Thank you
-
వాళ్లకు సారీ చెప్పారా? వీళ్లతో థ్యాంక్యూ అన్నారా?
365 రోజులు... జీవితమనే అంతులేని ప్రయాణంలో 2023వ సంవత్సరం ఈ 365 రోజులు మనకెన్నో జ్ఞాపకాలు, అనుభవాలు, సంతోషాలు, సవాళ్లు ఇచ్చి ఉంటుంది. ఈ ప్రయాణం మనం ఒక్కరమేచేయగలమా? ఎందరో సాయం చేసి ఉంటారు. వారికి మనస్ఫూర్తిగా థ్యాంక్యూ చెప్పామో లేదో. ఇప్పుడు చెబుదామా. కొందరిని తెలిసో తెలియకో హర్ట్ చేసి ఉంటాం. ఎంత బాధ పడ్డారో ఏమో.. సారీ చెబుదామా. పాత సంవత్సరం అకౌంట్లు సెటిల్ చేసుకొని కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదామా? ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చి ఉంటాయి. ఎవరినో సలహా అడిగి ఉంటాం. హాస్పిటల్కు తోడు రమ్మని చెప్పి ఉంటాం. అప్పు అడిగి ఉంటాం. వారు ఇచ్చి ఉంటారు. ఆ హడావిడిలో వారికి సరైన థ్యాంక్యూ చెప్పి ఉండం. పట్టించుకోరులే అనుకుంటాం. కాని పట్టించుకుంటారు. మనకు ఈ సంవత్సరం ఇంత సాయం చేసిన వారికి ఈ సంవత్సరాంతంలో కాల్ చేసి, లేదా ఇంటికి వెళ్లి, ఈ సంవత్సరం ఫలానా టైమ్లో మీరు నాకు ఈ సాయం చేశారు... థ్యాంక్యూ అని చెప్పి చూడండి... వాళ్ల కళ్లల్లో నీళ్లు చిప్పిల్లుతాయి... మీ కళ్లల్లో కూడా. చెబుదామా? సాయం చేసిన వాళ్లు అవతలి వారి నుంచి కృతజ్ఞతను ఆశించరు కానీ అలాగని కృతజ్ఞత తెలియచేయడం కనీస బాధ్యత కదా! అసలు మేలు చేస్తేనే థ్యాంక్యూ చెప్పాలా? మీ ఇరుగున ఒక ఇల్లు, పొరుగున ఒక ఇల్లు ఉంటుంది. వారితో ఏ తగాదా గొడవా లేకుండానే హ్యాపీగా ఈ సంవత్సరం గడిచిపోయింది. వాళ్లను పలకరించి ‘ఈ సంవత్సరమంతా మనం స్నేహంగా ఉన్నాం. అందుకు థ్యాంక్యూ. వచ్చే సంవత్సరం కూడా ఇలాగే ఉందాం’ అని చిన్న స్వీట్ ఇచ్చి చూడండి. ఆ మేజిక్ ఎలా ఉంటుందో. మీ ఆఫీస్లో కలీగ్స్తో ‘థ్యాంక్యూ... ఈ సంవత్సరమంతా మనం కలిసి మెలిసి పని చేసినందుకు’ అని టీకి పిలవండి... అదీ చిన్న మేజిక్ కాదు. ఒక సంవత్సరం దాటి వచ్చినందుకు ఎందరికో కృతజ్ఞత ప్రకటించాలి. తల్లిదండ్రులకు, తోడ బుట్టిన వారికి, మిత్రులకు... వీరున్నారనే ధైర్యం వల్లే కదా... ప్రతి రోజునూ చులాగ్గా దాటాం. వీరికి థ్యాంక్స్ చెప్పండి: ఈ సంవత్సరమంతా మనకు ఇంటి సాయం చేసిన పని మనిషికి, కారు డ్రైవర్కు, ప్రయాణాలకు టికెట్లు బుక్ చేసిచ్చిన ఏజెంట్కు, పిల్లలకు ట్యూషన్ చెప్పిన టీచర్కు, అపార్ట్మెంట్ వాచ్మెన్కు, ఫ్యామిలీ డాక్టర్కు... డబ్బు చెల్లించే పని చేయించుకుని ఉండొచ్చు. డబ్బు ఇచ్చినా అలాంటి పని చేసేవారు దొరకనప్పుడు తెలుస్తుంది వారి విలువ. అందుకే థ్యాంక్స్ చెప్పండి. బాగుంటుంది. ఇక మీకు సపోర్ట్గా నిలిచిన స్నేహితులకు కాల్ చేసి, వారు ఏ సందర్భంలో ఎంత సపోర్ట్ చేశారో చెప్పి థ్యాంక్స్ చెప్పండి. ఊళ్లో ఉన్న అమ్మా నాన్నలను ఎవరో ఒక పక్కింటి పిన్ని పలకరించి బాగోగులు గమనిస్తుంటుంది. ఆమెకు థ్యాంక్స్ చెప్పండి. మన పిల్లలను రోజూ ఆటకు పిలిచి వారితో స్నేహంగా ఆడుతున్న పిల్లలకూ థ్యాంక్స్ చెప్పండి. వారు ఇంకా విలువైన వారు. అన్నింటికి మించి మన పట్ల కనికరంగా ఉన్న ప్రకృతికి. కరుణతో ఉన్న రుతువులకి, తిన్న ప్రతి అన్నం ముద్దకి, మీరు విశ్వసించే ఈశ్వరునికి థ్యాంక్స్ చెప్పండి. వీరితో సారీ చెప్పండి: ఈ సంవత్సరం రెండు మూడుసార్లు కూడా వెళ్లి చూడటం కుదరని తల్లిదండ్రులకు, తోబుట్టువులకు, అన్నదమ్ములకు... ‘సారీ.. మీరంటే ఎంతో ప్రేమ... కాని కలవడం కుదరలేదు’ అని చెప్పండి. మనసు తేలిక అవుతుంది. ఎందరో స్నేహితులు, బంధువులు శుభకార్యాలకు పిలిచి ఉంటారు. వెళ్లి ఉండరు. వారికి పనిగట్టుకుని ఫోన్ చేసి సారీ చెప్పండి. ఇకపై తప్పక వస్తామని చెప్పండి. బాగా ఆత్మీయులు కొందరు స్వర్గస్తులై ఉంటారు. ఏదో కారణాన వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ఉండరు. ఇప్పుడు ఫోన్ చేసి వీలైతే కలిసి సహేతుకమైన కారణం చెప్పి సారీ చెప్పండి. కొందరు మీరు చేయదగ్గ సాయం అడిగినా మీరు నిర్లక్ష్యంతో చేసి ఉండరు. వారు బాధ పడిన విషయం కూడా మీకు తెలిసి ఉండదు. గుర్తు తెచ్చుకుని సారీ చెప్పండి. ఎవరికో ఏవో వాగ్దానాలు చేసి తప్పి ఉంటారు. సారీ చెప్పండి. భార్య భర్తను బాధించిన సందర్భాలకు, భర్త భార్యను కష్టపెట్టిన సందర్భాలకు తప్పక ఒకరికొకరు సారీ చెప్పాలి. పిల్లల్ని చిన్నబుచ్చిన సందర్భాలకు కూడా వారికి సారీ చెప్పాలి. చేజారిన బంధాలు, స్నేహాలు... పలచబడిన బాంధవ్యాలు కేవలం ‘థ్యాంక్యూ’, ‘సారీ’ అనే రెండు పదాలతో తిరిగి అతుక్కుంటాయి. రెండు మూడు రోజులు టైమ్ ఉంది. తెమిలి కూచుని ఇతరుల ఒప్పులను, మీ తప్పులను లిస్ట్ చేసుకుని ఎవరికి ఏం చెప్పాలో అది చెప్పి కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా మొదలెట్టండి. -
మా తరానికి విద్యా ప్రదాత సీఎం జగన్
సాక్షి, అమరావతి, నెట్వర్క్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న మా మాటలను ప్రపంచమంతా ఆసక్తిగా ఆలకించిందంటే మన విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల పుణ్యమే! చెట్ల కింద సాగే వానాకాలం చదువులను సంస్కరణల బాట పట్టించిన సీఎం జగన్ సర్దే ఆ గొప్పతనమంతా! చదువులతోటే పేదరికాన్ని ఎదిరిద్దామన్న ఆయన పిలుపు అక్షర సత్యం! విద్యారంగంలో ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తే అత్యుత్తమ ఫలితాలను సాధించవచ్చో దేశానికే మార్గ నిర్దేశం చేశారు. ప్రతిభతో రాణిస్తున్న పేదింటి బిడ్డలకు దక్కిన అరుదైన గౌరవమిది. ఐరాస, వరల్డ్ బ్యాంక్ వేదికగా అంతర్జాతీయ ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించడం.. ఎన్నడూ రాష్ట్రం దాటని మేం ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్లో కాలు మోపడం.. కాణీ ఖర్చు లేకుండా విదేశాలకు వెళ్లి రావడం.. ఇదంతా ఇంకా నమ్మశక్యంగా లేదు!.. ఇదీ నిరుపేద కుటుంబాల్లో జన్మించి అంతర్జాతీయ వేదికలపై అందరినీ ఆకట్టుకున్న 10 మంది విద్యార్థుల మనోగతం. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 45 లక్షల మంది విద్యార్థులకు ప్రతినిధులుగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వీరంతా సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు అమెరికాలో పర్యటించి వివిధ వేదికలపై తమ గళాన్ని సగర్వంగా వినిపించారు. ప్రభుత్వ బడి నుంచి ఐఎంఎఫ్కు.. ఎకరం పొలంతో పాటు కేబుల్ ఆపరేటింగ్ పనులు చేసుకునే రైతు బిడ్డనైన నాకు 190 దేశాలకు సభ్యత్వమున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో మాట్లాడే అవకాశం దక్కడం నిజంగా అదృష్టమే. అది సీఎం జగన్ సర్ తెచ్చిన విద్యా సంస్కరణల ఫలితమే. మన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానాన్ని అగ్రరాజ్యం ప్రతినిధులకు వివరించడం చాలా సంతోషంగా ఉంది. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, షూలు, నాణ్యమైన పోషకాహారం, ట్యాబ్లు, కార్పొరేట్ స్థాయిలో పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించిన విషయాన్ని తెలియచేశా. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుబ్రమణ్యన్ మాలో ఎంతో స్ఫూర్తి నింపారు. ఏ స్థాయికి ఎదిగినా మన మూలాలను మరువకూడదని, రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను ఖండాతరాలకు విస్తరింపజేయాలని నిర్ణయించుకున్నా. పేద పిల్లలకు జగనన్న ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకునే బాధ్యత విద్యార్థులపైనే ఉంది. – వంజివాకం యోగీశ్వర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నరసింగాపురం, తిరుపతి జిల్లా ఎన్నడూ చూడని సదుపాయాలు.. మా బిడ్డలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాం. గతంలో ఎన్నడూ చూడని సదుపాయాలను సీఎం జగన్ ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రభుత్వ విద్యావ్యవస్థలో అద్భుతమైన సంస్కరణలు తెచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. – నాగరాజు, విజయ (యోగీశ్వర్ తల్లిదండ్రులు, అక్క) నిజంగా.. నేనేనా! ఐరాస, వరల్డ్ బ్యాంకుల్లో ప్రసంగించింది నేనేనా అని ఆశ్చర్యంగా ఉంది. అమెరికా అధ్యక్ష భవనాన్ని సందర్శించడాన్ని కూడా నమ్మలేకున్నా. సోషల్ పుస్తకంలో ఫొటో మాత్రమే చూసిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఒక రోజంతా ఉన్నాం. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ఎకో అంబాసిడర్ కార్యక్రమంలో పాల్గొని ఇతర దేశాల విద్యార్థులతో ముచ్చటించి వారి సంస్కృతిని తెలుసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, పథకాలను వివరించాం. ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి నాడు–నేడు, జగనన్న విద్యాదీవెన, గోరుముద్ద తదితర పథకాల అమలు తీరుతోపాటు బడుల్లో తాగునీరు, టాయిలెట్స్, కాంపౌండ్ వాల్స్, ల్యాబ్స్తో పాటు జగనన్న కానుక కింద స్కూల్ యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు, షూలు ప్రతి విద్యార్థికీ ఉచితంగా ఇవ్వడంపై వరల్డ్ బ్యాంక్, యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికారులతో మాట్లాడాం. నయాగరా వాటర్ ఫాల్స్ చూశాం. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, 2001లో కూలిపోయిన ట్విన్ టవర్స్ చరిత్ర తెలుసుకున్నా. – అల్లం రిషితారెడ్డి, కస్పా మున్సిపల్ ఉన్నత పాఠశాల, విజయనగరం ఇంత గుర్తింపు ప్రభుత్వ చలవే.. గతంలో మా ఇద్దరు అమ్మాయిలను ప్రైవేట్ స్కూళ్లలో చదివించాం. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాం. ఇద్దరికీ నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్లు వచ్చాయి. ప్రైవేట్ విద్యాసంస్థల్లోనే చదివించి ఉంటే ఇంత గుర్తింపు లభించేది కాదు. – ఉదయలక్ష్మి, రామకృష్ణారెడ్డి (రిషితారెడ్డి తల్లిదండ్రులు) విద్యా సంస్కరణల అమలుతో.. మా అమ్మ ఫాతిమా వ్యవసాయ కూలీ. మాలాంటి పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో అమెరికా వెళ్లి అంతర్జాతీయ వేదికలపై ప్రసగించే అవకాశాన్ని సీఎం జగన్ సర్ కల్పించారు. అమెరికాలో 15 రోజుల పర్యటనలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా. విద్యాపరంగా ఎలాంటి సంస్కరణలు అమలుపరిస్తే దేశం అభివృద్ధి చెందుతుందో ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్లో విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నాడు–నేడు, విద్యాకానుక, డిజిటల్ బోధన, గోరుముద్ద, అమ్మఒడి లాంటి పథకాలను మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేకంగా స్వేచ్ఛ పథకాన్ని అమలు చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతోంది. – షేక్ అమ్మాజాన్, ఏపీ ఆర్ఎస్, వేంపల్లి, శ్రీసత్యసాయి జిల్లా పేద కుటుంబాలకు విద్యా ప్రదాత ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్ది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్న సీఎం జగన్ మా తరంలో పేద కుటుంబాలకు విద్యా ప్రదాతగా నిలిచిపోతారు. మన రాష్ట్రంలో తెచ్చిన విద్యా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఐరాస వేదికగా వీటిని చాటిచెప్పాం. ఈ పర్యటనను కలలో కూడా ఊహించలేదు. మాలాంటి పేద విద్యార్థులను ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ప్రోత్సహించి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం వల్లే ఈ అవకాశం లభించింది. రెండు వారాల పాటు ఎందరో ప్రముఖులతో చర్చించడం గర్వంగా ఉంది. – మోతుకూరి చంద్రలేఖ, కేజీబీవీ, ఎటపాక, ఏఎస్ఆర్ జిల్లా ధీమాగా చదువులు.. కేజీబీవీలో చదువుకున్న నా బిడ్డకు ఈ అవకాశాన్ని కల్పిం చిన సీఎం జగన్కు రుణపడి ఉంటాం. ఈ ప్రభుత్వం వచ్చాక నాలాంటి తండ్రులకు పిల్లల చదువులపై బెంగ పోయింది. డబ్బున్న వారు, ఉద్యోగాలు చేసేవారు కూడా ఇప్పుడు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించేందుకు ఆసక్తి చూపడం విద్యా సంస్కరణల పుణ్యమే. – రామారావు, ఆటో డ్రైవర్ (చంద్రలేఖ తండ్రి) ప్రపంచానికి చాటి చెప్పా.. మా నాన్న దస్తగిరి లారీ డ్రైవర్. అమ్మ రామలక్ష్మి రజక వృత్తిలో ఉంది. పేద కుటుంబం నుంచి వచ్చిన నాకు అమెరికా వెళ్లి అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించే అవకాశాన్ని సీఎం జగన్ కల్పిం చారు. ఈ పర్యటన జీవితాంతం గుర్తుంటుంది. న్యూయార్క్లో జరిగిన ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్లో మాట్లాడే అవకాశం నాకు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రపంచానికి తెలియచేశా. నాడు– నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించా. ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు ఎంతో మెరుగయ్యాయి. టాయిలెట్ల శుభ్రతతో పాటు బాలికలకు ప్రత్యేకంగా న్యాప్కిన్ల వాడకంపై అవగాహన కల్పించడం, అమ్మఒడి పథకంతో స్కూళ్లలో డ్రాప్అవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ అంశాలను ఐరాస ప్రతినిధులకు వివరించా. మన దేశ ఆర్థి క వ్యవస్థలో యువత భాగస్వామ్యంపై ప్రసంగించా. ఐఐటీ గ్రాడ్యుయేట్స్లో చాలా మంది స్టార్టప్లు ప్రారంభించి ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని చెప్పా. – చాకలి రాజేశ్వరి, ఏపీ మోడల్ స్కూల్, నంద్యాల పక్క ఊరు వెళ్లాలన్నా చార్జీల గురించి ఆలోచించే మాకు.. కాకినాడ జిల్లా తీరప్రాంత గ్రామమైన రమణక్కపేటలో నిరుపేద ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు కుటుంబంలో జన్మించిన నాకు అంతర్జాతీయ వేదికపై ప్రసంగించేలా సీఎం జగన్ సార్ గొప్ప అవకాశాన్ని కల్పించారు. నాన్న సింహాచలం సెక్యూరిటీ గార్డు కాగా అమ్మ శాంతి గృహిణి. నేను, చెల్లి, తమ్ముడు.. ఇదీ మా కుటుంబం. నాన్న కొద్దిపాటి సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తూ మమ్మల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. పక్క ఊరు వెళ్లాలన్నా చార్జీల గురించి ఆలోచించే కుటుంబం నుంచి వచ్చిన నేను అమెరికా వెళ్లానంటే అది జగన్ సార్ విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పుల పుణ్యమే. విద్యతోనే అన్నీ సాధ్యమవుతాయని సీఎం సార్ చెబుతుంటారు. అది నిజమే. అందుకు నేనే నిదర్శనం. సాధారణ విద్యార్థులను ప్రభుత్వ ప్రతినిధులుగా అమెరికా పంపించి సీఎం జగన్ సర్ చరిత్ర సృష్టించారు. భవిష్యత్లో ఐఏఎస్ అయ్యి సీఎం జగన్ సార్ ఆశయ సాధనకు కృషిచేస్తా. రాష్ట్రంలోని విద్యా సంస్కరణలు విదేశాల్లో సైతం గుర్తింపు పొందాయి. కొలంబియా యూనివర్సిటీలో మాట్లాడే అవకాశం నాకు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గౌరవప్రదమైన జీవనోపాధులపై వివరించడం ఆనందంగా ఉంది. – దడాల జ్యోత్స్న, సాంఘిక సంక్షేమ గురుకులపాఠశాల,వెంకటాపురం, కాకినాడ జిల్లా మరపురాని అనుభూతి.. ఐరాస, కొలంబియా యూనివర్సిటీల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొన్నా. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలపై మాట్లాడటం మరపురాని అనుభూతి. మా జీవితాన్ని మలుచుకునేందుకు ఈ పర్యటన ఎంతో స్ఫూర్తినిచ్చింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువలేం. విద్యా వ్యవస్థలో తెచ్చిన సంస్కరణలను సద్వినియోగం చేసుకుంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. – పసుపులేటి గాయత్రి, జడ్పీహెచ్ఎస్, వట్లూరు, పెదపాడు మండలం, ఏలూరు జిల్లా ఎంతో నేర్చుకున్నాం.. నాకు ఇంత అరుదైన అవకాశం జగన్ మామయ్య పాలనలో దక్కడం, అందుకు ప్రభుత్వ పాఠశాలలు వేదిక కావడం ఎన్నటికీ మర్చిపోలేను. సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు జరిగిన విదేశీ విజ్ఞాన యాత్రలో ఐరాస జనరల్ అసెంబ్లీ హాల్ని సందర్శించాం. కొలంబియా యూనివర్సిటీలో ఎకో ఎంబాసిడర్ ప్రోగ్రాంలో పాల్గొన్నాం. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ట్విన్ టవర్స్ కూలిన చోటు, నయాగరా జలపాతం ఇలా వివిధ ప్రాంతాలను సందర్శించి అక్కడి సంస్కృతిపై అవగాహన పెంచుకున్నాం. విదేశీ విద్యార్థులతో ముచ్చటించడం కొత్త అనుభూతిని కలిగించింది. ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఆర్థి క విషయాలు, అంతర్జాతీయ ఆర్థి క అవసరాలు, ఆర్థిక పరిపుష్టికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తదితర అంశాలను నేర్చుకున్నాం. అమెరికా అధ్యక్షుడు నివసించే వైట్ హౌస్ను సందర్శించే అవకాశం రావడం మరపురాని అనుభూతి. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంలో 12 శాతం విద్యపై ఖర్చు చేయటాన్ని బట్టి చదువులకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. – జి.గణేష్ అంజన సాయి, వల్లూరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా గిరిజన బిడ్డకు గర్వకారణం.. మాది కురుపాం మండలం కొండబారిడి గిరిజన గ్రామం. కుటుంబ కారణాలతో తల్లిదండ్రులు విడిపోయారు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా. ఏసీ బస్సు అంటే ఏమిటో కూడా తెలియదు. గతంలో ఓసారి విశాఖపట్నం, మరోసారి సైన్స్ ఎగ్జిబిషన్ కోసం విజయవాడ వెళ్లా. అలాంటిది మన రాష్ట్ర ప్రతినిధిగా విమానం ఎక్కి ఏకంగా అమెరికా వెళ్లి రావడం కలగానే ఉంది. మన విద్యా సంస్కరణలు, సంక్షేమ పథకాలను ఐరాస, యూఎస్ స్టేట్ అధికారులకు వివరించా. ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ విద్యా విధానంతో విద్యార్థులకు కలుగుతున్న ప్రయోజనాలను కొలంబియా యూనివర్సిటీలో జరిగిన సదస్సులో తెలియచేశా. వివిధ దేశాల విద్యార్థులతో మాట్లాడి భిన్న సంస్కృతులను తెలుసుకునే అవకాశాన్ని కల్పిం చిన ముఖ్యమంత్రి జగన్కు కృతజ్ఞతలు. – సామల మనస్విని, కేజీబీవీ, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, మన్యం జిల్లా ప్రభుత్వ స్కూళ్ల విశిష్టతను చాటిచెప్పాం.. నాన్న సోమనాథ్, అమ్మ గంగమ్మ వ్యవసాయ కూలీలు. పేద కుటుంబాల నుంచి వచ్చిన మేం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిం చిన సదుపాయాలు, విశిష్టతను ప్రపంచానికి తెలియచేశాం. విద్యారంగంలో మన రాష్ట్రం ఏ స్థాయిలో రాణిస్తోందో చాటాం. ఈ పర్యటనలో చాలా విషయాలు నేర్చుకున్నా. యూఎన్వో హెడ్ క్వార్టర్స్, ఐఎంఎఫ్ సమావేశంలో ప్రసంగించడం మరచిపోలేని అనుభూతి. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, నయగారా ఫాల్స్, మ్యూజియం, వైట్హౌస్ లాంటి ప్రదేశాలను సందర్శించడం మాలాంటి వారికి అసాధ్యం. సీఎం జగన్ సర్ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పించి బాగా చదువుకోమని ప్రోత్సహిస్తున్నారు. ప్రతిభ చాటిన మాకు మరువలేని అవకాశాన్ని కల్పిం చారు. చదువుల్లో రాణించే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అంతర్జాతీయ సదస్సులకు ఎంపిక చేయడం దేశంలో ఇదే ప్రథమం. – మాల శివలింగమ్మ, కేజీబీవీ, ఆదోని, కర్నూలు జిల్లా -
గ్రామ స్వరాజ్యానికి నాలుగేళ్లు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ (జీఎస్డబ్ల్యూఎస్) వ్యవస్థ ద్వారా సమర్థమైన సేవలను ప్రారంభించి సోమవారానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జీఎస్డబ్ల్యూఎస్ ఉద్యోగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గాంధీజీ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్ర భారతావనిలో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన సంక్షేమరాజ్య నిర్మాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చి.. 1.30 లక్షలకుపైగా యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించారని కొనియాడారు. పేదలకు సంక్షేమ ఫలాలను పారదర్శకంగా అందించడంలో తమను భాగస్వాముల్ని చేయడంపై జీఎస్డబ్ల్యూఎస్ రాష్ట్ర నాయకులు బత్తుల అంకమ్మరావు, నిఖిల్కృష్ణ, కిషోర్ సంతోషం వ్యక్తం చేశారు. -
ప్రాణదాతలకు కృతజ్ఞతలు!
