UPI App
-
యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపు ఎలాగంటే..
ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్నాయి. ప్రధానంగా యూపీఐని ఎక్కువ మంది వాడుతుండడంతో, క్రెడిట్ కార్డు(credit card) వినియోగదారులు కొనుగోళ్లు చేయడానికి డిజిటల్ చెల్లింపులను ఎంచుకుంటున్నారు. తిరిగి కార్డు బిల్లులు చెల్లించేందుకు కూడా యూపీఐను ఎంచుకుంటే మరింత సులువుగా పేమెంట్స్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే యూపీఐ చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డులను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.క్రెడిట్ కార్డును యూపీఐతో లింక్ చేయడం ఎలా?మొదటిసారి యూపీఐని ఉపయోగిస్తుంటే, డిజిటల్ చెల్లింపులు చేయడానికి, మీ క్రెడిట్ కార్డు(credit card)లను ఉపయోగించడానికి భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ (BHIM) యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి.క్రెడిట్ కార్డును యూపీఐతో జత చేయాలి. అందుకు యాప్ ఓపెన్ చేసి ‘యాడ్ పేమెంట్ మెథడ్’ విభాగానికి వెళ్లాలి.క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఎంచుకుని క్రెడిట్ కార్డ్ నంబర్, సివీవీ, ఎక్స్పైరీ తేదీ వంటి వివరాలను ఇవ్వాలి.తర్వాత మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్కు వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. దాంతో యూపీఐకు కార్డు లింక్ అవుతుంది.క్రెడిట్ కార్డు ఖాతాను లింక్ చేసిన తర్వాత కార్డుతో యూపీఐ ఐడీని సృష్టించాలి. యూపీఐ ఐడీ అనేది సంఖ్యలు, అక్షరాలు, స్పెషల్ సింబల్స్ కలిగిన ఒక ప్రత్యేక గుర్తింపు. మీ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయబడిన ఈ ఐడీ యూపీఐ ద్వారా డబ్బు చెల్లించడానికి, స్వీకరించడానికి సహాయపడుతుంది.యూపీఐ ఐడీ చెక్ చేసుకోవడానికి యాప్లోని ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్లి ‘యూపీఐ ఐడీ’ని ఎంచుకోవాలి.ఇదీ చదవండి: మెటా కొంపముంచిన ఆ ఒక్క నిర్ణయంక్రెడిట్ కార్డు చెల్లింపులు చేయడం ఎలా?క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులు చేయడానికి, క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. లేదా ‘పే ఫోన్ నంబర్’ లేదా ‘పే కాంటాక్ట్స్’ వంటి ఆప్షన్ను ఎంచుకోవాలి.తర్వాత యూపీఐ ఐడీని ఎంటర్ చేయాలి. యాప్ క్యూఆర్ కోడ్, ఫోన్ నంబర్ లేదా కాంటాక్ట్ నంబర్ను ధ్రువీకరించిన తర్వాత, బదిలీ చేయాల్సిన మొత్తాన్ని నమోదు చేయాలి.తర్వాత చెల్లింపులు చేయడానికి క్రెడిట్ కార్డును ఎంచుకోవాలి.యూపీఐ పిన్ ఎంటర్ చేసి లావాదేవీ(UPI payments)ని పూర్తి చేయాలి.యాప్లో సంబంధిత చెల్లింపు ఎంపికల్లో ‘సెల్ఫ్ ట్రాన్స్ఫర్’ను కూడా ఎంచుకోవచ్చు. ఇది ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. -
యూపీఐ చెల్లింపుల్లో కొత్త మార్పులు షురూ
మెరుగైన వినియోగదారు అనుభవంతో లావాదేవీలను సులభతరం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సిస్టమ్కు కొన్ని భారీ అప్గ్రేడ్లను ప్రవేశపెట్టింది. ఈ మార్పులలో లావాదేవీ పరిమితులను పెంచడం, యూపీఐ సర్కిల్ వంటివి ఉన్నాయి.యూపీఐ123పే పరిమితి పెంపుఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం తీసుకొచ్చిన యూపీఐ123పే (UPI123Pay) లావాదేవీ పరిమితులను అధికార యంత్రాంగం పెంచింది. ఫీచర్ ఫోన్ యూజర్లు ఇప్పుడు రూ. 10,000 వరకు నగదు పంపవచ్చు. మునుపటి పరిమితి రూ. 5,000గా ఉండేది. ఈ కొత్త మార్పు ఫీచర్ ఫోన్ వినియోగదారులు తమ ఆర్థిక లావాదేవీలను నిర్వహించడాన్ని సులభతరం చేస్తుంది.అయితే ఈ పెరిగిన పరిమితి యూపీఐ123పేకి మాత్రమే వర్తిస్తుంది. స్మార్ట్ఫోన్లలో ప్రసిద్ధ ఫోన్పే (PhonePe), పేటీఎం (Paytm), గూగుల్ పే (Google Pay) వంటి యూపీఐ యాప్లలో రూ. 1 లక్ష వరకు రోజువారీ లావాదేవీలు చేసుకోవచ్చు. ఇక మెడికల్ ఎమర్జెన్సీ చెల్లింపుల రోజువారీ పరిమితి రూ. 5 లక్షలకు పెరిగింది.యూపీఐ సర్కిల్పెరిగిన లావాదేవీ పరిమితులతో పాటు యూపీఐ సర్కిల్కు కూడా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. భాగస్వామ్య చెల్లింపు సర్కిల్కు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను జోడించడానికి అనుమతించే యూపీఐ సర్కిల్ను ఇప్పుడు ఫోన్పే, పేటీఎం, గూగుల్ పే వంటి ఇతర ప్లాట్ఫారమ్లకు జోడించవచ్చు. ఇప్పటి వరకు, ఈ ఫీచర్ భీమ్ (BHIM) యాప్ వినియోగదారులకు మాత్రమే ఉండేది. ఈ ఫీచర్ ద్వారా ద్వితీయ వినియోగదారులు ప్రాథమిక వినియోగదారు ఆమోదంతో చెల్లింపులు చేయగలుగుతారు.గడిచిన ఏడాదిలో (2024) యూపీఐ భారీ వృద్ధిని సాధించింది. ఆర్థిక శాఖ ప్రకారం.. 2024 జనవరి నుండి నవంబర్ వరకు 15,537 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. మొత్తం లావాదేవీ విలువ రూ. 223 లక్షల కోట్లకు చేరుకుంది. కొత్తగా వచ్చిన ఈ మార్పులు ఇప్పుడు మరింత మంది వినియోగదారులను రోజువారీ లావాదేవీలు చేయడానికి వీలు కల్పిస్తాయి. -
ఆర్బీఐ కొత్త రూల్.. యూపీఐ యూజర్లకు గుడ్న్యూస్
యూపీఐ చెల్లింపులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుభవార్త చెప్పింది. కస్టమర్లకు మరింత సౌలభ్యాన్ని అందించడానికి థర్డ్-పార్టీ యూపీఐ ( UPI ) యాప్ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPI) వ్యాలెట్లలోని సొమ్ముతో చెల్లింపులు చేసే అవకాశం కల్పించింది. ఇప్పటి వరకూ పీపీఐ సంస్థకు చెందిన యూపీఐ యాప్ ద్వారా మాత్రమే ఈ తరహా పేమెంట్లకు అవకాశం ఉండేది.ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఇకపై వ్యాలెట్ హోల్డర్లు యూపీఐ చెల్లింపులు చేయడానికి పీపీఐ వ్యాలెట్ జారీచేసే సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. యూపీఐని ఉపయోగించి వ్యాలెట్ ద్వారా లావాదేవీలు చేయడానికి థర్డ్ పార్టీ యాప్లను ఉపయోగించవచ్చు. ఈ మేరకు ఓ నోటిఫికేషన్లో ఆర్బీఐ పేర్కొంది.పీపీఐ అంటే..పీపీఐలు అనేవి అందులో జమైన సొమ్ముతో వస్తువులు, సేవల కొనుగోలు, ఆర్థిక సేవల నిర్వహణ, చెల్లింపులు మొదలైన వాటిని సులభతరం చేసే సాధనాలు. పీపీఐలను బ్యాంకులు, నాన్-బ్యాంకులు జారీ చేయవచ్చు. ఆర్బీఐ నుండి అనుమతి పొందిన తర్వాత బ్యాంకులు పీపీఐలను జారీ చేస్తాయి. ఇక భారతదేశంలో ఏర్పాటై కంపెనీల చట్టం, 1956 / 2013 కింద నమోదైన నాన్ బ్యాంక్ కంపెనీలు కూడా పీపీఐలను జారీ చేస్తాయి. -
డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారా? ఇది మీకోసమే..
ఈరోజుల్లో జేబులో కరెన్సీ లేకున్నా.. ధైర్యంగా అడుగు బయటపెట్టొచ్చు!. బ్యాంక్ బ్యాలెన్స్, ఓ స్మార్ట్ఫోన్.. దానికి ఇంటర్నెట్ ఉంటే చాలూ!. మార్కెట్లో ఎక్కడికి వెళ్లినా సెకన్లలో పేమెంట్లు చకచకా చేసేయొచ్చు. రూపాయి దగ్గరి నుంచి మొదలుపెడితే.. పెద్ద పెద్ద అమౌంట్ల చెల్లింపులకు రకరకాల యాప్స్ను ఉపయోగిస్తున్నాం. అంతగా డిజిటల్ చెల్లింపులు మన జీవనంలో భాగమయ్యాయి. అయితే ఈ చెల్లింపులపై ట్యాక్స్ విధింపు సబబేనా?.. ప్రస్తుతం దేశంలో చాలావరకు జనం డిజిటల్ పేమెంట్లకు అలవాటు పడ్డారు. పల్లె నుంచి పట్నం దాకా అందరికీ ఇది అలవాటైంది. మార్కెట్లలోనే కాదు, గ్యాస్, కరెంట్.. అన్ని రకాల బిల్లుల చెల్లింపులకు వీటినే ఉపయోగిస్తున్నారు. కానీ, కేంద్రం ఇప్పుడు వీటిపై ట్యాక్స్ విధించబోతోందట. ప్రత్యేకించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) యాప్ల ద్వారా చెల్లింపులపైనే ఈ పన్ను విధింపు ఉండనుందట!. ఇక నుంచి ఫోన్ పే, గూగుల్పే, మరేయిత యూపీఐ యాప్ ద్వారాగానీ పేమెంట్ చేశారనుకోండి.. దానిపై ఎక్స్ట్రా ఛార్జీ వసూలు చేస్తారు. 2025 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమలు కాబోతోంది. మీరూ వాటితోనే చెల్లింపులు చేస్తున్నారా? అయితే ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి.. ఏ యూపీఐ యాప్ ద్వారా అయినా 2 వేల రూపాయలకు పైన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే 1.1 శాతం టాక్స్ పడుతుందట. ఎవరికైనా 10 వేల రూపాయలు పంపిస్తే, ట్యాక్స్ రూపంలో 110 రూపాయలు కట్ అవుతుందని.. కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కానీ,ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వార్త మాత్రమే. ముఖ్యంగా వాట్సాప్ యూనివర్సిటీ నుంచి ఈ వార్త ఎక్కువగా సర్క్యులేట్ అవుతోంది. వీటిని అదనంగా.. కొందరు వీడియోలను యాడ్ చేస్తున్నారు. అయితే ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ ప్రచారంపై మీకు స్పష్టత ఇవ్వబోతున్నాం.అదొక ఫేక్ వార్త. పైగా ఇలాంటి వార్తే 2023-24 బడ్జెట్ టైంలోనూ వైరల్ అయ్యింది. ఆ టైంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) కూడా ఓ క్లారిటీ ఇచ్చింది. డిజిటల్ వాలెట్లు, ఇతర ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్.. PPIని ఉపయోగించి చేసే లావాదేవీలకు మాత్రమే ఈ టాక్స్ వర్తిస్తుంది. ‘కొత్త ఇంటర్ఛేంజ్ ఛార్జీలు PPI లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయి. ఇతర సాధారణ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు’ అని స్పష్టం చేసింది. .@IndiaToday claims that UPI transactions over Rs 2000 will be charged at 1.1%#PIBFactCheck➡️There is no charge on normal UPI transactions. ➡️@NPCI_NPCI circular is about transactions using Prepaid Payment Instruments(PPI) like digital wallets. 99.9% transactions are not PPI pic.twitter.com/QeOgfwWJuj— PIB Fact Check (@PIBFactCheck) March 29, 2023సాధారణ UPI పేమెంట్లకు, PPI పేమెంట్లకు మధ్య తేడాను అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ గందరగోళం నెలకొంటోంది. పైగా కొన్ని ప్రముఖ ఛానెల్స్, వెబ్సైట్లు ఎలాంటి ధృవీకరణ లేకుండా గుడ్డిగా.. డిజిటల్ పేమెంట్లపై బాదుడే బాదుడు అంటూ కథనాలు ఇచ్చేయడం గమనార్హం. -
రోజూ 50 కోట్ల లావాదేవీలు
