ళి చూపులు’ సక్సెస్కి ఎమోషనల్ అయ్యాం. అప్పుడు విజయ్ది, నాది బ్యాడ్ సిట్యువేషన్... నిరాశలో ఉన్నాం. మా ఇంట్లో పరిస్థితులు బాలేదు. మా నాన్న సంవత్సరీకం కూడా. ఆ టైమ్లో వచ్చినన్ని అప్స్ అండ్ డౌన్స్ మాకెప్పుడూ రాలేదు. ఆ పరిస్థితుల్లో చేసిన సినిమా హిట్ కావడంతో ఎమోషన్తో కన్నీళ్లు వచ్చాయి. → విజయ్తో మళ్లీ సినిమా ఎప్పుడు? విజయ్ నా ట్రంప్ కార్డ్. గేమ్లో ఎప్పుడైనా కొంచెం అటూ ఇటూ అయితే ఆ ట్రంప్ కార్డ్ వాడుకుంటా. ఆ టైమ్ దగ్గరికొచ్చింది. నాక్కూడా ఎక్కువమంది ఆడియన్స్కి రీచ్ కావాలని ఉంది. మా కాంబినేషన్లో సినిమా ఉంటుంది. → విజయ్ లాంటి ఫ్రెండ్ ఉండటం గురించి? విజయ్ ప్రతి సక్సెస్లో నా విజయం ఒకటి కనబడుతుంటుంది. తను నా హోమ్ బాయ్... నా డార్లింగ్. విజయ్ అవుట్సైడర్గా ఇండస్ట్రీకి వచ్చి, ఆ స్టేటస్కి రావడమనేది చాలామందికి ఆదర్శంగా ఉంటుంది. కొన్నేళ్ల తర్వాత కూడా ఆ అచీవ్మెంట్ గురించి మాట్లాడుకుంటారు. విజయ్ జర్నీలో నేనో చిన్న ΄ార్ట్ అవడం గర్వంగా ఉంటుంది.మీ ఫస్ట్ సినిమాలో విజయ్ని ‘పెళ్ళి చూపులు’కి పంపించారు. మరి రియల్ లైఫ్లో విజయ్ని పెళ్లి కొడుకుగా చూడాలని లేదా? కచ్చితంగా ఉంది. మా మధ్య ఆ విషయం గురించి చర్చకు వస్తుంటుంది. కానీ అవి వ్యక్తిగతం కాబట్టి బయటకు చెప్పలేను. అయితే నాకు హండ్రెడ్ పర్సంట్ విజయ్ని ఫ్యామిలీ మేన్గా చూడాలని ఉంది. ఎందుకంటే తనలో మంచి ఫ్యామిలీ మేన్ ఉన్నాడు. మంచి భర్త, తండ్రి కాగలుగుతాడు. విజయ్ ఆ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. నా ఫ్రెండ్ పక్కా ‘జెంటిల్మేన్’.మీ బాయ్స్కి ‘అడ్డా’ ఉంటుంది కదా...అప్పట్లో మీ అడ్డా ఎక్కడ? నెక్లెస్ రోడ్, మహేశ్వరి చాంబర్స్ దగ్గర చాయ్ బండి, ఆ పక్కన చైనీస్ ఫుడ్ సెంటర్. అక్కడే ఏదొకటి తింటూ సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఆ మధ్య అటువైపు వెళ్లినప్పుడు ఆ చాయ్ కేఫ్ దగ్గర థమ్సప్ లోగోలో విజయ్ థమ్సప్ తాగే ఫొటో కనిపించింది. అది ఫొటో తీసి, విజయ్కి పంపిస్తే ఎక్కడరా ఇది అని అడిగాడు. మనం ఒకప్పుడు కూర్చున్న కేఫ్ దగ్గర అన్నాను. మాకు అదో ఎమోషనల్ మూమెంట్. ఇక అప్పట్లో ఎక్కడ ఆఫర్లో ఫుడ్ ఉంటే అక్కడ తినేవాళ్లం (నవ్వుతూ). ఇప్పుడు ఆ ప్లేసెస్కి అంత ఫ్రీగా వెళ్లలేం. అందుకే ఇప్పుడు మాస్క్ లేకుండా సూపర్ మార్కెట్కి వెళ్లి ఓ ΄ాల ΄్యాకెట్ కొనుక్కురా దమ్ముంటే అని విజయ్తో అంటుంటాను. అది మాత్రం నా వల్ల కాదురా అంటాడు.మా కల ఒకటే– విజయ్ దేవరకొండమేం ఇద్దరం చిన్నప్పట్నుంచి కలిసి పెరిగినవాళ్లం కాదు... ఒకే స్కూల్లో చదువుకున్నవాళ్లమూ కాదు. నేను పుట్టపర్తిలో, తరుణ్ హైదరాబాద్లో చదువుకున్నాడు. ఎక్కడెక్కడో పెరిగినప్పటికీ మా ఇద్దరి కల (సినిమా) ఒకటే. నా ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా చూసి, తరుణ్ నాతో ‘పెళ్ళి చూపులు’ సినిమా చేద్దాం అనుకున్నాడు. అప్పుడప్పుడే మా పరిచయం బలపడుతోంది. జేబులో రూ΄ాయి లేక΄ోయినా చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్లం. ఎంతో నమ్మకంగా ‘పెళ్ళి చూపులు’ చేసి, సక్సెస్ అయ్యాం. ఆ సినిమా తర్వాత తరుణ్కి చాలా అవకాశాలు వచ్చినా, మళ్లీ కొత్తవాళ్లతోనే చేద్దాం అనుకున్నాడు. తన మీద, తన స్క్రిప్ట్ మీద తనకు చాలా నమ్మకం. తరుణ్లో ఆ విషయం నాకు చాలా నచ్చుతుంది. ఏదైనా స్క్రిప్ట్తో నా దగ్గరకు రారా అంటుంటాను... వస్తా అంటాడు. ఎక్కడో స్టార్ట్ అయి, చాలా దూరం వచ్చిన మా ఈ జర్నీలో ఎన్నో కష్టాలు చూశాం... ధైర్యంగా ఎదుర్కొన్నాం. గొప్పగా ఏదో చేస్తాం అనే నమ్మకంతో ఉండేవాళ్లం. మాతో ΄ాటు మా ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతూ వచ్చింది. లైఫ్లో ఒక మంచి ఫ్రెండ్ ఉండటం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది.– డి.జి. భవాని -
ఆవకాయ తాండ్ర...
‘అప్పడప్పడ తాండ్ర ఆవకాయ తాండ్ర...’ అంటూ చిందేశారు దర్శకుడు తరుణ్ భాస్కర్. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ‘మంగళవారం’ చిత్రంలోని పాట ఇది. పాయల్ రాజ్పుత్, అజ్మల్ అమీర్ జంటగా స్వాతీ రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మించారు. బి. అజనీష్ లోక్నాథ్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘అప్పడప్పడ తాండ్ర...’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు. తరుణ్ భాస్కర్, గణేష్ ఎ. రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ ప్రత్యేక పాటలో తరుణ్ భాస్కర్ నటించడం విశేషం. ‘‘తరుణ్ భాస్కర్ గెటప్, లుంగీలో డాన్స్ చేయడం ఈ పాట ప్రత్యేకత. కోనసీమలోని ఓ పల్లెటూరిలో చిత్రీకరించిన ఈ పాట పల్లె ప్రజల మధ్య సంభాషణలు, ఊరిలో పరిస్థితులను తెరపై ఆవిష్కరించేలా ఉంటుంది’’ అన్నారు అజయ్ భూపతి. -
కీడా కోలా నవ్విస్తుంది
తరుణ్ భాస్కర్ కథ అందించి, నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కీడా కోలా’. బ్రహ్మానందం, చైతన్యా రావు, రాగ్ మయూర్, విష్ణు, రవీంద్ర విజయ్, రఘురామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నటుడు – నిర్మాత రానా సమర్పణలో కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 3న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ను రిలీజ్ చేసిన రానా మాట్లాడుతూ– ‘‘తాము అనుకున్న కథను బలంగా నమ్మి, కథ... కథనానికి కట్టుబడి సినిమాలు చేసే తరుణ్ భాస్కర్ వంటి ఫిల్మ్ మేకర్స్ చాలా అరుదుగా ఉంటారు. ‘కీడా కోలా’ చూసి నవ్వుకున్నాను. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. నేను హీరోగా చేసే సినిమాల అప్డేట్స్ త్వరలో తెలుస్తాయి. అలాగే అరవై ఏళ్లుగా ఉన్న సురేష్ ్ర΄÷డక్షన్స్లో చాలా సినిమాల రీమేక్స్ రైట్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి నేను ఏ రీమేక్ చేయడం లేదు. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ తో నాకు ఉన్న అసోషియేషన్ ఏంటి? అనేది త్వరలో తెలుస్తుంది’’ అన్నారు. ‘‘లాక్డౌన్ టైమ్లో డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా డ్రింక్లో ఓ కీడా ఉంటే కన్జ్యూమర్ కేసు వేసి, కోట్లు సంపాదించవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. అలా క్రైమ్ కామెడీగా ‘కీడా కోలా’ కథను కొత్తగా రెడీ చేసుకున్నాను. వెంకటేశ్గారితో సురేష్ ప్రొడక్షన్స్లో నేను చేయాల్సిన సినిమా కథ సెకండాఫ్ వర్క్ చేస్తున్నాను’’అన్నారు. ‘‘తరుణ్ భాస్కర్తో సినిమా చేయాలన్న నా కల నేరవేరింది’’ అన్నారు చైతన్యా రావు. ‘‘ప్రేక్షకులు ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు నిర్మాతలు. -
ఆ రోజు కీడా కోలా
‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాల ఫేమ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ నటించి, తెరకెక్కించిన తాజా చిత్రం ‘కీడా కోలా’. క్రైమ్ కామెడీ జానర్లో రూపొందిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్ లీడ్ రోల్స్ చేశారు. కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీసాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమా నటుడు–నిర్మాత రానా సమర్పణలో నవంబరు 3న విడుదల కానున్నట్లుగా చిత్ర యూనిట్ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాకు సంగీతం: వివేక్ సాగర్ -
వస్తున్నాం!
‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాల తర్వాత దర్శక–నటుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘కీడా కోలా’. ఈ చిత్రంలో బ్రహ్మానందం, రఘు రామ్, రవీంద్ర విజయ్, చైతన్య రావు మాదాడిలతో పాటు తరుణ్ భాస్కర్ కూడా ఓ లీడ్ రోల్ చేశారు. కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీ పాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించారు. వినోదాత్మక పాత్రలో బ్రహ్మానందం, లోకల్ డాన్గా తరుణ్ భాస్కర్ కనిపిస్తారు. సినిమా షూటింగ్ పూర్తయింది. బుధవారం టీజర్ రిలీజ్ చేశారు. ఏంట్రా అది (బ్రహ్మానందం), గ్రేప్స్.. ఏమో (మరో పాత్రధారి).. గ్రేప్.. గ్రే΄్సా... ఎలా బతికావురా ఇన్నాళ్లు నువ్వు...(బ్రహ్మానందం), నువ్వు బతుకుతా లేవా..అట్లనే... (మరో పాత్రధారి) అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. అలాగే టీజర్ చివర్లో ‘శ్వాస మీద ధ్యాస.. వస్తున్నాం’ అని కూడా కనిపించింది. -
నేను డైరెక్టర్ కాకపోయుంటే మంచి చెఫ్ను అయ్యేవాడిని...