సత్యసాయి: జీవితంపై విరక్తితో ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడిని పోలీసులు సకాలంలో ఆస్పత్రిలో చేర్పించి, ప్రాణాలు కాపాడారు. ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్న అనంతరం ఆ యువకుడు పోలీసులను కలసి కృతజ్ఞతలు తెలిపాడు. వివరాలు.. శెట్టూరు మండలం మాలేపల్లికి చెందిన వన్నూరుస్వామి వారం రోజుల క్రితం కుటుంబ సమస్యలతో విసుగు చెంది జీవితంపై విరక్తితో కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు రోడ్డు పక్కన పురుగుల మందు తాగాడు. అపస్మారకస్థితిలో పడి ఉన్న యువకుడిని అదే సమయంలో అటుగా వెళ్లిన పట్టణ సీఐ తేజమూర్తి, ఎస్ఐ నాగమధు గమనించి, వెంటనే స్థానిక సీహెచ్సీకి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్న వన్నూరు స్వామి గురువారం కళ్యాణదుర్గానికి వచ్చి నేరుగా తనను కాపాడిన పోలీసులను కలసి కృతజ్ఞతలు తెలిపాడు. తన తల్లి మరణించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు వివరించాడు. -
‘థ్యాంక్ యూ’ చెప్పలేదని పొడిచి చంపాడు..!
వాషింగ్టన్: చిన్న చిన్న గొడవలకే కొందరు సహనం కోల్పోతున్నారు. ఎదుటివారిపై దాడి చేసి వారి ప్రాణాలు పోయేందుకు కారణమవుతున్నారు. అలాంటి సంఘటనే అమెరికాలోని బ్రూక్లిన్లో వెలుగు చూసింది. ‘థ్యాంక్ యూ’ చెప్పలేదని మొదలైన వాగ్వాదం.. చిలికి చిలికి గాలివానగా మారి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేందుకు దారి తీసింది. 37 ఏళ్ల వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడవటంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు. పార్క్ స్లోప్లోని 4వ అవెన్యూ భవనం స్మోకింగ్ దుకాణం వద్ద ఈ గొడవ జరిగింది. ఈ సంఘటన స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదైంది. తెల్ల రంగు టీషర్ట్ ధరించిన బాధితుడు లోపలికి రాగా.. మరో వ్యక్తి డోర్ తెరిచాడు. అయితే, డోర్ తెరిచినందుకు కృతజ్ఞతలు తెలపకపోవటంపై లోపలి వ్యక్తి ప్రశ్నించాడు. దాంతో తాను తెరవాలని కోరలేదని, థ్యాంక్ యూ చెప్పనని స్పష్టం చేశాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. బయటకు వెళ్లిన నిందితుడు తన సైకిల్ పై ఉన్న కత్తిని తీసుకొచ్చి బెదిరించాడు. బాధితుడు వెనక్కి తగ్గకుండా రెచ్చగొట్టగా.. పొట్ట, మెడ భాగంలో కత్తితో దాడి చేశాడు నిందితుడు. తీవ్రంగా రక్తస్రావమైంది. న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ బ్రూక్లిన్ మెథొడిస్ట్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇదీ చదవండి: టిక్టాక్ ప్రేమ.. భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య -
Thank You Movie: ‘థ్యాంక్యూ’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు.. ఎక్కడ?
‘మనం’లాంటి క్లాసిక్ హిట్ తర్వాత నాగచైతన్య, విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్ వచ్చిన చిత్రం ‘థ్యాంక్యూ’. రాశీఖన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో అవికా గోర్, మాళవికా నాయర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య జులై 22 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టలేకపోయింది. దీంతో థియేటర్స్లో విడుదలై మూడు వారాలు గడకముందే కంటే ముందే ఈ చిత్రంలో ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆగస్ట్ 11 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు సంస్థ విడుదల తేదిని అధికారికంగా తెలియజేస్తూ కొత్త ట్రైలర్ని విడుదల చేసింది. they are here to drown you into a pleasant sea of wholesomeness with a very distinct storyline 🌼#ThankYouOnPrime, Aug 11 pic.twitter.com/S4WOcwpEAc — prime video IN (@PrimeVideoIN) August 9, 2022 ‘థ్యాంక్యూ’ కథేంటంటే.. మనం ఓ స్థాయికి చేరాక.. మనకు సహాయం చేసిన వారిని మరచిపోవద్దు అనే మంచి సందేశంతో ‘థాంక్యూ’మూవీ తెరకెక్కింది. అభి అలియాస్ అభిరామ్(నాగచైతన్య) ఉద్యోగం కోసం అమెరికా వెళ్తాడు. అక్కడ రావ్ కన్సల్టెన్సీ చీఫ్ రావు (ప్రకాశ్రాజ్) అభికి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు ఇప్పిస్తాడు. కానీ అభికి మాత్రం ఉద్యోగం చేయాలని ఉండడు. ఓ యాప్ని తయారు చేయాలనుకుంటాడు. రావు గారి ద్వారా పరిచమైన ప్రియ(రాశీఖన్నా) చేసిన ఆర్థిక సహాయంతో ఓ యాప్ని తయారు చేసి సక్సెస్ సాధిస్తాడు. దాని ద్వారా అభికి మంచి గుర్తింపు రావడంతో పాటు.. పెద్ద వ్యాపారవేత్తగా మారిపోతాడు. ఆ తర్వాత అభిలో మార్పు మొదలవుతుంది. తన ఎదుగుదలకు సహాయం చేసిన వారిని పట్టించుకోకుండా.. కేవలం డబ్బు, ప్రతిష్టలకే ప్రాధాన్యత ఇస్తాడు. దీంతో అందరూ అతనికి దూరం అవుతారు. చివరకు ప్రేమించిన ప్రియ కూడా అతన్ని వదిలి వెళ్లిపోతుంది. అప్పుడు అభి రియలైజ్ అవుతాడు. (చదవండి: ‘బిగ్బాస్’ వచ్చేస్తున్నాడు.. ప్రోమో అదిరింది) తాను ఈ స్థాయిలో ఉండడానికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా కారణమైన వారందరిని కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకుంటాడు. స్కూల్, కాలేజీ డేస్ని గుర్తు చేసుకుంటాడు. ఇప్పటి వరకు తన జీవితంలోకి వచ్చిన పారు(మాళవికా నాయర్), చిన్నూ(అవికా గోర్), శర్వా(సుశాంత్ రెడ్డి) కలిసి థ్యాంక్స్ చెప్పేందుకై ఇండియాకు వస్తాడు. మరి అభి సక్సెస్కు పారు, చిన్నూ, శర్వాల ఎలా కారణమయ్యారు? వీరితో అతనికి ఉన్న అనుబంధం ఏంటి? వీరిని కలిశాక అతనిలో వచ్చిన మార్పు ఏంటి? చివరకు ప్రియ, అభిలు కలిశారా? లేదా? అనేదే మిగతా కథ. -
అప్పుడే ఓటీటీకి ‘థ్యాంక్యూ’?, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే!
అక్కినేని హీరో నాగచైతన్య ‘లెటేస్ట్’ మూవీ థ్యాంక్యూ. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 22న ప్రేక్షకుల ముందుకు. లవ్ అండ్ ఎమోషనల్ జానర్లో రూపొందిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించగా.. అవికా గోర్లో ముఖ్య పాత్ర పోషించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం థియేటర్లో నడుస్తున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. చదవండి: ‘కార్తీకేయ 2’ ప్రమోషన్స్కి అనుపమ డుమ్మా.. నిఖిల్ కామెంట్స్ వైరల్ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోందట. ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ను డిజిటల్ దిగ్గజం అమెజాన్ ప్రైం సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే సన్ నెక్ట్ కూడా మంచి రేటుకే స్ట్రీమింగ్ రైట్స్ పొందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్ట్ రెండో వారం లేదా మూడో వారంలో ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి రానుందని వినికిడి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ‘థ్యాంక్యూ’ ఓటీటీ రిలీజ్పై మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట. కాగా దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. -
మేకింగ్ ఆఫ్ మూవీ - థ్యాంక్యూ
-
‘థాంక్యూ’ ఫస్ట్ డే కలెక్షన్స్.. చైతూ కెరీర్లోనే తొలిసారి ఇలా..
నాగచైతన్య, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘థాంక్యూ’. ‘మనం’లాంటి క్లాసిక్ హిట్ తర్వాత నాగచైతన్య, విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రమిది. అవికా గోర్, మాళవికా నాయర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. (చదవండి: ‘థాంక్యూ’ మూవీ రివ్యూ) భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. దీంతో తొలి రోజు ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఈ చిత్రం కేవలం రూ. 1.65 కోట్ల మాత్రమే వసూలు చేసింది. మొత్తంగా రూ. 2.16 కోట్లు షేర్ కలెక్షన్స్ని రాబట్టింది. ఈ చిత్రం దాదాపు రూ.24 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. హిట్ అని పించుకోవాలంటే దాదాపు రూ. 25 కోట్ల వసూళ్లని రాబట్టాలి. కానీ తొలి రోజు కేవలం రూ.2.23 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇటీవల కాలంలో నాగచైతన్య నటించిన ఏ చిత్రానికి కూడా తొలి రోజు ఇంత తక్కువ కలెక్షన్స్ రాలేదు. తండ్రి నాగార్జునతో కలిసి నటించిన బంగార్రాజు చిత్రం తొలి రోజు రూ.9.06 కోట్లు వసూలు చేస్తే.. సోలో హీరోగా నటించిన లవ్స్టోరీ రూ. 7.13 కోట్లు, మజిలీ 5.6 కోట్లు వసూలు చేసింది. ‘థ్యాంక్యూ’ తొలి రోజు కలెక్షన్స్.. ► నైజాం - రూ. 72 లక్షలు ► సీడెడ్ - రూ. 20 లక్షలు ► ఈస్ట్ - రూ. 14 లక్షలు ► వెస్ట్ - రూ. 8 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ. 22 లక్షలు ► గుంటూరు- రూ. 10 లక్షలు ► కృష్ణా - రూ. 12 లక్షలు ► నెల్లూరు - రూ. 7 లక్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ.6 లక్షలు ►ఓవర్సీస్- రూ. రూ.45 లక్షలు ►మొత్తం- 2.16 కోట్లు షేర్, రూ.3.70 కోట్లు గ్రాస్ -
యాక్... బాలేదు అని మోహం మీద చెప్పేస్తాడు: నాగ చైతన్య
-
థ్యాంక్యూ మూవీ పబ్లిక్ టాక్
-
Thank You Review: ‘థాంక్యూ’ మూవీ రివ్యూ
టైటిల్ : ‘థాంక్యూ’ నటీనటులు :నాగచైతన్య, రాశీఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్, ప్రకాశ్రాజ్ సాయి సుశాంత్ రెడ్డి నిర్మాణ సంస్థ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్ దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్ సంగీతం :తమన్ సినిమాటోగ్రఫీ: పీసీ శ్రీరామ్ ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: జులై 22, 2022 పుష్కరకాలం కింద దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన జోష్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. వాసు వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. అప్పటి నుంచి నాగచైతన్యతో సినిమాలు చేయలేదు దిల్ రాజు. రెండో సారి నాగచైతన్యతో సినిమా తీస్తే అది తప్పకుండా బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉండాలని చాలా కాలంగా వెయిట్ చేసి..‘థాంక్యూ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత నాగచైతన్య నటిస్తున్న చిత్రం కావడం, అక్కినేని హీరోలకు మనం లాంటి క్లాసిక్ మూవీని అందించిన విక్రమ్ కే.కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ‘థాంక్యూ’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంపై ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. అభి అలియాస్ అభిరామ్(నాగచైతన్య) ఉద్యోగం కోసం అమెరికా వెళ్తాడు. అక్కడ రావ్ కన్సల్టెన్సీ చీఫ్ రావు (ప్రకాశ్రాజ్) అభికి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు ఇప్పిస్తాడు. కానీ అభికి మాత్రం ఉద్యోగం చేయాలని ఉండడు. ఓ యాప్ని తయారు చేయాలనుకుంటాడు. రావు గారి ద్వారా పరిచమైన ప్రియ(రాశీఖన్నా) చేసిన ఆర్థిక సహాయంతో ఓ యాప్ని తయారు చేసి సక్సెస్ సాధిస్తాడు. దాని ద్వారా అభికి మంచి గుర్తింపు రావడంతో పాటు.. పెద్ద వ్యాపారవేత్తగా మారిపోతాడు. ఆ తర్వాత అభిలో మార్పు మొదలవుతుంది. తన ఎదుగుదలకు సహాయం చేసిన వారిని పట్టించుకోకుండా.. కేవలం డబ్బు, ప్రతిష్టలకే ప్రాధాన్యత ఇస్తాడు. దీంతో అందరూ అతనికి దూరం అవుతారు. చివరకు ప్రేమించిన ప్రియ కూడా అతన్ని వదిలి వెళ్లిపోతుంది. అప్పుడు అభి రియలైజ్ అవుతాడు. తన మనస్సాక్షితో తాను మాట్లాడుకోవడం మొదలుపెడతాడు. కెరీర్ గ్రోత్ అంటూ తన ఎదుగుదలకు సహాయం చేసిన వారిని వదిలేశానని.. అందుకే అందరూ తనకు దూరమయ్యారని తెలుసుకుంటాడు. తన తప్పును తెలుసుకొని.. ఈ స్థాయిలో ఉండడానికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా కారణమైన వారందరిని కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకుంటాడు. స్కూల్, కాలేజీ డేస్ని గుర్తు చేసుకుంటాడు. ఇప్పటి వరకు తన జీవితంలోకి వచ్చిన పారు(మాళవికా నాయర్), చిన్నూ(అవికా గోర్), శర్వా(సుశాంత్ రెడ్డి) కలిసి థ్యాంక్స్ చెప్పేందుకై ఇండియాకు వస్తాడు. మరి అభి సక్సెస్కు పారు, చిన్నూ, శర్వాల ఎలా కారణమయ్యారు? వీరితో అతనికి ఉన్న అనుబంధం ఏంటి? వీరిని కలిశాక అతనిలో వచ్చిన మార్పు ఏంటి? చివరకు ప్రియ, అభిలు కలిశారా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే... జీవితంలో ఇతరుల సపోర్ట్ లేకుండా ఎవ్వరూ సొంతంగా ఎదుగరు. పేరెంట్స్..బంధువులు.. స్నేహితులు.. ఇలా ఎవరో ఒకరు మన ఎదుగుదలకు ప్రత్యేక్షంగానో, పరోక్షంగానో సహాయం చేస్తుంటారు. మనం ఓ స్థాయికి చేరాక..అలాంటి వారిని మరచిపోవద్దు’అనే మంచి సందేశంతో ‘థాంక్యూ’మూవీని తెరకెక్కించాడు దర్శకుడు విక్రమ్ కె.కుమార్. డైరక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటీకీ..తెరపై మాత్రం అది అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. గత సినిమాలకు భిన్నంగా కొత్తగా ట్రై చేశాడు. కానీ ఎక్కడో తేడా కొట్టింది. హీరో తన ఎదుగుదలకు సహకరించిన వారికి ఎమోషనల్గా ఎలా థ్యాంక్స్ చెప్పాడన్న పాయింట్ చుట్టే కథ తిరుగుతుంది. సినిమా మొదలైన కొద్ది సేపటికే.. కథ ఎలా సాగుతుందో, క్లైమాక్స్ ఎలా ఉంటుందో సగటు ప్రేక్షకుడు ఊహించుకోవచ్చు. ఎలాంటి ట్విస్ట్లు,టర్నింగ్ పాయింట్స్ లేకుండా సింపుల్గా అలా.. సాగిపోతుంది. మంచి ఎమోషన్స్, సెంటిమెంట్తో ఫస్టాఫ్ సాగుతుంది. స్కూల్ డేస్లో పారుతో ప్రేమాయణం, నారాయణపురంలో జరిగే పడవ పోటీల సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇష్టంగా ప్రేమించిన పారు ఎందుకు దూరమైందనేది కూడా ఇంట్రెస్టింగ్ చూపించారు. ఇంటర్వెల్ సీన్ సింపుల్గా ఉంటుంది. ఇక సెకండాఫ్లో అభి కాలేజ్ డేస్ని చూపించారు. అక్కడ కూడా కథ ఊహకు అందేలా సింపుల్గా సాగుతుంది. మహేశ్బాబు ఫ్లెక్సీ సీన్ ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. అభిరామ్ పాత్రలో నాగ చైతన్య ఒదిగిపోయాడు. ఆయన పాత్రకి చాలా వేరియషన్స్ ఉంటాయి. అన్నింటిని చక్కగా డీల్ చేశాడు. తెరపై చాలా కొత్తగా కనిపించాడు. ఎమోషనల్ సీన్స్లోనూ ఒదిగిపోయాడు. కథనంత తన భూజాన వేసుకొని నడిపించాడు. ఇక ప్రియగా రాశీఖన్నా పర్వాలేదనిపించింది. అయితే ఇందులో ఆమె పాత్రకు నిడివి తక్కువ. ఇక అభి స్కూల్డేస్ లవర్ పార్వతి పాత్రలో మాళవికా నాయర్ మంచి నటనను కనబరిచింది.చైతూ- మాళవికా నాయర్లా కెమిస్ట్రీ తెరపై వర్కౌట్ అయింది. చిన్నూగా అవికా ఘోర్ తన పాత్ర పరిధిమేర నటించింది. ప్రకాశ్రాజ్ సాయి సుశాంత్ రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతీ ఫ్రేమ్ అందంగా కనిపిస్తుంది. తమన్ సంగీతం జస్ట్ ఓకే. టైటిల్ సాంగ్, కాలేజ్ వీడ్కోలు పార్టీ సందర్భంగా వచ్చే పాటలు కొంతమేర ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటర్ నవీన్ నూలి తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా, ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
‘థ్యాంక్యూ’ మూవీ ట్విటర్ రివ్యూ