దేశీయంగా యూపీఐ లావాదేవీలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు దాదాపు 500 మిలియన్లు(50 కోట్లు) లావాదేవీలు జరుగుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అంచనా వేస్తున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. త్వరలో ఇది బిలియన్(100 కోట్లు) మార్కును చేరనున్నట్లు చెప్పారు. అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన ‘గ్రూప్ ఆఫ్ థర్టీస్ వార్షిక అంతర్జాతీయ బ్యాంకింగ్ సెమినార్’లో పాల్గొని ఆయన మాట్లాడారు.‘భవిష్యత్తులో ఆన్లైన్ లావాదేవీలకు మరింత ఆదరణ పెరుగుతుంది. ఆమేరకు చెల్లింపులకు సంబంధించి ఎలాంటి భద్రతా లోపాలకు తావులేకుండా మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తున్నాం. అందుకు ఆర్బీఐ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) అన్ని చర్యలు తీసుకుంటోంది. యూపీఐ విధానం ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. ప్రస్తుతం రోజుకు దాదాపు 50 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. వీటిని మరింత పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. రానున్న రోజుల్లో వీటి సంఖ్యను ఒక బిలియన్(100 కోట్లు)కు చేర్చాలని భావిస్తున్నాం’ అన్నారు.ఇదీ చదవండి: క్విక్ కామర్స్లోకి టాటా గ్రూప్?‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) డేటా ప్రకారం, ఆగస్టులో యూపీఐ రోజువారీ లావాదేవీల సంఖ్య 483 మిలియన్లకు చేరింది. ఇది సెప్టెంబర్లో సుమారు 500 మిలియన్లుగా ఉంది. సెప్టెంబర్ 2024లో మొత్తం యూపీఐ చెల్లింపుల సంఖ్య 15.04 బిలియన్లు(1500 కోట్లు). ఫలితంగా వీటి విలువ రూ.20.64 లక్షల కోట్లకు చేరింది. ఆన్లైన్ చెల్లింపులు పెంచడానికి ఇతర దేశాల ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్లతో కూడా యూపీఐను లింక్ చేస్తున్నాం. ఇప్పటికే ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్, భూటాన్, శ్రీలంక, మారిషస్, నేపాల్ వంటి ఏడు దేశాల్లో యూపీఐ అందుబాటులో ఉంది’ అని దాస్ చెప్పారు. -
ఆరు నెలల్లో 7897 కోట్ల లావాదేవీలు
తక్షణ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీల సంఖ్య 2024 జనవరి–జూన్ మధ్య దేశవ్యాప్తంగా 78.97 బిలియన్ల(7897 కోట్లు)కు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే లావాదేవీలు 52 శాతం పెరిగాయని పేమెంట్ టెక్నాలజీ సర్వీసులు అందిస్తున్న వరల్డ్లైన్ నివేదిక వెల్లడించింది.‘గతేడాదితో పోలిస్తే జనవరి–జూన్ మధ్య లావాదేవీల విలువ రూ.83.16 లక్షల కోట్లు నుంచి రూ.116.63 లక్షల కోట్లకు చేరింది. 2023 జనవరిలో యూపీఐ లావాదేవీల సంఖ్య 803 కోట్లుగా ఉంది. 2024 జూన్కు ఇది 1300 కోట్లకు చేరింది. లావాదేవీల విలువ రూ.12.98 లక్షల కోట్ల నుంచి రూ.20.07 లక్షల కోట్లకు చేరింది. విలువ, పరిమాణం పరంగా ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వరుసగా మూడు స్థానాలను ఆక్రమించాయి. సగటు లావాదేవీ విలువ 2023 జనవరి–జూన్ మధ్య రూ.1,603 నమోదైంది. 2024 జూన్తో ముగిసిన ఆరు నెలల్లో ఇది రూ.1,478కి చేరింది. ఆన్లైన్ పరిశ్రమలో ఈ–కామర్స్, గేమింగ్, యుటిలిటీస్, ప్రభుత్వ సేవలు, ఆర్థిక సేవలు మొత్తం లావాదేవీల పరిమాణంలో 81 శాతం, విలువలో 74 శాతం కైవసం చేసుకున్నాయి’ అని నివేదిక వివరించింది.ఇదీ చదవండి: ఒకే నెలలో రూ.24,509 కోట్లు రాక! -
రోజూ 50 కోట్ల లావాదేవీలు..!
దేశీయంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో యూపీఐ ద్వారా రూ.20.64 లక్షల కోట్ల చెల్లింపులు నమోదైనట్లు నివేదికలు తెలుపుతున్నాయి. లావాదేవీల పరిమాణం సెప్టెంబర్లో గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 42% పెరిగి 1500 కోట్లకు చేరింది. సగటున రోజువారీ లావాదేవీలు 50 కోట్ల మార్కును చేరాయి.భారత్లోనే కాకుండా దుబాయ్, ఖతార్, కువైట్, మారిషస్.. వంటి ఇతర దేశాల్లోనూ ఎన్పీసీఐ యూపీఐ సేవలను అమలు చేస్తోంది. దాంతో అంతర్జాతీయంగా యూపీఐ లావాదేవీలు పెరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఫిజికల్గా డబ్బు ఉంచుకోవడం కంటే డిజిటల్ లావాదేవీలు చేయడం మేలని యూపీఐ వినియోగదారులు నమ్ముతున్నారు. ప్రభుత్వానికి కూడా ఈ లావాదేవీలను ట్రాక్ చేయడం సులభమవుతోంది. కానీ కొన్ని థర్డ్పార్టీ యూపీఐ యాప్లనే యూజర్లు ఎక్కువగా వినియోగిస్తుండడంపట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తులో ఏదైనా భద్రతా వైఫల్యాలు తలెత్తితే తీవ్ర నష్టం కలుగుతుందని అభిప్రాయపడుతోంది. ఈ థర్డ్పార్టీ యూపీఐ కంపెనీలు వినియోగదారులకు అధిక వడ్డీలోన్లను ఆశచూపి భారీగానే లాభపడుతున్నాయని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: నెలలో 11 శాతం పెరిగిన విక్రయాలుదేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నట్లు గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) డిజిటల్ చెల్లింపుల విలువ రూ.1,669 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్థికశాఖ చెప్పింది. ఇదే కాలంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీల పరిమాణం 8,659 కోట్లకు చేరుకుందని పేర్కొంది. తాజాగా సెప్టెంబర్ నెలలో జరిగిన యూపీఐ లావాదేవీలు కలుపుకుంటే ఈ పరిమాణం మరింత పెరుగుతుంది. -
చార్జీలు విధిస్తే .. వాడటం ఆపేస్తాం..
న్యూఢిల్లీ: చెల్లింపు లావాదేవీలకు యూపీఐని గణనీయంగా వాడుతున్నప్పటికీ చార్జీలు గానీ విధిస్తే మాత్రం దాన్ని వినియోగించడం ఆపేయాలని చాలా మంది భావిస్తున్నారు. లోకల్సర్కిల్స్ సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది యూజర్లు తమ అభిప్రాయం వెల్లడించారు. కేవలం 22% మందే ఫీజును చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సర్వే ప్రకారం 38% మంది యూజర్లు తమ చెల్లింపుల్లో 50% లావాదేవీల కోసం డెబిట్, క్రెడిట్ లేదా ఇతరత్రా డిజిటల్ విధానాలు కాకుండా యూపీఐనే ఉపయోగిస్తున్నారు. జూలై 15 నుంచి సెప్టెంబర్ 20 మధ్య నిర్వహించిన సర్వేలో వేసిన ప్రశ్నలకు 308 జిల్లాల నుంచి 42,000 సమాధానాలు వచ్చాయి. యూపీఐ లావాదేవీలపై చార్జీల అంశంపై 15,598 సమాధానాలు వచ్చాయి. మర్చంట్ డిస్కౌంట్ రేట్లను వి« దించే ముందు ఈ అంశాలన్నింటినీ కేంద్ర ఆరి్థక శాఖ, ఆర్బీఐ పరిగణనలోకి తీసుకునేలా, ఈ సర్వే వివరాలను వాటి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు లోకల్సర్కిల్స్ తెలిపింది. ఎన్పీసీఐ లెక్కల ప్రకారం 2023–24లో యూపీఐ లావాదేవీలు 57% పెరిగాయి. తొలిసారిగా 100 బిలియన్లు దాటి 131 బిలియన్లకు చేరాయి. విలువపరంగా చూస్తే 44% ఎగిసి రూ. 199.89 లక్షల కోట్లకు చేరాయి. -
ఐదు నెలల్లో యూపీఐ లావాదేవీలు ఎంతంటే..
దేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) డిజిటల్ చెల్లింపుల విలువ రూ.1,669 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్థికశాఖ చెప్పింది. ఇదే కాలంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీల పరిమాణం 8,659 కోట్లకు చేరుకుందని పేర్కొంది.మొత్తం డిజిటల్ చెల్లింపు లావాదేవీల సంఖ్య 2017-18 ఆర్థిక సంవత్సరంలో 2,071 కోట్ల నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 18,737 కోట్లకు పెరిగాయి. ఇది ఏటా 44 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. ఈ ఏడాది కేవలం ఐదు నెలల్లోనే యూపీఐ లావాదేవీల పరిమాణం 8,659 కోట్లకు చేరుకుంది. ఇదిలాఉండగా, కేవలం భారతదేశంలోనే కాకుండా దుబాయ్, ఖతార్, కువైట్, మారిషస్.. వంటి ఇతర దేశాల్లోనూ ఎన్పీసీఐ యూపీఐ సేవలను అమలు చేస్తోంది. దాంతో అంతర్జాతీయంగా యూపీఐ లావాదేవీలు పెరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.ఇదీ చదవండి: ఇంక్రిమెంట్లు, బోనస్ల పవర్ తెలుసా..?ఫిజికల్గా డబ్బు ఉంచుకోవడం కంటే డిజిటల్ లావాదేవీలు చేయడం మేలని యూపీఐ వినియోగదారులు నమ్ముతున్నారు. ప్రభుత్వానికి కూడా ఈ లావాదేవీలను ట్రాక్ చేయడం సులభమవుతోంది. కానీ కొన్ని థర్డ్పార్టీ యూపీఐ యాప్లనే యూజర్లు ఎక్కువగా వినియోగిస్తుండడంపట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తులో ఏదైనా భద్రతా వైఫల్యాలు తలెత్తితే తీవ్ర నష్టం కలుగుతుందని అభిప్రాయపడుతోంది. ఈ థర్డ్పార్టీ యూపీఐ కంపెనీలు వినియోగదారులకు అధిక వడ్డీలోన్లను ఆశచూపి భారీగానే లాభపడుతున్నాయని కొందరు చెబుతున్నారు. -
డెబిట్ కార్డు లేకపోయినా డబ్బు విత్డ్రా
డెబిట్ కార్డు పోయిందా..ఏటీఎంకు కార్డు తెసుకెళ్లడం మర్చిపోయారా..డెబిట్ కార్డు లేకుండా దూరప్రాంతాలకు వెళ్లారా.. మరేం పర్వాలేదు. మీరు ఉన్న ప్రాంతంలో ఏటీఎం ఉంటే ఎలాంటి డెబిట్ కార్డు లేకుండానే నగదు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే అందుకోసం మీ స్మార్ట్ఫోన్లో యూపీఐ యాప్ ఉంటే సరిపోతుంది. కార్డు అవసరం లేకుండా యూపీఐ ద్వారా ఎలా డబ్బు విత్డ్రా చేయాలో తెలుసుకుందాం.బ్యాంకింగ్ రంగ సేవల్లో టెక్నాలజీ విస్తరిస్తోంది. అందులో భాగంగా యూపీఐ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఏ చిన్న లావాదేవీలు చేయాలన్నా స్మార్ట్పోన్లోని యూపీఐని వినియోగిస్తున్నారు. దీన్ని ఉపయోగించి డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎంలో డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు. అందుకోసం ఇంటర్ ఆపరబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రావల్ (ఐసీసీడబ్ల్యూ) విధానం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలా బ్యాంకులు ఈ సర్వీసును అందిస్తున్నాయి.విత్డ్రా చేసుకోండిలా..ముందుగా మీ వద్ద యూపీఐ యాప్ ఇన్స్టాల్ చేసిన స్మార్ట్ఫోన్ ఉండాలి. ప్రస్తుతం చాలామంది గూగుల్పే, ఫోన్పే..వంటి యూపీఐ ధర్డ్పార్టీ యాప్లను వాడుతున్నారు.మీ బ్యాంకు ఐసీసీడబ్ల్యూ సేవలందిస్తుందో లేదో తనిఖీ చేసుకోవాలి.ఒకవేళ ఈ సర్వీసు అందుబాటులో ఉంటే ఏటీఎం వద్దకు వెళ్లి స్క్రీన్పై ‘యూపీఐ నగదు ఉపసంహరణ’ ఆప్షన్ ఎంచుకోవాలి.ఏటీఎం ప్రొవైడర్ను బట్టి ఈ ఎంపిక విభిన్నంగా ఉండవచ్చు. జాగ్రత్తగా గమనిస్తే సులువుగానే దాన్ని గుర్తించవచ్చు.యూపీఐ విత్డ్రా సెలక్ట్ చేసుకున్నాక క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది.మీ ఫోన్లోని యూపీఐ యాప్ ఓపెన్ చేసి ఏటీఎం స్క్రీన్పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి.మీరు ఎంత డబ్బు విత్డ్రా చేయాలో ఎంటర్ చేసి, యూపీఐ పిన్ ప్రెస్ చేయాలి. (యూపీఐ ద్వారా ఏటీఎం రోజువారీ విత్డ్రా పరిమితి సాధారణంగా రూ.10,000గా ఉంటుంది)కొంత సమయం తర్వాత బ్యాంకు సిస్టమ్ సర్వర్తో కనెక్ట్ అయి డబ్బు విత్డ్రా అవుతుంది.ఇదీ చదవండి: కొత్త పెన్షన్ విధానంలోని కీలకాంశాలు..ఈ ప్రక్రియ వల్ల ఖాతాదారుల వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. క్యూఆర్ కోడ్ మీ సమాచారాన్ని రక్షించడానికి ఎన్క్రిప్షన్ని ఉపయోగిస్తుంది. మీకు మాత్రమే తెలిసిన యూపీఐ పిన్తో లావాదేవీని పూర్తి చేసుకోవచ్చు. -
యూపీఐ పేమెంట్స్ ఏ దేశాల్లో చేయొచ్చో తెలుసా..