డైరెక్టర్ కాకపోతే ఏమయ్యేవారు? నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. నేను డైరెక్టర్ కాకపోతే మంచి చెఫ్ని అయ్యేవాడిని. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన రంగంలోకి అడుగుపెట్టాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలి. బీటెక్ చదువుతుండగా స్టడీపై ఆసక్తి లేదని నా మిత్రుడు కౌశిక్కు చెప్పగా స్టోరీలు రాయమన్నాడు. ఆవిధంగా షార్ట్ఫిల్మ్లతో మూవీస్లోకి వచ్చాను. మీకిష్టమైన డైరెక్టర్, మీ రాబోయే సినిమాలు? నాకు మణిరత్నం, సింగీతం శ్రీనివాస్ అంటే చాలా ఇష్టం. క్రైమ్ కామెడీతో నేను కీడాకోయి ల పేరుతో ఓ సినిమా చేస్తున్నాను. ‘పెళ్లి చూ పులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాల కంటే విభిన్నంగా ఉంటుంది. ఇందులో బ్రహ్మానందం ప్రత్యేకంగా కనిపించనున్నారు. ఇటీవలి కాలంలో మీకు నచ్చిన సినిమా? నాకు బలగం సినిమా బాగా నచ్చింది. మన సంస్కృతి సంప్రదాయాలను తెలంగాణ యాస కట్టిపడేసింది. కొత్త వారు చేసే సినిమాలను తప్పకుండా ఆదరించండి. నాకు నచ్చిన హీరో హీరోయిన్లు జూనియర్ ఎన్టీఆర్, మహేష్బాబు, సమంత. సినీ రంగంలోకి ఎలా అడుగుపెట్టాలి? సినీ రంగంలోకి రావాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. ఇంటర్నెట్లో అన్ని అందుబాటులో ఉన్నాయి. ట్రెయినింగ్ పేరిట డబ్బులు ఖర్చు పెట్టకుండా గూగుల్, యూట్యూబ్లో నేర్చుకుంటే చాలు. -
‘దాస్ కా ధమ్కీ’ మూవీ రివ్యూ
టైటిల్: దాస్ కా ధమ్కీ నటీనటులు: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేశ్, రోహిణి, తరుణ్ భాస్కర్, హైపర్ ఆది, మహేశ్ తదితరులు నిర్మాణ సంస్థ: విశ్వక్ సేన్ సినిమాస్ నిర్మాత: విశ్వక్ సేన్ దర్శకత్వం: విశ్వక్ సేన్ సంగీతం: లియోన్ జేమ్స్ సినిమాటోగ్రఫీ: దినేష్ బాబు విడుదల తేది: మార్చి 22, 2023 టాలీవుడ్లో బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత ఫలక్నుమా దాస్లో నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ యంగ్ హీరోకి ఈ మధ్య కాలంలో మాత్రం సరైన హిట్ పడలేదు. మాస్ ఇమేజ్ని పక్కన పెట్టి నటించిన పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఈ సారి తనకు అచ్చొచ్చిన మాస్ జోనర్ని ఎంచుకున్నాడు. ఆయన హీరో గా నటిస్తూనే డైరెక్టర్ గా, నిర్మాతగా మారి ‘మాస్ కా ధమ్కీ’ తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో పాటు.. సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో ‘మాస్ కా ధమ్కీ’పై బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కృష్ణ దాస్ ( విశ్వక్ సేన్) ఓ అనాథ. స్నేహితులు ఆది(హైపర్ ఆది), మహేశ్(రంగస్థలం మహేశ్)లతో కలిసి ఉంటూ.. ఓ స్టార్ హోటల్లో వెయిటర్గా పని చేస్తుంటాడు. అక్కడికి కస్టమర్గా వచ్చిన కీర్తి(నివేదా పేతురాజ్)తో తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెను ప్రేమలో దింపడానికి కోటీశ్వరుడిలాగా నటిస్తాడు. కట్ చేస్తే.. అచ్చం కృష్ణదాస్ లాగే ఉండే సంజయ్ రుద్ర(విశ్వక్ సేన్) ఎస్సార్ ఫార్మా కంపెనీ స్థాపించి, క్యాన్సర్ని పూర్తిగా తగ్గించే డ్రగ్ కనిపెట్టడం కోసం తన బృందంతో కలిసి పోరాతుంటాడు. డ్రగ్ కోసం వ్యాపారవేత్త ధనుంజయ్(అజయ్)తో రూ. 10 వేల కోట్లు డీల్ కుదుర్చుకుంటాడు. ఓ కారణంగా సంజయ్ రుద్ర ప్లేస్లోకి కృష్ణదాస్ వస్తాడు. తన అన్న కొడుకు సంజయ్లా నటించమని స్వయంగా అతని బాబాయ్(రావు రమేశ్)కృష్ణదాస్ని తీసుకొస్తాడు. అతను ఎందుకు అలా చేశాడు? సంజయ్ ప్లేస్లోకి వచ్చాక కృష్ణదాస్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? డ్రగ్ కోసం సంజయ్ రుద్ర ఏం చేశాడు? అతని వేసిన ప్లాన్ ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే థియేటర్లో ‘దాస్క్ కా ధమ్కీ’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈ సినిమాకు కథ అందించింది బెజవాడ ప్రసన్న కుమార్. పాత కథలనే అటు ఇటు మార్చి దానికి కొత్త ట్రీట్మెంట్ ఇచ్చి స్క్రీన్ప్లేతో మాయ చేయడం ప్రసన్న కుమార్కు బాగా అలవాటు. మొన్నటి బ్లాక్ బస్టర్ ‘ధమాకా’ చిత్రంలోనూ ఇదే చేశాడు. ఇప్పుడు మాస్క్ కా ధమ్కీలో కూడా అదే పని చేశాడు. తెలిసిన కథనే కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ఒకరి ప్లేస్లోకి ఒకరు రావడం... చివర్లో వచ్చే ట్విస్టులు.. ఇవన్ని ‘ధమాకా’, ‘ఖిలాడీ’తో పాటు ఇంతకు ముందు వచ్చిన చాలా తెలుగు సినిమాలను గుర్తుకు చేస్తాయి. ఇక లాజిక్స్ గురించి అసలే మాట్లాడొద్దు. కొన్ని ట్విస్టులకు కూడా ప్రేక్షకులు ఈజీగా పసిగడతారు. అలా అని సినిమా మొత్తం ఊహకందేలా రొటీన్గా సాగుతుందని చెప్పలేం. కొన్ని చోట్ల వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్లో కృష్ణదాస్ క్యారెక్టర్ చాలా ఫన్నీగా సాగుతుంది. కీర్తితో ప్రేమాయణం రొటీన్గా ఉన్నప్పటికీ.. మధ్య మధ్యలో ఆది వేసే పంచులతో పర్వాలేదనిపిస్తుంది. ఇక సెకండాఫ్ను మాత్రం వరుస ట్విస్టులతో ప్లాన్ చేశారు. అయితే వాటిలో కొన్ని ప్రేక్షకుడిని ఆశ్చర్యానికి గురి చేయకుండా.. సహనానికి పరీక్షగా మారాయి. తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా ఊహించొచ్చు. చాలా చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. కొత్తదనం కోరుకోకుండా..కాస్త కామెడీగా ఉంటే చాలు అనుకునేవాళ్లకి ‘దాస్ కా ధమ్కీ’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాతో నటన పరంగా విశ్వక్ సేన్ ఒక మొట్టు ఎక్కాడు. వెయిటర్ కృష్ణదాస్, డాక్టర్ సంజయ్ రుద్ర రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన విశ్వక్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ఒకవైపు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను వహిస్తూ.. ఇంత చక్కగా నటించిన విశ్వక్ సేన్ని అభినందించొచ్చు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సీన్లలో కూడా చక్కగా నటించాడు. కీర్తి పాత్రకు నివేదా పేతురాజ్ న్యాయం చేసింది. సెకండాఫ్లో ఆమె ఇచ్చే ట్విస్ట్ బాగుంటుంది. సంజయ్ బాబాయ్గా రావు రమేశ్ తనదైన నటనతో మెప్పించాడు. హీరో స్నేహితులుగా ఆది, రంగస్థలం మహేశ్ల కామెడీ బాగుంది. ఒక తరుణ్ భాస్కర్ పాత్ర నిడివి చాలా తక్కువే అయినప్పటికీ.. మహేశ్, అతని మధ్య వచ్చే సీన్ బాగా పేలింది. రోహిణి, అజయ్, అక్షరా గౌడ, పృథ్విరాజ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం బాగుంది. రామ్ మిరియాల సంగీతం అందించిన 'మావా బ్రో' తో పాటు మిగిలిన పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటర్ల పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
'వరదరాజు' పాత్రలో బ్రహ్మానందం.. స్పెషల్ పోస్టర్ రిలీజ్
తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘కీడా కోలా’. ఎనిమిది ప్రధాన పాత్రలతో ఈ మూవీ రూపొందుతోంది. వారిలో బ్రహ్మానందం ఒక కీలక పాత్ర చేస్తున్నారు. బుధవారం బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ‘మీ ప్రపంచం వింతగా మారబోతోంది’ అని పోస్టర్పై క్యాప్షన్ ఇచ్చారు. ‘‘ప్రతి ఇంట్లో ఉండే తాత పాత్రలో (వరదరాజు) బ్రహ్మానందంగారు కనిపిస్తారు’’ అన్నారు తరుణ్ భాస్కర్. Bhascker meets Bramhi.#keedaacola #Brahmanandam pic.twitter.com/PvOB0j3Dlw — Tharun Bhascker Dhaassyam (@TharunBhasckerD) February 1, 2023 -
కరోనా వచ్చింది ఫ్రెండ్స్.. సీరియస్గా తీసుకోండి : డైరెక్టర్
టాలీవుడ్ ఇండస్ట్రీని కరోనా వదలడం లేదు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్కు సైతం కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. నాకు కరోనా వచ్చింది ఫ్రెండ్స్. రెస్ట్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. కరోనాను సీరియస్గా తీసుకోండి ఫ్రెండ్స్ అంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు. 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పాపులారిటీని సంపాదించుకున్న తరుణ్ భాస్కర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. గతంలో వెంకటేశ్తో ఓ సినిమా చేయనున్నారన్న వార్తలు వచ్చినా కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం సెట్స్ మీదకి వెళ్లలేదు. -
లైంగిక ఆరోపణలు: క్లారిటీ ఇచ్చిన విశ్వక్ సేన్
2017లో 'వెళ్లిపోమాకే' చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు విశ్వక్ సేన్. తొలి సినిమాతోనే సైమా అవార్డు కొట్టేసిన ఈ యంగ్ హీరో 'ఫలక్నుమా దాస్'తో దర్శకుడు, రచయిత, సహ నిర్మాతగా అవతారం ఎత్తాడు. ఈ సినిమాతో పాటు ఆ తర్వాత వచ్చిన 'హిట్' కూడా ప్రేక్షకులను మెప్పించడంతో యూత్ ఫేవరెట్ స్టార్గా నిలిచాడీ యంగ్ హీరో. ఇదిలా వుంటే విశ్వక్ సేన్ తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తన అసలు పేరు దినేశ్ కార్తీక్ అని, జాతకాల ప్రకారం దాన్ని విశ్వక్ సేన్గా మార్చుకున్నట్లు తెలిపాడు. ఇది బెంగాలీ పేరు అని, తండ్రే స్వయంగా తనకు ఈ పేరు మార్చాడని పేర్కొన్నాడు. నిజానికి తనకు ఓ వైపు నటించడంతో పాటు దర్శకత్వం చేయాలనే ఆలోచన 7వ తరగతిలోనే పురుడు పోసుకుందని చెప్పుకొచ్చాడు. అయితే ఇండస్ట్రీకి వచ్చాక తనలాంటి కొత్తవాడిని పెట్టుకుని సినిమా ఎవరు తీస్తారని, అందుకే సొంతంగా సినిమా చేయాలనుకున్నాని మనసులోని మాటను బయటపెట్టాడు. కానీ ఆ సమయంలో తరుణ్ భాస్కర్.. 'ఈ అబ్బాయి బాగున్నాడు, పిలవండి' అని చెప్పడంతో తరుణ్ను కలిశాడు విశ్వక్. అప్పుడు ఆయన 'ఫలక్నుమాదాస్ తీస్తున్నావంట కదా, మరి నా సినిమా చేస్తావా?' అని అడిగాడు. అవకాశం తనను వెతుక్కుంటూ రావడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన విశ్వక్.. 'మీరు సినిమా చాన్స్ ఇస్తే నా సినిమా ఆపేస్తా' అని చెప్పాడు. ఆ ఒక్క మాటతో తరుణ్కు అతడి మీద ఎనలేని నమ్మకం కలిగింది. అలా 'ఈ నగరానికి ఏమైంది?' సినిమాలో అవకాశం వచ్చింది. కానీ అతడి ఆశల మీద నీళ్లు చల్లుతూ.. విశ్వక్ అసలు మంచివాడు కాదంటూ తరుణ్కు ఓ మెయిల్ వచ్చింది. 'విశ్వక్ సేన్ నాకు మత్తు మందు ఇచ్చి, నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నా పరిస్థితి ఏ హీరోయిన్కీ రావద్దు. మీరు వాడిని సినిమాలో పెట్టుకుంటే మీడియా ముందుకెళ్లి ఏం చేయాలో నాకు తెలుసు' అంటూ వార్నింగ్ ఇచ్చిందో అమ్మాయి. ఇది తెలిసిన విశ్వక్.. ఇదంతా తను అంటే గిట్టనివాళ్లు చేశారని భావించాడు. ఎవరో కుట్ర పన్ని కావాలని ఇదంతా చేశాడని నిరూపించాడు. అలా తరుణ్ దర్శకత్వంలో 'ఈ నగరానికి ఏమైంది?' సినిమాలో నటించాడు. చదవండి: నీ మీద ఒట్టు, చచ్చిపోతా: విశ్వక్సేన్కు బెదిరింపులు -
కొన్ని కథలు ఇక్కడే చెప్పాలి!
నెట్ఫ్లిక్స్ నిర్మించిన యాంథాలజీ చిత్రం ‘పిట్ట కథలు’. నాలుగు కథలున్న ఈ యాంథాలజీను తరుణ్ భాస్కర్, నందినీ రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు. లక్ష్మీ మంచు, జగపతి బాబు, అమలాపాల్, శ్రుతీహాసన్, ఈషా రెబ్బా, సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 19 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ కానున్న ఈ యాంథాలజీ ట్రైలర్ నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు ఈ నలుగురు దర్శకులు. నందినీ రెడ్డి మాట్లాడుతూ – ‘ఓటీటీలో ఎక్కువ శాతం వీక్షకులు ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనే అని సర్వేలో ఉంది. పెనం మీద నీళ్లు వేస్తే ఆవిరైపోయినట్టు అయిపోతుంది కంటెంట్. ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ లేదు. ఆ డిమాండ్ చాలా ఉంది. ఓటీటీ అవకాశం వచ్చినప్పుడు ఆడియన్స్ చూస్తారా? చూడరా? అని ఆలోచించలేదు. కొత్త ఫార్మాట్లో కథ చెప్పగలుగుతున్నాం అని ఎగ్జయిట్ అయ్యాను. మమ్మల్ని మేం టెస్ట్ చేసుకోవచ్చు అనిపించింది. కొత్తదారిలో వెళ్లొచ్చు అనిపించింది. ఎంత సమయంలో కథ చెబుతున్నాం అనేది చాలెంజ్ కాదు అనిపించింది. యాడ్ ఫిల్మ్లోనూ ఒక కథ చెప్పొచ్చు. 30 నిమిషాల్లో కథ చెప్పడం బావుంది’’ అన్నారు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘సినిమా అంటే సినిమా కథకు ఇది సరిపోతుందా? సరిపోదా అని ఆలోచించుకోవాలి. కానీ చాలా కథలు 20–30 నిమిషాల్లో చెప్పేవి ఉంటాయి. దాన్ని సినిమాగా చేయలేం. ఇలాంటి యాంథాలజీల్లో, డిజిటల్లో ఈ కథలు చెప్పొచ్చు. ఇది చాలా బాగా అనిపించింది. ఈ యాంథాలజీ చేస్తూ దర్శకులుగా మమ్మల్ని మేం కనుగొన్నాం అనిపించింది. ఇది భారీ మార్పుకు దారి తీస్తుంది. మనం కథల్ని చెప్పే విధానంలో మార్పు వస్తుంది. ఇలాంటి అవకాశాలు అప్పుడప్పుడే వస్తాయి. ధైర్యం చేసేయాలి. మేం చేశాం. ఇలా చేసినప్పుడు కచ్చితంగా కొత్త విషయాలు నేర్చుకుంటాం. స్టార్స్ కూడా ఓటీటీలో చేయాలి. చిన్న తెరపై కనిపిస్తే స్టార్డమ్ తగ్గిపోతుంది అనుకోవద్దు. ప్రతీ స్క్రీన్కి వెళ్లి.. కథల్ని ఇంకా ఎంత కొత్తగా చెప్పగలం అని ప్రయత్నిస్తూనే ఉండాలి’’ అన్నారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘30 నిమిషాల్లో కథ చెప్పడం కొత్తగా అనిపించింది. ఇంత తక్కువ సమయంలో చెప్పే కథలు ఇంకా చాలా ఉన్నాయనిపించింది. అందరి కంటే లాస్ట్ నా పార్ట్ షూట్ చేశాను. మార్చిలో షూట్ చేయాలనుకున్నాం. కానీ కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత షూట్ చేయడం మరో చాలెంజ్. కోవిడ్ టెస్ట్ వల్ల కాస్త బడ్జెట్ యాడ్ అయింది (నవ్వుతూ). మారుతున్న టెక్నాలజీ మనకు బలం ఇస్తుందా? లేక దానికి మనం బలం ఇస్తున్నామా అనే ఆలోచనతో నా కథను తెరకెక్కించాను’’ అన్నారు నాగ్ అశ్విన్. సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ –‘‘అన్ని కథలు థియేటర్కి సెట్ కావు. అలాంటి కథలు ఓటీటీలో ఎవరి ల్యాప్టాప్లో వాళ్లు చూసుకోవచ్చు. ఈ పిట్ట కథలు అలాంటివే. చిన్న కథలోనూ సంపూర్ణంగా అనిపించే ఫీలింగ్ కలిగించొచ్చు. ఈ కొత్త ఫార్మాట్ చాలా ఎగ్జయిటింగ్గా అనిపించింది. ఇలాంటి కథలు ఇంకా చెప్పాలనుంది’’ అన్నారు. -
ఫైనల్ విన్నాక ఫైనలైజ్!