‘మనం’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్ చేయడంతో ‘థ్యాంక్యూ’పై ఆసక్తి పెరిగింది. భారీ అంచనాల మధ్య నేడు(జులై 22) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘థ్యాంక్యూ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #ThankYouTheMovie block buster .it's a feel good and emotional .@chay_akkineni excellent performance — Kumar (@Kumar47007099) July 22, 2022 ‘థ్యాంక్యూ’ బ్యూటిఫుల్ ఫీల్గుడ్ మూవీ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. నాగచైతన్య యాక్టింగ్ పరంగా అదరగొట్టేశారని అంటున్నారు. మరికొంతమంది రోటీన్గా ఉందని, ఆశించిన స్థాయిలో అలరించలేకపోయిందని చెబుతున్నారు. #ThankYou..! There is ‘Gratitude’ but no magic this time from #VikramKKumar..! There is something missing and the actual soul of film is not felt..! #NagaChaitanya looks wise 👍🏼 but couldn’t deliver completely..! Even the csrip runtime felt like it was lagged..! 2.5/5..! — FDFS Review (@ReviewFdfs) July 22, 2022 ‘థ్యాంక్యూ’లో కృతజ్ఞత ఉంది కాని మ్యాజిక్ చేయలేకపోయింది. విక్రమ్ కె కుమార్ కొత్తగా ట్రై చేసిన ఎక్కడో తేడా కొట్టింది. సోల్ మిస్ అయింది. లుక్స్ పరంగా నాగచైతన్య కొత్తగా కనిపించాడు. కానీ పూర్తిస్థాయి నటనను కనబర్చలేకపోయాడు. రన్టైమ్ కూడా ల్యాగ్ అయినట్లు అనిపించింది’అంటూ ఓ నెటిజన్ 2.5 రేటింగ్ ఇచ్చాడు. First Half - good 👌. Narayanapuram Scenes and Bgm 💥💥. Waiting for 2nd half ...@chay_akkineni looks and acting 👌👌👌👌.#Thankyouthemovie!! — Akkineni_Agent (@akkineniagent) July 22, 2022 story vikram kumar dhe na??? too bad asal....Hype lekunda poina ekale...Chai disappointed this time... #ThankYouTheMovie — karthik (@karthik170920) July 22, 2022 #ThankYouTheMovie#ThankYouMovie A simple story weighed down by ordinary visuals and dragged narration. But it has some moments which served its purpose. Rating: 2.75/5 pic.twitter.com/UELTOiTkzN — Review Rowdies (@review_rowdies) July 22, 2022 1st half Ok (Some good and and some bad scenes) 2nd half good with good climax As usual @MusicThaman rocked with songs and BGM 👏 Overall Good movie and easy one time watch ❤️ #ThankYou @chay_akkineni and @SVC_official for bringing the movie to us 🤝 #ThankYouTheMovie — Albitthar Appanna (@ulfha_reddy) July 22, 2022 Nee story @BvsRavi okati ayina hit ayyindha bro? Ayina sare Vikram k Kumar kosam povali movie 😘 PC sir DOP is ❤️ #ThankYouTheMovie — Shashidharreddy🔔 (@Shashi262602) July 22, 2022 Very good second half with ok climax overall excellent one 👌 Everyone will love the journey of abhiram for sure😍👌👌👌 3.5/5⭐️ Only negative DOP (IMO)#ThankYouMovie @chay_akkineni https://t.co/cUatqIM9ef — koushik (@koushik0909) July 21, 2022 -
లైన్ చెప్పి అడ్వాన్స్ ఇచ్చేస్తే సినిమా చేయను
‘‘ఈ రోజుల్లో మానవ సంబంధాలకు చాలామంది విలువ ఇవ్వడం లేదు. కనీసం సహాయం చేసినవారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ కూడా చెప్పడం లేదు. ఒకవేళ చెప్పినా మొక్కుబడిగా చెప్పినట్లు కనిపిస్తోంది. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ‘థ్యాంక్యూ’ లాంటి సినిమా రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత ‘థ్యాంక్యూ’ మాటకు ఎంత విలువ ఇవ్వాలో తెలుస్తుంది’’ అని ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ అన్నారు. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ కథానాయికలు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా కెమెరామేన్ పీసీ శ్రీరామ్ చెప్పిన విశేషాలు.. ► నేను ఓ సినిమా ఒప్పుకునే ముందు కథ మొత్తం వింటాను. ఆ కథ నా మనసుకి ఎమోషనల్గా నచ్చితేనే సినిమా చేసేందుకు అంగీకరిస్తాను. అంతేకానీ స్టోరీ లైన్ చెప్పి అడ్వాన్స్ చేతిలో పెడితే సినిమా ఒప్పుకోను. కథ పూర్తిగా విన్నప్పుడే దర్శకుడి విజన్ ఏంటో తెలుస్తుంది. అప్పుడే ఆ కథని ఎలా చూపించాలో నాకు అర్థం అవుతుంది. ► ‘థ్యాంక్యూ’ అనే పదంలోనే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. మన హృదయంలోని భావాలను స్వచ్ఛంగా వ్యక్తం చేయగలం. నా తల్లితండ్రులకు నేను ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే ఈ రోజు నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం వారే. నా వ్యక్తిగత, సినీ ప్రయాణంలో నేను థ్యాంక్స్ చెప్పాల్సినవారెందరో ఉన్నారు.. ఈ సినిమా చేశాక వారందరకీ థ్యాంక్స్ చెప్పాలనిపించింది. ► ప్రతి రంగంలో టెక్నాలజీలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. అలాగే సినిమాటోగ్రఫీలోనూ సాంకేతిక పరంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. రోజురోజుకీ వందల రకాలుగా టెక్నాలజీ అప్డేట్ అవుతుంటుంది. ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా మన క్రియేటివ్ విజన్ని బట్టే అది తెరపై కనిపిస్తుంది. దర్శకుడు చెప్పిన కథని నా కోణంలో తెరపైన ఆవిష్కరించడానికే ప్రయత్నిస్తాను. నేను ఏ సినిమా చేసినా, నా వర్కే డామినేట్ చేస్తుందని అనుకోవడంలో నిజం లేదు. కథకి ఏం కావాలో అదే ఇస్తాను. ఎవరైనా అభద్రతా భావంలో ఉంటే నేను డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ► డైరెక్షన్, సినిమాటోగ్రఫీ రెండూ వేర్వేరు. ఈ విభాగాల పని తీరు వేరుగా ఉంటుంది. దర్శకత్వం నా వృత్తి కాదు. అందుకే డైరెక్టర్ (తమిళ చిత్రాలు ‘మీరా, కురుది పునల్, వానమ్ వసప్ప డుమ్’కి దర్శకత్వం వహించారు) గా సక్సెస్ కాలేకపోయాను. భవిష్యత్తులో మెగాఫోన్ పట్టాలన్న ఆలోచన లేదు. -
‘థ్యాంక్ యూ’ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
గుడ్న్యూస్, ఇకమీదట అన్ని సినిమాలకు ఒకటే టికెట్ రేట్!
సినీప్రియులకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు గుడ్ న్యూస్ చెప్పాడు. ఇక మీదట అన్ని సినిమాలకు ఒకే ధర ఉంటుందని వెల్లడించాడు. కాకపోతే భారీ బడ్జెట్తో తెరకెక్కిన స్టార్ హీరోల సినిమాలకు మాత్రం ఇందుకు మినహాయింపు అని స్పష్టం చేశాడు. బుధవారం నాడు జరిగిన థాంక్యూ చిత్ర ప్రెస్మీట్లో దిల్ రాజు మాట్లాడుతూ.. స్టార్ హీరోల హై బడ్జెట్ చిత్రాలను మినహాయిస్తే అన్ని సినిమాలకు టికెట్ రేట్లు ఒకేలా ఉంటాయన్నాడు. మేజర్, విక్రమ్ సినిమాలకు ఉన్న రేట్లే అన్నింటికీ ఉంటాయని తెలిపాడు. హైదరాబాద్, వైజాగ్లాంటి పట్టణాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీ కలిపి రూ.150, మల్టీప్లెక్స్లో రూ.200 ఉంటాయని పేర్కొన్నాడు. నిర్మాతలందరం కలిసి చర్చించాకే టికెట్ రేట్లపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. చదవండి: పనిమనిషి చెప్పేదాకా చైసామ్ విడిపోతున్నారని తెలియదు 'లైగర్' ట్రైలర్ లాంచ్.. ఆకర్షిస్తోన్న రౌడీ హీరో భారీ కటౌట్ -
నా మైండ్ సెట్ చాలా మారింది: నాగ చైతన్య
Naga Chaitanya Comments On Thank You Movie: ‘‘ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పు వచ్చింది. సినిమాలో కొత్త విషయం ఉంటేనే థియేటర్స్కు వస్తున్నారు. ట్రైలర్ చూసి ఆ మూవీ చూడాలా? వద్దా అని నిర్ణయించుకుంటున్నారు. ఇప్పుడు చిత్రాల ఎంపికలో నా మైండ్ సెట్ కూడా మారింది. సినిమాలో హీరో, డైరెక్టర్ అనే విషయాలు పక్కన పెడితే కథే కింగ్ అని నమ్ముతాను’’ అని అక్కినేని నాగచైతన్య అన్నారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. నాగచైతన్య హీరోగా, రాశీఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. అనిత సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్లో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘థ్యాంక్యూ’ ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు. ‘దిల్’ రాజుగారితో 12 ఏళ్ల తర్వాత (2019లో ‘జోష్’ వచ్చింది) ‘థ్యాంక్యూ’ సినిమా చేశాను. ఈ గ్యాప్లో ఆయన కాంపౌండ్ నుంచి చాలా కథలు విన్నాను. అయితే ఎగ్జయిటెడ్గా అనిపించలేదు. కానీ ‘థ్యాంక్యూ’ గురించి రాజు, విక్రమ్, బీవీఎస్ రవి చెప్పినప్పుడు ఎగ్జయిటింగ్గా అనిపించింది. ఈ సినిమా తప్పక చేయాలనిపించి, చేశా. ఇలాంటి స్క్రిప్ట్స్ దొరకడం చాలా కష్టం. ‘థ్యాంక్యూ’ సినిమా నాకు ఫిజికల్గా, మెంటల్గా ఛాలెంజింగ్గా అనిపించింది. ఇందులో మూడు షేడ్స్లో ఉన్నట్టు కనిపిస్తాను. కానీ ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి. 16 ఏళ్ల నుంచి 36 ఏళ్ల వరకు రకరకాల దశలలో కనిపిస్తాను. ఇప్పుడంటే నన్ను టీనేజర్ పాత్రలో ప్రేక్షకులు చూస్తున్నారు. ఇంకో మూడు, నాలుగేళ్ల తర్వాత నేను ఇలాంటి సినిమాలు చేస్తానంటే ఎవరూ పెద్దగా ఇంట్రస్ట్ చూపించరు. అందుకే ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశాను (నవ్వుతూ). విక్రమ్ కుమార్ సున్నితమైన విషయాలను బాగా డీల్ చేస్తారు. ఒక వ్యక్తి తన జీవితంలో కలిసే వ్యక్తుల వల్ల ఎలా ప్రభావం చెందాడు? అనేది ‘థ్యాంక్యూ’లో మెయిన్ పాయింట్. ఈ సినిమాతో వ్యక్తిగా నేను చాలా మారాను. అంతకు ముందు మనసులో ఉన్న విషయాలను సగమే బయటకు చెప్పేవాణ్ణి.. ఇప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీకి మరింత క్లోజ్ అయ్యాను. మనసు విప్పి మాట్లాడుతున్నాను. ఈ సినిమాలో 16 ఏళ్ల కుర్రాడిలా కనపడటానికి ప్రొడక్షన్ వాళ్లు సపోర్ట్ చేసి, మూడు నెలలు సమయం ఇచ్చారు. ఆ టైమ్లో వర్కవుట్స్తో పాటు బాడీ లాంగ్వేజ్ పరంగా వర్క్షాప్స్ కూడా చేశాను. ప్రతి స్క్రిప్ట్లోనూ అది దొరకదు. ఈ సినిమాలో దొరికింది. ఇప్పుడంటే నా శరీరం కూడా సపోర్ట్ చేస్తోంది. భవిష్యత్లో కుదురుతుందో? లేదో చూడాలి (నవ్వుతూ). అఖిల్ ‘ఏజెంట్’ ట్రైలర్ బాగుంది. తన లుక్ మార్చుకోవటం కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ‘ఏజెంట్’తో తనకు మాస్, కమర్షియల్గా పెద్ద సక్సెస్ వస్తుందనుకుంటున్నాను. నా తర్వాతి సినిమా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఉంటుంది. ఇందులో నాది పోలీస్ ఆఫీసర్ పాత్ర. తరుణ్ భాస్కర్తో ఓ చిత్రం డిస్కషన్లో ఉంది. పరుశురామ్తోనూ ఓ పాయింట్ అనుకున్నాం. కోవిడ్ సమయంలోనే హిందీలో ‘లాల్సింగ్ చద్దా’ అవకాశం వచ్చింది. ఈ సినిమా కోసం 25కిలోలు బరువు తగ్గాను. నాన్న (నాగార్జున), చిరంజీవి, రాజమౌళి, సుకుమార్, ఆమిర్ ఖాన్ గార్లతో ‘లాల్సింగ్ చద్దా’ ప్రీమియర్ చూడటం మరచిపోలేని అనుభూతి. అందరికీ సినిమా బాగా నచ్చింది. చిరంజీవిగారు మా సినిమాని సమర్పించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాతో హిందీ ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే బాలీవుడ్ సినిమాల గురించి ఆలోచిస్తాను. -
ఆమె నా హృదయం ముక్కలు చేసింది: నాగ చైతన్య
నాగచైతన్య, రాశీఖన్నా జంటగా నటించిన సినిమా 'థ్యాంక్యూ'. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్రాజు నిర్మిస్తున్నారు. ఈనెల 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమాపై మరింత హైప్ నెలకొంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ టీం ప్రమోషన్స్లో బిజీబిజీగా గడుపుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాశీఖన్నా, నాగచైతన్య సందడి చేశారు. ఈ సందర్భంగా తన ఫస్ట్ లవ్ గురించి నాగ చైతన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. 'నా ఫస్ట్లవ్ తొమ్మిదో తరగతిలో జరిగింది. ముగ్గురం కలిసి ఒకే అమ్మాయిని లవ్ చేసేవాళ్లం. అయితే ఆ అమ్మాయి తమ హృదయాలను ముక్కలు చేసింది' అంటూ గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ముగ్గురం మంచి స్నేహితులుగా మారిపోయామంటూ తెలిపాడు. ప్రస్తుతం చై చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. -
వాళ్లందర్నీ కలిసి థ్యాంక్స్ చెప్పాను
‘‘రచయిత బీవీఎస్ రవి నాలుగేళ్ల క్రితం నాకు ‘థ్యాంక్యూ’ స్టోరీ లైన్ చెప్పినప్పుడు ఎగ్జయిట్ అయ్యాను. ఇదే లైన్ని నాని ‘గ్యాంగ్ లీడర్’ ప్రీమియర్లో విక్రమ్ కుమార్కి చెబితే తను కూడా ఎగ్జయిట్ అయ్యి, సినిమా చేద్దాం అన్నాడు. ‘మనం’ చిత్రం తర్వాత విక్రమ్కి, చైతన్యకి మధ్య ఉన్న కెమిస్ట్రీ (డైరెక్టర్, హీరోగా) మా సినిమాకి ప్లస్ అయింది. ‘థ్యాంక్యూ’లో మూడు పాత్రల్లో నాగచైతన్య అద్భుతంగా నటించాడు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదలకానుంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు విలేకరులతో పంచుకున్న విశేషాలు. ► బీవీఎస్ రవి చెప్పిన స్టోరీ లైన్తో ఓ హీరో కేరక్టర్ రాయాలనుకున్నాం. ఆ పాత్రకి గతం చెప్పాలనుకున్నాం. అందుకే ‘థ్యాంక్యూ’లో హీరో పాత్రలో కాలేజ్, టీనేజ్.. ఇలా అన్నింటినీ డిజైన్ చేశాం. స్క్రీన్ప్లే, సీన్స్ అన్నీ విక్రమ్ స్టైల్లో రాయమని రవికి చెబితే అలాగే రాశాడు. ∙ ► కరోనా లాక్డౌన్ సమయంలో నేను కూడా వ్యక్తిగతంగా ‘థ్యాంక్యూ’ జర్నీని స్టార్ట్ చేశాను. నాకు స్కూల్లో, ఆటోమొబైల్ రంగంలో సహాయం చేసిన వారందర్నీ కలిసి థ్యాంక్స్ చెప్పాను. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో థ్యాంక్యూ జర్నీని కంటిన్యూ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను. ∙ ► ‘థ్యాంక్యూ’ సినిమాలో ఒక సాధారణ కుర్రాడు లెజెండ్ అవుతాడు. మొత్తం నేనే అనుకుంటాడు. కానీ అది నిజం కాదు. అతనికి సాయం చేసినవాళ్లు చాలామంది ఉంటారు. అందమైన ప్రేమకథ, వాణిజ్య అంశాలన్నీ కలిపి ఈ కాన్సెప్ట్ని సినిమాటిక్గా చెప్పడానికి ఎక్కువ స్ట్రగుల్ అయ్యాం. గతం గురించి ఆలోచించే టైమ్ ప్రస్తుతం ఎవరికీ లేదు. ► కథ విషయంలో ప్రతి డైరెక్టర్తో డిస్కస్ చేస్తాను. నా సలహాలను కొందరు డైరెక్టర్లు వింటారు.. మరికొందరు తామే రైట్ అంటారు. అలాంటివాళ్లతో నేను వాదించను. ∙పెద్ద డైరెక్టర్ల అనుభవాలు వాడుకుంటాను. కొత్తవాళ్లకి పాయింట్ టు పాయింట్ రాసిస్తాను. దానికి రీచ్ అవుతున్నామా? లేదా అని చెక్ చేస్తాను. మిడ్ వాళ్లతో అటూ ఇటూ ఉంటాను. ► కరోనాకి ముందు, కరోనా తర్వాత ప్రేక్షకుల ఆలోచనలు మారిపోయాయి. అంతకుముందు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూద్దామనే మూడ్లో ఉన్నారు. లాక్డౌన్లో ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో చాలా కంటెంట్ చూసి, ఎడ్యుకేట్ అయ్యారు. ఇప్పుడు వాళ్లకి అంతంత మాత్రం కంటెంట్ నచ్చట్లేదు. దీనికోసం ఇంత డబ్బు పెట్టి వెళ్లాలా? అనుకుంటున్నారు. ఈ విషయంలో చిత్ర పరిశ్రమ మారాల్సిన టైమ్ వచ్చింది. మంచి కంటెంట్ ఇచ్చి టిక్కెట్ ధరలు తగ్గిస్తే జనాలు వస్తారు. ఓటీటీలో త్వరగా సినిమాలు రావడం వల్ల కూడా థియేటర్లకు వచ్చే జనాలు తగ్గారు. మీడియం రేంజ్ నుంచి టాప్ స్టార్స్ సినిమాలు థియేటర్లలో వచ్చాకే ఓటీటీకి వెళ్లాలి. అది ఎన్ని వారాలకు? అనేది నిర్మాతలందరూ కలిసి మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య వచ్చిన ‘మేజర్, విక్రమ్’ సినిమాల కంటెంట్ బాగుండటంతో ప్రేక్షకులు ఆదరించారు... మంచి కంటెంట్ ఉంటే హిట్ చేస్తారు. ► ఒక సినిమా ఫ్లాప్కు చాలా కారణాలుంటాయి. కరోనా తర్వాత వచ్చిన ఆర్థిక ఇబ్బందులవల్ల జనాల్లో డబ్బు ఖర్చు చేసే సత్తా కూడా తగ్గింది. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడం అనేది గతంలో నిర్మాత సమస్య. కానీ ఇప్పుడు సినిమాది. అందుకే అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. ప్రతి సినిమాకీ డబ్బు పోతుందని తెలిస్తే బాధ ఉంటుంది. ఈ విషయం డైరెక్టర్లకీ, హీరోలకి కూడా అర్థమైంది. హిందీలో తీసిన ‘హిట్’ సినిమాకి మేం నష్టపోలేదు. కానీ, ‘జెర్సీ’ రీమేక్ని కరోనా పరిస్థితుల్లో రిలీజ్ చేయడం వల్ల 3–4 కోట్ల డ్యామేజ్తో బయటపడ్డాం. ఓటీటీల వల్ల నిర్మాతలకు లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఓటీటీలో సూపర్హిట్ అయినా వచ్చేదేమీ లేదు. అదే సినిమా థియేటర్లలో రిలీజ్ అయితే ఆ వసూళ్లు, ఆ ఎనర్జీ వేరు. ప్యాషన్గా సినిమా తీయాలనుకున్నవారికి డబ్బులతో పాటు ఎనర్జీ కూడా ముఖ్యమే. హీరోలందరికీ ప్రస్తుత పరిస్థితు (నిర్మాణ వ్యయాన్ని ఉద్దేశించి) లను, సమస్యను చెబితే అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది. -
ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..