డిజిటల్ చెల్లింపులు వచ్చిన తరువాత భారతదేశంలో చిన్న కిరాణా షాపు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు చేతిలో డబ్బు ఉంచుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. గత కొన్ని రోజుల ముందు వరకు యూపీఐ పేమెంట్స్ కేవలం దేశానికి మాత్రమే పరిమితమై ఉండేవి. కాగా మారుతున్న కాలంలో పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని యూపీఐ పేమెంట్స్ విదేశాలకు కూడా వ్యాపించాయి. ప్రస్తుతం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) అనేది విదేశాల్లో కూడా చెల్లుబాటు అవుతుండటంతో ఆయా దేశాల కరెన్సీలతోనే చెల్లింపులు జరుగుతున్నాయి. కాబట్టి విదేశాలకు వెళ్లేవారు ప్రత్యేకించి ఆ దేశ కరెన్సీని తమతో పాటు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు భారతదేశంలో మాత్రమే కాకుండా.. సమీప దేశమైన శ్రీలంక, భూటాన్, మారిషస్, ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్, నేపాల్ దేశాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. శ్రీలంకలో పర్యటించే భారతీయులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. మారిషస్ దేశంలో కూడా ఇండియన్స్ డిజిటల్ చెల్లింపులకు అనుమతి ఉంది. మారిషస్ వాసులకు కూడా మన దేశంలో ఆ సదుపాయం కల్పించారు, కాబట్టి వారు కూడా మనదేశంలో డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు. ఇండియాలో కాకుండా మొదటిసారి యూపీఐ సేవలను అనుమతించిన దేశం భూటాన్. 2012 జులై 13న ఆ దేశంలో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీని కోసం భీమ్ యాప్ & భూటాన్ రాయల్ మానిటరీ అథారిటీ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారతదేశ మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి UAE, యూఏఈలోని ప్రధాన బ్యాంకు మష్రెక్తో కలిసి కొద్ది రోజుల క్రితం దేశంలో UPI చెల్లింపులను స్వీకరించడానికి సంబంధించి భారత ప్రభుత్వంతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఫ్రాన్స్ లైరా నెట్వర్క్తో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవలే భాగస్వామ్య కుదుర్చుకున్నాయి. ఫోన్పే డేటాబేస్ ప్రకారం యూపీఐ చెల్లింపులకు మద్దతు ఇచ్చే బ్యాంకుల జాబితా.. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్ ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ ఇండియన్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్ కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్ పంజాబ్ & సింధ్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ కాస్మోస్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదీ చదవండి: 20 ఏళ్లకే క్యాన్సర్.. 33 ఏళ్లకు రూ.420 కోట్లు - ఎవరీ కనికా టేక్రీవాల్.. -
ఈ యాప్ యూజర్లకు ఆఫర్లే ఆఫర్లు.. రూ.750 వరకు క్యాష్బ్యాక్!
BHIM App Offers: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ భీమ్ (BHIM) తమ యూజర్లకు సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. రూ. 750 వరకు క్యాష్బ్యాక్ అందిస్తోంది. ఈ ఆఫర్లు పొందడానికి కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. యూజర్ బేస్ పెంచుకునేందుకు మొదట్లో గూగుల్ పే అందించినట్టుగానే భీమ్ యాప్ కూడా విభిన్న క్యాష్బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. ఇందులో రూ. 750 వరకు క్యాష్బ్యాక్ అందించే రెండు రకాల ఆఫర్లు ఉన్నాయి. వీటితో పాటు అదనంగా 1 శాతం క్యాష్ బ్యాక్ వచ్చే మరో ఆఫర్ కూడా ఉంది. భీమ్ యాప్లో ఈ క్యాష్బ్యాక్ ఆఫర్లు మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ అయ్యేందుకు 7 వారాల కన్నా ఎక్కువ సమయం పడుతుందని గమనించాలి. ఆఫర్లను మరింత కాలం పొడిగించే అవకాశం ఉందా అన్నదానిపై స్పష్టత లేదు. రూ.750 క్యాష్బ్యాక్ ఎలా పొందాలంటే.. ఫుడ్ ఆర్డర్లు, ట్రావెల్ చేసే యూజర్లు భీమ్ యాప్ ద్వారా రూ. 150 క్యాష్బ్యాక్ పొందవచ్చు. ఈ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్లు, ట్రావెల్ ఖర్చులు అంటే రైల్వే టిక్కెట్ బుకింగ్లు, క్యాబ్ రైడ్లు, మర్చంట్ యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించే రెస్టారెంట్ బిల్లులపై రూ. 100 మించి లావాదేవీలు చేస్తే రూ. 30 ఫ్లాట్ క్యాష్బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ను కనీసం 5 సార్లు క్లెయిమ్ చేసుకోవచ్చు. తద్వారా గరిష్టంగా రూ. 150 క్యాష్బ్యాక్ అందుకోవచ్చు. ఇక రూ. 600 క్యాష్బ్యాక్ అందించే మరో ఆఫర్ కూడా ఉంది. రూపే క్రెడిట్ కార్డులను భీమ్ యాప్నకు లింక్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు. అన్ని మర్చంట్ యూపీఐ పేమెంట్లపై రూ. 600 క్యాష్బ్యాక్ రివార్డ్ను అందుకోవచ్చు. ఈ ఆఫర్లో భాగంగా ఒక్కొక్కటి రూ. 100 దాటిన మొదటి మూడు లావాదేవీలపై రూ. 100 క్యాష్బ్యాక్, ఆ తర్వాత ప్రతి నెలా రూ. 200 దాటిన 10 ట్రాన్సాక్షన్స్పై రూ. 30 క్యాష్బ్యాక్ పొందవచ్చు. ఇలా ఈ ఆఫర్లన్నీ కలుపుకొంటే మొత్తంగా రూ.600 క్యాష్బ్యాక్ను అందుకోవచ్చు. ఇవేకాకుండా భీమ్ యాప్ ఉర్జా (Urja) ఒక శాతం స్కీమ్ను కూడా అందిస్తోంది. దీని కింద పెట్రోల్, డీజిల్, సీఎన్జీతో సహా అన్ని ఫ్యూయల్ పేమెంట్లపై 1 శాతం ఫ్లాట్ క్యాష్బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ రూ. 100 లేదా అంతకు పైబడి ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్స్, గ్యాస్ బిల్లుల వంటి యుటిలిటీ బిల్లు చెల్లింపులపై కూడా వర్తిస్తుంది. భీమ్ యాప్తో లింక్ చేసిన ప్రైమరీ బ్యాంక్ అకౌంట్లలో ఈ క్యాష్బ్యాక్ నేరుగా క్రెడిట్ అవుతుంది. -
యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా.. జర భద్రం!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో యూపీఐ యాప్స్ వినియోగం బాగా పెరిగింది. దీంతో చాలా మంది జేబులో డబ్బు పెట్టుకోవాలన్న సంగతే మరచిపోయారు. ఎక్కడికెళ్లినా స్మార్ట్ఫోన్ ఉంటే సరిపోతుంది. కిరాణా కొట్టులో వస్తువులు కొనే దగ్గర నుంచి షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేసే వరకు అన్నీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేస్తున్నారు. దీన్నే అదునుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెర తీస్తున్నారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు నకిలీ క్యూఆర్ కోడ్ల ద్వారా యూజర్ల వ్యక్తిగత వివరాలను దొంగలిస్తున్నారు. ఇది ఆ తరువాత రోజుల్లో ప్రమాదాలను కలిగించే అవకాశం ఉంది. యూపీఐ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన వెంటనే అది యూజర్లను ఒక వెబ్సైట్కు తీసుకెళ్తుంది. అక్కడ చెల్లించాల్సిన పేమెంట్ ఎంటర్ చేసి చెల్లిస్తారు. కానీ సైబర్ నేరగాళ్ళకు సంబంధించిన క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసిన తరువాత అది కూడా వేరొక వెబ్సైట్కి కనెక్ట్ చేస్తుంది. ఈ వెబ్సైట్ సాధారణంగా నిజమైన వెబ్సైట్ మాదిరిగానే కనిపిస్తుంది. అందులో యూజర్ వ్యక్తిగత సమాచారం ఎంటర్ చేయమని చెబుతుంది. దీనిని నమ్మి వినియోగదారుడు సమాచారం ఎంటర్ చేస్తే.. వివరాలన్నీ కూడా స్కామర్కు వెళ్ళిపోతుంది. యూజర్ వ్యక్తిగత వివరాలు తెలుసుకున్న స్కామర్ అకౌంట్ నుంచి డబ్బు కాజేయడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నేరుగా యూపీఐ పిన్ ఎంటర్ చేయమని చెబుతారు.. ఇదేగానీ జరిగితే యూజర్ పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: ఆధార్ కార్డు ఆధారం కాదు - లిస్ట్ నుంచి తొలగించిన ఈపీఎఫ్ఓ ఇలాంటి స్కామ్ నుంచి తప్పించుకునే మార్గాలు! బహిరంగ ప్రదేశాల్లో ఉండే క్యూఆర్ కోడ్లను ఎట్టి పరిస్థితుల్లో స్కాన్ చేయకూడదు. క్యూఆర్ కోడ్లు మీకు తెలియని వ్యక్తుల నుంచి సందేశం లేదా ఇమెయిల్ రూపంలో వస్తే వాటిని స్కాన్ చేయకూడదు. సోషల్ మీడియాలో కనిపించే క్యూఆర్ కోడ్ల పట్ల కూడా జాగ్రత్త వహించాలి. లింక్ను కలిగి ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసేముందు, యూఆర్ఎల్ చెక్ చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే వెబ్సైట్లోకి తీసుకెళ్తే.. అలాంటి వాటిని విస్మరించడం మంచిది. ఇలాంటి మోసాలను నివారించడానికి బిల్డ్ ఇన్ సెక్యూరిటీ ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. మీ డిజిటల్ అకౌంట్స్ పాస్వర్డ్లను ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. -
వీటిని తెగవాడుతున్నారు..!
ప్రస్తుతం ఏ చిన్న వస్తువు కొనాలన్నా యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్ స్కానర్లు కనిపిస్తున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్తో చెల్లింపులు సాగిస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు కచ్చితంగా ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ ఉంటున్నాయి. చిటికెలో ట్రాన్సాక్షన్ పూర్తి చేసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చిన క్రమంలో డిజిటల్ పేమెంట్లలో యూనిఫైడ్ ఫేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ మేరకు యూపీఐ పేమెంట్లకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కె కరాద్ పార్లమెంట్లో కీలక విషయాలు వెల్లడించారు. యూపీఐ పేమెంట్లు పెరగడంతో గతేడాది చలామణిలో ఉన్న నోట్ల విలువలో వృద్ధి 7.8 శాతానికి తగ్గినట్లు చెప్పారు. 2017-18 ఏడాదిలో యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్య 92 కోట్లుగా ఉండగా.. అది 2022-23కు ఏకంగా 8,357 కోట్లకు చేరినట్లు చెప్పారు. యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్యాపరంగా వార్షిక వృద్ధి 147 శాతంగా ఉందని పేర్కొన్నారు. యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ 2017-18లో దాదాపు రూ.1 లక్ష కోట్లుగా ఉండగా.. అది 168 శాతం పెరిగి 2022-23లో రూ.139 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో డిసెంబర్ 11 వరకు యూపీఐ మొత్తం ట్రాన్సాక్షన్ల సంఖ్య 8,572 కోట్లుగా తెలిపారు. 2022-23లో మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్లలో యూపీఐ లావాదేవీలే 62 శాతంగా ఉన్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: రూ.1000 కోట్లు ఆదా చేసిన ప్రభుత్వ సంస్థ.. చలామణిలో ఉన్న నోట్ల విలువలో వృద్ధి 2021-22లో 9.9 శాతంగా ఉండగా.. 2022-23లో 7.8 శాతానికి తగ్గిందన్నారు. యూపీఐతో రూపే క్రెడిట్ కార్డులు లింక్ చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దీనివల్ల క్రెడిట్ కార్డులను తమతో తీసుకెళ్లకుండానే చిన్న విక్రయ కేంద్రాల్లోనైనా చెల్లింపులు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలాఉండగా.. గత తొమ్మిదేళ్లలో 57 బ్యాంకులను మూసివేసినట్లు మంత్రి చెప్పారు. మూడు బ్యాంకులు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, యెస్ బ్యాంకులను పునరుద్ధరించినట్లు చెప్పారు. -
యూపీఐ ఐడీలు డీయాక్టివేట్ అవుతాయ్ - చెక్ చేసుకోండి!