అన్నం ఉడికిందా? లేదా అని తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టుకు చూస్తే చాలంటారు. అలాగే స్టోరీ బాగుంటుందా? లేదా అని తెలుసుకోవడానికి ‘స్టోరీ లైన్’ వింటే చాలని కొందరు సినీ ప్రముఖులు అంటుంటారు. లైన్ నచ్చితే మొత్తం కథ రెడీ చేయమని అడుగుతారు. ప్రస్తుతం నాగచైతన్యకి ఒక స్టోరీ లైన్ నచ్చిందట. కథ పూర్తి చేసి, ఫైనల్ వెర్షన్ వినిపిస్తే, సినిమా ఫైనలైజ్ చేస్తారట. ఇంతకీ చైతూ ఈ సినిమాని ఎవరితో చేస్తారంటే, ‘పెళ్ళి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్తో అని తెలిసింది. ఇటీవల తరుణ్ చెప్పిన లైన్ చైతూకి నచ్చి, ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమన్నారని సమాచారం. అంతా ఓకే అయితే వచ్చే ఏడాది ఈ కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కుతుంది. -
ప్రేమ మెరిసే
‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా, శ్వేతా అవస్తి హీరోయిన్గా నటించిన చిత్రం ‘మెరిసే మెరిసే’. పవన్ కుమార్.కె దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి నిర్మించారు. ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కుమార్. కె మాట్లాడుతూ– ‘‘కామెడీ, లవ్, ఎమోషన్స్తో కూడిన చిత్రమిది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ప్రస్తుతం మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నగేష్ బన్నెల్, సంగీతం: కార్తీక్ కొడగండ్ల. -
వేసవి తర్వాత...
వెంకటేష్ హీరోగా యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఓ సినిమా తెరకెక్కించనున్నారనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్ష¯Œ ్స పతాకంపై డి. సురేశ్ బాబు నిర్మించనున్నారు. ఆ మధ్య స్టోరీ లైన్ చెప్పిన తరుణ్ భాస్కర్ ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ను పూర్తి చేశారట. వెంకటేశ్, సురేష్ బాబులకు కథ వినిపించగా వారు పచ్చజెండా ఊపారని టాక్. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి తర్వాత సెట్స్పైకి వెళుతుందని సమాచారం. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ నటిస్తున్న ‘నారప్ప’ షూటింగ్ పూర్తయిన తర్వాతనే తరుణ్ భాస్కర్ సినిమాలో జాయిన్ అవుతార ట వెంకీ. ఈ సినిమా హార్స్ రేసింగ్ నేపథ్యంలో సాగుతుందట. -
కథ కంప్లీట్
‘పెళ్ళి చూపులు, ఈ నగరానికి ఏమైంది’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో యాక్టర్ అయ్యారు. ప్రస్తుతం యాంకర్గానూ మారారు. ఎన్ని పనులు చేసినా కథలు చెప్పడమే నా అంతిమ లక్ష్యం అంటారాయన. తరుణ్ భాస్కర్ తన తదుపరి చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వెంకటేశ్తో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన కథ రాయడం పూర్తయిందని తెలిపారు తరుణ్. వెంకటేశ్ ‘నారప్ప’ తర్వాత ఈ సినిమాను సెట్స్ మీద తీసుకెళ్తారని సమాచారం. అలాగే నెట్ఫ్లిక్స్ ‘లస్ట్ స్టోరీస్’ ఆంథాలజీలో ఓ కథను డైరెక్ట్ చేశారు తరుణ్. ఆయన డైరెక్ట్ చేసిన భాగంలో మంచు లక్ష్మీ ఓ కీలక పాత్ర చేశారు. ఇందులోనే మేఘనా శానీ అనే కొత్త అమ్మాయి పరిచయం కాబోతున్నారు. త్వరలో ఈ ఆంథాలజీ ప్రసారం కానుంది. -
టాలీవుడ్లో ఓరుగల్లు దర్శకుల హవా
‘పెళ్లి చూపులు’ అంటూ సైలెంట్గా వచ్చి వైలెంట్ హిట్తో తన సత్తా చాటాడు తరుణభాస్కర్. ‘అర్జున్ రెడ్డి’ అంటూ సందీప్ రెడ్డి వంగా తెలుగు సినీ బాక్సాఫీస్ను షేక్ చేయగా.. చదువు, భవిష్యత్ అంశాన్ని ‘నీదీ నాదీ ఒకే కథ’ అంటూ వేణు ఊడుగుల అద్భుతంగా చర్చించి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ‘దొరసాని’వే అంటూ కేవీఆర్ మహేంద్ర వెంటాడి విజయతీరాలకు చేరాడు.!! వీరందరూ తొలి సినిమాతోనే హిట్ సొంతం చేసుకున్నారు. కథపై క్లారిటీ, వినూత్న స్క్రీన్ ప్లే, మాటల మాయాజాలం, బిగువైన సన్నివేశాలు, భావోద్వేగాలు, రచనా శైలియే వీరి విజయానికి చిరునామా.! సాక్షి, వరంగల్ రూరల్: తెలుగు సినీ పరిశ్రమలో ఓరుగల్లు యువ దర్శకులు సత్తా చాటుతున్నారు. మెగాఫోన్ పట్టి స్టార్ నటులకు స్టార్ట్.. కెమెరా.. యాక్షన్ అంటూ ఆదేశాలిస్తున్నారు.! ప్రత్యేక రాష్ట్ర సాకారం తర్వాత సినీ రంగంలో మార్పు కనిపిస్తోంది. ఉద్యమగడ్డ.. అడ్డా అయిన వరంగల్కు చెందిన పలువురు వినోదాత్మతకమైన ఊహా ప్రపంచంలో తమదైన మార్క్ను పద్రర్శిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినీరంగంలో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండకు స్టార్ ఇమేజ్ ఇచ్చిన సినిమా ఇది. అనంతరం బాలీవుడ్కు వెళ్లి అర్జున్రెడ్డిని షాహీద్కపూర్తో ‘కబీర్ సింగ్’గా తీసి అక్కడ బాక్సాఫీస్ను షేక్ చేశాడు. ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్తో సత్తా చాటి సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఫలితంగా బాలీవుడ్ సందీప్పై ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లా మర్రి వెంకటయ్య కాలనీకు చెందిన వారు సందీప్ రెడ్డి. కేవీఆర్ మహేంద్ర.. కొద్దిరోజుల క్రితం విడుదలయిన ‘దొరసాని’ సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు కేవీఆర్ మహేంద్ర. హసన్పర్తికి చెందిన ఈ యువ దర్శకుడు ‘నిశీధి’ అనే షార్ట్ ఫిల్మ్ తీసి పలు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. అనంతరం ‘ఒగ్గుచుక్క’ అనే డాక్యుమెంటరీని తీశాడు. పలు యాడ్స్కు దర్శకత్వం వహించాడు. తాజాగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్లతో తెరకెక్కించిన ‘దొరసాని’ సినిమాతో విజయభేరి మోగించాడు. వేణు ఊడుగుల వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట ఉప్పరపల్లిలో వేణు ఊడుగుల జన్మించాడు. ఉప్పరపల్లిలో పాఠశాల విద్య, డిగ్రీ హన్మకొండలో డిగ్రీ మూడో సంవత్పరం చదువుతున్న దశలోనే పరిశ్రమవైపు అడుగులు వేశాడు. రచయిత, దర్శకుడు మదన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా, వేటూరి సుందరరామమూర్తి వద్ద 2008లో సహాయకుడిగా తన కెరీర్ను ప్రారంభించాడు. వేణు మంచి భావుకత వున్న కవి కూడా. వేణు కవితలు పలు పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జై బోలో తెలంగాణ’ సినిమాకు మాటల రచయితగా తనముద్ర వేశాడు. అనంతరం ‘నీదీ నాదీ ఒకేకథ’ సినిమాతో దర్శకుడి అవతారమెత్తాడు. చదువు, భవిష్యత్ వంటి సున్నితమైన అంశంతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ఈ అంశాన్ని వేణు సరికొత్తగా తెరపై ఆవిష్కరించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం తన రెండో సినిమా రానా, సాయిపల్లవితో ‘విరాటపర్వం’ను తెరకెక్కిస్తున్నాడు. తరుణ్ భాస్కర్.. హన్మకొండ వడ్డేపల్లి నుంచి వచ్చిన తరుణ్ తొలుత ‘సైన్మా’ అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు. అనంతరం ‘పెళ్లిచూపులు’ సినిమా తీసి సినిమా ఇండస్ట్రీ చూపును తనవైపునకు తిప్పుకున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా మంచి బోణీ ఇచ్చిన సినిమా ఇదే. ఆ తర్వాత తరుణ్ ‘ఈ నగరానికి ఏమైంది’ దర్శకత్వం వహించాడు. అనంతరం నటుడిగా కూడా రాణిస్తున్నాడు. మీకుమాత్రమే చెప్తా, మహానటి, ఫలక్నుమాదాస్ సినిమాల్లో నటుడిగా తనలోని మరో కళా ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ హీరోగా రాణించేందుకు తరుణ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరికొన్ని సినిమాలకు స్టోరీలను రాస్తున్నాడు. కొత్త ఒరవడి తెలుగు పరిశ్రమలో స్వరాష్ట్ర సాధన అనంతరం మార్పు కనిపిస్తోంది. వరంగల్ నుంచి చాలామంది ప్రతిభ ఉన్న టెక్నీషియన్లు సినిమా రంగానికి పరిచయమవుతున్నారు. నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సంగీత దర్శకులు.. ఇలా అన్నీ రంగాల్లో తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. బాలీవుడ్లో తెర మీద మరాఠీ సినిమాలు తమ ఉనికిని చాటుకుంటున్నట్టే ఇప్పుడు తెలుగు సినీరంగంలో తెలంగాణ టెక్నీషియన్స్ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి దర్శకులు ఎక్కువగా వస్తున్నారు. -
చూసీ చూడంగానే నచ్చుతుంది
నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా నటించిన చిత్రం ‘చూసీ చూడంగానే’. శేష సింధురావు దర్శకత్వం వహించారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటించారు. ‘పెళ్ళి చూపులు, మెంటల్ మదిలో’ వంటి చిత్రాలను నిర్మించిన రాజ్ కందుకూరి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ని నిర్మాత డి. సురేష్బాబు, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ – ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. మా గత చిత్రాల్లాగానే ఈ సినిమా కూడా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై విడుదల కానుంది. గోపీసుందర్ మంచి సంగీతం అందించారు. ‘మెంటల్ మదిలో’ ఫేమ్ వేద రామన్ చక్కని విజువల్స్ అందించారు. ఈ నెల చివరి వారంలో సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. -
దర్శకులుగా మారిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు
డాక్టర్ను కాబోయి యాక్టర్నయ్యానని చాలా మంది నటులు చెబుతుంటారు. అయితే.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లం కాబోయి డైరెక్టర్లమయ్యామంటున్నారు నేటితరం దర్శకులు. దిగ్గజ దర్శకుడు శేఖర్ కమ్ముల మొదలుకుని నిన్నటి క్షీరసాగర మథనం దర్శకుడు అనిల్ పంగులూరి వరకు పలువురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు తెలుగు సినిమా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఐటీ రంగం నుంచి ఎందరో ప్రతిభాశాలురు దర్శకులుగా పరిచయమవుతున్నారు. శేఖర్ కమ్ముల స్ఫూర్తిగా చాలా మంది యువ దర్శకులు సాఫ్ట్వేర్ కొలువులను పక్కనబెట్టి దర్శకత్వంలో రాణిస్తున్నారు. హిట్ సినిమాలకు రూపకల్పన చేస్తున్నారు. చిత్రపరిశ్రమలో ఇప్పుడంతా ఐటీ రంగం నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ల హవా కొనసాగుతోంది. – బంజారాహిల్స్ సాక్షి, హైదరాబాద్ : ప్రస్థానం చిత్ర దర్శకుడు దేవా కట్టా, గౌతం (జెర్సీ), తరుణ్ భాస్కర్ (పెళ్లి చూపులు) వెన్నెల కిశోర్ (జఫ్పా), ప్రవీణ్ సత్తారు (గరుడవేగ), శ్రీహర్ష మందా (రామచక్కని సీత), సందీప్ (అర్జున్రెడ్డి), మేర్లపాక గాంధీ (వెంకటాద్రి ఎక్స్ప్రెస్), నీలకంఠ (మిస్సమ్మ).. ఇలా చెబుతూపోతే చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు తమ దర్శకత్వ ప్రతిభతో చిత్రసీమను ఏలుతున్నారనే చెప్పాలి. చక్కని కథనాలతో వీళ్లు తెరకెక్కిస్తున్న సినిమాలు హిట్ అవుతున్నాయి. ఐబీఎంలో పనిచేసిన ప్రవీణ్ సత్తారు సాఫ్ట్వేర్ కొలువు వదిలి సినిమా రంగంలోకి ప్రవేశించి మంచి హిట్లు కొట్టారు. అర్జున్రెడ్డి సినిమాతో మరో సాఫ్ట్వేర్ ఇంజినీర్ సందీప్ చూపిన ప్రతిభ అందరికీ తెలిసిందే. వెన్నెల కిశోర్ సాఫ్ట్వేర్ కొలువు వదిలి సినిమా రంగంలోకి ప్రవేశించి మొదట్లో దర్శకత్వంపై దృష్టి సారించారు. ప్రస్తుతం హాస్య నటుడిగా అలరిస్తున్నారు. చాలామంది యువ దర్శకులు తాము చదువుకునే రోజుల్లోనే చక్కని కథలు, పాటలు రాసుకునేవారు. సరైన దారి లేకపోవడంతో వీరు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి చాలా రోజులే పట్టిందని చెప్పాలి. తీసిన మొదటి సినిమాతోనే మంచి ప్రతిభ కనబరిచిన వీరికి ఇప్పుడు చిత్ర పరిశ్రమ జేజేలు పలుకుతోంది. సీన్ వివరిస్తున్న శేఖర్ కమ్ముల సాఫ్ట్వేర్ కొలువు చేస్తూనే.. మాది ఒంగోలు. ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మనవణ్ని. హైటెక్ సిటీలో 14 ఏళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాను. చదువుకునే సమయంలోనే కథల మీద బాగా ఇంట్రెస్ట్. ఇప్పుడిప్పుడే మంచి వేదిక దొరకడంతో క్షీరసాగర మథనం సినిమాకు దర్శకత్వం వహించా. గుండెల్ని మెలిపెట్టే గాఢమైన అనుభూతుల్ని పంచి.. భావోద్వేగాలతో మనసుల్ని రంజింపజేసి మంచి సినిమా చూశామనే సంతృప్తిని మిగిల్చే చిత్రాన్ని అందిస్తున్నామన్న నమ్మకం నాకు ఉంది. దాదాపు అందరూ కొత్తవాళ్లతోనే ఈ సినిమా రూపొందించాను. – అనిల్ పంగులూరి, ‘క్షీరసాగర మథనం’ దర్శకుడు దర్శకుడు సందీప్, అనిల్ పంగులూరి సినిమాలపై మోజుతో.. మాది విజయవాడ. ఎంటెక్ చదివా. కాలేజీ రోజుల్లోనే సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగింది. కథలు బాగా రాసుకునేవాణ్ని. ఎప్పటికైనా ఒక్క సినిమా అయినా తీయాలనే లక్ష్యంగా పెట్టుకున్నా. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చాను. ఫిలింనగర్లో ఎన్ని చోట్లకు తిరిగానో నాకే గుర్తు లేదు. ఈ క్రమంలో ఒక మంచి కథతో నేను వెళ్లగానే నిర్మాత అంగీకరించారు. అదే రామచక్కని సీత సినిమా. నాకు మంచి పేరు తీసుకొచ్చింది. – శ్రీహర్ష మందా, ‘రామచక్కని సీత’ దర్శకుడు -
వెబ్లో అడుగేశారు
నెట్ఫ్లిక్స్లో హిట్ అయిన హిందీ ఆంథాలజీ (ముగ్గురు లేదా నలుగురు దర్శకులు చిన్న చిన్న కథలను ఓ సినిమాగా రూపొందించడం) ‘లస్ట్ స్టోరీస్’. తాజాగా నెట్ఫ్లిక్స్ ఇప్పుడు తెలుగులోనూ ‘లస్ట్ స్టోరీస్’ను తీసుకురాబోతోంది. ఈ ఆంథాలజీని నందినీ రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చే స్తారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించే కథలో ఈషారెబ్బా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ పార్ట్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఈషారెబ్బాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈషా డిజిటల్ ఎంట్రీకి ఇదే తొలి వేదిక కానుంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించే భాగంలో అమలా పాల్ నటిస్తున్నారు. -
నవ్వులతో నిండిపోవడం ఆనందంగా ఉంది
తరుణ్ భాస్కర్ హీరోగా షామీర్ సుల్తాన్ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ నెల 1న విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘ప్రేమతో, ఇష్టంతో చేసే పనిలో దేవుడు ఉంటాడు. ఆ ఇష్టంతో విజయ్ నిర్మించిన ఈ సినిమాకు మంచి ఫలితం వచ్చింది. ప్రేక్షకులు రెండు గంటలపాటు పగలబడి నవ్వుతున్నారు. విజయ్ ఎప్పుడు దర్శకత్వం చేయాలనుకున్నా ఆ సినిమాకి నేను నిర్మాత అవుతా’’ అని అన్నారు. ‘‘మా అందరి కలలు నిజమయ్యాయి. నైజాంలో 80శాతం థియేటర్స్ ఫుల్ అయ్యాయి. వీటికంటే థియేటర్స్ అన్నీ నవ్వులతో నిండిపోవడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. సృజన్ అనే మరో కొత్త దర్శకుడితో మరో సినిమా నిర్మిస్తున్నా’’ అన్నారు విజయ్ దేవరకొండ. ‘‘సినిమా విడుదలైన రోజున మూడు థియేటర్స్కు వెళ్లాం. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకే రెండేళ్లు కష్టపడ్డాను’’ అన్నారు షామీర్. నటుడు అభినవ్, సంగీత దర్శకుడు శివకుమార్, ఎగ్జిక్యూటివ్ పొడ్యూసర్ అనురాగ్ మాట్లాడారు. -
‘మీకు మాత్రమే చెప్తా’ థ్యాంక్యూ మీట్
-
మీకు మాత్రమే చెప్తా : మూవీ రివ్యూ
-
మీకు మాత్రమే చెప్తా : మూవీ రివ్యూ
టైటిట్: మీకు మాత్రమే చెప్తా జానర్: యుత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ నటీనటులు: తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ దర్శకత్వం: షమ్మీర్ సుల్తాన్ నిర్మాతలు: వర్ధన్ దేవరకొండ, విజయ్ దేవరకొండ బ్యానర్: కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ టాలీవుడ్లో స్టార్ హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటుచేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ఎలాంటి వారసత్వం లేకపోయినా.. చిన్నచిన్నగా అడుగులు వేస్తూ.. పెళ్లి చూపులు, అర్జున్రెడ్డి, గీతగోవిందంలాంటి సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన విజయ్.. ఇటు నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. పెళ్లిచూపులు సినిమాతో తనకు మంచి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ను హీరోగా పరిచయం చేస్తూ.. ఆయన తొలిసారిగా నిర్మించిన యుత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ‘మీకు మాత్రమే చెప్తా’ . ఈ సినిమాతో దర్శకుడి రోల్ నుంచి హీరో రోల్లోకి తరుణ్ భాస్కర్ షిఫ్ట్ అవ్వగా.. అతని సరసన కన్నడ నటి వాణీభోజన్ హీరోయిన్గా నటించింది. విజయ్ నిర్మాతగా మారడం, తరుణ్ హీరో అవతారం ఎత్తడంతో సహజంగానే యుత్లో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. అనుకున్నట్టుగానే యుత్ను ఈ సినిమా ఆకట్టుకుందా? ఒకప్పుడు ‘పెళ్లిచూపులు’ సినిమాతో విజయ్-తరుణ్ జోడీ టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మారిన రోల్స్తో ఈ ఇద్దరు మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేశారా? కథ: రాకేశ్ (తరుణ్ భాస్కర్), కామేశ్ (అభినవ్ గోమటం) జాన్జిగిరీ దోస్తులు. ఒక టీవీ చానెల్లో ఇద్దరూ పనిచేస్తుంటారు. రాకేశ్, కామేశ్ ఇద్దరూ డాక్టర్లను ప్రేమిస్తారు. రాకేశ్ ప్రతి విషయంలో అబద్ధాలు చెప్తుంటాడని ప్రతి విషయంలోనూ అతని లవర్ స్టెఫీ అనుమానిస్తూ ఉంటుంది. పెదవాళ్లను ఒప్పించి రాకేశ్ స్టెఫీని పెళ్లాడేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలో పెళ్లికి రెండురోజుల ముందు రాకేశ్ ఫోన్కు ఒక వీడియో వస్తుంది. ఒక అమ్మాయితో హానీమూన్లో గడుపుతున్నట్టు ఆ వీడియో ఉంటుంది. ఎవరో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఈ వీడియో పెళ్లికి ముందు బయటపడితే.. తన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని రాకేశ్ తీవ్రంగా టెన్షన్ పడుతుంటాడు. మరోవైపు స్టెఫీని లవ్ చేస్తున్న ఆమె బావ జాన్సన్ పెళ్లిని ఆపేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇంకోవైపు ప్రతి విషయంలో రాకేశ్ అబద్ధాలు చెప్తున్నాడని స్టెఫీని అనుమానిస్తుంటుంది. అసలు ఈ వీడియో ఎక్కడిది? నిజంగానే ఓ యువతితో రాకేశ్ గడిపాడా? ఆ వీడియోను డిలీట్ చేసేందుకు రాకేశ్, కామేశ్ ఏం చేశారు? కింగ్ హ్యాకర్ ఎవరు? చివరకు రాకేశ్ పెళ్లి ఎలా జరిగింది? కామేశ్ మీకు మాత్రమే చెప్తా అని మొదలుపెట్టిన ఈ కథ అసలు ఎవరిది అన్నది తర్వాతి కథ. విశ్లేషణ: ప్రజల వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో లీకై రచ్చరచ్చ అవ్వడం.. ఎన్నో దురాగతాలు జరగడం చూస్తూనే ఉన్నాం. ఇది సుమారు అలాంటి కథే కానీ, కేవలం కామెడీ ఎంటర్టైనర్గా ఒక చిన్న పాయింట్ చుట్టే దర్శకుడు షమ్మీర్ ఈ కథను తిప్పాడు. ఎంచుకున్న పాయింట్ కొత్తదే అయినప్పటికీ.. పెద్దగా ట్విస్టులు, మలుపులు లేకుండా కేవలం కామెడీ ఎంటర్టైనర్గా మలచడంపైనే దర్శకుడి దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. పెళ్లికి రెండురోజుల ముందు తన ‘పర్సనల్ వీడియో’ బయటపడటంతో ఓ వ్యక్తి ఎలాంటి తిప్పలు పడ్డాడన్నది ఆసక్తికరంగా కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించడంలో దర్శకుడు కొంతమేరకు సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ అంతా కామెడీతో ప్రేక్షకులను నవ్వించేలా సాగుతోంది. అయితే, సెకండాఫ్లో అంతగా కామెడీ లేకపోవడంతోపాటు స్క్రీన్ప్లే పెద్దగా ఇంట్రస్టింగ్గా సాగకపోవడంతో సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. తొలిసారిగా హీరోగా చేసిన తరుణ్ భాస్కర్ తన నటనతో సినిమాకు ప్లస్ అయ్యాడు. చాలా సీన్లలో తరుణ్ సహజంగా నటించాడు. తరుణ్ ఫ్రెండ్ కామేశ్గా అభినవ్ గోమటం మరోసారి అలరించాడు. తనదైన స్టైల్లో సినిమాలో నవ్వులు పూయించాడు. హ్యాకర్ పపా అక్కగా అనసూయ కీలక పాత్రలో కనిపించారు. పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా.. నేపథ్య సంగీతం సినిమాను బాగా ఎలివేట్ చేసింది. వాణీ భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ తమ పరిధిలో పాత్రలకు న్యాయం చేశారు. సినిమా చివర్లో వచ్చే ‘మీకు మాత్రమే చెప్తా’ పాటలో విజయ్ దేవరకొండ అలరించాడు. మొత్తానికి విజయ్-తరుణ్ తమ రోల్స్ మార్చుకొని కొత్త రోల్స్తో తీసిన ఈ సినిమా యూత్ను కొంచెం ఆకట్టుకోవచ్చు. బలాలు తరుణ్ భాస్కర్ కామెడీ ఫస్టాప్ బలహీనతలు సెకండాఫ్ కొన్ని సాగదీత సీన్లు - శ్రీకాంత్ కాంటేకర్ -
ఇంకో సినిమా నిర్మించే ధైర్యం వచ్చింది
‘‘కొత్త సినిమాకి నిర్మాత దొరక్కపోతే ఎంత కష్టం అనేది ‘పెళ్ళి చూపులు’ టైమ్లో చూశా. నేనీ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఎంతోమంది. అందుకే.. ఇప్పుడు నేను ఉన్న ఈ స్టేజ్లో ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చని ‘మీకు మాత్రమే చెప్తా‘ సినిమా నిర్మించా’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. తరుణ్ భాస్కర్, వాణీ భోజన్, అభినవ్ గోమటం ప్రధాన పాత్రల్లో షామీర్ సుల్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి రూపొందించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు. ► ‘మీకు మాత్రమే చెప్తా’లో మీరు హీరోగా ఎందుకు నటించలేదు? నేను ‘పెళ్ళి చూపులు’ సినిమా చేసిన తర్వాత షామీర్ సుల్తాన్, ‘మీకు మాత్రమే చెబుతా’ కో– డైరెక్టర్ అర్జున్ నన్ను కలిశారు. అప్పటికే వాళ్లు చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూశాను. ఏ మాత్రం బడ్జెట్ లేకున్నా చాలా రిచ్గా తీశారు. వాళ్ల ప్రతిభ చూసి ఓ సినిమా చేస్తానని చెప్పా. ‘అర్జున్ రెడ్డి’ విడుదల కాకముందు ‘మీకు మాత్రమే చెప్తా’ కథ చెప్పారు. నేను కూడా చేద్దామనుకున్నాను. ‘అర్జున్ రెడ్డి’ విడుదల తర్వాత నేనీ సినిమా చేయడం కరెక్ట్ కాదనిపించింది. వేరే నిర్మాతల కోసం తిరుగుతున్నాం కానీ వర్కవుట్ కాలేదని ఆ ఇద్దరూ అన్నారు. కథపై, వారిపై ఉన్న నమ్మకంతో నేనే నిర్మాతగా మారి ఈ సినిమా చేశా. ► మీ ‘పెళ్ళిచూపులు’ చిత్రానికి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్నే ఈ సినిమాకిæహీరోగా పెట్టుకోవడానికి కారణం? ఈ చిత్రంలోని రాకేశ్ పాత్రకి నవీన్ పొలిశెట్టి, తరుణ్ భాస్కర్ సరిపోతారనిపించింది. ‘పెళ్ళిచూ పులు’ సినిమా చేస్తున్నప్పుడు ఆయా సన్నివేశాల్లో ఎలా నటించాలో తరుణ్ చేసి చూపించేవాడు. ఆ సమయంలో నిజంగా మాకంటే బాగా నటించేవాడు. అందుకే తరుణ్ని లీడ్ రోల్ చేయమని అడిగాను. ఏదో చిన్న చిన్న రోల్స్ చేస్తున్నానే కానీ లీడ్ రోల్ కష్టం, నా దృష్టి డైరెక్షన్పైనే అన్నాడు. ఓ సారి కథ వినమని చెప్పా. విన్నాక ఒప్పుకున్నాడు. ► ఈ సినిమా కథలో మీరు కల్పించుకున్నారా ? స్క్రిప్ట్ ఫైనలైజ్ చేశాక ఎక్కడా కల్పించుకోలేదు. సెట్కి ఒక్కసారి మాత్రమే వెళ్లాను. అది కూడా ఓ సారి వస్తే బాగుంటుంది అని వారు అడిగితేనే వెళ్లా. సంగీతం గురించి మాత్రమే నాతో చర్చించేవాళ్లు. పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కూడా కొంచెం చూశా. మిగిలినవాటి గురించి అస్సలు పట్టించుకోలేదు. అల్లు అరవింద్గారి వంటి నిర్మాత కూడా సెట్స్లో మాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చేవారు. మా యూనిట్కి నేను పూర్తి స్వేచ్ఛ ఇచ్చా. ► నిర్మాణం రిస్క్ అనుకోలేదా? నేనిప్పటివరకూ చేసిన కొన్ని సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులో 70 శాతం ‘మీకు మాత్రమే చెప్తా’కి పెట్టాను. ‘ఇప్పుడు మనకెందుకురా ప్రొడక్షన్’ అని మా నాన్న (వర్థన్) అన్నారు. అయితే కథ బాగుంది.. ఈ టీమ్పై పూర్తి నమ్మకం ఉంది. పైగా డబ్బులు పోయినా మళ్లీ సంపాదించుకోవచ్చనే నమ్మకంతో రిస్క్ తీసుకుని ఈ సినిమా చేశాను. నా మీద నమ్మకంతో నా నిర్మాతలు డబ్బు ఖర్చు పెట్టకపోతే నేను ఇప్పటికీ ఓ చిన్న ఇంట్లో నెలకు రూ. 