ప్రతివారం బాక్సాఫీసు వద్ద కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. అయితే సమ్మర్లో పెద్ద సినిమాలు, పాన్ ఇండియా చిత్రాలు సందడి చేయగా.. ఇప్పుడు చిన్న సినిమాలు వరుసగా థియేటర్లోకి వస్తున్నాయి. ఇక బిగ్స్క్రీన్పై వచ్చిన పలు పెద్ద సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. అలా ఈ వారం థియేటర్లో, ఓటీటీలో సందడి చేసే చిత్రాలేంటో చూద్దాం రండి! ఈ వారం థియేటర్లో సందడి చేసే చిత్రాలివే: ‘థ్యాంక్యూ’ చేప్పేందుకు వస్తున్న నాగ చైతన్య అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చై విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనసూయా ‘దర్జా’ సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో పీఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివశంకర్ పైడిపాటి నిర్మించారు. ఈ నెల 22న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ‘షంషేరా’గా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న రణ్బీర్ కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, వాణీ కపూర్ జంటగా సంజయ్ దత్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘షంషేరా’. యశ్ రాజ్ ఫిలింస్పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న హిందీ, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. ‘మహ’గా వస్తున్న హన్సిక హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రంలో హన్సిక నటించిన తొలి చిత్రం మహా. మదియళగన్ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ సంస్థ, మాలిక్ స్ట్రీమింగ్ కార్పొరేషన్ అధినేత డత్తో అబ్దుల్ మాలిక్ నిర్మించిన ఈ చిత్రానికి జమీల్ దర్శకుడు. శింబు కీలక పాత్ర పోషిస్తుండగా శ్రీకాంత్, కరుణాకరన్, తంబి రామయ్య ముఖ్యపాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం జూలై 22వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ‘హై ఫైవ్’ అమ్మ రాజశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం 'హై ఫైవ్'. మన్నార చోప్రా, సుధీర్, అమ్మ రాజశేఖర్, సమీర్ తదితరులు నటించిన ఈ చిత్రం జూలై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. మీలో ఒకడు శ్రీమతి చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ''మీలో ఒకడు''. సీనియర్ నటుడు సుమన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నటులు కృష్ణ భగవాన్, సమీర్, అశోక్ కుమార్, బస్టాప్ కోటేశ్వరరావు, గబ్బర్ సింగ్ బ్యాచ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం జూలై 22న థియేటర్లోకి రాబోతోంది. జగన్నాటకం మనిషి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘జగన్నా టకం’. ఆరజ్ అల్తాడ దర్శకత్వంలో పార్వతీశం, కుమారస్వామి, స్వాతి మండల్ అర్ఫితా లోహి ప్రధానా పాత్రలు పోషించారు. ఈ మూవీ జులై 22 ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. వి. కిరణ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలేంటంటే... ట్రిబుల్ ఫన్తో వస్తున్న ‘ఎఫ్ 3’ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్తేజ్ హీరోలుగా నటించిన చిత్రం ఎఫ్3. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించగా, రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, అలీ, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 22న ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్, సోనిలివ్లో ఈ చిత్రం జూలై 22న నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెట్ఫ్లిక్స్ ఇండియన్ ప్రిడెటర్ హిందీ సిరీస్ - జూలై 20 ద గ్రే మ్యాన్(తెలుగు డబ్బింగ్) - జూలై 22 యూత్ ఆఫ్ మే (కొరియన్ సిరీస్) - జూలై 22 అమెజాన్ ప్రైం కమెండెడ్ ఫర్ యూ షార్ట్ఫిల్మ్ విడుదల - జూలై 20 డిస్నీ ప్లస్ హాట్స్టార్ పరంపర 2 తెలుగు సిరీస్ జూలై 21న హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఆహా తొలి తెలుగు ఓటీటీలో బిగ్బాస్ ఫేం షణ్ముక్ జశ్వంత్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ తెలుగు సిరీస్ జూలై 22న విడుదల కానుంది. సోనీ లివ్ డాక్టర్ అరోరా(హిందీ సిరీస్) - జూలై 22 మీమ్ బాయ్స్ (తమిళ సిరీస్) - జూలై 22 ఎఫ్ 2 మూవీ - జూలై 22 -
చిన్న చిన్న విషయాలకు కూడా ‘థ్యాంక్యూ’ చెబుతున్నారు: డైరెక్టర్
‘‘మన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో మందికి థ్యాంక్స్ చెప్పాల్సి ఉంటుంది. ఎలాంటి అహం లేకుండా మనం థ్యాంక్స్ చెబితే ఎదుటివారు పడే ఆనందం మన మనసుకు సంతృప్తినిస్తుంది. ‘థ్యాంక్యూ’ సినిమా చాలామంది కథ. అందరికీ కనెక్ట్ అవుతుంది’’ అని డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ అన్నారు. అక్కినేని నాగచైతన్య హీరోగా, రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు విక్రమ్ కె. కుమార్ విలేకరులతో చెప్పిన విశేషాలు. ► ‘మనం’ తర్వాత నేను, చైతు మరో సినిమా చేద్దామని నాలుగేళ్లుగా అనుకుంటున్నాం. ఆ సమయంలో బీవీఎస్ రవిగారు రాసిన ‘థ్యాంక్యూ’ కథ వచ్చింది. ఆ కథ వినగానే కనెక్ట్ అయ్యాను. ఇప్పటివరకూ నేను దర్శకత్వం వహించిన చిత్రాలన్నింటికీ నేనే కథలు రాశాను. తొలిసారి ఓ రచయిత కథకి దర్శకత్వం వహించాను. ఈ చిత్రం సోల్, హార్ట్ రవిదే.. కానీ ట్రీట్మెంట్ నాది. ► ‘థ్యాంక్యూ’ అనేది పవర్ఫుల్ పదం. దాని విలువ చాలామందికి తెలియడం లేదు. చిన్న చిన్న విషయాలకు కూడా థ్యాంక్స్ చెబుతున్నారు. థ్యాంక్స్ విలువని మా సినిమాలో చెప్పాం. జీవితంలో ప్రతి ఒక్కరూ తల్లితండ్రులకు థ్యాంక్స్ చెప్పాలి. నేను మా నాన్నకి థ్యాంక్స్ చెప్పకుండానే ఆయన వెళ్లిపోయారు. ► ఈ చిత్రంలో అభిరామ్ పాత్రలో నాగచైతన్య మూడు వేరియేషన్స్లో కనిపిస్తాడు. ఒక్కో వేరియేషన్కి ఒక్కో హీరోయిన్ ఉంటుంది. అభిరామ్ జీవితంలో రాశీ ఖన్నాది ముఖ్యమైన పాత్ర. మాళవికా నాయర్ కూడా వందశాతం ఎఫర్ట్ పెట్టి నటించింది. అవికా గోర్ కూడా అద్భుతమైన నటి. ► ‘ఆర్య’ సినిమా నుంచి ‘దిల్’ రాజుగారితో పరిచయం ఉంది. ఇద్దరం కలిసి సినిమా చేయాలనుకున్నాం.. అది ‘థ్యాంక్యూ’తో కుదిరింది. మా కాంబినేషన్లో వస్తున్న పర్ఫెక్ట్ మూవీ ఇది. ఇక మా చిత్రానికి తమన్ అందమైన సంగీతం ఇచ్చారు.. నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంది. కెమెరామేన్ పీసీ శ్రీరామ్గారితో ‘థ్యాంక్యూ’ నా మూడో సినిమా. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ అయిన ఆయనతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. భారతదేశంలోని ఎడిటర్స్లో బెస్ట్ ఎడిటర్ నవీన్ నూలిగారు. అద్భుతంగా ఎడిటింగ్ చేశారు. ► నాగచైతన్యతో నా దర్శకత్వంలో రూపొందుతున్న ‘దూత’ వెబ్ సిరీస్ హారర్ నేపథ్యంలో ఉంటుంది. నాగచైతన్య పోర్షన్ షూటింగ్ పూర్తయింది. పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ► ‘24’ సినిమాకు సీక్వెల్ ఆలోచన ఉంది. వ్యక్తిగతంగా నాకు రొమాంటిక్ జోనర్ సినిమాలంటే ఇష్టం. హిందీలో ఓ సినిమా చేయబోతున్నాను. ఆ తర్వాత తెలుగులో మైత్రీ మూవీస్ బ్యానర్లో ఓ చిత్రం ఉంటుంది.. -
గులాబీ రంగు డ్రెస్లో కుర్రళ్ల గుండెల్లో దడ పుట్టిస్తున్న రాశీ ఖన్నా..
-
జీవితంలో వారు మనకు స్పెషల్: నాగ చైతన్య
Naga Chaitanya About Thank You Movie: అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చై విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్లో స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగానే ఇటీవల ఈ మూవీ ట్రైలర్ లాంచ్ గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో నాగ చైతన్య పలు ఆసక్తిర విషయాలు పంచుకున్నాడు. ''థ్యాంక్యూ కథ అభిరామ్ అనే వ్యక్తి ప్రయాణం. ఈ పాత్రలో శారీరకంగా, మానసికంగా పలు భిన్నమైన షేడ్స్ ఉన్నాయి. యాక్షన్ సీన్స్ ఆడియెన్స్ను ఎలా కట్టిపడేస్తాయో ఈ అభిరామ్ ప్రయాణం అలానే కట్టిపడేస్తుంది. ఇలాంటి మంచి పాత్రలు ఏ యాక్టర్కైనా చాలా అరుదుగా వస్తాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ విక్రమ్, నిర్మాత దిల్ రాజుకు కృతజ్ఞతలు. ఈ స్క్రిప్ట్ వినగానే 'జీవితంలో ఫలానా వారు మనకు స్పెషల్. వారికి ఫోన్ చేసి థ్యాంక్యూ చెప్పాలి' అనే ఫీలింగ్ మా అందరికీ కలిగింది. సినిమా చూసిన ప్రేక్షకులకు కూడా అదే అనుభూతి కలుగుతుందనే నమ్మకం ఉంది. రాశీఖన్నా రోల్తో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఆమె లేకపోతే ఈ చిత్రమే లేదు'' అని నాగ చైతన్య తెలిపాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా.. ఒక్క ఎపిసోడ్కు రూ. 5 కోట్లు.. హీరోయిన్ పారితోషికంపై చర్చ ! ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్ -
నాగచైతన్య ‘థ్యాంక్యూ’ సినిమా ట్రైలర్ రిలీజ్ (ఫొటోలు)
-
అలా మరిచిపోతే విలువ ఉండదు: నాగ చైతన్య
అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చై విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్లో స్పీడ్ పెంచారు. ఇదివరకు ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. మనం ఎక్కడ మొదలయ్యామో మరిచిపోతే.. మనం చేరిన గమ్యానికి విలువ ఉండదని నా ఫ్రెండ్ చెప్పాడు అంటూ నాగ చైతన్య చెప్పిన డైలాగ్తో ప్రారంభమైన ట్రైలర్ను 'ఇట్స్ ఏ లాంగ్ జర్నీ మై ఫ్రెండ్' అంటూ నాగ చైతన్య చెప్పే డైలాగ్స్తో ముగించారు. లవ్ ఫీల్తో ఎమోషనల్గా ఆకట్టుకునేలా ఉంది ట్రైలర్. క్లాస్, మాస్ గెటప్లో నాగ చైతన్య కనిపించి ఆకట్టుకునేలా ఉన్నాడు. డైలాగ్స్, తమన్ సంగీతం బాగుంది. లవ్, కెరీర్ వంటి తదితర అంశాలను సినిమాలో ప్రస్తావించనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. 'మనం' తర్వాత విక్రమ్ కె. కుమార్, నాగ చైతన్య కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం వల్ల 'థ్యాంక్యూ'పై అంచనాలు నెలకొన్నాయి. చదవండి: ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్ 'ఆర్ఆర్ఆర్'పై పోర్న్ స్టార్ ట్వీట్.. నెట్టింట జోరుగా చర్చ -
నాగ చైతన్య ఎమోషనల్ నోట్.. సామ్ పెంపుడు కుక్కకు థ్యాంక్స్
Naga Chaitanya Emotional Thank You Note: నాగచైతన్య హీరోగా రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'థ్యాంక్యూ'. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని జులై 22న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో జోరుగా పాల్గొంటున్న నాగ చైతన్య తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్గా పోస్ట్ చేశాడు. 'థ్యాంక్యూ అనే పదాన్ని చాలా ఎక్కువగా వాడుతుంటాను. కానీ కొన్ని సార్లు అదొక్కటే సరిపోదు. నా తదుపరి చిత్రం థ్యాంక్యూ ఈ ఆలోచనకు కారణం. ఈ మూవీ జర్నీ నన్ను కదిలించింది' అని రాసుకొస్తూ తన జీవితంలోని ముఖ్యమైన వ్యక్తులకు అంకితం ఇస్తున్నట్లుగా తెలిపాడు. అలాగే తన అభిమానులను #themagicwordisthankyou అనే ట్యాగ్తో తమ జీవితంలో ఎవరికీ థ్యాంక్యూ చెప్పాలనుకుంటున్నారో ఫొటోలను షేర్ చేసి ట్యాగ్ చేయమని కోరాడు. ఇందులో భాగంగానే చైతన్న చిన్నతనంలో తన తల్లితో తీసుకున్న ఫొటో, తండ్రి నాగార్జునతో కలిసి దిగిన పిక్తోపాటు సమంత పెంపుడు హ్యాష్తో తీసుకున్న ఫొటోను షేర్ చేశాడు. 'అన్ని విషయాల్లో నాకు సపోర్ట్ చేస్తూ నాపై అంతులేని ప్రేమను చూపించిన అమ్మకు థ్యాంక్స్', 'నాకు తోడుగా నిలిచినందుకు, స్నేహితుడిగా ఉన్నందుకు థ్యాంక్స్ నాన్న', 'ఎలా ప్రేమించాలో, మనిషిగా ఎలా ఉండాలో చూపించినందుకు థ్యాంక్స్ హ్యాష్' అంటూ ఎమోషనల్గా నోట్స్ రాసుకొచ్చాడు చైతూ. ప్రస్తుతం ఈ ఫొటోలు, పోస్ట్ వైరల్ నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
ఏదైనా సూటిగా చెప్తా.. డబుల్ మీనింగ్ ఉండదు : నాగచైతన్య
తాను ఏ విషయాన్ని అయినా సూటిగా చెప్తానని, డబుల్ మీనింగ్లో మాట్లాడడం రాదని నాగచైతన్య అన్నారు. చైతూ, రాశీఖన్నా జంటగా తెరకెక్కిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవికా నాయర్, అవికా గోర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జులై 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా నాగచైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. (చదవండి: గాడ్ ఫాదర్ లుక్లో అదరగొట్టేసిన చిరంజీవి) ర్యాపిడ్ క్వశ్చన్స్ అంటూ ఐదు డబుల్ మీనింగ్ పదాలు చెప్పాలని చైతూని కోరాడు యాంకర్. దీనికి చైతూ తనదైన శైలీలో సమాధానం ఇచ్చాడు. తనకు డబుల్ మీనింగ్ పదాలు తెలియవని, ఏ విషయాన్ని అయినా సూటిగా చెప్తానని అన్నారు. అంతేకాదు డబుల్ మీనింగ్ పదాలు ఏంటో నువ్వే చెప్పు అని తిరిగి యాంకర్ని ప్రశ్నించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. -
నాగ చైతన్య 'థ్యాంక్యూ' నుంచి 'ఫేర్వెల్..'