యూపీఐ లావాదేవీలు పెరుగుతున్న సమయంలో చాలామంది చేతిలో డబ్బు పెట్టుకోవడమే మర్చిపోయారు. చిన్న కొట్టు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఎక్కడ ఏది కొనాలన్నా ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారు. ఇది చాలా సులభమైన ప్రాసెస్ కూడా. అయితే ఇప్పుడు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఓ కొత్త రూల్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ప్రకారం వాడకంలో లేని.. లేదా వినియోగంలో లేని యూపీఐ ఐడీలను డీయాక్టివ్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియను ఫోన్పే, గూగుల్ పేకి మాత్రమే కాకుండా పేటీఎమ్ వంటి ఇతర పేమెంట్స్ యాప్స్ కూడా ప్రారంభించాలని ఆదేశించింది. ఒక సంవత్సరంకంటే ఎక్కువ రోజులు వినియోగంలో లేని యూపీఐ ఐడీలను పూర్తిగా క్లోజ్ చేయాలని సంబంధిత సంస్థలకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ సర్క్యులర్ జారీ చేసినట్లు సమాచారం. ఇందులో 2023 డిసెంబర్ 31 నాటికి ఈ మార్గదర్శకాలను అమలు చేయాలనీ స్పష్టం చేసింది. ఇదీ చదవండి: ఓపెన్ఏఐ కొత్త సీఈఓ.. ఎవరీ 'మీరా మురాటి'? వినియోగదారులు లేదా ఖాతాదారులు మొబైల్ నెంబర్స్ మార్చుకునే సమయంలో.. అప్పటికే ఉన్న నెంబర్స్ డీయాక్టివేట్ చేయకపోతే.. వారికి సంబంధం లేని కొన్ని ఖాతాలకు డబ్బు బదిలీ అయ్యే అవకాశం ఉందని ఎన్పీసీఐ భావించి ఈ నిర్ణయం తీసుకుంది. అంటే టెలికం ఆపరేటర్లు పాత నెంబర్స్ వేరొకరికి అందించడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది. కాబట్టి వినియోగంలో లేని ఐడీలను డీయాక్టివేట్ చేస్తే ఈ సమస్య జరగదని ధ్రువీకరించింది. -
యూపీఐ ట్రాన్సాక్షన్ల జోరు.. డెబిట్ కార్డులు బేజారు!
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ లావాదేవీలతో మనోళ్లు దుమ్మురేపుతున్నారు. యూపీఐ పేమెంట్స్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన డబ్బు బదిలీ (మనీ ట్రాన్స్ఫర్)గా నేడు అవతరించింది. అందుకే మునుపెన్నడూ లేనంత స్థాయిలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ట్రాన్సాక్షన్ల జోరు కొనసాగుతోంది. మూడు, నాలుగేళ్ల కిందట ప్రధానంగా బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతో అత్యధికంగా పలు రకాల లావాదేవీలు, ఆర్థిక కార్యకలాపాలు జరిగిన విషయం తెలిసిందే. కోవిడ్ మహమ్మారి కాలం తెచ్చిన మార్పు చేర్పులతో డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగాన్ని తోసిరాజని యూపీఐ లావాదేవీలు ఇప్పుడు అగ్రపీఠాన్ని అధిరోహించాయి. యూపీఐ ద్వారా... చిన్న మొత్తంలో కొనుగోళ్లు, ఇతరత్రా చెల్లింపులకు అవకాశం ఉండడంతో వాటివైపే అత్యధికుల మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమైంది. రోజువారీ నిత్యావసర కొనుగోళ్లు మొదలు, మార్కెట్లో వివిధరకాల వస్తువుల కొనుగోలుకు యూపీఐ చెల్లింపు విధానాన్ని మెజారిటీ వినియోగదారులు అనుసరిస్తున్నారు. గత మూడేళ్లలో 428 శాతం యూపీఐ ట్రాన్సాక్షన్లు పెరగ్గా, గత నెలలో (ఆగస్టులో) రూ.పది బిలియన్ల (బిలియన్ = 100 కోట్లు) ట్రాన్సాక్షన్ల నమోదుతో తొలిసారి రికార్డ్ సృష్టించాయి. మూడేళ్లుగా డిజిటల్ లావాదేవీలు కోవిడ్ నుంచి మూడేళ్లుగా క్రమంగా డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. ఎంతగా అంటే.. 2023–24 ఆర్థికసంవత్సరంలో (ఏప్రిల్–జూలైల మధ్య) చెల్లింపుల విషయానికొస్తే..క్రెడిట్కార్డుల ద్వారా రూ.5.57 ట్రిలియన్లు, డెబిట్కార్డులతో రూ.13 ట్రిలి యన్లు, యూపీఐ ద్వారా రూ.59.14 ట్రిలియన్ల (ట్రిలియన్ = లక్ష కోట్లు)లో జరిగినట్టు వెల్లడైంది. ఆర్బీఐ డేటా ఆధారంగా రూపొందించిన నివేదికలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. కరోనా తెచ్చిన మార్పులతో భారతీయులు అనుస రిస్తున్న వ్యయం తీరులో మార్పులు వచ్చి నట్టుఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. చదవండి: పనిచేస్తున్న బ్యాంకులోనే రూ.8.5 కోట్లు స్వాహా చేసిన డిప్యూటీ మేనేజర్ కీలకాంశాలు ► 2020 జూలైలో డెబిట్కార్డుల ద్వారా చేసిన చెల్లింపులు రూ.2.81 ట్రిలియన్లు కాగా. 2023 జూలైలో అవి రూ.3.15 ట్రిలియన్లుకు... అంటే 11.96 శాతం వృద్ధిని మాత్రమే నమోదుచేశాయి. ► ఇదే సమయంలో యూపీఐ చెల్లింపులు అనేవి రూ.2.90 ట్రిలియన్ల నుంచి రూ.15.33 ట్రిలియన్లకు.. అంటే 428 శాతం పెరుగుదలను రికార్డ్ చేశాయి ►మరోవైపు క్రెడిట్కార్డుల ద్వారా చెల్లింపులు కూడా పెరుగుతున్నాయి ► 2020 జూలైలో రూ.0.45 ట్రిలియన్ల చెల్లింపులతో పోల్చితే 2023 జూలై నాటికి అవి రికార్డ్ స్థాయిలో రూ.1.45 ట్రిలియన్లకు చేరుకున్నాయి ► కస్టమర్లు చెల్లిస్తున్న పద్ధతుల్లో భారీ మార్పుల వస్తున్నా డెబిట్కార్డుల వినియోగం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు లేవు. మార్కెట్లో వాటి స్థానం పదిలమని నిపుణుల అంచనా. 20 బిలియన్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదు చిన్న చిన్న మొత్తాల్లో చెల్లింపులు పెరగడం, ఫోన్ ద్వారా యూపీఐ లావాదేవీల వెసులుబాటుతో.. సంప్రదాయ చెల్లింపు పద్ధతిగా ఉన్న కస్టమర్ల డెబిట్కార్డుల వినియోగం అనేది బాగా తగ్గింది. దీనిని బట్టి వచ్చే 18–24 నెలల కాలంలో యూపీఐ లావాదేవీలు నెలకు రూ.20 బిలియన్లకు చేరుకున్నా ఆశ్చర్యపడక్కర లేదు. –సునీల్ రంగోలా, సీనియర్ వైస్ప్రెసిడెంట్, హెడ్ –స్ట్రాటజీ,ఇన్నోవేషన్, అనాలిటిక్స్, వరల్డ్లైన్ ఇండియా -
డబ్బులెందుకు.. ఫోన్ ఉంటే చాలు..
సాక్షి, అమరావతి: బడ్డీ కొట్టులో రూపాయి చాక్లెట్ కొన్నా.. ఇంట్లోనే కూర్చొని టికెట్లు బుక్ చేయాలన్నా.. గ్యాస్, కరెంట్ తదితర బిల్లులు చెల్లించాలన్నా.. అన్నింటికీ ప్రజలు ఇప్పుడు ‘యూపీఐ’ యాప్లనే ఆశ్రయిస్తున్నారు. చివరకు భిక్షాటనలోనూ యూపీఐ క్యూఆర్ కోడ్లనే ఉపయోగించేస్తున్నారు. అన్నింటికీ పేమెంట్ యాప్లతోనే చెల్లింపులు జరుపుతున్నారు. ముఖ్యంగా గత రెండు, మూడేళ్ల నుంచి జనం చేతుల్లో క్యాష్ తక్కువైపోయి.. స్కానింగ్ ఎక్కువైపోయింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో అకౌంట్కు మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు వాడే ఒక వాహకం. దీని ద్వారా ఆన్లైన్ పేమెంట్స్ చాలా సులవుగా, వేగంగా జరిగిపోతున్నాయి. ప్రస్తుతం పేమెంట్ యాప్ల ద్వారా రోజుకు రూ.లక్ష వరకు బదిలీ చేసే అవకాశముండటంతో.. దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల ప్రజలు బ్యాంకులకు వెళ్లి.. గంటల పాటు వేచి చూసే శ్రమ కూడా తప్పింది. సమయం కూడా ఆదా అవుతోంది. వేగంగా వృద్ధి.. ‘డేటా డాట్ ఏఐ’ అనే సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న యాప్స్లో ఫోన్ పే, పేటీఎం, గూగుల్పే మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్, పేమెంట్, పర్సనల్ లోన్స్ ఎంతో వేగంగా వృద్ధి చెందాయని ఈ నివేదిక వెల్లడించింది. ఇక టాప్–10 డౌన్లోడెడ్ యాప్స్లో నాలుగు, ఆ తర్వాతి స్థానాల్లో బజాజ్ ఫిన్ సర్వ్, యోనో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్, క్రెడిట్ బీ, ధని, నవీ, గ్రో యాప్స్ ఉన్నాయి. ఆదమరిస్తే అంతే.. డిజిటల్ పేమెంట్స్ వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో.. ముప్పు కూడా అదే స్థాయిలో ఉంది. కాస్త అజాగ్రత్తగా ఉన్నా.. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయే ప్రమాదముంది. యూపీఐ పేమెంట్స్పై అవగాహన లేకపోవడం, తమకు వచ్చే మోసపూరిత ఫోన్ కాల్స్, మెసేజ్లను నమ్మడం వల్ల చాలామంది మోసపోతున్నారు. లాటరీ తగిలిందని.. మీ ఖాతా వివరాలు అప్డేట్ చేయాలి ఓటీపీ చెప్పండని, ఈ లింక్ మీద క్లిక్ చేస్తే అదృష్టం వరిస్తుందని.. ఇప్పుడు కొత్తగా మా వీడియోలను చూస్తే చాలు, సోషల్ మీడియాలో లైక్ కొడితే చాలు డబ్బులిస్తామంటూ అనేక రకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసి.. వన్టైమ్ పాస్వర్డ్(ఓటీపీ), యూపీఐ పిన్ నంబర్లు తెలుసుకొని డబ్బులు లాగేస్తున్నారు. ఇలా మోసపోకుండా ఉండాలంటే.. పాస్వర్డ్లను తరచుగా మారుస్తుండాలి. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్లను తెరవకూడదు. క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయకూడదు. ఎవరికీ ఎలాంటి సందర్భంలోనూ ఓటీపీ చెప్పకూడదు. ఇలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు.. చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉంటే మోసాల నుంచి తప్పించుకోవచ్చు. -
మీ ట్రైన్ టికెట్ కన్ఫామ్ అయిందా? పేటీఎంలో చెక్ చేయండిలా!