3000 అద్దె కట్టుకుంటూ, తర్వాతి నెల ఎలా? అంటూ ఇబ్బందులు పడేవాణ్ణి. ► ‘మీకు మాత్రమే చెప్తా’లో మీకు నచ్చిందేంటి? ఈ కథ విన్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. ప్రేక్షకులు కూడా మా సినిమా చూసి థియేటర్ నుంచి బయటకి వచ్చేటప్పుడు నవ్వుకుంటూ వస్తే నాకు తృప్తి. ఈ రోజుల్లో వినోదం వర్కౌట్ అవుతుంది. సినిమా చూశాక బాగా చేశారు, బాగా ఎంజాయ్ చేశాం అని ప్రేక్షకులు భావిస్తారు. ► కొత్తవాళ్లతో ఇంకా సినిమాలు నిర్మిస్తుంటారా? ముందు ముందు కూడా చేయాలని ఉంది. మా సినిమాని సునీల్ నారంగ్గారు అడ్వాన్స్ ఇచ్చి కొన్నప్పుడు మా నాన్నగారి కళ్లలో నీళ్లు తిరిగాయి. శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్.. ఇవన్నీ జరిగిన తీరు చూస్తుంటే ఇంకో సినిమా చేయడానికి ఇప్పుడు ధైర్యం వచ్చింది. ► మీరు హీరోగా చేస్తున్న సినిమాల గురించి... క్రాంతి మాధవ్గారి దర్శకత్వంలో చేస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఎనిమిది రోజులు షూటింగ్ మిగిలి ఉంది. పూరి జగన్నాథ్గారితో చేయబోయే ‘ఫైటర్’ జనవరిలో ప్రారంభమవుతుంది. ఆనంద్ అన్నామళై దర్శకత్వంలో చేస్తోన్న ‘హీరో’ సినిమా తర్వాత శివ నిర్వాణతో ఒక సినిమా ఉంటుంది. -
కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయటం నా బాధ్యత
‘‘విజయ్ వాళ్ల నాన్న గోవర్థన్తో వర్క్ చేశాను. చాలామంచి వ్యక్తి. ఈ చిత్రం ట్రైలర్ చూశాను, బావుంది. సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ చిత్రంతో పాటు విజయ్ చేస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవ్’ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు పూరి జగన్నాథ్. ‘పెళ్ళిచూపులు’ దర్శకుడు తరుణ్భాస్కర్ హీరోగా ఆ చిత్ర హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా షామీర్ సుల్తాన్ దర్శకునిగా చేసిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ వేడుకలో పూరి జగన్నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి. సురేశ్బాబు మాట్లాడుతూ– ‘‘విజయ్, తరుణ్ ఎదిగిన తీరు చూస్తుంటే ముచ్చటగా ఉంటుంది. ఈ చిత్రం ట్రైలర్ చూశాను. చాలా బాగుంది’’ అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఐదారేళ్ల క్రితం టీవీలో సెలబ్రిటీలందరినీ చూసి నటుడవ్వాలనే కోరిక ఉండేది. అప్పుడు మా నాన్న నన్ను పూరిగారి దగ్గర వర్క్ చేయమని చెప్పారు. ఇప్పుడు నేను పూరిగారితో వర్క్ చేయటం మర్చిపోలేని అనుభూతి. కలలు కనండి, వాటిని నిజం చేసుకోవటానికి కష్టపడండి. నన్ను చాలామంది సపోర్ట్ చేయటంతో ఈ స్థానంలో ఉన్నాను. అందుకే నేను కొత్తవారిని సపోర్ట్ చేస్తున్నాను. నా సక్సెస్కు కారణం సందీప్రెడ్డి వంగా. నిర్మాత సురేశ్బాబు గారు నా మొదటి సినిమా నుండి సపోర్ట్ చేస్తున్నారు’’ అన్నారు. ‘‘విజయ్ దేవరకొండ చేసే ఏ ప్రయత్నమైనా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా’’ అన్నారు తరుణ్ భాస్కర్. షామీర్ మాట్లాడుతూ– ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్కి, వర్థన్ గారికి థ్యాంక్స్. రాకేశ్ పాత్రలో తరుణ్ భాస్కర్ చక్కగా నటించారు. అంతేకాకుండా ఎడిటింగ్, మ్యూజిక్ ఇలా అన్ని విభాగాల్లో చాలా సపోర్ట్ చేశారు. సినిమా విడుదల తర్వాత అందరి పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి’’ అన్నారు. నిర్మాతలు కె.ఎస్.రామారావు, మధురా శ్రీధర్, గోవర్థన్ దేవరకొండ, చార్మి తదితరులు పాల్గొన్నారు. -
జుట్టు తక్కువ, పొట్ట ఎక్కువ.. నేను హీరో ఏంటి?
‘‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో నువ్వే హీరో అని విజయ్ దేవరకొండ అన్నప్పుడు, నేను హీరో ఏంటి? అనుకున్నాను. ‘నాకు జుట్టు తక్కువ, పొట్ట ఎక్కువ’ అని విజయ్తో చెప్పాను. ‘ఏం ఫర్వాలేదు’ అన్నాడు’’ అని అన్నారు తరుణ్ భాస్కర్. ‘పెళ్ళి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. వాణీ భోజన్, అనసూయ, అభినవ్ గోమటం ముఖ్యపాత్రల్లో షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. హీరో విజయ్ దేవరకొండ, వర్థన్ దేవరకొండ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్, చిత్రంలో కీలక పాత్ర చేసిన అభినవ్ గోమటం చెప్పిన విశేషాలు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ – ‘‘విజయ్ దేవరకొండ కోసం తమిళ దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ ఈ కథను వినిపించారు. విజయ్కి కథ చాలా నచ్చింది కానీ తనకు సెట్ కాదనిపించింది. ఈ కథ మిస్ అవ్వకూడదనుకున్నాడు. నన్ను కథ వినమన్నాడు. ఫ్రెండ్లీగా విన్నాను. ఆ తర్వాత నువ్వే హీరో అన్నాడు. నిర్మాతగా విజయ్ ఎక్కడ వరకూ ఇన్వాల్వ్ అవ్వాలో అక్కడి వరకే ఉండేవాడు. ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్ అంతా ముగిసిన తర్వాత ‘బరువు తగ్గాలి తరుణ్’ అని విజయ్ చెప్పాడు. ‘పెరగడం తప్ప తగ్గడం నాకు తెలియదు’ అన్నాను. ఆ తర్వాత మెల్లిగా తగ్గాను. – నేను హీరోగా చేయాలనుకున్నప్పుడు మా ఆవిడ నాతో మాట్లాడలేదు (నవ్వుతూ). చిన్న చిన్న పాత్రలు చేస్తునప్పుడు ఎంకరేజ్ చేసింది. కానీ హీరోగా చేయడం నచ్చలేదు. అయితే మా అమ్మ ప్రోత్సహించారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ‘ఫిదా’ సినిమాలో మా అమ్మకు నటించే అవకాశం వచ్చింది. ‘విధవరాలికి ఇవన్నీ ఎందుకు?’ అని కొందరు బంధువులు కామెంట్ చేశారు. ‘అమ్మా ఇది నీ లైఫ్. నువ్వు చేయాలనుకుంది చెయ్. పక్కనోళ్ల మాటలు పట్టించుకోకు’ అని ధైర్యం చెప్పాను. అవే మాటలు నాకు మళ్లీ గుర్తు చేసింది అమ్మ. కొడుకు హీరో అంటే ఏ అమ్మకైనా ఆనందమే కదా. – ప్రస్తుతం వెంకటేశ్గారి కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నాను. ‘ఈ నగరానికి ఏమైంది’ కొనసాగింపుగా వెబ్ సిరీస్ చేస్తున్నాం. ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్లో నా పోర్షన్కి కథ సిద్ధం చేసుకున్నాను. సెల్ఫోన్ వల్ల ఇబ్బందులు అభినవ్ గోమటం మాట్లాడుతూ – ‘‘నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. సినిమాలంటే ఆసక్తితో థియేటర్ ఆర్టిస్ట్గా చేశాను. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాను. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం హిట్ కావడంతో పాటు నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. తరుణ్ భాస్కర్తో నాకున్న ప్రయాణంతో ‘మీకు మాత్రమే చెప్తా’లో చేయమని అడిగినప్పుడు వెంటనే ఒప్పుకున్నాను. ఈ కాన్సెప్ట్ని షమ్మీర్ మొదట విజయ్కు చెప్పాడు. ‘అర్జున్ రెడ్డి’ విడుదల తర్వాత విజయ్ చేద్దామనుకున్న ప్రాజెక్ట్ ఇది. తరుణ్ భాస్కర్లో డైరెక్షన్ స్కిల్స్తో పాటు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని తెలియడంతో హీరోగా నటించాడు. మొబైల్ వాడకం వల్ల ఎలా ఇబ్బందులు పడ్డారనే విషయాన్ని వినోదాత్మకంగా చెప్పాం.ప్రస్తుతం నితిన్ ‘రంగ్ దే’, జయంత్ సి. పరాన్జీగారి సినిమాతో పాటు సుశాంత్ సినిమాలో నటిస్తున్నాను’’ అన్నారు. -
రేస్ మొదలు
‘వెంకీ మామ’ సినిమా కోసం అల్లుడు నాగచైతన్యతో కలసి అల్లరి చేశారు వెంకటేశ్. ఇప్పుడు కొత్త సినిమా కోసం రేసు మొదలుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ రేసు డిసెంబర్ నెలలో ప్రారంభం అవుతుందని సమాచారం. ‘పెళ్ళి చూపులు, ఈ నగరానికి ఏమైంది’ చిత్రాలను తెరకెక్కించిన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేశ్ ఓ సినిమా చేయనున్నారు. హైదరాబాద్లోని మలక్పేట్ రేసింగ్ క్లబ్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రకథ సాగనుందట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్లో మొదలు కానుందని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సెట్లను హైదరాబాద్లోని ప్రముఖ స్టూడియోలో రూపొందిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై సురేశ్బాబు ఈ సినిమాను నిర్మించనున్నారు. -
ఈ కాంబినేషన్ కొత్తగా ఉంది
‘‘విజయ్ ప్రొడ్యూసర్, తరుణ్ భాస్కర్ హీరో అని వినగానే కొత్తగా అనిపించింది. నాకు బాగా నచ్చిన సినిమా ‘పెళ్ళి చూపులు’. నిర్మాతగా విజయ్ చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ‘మీకు మాత్రమే చెప్తా’ ట్రైలర్ చాలా బాగుంది. కథ ఆసక్తిగా అనిపించింది’’ అని హీరో మహేశ్బాబు అన్నారు. తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి ముఖ్య తారలుగా షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ని మహేశ్బాబు విడుదల చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘మీకు మాత్రమే చెప్తా’ కథాంశం బాగా నచ్చి నేనే నిర్మించా. నిర్మాత బాధ్యతలు మా నాన్న వర్ధన్ దేవరకొండగారు తీసుకున్నారు. నా మనసుకు నచ్చిన సినిమా ఇది. నా అభిమాన హీరో మహేశ్గారు ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ మూవీలో నన్ను హీరో అంటున్నారు. కానీ, నేను ఓ నటుడిగానే భావిస్తున్నా. కథ, కథనాలు ఫన్గా ఉంటాయి’’ అన్నారు తరుణ్ భాస్కర్. ‘‘ఈ సినిమా ఓ సంఘటన ఆధారంగా ఉంటుంది. డైలాగ్స్ రాసిన తరుణ్ భాస్కర్కి థ్యాంక్స్. అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్తో ఎంటర్టైన్ చేయబోతున్నాం’’ అన్నారు షమ్మీర్ సుల్తాన్. నటీనటులు అనసూయ భరద్వాజ, వాణి భోజన్, అభినవ్ గోమటం, నవీన్ జార్జ్ థామస్ మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: మదన్ గుణదేవా, సంగీతం: శివకుమార్, లైన్ ప్రొడ్యూసర్: విజయ్ మట్టపల్లి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనురాగ్ పర్వతనేని. -
ఓ చిన్న తప్పు!
హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి నిర్మించిన తొలి చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నవంబర్ 1న విడుదల కానుంది. నిర్మాతల్లో ఒకరైన వర్థన్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘మంచోడు అనే ఇమేజ్ని కాపాడుకునేందుకు ప్రతి మనిషి ప్రయత్నిస్తుంటాడు. ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేసే చిన్న తప్పును దిద్దుకునే ప్రయత్నంలో ఎంత కామెడీ పండింది? అనేది సినిమా. యూత్కి కనెక్ట్ అవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: విజయ్ మట్టపల్లి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనురాగ్ పర్వతనేని. -
నవంబరులో రేస్
‘గురు’ (2017) చిత్రంలో బాక్సింగ్ కోచ్గా వెంకటేశ్ నటన సూపర్ అని ఆడియన్స్ కితాబులిచ్చారు. బాక్సాఫీసు వద్ద ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. మళ్లీ వెంకీ క్రీడా నేపథ్యంలో ఉన్న చిత్రంలో నటించనున్నారని సమాచారం. హార్స్ రేసింగ్ ప్రధానాంశంగా సాగే ఓ ఎమోషనల్ ఎంటర్టైనింగ్ స్టోరీకి వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ‘పెళ్ళి చూపులు’ ఫేమ్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలిసింది. హైదరాబాద్లోని మలక్పేట హార్స్ క్లబ్ నేపథ్యంలో స్క్రిప్ట్ రెడీ చేశారట తరుణ్. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ సినిమా ఈ నవంబరులో మొదలవుతుందట. ప్రస్తుతం ‘వెంకీ మామ’ సినిమాతో బిజీగా ఉన్నారు వెంకటేశ్. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగచైతన్య మరో హీరో. -
ప్రతి ఫోన్లో సీక్రెట్ ఉంది
తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం ప్రధాన పాత్రధారులుగా షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ, వర్థన్ దేవరకొండ నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ‘ఎవ్రీ ఫోన్ హ్యాజ్ ఇట్స్ సీక్రెట్స్’ అనేది ట్యాగ్లైన్. శుక్రవారం ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ‘మీ లాంటి వారు బ్రౌజర్ హిస్టరీ డిలిట్ చేస్తారు. కాల్ హిస్టరీ డిలిట్ చేస్తారు. వాట్సప్ చాట్ డిలిట్ చేస్తారు. అన్నీ దాచేసి దొరికిపోతే చీటింగ్ కాదంటారు’, ‘ప్లీజ్ నా గురించి తప్పుగా ఆలోచించొద్దురా.. బేసిక్గా నేను మంచోణ్ణి’ అన్న టీజర్లోని డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబరులో విడుదల చేయాలనుకుంటున్నారు. అనసూయ భరద్వాజ్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అంతిక మిశ్రా, వినయ్, జీవన్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు శివ కుమార్ దర్శకత్వం వహించారు. -
మీకు మాత్రమే చెప్తా
‘పెళ్ళిచూపులు’ సినిమాతో విజయ్ దేవరకొండకు మంచిహిట్ ఇచ్చి, హీరోగా నిలబెట్టారు దర్శకుడు తరుణ్ భాస్కర్. అయితే.. తనను హీరోగా నిలబెట్టిన తరుణ్ భాస్కర్ని హీరోని చేశారు విజయ్ దేవరకొండ. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమఠం, అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్స్లో షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ దేవరకొండ, వర్థన్ దేవరకొండ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్లుక్ని గురువారం విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ ్టప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమాకి కెమెరా: మదన్ గుణదేవా, సంగీతం: శివకుమార్, లైన్ ప్రొడ్యూసర్: విజయ్ మట్టపల్లి. -
నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ సవారి
‘‘తెలుగు తెరపై కొత్త కథలు వస్తున్నాయి. సాహిత్ ఎంచుకొన్న కథ డిఫరెంట్గా ఉంది. దాన్ని తెరపై బాగా చూపించి ఉంటారనే నమ్మకం ఉంది. నందుకు ఈ సినిమా చక్కటి బ్రేక్ ఇస్తుంది అనుకుంటున్నాను’ అన్నారు దర్శకుడు తరుణ్ భాస్కర్. ‘బంధం రేగడ్’ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్తో గుర్తింపు పొందిన సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘సవారి’. సంతోశ్ మోత్కూరి, నిశాంక్ కుడితి నిర్మించారు. నందు, ప్రియాంకా శర్మలు జంటగా నటించిన ఈ చిత్రం టీజర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దర్శకుడు తరుణ్ భాస్కర్, ప్రణయ్రెడ్డి వంగా, టి.ఎన్.ఆర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ– ‘‘ఇదివరకు నేను చాలా సినిమాల్లో నటించాను. ‘సవారి’ నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్. సాహిత్ ఓ కొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నా బాడీ లాంగ్వేజ్, క్యారెక్టర్ ఈ సినిమాకు కరెక్ట్గా సెట్ అయ్యాయి’’ అన్నారు. సాహిత్ మాట్లాడుతూ– ‘‘టీజర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. హీరో పాత్ర విభిన్నంగా ఉంటుంది. నందు ఈ పాత్రకు బాగా సెట్ అయ్యాడు’’ అన్నారు. ‘‘ఈ చిత్రం షూటింగ్ సమయంలో నందు నన్ను ఎంతగానో సపోర్ట్ చేశాడు. ఈ సినిమాలో నేను చాలెంజింగ్ రోల్ చేశాను. ఇంత మంచి పాత్ర ఇచ్చిన సాహిత్కు థ్యాంక్స్’’ అన్నారు ప్రియాంకా శర్మ. -
ఫలక్నుమా... తెలుగు సినిమాకి కొత్త
‘‘ఫలక్నుమా దాస్’ చిత్రంలో సంభాషణలు చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. దీన్ని ఓ ఆర్ట్ ఫిల్మ్లా కాకుండా కమర్షియల్ చిత్రంగా బాగా తీశారు. సంగీతం కూడా బాగుంది. ఇలాంటి చిత్రం తెలుగు సినిమాకి కొత్త. విశ్వక్ ఎంతో ఇష్టంతో నటించి, దర్శకత్వం వహించారు. తరుణ్ భాస్కర్ బాగా నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని చిత్ర సమర్పకులు డి.సురేశ్బాబు అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్నుమా దాస్’. సలోని మిశ్రా కథానాయిక. కరాటే రాజు సమర్పణలో కరాటే రాజు, చర్లపల్లి సందీప్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో–దర్శకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాను ఇటీవల 100 మంది దాకా చూశారు. వారంతా సినిమా బాగుందని ప్రశంసలు కురిపించారు. మా చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘విశ్వక్ మీద మొదట్లో నమ్మకం లేదు. అయితే తను ఓ షార్ట్ ఫిల్మ్ చూపించడంతో నమ్మకం కలిగి ఈ సినిమాలో ఓ పాత్ర చేశా’’ అన్నారు తరుణ్ భాస్కర్. ‘‘హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని కరాటే రాజు అన్నారు. ‘‘ఈ సినిమాలోని రా కంటెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’ అని సలోని మిశ్రా అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: మీడియా 9 మనోజ్కుమార్. -
విజయ్ దేవరకొండ సినిమాలో సీరియల్ నటి
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాలో ఓ తమిళ సీరియల్ నటి హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో విజయ్ హీరోకాదు కేవలం నిర్మాత మాత్రమే. ఇటీవల కింగ్ ఆఫ్ ద హిల్ బ్యానర్ను స్థాపించిన విజయ్ దేవరకొండ తన సినిమాలకు భాగస్వామిగా వ్యవహరించటంతో పాటు కొత్త నటీనటులు, దర్శకులను పరిచయం చేస్తూ సినిమాలు తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తొలి ప్రయత్నంగా పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో తమిళ నాట షార్ట్ ఫిలింస్తో ఫేమస్ అయిన సమీర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీలో తరుణ్కు జోడిగా తమిళ సీరియల్ నటి వాణి భోజన్ నటించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్మీదకు వెళ్లనుంది. -
12 సార్లు చెంప దెబ్బ కొట్టా
‘‘హైదరాబాద్లోని ఫలక్నుమా ప్రాంతంలోని వాస్తవికతను ‘ఫలక్నుమాదాస్’ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాడు విష్వక్ సేన్. ఈ సినిమా షూటింగ్లో 12 సార్లు విష్వక్ను చెంప దెబ్బ కొట్టా. ఇంకా గట్టిగా కొట్టు అనేవాడు. అంత డెడికేటెడ్గా వర్క్ చేశాడు’’ అని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అన్నారు. ‘వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది’ వంటి చిత్రాల్లో నటించిన విష్వక్ సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్నుమా దాస్’. కరాటే రాజు సమర్పణలో వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్, టెరనోవ పిక్చర్స్ అనుసంధానంతో పూర్తిగా హైదరాబాద్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. సలోని మిశ్రా, హర్షిత గౌర్, ప్రశాంతి హీరోయిన్లుగా నటించారు. తరుణ్ భాస్కర్ పోలీస్ అధికారిగా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ట్రైలర్ని విష్వక్సేన్ తల్లి దుర్గ రిలీజ్ చేశారు. హీరో, దర్శకుడు విష్వక్సేన్ మాట్లాడుతూ– ‘‘ప్రేమికుల రోజు సందర్భంగా టీజర్ విడుదల చేయడానికి కారణం ఈ సినిమా నా గర్ల్ ఫ్రెండ్. ఏడాదిగా ఈ సినిమాతోనే గడిపాను. ఇది చిన్న సినిమా కాదు.. దయచేసి అలా రాయొద్దు, మాట్లాడొద్దు. ఈ సినిమాకు ఎంత బడ్జెట్ అవసరమో అంత పెట్టాను. చాలా పెద్ద సినిమా.. కాకపోతే చిన్నోడు తీశాడంతే’’ అన్నారు. ‘‘20 నుంచి 25 సంవత్సరాల వయసుండే 40 మంది కుర్రాళ్లంతా కష్టపడి ఈ సినిమా చేశారు. మొత్తం మీద అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. హైదరాబాద్లో ఇలాంటి ఏరియాలు కూడా ఉన్నాయని ఎవరికీ తెలియని 118 లొకేషన్స్లో తీశాం’’ అని నిర్మాత కరాటే రాజు చెప్పారు. సంగీత దర్శకుడు వివేక్ సాగర్, నటుడు కౌశిక్, రచయిత కిట్టు విస్సా ప్రగడ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తదితరులు హాజరయ్యారు. -
నో సాంగ్స్.. ఓన్లీ బ్యాగ్రౌండ్!