Naga Chaitanya Thank You Movie Farewell Lyrical Song Released: నాగచైతన్య హీరోగా రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'థ్యాంక్యూ'. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా జులై 22న విడుదల కానుంది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని 'ఫేర్ వెల్..' అంటూ సాగే పాటను హైదరాబాద్లోని ఓ కాలేజీలో విద్యార్థుల సమక్షంలో సోమవారం (జూన్ 28) విడుదల చేశారు. దిల్ రాజు మాట్లాడుతూ- 'ఐదో తరగతి వరకు అమ్మానాన్నతో ఉంటాం.. ఆ తర్వాత స్కూల్మేట్స్తో కలుస్తాం. ఆ తర్వాత అంతా కళాశాల జీవితమే. అంత అనుబంధమున్న కాలేజ్ లైఫ్ను వదిలేసి వెళ్తుంటే ఎంత భావోద్వేగానికి గురవుతామో ఈ 'ఫేర్వెల్..' పాట ద్వారా చెప్పాం' అన్నారు. 'ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది' అని విక్రమ్ కె. కుమార్ అభిప్రాయపడ్డారు. ''మూడేళ్లు 'థ్యాంక్యూ' కోసం కష్టపడ్డాం. రిజల్ట్ కోసం వేచి చూస్తున్నాం'' అని నాగచైతన్య పేర్కొన్నాడు. ''ఫేర్వెల్..' సాంగ్ సినిమాలో మంచి సందర్భంలో వస్తుంది. ఈ పాట చూశాక మీరు ఉద్వేగానికి గురవుతారు'' అని తమన్ తెలిపాడు. చదవండి: హార్ట్ సింబల్స్తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. -
వెనక్కి తగ్గిన నాగ చైతన్య.. 'థ్యాంక్యూ' రిలీజ్లో మార్పు
Naga Chaitanya Raashi Khanna Thank You Movie Postponed: అక్కినేని నాగ చైతన్య తన అభిమానులకు బ్యాడ్ న్యూస్ తెలిపాడు. చై హీరోగా నటించిన తాజా చిత్రం 'థ్యాంక్యూ'. ఈ మూవీ రిలీజ్లో చిన్న మార్పు జరిగింది. ఈ చిత్రాన్ని జులై 8న విడుదల చేయనున్నట్లు ఇంతకుముందు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రిలీజ్ డేట్లో చిన్న మార్పు చేశారు. ఈ సినిమాను జులై 22న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ప్రకటించారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. అలాగే అవికా గోర్ మరో కీలక పాత్ర పోషించింది. ''మా టీజర్ సినిమాపై ఆసక్తి పెంచగా, 'మారో..', 'ఎంటో ఏంటేంటో..' పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. చైతన్య కెరీర్లో స్పెషల్ మూవీగా నిలుస్తుంది.'' అని చిత్రబృందం పేర్కొంది. చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? #ThankYouTheMovie is now hitting the screens on July 22nd! It will be worth the wait...We promise! #ThankYou for understanding ♥️ @chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi @SaiSushanthR #MalavikaNair @avika_n_joy @SVC_official @adityamusic pic.twitter.com/xAyBsIbMxJ — Sri Venkateswara Creations (@SVC_official) June 24, 2022 #ThankYouTheMovie in Theatres on July 22nd😍https://t.co/ABhrv9Ndap#ThankYouOnJuly22nd@chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi @SaiSushanthR #MalavikaNair @avika_n_joy @SVC_official @adityamusic pic.twitter.com/RlPP5acpJU — Sri Venkateswara Creations (@SVC_official) June 24, 2022 -
‘థ్యాంక్ యూ’ నుంచి మెలోడీ సాంగ్, ఆకట్టుకుంటున్న లిరిక్స్
నాగచైతన్య అక్కినేని హీరోగా తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. మనం’ తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా చై విభిన్న లుక్లో అలరించనున్నాడు. రాశీఖన్నా, మళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అవిక గోర్ ఓ కీ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడదులై టీజర్, పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక జూలై 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ సాంగ్ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఏంటో ఏంటేంటో అంటూ సాగే ఈ పాటను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. నాగ చైతన్య, మాళవిక నాయర్ల మధ్య తెరకెక్కిన ఈ పాటకు ఆనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. జొనితా గాంధీ ఆలపించారు. తమన్ స్వరాలను సమకూర్చారు. కాగా శ్రీవెంకేటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. -
ఆకట్టుకున్న నాగ చైతన్య ‘థ్యాంక్ యూ’ మూవీ సాంగ్
నాగచైతన్య అక్కినేని హీరోగా తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. మనం’ తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా జూలై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా నుంచి ఒక్కో అప్డేట్ వదులుతుంది చిత్ర బృందం. ఇటీవల టీజల్ రిలీజ్ చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ‘సై అంటే సై రా.. సంసిద్ధం లేరా..’, ‘మారో మారో యుద్ధం మొదలు..తాడో పేడో..తేల్చెయ్ ఇప్పుడు’ అంటూ సాగుతుంది ఈ యూత్ఫుల్ కాలేజీ సాంగ్. ఇందులో చై హాకీ ఆడుతూ కనిపిస్తాడు. ‘ఇక్కడ ఒకరంటే ఒకరికి పడదు.. గ్యాంగ్.. గ్యాంగ్ బ్రదర్ అంటూ ఒంటినిండా పొగరు’ అంటూ మొదలయ్యే ఈ మారో మారో లిరికల్ పాటకు విశ్వ అండ్ కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించారు. తమన్ సంగీతం అందించగా.. దీపు, పృథ్వీచంద్రలు పాడారు. -
ఇప్పటికైనా దిల్ రాజుకు ఆ లోటు తీరేనా?
నిర్మాతగా దిల్ రాజు జర్నీ 2003లో ప్రారంభమైంది. తక్కువ కాలంలో అగ్ర నిర్మాతగా స్థాయికి ఎదిగాడు.ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్నాడు. ఫ్యూచర్ లో ఒక బాహుబలి, ఒక కేజీయఫ్ రేంజ్ ప్రాజెక్ట్స్ని తన బ్యానర్ నుంచి ఎక్స్ పెక్ట్ చేయవచ్చు అంటున్నాడు. ఎంత ఎదిగినా, ఎన్ని బ్లాక్ బస్టర్స్ అందుకున్నా ఒక్క లోటు మాత్రం దిల్ రాజును కొంతకాలంగా వెంటాడుతూ వస్తోంది. ఆ లోటు జులై 8తో తీరిపోతుందనే ధీమాతో ఉన్నాడు దిల్ రాజు. ఆ లోటు ఏంటంటే.. పుష్కరకాలం కింద దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన జోష్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. అప్పటికే ఆర్య, దిల్ , భద్రా, బొమ్మరిల్లు లాంటి సినిమాలతో వరుస విజయాలతో ఊపుమీదున్నాడు దిల్ రాజు.అందుకే నాగ చైతన్య డెబ్యూట్ బాధ్యతను దిల్ రాజు చేతిలో పెట్టాడు నాగార్జున.వాసు వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. అప్పటి నుంచి నాగచైతన్యతో సినిమాలు చేయలేదు దిల్ రాజు. అందుకు కారణం రెండోసారి చైతన్యతో వర్క్ చేస్తే మాత్రం అతనికి తప్పకుండా బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే పట్టుదలతో ఇంత కాలం వెయిట్ చేస్తూ వచ్చాడు. మొత్తానికి అక్కినేని హీరోలకు మనం లాంటి క్లాసిక్ మూవీని అందించిన విక్రమ్ కుమార్ దిల్ రాజు వెయిటింగ్ కు ఎండ్ పలికాడు.కేవలం చైని దృష్టిలో పెట్టుకుని రాసుకొచ్చిన థ్యాంక్యూ సబ్జెక్ట్ దిల్ రాజుకు బాగా నచ్చింది.అందుకే ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాడు.జులై 8న థ్యాంక్యూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రమోషన్ లో భాగంగా దిల్ రాజు అండ్ టీమ్ రిలీజ్ చేసిన థ్యాంక్యూ టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.తన కెరీర్లో ఎంతో మంది హీరోలకు సూపర్ హిట్ అందించిన దిల్ రాజు.. చైకి కూడా బ్లాక్ బస్టర్ అందిస్తాడో లేదో చూడాలి. -
‘థ్యాంక్ యూ’ టీజర్, నాగ చైతన్యపై రానా ఆసక్తికర వ్యాఖ్యలు
Rana Interesting Comment On Naga Chaitanya: అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. జూలై 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ మూవీ టీజర్ను విడుదల చేసిన సంగతి తెలిసందే. ఇందులో చై విభిన్న పాత్రల్లో కనిపించాడు. రొమాంటి, యాక్షన్ సీన్స్ వదిలిన ఈ టీజర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్విటర్లో ఈ టీజర్ షేర్ చేస్తూ నాగ చైతన్య ‘నన్ను నేను సరిచేసుకోవాడినికే చేస్తున్న ప్రయాణమే థ్యాంక్ యూ’ అని క్యాపన్ ఇచ్చాడు. చై ట్వీట్పై రానా ఆసక్తిగా స్పందిచాడు. ‘నువ్వు ఇప్పటికే సరి అయిపోయావు బ్రదర్, సూపర్ టీజర్ గాయ్స్’ అంటూ కామెంట్ చేశాడు. చదవండి: తను ఒంటరిగా చనిపోవాలన్న నెటిజన్, దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సామ్.. దీంతో రానా కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. కాగా విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హీరోయిన్లుగా రాశీ ఖన్నా, మాళవిక నాయర్ నటిస్తుండగా.. అవిక గోర్ కీ రోల్ పోషిస్తోంది. ఇదిలా ఉంటే రానా నటించిన విరాట పర్వం జులై 1న థియేటర్లో విడుదల కానుంది. విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న విరాటపర్వంలో రానా కామ్రేడ్ రవన్నగా నటిస్తుండగా ప్రియమణి ముఖ్య పాత్రలో కనిపించనుంది. దగ్గుబాటి సురేశ్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. Nuvvu already sari aiyipoyyavu brother 😝 superb teaser guy! Best wishes @Vikram_K_Kumar @RaashiiKhanna_ https://t.co/9s6qhMpLCx — Rana Daggubati (@RanaDaggubati) May 26, 2022 -
లైఫ్లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు: నాగచైతన్య
‘అన్నీ వదులుకుని ఇక్కడిదాకా వచ్చాను.. ఇక లైఫ్లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు’, ‘నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే..’ అంటూ నాగచైతన్య చెప్పే డైలాగులతో ‘థ్యాంక్యూ’ చిత్రం టీజర్ విడుదలైంది. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘థ్యాంక్యూ’. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 8న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ని బుధవారం విడుదల చేశారు.‘నువ్వు సెల్ఫ్ సెంట్రిక్ అయ్యావు, నీ లైఫ్లో నీకు తప్ప మరో వ్యక్తికి చోటు లేదు’ అంటూ హీరోయిన్ చెప్పే మాటలు కూడా టీజర్లో వినిపిస్తాయి. ‘‘ఈ చిత్రంలో వ్యాపారవేత్త అభిరామ్ పాత్రలో నాగచైతన్య నటిస్తున్నారు. ఓ సక్సెస్ఫుల్ పర్సన్ జీవితంలోని ఫీల్ గుడ్ లవ్ స్టోరీని మా సినిమాలో చూపించబోతున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. బీవీఎస్ రవి కథను అందించిన ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: పీసీ శ్రీరామ్. -
ఆసక్తిగా నాగ చైతన్య థ్యాంక్యూ మూవీ టీజర్
Thank You Movie Teaser Out: అక్కినేని నాగచైతన్య హీరోగా తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. హీరోయిన్లుగా రాశీ ఖన్నా, మాళవిక నాయర్ నటిస్తుండగా.. అవిక గోర్ కీ రోల్ పోషిస్తోంది. ఎప్పుడో షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. చదవండి: ముంబై కరణ్ బర్త్డే పార్టీ.. విజయ్, రష్మికలకు మాత్రమే ఆహ్వానం! ఈ టీజర్ చూస్తుంటే చై విభిన్న పాత్రల్లో అలరించబోతున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో నాగ చైతన్య క్లాస్, మాస్ లుక్తో ఆకట్టుకుంటున్నాడు. కాగా లైఫ్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అంటూ చై చెప్పిన డైలాగ్ ఆసక్తిగా ఉంది. టీజర్ చివరిలో ‘నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్నా ప్రయాణమే..’ అని చై చెప్పిన డైలాగ్ ఈ మూవీపై హైప్ క్రియేట్ చేస్తోంది. మొత్తానికి లవ్ ట్రాక్, రొమాంటిక్ సన్నివేవాలను రూపొందిన థ్యాంక్యూ టీజర్ బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా, బీవీఎస్ రవి కథ, పీసీ శ్రీరామ్ ఫొటోగ్రాఫర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చదవండి: లండన్లో ‘పుష్ప’ సింగర్ వెడ్డింగ్ రిసెప్షన్, స్టార్ హీరో కూతురు సందడి -
'థ్యాంక్ యూ' సినిమా అప్డేట్.. టీజర్ ఎప్పుడంటే ?
Naga Chaitanya Thank You Teaser Release Date Announced: అక్కినేని నాగచైతన్య హీరోగా తాజాగా నటిస్తున్న చిత్రం 'థ్యాంక్ యూ'. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. హీరోయిన్లుగా రాశీ ఖన్నా, మాళవిక నాయర్ అలరించనున్నారు. అంతేకాకుండా అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. జూలై 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా మరో కీలక అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. 'థ్యాంక్ యూ' సినిమా టీజర్ను మే 25న సాయంత్ర 5:04 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేస్తూ అధికారికంగా తెలిపింది. ఈ వీడియోలో 'ప్రియా నేను రెడీ.. ఏ పనైనా వెంటనే స్టార్ట్ చేయాలి' అంటూ నాగ చైతన్య డబ్బింగ్ చెబుతూ ఉంటాడు. తర్వాత టీజర్ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా, బీవీఎస్ రవి కథ, పీసీ శ్రీరామ్ ఫొటోగ్రాఫర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చదవండి: 👇 సమంత 'యశోద'గా వచ్చేది అప్పుడే.. నాగ చైతన్య, అఖిల్తో పోటీ ! సమంత పర్సనల్ లైఫ్పై నందినీ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు -
కీలక అప్డేట్ షేర్ చేసిన నాగ చైతన్య
Naga Chaitanya 'Thank You' Movie Release Date: ఇటీవలె బంగార్రాజుతో హిట్టు కొట్టిన నాగ చైతన్య ఇప్పుడు థ్యాంక్యూ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగ చైతన్య, రాశిఖాన్నా హీరో,హీరోయన్లుగా నటించారు. మాళవికా నాయర్, అవికా గోర్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ను విడుదల చేశారు. జూలై8న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారిక పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో చైతూ లుక్ క్లాస్ అండ్ డిఫరెంట్గా ఉంది. కాగా ఈ సినిమా తర్వాత చై పరుశురామ్తో సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. The date is set! Get ready to experience the magic of #ThankYouTheMovie on July 8th, 2022 in theaters @Vikram_K_Kumar@RaashiiKhanna_@MusicThaman @pcsreeram @BvsRavi #MalavikaNair @avika_n_joy @SaiSushanthR @SVC_official @adityamusic#ThankYouOnJuly8th pic.twitter.com/BWjD0BXdqU — chaitanya akkineni (@chay_akkineni) May 14, 2022 -
హీరోయిన్ మాట్లాడుతుంటే చై ఏం చేస్తున్నాడో చూడండి..
యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. గతేడాది లవ్స్టోరీతో హిట్కొట్టిన నాగ చైతన్య ఈ ఏడాది బంగర్రాజుతో సంక్రాంతి విన్నర్గా నిలిచాడు. ప్రస్తుతం ఈయన నటించిన థ్యాంక్యూ చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. విక్రమ్ కే కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాగ చైతన్య సరసన రాశీఖన్నా నటించింది. తాజాగా ఈ చిత్రం బీటీఎస్(బి హైండ్స్ ది సీన్స్) నుంచి ఓ ఫోటోను మేకర్స్ విడుదల చేశారు. చదవండి: లీకైన నిహారిక న్యూలుక్ ఫోటోలు.. నెట్టింట వైరల్ ఇందులో చై ఫోన్ చూస్తుండగా, రాశీఖన్నా దర్శకనిర్మాతలతో మాట్లాడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా ఈ చిత్రంలో నాగ చైతన్య హాకీ ప్లేయర్గా కనిపించనున్నారు.వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో అవికాగోర్, మాళవికా నాయర్లు కీలకపాత్రలో కనిపించనున్నారు. చదవండి: సహనం నశిస్తుంది, మౌనం అంగీకరంగా తీసుకోకు.. సమంత వార్నింగ్ Yuva Samrat @chay_akkineni & @RaashiiKhanna_ from the sets of #ThankYouTheMovie #Nagachaitanya #RaashiKhanna pic.twitter.com/aHZ8Z2A7y0 — BA Raju's Team (@baraju_SuperHit) April 25, 2022 -
నాగ చైతన్య సరికొత్త లుక్.. సోషల్ మీడియాలో వైరల్
Naga Chaitanya Look from Thank You Movie: అక్కినేని వారసుడు, టాలీవుడ్ గుడ్ బ్యాయ్ నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్గా లవ్స్టోరీ, బంగార్రాజు సినిమాలతో ఏడాది గ్యాప్లోనే రెండు హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న 'థాంక్యూ' చిత్రంతో బిజీగా ఉన్నాడు. చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, అవికా గోర్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. అయితే తాజా షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమాలో చైతూ ఇంటెన్స్ లుక్లో కనిపించాడు. (చదవండి: ఓటీటీలోకి నాగ చైతన్య.. టైమ్ ట్రావెల్ కథలో జర్నలిస్ట్గా !) నాగ చైతన్య గడ్డంతో, స్పెక్ట్స్ పెట్టుకుని సరికొత్త లుక్లో ఆకట్టుకుంటున్నాడు. ఈ ఫొటోను సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నాడు చైతూ. ఈ పిక్ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ తీయడం విశేషం. ఈ విషయాన్ని తన ఇన్స్టా వేదికగా 'పీసీ సర్ #థాంక్యూదిమూవీ' అంటూ అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే చైతూ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా'లో అలరించనున్న సంగతి తెలిసిందే. -
మాస్కో వీధుల్లో రాశి ఖన్నాతో నాగచైతన్య చక్కర్లు.. అక్కడేం చేస్తున్నారంటే..?