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పేటీఎం ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్, బుకింగ్ మూవీ టికెట్స్, పలు రకాలైన సేవల్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రైల్వే ప్రయాణికుల కోసం అదిరిపోయే ఫీచర్ను పేటీఎం తన యాప్లో జత చేసింది. ఐఆర్సీటీసీ భాగస్వామ్యంతో ప్రయాణికులకు ఇకపై సులభం తత్కాల్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. వీటితో పాటు పీఎన్ఆర్ స్టేటస్, ట్రైన్ రన్నింగ్ స్టేటస్, క్యాన్సిలేషన్పై టికెట్లపై ఇన్స్టంట్ రీఫండ్, ఫ్లాట్ ఫామ్ నెంబర్ను ట్రాక్ చేయడంతో పాటు ఐటీఆర్సీటీసీ బుకింగ్స్ సంబంధించిన అన్నీరకాల సర్వీసుల్ని యూజర్లు వినియోగించుకోవచ్చని పేటీఎం ప్రతినిధులు తెలిపారు. వీటితో పాటు మీరు బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్ కన్ఫామ్ లేదా అని తెలిపేలా ప్రిడిక్షన్స్ సైతం చూపిస్తుంది. అదే సమయంలో మీరు వెళ్లాలనుకుంటున్న ప్రాంతానికి అదే సమయానికి ఏయే ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. ఉంటే సదరు ట్రైన్లలో సీట్లను కేటాయిస్తామని పేటీఎం హామీ ఇచ్చింది. ఐఆర్సీటీసీ ప్రయాణికులు సైతం పేటీఎం యాప్లో సమీప రైల్వే స్టేషన్లను, ట్రైన్ టికెట్లపై పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ట్రైన్ సమయపాలనలో అంతరాయం ఉంటే ముందే చెప్పేస్తుంది. 24*7 పేటీఎం యాప్లో 10 లాంగ్వేజ్లలో సీనియర్ సిటిజన్లు, మహిళా ప్రయాణికులకు అనుగుణంగా వారికి కావాల్సిన విధంగా టికెట్ ధరల్ని అందిస్తుంది. పేటీఎంలో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవడం ఎలా? 👉యాప్ లో పేటీఎంలోకి లాగిన్ అవ్వండి లేదా paytm.com/train-tickets సందర్శించండి 👉మీరు వెళ్లాలనుకుంటున్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి 👉ఆ తర్వాత జర్నీ డేట్ ఎంటర్ చేసి ఏయే ట్రైన్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకునేందుకు సెర్చ్ ఆప్షన్పై ట్యాప్ చేయండి. 👉ఇప్పుడు మీ ట్రైన్, అందులో సీటు సదుపాయం ఉందో లేదో చెక్ చేసుకొని మీకు కావాల్సిన సీటు, తరగతి, తేదీని ఎంపిక చేసుకోవాలి. 👉టికెట్లు బుక్ చేసుకోవడానికి బుక్ బటన్ మీద క్లిక్ చేసి, మీ ఐఆర్సీటీసీ లాగిన్ ఐడిని ఎంటర్ చేయండి. 👉మీకు లాగిన్ ఐడీ లేకపోతే ‘సైన్ అప్ విత్ ఐఆర్సీటీసీ’ ఆప్షన్పై ట్యాప్ చేయడం లేదా, ఐఆర్సీటీసీ ఫర్ గెట్ పాస్వర్డ్ ఆప్షన్పై క్లిక్ చేస్తే ఐఆర్సీటీసీ ఐడీని రీసెట్ చేసుకోవచ్చు. 👉తరువాత, ట్రైన్ వివరాల్ని జత చేసి ‘బుక్’ ఆప్షన్మీద ట్యాప్ చేయండి. 👉ఇప్పుడు మీకు నచ్చిన పేమెంట్ ఆప్షన్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లకు డబ్బులు చెల్లించండి. 👉మీ బుకింగ్ పూర్తి చేయడానికి ఐఆర్సీటీసీ వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతుంది. 👉ధృవీకరించడానికి పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి 👉టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పేటీఎం మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి మీ టికెట్ల ఇమెయిల్ కూడా పంపుతుంది. చదవండి👉 రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్.. మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉందా? -
ఇంటర్నెట్ లేకుండానే UPI పెమెంట్స్
-
షాకింగ్: గూగుల్ పే, పోన్పేలాంటి యాప్స్లో ఇక ఆ లావాదేవీలకు చెక్?
సాక్షి,ముంబై: డిజిటల్ ఇండియాలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చాలా సర్వసాధారణమైపోయాయి. ప్రతీ చిన్న లావాదేవీకి గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం లాంటి పేమెంట్ యాప్స్పై ఆధారపడటం బాగా పెరిగింది. అయితే అపరిమిత యూపీఐ లావాదేవీలకు సంబంధించి తాజా అంచనాలు యూజర్లకు షాకివ్వనున్నాయి. పేమెంట్ యాప్ల ద్వారా అన్లిమిటెడ్ పేమెంట్లు చేయకుండా నిబంధనలు త్వరలోనే అమల్లోకి రానున్నాయని భావిస్తున్నారు. త్వరలో డిజిటల్ యూపీఐ పేమెంట్లపై ట్రాన్సాక్షన్ లిమిట్ విధించనున్నారని తాజా నివేదికల సమాచారం. యూపీఐ డిజిటల్ సిస్టమ్లోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), థర్డ్-పార్టీ యాప్ ప్రొవైడర్ల (TPAP) వాల్యూమ్ క్యాప్ను పరిమితం చేయనుంది. ఈ మేరకు వాల్యూమ్ను 30 శాతానికి పరిమితం చేసే విషయంపై రిజర్వ్ బ్యాంక్తో చర్చలు జరుపుతోంది. ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ PhonePe ఈ ఏడాది డిసెంబరు 31తోముగియనున్న గడువును కనీసం మూడు సంవత్సరాలు పెంచాలని ఇప్పటికే ఫోన్పే అభ్యర్థించింది. మరికొందరైతే ఐదేళ్లు పొడిగించాలని కోరుతున్నారు. అయితే ఈ నెలాఖరులోగా ఎన్పీసీఐ నిర్ణయం తీసుకోనుంది. కాగా 2020లో ఈ లావాదేవీల పరిమాణాన్ని 30 శాతానికి పరిమితం చేసేలా ప్రతిపాదించింది. ఎన్పీసీఐ థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ UPIలో నిర్వహించబడే లావాదేవీలను నియంత్రించాలని భావించింది. ఆ తరువాత దీని అమలును రెండు సంవత్సరాలకు పొడిగించింది. మరి ఈ గడువును పొడిగించే అవకాశం ఉందా లేదా అనే దానిపై నవంబర్ చివరి నాటికి దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎలాంటి పరిమితులు లేకుండా యూపీఐ యాప్ల చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంది. గూగుల్ పే, ఫోన్పే మార్కెట్లో దాదాపు 80 శాతం వాటా కలిగి ఉన్నాయి. -
అందుబాటులోకి కొత్త సేవలు.. ఈ క్రెడిట్ కార్డ్తో బోలెడు లాభాలు!
ఆన్లైన్ చెల్లింపులను మరింత ప్రోత్సాహించేందుకు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సేవలను పొందడం కోసం మీ రూపే క్రెడిట్ కార్డ్ (Rupay credit card)లను భీం యాప్ (BHIM UPI) యాప్కి లింక్ చేయాల్సి ఉంటుంది. తద్వారా.. ప్రజలు ఇకపై షాపుల్లో, మాల్స్లో షాపింగ్తో పాటు మరే ఇతర బిల్లుల చెల్లింపులకు మీ క్రెడిట్ కార్డులను స్వైపింగ్ మిషన్ల వద్ద స్వైప్ చేయాల్సిన అవసరం ఉండుదు. ఎలాగో తెలుసుకుందాం! క్రెడిట్ కార్డ్ లేకపోయినా ..ఈజీగా చెల్లింపులు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రతి రంగంలోనే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బ్యాంకింగ్లోనూ భారీగానే జరిగాయి. గతంలో ఏ లావాదేవీలకైన కస్టమర్ నేరుగా బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేది. అయితే క్రమంగా కాలం డిజిటల్ యుగం వైపు అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో ఏటీఎం, క్రెడిట్ కార్డ్, ఆన్లైన్ లావాదేవీలంటూ అంతా కూర్చున్న చోటే చెల్లింపులు జరిగిపోతున్నాయి. కరోనా నుంచి ఆన్లైన్ లావాదేవీలు మరింత పెరిగాయని నివేదికలు కూడా చెప్తున్నాయి. తాజాగా ఎన్పీసీఐ మరో ఫీచర్ను ప్రవేశపెట్టింది. మీరు చేయల్సిందల్లా.. భీం యూపీఐలో మీ రూపే క్రెడిట్ కార్డ్ని లింక్ చేయడమే. తద్వారా ఏ చెల్లింపులకైన క్రెడిట్ కార్డు మీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. క్రెడిట్ కార్డు లేకుండానే కేవలం భీం యాప్కి లింక్ చేసిన మీ యూపీఐ అకౌంట్తో ఈజీగా చెల్లింపులు జరుపుకోవచ్చు. ఇటీవల గణనీయంగా పెరుగుతున్న క్రెడిట్ కార్డుల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని వల్ల క్రెడిట్ కార్డ్ పోగొట్టుకునే సమస్య ఇకపై ఉండదు. చెల్లింపులు కూడా చాలా సులభతరం కానున్నాయి. ఈ బ్యాంకులకు మాత్రమే.. కేవలం కొన్ని బ్యాంకులకు మాత్రమే భీమ్ యాప్ ద్వారా రూపే క్రెడిట్ కార్డు ఉపయోగానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. అందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ ఖాతాదారులకు మాత్రమే తొలుత భీం యాప్తో రూపె క్రెడిట్ కార్డు సేవలను ఉపయోగించగలరు. ఈ మేరకు గత సెప్టెంబర్ 20న ఎన్పీసీఐ సర్క్యులర్ జారీ చేసింది. చదవండి: ఎలాన్ మస్క్కు భారీ ఝలకిచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడేం చేస్తావ్! -
వామ్మో రూ.12.11 లక్షల కోట్లు.. ఏం వాడకం రా బాబు!
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మార్పులు చోటు చేసుకోవడం సహజం. గతంలో చెల్లింపులు నగదు లేదా చెక్ రూపంలో చేస్తున్న ప్రజలు, ఇటీవల డిజిటల్ సేవలు అందుబాటులోకి రావడంతో అటు వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే కరోనా నుంచి ఈ డిజిటిల్ చెల్లింపులు ఊహించని స్థాయిలో పుంజుకున్నాయి. తాజాగా యూపీఐ లావాదేవీల సంఖ్య అక్టోబర్లో 7.7 శాతం పెరిగి 730 కోట్లు నమోదయ్యాయి. వీటి విలువ రూ.12.11 లక్షల కోట్లు రికార్డ్ స్థాయిలో జరిగాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. సెప్టెంబర్లో 678 కోట్ల లావాదేవీలకుగాను విలువ రూ.11.16 లక్షల కోట్లుగా ఉంది. ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) లావాదేవీల సంఖ్య 48.25 కోట్లు కాగా, వీటి విలువ రూ.4.66 లక్షల కోట్లు. సెప్టెంబర్తో పోలిస్తే గత నెలలో ఎన్ఈటీసీ ఫాస్టాగ్ లావాదేవీల విలువ రూ.4,452 కోట్లకు చేరుకుంది. సురక్షితమైన, వేగంతో కూడిన బ్యాంకింగ్ లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు ఆధార్ కార్డ్ని ఏఈపీఎస్తో అనుసంధానించగా.. గత నెలలో 10.27 కోట్లు ఉండగా అక్టోబర్లో ఇవి 11.77 కోట్లకు చేరుకుంది. ఏఈపీఎస్ లావాదేవీల విలువ రూ.26,665.58 కోట్ల నుంచి రూ.31,112.63 కోట్లకు పెరిగింది. చదవండి: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్: అందరికీ ఒకటే ఐటీఆర్ ఫామ్! -
TTD: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. తిరుమలలో యూపీఐ(Unified Payments Interface) విధానాన్ని ప్రవేశపెట్టినట్టు టీటీడీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, పైలట్ ప్రాజెక్టు కింద గదుల కేటాయింపులో యూపీఐ విధానాన్ని అమలు చేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. ఇక, త్వరలోనే తిరుమలలో అన్ని చెల్లింపులు యూపీఐ విధానంలోనే చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: భక్తులకు గమనిక: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎప్పుడంటే.. -
ఏటీఏం కార్డ్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త!