‘‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమా నేను చేయడానికి రీజన్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. తన ‘పెళ్ళి చూపులు’ సినిమా చూసి బావుందని మెసేజ్ పెట్టా. అలా మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ‘వైఫ్ ఆఫ్ రామ్’ దర్శకుడు విజయ్, తరుణ్ ఫ్రెండ్స్. విజయ్ని నాకు తరుణే పరిచయం చేశారు’’ అని సంగీత దర్శకుడు రఘు దీక్షిత్ అన్నారు. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో విజయ్ యలకంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైఫ్ ఆఫ్ రామ్’. టీజీ విశ్వప్రసాద్, లక్ష్మీ మంచు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు రఘు దీక్షిత్ మాట్లాడుతూ– ‘‘నేను బాలీవుడ్, కన్నడ చిత్రాలకు సంగీతం అందించా. తెలుగులో ‘వైఫ్ ఆఫ్ రామ్’ నా మొదటి సినిమా. విజయ్ గతేడాది ఫోన్ చేసి ఒక సినిమా చేస్తున్నా. పాటలు ఉండవు. కేవలం నేపథ్య సంగీతం ఉంటుందన్నారు. కథ విన్నాను. చాలా ఎగై్జటింగ్గా అనిపించి చేశా. నిజంగా అలా పని చేయడం ఓ మ్యూజిక్ డైరెక్టర్కి పెద్ద ఛాలెంజ్. పైగా నాకు మొదటి తెలుగు సినిమా, బడ్జెట్ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటి మధ్య పని చేయడం నిజంగా ఛాలెంజే. నేను కూడా అలాగే ఫీల్ అయి చేశా. కథకి తగ్గట్టే మ్యూజిక్ అందించా. రెగ్యులర్ తెలుగు ఫిల్మ్స్ సంగీతంలా ఉండదు. స్క్రీన్ప్లే టైట్గా ఉంటుంది. సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేక్షకులు ఎక్కడా బోర్ ఫీల్ అవ్వరు’’ అన్నారు. -
‘ఈ నగరానికి ఏమైంది?’ మూవీ రివ్యూ
టైటిల్ : ఈ నగరానికి ఏమైంది? జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి సంగీతం : వివేక్ సాగర్ దర్శకత్వం : తరుణ్ భాస్కర్ నిర్మాత : డి. సురేష్ బాబు పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్. కాస్త గ్యాప్ తీసుకొని మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది? సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. పదికి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడా..? ఈ నగరానికి ఏమైంది? యాడ్ రేంజ్లో సినిమా కూడా సక్సస్ అయ్యిందా..? కథ; ఈ నగరానికి ఏమైంది? నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ (విశ్వక్ సేన్ నాయుడు), కార్తిక్ (సుశాంత్ రెడ్డి), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను)లు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతురిని పెళ్ళి చేసుకొని అమెరికాలో సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాసెట్స్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. (సాక్షి రివ్యూస్) ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్మ్ ఫిలింస్ తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావటంతో మధ్యానికి బానిసై ఫ్రెండ్స్కు దూరంగా ఉంటుంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్కి ఓనర్ కూతురితో పెళ్లి కుదరటంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒక్కటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకొని పరిస్థితుల్లో గోవా వెళ్లిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు..? ఈ ప్రయాణం వారికి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది.? ఈ ట్రిప్ తరువాత వారు ఎలా మారిపోయారు? అన్నదే మిగతా కథ. నటీనటులు ; సినిమా అంతా నలుగురు కుర్రాళ్ల చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటీనటులను ఎంచుకున్న దర్శకుడు వాళ్ల నుంచి సహజమైన నటనను రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ సీరియస్నెస్ తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమఠం. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతీసారి ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకుంటాడు.(సాక్షి రివ్యూస్) చిన్న చిన్న పంచ్ డైలాగ్స్తో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో సుశాంత్, ఉపేంద్రలు తమ పాత్రలకు న్యాయం చేశారు. వివేక్ ప్రేమ కథలో వచ్చే శిల్ప పాత్రలో సిమ్రాన్ చౌదరి అందంగా కనిపించారు. మోడ్రన్ అమ్మాయిగా అనీషా ఆంబ్రోస్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. విశ్లేషణ ; పెళ్లిచూపులు లాంటి క్లాస్ సినిమా తరువాత పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్ గా తెరకెక్కించాడు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించిన ఎమోషన్స్, బిల్డప్ సీన్స్, డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగుతుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెరమీద చూపించటంలో తరుణ్ భాస్కర్ విజయం సాధించాడు. చాలా సందర్భాల్లో తనలోని రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. `జీవితమంటే.. నచ్చిన వాళ్లతో ఉంటూ, నాలుగు మెతుకులు తింటూ, నచ్చిన పని చేసుకోవడమే` లాంటి డైలాగ్స్ మనసును తాకుతాయి. (సాక్షి రివ్యూస్) ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రస్టింగ్గా తెరకెక్కించిన దర్శకుడు.. వివేక్ ప్రేమకథ, బ్రేకప్ లను చాలా సాదాసీదాగా తెరకెక్కించాడు. తొలి భాగం కామెడీ సీన్స్ తో వేగంగా కథ నడిచినా.. ద్వితీయార్థం కాస్త నెమ్మదించింది. వివేక్ సాగర్ అందించిన పాటలు పరవాలేదనిపించినా.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ ; లీడ్ యాక్టర్స్ నటన డైలాగ్స్ మైనస్ పాయింట్స్ ; అక్కడక్కడా నెమ్మదించిన కథనం లవ్ స్టోరి సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఈ నగరానికి ఏమైంది? : రేపే ప్రీ రిలీజ్
మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు లాంటి చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని సాధించారు. గ్యాప్ తీసుకుని తన రెండో సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యారు. నీ గ్యాంగ్తో థియేటర్కి రా చూస్కుందాం అంటూ సినిమాపై ఆసక్తిని పెంచారు. నలుగురు స్నేహితుల పాత్రల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్ను ఆకర్షించేలా ఉంది. ఈ నగరానికి ఏమైంది? అంటూ అందరికీ పరిచయమైన యాడ్లోని లైన్ను టైటిల్గా పెట్టారు. సోషల్ మీడియాలో ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను రేపు (జూన్ 25) నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈ మూవీ జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నా కథను నేను రాసుకున్నా
‘‘పెళ్ళి చూపులు’’ సినిమా 2016జూలై 29న విడుదలైనా నిన్ననే రిలీజ్ అయినట్లు ఉంది. ‘పెళ్లి చూపులు’ సినిమా చూసిన సురేశ్బాబుగారు ఈ సినిమా 100 రోజులు ఆడుతుందన్నారు. నవంబర్ 5న ఆ సినిమా 100వ రోజు. అదేరోజు నా పుట్టిన రోజు కావడం విశేషం’’ అని దర్శకుడు తరుణ్ భాస్కర్ అన్నారు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, వెంకట్ కకుమను, అభినవ్ గోమతం, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో డి.సురేశ్ బాబు నిర్మించిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం ఈనెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా యూనిట్, కొందరు సామాన్యులకు చిత్రం ప్రదర్శించారు. అనంతరం తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘పెళ్లి చూపులు’ సినిమా తర్వాత నా రెండో సినిమాకి సురేశ్బాబుగారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఏ కథ రాయాలని చాలా ఆలోచించా. చాలా మంది వద్ద సలహాలు తీసుకున్నా. ఆ టైమ్లో ‘నా గురించే నేను ఎందుకు రాసుకోకూడదు?’ అనిపించి, నా కథను నేను రాసుకున్నా. నా ఫ్రెండ్స్ గురించి, మా జీవన ప్రయాణంలో జరిగిన సంఘటనలను ‘ఈ నగరానికి ఏమైంది’ కథ రాశా. సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు కొత్త ఫీల్ కలిగిస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మిరెడ్డి, సంగీతం: వివేక్ సాగర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ సిద్దారెడ్డి, కో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీనివాస్ కౌశిక్, లైన్ ప్రొడ్యూసర్: సాయికరణ్ గద్వాల్. -
‘ఈ నగరానికి ఏమైంది?’
-
ఈ సండే నగరానికి... ట్రైలర్ వస్తోందంట!
ఓ చిన్న సినిమాతో పెద్ద విజయాలు చాలా మంది అందుకున్నారు. అలాంటి జాబితాలో పెళ్లి చూపులు సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఉండాల్సిందే. పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత తరుణ్ భాస్కర్ ఇప్పటివరకు ఇంకో సినిమాను తెరకెక్కించలేదు. తాజాగా ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాను ప్రకటించాడు. టైటిల్తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించారు డైరెక్టర్. ఓ నలుగురు స్నేహితుల మధ్య జరిగే కథ, ఆ కథకు గోవా నేపథ్యాన్ని జోడించి.. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ సినిమా ట్రైలర్ను ఆదివారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘ఈ ఆదివారం నగరానికి మంచి ట్రేలర్ వస్తుంది’ అని పోస్టర్ను రిలీజ్ చేశారు. సురేశ్ ప్రొడక్షన్స్పై తెరకెక్కుతున్న ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతమందిస్తున్నారు. This Sunday will not be like any other SUNDAY... SUN might come and go... But our Trailer can’t 😎... Vasthundi anthe ⚡️⚡️... Kaaskondi. #ENETrailerOnSunday pic.twitter.com/c3wNOp1HWK — Suresh Productions (@SureshProdns) June 8, 2018 -
‘ఈ నగరానికి ఏమైంది?’ మోషన్ పోస్టర్
పెళ్లి చూపులు మూవీతో చిన్న సినిమా స్టామినా ఏంటో నిరూపించాడు ఆ చిత్ర దర్శకుడు తరుణ్ బాస్కర్. తీసిన ఆ ఒక్క సినిమాతో పెద్ద సక్సెస్ సాధించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. పెళ్లి చూపులు సినిమా వచ్చి రెండేళ్లు గడుస్తున్నా... ఇంకో సినిమాను తెరకెక్కించలేదు ఈ యువ దర్శకుడు. ఈ నగరానికి ఏమైంది అంటూ సాగే ఒకప్పటి ఫేమస్ యాడ్లోని ఫస్ట్ లైన్ను తన సినిమా టైటిల్గా ఎంచుకున్నాడు. నీ గ్యాంగ్తో థియేటర్కు రా చూస్కుందాం అంటూ టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిగా రేకెత్తెలా చేశాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. దీంట్లో సినిమాలోని నలుగురు కుర్రాళ్లను పరిచయం చేశాడు. మీరంతా గ్యాంగ్తో రండి... ఈ సమ్మర్లో మిమ్మల్ని గోవాకు తీసుకెళ్తాం అంటూ పోస్టర్ను రిలీజ్చేశారు. సురేష్ ప్రొడక్షన్స్పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఈ నగరానికి ఏమైంది.. మోషన్ పోస్టర్ విడుదల
-
పెళ్లి చూపులు దర్శకుడి కొత్త సినిమా అప్డేట్
గత ఏడాది సంచలన విజయం సాధించిన చిన్న సినిమా పెళ్లి చూపులు. విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా తెరకెక్కిన ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతో ఘనవిజయం సాధించిన తరుణ్ తన రెండో సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో చేస్తున్న సంగతి తెలిసిందే. అంతా కొత్తవారితో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమాకు ‘ఈ నగరానికి ఏమైంది’ అనే డిఫరెంట్ టైటిల్ను ఫిక్స్ చేశారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ను వేసవి కానుకగా ఏప్రిల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పెళ్లిచూపులు సినిమాకు సంగీతమందించిన వివేక్ సాగర్ ఈ సినిమాకు కూడా సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా రోడ్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలుస్తోంది. త్వరలో చిత్రయూనిట్ పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. -
తరుణ్ కొత్త సినిమా ‘ఈ నగరానికి ఏమయింది..?’
తొలి చిత్రంగా తెరకెక్కిన పెళ్లి చూపులు సినిమాతో సంచలన విజయం సాధించిన దర్శకుడు తరుణ్ భాస్కర్. లఘు చిత్ర నేపథ్యం తో వెండితెర అరంగేట్రం చేసిన ఈ యువ దర్శకుడు తొలి సినిమాతోనే మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. తొలి చిత్రం ఘనవిజయం సాధించినా.. రెండో సినిమాను ప్రారంభించేందుకు చాలా సమయం తీసుకున్నాడు తరుణ్. తన రెండో సినిమా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఉంటుందని తెలిపినా. అది ఎప్పుడు మొదలవుతుందో ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా తరుణ్ భాస్కర్ రెండో సినిమాపై ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. తన రెండో సినిమాకు తరణ్ ఓ ఆసక్తికరమైన టైటిల్ను నిర్ణయించాడట. ప్రతీ సినిమా ప్రారంభంలో వచ్చే ‘ ఈ నగరానికి ఏమయింది..?’అనే మాటలనే తన టైటిల్ గా ఎంచుకున్నాడట తరుణ్ భాస్కర్. త్వరలోనే ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెలువడనున్నాయి. -
నటిగా దర్శకుడి తల్లి
కాఫీలాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఫిదా. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. మలయాళీ బ్యూటి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీలకమైన పాత్రలో ఓ హిట్ దర్శకుడి తల్లి కనిపించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రకటించారు. పెళ్లి చూపులు సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ తల్లి గీత.. ఫిదా సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్నారు. గతంలో తరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన పలు షార్ట్ ఫిలింస్ లో కనిపించిన గీత.. తొలిసారిగా వెండితెర మీద కనిపించనున్నారు. ఈ సినిమా తరువాత తరుణ్ తల్లి గీత అని కాదు.. గీతగారి కొడుకే తరుణ్ అని చెప్పుకుంటారంటున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. -
కథా బలంతోనే విజయం
కర్నూలు (కల్చరల్): చిత్రంలోని కథా బలమే ఈ విజయానికి కారణమని పెళ్లిచూపులు సినిమా రచయితా, దర్శకుడు తరుణ్భాస్కర్ తెలిపారు. స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ఆ సినిమాకు సంబంధించి జరిగిన సక్సెస్ మీట్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి తక్కువ బడ్జెట్తో తీసిన పెళ్లి చూపులు సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించిందన్నారు. సినిమా షూటింగ్ జరిగే సందర్భంలో ఇంత విజయం తమను వరిస్తుందని అనుకోలేదన్నారు. కొత్త నటీ నటులతో తీసిన ఈ సినిమా సినీ మేధావుల అంచనాలు దాటి సక్సెస్ను అందుకోవడం హర్షణీయమన్నారు. ఆసక్తికలిగిన యువతీ, యువకులు సినీ రంగంలో ప్రవేశించేందుకు ప్రతిభనే ప్రాతిపదికన ఎంచుకోవాలన్నారు. తాను షార్ట్ఫిలింలు నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్మాత తనకు చక్కని అవకాశం కల్పించి మార్గం సుగమం చేశారన్నారు. సభలో ముఖ్యఅతితిగా పాల్గొన్న ప్రముఖ పారిశ్రామిక వేత్త టీజీ భరత్ మాట్లాడుతూ పెళ్లి చూపులు చిత్రం యువతకు మంచి సందేశాన్ని అందించిందన్నారు.ఇలాంటి సందేశాత్మక చిత్రాలు ఇంకా రావాల్సిన అవసరం ఉందన్నారు. కర్నూలులో స్టూడియో నిర్మించేందుకు అవసరమైన అన్ని హంగులు ఉన్నాయన్నారు. ఎవరైనా ముందుకొస్తే స్టూడియో నిర్మాణానికి తానూ సహకరిస్తానన్నారు. టీజీవీ యాక్టింగ్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఎంతో మంది యువతీ, యువకులు నటనలో శిక్షణ పొందుతున్నారన్నారు. లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో కళాకారులకు కొదవే లేదన్నారు. ఇటీవల తాము నిర్వహించిన షార్ట్ఫిలిం పోటీల్లో చాలా మంది యువతీ, యువకులు పాల్గొన్నారన్నారు. అనంతరం పెళ్లి చూపులు సినిమా డైరెక్టర్ తరుణ్భాస్కర్ను ఘనంగా సత్కరించారు. సినిమాలో నటించిన కమిడియన్ అభయ్, కెమెరామెన్ నగేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత సాయికృష్ణ, నటి తన్విలను వారు ఘనంగా సత్కరించారు. -
పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది
సదువు సక్కంగా బుర్రకు ఎక్కని ఓ ఆవారా కుర్రాడు బీటెక్ పూర్తి చేస్తాడు. షెఫ్ కావాలనేది అతడి కోరిక. పిల్లను సూడనీకి ఓ ఇంటికి వెళ్లబోయి మరో ఇంటికి వెళ్తాడు. ఆ పిల్లేమో ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. మరక మంచిదే అన్నట్టు... రాంగ్ అడ్రస్కు వెళ్లడం వల్ల ఇద్దరికీ మేలు జరిగింది. విభిన్న వ్యక్తిత్వాలు గల ఇద్దరూ కలసి ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, తర్వాత ప్రేమలో పడతారు. చిన్న సంఘర్షణ తర్వాత ఒక్కటవుతారు – తరుణ్ భాస్కర్ దర్శకునిగా పరిచయమైన ‘పెళ్ళి చూపులు’ చిత్రకథ సాదాసీదాగానే అనిపిస్తుంది. మరి, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఒకటి, ఉత్తమ సంభాషణలకు గాను తరుణ్ భాస్కర్కి మరొకటి... రెండు నేషనల్ అవార్డులు ఎందుకొచ్చాయి? అనడిగితే... ‘పెళ్లి చూపులు’లో సహజత్వం ఉంది. ‘నా సావు నేను సస్తా... నీకెందుకు?’ వంటి మాటలు నుంచి మొదలుపెడితే... ఇప్పటి యువతీయువకుల ఆలోచనా ధోరణి వరకూ ప్రతి అంశంలోనూ దర్శకుడు సహజత్వం చూపించాడు. ఏదో మన పక్కింట్లో, మనింట్లో జరిగే కథగా అనిపిస్తుంది. అందుకే, సూపర్ హిట్టయ్యింది. కంటెంట్ ఈజ్ కింగ్ సినిమా సక్సెస్, ఇప్పటివరకూ వచ్చిన అవార్డులు ఒకెత్తు అయితే... నేషనల్ అవార్డు రావడం మరో ఎత్తు. సూపర్ స్టార్స్ చేసిన చిత్రమా? కొత్తవాళ్లు చేసిన చిత్రమా? అని ఆలోచించకుండా... సినిమా హైప్తో, బడ్జెట్తో సంబంధం లేకుండా... మా చిత్రాన్ని గౌరవించిన ప్రేక్షకులకు నమస్కరిస్తున్నా. ‘కంటెంట్ ఈజ్ కింగ్’ అని మేము ఏ నమ్మకంతో అయితే సినిమా తీశామో? ప్రేక్షకులు ఆ నమ్మకాన్ని నిలబెట్టారు. ‘పెళ్లి చూపులు’కు భారీ విజయాన్ని అందించారు. దీనివల్ల నేను లేదా మరో కొత్త నిర్మాత... ఎవరైనా కంటెంట్ను నమ్ముకుని సినిమా తీయడానికి ముందుకొస్తారు. ఈ ప్రోత్సాహాన్ని మరో పదిమంది స్ఫూర్తిగా తీసుకుంటారని ఆశిస్తున్నా. ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందిస్తే... మిగతా అంశాలు ఏవీ చూడకుండా ఓటు వేస్తారని మరోసారి రుజువైంది. ఈ సందర్భంగా ‘పెళ్లి చూపులు’ టీమ్, నిర్మాత డి. సురేశ్బాబుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. – నిర్మాత రాజ్ కందుకూరి ప్రేక్షకుల వల్లే ఇది సాధ్యమైంది! ‘‘సూపర్ హ్యాపీ. ‘పెళ్ళి చూపులు’కు నేషనల్ అవార్డు వస్తుందని ఊహించలేదు. ఈ సినిమా రిలీజవుతుందా? లేదా? అని భయపడేవాణ్ణి. ప్రతి ఒక్కరి (ప్రేక్షకుల) ప్రశంసలతో ఇంత దూరం వచ్చింది. 2015లో మా నాన్నగారు చనిపోయారు. ఆయన ఆశీస్సులతోనే ఇవన్నీ దక్కుతున్నాయని అనుకుంటున్నా. నాన్నగారు ఉండుంటే ఈ సంతోషం వేరేలా ఉండేదేమో. పైనుంచి ఆయన చూసి, ఆశీర్వదిస్తున్నారనే నమ్మకంతో హ్యాపీగా ఉన్నాను. ఇది పక్కన పెడితే... మా నిర్మాతలు నా ప్రతి అడుగులోనూ సపోర్ట్ చేశారు. మంచి ప్రయత్నం చేద్దామనుకున్నాం తప్ప... డబ్బులొస్తాయి, వందరోజులు ఆడుతుంది, నేషనల్ అవార్డు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాల వల్లే ఇది సాధ్యమైంది. దీన్నో గొప్ప బాధ్యతగా భావిస్తున్నా. – దర్శకుడు తరుణ్ భాస్కర్ -
కంటెంట్ ఈజ్ కింగ్!