రష్యాలో థ్యాంక్యూ చెబుతున్నారు నాగచైతన్య. ‘మనం’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ రష్యాలో జరుగుతోంది. రష్యా రాజధాని మాస్కోలో ప్రస్తుతం వీధుల్లో మంచు కురుస్తోంది. ఆ వాతావరణంలో ఈ చిత్రానికి చెందిన పలు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నాగచైతన్య, రాశీ ఖన్నా, ప్రకాశ్రాజ్తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై మైనస్ 18 డిగ్రీల చలిలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా తెలిసింది. ఈ చిత్రంలో నాగచైతన్య మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపిస్తారు. ‘థ్యాంక్యూ’ చిత్రానికి ‘దిల్’ రాజు నిర్మాత. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
హ్యాపీ మూడ్లో చై, ఆకట్టుకుంటున్న లుక్
హీరో నాగచైతన్య-రాశి ఖన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమా తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ రూపొందింది. దిల్ రాజు - శిరీష్లు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో మాళవిక నాయర్, అవికా గోర్లు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. దాదాపు షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి చై లుక్ విడుదల చేశారు మేకర్స్. నవంబర్ 23 నాగ చైతన్య బర్త్డే సందర్భంగా ఫస్ట్లుక్తో పాటు ఫస్ట్ గ్లింప్స్ను పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే చై తిరునాళ్లలో కొయ్య గుర్రంపై ఎక్కి కేరింతలు కొడుతూ చాలా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. విక్రమ్ కుమార్ తయారు చేసుకున్న ఈ కథ .. విదేశాల్లోను షూటింగును జరుపుకుంది. అయితే ఇంతవరకూ ఆయన తన సినిమా నుంచి పెద్దగా అప్ డేట్స్ ఇచ్చింది లేదు. చాలా సైలెంట్ గా ఆయన తనపని చేసుకుంటూ వెళుతున్నారు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు? ఎప్పటి నుంచి ప్రమోషన్స్ మొదలుపెడతారు? అనే విషయాలు అధికారికంగా వెలువడవలసి ఉంది. కాగా ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. Here’s a glimpse wishing @chay_akkineni, a Very Happy Birthday!https://t.co/LgLgMN4fI8#HBDYuvasamratNagaChaitanya#ThankYouMovie@chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi #MalavikaNair @avika_n_joy @SaiSushanthR @SVC_official @adityamusic pic.twitter.com/OiNuIG6X17 — Sri Venkateswara Creations (@SVC_official) November 23, 2021 -
ఆర్మీ ఆఫీసర్గా చైతూ.. జిమ్లో కసరత్తులు
కొత్త మేకోవర్ కోసం జిమ్లో కసరత్తులు చేస్తున్నారు నాగ చైతన్య. లుక్ అండ్ బాడీ లాంగ్వేజ్ విషయాల్లో పర్ఫెక్షన్ కోసం ఫిట్గా రెడీ అవుతున్నారు. ఇదంతా... హిందీ చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ కోసమే అని టాక్. ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారట. అందుకే మేకోవర్ అవుతున్నారని తెలిసింది. మరోవైపు ‘థ్యాంక్యూ’ తర్వాత చైతన్య ఓ యాక్షన్ మూవీ చేయనున్నారని సమాచారం. అందుకోసం కూడా మేకోవర్ అవుతున్నారట. వచ్చే నెలలో ‘లాల్ సింగ్ చద్దా’ కొత్త షెడ్యూల్ లడఖ్, కార్గిల్లో జరగనుంది. ఈ షెడ్యూల్లో ఆమిర్, చైతన్యల మధ్య సీన్లు తీస్తారట. ఆస్కార్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు ఈ చిత్రం హిందీ రీమేక్. చదవండి: యూట్యూబ్లో సత్తా చాటుతున్న ‘మజిలీ’ హిందీ వెర్షన్ -
మరో ఆరు రోజుల్లో థ్యాంక్యూకు నాగచైతన్య గుడ్బై!
థ్యాంక్యూ చిత్రానికి బైబై చెప్పననున్నారు నాగచైతన్య. మనం సినిమా తర్వాత నాగచైతన్య. దర్శకుడు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం థ్యాంక్యూ. ఈ చిత్రంలో రాశీఖన్నా , మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అవికాగోర్ కీలక పాత్రధారి. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి హైదరాబాద్లో ప్రారంభం కానుంది. ఓ ఆరు రోజుల చిత్రీకరణ జరుపుకుంటే థ్యాంక్యూ సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలిసింది. ఈ ఆరు రోజుల చిత్రీకరణ త్వరలోనే ఆరంభం కానుంది. ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసిన వెంటనే తాను హిందీలో నటించనున్న తొలి చిత్రం లాల్ సింగ్ చద్దా చిత్రీకరణలో పాల్గొంటారు నాగచైతన్య. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ఫారెస్ట్ గంప్కు హిందీ రీమేక్గా లాల్సింగ్ చద్దా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. చదవండి: నాగచైతన్య కార్ల కలెక్షన్స్ చూస్తే కళ్లు తిరగడం ఖాయం! -
Rashi Khanna: రిస్క్ అయినా.. 18 గంటలు కష్టపడ్డాం
‘మనం’తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘థ్యాంక్యూ’.ఇందులో రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోవిడ్ పరిస్థితులు భయపెడుతున్నప్పటికీ ‘థ్యాంక్యూ’టీమ్ ఇటలీలో వెళ్లి షూటింగ్ కంప్లీట్ చేసుకొచ్చింది. ఇలాంటి రిస్క్ టైంలో కూడా థాంక్యూ టీమ్ షూటింగ్ పూర్తి చేసుకొని రావడం ఆశ్చర్యం కలిగించింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో పడిన కష్టాలను బయట పెట్టింది రాశిఖన్నా. కరోనా భయానికి ఇండియా నుంచి ఇటలీకి వెళ్లాలంటే భయమేసింది కానీ, సినిమా కంప్లీట్ చేయాలి కాబట్టి భయంతోనే ఇటలీకి వెళ్లాలని చెప్పింది. భయం భయంగానే షూటింగ్ పూర్తి చేశామని తెలిపింది. షూటింగ్ త్వరగా ముగించేందుకు రోజుకు 18 గంటలు కష్టపడిన సందర్భాలు ఉన్నాయని రాశి చెప్పు కొచ్చింది. కొంచెం కష్టమైనా.. మొత్తనాకి షూటింగ్ పూర్తి చేసుకొని రావడం సంతోషంగా ఉందని రాశి పేర్కొంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో మహేశ్బాబు అభిమాని పాత్రలో నాగచైతన్య కనిపిస్తారని తెలుస్తోంది. ఓ కీలక పాత్రలో అవికా గోర్ కనిపిస్తారని సమాచారం. చదవండి : ప్రీ లుక్తోనే షాకిస్తున్న అల్లు శిరీష్.. అస్సలు తగ్గట్లేదుగా ఇతిహాసాల నేపథ్యంలో ప్రశాంత్ వర్మ కొత్త మూవీ, టైటిల్ ఖరారు -
వైరల్ అవుతన్న నాగచైతన్య, రాశిఖన్నా సెల్ఫీ ఫోటో
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘థాంక్యూ’. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటలీలో ఈ సినిమా షూటింగ్ ప్యాక్ అప్ అయింది. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా చిత్ర బృందం కలిసి దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. షూటింగ్ లొకేషన్లో నాగ చైతన్య కలిసి దిగిన ఓ సెల్ఫీని రాశిఖన్నా అభిమానులతో పంచుకుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా సినిమాల షూటింగులు నిలిపివేస్తే.. ‘థ్యాంక్యూ’ చిత్రబృందం మాత్రం చిత్రీకరణ కోసం ఇటలీ వెళ్లింది. కోవిడ్ కారణంగా షూటింగ్ క్యాన్సిల్ అయిందని ఇటీవల వార్తలు వినిపించాయి. కానీ తాజాగా షేర్ చేసిన ఫోటోతో ఆ వార్తలన్నీ పుకార్లేనని తేలిపోయాయి. థ్యాంక్యూ' ఇటలీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగి వస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. #onset #thankyouthemovie @chay_akkineni pic.twitter.com/xQD0Nb9SWg — Raashii Khanna (@RaashiiKhanna_) May 7, 2021 -
ఇటలీలో ల్యాండ్ అయిన నాగచైతన్య
కోవిడ్ పరిస్థితులు భయపెడుతున్నప్పటికీ ‘థ్యాంక్యూ’ చిత్రబృందం ఇటలీలో ల్యాండ్ అయింది. పదిహేను రోజుల షూటింగ్ను అక్కడ ప్లాన్ చేశారు. ఇటీవల వైజాగ్లో ఒక షెడ్యూల్ జరిగింది. ఇప్పుడు ఇటలీలో జరుగుతున్న షెడ్యూల్ తర్వాత హైదరాబాద్లోనూ ప్లాన్ చేశారు. ఇటలీలో జోరుగా షూటింగ్ చేస్తున్నారు. మరి.. యూనిట్ ఇటలీ నుంచి వచ్చాక ఇక్కడి పరిస్థితులను బట్టి హైదరాబాద్ షెడ్యూల్ ఉంటుంది. ‘మనం’ తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో హీరోయిన్ అవికా గోర్ ఇందులో కీలక పాత్రధారి. ఈ సినిమాలో హీరో మహేశ్బాబు అభిమాని పాత్రలో నాగచైతన్య కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. చదవండి: -
‘థ్యాంక్యూ’ కోసం ఇటలీకి పయనమైన నాగచైతన్య
నాగచైతన్య ఇటలీలో ‘థ్యాంక్యూ’ చెప్పనున్నారు. ‘మనం’ సినిమా తర్వాత నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. ఇందులో రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ కీలక పాత్రలో అవికా గోర్ కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ ఇటీవల విశాఖపట్నంలో ముగిసింది. ఒక ఫారిన్ షెడ్యూల్ మిగిలి ఉంది. ఈ షెడ్యూల్ను ఇటలీలో జరపాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. మొత్తం పదిహేను రోజుల పాటు అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించాలనుకుంటున్నారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఫారిన్ షెడ్యూల్ ఉంటుందా? లేదా? అనేది మరో రెండు రోజుల్లో తెలుస్తుంది. చదవండి: ఆటో డ్రైవర్కు సమంత ఊహించని గిఫ్ట్ బన్నీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘ఐకాన్’ మూవీపై దిల్రాజు క్లారిటీ -
విదేశాల్లో థ్యాంక్యూ
విదేశాల్లో ‘థ్యాంక్యూ’ చెప్పనున్నారు నాగచైతన్య. ‘మనం’ తర్వాత దర్శకుడు విక్రమ్ కె. కుమార్, హీరో నాగచైతన్య కాంబినేష¯Œ లో రూపొందుతున్న సినిమా ‘థ్యాంక్యూ’. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. త్వరలో ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ విదేశాల్లో జరుగనుంది. దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. క్రీడా నేపథ్యంలో సాగే సినిమా ఇదని టాక్. అలాగే ఇందులో హీరో మహేశ్బాబు అభిమానిగా కనిపిస్తారట నాగచైతన్య. -
మరోసారి నాగచైతన్యతో స్క్రీన్ పంచుకోనున్న రాశిఖన్నా
‘వెంకీమామ’ సినిమాలో జంటగా కనిపించి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నాగచైతన్య, రాశీ ఖన్నా. అంతకుముందు అక్కినేని ఫ్యామిలీ నటించిన ‘మనం’ చిత్రంలో రాశీఖన్నా ఓ గెస్ట్ రోల్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు చైతూతో ఆమె మరోసారి సిల్వర్ స్క్రీన్ని షేర్ చేసుకోనున్నారని సమాచారం. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘థ్యాంక్యూ’. ఈ సినిమాలో మహేశ్బాబు అభిమానిగా కనిపిస్తారు నాగచైతన్య. కథ ప్రకారం ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. ఒక నాయికగా రాశీ ఖన్నాను ఎంపిక చేశారని సమాచారం. కథలో నాగచైతన్య యంగ్ ఏజ్లో ఉన్న సన్నివేశాల్లో అతనికి జోడీగా రాశీ కనిపిస్తారట. ఇంకా ఇద్దరు కథానాయికల జాబితాలో మాళవికా నాయర్, నభా నటేశ్ పేర్లు వినిపిస్తున్నాయి. -
ఈ పిల్లోడి నవ్వు భలే ఉంటుంది!
‘‘పిల్లలందరితో లొకేషన్ చాలా సందడిగా ఉంది’’ అంటున్నారు ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్. ఒక సీనియర్ కెమెరామేన్గా లొకేషన్లో ఉన్నవాళ్లందరూ ఆయనకు పిల్లల్లా కనిపించారు. ఇక్కడున్న ఫొటోను బట్టి నాగచైతన్యతో చేస్తున్న సినిమా గురించే పీసీ శ్రీరామ్ ఇలా అని ఉంటారని అర్థమై ఉంటుంది. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘థ్యాంక్యూ’. ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. చిత్రీకరణకు సంబంధించిన ఓ చిన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి, ‘‘ఈ పిల్లోడి నవ్వు భలే ఉంటుంది’’ అని నాగచైతన్యను ఉద్దేశించి అన్నారు పీసీ శ్రీరామ్. ఫొటోలో నాగచైతన్య మీసాలు లేకుండా యంగ్ లుక్లో కనబడుతున్నారు. ఇందులో చైతూ స్కూల్ స్టూడెంట్లానూ కనబడతారని ఓ వార్త వచ్చింది. ఆ వార్త నిజమేనని ఈ ఫొటో చెబుతోంది. On location with kids all around . pic.twitter.com/6KonlSGjxI — pcsreeramISC (@pcsreeram) March 6, 2021 -
రాజమండ్రిలో థ్యాంక్యూ
‘‘చెప్పాల్సిన టైమ్లో థ్యాంక్యూ చెప్పడం అవసరం’’ అని కొన్ని రోజుల క్రితం నాగచైతన్య అన్నారు. ప్రస్తుతం ఆయన ‘థ్యాంక్యూ’ అనే సినిమా చేస్తున్నారు. అందుకే అలా అన్నారు. ‘మనం’ దర్శకుడు విక్రమ్ కుమార్తో మళ్లీ నాగచైతన్య చేస్తున్న సినిమా ఇది. వారం క్రితం ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రిలో ఆరంభమైంది. మరోవారం పాటు జరుగుతుంది. ఇప్పటికే ఒక పాట చిత్రీకరించారు. ప్రస్తుతం సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇందులో చైతూ సరసన ఇద్దరు నాయికలు నటిస్తారు. ఇంకా కథానాయికలను అధికారికంగా ప్రకటించలేదు. అలాగే ఓ ప్రముఖ హీరోయిన్ కీలక పాత్ర చేస్తారని టాక్. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. -
ట్రిపుల్ ధమాకా
ఇప్పటివరకూ నాగచైతన్య హీరోగా నటించిన సినిమాలు ఇరవై. వీటిలో ఇద్దరు కథానాయికలున్న చిత్రాలు ఉన్నాయి. కానీ ముగ్గురు కథానాయికలతో ఇప్పటివరకూ చైతూ సినిమా చేయలేదు. ఇప్పుడు చేయనున్నారని తెలిసింది. అక్కినేని కుటుంబానికి ‘మనం’లాంటి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇచ్చిన విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో చైతూ ‘థ్యాంక్యూ’ సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం దసరా సందర్భంగా లాంఛనంగా ఆరంభమైంది. ఈ నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుందని సమాచారం. ఇందులో చైతూ సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తారని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంటే.. అక్కినేని అభిమానులకు చైతన్యను ముగ్గురు నాయికల సరసన చూడటం ట్రిపుల్ ధమాకా అన్నమాట. ప్రస్తుతం ముగ్గురు నాయికల ఎంపిక జరుగుతోంది. ఇందులో చైతన్య పల్లెటూరి కుర్రాడు, ఎన్నారైగా కనిపించనున్నారట. ‘మనం’ తర్వాత చైతూ–విక్రమ్ కుమార్ కాంబినేషన్లో రూపొందనున్న ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకుడు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
అక్టోబర్లో స్టార్ట్
‘మనం’ తర్వాత విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నారు నాగచైతన్య. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఇటీవల ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘థ్యాంక్యూ’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తారు. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ కనిపించే అవకాశం ఉందని తెలిసింది. రకుల్ ప్రీత్సింగ్, తమిళ నటి ప్రియా భవానీ శంకర్లను ఈ సినిమాలో హీరోయిన్లుగా తీసుకోవాలని చిత్రబృందం అనుకుంటున్నారట. గతంలో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో జంటగా నటించారు చైతన్య, రకుల్. మరి ‘థ్యాంక్యూ’లో జంటగా కనిపిస్తారా? అనేది త్వరలో తెలిసిపోతుంది. హీరోయిన్ల గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయని సమాచారం. అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
థాంక్యూ మహి...
-
అవిశ్వాసానికి థాంక్యూ..!