ఏటీఏం కార్డ్ వినియోగదారులకు శుభవార్త. త్వరలో ఏటీఎం కార్డ్తో పనిలేకుండా యూపీఐ పేమెంట్ ద్వారా ఏటీఏం సెంటర్లో ఈజీగా డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం ప్రస్తుతం ట్రయల్ వెర్షన్లో ఉండగా త్వరలో అందరికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని సమాచారం. దేశంలో యూపీఐ పేమెంట్స్ వినియోగం రోజురోజుకీ పెరిగిపోతుంది. ముఖ్యంగా కరోనా కారణంగా మునుపెన్నడూ లేని విధంగా యూజర్లు క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్పై మొగ్గు చూపుతున్నారు. వైరస్ వ్యాప్తితో పాటు బ్యాంక్కు వెళ్లే అవసరం లేకుండా ఉన్న చోటు నుంచి ఆన్లైన్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేయడంతో యూజర్లు యూపీఏ పేమెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏటీఎం సెంటర్లలో జరిగే నేరాల్ని అరికడుతూ...యూపీఏ పేమెంట్స్ను మరింత పెంచేలా ఎన్సీఆర్ కార్పొరేషన్ అనే సాఫ్ట్వేర్ సంస్థ తొలిసారి యూపీఐ నెట్వర్క్ ఫ్లాట్ ఫామ్స్తో కలిసి ఇంటర్ ఆపరబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్ డ్రాల్(ఐసీసీడబ్ల్యూ) సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొని రానుంది. ఈ ఫ్లాట్ ఫామ్తో యూజర్లు కార్డ్ లేకుండా ఏటీఎం సెంటర్లలో గూగుల్పే, పేటీఎం, ఫోన్తో పే పాటు ఇతర యూపీఐ పేమెంట్స్తో మనీ విత్ డ్రాల్ చేసుకునే సౌకర్యం ఉంటుందని ఎన్సీఆర్ కార్పొరేషన్ ప్రతినిధులు తెలిపారు. కార్డ్ లెస్ మనీ విత్ డ్రాల్ జరగాలంటే..సంబంధిత బ్యాంక్లకు చెందిన ఏటీఎంలలో ఈ కొత్త యూపీఏ పేమెంట్ సదుపాయం ఉండాలని చెప్పారు. కార్డ్ లేకుండా ఏటీఎం నుంచి మనీ విత్ డ్రా ఎలా చేయాలంటే? ►ముందుగా ఏటీఎం మెషిన్లో విత్ డ్రా క్యాష్ ఆప్షన్ను సెలక్ట్ చేసుకోవాలి ►వెంటనే మీకు యూపీఐ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్పై ట్యాప్ చేయాలి ►అలా ట్యాప్ చేస్తే ఏటీఎం స్క్రీన్పై క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది ►ఆ కోడ్ను మీ యూపీఐ పేమెంట్(ఉదాహరణకు గూగుల్ పే) ను స్కాన్ చేసుకోవాలి ►స్కాన్ చేస్తే మీరు మనీ ఎంత డ్రా చేయాలనుకుంటున్నాని అడుగుతుంది. మీ అవసరాన్ని బట్టి మనీ డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం లిమిట్ రూ.5వేల వరకు ఉండనుందని తెలుస్తోంది. ►మీకు ఎంత క్యాష్ కావాలో..నెంబర్ (ఉదాహరణకు రూ.2వేలు) ఎంట్రీ చేసిన తర్వాత హింట్ ప్రాసెస్ బటన్ క్లిష్ చేస్తే మనీ విత్ డ్రా అవుతుంది. డీఫాల్డ్గా మీ యూపీఐ అకౌంట్ క్లోజ్ అవుతుంది. చదవండి👉వాటిని దాటేయనున్న డిజిటల్ వాలెట్లు -
ఆ విషయాన్ని బోర్డు చూసుకుంటుంది,'అష్నీర్' నిధుల దుర్వినియోగంపై సమీర్!
న్యూఢిల్లీ: ఫిన్టెక్ కంపెనీ భారత్పే మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో పటిష్ట పనితీరు చూపినట్లు కంపెనీ సీఈవో సుహయిల్ సమీర్ తాజాగా పేర్కొన్నారు. లాభనష్టాలులేని(బ్రేక్ఈవెన్) స్థితికి చేరే బాటలో వృద్ధి పథాన సాగుతున్నట్లు తెలియజేశారు. 18–24 నెలల్లో పబ్లిక్ ఇష్యూని సైతం చేపట్టే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. కంపెనీ మాజీ చీఫ్ అష్నీర్ గ్రోవర్ నిధుల దుర్వినియోగ ఆరోపణ అంశాన్ని బోర్డు చూసుకుంటుందని పేర్కొన్నారు. ఉద్యోగులకే తమ తొలి ప్రాధాన్యత అని, టీముల స్థిరత్వంపై దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. ఇక బిజినెస్ వృద్ధి ద్వితీయ ప్రాధాన్యతగా పేర్కొంటూ ఇందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇది కంపెనీ ఫలితాలలో ప్రతిఫలిస్తున్నట్లు తెలియజేశారు. చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో కంపెనీ ప్రతీ అంశంలోనూ 20 శాతం పురోగతి సాధించినట్లు వెల్లడించారు. కోవిడ్–19 జనవరిలో దెబ్బతీసినప్పటికీ లావాదేవీలు, టీపీవీ, రుణాల ఏర్పాటు, ఆదాయం తదితర పలు అంశాలలో ప్రస్తావించదగ్గ వృద్ధి సాధించినట్లు వివరించారు. టీపీవీ జోరు క్యూఆర్ కోడ్ల ద్వారా షాపు యజమానులు డిజిటల్ చెల్లింపులను చేపట్టేందుకు వీలు కల్పించే భారత్పే 225 పట్టణాలకు విస్తరించినట్లు సుహయిల్ తెలియజేశారు. 80 లక్షలకుపైగా మర్చంట్స్ నమోదైనట్లు, లావాదేవీ విలువ(టీపీవీ) 2.5 రెట్లు ఎగసి 16 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1.2 లక్షల కోట్లు)ను తాకినట్లు వెల్లడించారు. 65 కోట్ల డాలర్ల(రూ. 4,875 కోట్లు) విలువైన రుణాలకు సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. బయ్ నౌ పే లేటర్ విభాగంలో ఐదు నెలల క్రితం ఆవిష్కరించిన పోస్ట్పే నెలకు 10 లక్షల లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 5 కోట్ల డాలర్ల(రూ. 375 కోట్లు) విలువైన టీపీవీ సాధించినట్లు వెల్లడించారు. -
'ఫోన్ పే' భారీగా నియామకాలు, ఏయే విభాగాల్లో జాబ్స్ ఉన్నాయంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ పేమెంట్స్ వేదిక అయిన ఫోన్పే 2022 డిసెంబర్ నాటికి కొత్తగా 2,800 మందిని నియమించుకోనుంది. ఇప్పటికే సంస్థలో 2,600 మంది ఉద్యోగులు ఉన్నారు. బెంగళూరు, పుణే, ముంబై, ఢిల్లీతోపాటు ఇతర నగరాల్లో కొత్త ఉద్యోగులను చేర్చుకోనున్నట్టు కంపెనీ మంగళవారం తెలిపింది. ఇంజనీరింగ్, ప్రొడక్ట్, అనలిటిక్స్, బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్ విభాగాల్లో ఈ నియామకాలు ఉంటాయని ప్రకటించింది. -
ఇక టాటా యూపీఐ..!
బెంగళూరు: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ .. డిజిటల్ వ్యాపార వ్యూహాల అమల్లో దూకుడు పెంచుతోంది. తాజాగా ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ఆధారిత యాప్ను ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తోంది. థర్డ్ పార్టీ పేమెంట్స్ అప్లికేషన్ ప్రొవైడరుగా డిజిటల్ చెల్లింపు సేవలు అందించేందుకు అనుమతులు ఇవ్వాలంటూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కి టాటా గ్రూప్ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. యూపీఐ సేవలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒక ప్రైవేట్ బ్యాంకుతో, టాటా గ్రూప్లో భాగమైన టాటా డిజిటల్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో బ్యాంకింగ్ భాగస్వామితో కూడా భేటీ అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే నెలలో టాటా యూపీఐ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు వివరించాయి. టాటాకు ప్రయోజనకరం .. ఆన్లైన్ కామర్స్లో విస్తరించాలనుకుంటున్న టాటా గ్రూప్నకు సొంత యూపీఐ యాప్ ఉంటే సహజంగానే ఉపయోగకరంగా ఉండనుంది. వివిధ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తన సొంత యూపీఐ సర్వీసుల ద్వారా యూజర్లకు క్యాష్బ్యాక్, ఇతరత్రా ప్రోత్సాహకాలు అందిస్తుండటం ద్వారా వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది. టాటా డిజిటల్ తమ టాటా న్యూ సూపర్యాప్ను వచ్చే నెల ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా ఆవిష్కరించాలని ప్రణాళికలు వేసుకుంది. దానితో పాటే యూపీఐ యాప్ కూడా అందుబాటులోకి వస్తే సూపర్యాప్ లావాదేవీలు మరింత సులభతరం కాగలవని సంస్థ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రిటైల్ పేమెంట్ గేట్వే సహా పలు ఆర్థిక సాధనాలు అందించే క్రమంలో టాటా ఫిన్టెక్ పేరుతో టాటా డిజిటల్ కొత్తగా ఫైనాన్షియల్ మార్కెట్ప్లేస్ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గూగుల్పే, ఫోన్పేకు పోటీ.. ఎన్పీసీఐ గణాంకాల ప్రకారం యూపీఐ ద్వారా ఫిబ్రవరిలో 452 కోట్ల పైచిలుకు లావాదేవీలు జరిగాయి. సాధారణంగా ఫోన్పే, గూగుల్ పే వంటి నాన్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్లు .. యూపీఐ కార్యకలాపాల కోసం వివిధ బ్యాంకులతో చేతులు కలపాల్సి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్లతో భాగస్వామ్యం ద్వారా గూగుల్ పే.. యూపీఐ సర్వీసులు అందిస్తోంది. నాన్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్లు టెక్నాలజీ ప్రధానమైనవి కావడంతో యూపీఐ విధానంలో బ్యాంకుల యాప్లతో పోలిస్తే ఇవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఉదాహరణకు ఫోన్పే, గూగుల్పేకు యూపీఐ లావాదేవీల్లో సింహభాగం వాటా ఉంటోంది. అమెజాన్ పే, పేటీఎం, ఫేస్బుక్కు చెందిన వాట్సాప్ పే వంటివి కూడా వినియోగంలో ఉన్నాయి. టాటా కూడా రంగంలోకి దిగితే పోటీ మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
టాటా యూపీఐ పేమెంట్ యాప్ వచ్చేస్తోంది!
గూగుల్ పే, ఫోన్పేలకు టాటా గ్రూప్ షాకివ్వనుంది. ఆ రెండు సంస్థలకు ధీటుగా టాటా గ్రూప్ యూపీఐ పేమెంట్ యాప్ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం..యూపీఐ పేమెంట్స్ సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చేందుకు టాటా గ్రూప్ ఇప్పటికే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) అనుమతులు తీసుకున్నట్లు టాటా గ్రూప్ డిజిటల్ కామర్స్ యూనిట్ తెలిపిందని ఎకనమిక్ టైమ్ పేర్కొంది. అంతేకాదు ఈ యూపీఐ పేమెంట్ కార్యకాలపాల్ని నిర్వహించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్తో చర్చలు జరిపినట్లు వెల్లడించింది. నాన్ బ్యాంక్ సంస్థలు థర్డ్ పార్టీ పేమెంట్ సర్వీసులను ప్రారంభించేందుకు బ్యాంక్లతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశీయంగా యూపీఐ సేవల్ని అందిస్తున్న గూగుల్ పే ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. భారతదేశంలో ఎక్కువ శాతం యూపీఐ లావాదేవీలు గూగుల్ పే లేదా ఫోన్పేలో జరుగుతాయి. ఇక పేటీఎం, అమెజాన్ పే, వాట్సాప్ పే వంటి ఇతర యాప్లు మార్కెట్ను కలిగి ఉండగా..తాజాగా టాటా గ్రూప్ రంగంలోకి దిగడంతో యూపీఐ పేమెంట్స్ యాప్స్ మధ్య పోటీ తత్వం నెలకొంది. -
ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్స్ చేయండిలా..!