‘‘సినిమాకు హీరో, బడ్జెట్ ముఖ్యమే. కంటెంట్ కూడా చాలా ముఖ్యం. అది కింగ్ లాంటిది. మంచి కథ, ఆ కథకు సూటయ్యే హీరో సినిమా చేస్తే విజయం సాధించ వచ్చు’’ అన్నారు నిర్మాత రాజ్ కందుకూరి. ‘పెళ్లి చూపులు’తో ఘనవిజయం అందుకున్నారీయన. ఆ సినిమా 20 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిందని ఆయన తెలిపారు. ఆ చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్తో ‘సైన్మా’, విజయ్ దేవరకొండ హీరోగా మరో సినిమా ప్లానింగ్లో ఉన్నాయన్నారు. నేడు పుట్టినరోజు సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ‘‘9 ఏళ్లలో పది సినిమాలు తీశా. ‘పెళ్లి చూపులు’ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. ఒకట్రెండు కోట్ల బడ్జెట్లో కొత్త వాళ్లతో సినిమాలు చేయాలని ఆసక్తిగా ఉంది. నా దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నా. ఓ స్టార్ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నాం’’ అన్నారు. -
మిలియన్ మార్క్ చేరువలో..!
ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలు కూడా కలెక్షన్ల విషయంలో తడబడుతుంటే.. మంచి కంటెంట్తో తెరకెక్కుతున్న చిన్న సినిమాలు కూడా భారీ వసూళ్లతో సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్కు భిన్నంగా తెరకెక్కుతున్న సినిమాలు సక్సెస్తో పాటు మంచి లాభాలను కూడా సాధించి పెడుతున్నాయి. చిన్న సినిమాగా విడుదలైన పెళ్లి చూపులు కూడా అదే బాటలో సరికొత్త రికార్డ్లు సృష్టిస్తోంది. రెండు వారాల క్రితం రిలీజ్ అయిన పెళ్లిచూపులు ఇప్పటికే పది కోట్లకు పైగా వసూళు చేసింది. పుల్ రన్లో 20 కోట్ల మార్క్ను కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఓవర్ సీస్ లోనూ ఈ సినిమా సత్తా చాటుతోంది. ఇప్పటికే 8 లక్షల డాలర్లు వసూళు చేసిన పెళ్లిచూపులు మరో వారంలో మిలియన్ మార్క్ను రీచ్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
మన సినిమాలకు కొత్త చూపు
చిత్రం: ‘పెళ్ళిచూపులు’, నిర్మాతలు: రాజ్ కందుకూరి, యశ్ రంగినేని, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: తరుణ్ భాస్కర్ జీవితం సినిమాలా ఉండదు. కానీ, సినిమా గనక జీవితంలా ఉండగలిగితే? కచ్చితంగా రొటీన్ కమర్షియల్ ఫిల్మ్స్ నుంచి రిలీఫ్గా ఉంటుంది. ‘పెళ్ళి చూపులు’ అలాంటిదే! ఇంజనీరింగ్ పూర్తి చేయలేని ప్రశాంత్ (విజయ్ దేవరకొండ) వంటల్లో దిట్ట కావాలనుకుంటాడు. పెళ్ళయితే జీవితం కుదుటపడుతుందన్న జోస్యుడి మాటలతో, హీరోని పెళ్ళిచూపులకు తీసుకువెళతాడు తండ్రి (కేదార్ శంకర్). అక్కడ పెళ్ళిచూపుల్లో విచిత్ర పరిస్థితుల్లో చిత్ర (రీతూ వర్మ)ను కలుస్తాడు. ఎం.బి.ఏ చదివిన చిత్ర ఆస్ట్రేలియా వెళ్ళి, పై చదువులు చదవాలనుకుంటుంది. అందుకు డబ్బు సంపాదించడానికి వీలుగా సంచార ఆహారశాలగా ‘ఫుడ్ ట్రక్’ను పెట్టడానికి సిద్ధపడుతుంది. ఆమె తండ్రి (గురురాజ్ మానేపల్లి) మాత్రం పెళ్ళి చేయాలనుకుంటూ ఉంటాడు. వచ్చిన సంబంధాల్ని హీరోయిన్ తిప్పికొడుతుంటుంది. ఆ టైమ్లో పొరపాటు అడ్రస్కు హీరో వెళ్ళడంతో, హీరో హీరోయిన్ల పెళ్ళిచూపుల వుతాయి. ‘ఫుడ్ ట్రక్’ ఐడియాకూ, ‘షెఫ్’ కావాలన్న హీరో కలకూ ముడి కుదురుతుందని హీరోయిన్, హీరోని అడుగుతుంది. మరి, ఫుడ్ ట్రక్ ఐడియా, హీరోయిన్ ఆస్ట్రేలియా కల ఏమయ్యాయన్నది మిగతా ఫిల్మ్. ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్లో ఫస్టాఫ్ అంతా ఈ కాలపు కాలేజీ కుర్రాళ్ళ ప్రవర్తన, పిల్లల్ని స్థిరపడేలా చేయడంపై తల్లితండ్రుల ఆందోళనతో వినోదాత్మకంగా నడుస్తుంది. స్ట్రెయిట్ నేరేషన్లో సెకండాఫ్ అంతా సినిమాలో అసలు కథ, పాత్రల మధ్య సిసలైన అంతః సంఘర్షణ, కెరీర్ తొలి దశలో కుర్రకారుకుండే శంకలు, స్వతహాగా మంచివాళ్ళయినా స్నేహితుల మధ్య వచ్చే సగటు ఇగో సమస్యలు, ప్రేమను వ్యక్తీకరించడానికి అహం అడ్డొచ్చే సందర్భాలు - ఇలా మరింత బలమైన భావోద్వేగాలతో నడుస్తుంది. పాత్రల ప్రవర్తనలో, స్క్రిప్టులో ఎన్నో పొరలున్నట్లు, తెలివిగా అల్లుకున్నట్లు అర్థమవుతుంది. వీడియో కుకింగ్ పాఠాలు, వైరల్ వీడియో, వెర్రివేషాల ప్రాంక్ వీడియోల లాంటి నేటి ట్రెండ్స్ చాలా ఫిల్మ్లో ఉన్నాయి. గతంలో ‘అనుకోకుండా’, ‘సైన్మా’ లాంటి లఘు చిత్రాలకు దర్శకత్వం వహించిన యువకుడు తరుణ్ భాస్కర్కు ఇది తొలి సినిమా. దాదాపు పూర్తిగా స్థానిక హైదరాబాద్ టాలెంట్ నటించిన చిత్రమిది. ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ విజయ్ దేవరకొండ, రీతూ వర్మ, హీరో ఫ్రెండ్స్గా తెలంగాణ మాండలికంలో మాట్లాడే ప్రియదర్శి, అభయ్ - ఇలా ప్రతి ఒక్కరూ చాలా సహజమైన పాత్రలుగా అనిపిస్తారే తప్ప, నటించారన్న ఫీలింగ్ రాదు. యువ సంగీత దర్శకుడు వివేక్ సాగర్కీ ఇదే తొలి చిత్రం. పరిమిత బడ్జెట్లో తీసినప్పటికీ తెరపై సినిమా రిచ్గా కనిపించడం (కెమేరా నాగేశ్), అనుభూతి పెంచే నేపథ్య సంగీతం, గానం ఈ సినిమాకున్న పెద్ద బలం. మనసుకు పట్టే సీన్లూ చాలా ఉన్నాయి. సినిమాలో చాలా పాత్రలు నిత్యం మనకు తారసపడేవే! అందుకే, తెరపై మనల్ని మనం చూసుకుంటాం. సహజమైన డైలాగులు, జోక్లు నవ్విస్తాయి. ఒక్కముక్కలో నాగేశ్ కుకునూర్ ‘హైదరాబాద్ బ్లూస్’, శేఖర్ కమ్ముల ‘ఆనంద్’ ట్రెండ్కి కొనసాగింపు... తెలుగు సిన్మా ఆలస్యంగానైనా అసలంటూ మారుతోందనడానికి నిదర్శనం... సకుటుంబ సత్కాలక్షేపం - ఈ ‘పెళ్ళిచూపులు’. - రెంటాల జయదేవ -
పెళ్లిచూపులు దర్శకుడితో వెంకీ
రిలీజ్కు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న పెళ్లిచూపులు సినిమా, రిలీజ్ తరువాత కూడా అదే హవాను కంటిన్యూ చేస్తోంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్నే సాధించింది. షార్ట్ ఫిలింస్తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్, ఈ సినిమాతో వెండితెర మీద కూడా సత్తా చాటాడు. దీంతో క్రేజీ ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు కథను ముందుగా సురేష్ బాబుకు చెప్పాడు. సురేష్ స్వయంగా సినిమాను నిర్మించకుండా రాజ్ కందుకూరి నిర్మాణంలో తన సమర్పణలో సినిమాను రూపొందించారు. అయితే పెళ్లిచూపులు ఫస్ట కాపీ చూసిన సురేష్ బాబు వెంటనే తరుణ్ భాస్కర్కు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సినిమా అవకాశం ఇచ్చాడు. తాజాగా సురేష్ ప్రొడక్షన్స్లో తరుణ్ చేయబోయే సినిమా విషయంలో క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం బాబు బంగారం రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న వెంకటేష్, తరువాత సాలాఖద్దూస్ రీమేక్లో నటించనున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. -
మా బ్యానర్లో తరుణ్ ఓ చిత్రం చేయాలి!
‘‘ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎంత బావుంటుందో తెలుస్తోంది. యంగ్ టీం అంతా కష్టపడి మంచి సినిమా తీశారు. తప్పకుండా ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. పాటలు వింటుంటే వివేక్ సాగర్ ఈ చిత్రం కోసం ఎంత ఎఫర్ట్ పెట్టాడో తెలుస్తోంది. నాగేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. డెరైక్టర్ తరుణ్ భాస్కర్ మా బ్యానర్లో ఓ చిత్రం చేయాలని కోరుకుంటున్నా’’ అని నిర్మాత డి.సురేశ్బాబు అన్నారు. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, యస్. రాగినేని నిర్మించిన చిత్రం ‘పెళ్లిచూపులు’. వివేక్ సాగర్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని సురేశ్బాబు విడుదల చేసి దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు అందించారు. ట్రైలర్ను హీరో సందీప్ కిషన్, దర్శకుడు క్రాంతిమాధవ్ విడుదల చేశారు. చిత్రదర్శకుడు మాట్లాడుతూ- ‘‘రియల్ లైఫ్ స్టోరీతో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టై నర్గా తెరకెక్కిన చిత్రమిది. నా తల్లితండ్రుల్లా ఈ చిత్ర నిర్మాతలు సపోర్ట్ చేశా రు. మాకు బాగా సహకరించిన సురేశ్బాబుగారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘నేనీ చిత్రం చేయడానికి కారణం సురేశ్బాబుగారు. తరుణ్ భాస్కర్ను ఆయన నా వద్దకు పంపి స్టోరీ వినమన్నారు. భవిష్యత్లో నేను నిర్మించే చిత్రాల్లో ‘పెళ్లి చూపులు’ గర్వపడే చిత్రమవుతుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాతల్లో ఒకరైన రాజ్ కందుకూరి చెప్పారు. నిర్మాతలు యస్. రాగినేని, అశోక్కుమార్, కేఎల్ దామోదర ప్రసాద్, దర్శకులు అల్లాణి శ్రీధర్, దశరథ్, హీరోయిన్ లావణ్యాత్రిపాఠి, సంగీత దర్శకులు వివేక్ సాగర్, రఘు కుంచె తదితరులు పాల్గొన్నారు.