న్యూఢిల్లీ: పార్లమెంట్లో తనపై అవిశ్వాస తీర్మానం పెట్టిన విపక్షాలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఆ తీర్మానం వల్ల ప్రతిపక్షాల అజ్ఞానాన్ని, అవగాహన లేమిని బట్టబయలు చేయగలిగామన్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో మంగళవారం ఆయన ప్రసంగించారు. ‘వారు (విపక్షాలు) తెచ్చిన తీర్మానం వారి రాజకీయ అపరిపక్వతను, అపరిణతిని, అవగాహన లేమి, విషయ పరిజ్ఞాన లేమి మొదలైనవాటినే బయటపెట్టింది’ అని మోదీ వ్యంగ్య బాణాలు విసిరారు. తీర్మానంపై చర్చలో హోంమంత్రి రాజ్నాథ్ చేసిన ప్రసంగాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని.. ఆ ప్రసంగాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలను కోరారు. అవిశ్వాస తీర్మానం గురించి భేటీలో పాల్గొన్న బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్రమంత్రులు గడ్కరీ, సుష్మా స్వరాజ్ తదితరులు కూడా మాట్లాడారని కేంద్రమంత్రి అనంత్కుమార్ మీడియాకు తెలిపారు. సాధారణంగా ప్రభుత్వ పక్షం మెజారిటీ కోల్పోయినప్పుడు అవిశ్వాస తీర్మానం పెడ్తారని, కానీ ఈ సందర్భంలో అలాంటి పరిస్థితేమీ లేదని వారు విమర్శించారన్నారు. ఐడియాలివ్వండి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించాల్సిన అంశాలను సూచించాల్సిందిగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘నా ఆగస్ట్ 15 ప్రసంగంలో ఏ అంశాలుంటే బావుంటుంది? మీ ఆలోచనలు, ఐడియాలను నరేంద్ర మోదీ యాప్లో ప్రత్యేకంగా రూపొందించిన ఒక ఫోరమ్లో నాతో పంచుకోండి. మీ సూచ నల కోసం ఎదురు చూస్తుంటా’ అని మోదీ ట్వీట్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం కోసం పౌరుల సూచనలు కోరే సంప్రదాయాన్ని మూడేళ్లుగా మోదీ పాటిస్తున్నారు. మైగవ్.ఇన్ వెబ్సైట్ ద్వారా కూడా సూచనలు పంపించవచ్చు. ఇప్పటికే ఆ వెబ్సైట్లో ఇందుకు సంబంధించిన పలు సూచలను ప్రజలు చేశారు. -
దుర్మార్గపు దయ
మిమ్మల్ని చూస్తుంటే మీ ఇద్దరి మధ్యా ఏదో ఉందనిపిస్తుంది, కానీ మీరు దాన్ని దాస్తున్నారు అని గనక ఎవరైనా అంటే... ఇద్దరూ ఏకగొంతుతో అలాంటిదేమీ లేదని బదులిస్తారు, అది నిజం కూడా. ఒక నెలకు పైగా వాళ్లు కలిసి తింటున్నారు, కలిసి చదువుతున్నారు, కలిసి పనిచేస్తున్నారు– గోరంతలు కొండంతలు చేసే స్వభావం ఉన్నవాళ్లు ఎవరైనా వీళ్లు ఒకరి కొకరు చెప్పుకుంటున్న మాటలు గమనించినా, ఒకరిమీద పడ్డట్టుగా మరొకరు ఉంటున్న తీరును చూసినా, వీళ్లు కచ్చితంగా ప్రేమించుకుంటున్నారని చెబుతారు. ఆమెది అర్జెంటీనా, అతడిది చిలీ. వాళ్లిద్దరూ దూరపు నడకలంటే ఇష్టం ఉన్నవాళ్లే, నడుస్తూ దూర ప్రయాణాలు చేయడం ఎంత బాగుంటుందో అని మాట్లాడుకున్నవాళ్లే, అసలు ప్రపంచాన్ని దూరపు నడకలు ఇష్టపడేవాళ్లూ, ఇష్టపడనివాళ్లూ అని విభజించేంతగా వాళ్ల సంభాషణ కొనసాగింది కూడా. అయినప్పటికీ ఏదో చపలచిత్తంతో వాళ్లు టాక్సీ ఎక్కారు, ఆ టాక్సీలు ఎక్కకూడదని వాళ్లకు మెక్సికో సిటీలో అడుగు పెట్టడానికి నెలలకు ముందే హెచ్చరికలు వచ్చివున్నప్పటికీ, ప్రత్యేకించి వీధుల్లోవి, వాళ్లకు కూడా ఇన్నిరోజులూ టాక్సీ తీసుకోవాలన్న ఆలోచనే రాలేదు, కానీ ఈ రోజు ఏదో చపలచిత్తంతో టాక్సీ తీసుకోవడమూ, డ్రైవరు రాంగ్ రూట్లో పోతున్నాడని ఆమె గ్రహించడమూ, చిలీ అబ్బాయితో ఆమె ఏదో గొణగడమూ, అతడు ఏం కాదన్నట్టుగా భరోసా ఇవ్వడమూ జరిగింది. కానీ అతడి మాటలకు ఏ ప్రభావమూ లేనట్టుగా టాక్సీ ఆగింది, ఇద్దరు మనుషులు టాక్సీలోకి వచ్చారు. చిలియన్ ధైర్యంగా, నిర్లక్ష్యంగా, కంగారుగా, పిల్లతనంతో, మూర్ఖత్వంతో స్పందించాడు, ఒక దోపిడీదారు ముక్కు మీద గుద్దాడు, ఆమె అప్పటికే ఆపండి, ఆపండి అని అరుస్తూనే ఉంది. చిలీ అబ్బాయి ఆగాడు, దోపిడీదారులు చిలియన్ను ఆడుకున్నారు, వాళ్లు ఏ కనికరమూ చూపలేదు, లోపల ఏమైనా విరిగివుండొచ్చు కూడా. కానీ ఇదంతా జరిగి అప్పటికే పది నిమిషాలైంది, అప్పటికే వీళ్ల డబ్బులూ, క్రెడిట్ కార్డులూ లాక్కున్నారు, ఏటీఎం పిన్ నంబర్లు కంఠస్తం చేశారు. ఇప్పుడు వాళ్లు ముగ్గురయ్యారు, కారు ఆగిన వెంటనే డ్రైవరు దిగిపోయాడు, ఆ కారునే మరో ట్రక్కుతో ఫాలో అవుతున్న ఇంకో దొంగ కారెక్కి స్టీరింగ్ తీసుకున్నాడు, ఈ కొత్త దొంగ మరోసారి చిలియన్ను కొట్టాడు, అమ్మాయిని తినేసేలా చూశాడు, ఆ దెబ్బలనీ, దగ్గరికి లాక్కోవడాన్నీ ఇంక చేసేదేమీ లేదన్నట్టుగా వాళ్లు అంగీకరించారు. దొంగలు ఎంతో దయగా వీళ్లు ఎక్కడికి వెళ్తున్నారని అడిగి, లా కొందేస వెళ్తున్నారని తెలుసుకుని, మేము దగ్గరలో మిమ్మల్ని డ్రాప్ చేస్తామనీ, మేము మరీ అంత చెడ్డవాళ్లమేమీ కాదనీ చెప్పారు. వాళ్లని దింపెయ్యడానికి ముందు నమ్మశక్యంకానట్టుగా వాళ్లకు నూరు పెసోలు ఇచ్చారు కూడా, తిరిగి మళ్లీ ఇంటికి టాక్సీలో వెళ్లమని చెప్పి, కానీ వీళ్లు టాక్సీ తీసుకోలేదు, సబ్వే వైపు బయల్దేరారు, మధ్యమధ్యలో ఆమె ఏడుస్తూ ఉంది, అతడు ఆమెను ఓదార్పుగా దగ్గరకు తీసుకున్నాడు, ఒక్కోసారి అతడు అయోమయంగా కన్నీరును ఆపుకున్నాడు. మెక్సికో సిటీ సబ్వేలో తరచూ ట్రెయిన్ చాలాసేపు ఆగుతుంది, ఒక మధ్య స్టేషన్లో ఒక ఆరేడు నిమిషాలపాటు, ఆ అతిసాధారణ ఆలస్యం ఉద్దేశపూర్వకంగా జరిగినట్టుగా వాళ్లను హింస పెట్టింది, ఆ ట్రెయిన్ డోర్లు మూసుకుని, ట్రెయిన్ కదిలి, చివరికి వాళ్ల స్టేషన్లో దిగి, నడుచుకుంటూ ఆమె ఉంటున్న ఇల్లు చేరేదాకా. ఈ అర్జెంటైన్, చిలియన్ ఒక దగ్గర ఉండరు. చిలియన్ ఒక ఈక్వెడార్ రచయితతోనూ అర్జెంటైన్ ఇద్దరు స్నేహితులతోనూ ఉంటారు– ఒక స్పానియార్డ్, ఒక చిలియన్, మరో చిలియన్– నిజానికి వాళ్లు స్నేహితులు కూడా కారు, వాళ్లంతా రచయితలు, మెక్సికో ప్రభుత్వం ఇస్తున్న ఒక గ్రాంటు వల్ల మెక్సికో వచ్చారు, వాళ్లు చేసే పనులన్నింట్లోకీ రాయడం తక్కువైనప్పటికీ. వాళ్లు వచ్చి తలుపు తెరిచేప్పటికి, స్పానియార్డ్, బక్కపలుచటి స్నేహశీలి ఏదో రాసుకుంటున్నాడు, రెండో చిలియన్ అక్కడ లేడు. మొదటి చిలియన్, రెండో చిలియన్ స్నేహితులు కారు, చెప్పాలంటే వాళ్లు శత్రువుల లాంటివారు, కనీసం చిలీలో ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు మెక్సికోలో ఉన్నప్పుడు కూడా పోట్లాడుకోవడం అనుచితమని ఇద్దరికీ తెలుసు. వీళ్లు ఇద్దరు వెళ్లేప్పటికి లివింగ్ రూములో శ్రద్ధగా రాసుకుంటున్న స్పానియార్డ్ జరిగింది విని దాదాపుగా కదిలిపోయాడు, వీళ్లను ఓదార్చడానికి ప్రయత్నించాడు, ఉల్లాసపరిచే సందర్భోచిత జోకొకటి చెప్పాడు, క్రెడిట్ కార్డులు బ్లాక్ చేయడానికి అవసరమైన నంబర్ సంపాదించి ఇవ్వడంలో సాయపడ్డాడు– దొంగలు 3000 పెసోలు తీసుకున్నారు, రెండు క్రెడిట్ కార్డులు, రెండు సెల్ఫోన్లు, రెండు లెదర్ జాకెట్లు, ఒక వెండి గొలుసు, ఒక కెమెరా కూడా, ఈ చిలియన్ కెమెరా తేవడానికి మళ్లీ తిరిగి వెళ్లాడు, ఎందుకంటే అతడు అర్జెంటైన్ ఫొటోలు తీద్దామనుకున్నాడు, ఆమె నిజంగా అందంగా ఉంటుంది, ఇది పడికట్టు మాటే, కానీ ఏం చేయగలం, నిజంగా కూడా ఆమె అందంగా ఉంటుంది, అతడు అది కూడా ఆలోచించాడు, ఆ కెమెరా తేవడానికి గనక తిరిగి ఇంటికి వెళ్లకపోయుంటే వాళ్లు అదే టాక్సీని ఎక్కకపోయేవాళ్లు, కానీ చాలా విషయాలు అలాగే జరుగుతాయి, వాళ్లు కొంచెం ముందు వెళ్లినా కొంచెం వెనక వెళ్లినా ఆ కిడ్నాప్ బారి నుంచి కాపాడుకోగలిగేవాళ్లు. అర్జెంటైన్, చిలియన్ జరిగిందేమిటో రెండోసారి, మూడోసారి స్పానియార్డ్కు చెబుతూ ఉపశమనం పొందుతున్నప్పుడు, రెండో చిలియన్ వచ్చాడు, అతడో పార్టీ నుంచి తిరిగొస్తున్నాడు, కూర్చుని తన చికెన్ ముక్క తినబోతూ, ఏం జరిగిందో చూసుకోకుండా ఉన్నపళంగా మాట్లాడటం మొదలుపెట్టాడు, అప్పుడుగానీ మొదటి చిలియన్ ముఖం ఉబ్బివుండటం, దానికి అతడు ఐస్బ్యాగ్ పెట్టుకోవడం గమనించలేదు, ముందైతే అతడికి అది సహజంగానే కనబడింది, అతడిదైన కవి ప్రపంచంలో ఎవరైనా ఒకరు ముఖానికి మంచుగడ్డలు పెట్టుకుని అలా రాత్రంతా గడపడం సాధారణమే కదా అనిపించింది, కానీ ఏం జరిగిందో తెలుసుకున్నాక, ‘ఘోరం, ఇవ్వాళ మధ్యాహ్నం నాకూ దాదాపు ఇలాగే జరగబోయింది’ అన్నాడు, అతడు ఒక్క లిప్తకాలంలో ఆ టాక్సీ నుంచి బయటపడాలని నిర్ణయం తీసుకోవడం వల్ల బచాయించాడు. మళ్లీ ఎవరో వచ్చారు, ఆ స్పానియార్డ్ స్నేహితుడై ఉండాలి, మళ్లీ వీళ్లు కథంతా చెప్పారు, ముఖ్యంగా చివరి భాగం, టాక్సీలోని తుది అరగంట, ఇది వాళ్లకు రెండో భాగం లాంటిది. అపహరణ వ్యవహారం మొత్తం గంటసేపు సాగింది, మొదటి అరగంట వీళ్లు ప్రాణాల కోసం భయపడ్డారు, రెండో అరగంటలో భయం ఉన్నప్పటికీ ఆ దొంగలు తమను కచ్చితంగా చంపరని వాళ్లకు నమ్మకం కుదిరింది, ఎందుకంటే వాళ్ల మాటలు అంత భయంకరంగా లేవనిపించింది: ‘అర్జెంటైన్లను పట్టుకున్నాంగానీ ఒక్క చిలియన్ను కూడా ఇంతకుముందు పట్టుకోలేదు’ అన్నాడు సీట్లో కూర్చున్న వ్యక్తి, ఇంకా ముందుకెళ్లి చిలీ దేశ పరిస్థితి ఏంటని కూడా విచారించాడు, వాళ్లేదో రెస్టారెంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నట్టుగా. ఇంతలో వెనకసీట్లో కూర్చుని చేతిలో గన్ పట్టుకున్న వ్యక్తి, ‘మిమ్మల్ని చూస్తుంటే మీ ఇద్దరి మధ్యా ఏదో ఉందనిపిస్తుంది, కానీ మీరు దాన్ని దాస్తున్నారు’ అన్నాడు, దానికి వాళ్లు ఏకస్వరంతో లేదులేదన్నారు. ఏం అతడు బాగానే ఉన్నాడు కదా అని అర్జెంటైన్ను ఉద్దేశించి అని, నువ్వా 70ల పొడుగు జుట్టు కత్తిరిస్తే ఇంకా బాగుంటావని చిలియన్కు సలహా ఇచ్చి, పెద్ద కళ్లద్దాలు అతడి ముఖం మీంచి తీయించి కిటికీలోంచి పారేశాడు. ‘ఈసారొచ్చినప్పుడు కత్తెర వెంట తెచ్చుకోవాలి’ అన్నాడు గన్మాన్, మళ్లీ చిలియన్ను పట్టుకున్నప్పుడు ఈ జుట్టు కత్తిరించాలని చెబుతూ, ముందుముందు మనం చిలియన్లనే, ప్రత్యేకించి పొడువు జుట్టు ఉన్నవాళ్లనే పట్టుకోవాలనీ, అర్జెంటైన్లను ఇంతకుముందు పట్టుకున్నాంగానీ మొదటిసారి మనకు ఈ కుక్కలకొడుకు దొరికాడనీ అన్నాడు. నా దగ్గరో కత్తివుందిగానీ దానితో జుట్టు కత్తిరించలేననీ, కాకపోతే వృషణాలు కోయగలననీ, కానీ అవి తీసేస్తే వీడి గర్ల్ఫ్రెండుకు కష్టమైపోతుందనీ బాధపడ్డాడు, పైగా అర్జెంటైన్ అమ్మాయి సెక్సీగా కూడా ఉందాయె, అంత అందగత్తెను ఏమీ చేయకుండా వదిలేయడం కష్టంగానే ఉన్నప్పటికీ ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను కాబట్టి ఆ పని చేయనన్నాడు. డ్రైవింగ్ సీట్లో ఉన్నవాడు అమ్మాయిని మారడోనా గురించి అడిగాడు, ఆమె ఏదో బదులిస్తుండగానే వాడు తమాషాగా మెస్సీ కంటే చిచారిటో హెర్నాండెజ్ మంచి ఆటగాడని చెబుతూ, మెక్సికోలో ఏ ఫుట్బాల్ క్లబ్ నీ ఫేవరేట్ అని అడిగాడు, ఆమె తనకు తెలియదంది, అది పచ్చి అబద్ధం, వాడికంటే కచ్చితంగా ఆ అమ్మాయికి సాకర్ గురించి ఎక్కువ తెలుసు. దీని గురించే చిలియన్ కూడా ఆలోచించాడు, ఎలా అబద్ధం చెప్పాలో తెలియక, ప్యూమా, షివాస్, క్రూజ్ అజుల్ క్లబ్బుల్లో దొంగలు దేని ఫ్యాన్సో అంచనా వేయలేక, మాంటెరీ అన్నాడు, అక్కడ చుపెటె సువాజో ఆడతాడు కాబట్టి. ఈ మాంటెరీ అంటే ఆ దొంగకు ఇష్టం లేకపోయినా చుపెటె సువాజోకు అతడు ఫ్యాన్ కాబట్టి, చుపెటె సువాజో గౌరవార్థం వాళ్లను చంపకుండా వదిలేయాలని తీర్మానించాడు. ఈ చుపెటె సువాజో ఎవరని అడిగాడు రెండో చిలియన్, తనకు కచ్చితంగా తెలిసినా, తాను సాకర్ను అంత పట్టించుకోనని బిల్డప్ ఇచ్చేందుకు. మొదటి చిలియన్ జవాబు ఇచ్చేలోగా స్పానియార్డ్ అందుకుని అతడు చిలీ సెంటర్ ఫార్వర్డ్ ఆటగాడని బదులిచ్చాడు. అర్జెంటైన్, మొదటి చిలియన్ ఇంకా అలాగే దగ్గరగా కూర్చుని ఉన్నారు. ఈ అన్ని వివరాలతో కూడిన కిడ్నాప్ డ్రామా గురించి చెప్పీ చెప్పీ అలసి, నిజంగా వాళ్లకు ఒంటరిగా ఉండాలనిపించింది. చివరకు బాత్రూమ్కు వెళ్తున్నానని చెప్పి అర్జెంటైన్ బెడ్రూములోకి వెళ్లాడు చిలియన్. కాసేపుండి అర్జెంటైన్ కూడా లేచి బాత్రూములోకి వెళ్లి కిడ్నాపును కడుక్కునేలా స్నానం చేసింది, ఇంకా నయం ఆమెకు జరిగింది తక్కువే కాబట్టి, ఈ రోజంతా ఆమె అందరికీ కృతజ్ఞతతో ‘థేంక్యూ, థేంక్యూ’ అని చెబుతూనేవుంది, ఏం చేయకుండా వదిలేసిన కిడ్నాపర్లకూ, తనను ఓదార్చిన స్పానియార్డ్కూ, పట్టించుకోకుండా వదిలేసి కూడా సాంత్వన ఇచ్చిన రెండో చిలియన్కూ, ఇంకా ముఖ్యంగా మొదటి చిలియన్కూ. ఇప్పుడు అర్జెంటైన్నూ చిలియన్నూ చూసేవాళ్లెవరైనా, ప్రేమంటే ఏమిటో తెలిసిన వాళ్లెవరైనా వీళ్లిద్దరూ చాలాకాలం కలిసివుంటారని అనుకుంటారు. అలెజాండ్రో జాంబ్రా అలెజాండ్రో జాంబ్రా, చిలీ రచయిత. 1975లో జన్మించారు. బోన్సాయ్ నవల ఆయనకు పేరు తెచ్చింది. ఆయన ‘థేంక్ యూ’ కథకు పైది సంక్షిప్త రూపం. అలెజాండ్రో తెంపు లేకుండా వాక్యాలు రాస్తూపోతాడు. స్పానిష్లో రాసిన ఈ కథ ఆంగ్లానువాదాన్ని ఈ లింకులో చదవొచ్చు. https://www.vice.com/ en_us/article/dpwv8w/thank-you-0000146-v20n11 -
నాకు 25.. అయితే ఏం?