Money Transfer Using UPI Without Internet: ప్రస్తుత ఈ డీజీటల్ ప్రపంచంలో టెక్నాలజీ వినియోగం పెరిగిపోతున్న కొద్ది కొత్త కొత్త సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. మొబైల్ అందుబాటులోకి వచ్చిన కొత్తలో స్మార్ట్ఫోన్ నుంచి పేమెంట్స్ చేసే విధానం వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ, ఇప్పుడు స్మార్ట్ఫోన్లోనే బ్యాంకింగ్ లావాదేవీలన్నీ సులువుగా జరుగుతున్నాయి. ప్రజలు రోజుకు లక్షల రూపాయలను క్షణాల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అయితే, ఈ సేవలన్నీ వాడుకోవాలంటే స్మార్ట్ఫోన్లో ఇంటర్నెట్ ఉండాలి. కానీ, ఇంటర్నెట్ లేకున్నా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనే విషయం మనలో ఎందరికి తెలుసు. అవును, మీరు విన్నది నిజమే!. మన స్మార్ట్ఫోన్లో ఇంటర్నెట్ లేకున్నా ఇతరులకు డబ్బులు పంపించే అవకాశం ఉంది. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి సులువుగా లావాదేవీలు జరపొచ్చు. ఆఫ్లైన్లో యూపీఐ లావాదేవీలు ఉపయోగించుకోవడానికి యూజర్లు *99# డయల్ చేయాల్సి ఉంటుంది. USSD 2.0 పద్ధతి ద్వారా ఈ సర్వీస్ ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. అయితే, ఈ విధానాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తీసుకొచ్చింది. ఆగస్టు 2016లో ఎన్పీసీఐ రెండు డీజీటల్ చెల్లింపు పద్ధతులను(యుపీఐ & *99#) ఇంటిగ్రేట్ చేసింది. ఇప్పుడు యూపీఐ లావాదేవీలకు ఇదే నెంబర్ను యూజర్లు ఉపయోగించుకోవచ్చు. మరి ఇంటర్నెట్ లేకపోయినా డబ్బులు పంపడానికి ఏఏ స్టెప్స్ ఫాలో కావాలో తెలుసుకోండి. స్మార్ట్ఫోన్లో *99# సౌకర్యాన్ని ఎలా ఉపయోగించాలి? మీ స్మార్ట్ఫోన్లో డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి *99# అని టైప్ చేయండి. ఇప్పుడుMy Profile', 'Send Money', 'Receive Money', 'Pending Requests', 'Check Balance', 'UPI PIN', 'Transactions' అనే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. డబ్బులు పంపాలంటే డయల్ ప్యాడ్లో 1 ప్రెస్ చేసి Send Money ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు మీరు ఫోన్ నెంబర్, యూపీఐ ఐడీ, అకౌంట్ నెంబర్ నుంచి డబ్బులు పంపే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఈ పేమెంట్స్ మెథడ్లో ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేస్తే మీరు ఎవరికి డబ్బులు పంపాలో వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు యుపీఐని ఎంచుకున్నట్లయితే, అప్పుడు మీరు యుపీఐ ఐడీని నమోదు చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే 11 అంకెల ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు ఎంత మొత్తం పంపాలనుకుంటున్నారో టైప్ చేయాలి. ఆ తర్వాత మీ యూపీఐ పిన్ నమోదు చేసి send పైన క్లిక్ చేయాలి. ఇలా చేస్తే మీ అకౌంట్ నుంచి అవతలి వారి అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయి. డబ్బు బదిలీ చేసిన తర్వాత రిఫరెన్స్ ఐడితో పాటు ఇతర లావాదేవీల వివరాలు కనిపిస్తాయి. భవిష్యత్తు లావాదేవీల కోసం లబ్ధిదారుడీగా గ్రహీతను సేవ్ చేయమని మిమ్మల్ని కోరుతుంది. ఈ సర్వీస్ ఉపయోగించడం వల్ల రూ.0.50 స్వల్ప ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా గరిష్టంగా రూ.5 వేలు మాత్రమే పంపించడానికి అవకాశం ఉంటుంది. (చదవండి: ఓలా ఎలక్ట్రిక్ సంచనలం.. దేశంలో మరో భారీ ప్లాంట్ నిర్మాణం!) -
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు బంద్..!
భారతదేశపు అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన వినియోగదారులను అలర్ట్ చేసింది. టెక్నాలజీ అప్గ్రేడ్లో భాగంగా ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలను జనవరి 22న నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సేవలు రేపు ఉదయం 02:00 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఎటువంటి సేవలు పనిచేయవు అని తన ట్విటర్ ఖాతా వేదికగా పేర్కొంది. "మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నాము అని, ఈ ఒక్క రోజు పాటు తమకు సహకరించగలరని" ఎస్బీఐ అభ్యర్థించింది. ఎస్బీఐ తాత్కాలికంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను బంద్ చేయడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు కూడా చాలా సార్లు మెయింటనెన్స్ చేపట్టింది. యూజర్లకు మరింత సురక్షితమైన సేవలను అందించేందుకు ఎస్బీఐ గత కొంత కాలంగా మెయింటనెన్స్ వర్క్ చేపడుతూ వస్తుంది. దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్ కలిగిన ఎస్బీఐకి 22 వేలకు పైగా బ్రాంచులున్నాయి. దేశవ్యాప్తంగా 57,889కి పైగా ఏటీఎంలున్నాయి. We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience. pic.twitter.com/3Y1ph0EUUS — State Bank of India (@TheOfficialSBI) January 21, 2022 (చదవండి: కరోనా కాలంలో అమ్మకాల్లో డోలో 650 టాబ్లెట్ రికార్డు..!) -
గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు అలర్ట్.. యూపీఐ సర్వర్ డౌన్!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన తక్షణ చెల్లింపు వ్యవస్థ యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) సర్వర్ నేడు డౌన్ అయ్యింది. దీంతో డిజిటల్ వ్యాలెట్, ఆన్లైన్ పేమెంట్ సేవలు స్తంభించాయి. గూగుల్ పే, ఫోన్ పే యూజర్లు లావాదేవీలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ యూపీఐ ఆధారంగానే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ వంటి సంస్థలు పని చేస్తాయి. ఈ రోజు యూపీఐ సర్వర్ డౌన్ కావడంతో డిజిటల్ వ్యాలెట్, ఆన్లైన్ పేమెంట్ సేవలకు ఓ గంట సేపు అంతరాయం కలిగింది. వినియోగదారులు ఇతర బ్యాంకు ఖాతాలకు తక్షణమే డబ్బు పంపడానికి యుపీఐని ఉపయోగించే గూగుల్ పే, పేటిఎమ్, ఫోన్ పే పనిచేయడం లేదని వారు ట్విటర్ వేదికగా ఫిర్యాదు చేశారు. అయితే, ఈ సమస్యపై ఎన్పీసీఐ స్పందించింది. ఎన్పీసీఐ ఒక ట్వీట్ చేస్తూ యూపీఐ వ్యవస్థలో కలిగిన సాంకేతిక లోపాన్ని అంగీకరించింది. అయితే, యూపీఐ ఇప్పుడు మళ్లీ పనిచేస్తోందని తెలిపింది. ఈ వ్యవస్థను తాము ఇప్పుడు మరింత తీక్షణంగా పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించింది. Regret the inconvenience to #UPI users due to intermittent technical glitch. #UPI is operational now, and we are monitoring system closely. — NPCI (@NPCI_NPCI) January 9, 2022 అయితే, ఈ ట్వీట్ చేసిన తర్వాత కూడా కొంతమంది వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఫిర్యాదు చేశారు. ఈ సేవలు నిలిచిపోవడంతో చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు పోస్టు చేశారు. ఇది కేవలం తమకే అవుతున్నదా.? ఇతరులకూ ఈ అంతరాయం ఎదురైందా? అని ప్రశ్నలు వేసుకున్నారు. అయితే, ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం దాని యూపీఐ సిస్టమ్ డౌన్ అయినట్లు వివరించింది. మెయింటెనెన్స్ కార్యకలాపాల వల్ల తమ యూపీఐ డౌన్లో ఉన్నదని తెలిపింది. ఇదే విషయాన్ని టెక్ రివ్యూయర్ నితిన్ అగర్వాల్ ట్విట్టర్లో తెలిపారు. @ThatNaimish @pushpendrakum @simplykashif @Btcexpertindia @NischalShetty Every UPI app is down 🥲 - Google Pay, Phonepe, Paytm and more #UPI . Bss isi liye too blockchain important h jo kabhi ruke na kabhi thake na. Bss chalta hii jaaye 😂😂 — NIKHIL KADIAN (@KADIANMcse) January 9, 2022 @ThatNaimish @pushpendrakum @simplykashif @Btcexpertindia @NischalShetty Every UPI app is down 🥲 - Google Pay, Phonepe, Paytm and more #UPI . Bss isi liye too blockchain important h jo kabhi ruke na kabhi thake na. Bss chalta hii jaaye 😂😂 — NIKHIL KADIAN (@KADIANMcse) January 9, 2022 It's more than 5 hours now #UPI transaction are stuck as servers are down..!!! What's going on here @HDFC_Bank @GooglePay @Paytm !! — Niral Mehta (@NiralMehta1) January 9, 2022 (చదవండి: కొత్త ఏడాదిలో ఏసీ, ఫ్రిజ్, టీవీ కొనేవారికి తయారీ కంపెనీల షాక్..!) -
యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..! అయితే వీటిని కచ్చితంగా గుర్తుంచుకోండి..!
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్(యూపీఐ) రాకతో నగదు లావాదేవీలు మరింత సులభంగా మారాయి. బ్యాంకుల ప్రమేయం లేకుండా క్షణాల్లో నగదును ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. పాన్ షాపు నుంచి మెడిసిన్స్ షాపుల వరకు అందరూ యూపీఐ పేమెంట్స్కు అలవాటు పడ్డారు. దీంతో కొత్త సైబర్ నేరస్తులు కూడా కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ క్యూ ఆర్ కోడ్లను, అడ్రస్లను యూజర్లకు గాలం వేసి డబ్బులను కాజేస్తున్నారు. ఇలాంటి నేరాల నుంచి తప్పించుకోవాలంటే యూపీఐ పేమెంట్స్ విషయంలో పలు సూచనలను పాటిస్తే సురక్షితంగా ఉండవచ్చును. చదవండి: హైటెక్ ఘరానా మోసగాళ్లు..! నమ్మించి సింపుల్గా రూ. 58 వేల కోట్లు స్వాహా..! 1. మీ యూపీఐ చిరునామాను ఎప్పుడూ తెలియనివారితో పంచుకోవద్దు. యూపీఐ చిరునామాను సురక్షితంగా ఉంచడం అత్యంత కీలకమైన భద్రతా చిట్కా. ఏదైనా చెల్లింపు లేదా బ్యాంక్ అప్లికేషన్ ద్వారా మీ యూపీఐ ఖాతాను యాక్సెస్ చేయడానికి మీరు ఎవరినీ అనుమతించకూడదు. 2. శక్తివంతమైన స్క్రీన్ లాక్ని సెట్ చేయండి మీరు వాడే గూగుల్పే, ఫోన్పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్కు శక్తివంతమైన స్క్రీన్ లాక్ను ఏర్పాటు చేయడం మంచింది. మీ డేట్ ఆఫ్ బర్త్ను, మొబైల్ నంబర్ అంకెలను, స్క్రీన్ లాక్గా ఉంచకూడదు. మీ పిన్ను ఎవరితోనూ షేర్ చేయకూడదు ఒకవేళ మీ పిన్ బహిర్గతమైందని మీకు అనుమానం వస్తే, వెంటనే దాన్ని మార్చండి. 3. వేరిఫైకాని లింక్లపై క్లిక్ చేయవద్దు, నకిలీ కాల్స్ను హాజరుకావద్దు సైబర్ నేరస్తులు కొంత పుంతలు తొక్కుతూ..యూపీఐ పేమెంట్స్ లింక్స్ను యూజర్లకు పంపిస్తున్నారు. యూపీఐ స్కామ్ అనేది యూజర్లను ట్రాప్ చేయడానికి హ్యాకర్లు ఉపయోగించే ఒక సాధారణ టెక్నిక్. హ్యాకర్లు సాధారణంగా లింక్లను షేర్ చేస్తూ లేదా కాల్ చేసి డబ్బులను ఊడ్చేస్తారు. మీరు అలాంటి లింక్లపై ఎప్పుడూ క్లిక్ చేయకూడదు. మీ పిన్ లేదా మరేదైనా సమాచారాన్ని ఎవరితోనైనా షేర్ చేయకూడదు. బ్యాంకులు ఎప్పుడూ పిన్, ఓటీపీ, మరే ఇతర వ్యక్తిగత వివరాలను అడగవు. 4. ఎక్కువ యాప్స్ వాడకండి. ఆయా యూపీఐ పేమెంట్స్ యాప్స్ భారీగా ఆఫర్లను ఇస్తున్నాయని చెప్పి ఒకటి, రెండు కంటే ఎక్కువ యూపీఐ యాప్స్ వాడడం మంచింది కాదు. 5. క్రమం తప్పకుండా యాప్స్ను అప్డేట్ చేయాలి. ఆయా యూపీఐ యాప్స్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. కొత్త అప్డేట్లు మెరుగైన UI , కొత్త ఫీచర్లు మీకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. యాప్లను తాజా వెర్షన్కి అప్గ్రేడ్ చేయడంతో మీ యూపీఐ ఖాతాలను సురక్షితంగా ఉంచుతుంది. చదవండి: ‘ప్రపంచ బ్లాక్ చైయిన్ టెక్నాలజీకి క్యాపిటల్గా తెలంగాణ..!’ -
ఫోన్పేలో ఉచితాలకు కోత.. ఈ సర్వీసులకు మొదలైన బాదుడు..