నీకు 45.. నాకు 25.. అయితే ఏం? మనిద్దరం చూడచక్కని జంట అనిపించు కోగలం అనే స్థాయిలో ఐదేళ్ల క్రితం ‘థ్యాంక్యూ’ సినిమాలో అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్ కెమిస్ట్రీ పండించగలిగారు. అందుకే ఇద్దరి మధ్య 20 ఏళ్లు వయసు వ్యత్యాసం ఉందనే విషయం ప్రేక్షకులకు గుర్తు రాలేదు. ఈ జంట మరోసారి జతకట్టనున్నారు. ‘చీనీ కమ్’, ‘పా’ వంటి చిత్రాల ద్వారా విలక్షణ దర్శకుడని పించుకున్న ఆర్. బాల్కీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. బాల్కీ చెప్పిన కథ వినగానే మరో ఆలోచనకు తావు లేకుండా అక్షయ్కుమార్– సోనమ్ కపూర్ ఈ చిత్రానికి సైన్ చేశారట. ఇందులో అమితాబ్ బచ్చన్ గెస్ట్ రోల్ చేయనున్నారట. ‘చీనీ కమ్’, ‘పా’ చిత్రాలు చేసినప్పుడు బాల్కీతో అమితాబ్కు మంచి అనుబంధం ఏర్పడింది. తాజా సినిమాలో గెస్ట్ రోల్ అంగీకరించడానికి ఆ ఒక్కటి చాలదా? పైగా బాల్కీ చిన్న పాత్ర ఇచ్చినా.. అది గొప్పగా ఉంటుందని అమితాబ్కు తెలుసు. వచ్చే ఏడాది షూటింగ్ మొదలు కానుంది. -
అందరికీ ధన్యవాదాలు
తమిళసినిమా; కబాలి చిత్రం అనితర సాధ్య వసూళ్లతో రికార్డులు బద్ధలుకొడుతోంది. ఈ విజయాన్ని ప్రపంచ సినిమా వేడుక చేసుకుంటోంది. ముఖ్యంగా రజనీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. చిత్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల గల్లాపెట్టెలు నిండుతున్నాయి. చిత్ర దర్శకుడు అభినందనల వానలో తడిచి ముద్దవుతున్నారు. కబాలి చిత్రంలో నటించిన తారాగణం, ఇతర సాంకేతిక వర్గం ఘనంగా ఫీలౌతున్నారు. ఇంతకీ కబాలి చిత్రాన్ని సింగిల్ హ్యాండ్తో విజయ తీరాన్ని దాటించిన సూపర్స్టార్ రజనీ మనసులోని మాట ఏమిటీ? కబాలి చిత్రంపై ఆయన స్పందన వినాలని పరిశ్రమ వర్గాలతో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మాట వాస్తవం. కబాలి చిత్రాన్ని పూర్తి చేసి, తదుపరి ఎందిరన్కు సీక్వెల్గా తెరకెక్కుతున్న 2.ఓ చిత్ర అమెరికా షెడ్యూల్ను పూర్తి చేసి అక్కడే ఉండిపోయారు. కబాలి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారని అందరూ భావించినా ఆయన రాలేదు. దీంతో రజనీకాంత్ గురించి రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. కబాలి విజయం సంతోషాన్నిచ్చింది: ఇక అసలు విషయానికొస్తే రెండు రోజుల క్రితం అమెరికా నుంచి చెన్నైకి తిరిగి వ చ్చిన సూపర్స్టార్ మంగళవారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో నాకు జీవితాన్నిచ్చిన తమిళ ప్రజలందరికీ నమస్కారాలు. శంకర్ దర్శకత్వంలో లైకా పొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 2,ఓ. నా చిరకాల మిత్రుడు కలైపులి ధాను యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో నిర్మించిన విప్లవాత్మక చిత్రాలకు సంబంధించి మలేషియా, ఇండియాలో షూటింగ్లో అవిశ్రాంతంగా నటించాను. దీంతో శారీరకంగానూ, మానసికంగానూ విశ్రాంతి అవసరం అయ్యింది. తన పెద్దకూతురు ఐశ్వర్యా ధనుష్తో కలిసి అమెరికాలోనే ఉండి విశ్రాంతి తీసుకుంటూ, వైద్య చికిత్స పొంది రెండు నెలల తరువాత పూర్తి ఆరోగ్యంతో, నూతనోత్సాహంతో చెన్నైకి తిరిగొచ్చాను. కాగా కబాలి చిత్ర సంచలన విజయ వార్తలను అమెరికాలోనే విన్న నేను ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడం సంతోషంగా ఉంది. ఇంత ఘన విజయానికి కారణం అయిన సహ నటీనటులు, అభిమానులకు, సగటు ప్రేక్షకులకు, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదే విధంగా చిత్ర నిర్మాత ధాను, దర్శకుడు రంజిత్తో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అని రజనీకాంత్ పేర్కొన్నారు. కబాలి ఫ్లాప్ అన్న వైరముత్తు: కాగా కబాలి చిత్ర అపజయాన్ని అంగీకరించాలన్న ప్రముఖ గీత రచయిత వైరముత్తు వ్యాఖ్యానించడంపై రజనీకాంత్ అభిమానులు మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితం ఒక కార్యక్రమంలో పాల్గొన్న వైరముత్తు కబాలి చిత్ర అపజయాన్ని అంగీకరించాలని నోరు జారారు. అయతే ఆయన ఈ చిత్రానికి ఒక్క పాట కూడా రాయలేదు. అదే విధంగా ఆయన మిత్రుడు ఏఆర్.రెహ్మాన్ కాకుండా సంతోష్ నారాయణన్ కబాలి చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఇవన్నీ మనసులో పెట్టుకునే వైరముత్తు కబాలి చిత్రం అపజయం అని పేర్కొన్నారని రజనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోరు జారింది: కాగా కబాలి చిత్రంపై వైరముత్తు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడంతో ఆయన వివరణ ఇచ్చుకోక తప్పలేదు. మంగళవారం వైరముత్తు ఒక ప్రకటన విడుదల చేస్తూ కబాలి చిత్ర జయాపజయాలను జీర్ణించుకోవాలన్న ఉద్దేశంతోనే తాను అలాంటి వ్యాఖ్యలు చేశానని, అయితే పొరపాటున విజయం అనే పదాన్ని వాడలేదని, ఇదే విషయాన్ని తాను రజినీ చెన్నైకి తిరిగొచ్చిన మరుసటి రోజే ఫోన్ చేసి వివరించానని అన్నారు. తన మాటలను అర్థం చేసుకున్న రజనీకాంత్ ఇతరులు కొం దరు ఇదే విధంగా చెప్పారని అన్నారన్నారు. కాబట్టి తన వ్యాఖ్యల్ని భూతద్దంలో చూడొద్దని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
మాట వినడం లేదా? మీరే వినండి!
పేరెంటింగ్ తలిదండ్రులు ఒక మాట చెప్తారు. అది పిల్లలు వినిపించుకోరు. తెలిిసీ తెలియనితనంతో ఎదురు చెప్తారు. గట్టిగా మందలిస్తే మరింత మొండిగా తయారవుతారు. పిల్లలు ఎదిగే క్రమంలో ఇలా జరగడం సర్వసాధారణం. పెద్దలే ఈ విషయాన్ని అర్థం చేసుకుని కొంచెం తగ్గితే మంచిది. ముందు పిల్లలపై కోప్పడి, రాత్రంతా ఆలోచించి తర్వాత పశ్చాత్తాపపడే బదులు కోప్పడటానికి ముందు రెండు నిమిషాలు ఆలోచిస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది. ఒకవేళ వాళ్లు చేసే పనులకు కోపం వచ్చినా చెప్పాల్సిన విధంగా చెప్తే వాళ్లే అర్థం చేసుకుంటారు. అంతేకానీ, కోప్పడటం శ్రేయస్కరం కాదు. ఈ కాలం పేరెంటింగ్లో కోప్పడటం చాలా వరకు తగ్గిస్తే మంచిదని మనోవైజ్ఞానిక నిపుణులు సూచిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు పిల్లల్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. నేటి ఇంటర్నెట్ యుగంలో చిన్నారుల మనసు రోజురోజుకీ సున్నితంగా మారుతోంది. పెరిగే క్రమంలో వారు చవిచూసే అనుభవాలే పెద్దయ్యాక వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుంటే వారిని మందలించే ముందు... కాస్త ఆగి, ఆలోచించాలనే స్వభావాన్ని అలవరుచుకోవచ్చు. ఆప్షన్లు ఇవ్వండి పిల్లలు ఎప్పటికప్పుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. వీలు చిక్కినప్పుడల్లా మీరు అవకాశం కల్పిస్తే, అన్ని విధాల ఆ స్వేచ్ఛను ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తారు. పండుగలు, పార్టీలకు వారికి నచ్చిన డ్రెస్లు వేసుకోమనడం, వంట చేసేముందు వారికి ఏది ఇష్టమో అడగడం వంటి పనులు చేస్తుండాలి. ఇలా చేస్తే వారి మీద వారికి మరింత ఇష్టం పెరగడంతో పాటు మీ మాటల్ని కూడా గౌరవించేందుకు ప్రయత్నిస్తారు. మంచిని పొగడండి పిల్లలు ఏదైనా మంచి పని చేస్తే పొగడటానికి సందేహించకండి. వాళ్లు ఎంతో ఆశతో మీ దగ్గరికి వచ్చి, తాము చేసిన పని గురించి చెప్పినపుడు కచ్చితంగా స్పందించండి. మీ ఒక్క చిన్న స్పందన వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది. అలాగే ప్రతిరోజు ‘గ్రేట్ జాబ్’, ‘థాంక్యూ’ వంటి పదాల్ని పిల్లలపై ప్రయోగించండి. దీనివల్ల వాళ్లలో పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. మీరెప్పుడైనా ఏదైనా చెప్తే అందులో మంచిని పిల్లలు గ్రహించేందుకు ఈ అలవాటు ఉపయోగపడుతుంది. నిబంధనలు పెట్టకండి ‘నువ్వు నా మాట వినకపోతే ఈరోజు నుంచి వీడియోగేమ్స్ కట్’, ‘టీవీ కట్’ వంటి మాటలు పిల్లలతో అనడం వల్ల వారిలో నెగెటివ్ ప్రవర్తనకు మీరే బీజాలు వేసినవాళ్లవుతారు. వీటి స్థాయి పెరిగితే పూర్తిగా మిమ్మల్ని నమ్మడం మానేస్తారు. నమ్మకం కోల్పోయినపుడు మీరు చెప్పిన మాటలు వినబుద్ధి కాదు. అయినా సరే గట్టిగా చెప్తే ఎదురుతిరగాలనిపిస్తుంది. మాటపై నిలబడండి పిల్లలు ఏ విషయాన్నైనా త్వరగా గ్రహిస్తారు, గుర్తుపెట్టుకుంటారు. నేర్చుకుంటారు కూడా. వాళ్లకు ఏదైనా కొనిస్తానని చెప్పి మర్చిపోతే మాత్రం వెంటనే క్షమాపణ అడగండి. లేదంటే మీ మాటపై వారికి గౌరవం తగ్గుతుంది. గొడవ పడకండి పిల్లలు ఇంట్లో ఉన్నపుడు తలిదండ్రులు గొడవ పడటం అనేది వారి బంగారు భవిష్యత్తును చాలా ప్రతికూల మలుపులు తిప్పుతుంది. ఇద్దరిలో ఎవరిది పైచేయి అయినా పిల్లలపై పడేది దుష్ర్పభావమే. దూరంగా వెళ్లండి కొన్నిసార్లు పిల్లలు కావాలని మారాం చేస్తుంటారు. తాము అడిగింది ఇస్తారా లేదా అని పరీక్షించడానికి వాళ్లు ఇలా చేస్తారు. దీన్ని మీరు ముందే గ్రహిస్తే మాత్రం అక్కణ్నుంచి దూరంగా వెళ్లిపోండి. అంతేకానీ వారిపై కోప్పడకండి. ఇలాంటి కొన్ని చిన్న చిన్న విషయాల్లో సంయమనం పాటించడం వల్ల రేపటి పౌరులను ఈరోజే తీర్చిదిద్దవచ్చు. - డి.ప్రగత్ -
నీకన్నా గొప్పెవరు?
గ్రేట్ కోట్స్ నీ కలల సౌధాలను నువ్వే నిర్మించుకో. లేకుంటే వేరెవరో వచ్చి వారి కలల సౌధాలను నీ చేత నిర్మించుకుంటారు. (ఫరా గ్రే, వ్యాపారవేత్త) నాకు ‘నో’ చెప్పినవాళ్లందరికీ ధన్యవాదాలు. వాళ్లు అలా చెప్పడం మూలానే నాకై నేను చేయగలిగాను. (ఆల్బర్ట్ ఐన్స్టీన్, భౌతికవేత్త) ఎవరితోనూ పోల్చుకోకు. అలా చేస్తే నిన్ను నువ్వు అవమానపరచుకున్నట్లే (బిల్ గేట్స్, సాఫ్ట్వేర్ దిగ్గజం) నీ పనిని నువ్వు గొప్పగా చేయడానికి ఉన్న మార్గం ఒక్కటే. ఆ పనిని నువ్వు ప్రేమించడం. ఒకవేళ అలాంటి పని నీకు ఇప్పటికీ దొరకనట్లయితే దాని కోసం ప్రయత్నిస్తుండు. అంతే తప్ప, చేస్తున్న పనికే పరిమితమైపోకు. (స్టీవ్ జాబ్స్, ఆపిల్ వ్యవస్థాపకులు) ఒక మనిషి కోసమో, ఒక కారణం కోసమో ఎదురు చూస్తూ ఉంటే నువ్వు కోరుకున్న మార్పు సంభవించదు. నువ్వు ఎదురు చూస్తుండే మనిషి, కారణం కూడా నువ్వే కావాలి. (బరాక్ ఒబామా, అమెరికా అధ్యక్షుడు) నీ కలలు నిజం కావాలంటే ముందు నువ్వు కలలు కనాలి. (ఎ.పి.జె. అబ్దుల్ కలామ్, క్షిపణి శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి) జీవితం అప్పగించిన బాధ్యతల్ని స్వీకరించు. నువ్వెక్కడికైతే వెళ్లాలని అనుకుంటున్నావో అక్కడికి నిన్ను తీసుకెళ్లగలిగేది నువ్వు మాత్రమే. వేరెవరో కాదు. (లెస్ బ్రౌన్, విశ్వవిఖ్యాత వక్త) -
సహానుభూతి
‘‘మరీ అంతగా నెత్తిన పెట్టుకున్నారేం?’’ గతవారం ‘దైవికం’ చదివిన వారిలో కొందరు ‘సాక్షి’కి ఫోన్ చేసిన అడిగిన ప్రశ్న ఇది. స్త్రీకి దైవత్వాన్ని ఆపాదించడం కూడా దైవదూషణే అవుతుందని వారు ఈ కాలమిస్టును ఆత్మీయంగా హెచ్చరించారు. ధన్యవాదాలు. అయితే ఒక సందేహం. స్త్రీకి కనీస గౌరవాన్ని, కనీస సౌకర్యాన్ని ఇవ్వకపోవడం దైవదూషణ అనిపించుకోదా?! ఇవన్నీ వాదనలతో తేలేవీ, తెలిసేవీ కాదు. కవి శివారెడ్డిలా స్త్రీ హృదయంలోకి ప్రవేశించాలి. అప్పుడిన్ని సందేహాలు రావు. అయితే- ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తూ, ‘‘ఆఫీస్కి క్యారేజీ రెడీ చేశావా, రాత్రికేం చేస్తున్నాం’’ అని అడిగినంత తేలికా... స్త్రీ హృదయంలోకి ప్రవేశించడం? కానే కాదు. మగపుట్టుక కదా! అన్నీ వేర్వేరు. లోపలి గ్రంధులు, నరాలు, నాళాలు. ఆ స్ట్రక్చర్, ఆ థాట్స్ అన్నీ డిఫరెంట్. మానవుడిగా పుట్టి దైవసాక్షాత్కారానికి యోగ్యత సాధించడం ఎంత కష్టమో, స్త్రీని మగవాడు అర్థం చేసుకోవడం కూడా అంతే కష్టం! ఇక మనం చేయగలిందేమైనా ఉందా అంటే స్త్రీల అసౌకర్యాలను అనుభూతి చెందే ప్రయత్నం చెయ్యడం. అది కూడా అయ్యే పని కాదు. చాలా శక్తి కావాలి. ఈ కండలు సరిపోవు. ఈ బుర్రలు సరిపోవు. ఈ చదువులు, సంస్కారాలు కూడా. ఒక సుపీరియన్ హ్యూమన్ బీయింగ్గా మగవాడు ఎదగాలి. అప్పుడేమైనా స్త్రీ మనసు మగవాడి మనసుకు అందుతుందేమో! లైంగిక హింస, లైంగిక దౌర్జన్యం, లైంగిక వేధింపు, లైంగిక అత్యాచారం స్త్రీని ఎంతగా కుంగదీస్తాయో మగవాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఆ బాధ, ఆ ఆవేదన, ఆ అవమానం ఎలా ఉంటుందో ఎన్ని జన్మలకీ అర్థం కాదు (ఆడజన్మకు తప్ప). బెత్తంతో కొడితే బెత్తానికి బాధ తెలుస్తుందా? రాయి తగిలితే రాయి ‘అమ్మా’ అంటుందా? అలాగే మగజన్మకు నొప్పి తెలియకపోవడంలో వింతేం లేదు. ఎలా మరి? దేనికి ఎలా? అదే, ఆడవాళ్ల బాధను అర్థం చేసుకోవడం ఎలా? ఇదిగో ఈ ప్రశ్న వేశారు కదా, సగం అర్థం చేసుకున్నట్లే. కనీసం అర్థం చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది కాబట్టి! స్త్రీల ఆవేదనను, అసౌకర్యాలను అర్థం చేసుకునే ఉద్యమం ఒకటి ప్రస్తుతం బల్గేరియాలో బయల్దేరింది. ‘వాక్ ఎ మైల్ ఇన్ హర్ షూజ్’ అంటూ అక్కడి మగవాళ్లు కొందరు ఆడవాళ్లలా హై హీల్స్ వేసుకుని నడుస్తూ లైంగిక హింసలకు వ్యతిరేకంగా ప్రచారోద్యమం చేపట్టారు. ‘స్త్రీల ఇబ్బందులేమిటో కొంతలో కొంతైనా అర్థం కావాలంటే, ఆ ఇబ్బందిని అనుభవించాలి తప్ప ఊహించలేం’ అనే విషయాన్ని సింబాలిక్గా హై హీల్స్ వేసుకుని మరీ అక్కడి మగవాళ్లు చూపిస్తున్నారు. మొన్న హైదరాబాద్లో కూడా ఉమెన్స్ డేకి ఇలాంటిదే ‘అర్థం చేయించే’ ప్రయత్నం ఒకటి జరిగింది. బస్టాపులు, టీ స్టాళ్లు, షాపింగ్ మాల్స్, పార్కులు... ఇలా కొన్ని బహిరంగ ప్రదేశాలలో అప్పటికప్పుడు కొంతమంది ఆడవాళ్లు ప్రత్యక్షమై, మగవాళ్లను వేధించారు. (రోడ్లపై మగాళ్లు ఆడవాళ్లను ఎలాగైతే వేధిస్తారో, సరిగ్గా అలాగే). ఇదో కనువిప్పు కార్యక్రమం. ‘నొప్పంటే ఇలా ఉంటుందిరా బయ్’ అని మగవాళ్లకు తెలియచెప్పడం. ‘మిర్రర్ మాబ్’ పేరుతో ‘హైదరాబాద్ ఫర్ ఫెమినిజం’ సంస్థ సభ్యులు ఇలా కొందరు మగాళ్లని ‘టీజ్’ చేశారు. వేధింపుల నాటకం అయ్యాక వీళ్లు అసలు విషయం చెప్పేవారు. ఆడవాళ్లను హర్ట్ చెయ్యడం హీరోయిజం కాదు అని చిన్నపాటి ప్రసంగం ఇచ్చి, ఇంకోచోటికి వెళ్లేవారు. ఏం జరుగుతుంది ఈ ప్రయత్నాల వల్ల? జరగనవసరం లేదు. జరగకుండా ఆగిపోతే చాలు... స్త్రీలపై ఈ దౌర్జన్యాలు, అఘాయిత్యాలు! స్త్రీ హృదయంలోకి ప్రవేశించే ద్వారాలను కాలితో తన్ని మూసేస్కోవడం మగవాడికి బాగా అలవాటు. ఆ అలవాటును మాన్పించే ఏ చిన్న ప్రయత్నమైనా దైవాన్వేషణ లాంటిదే. ముందు ఒక మెట్టంటూ ఎక్కితే, తర్వాత దేవుడే తన సన్నిధిలోకి రప్పించుకుంటాడు ఎంత నాస్తికుడినైనా! స్త్రీ హృదయంతో సహానుభూతి చెందడం అంటే దైవసాక్షాత్కారానికి యోగ్యత సంపాదించడమే. తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుని, ఇరవై ఏళ్లు కళ్లలో పెట్టుకుని, ఆ తర్వాత భాగస్వామిగా జీవితాంతం కనిపెట్టుకుని ఉండే స్త్రీని నెత్తిన పెట్టుకోవడం దైవార్చన అవుతుంది కానీ దైవదూషణ అవుతుందా? చెప్పండి.