Phone Pay User Charges: ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఇండియాలో మార్కెట్ లీడర్గా ఉన్న ఫోన్పే వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఇంతకాలం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సర్వీసులకు సంబంధించి ఉచితంగా అందించిన సర్వీసులకు ఇప్పుడు యూజర్ ఛార్జీలను వసూలు చేస్తోంది. ప్రభుత్వ ఆధీనంలో పెట్రోలు డీజిలు ధరలు పెరుగుతున్నాయి. ఇదే బాటలో ప్రైవేటు రంగంలోని డీటీహెచ్, ప్రైమ్ వీడియోల సబ్స్క్రిప్షన్స్ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా ఫోన్పే వచ్చి చేరింది. ఇంత కాలం ఉచితంగా అందించిన సర్వీసులకు యూజర్ ఛార్జీలను చేర్చింది. వినియోగదారులకు నేరుగా ఈ విషయం చెప్పకుండానే బాదుడు మొదలు పెట్టింది. యూజర్ ఛార్జీలు ఇప్పటి వరకు ఫోన్పే ద్వారా బ్యాంకు చెల్లింపులు, గ్యాస్ బుకింగ్, మనీ ట్రాన్స్ఫర్, మొబైల్ రీఛార్జ్ వంటి సేవలన్నీ ఉచితంగా అందేవి. అయితే ఇటీవల పెద్దగా హడావుడి చేయకుండానే యూజర్ ఛార్జీల విధానాన్ని ఫోన్పే ప్రవేశపెట్టింది. ప్రయోగాత్మకంగా మొబైల్ రీఛార్జీల విషయంలో వినియోగదారుల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తోంది. బాదుడు ఇలా మొబైల్ రీఛార్జీలకు సంబంధించి రూ.50లోపు ఉన్న రీఛార్జీ సేవలను గతంలోలాగానే ఉచితంగా అందిస్తోంది. కానీ రూ. 50 నుంచి 100ల మధ్యన రీఛార్జ్ చేస్తే ఒక రూపాయి యూజర్ సర్వీస్ ఛార్జ్ని వసూలు చేస్తోంది. 100కు మించి ఉన్న రీఛార్జ్లకు రెండు రూపాయల వంతున యూజర్ ఛార్జీలుగా ఫోన్పే విధించింది. కవరింగ్ మొబైల్ రీఛార్జీ యూజర్ చార్జీలకు సంబంధించిన వివరాలను ఫోన్పే పెద్దగా ప్రచారం చేయడం లేదు. పైగా ప్రయోగాత్మకంగా యూజర్ ఛార్జీలు తీసుకుంటున్నాం. కేవలం కొద్ది మంది మాత్రమే యూజర్ ఛార్జీల పరిధిలోకి వస్తున్నారంటూ కవరింగ్ ఇస్తోంది. మార్కెట్ లీడర్ కానీ సెప్టెంబరులో దేశవ్యాప్తంగా ఫోన్పే ద్వారా రికార్డు స్థాయిలో 165 కోట్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. యూపీఏ సర్వీసులు అందిస్తున్న థర్ట్ పార్టీ యాప్లలో ఒక్క ఫోన్పేనే 40 శాతం వాటాను ఆక్రమించింది. మార్కెట్ లీడర్గా స్థానం సుస్థిరం చేసుకునే సమయంలో ఫోన్పై యూజర్ ఛార్జీలు వసూలు చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. కనీసం యూజర్ ఛార్జీలకు సంబంధించి ముందుగా కొంత ప్రచారం చేయాల్సిందని అంటున్నారు. చదవండి:ఇలా చేస్తే రూ.5000 ఉచితం..! -
డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా... జర భద్రం
మన ఆశనే ఆసరాగా చేసుకుని చేసే మోసాలలో ‘పే’ యాప్ల ద్వారా క్యాష్ను కొల్లగొట్టడం ఒకటి. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎమ్ .. ఏ అప్లికేషన్ ద్వారా అయినా మీరు నగదు లావాదేవీలు చేస్తున్నప్పుడు జాగ్రత్త తప్పనిసరి. కుమారి (పేరు మార్చడమైనది) టీవీ చూస్తుండగా ఫోన్ కాల్ వచ్చింది. ‘మేడమ్, మీరు ఆన్లైన్ షాపింగ్లో ఫోన్ కొనుగోలు చేశారు కదా! మీకు రూ.4,999 క్యాష్బ్యాక్ ఆఫర్ వచ్చింది. ఆ మనీ మీ బ్యాంక్ అకౌంట్లోకి రావాలంటే నేను చెప్పే పద్ధతులను జాగ్రత్తగా ఫాలో అవ్వండి చాలు. ఈ మొత్తం మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది’ అని చెప్పింది అవతలి వ్యక్తి. దాంతో ఫోన్ పే ద్వారా ఫోన్లో అవతలి వ్యక్తి చెబుతున్న విధంగా వివరాలను జాగ్రత్తగా పొందుపరిచింది కుమారి. ‘మీ బ్యాంక్లో నగదు జమ అయింది. చెక్ చేసుకోండి మేడమ్, థాంక్యూ’ అని ఫోన్ కట్ అయింది. పే యాప్లో చెక్ చేసుకుంది కుమారి. క్రెడిట్ అవ్వాల్సిన నగదు కాస్తా డెబిట్ అయ్యింది. తన అకౌంట్లో నుంచి నగదు తగ్గిపోయి, వేరేవాళ్ల అకౌంట్లోకి వెళ్లినట్టుగా యాప్ హిస్టరీలో ఉండటంతో షాక్ అయ్యింది కుమారి. స్మూత్గా కొల్లగొడతారు వేల రూపాయలే కాదు లక్షల్లోనూ డబ్బును యాప్ల ద్వారా కొల్లగొట్టే ఉపాయాలు పన్నుతున్నారు మోసగాళ్లు. ఫోన్ మాట్లాడుతూనే క్రెడిట్ చేస్తామని చెప్పిన నగదు మొత్తాన్ని, మన అకౌంట్ నుంచి మన చేత్తోనే డెబిట్ చేసుకుంటారు. పూర్తిగా వారి మాటలతో మనల్ని తమ ఆధీనంలోకి తీసుకుని, నిలువునా ముంచేస్తారు. బోనస్ పాయింట్లు వచ్చాయనో, లాటరీ తగిలిందనో, స్క్రాచ్ కార్డులో క్యాష్బ్యాక్ వచ్చిందనో, బ్యాంక్ మేనేజర్ అనో .. ఇలా ఈ కామర్స్ ఫ్రాడ్స్కి తెరలేపుతారు. అకౌంట్లో ఉన్న నగదును దోచేస్తారు. పద్ధతిగా మోసం మీరు ఏదైనా ఆన్లైన్ షాపింగ్ ద్వారా ఒక వస్తువు బుక్ చేశారనుకోండి. ఆ వస్తువు డెలివరీ అయిన అరగంటలో మీకో ఫోన్ కాల్ వస్తుంది. అంటే, రకరకాల మార్గాల ద్వారా మీ ఫోన్ నెంబర్ను హ్యాకర్లు హ్యాక్ చేస్తారు. మీ వివరాలన్నీ తెలియజేస్తూ, వాటి పనితనం గురించి చెబుతూ తిరిగి సర్వీస్ అందించాలంటే ఫలానా ఫోన్ నెంబర్కి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెబుతారు. ఆ ‘కబుర్ల’ను నమ్మి ఫోన్ చేస్తే, బ్యాంకు వివరాలన్నీ రాబట్టడానికి ఎన్ని పద్ధతులు అవలంబించాలో అన్నీ అమలులో పెట్టేస్తారు. సులభమైన మార్గాలు డిజిటల్ లావాదేవీలు జీవితాన్ని సులభతరం చేశాయి. UPI ఇటీవలి కాలంలో ఎంచుకున్న సులభమైన చెల్లింపు పద్ధతుల్లో ఒకటి. మీ ఆర్థిక లావాదేవీకి అధికారం ఇవ్వడానికి మీకు కావలసిందల్లా కేవలం 4 అంకెల పిన్, మొత్తం బదిలీ ప్రక్రియ సెకన్లలో జరుగుతుంది. ఇది చాలా సౌలభ్యంగా ఉంటుంది. దాదాపు అన్నిUPI యాప్లు అంటే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ సాంకేతికంగా సురక్షితమైనవి. అయితే ఫిషింగ్, విషింగ్, స్మిషింగ్, మాల్వేర్,ఐఎమ్ క్లోన్..ఇతరత్రా మార్గాలను ఉపయోగించి డబ్బును దొంగిలించడానికి మోసగాళ్లు రకరకాల ప్రణాళికలు రచిస్తుంటారు. ఇ–మోసగాళ్లకు సామాజిక ఇంజనీరింగ్ వ్యూహాలపై మంచి అవగాహన ఉండటం వల్ల మనం అత్యంత జాగ్రత్తగా ఉండటం అవసరం. కబుర్లతో వల మోసగాళ్లు సాధారణంగా ఇతరులను ఆకర్షించడానికి రకరకాల టార్గెట్లను ఎంచుకుంటారు. వాటిలో.. వారు తమను తాము బ్యాంక్ ప్రతినిధులుగా చెప్పుకుంటారు, కెవైసీ అప్డేట్ చేస్తున్నామని, బోనస్ పాయింట్లు వచ్చాయని, క్యాష్ బ్యాక్లను రిడీమ్ చేస్తున్నామని.. వంటి వాటిని ఫోన్ కాల్ రూపంలో మనతో మాట్లాడుతారు. స్క్రీన్ షేరింగ్ అవకాశాలను ఉపయోగించుకుంటారు. స్కామర్లు మన ఫోన్కి వచ్చిన OTPని అడగచ్చు. కోడ్ చెప్పిన తర్వాత వారి ఫోన్ నుండే అనుమతిని ఓకే చేయమని కూడా అడగచ్చు. యాప్కు అవసరమైన అన్ని అనుమతులను పొందినప్పుడు, కాలర్ మన ఫోన్ని మనకే తెలియకుండా పూర్తిగా నియంత్రించడం ప్రారంభిస్తాడు. పూర్తి యాక్సెస్ పొందిన తర్వాత స్కామర్ పాస్వర్డ్లను దొంగిలించి, UPI ఖాతాతో లావాదేవీని ప్రారంభిస్తాడు. అకౌంట్లో ఉన్న మోత్తాన్ని ఖాళీ చేస్తాడు. సురక్షిత చెల్లింపులకు http: // ప్యాడ్ లాక్ సింబల్తో ఉన్న URL లింక్లను క్లిక్ చేయడం సురక్షితం. కొనుగోలుదారు లేదా విక్రేతకు OTP/ MPIN/UPI నంబర్లను ఏ రూపంలోనూ షేర్ చేయవద్దు. ముఖ్యంగా మీరు ఫోన్ కాల్లో ఉన్నప్పుడు చెల్లింపు లావాదేవీని ఎప్పుడూ చేయవద్దు. కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన ఏవైనా షార్ట్ లింక్లను క్లిక్ చేసి పూరించవద్దు. కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన గూగుల్ ఫారమ్ల లింక్లను అస్సలు పూరించవద్దు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయవద్దు. మీరు స్కాన్ చేస్తున్న సమయంలోనే మీ ఖాతా నుండి డబ్బు డెబిట్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా బ్యాంకింగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్వేర్లు అంటే స్క్రీన్ షేర్, ఎనీ డెస్క్, టీమ్ వ్యూయర్ మొదలైన వాటిని స్మార్ట్ఫోన్ లలో ఉపయోగించడం పూర్తిగా మానుకోవాలి.మీ యాప్ కస్టమర్ సపోర్ట్ నంబర్ల కోసం గూగుల్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల్లో వెతకవద్దు. -
బంగారం కొనుగోళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త పద్దతిలో!
Buying Gold On PhonePe: కరోనా సంక్షోభం వచ్చిన తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. టీ బిల్లు దగ్గరి నుంచి ఇంటి రెంట్ వరకు అంతా యూపీఐ పేమెంట్స్లోనే చేయడానికి జనం అలవాటు పడిపోయారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి విలువైన బంగారాన్ని సైతం ఆన్లైన్లోనే కొనేస్తున్నారు. ఈ విషయంలో మిగిలిన దక్షిణాది రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు జోరు మీదున్నారు. ఆన్లైన్లో కొనేస్తున్నారు పెళ్లిలు, పేరంటాలకే కాదు పెట్టుబడిగా కూడా బంగారం కొనుగోలు చేయడం మన దగ్గర ఆనవాయితీ. దేశంలో అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే రాష్ట్రంగా కేరళ ప్రథమ స్థానంలో నిలుస్తుంది. కానీ ఇప్పటికీ కేరళలో బంగారం కొనుగోలు విషయంలో పాత పద్దతినే అనుసరిస్తున్నారు. వ్యాపారుల వద్దకే వెళ్లి స్వయంగా పరిశీలించి బంగారం కొనుగోలు చేస్తున్నారు. అదే తెలుగు రాష్ట్రాల దగ్గరికి వచ్చే సరికి ఆన్లైన్లో బంగారం కొనుగోలుకు ఓకే అనేస్తున్నారు. ఇటీవల ఫోన్ పే సంస్థ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. దేశ్యాప్తంగా ఫోన్పే యాప్ ద్వారా అత్యధికంగా బంగారం కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు నాలుగు ఐదు స్థానాల్లో నిలిచాయి. వీటికంటే ముందు మహరాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఫోన్పే యాప్ ద్వారా 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ నంబర్ 1 ఫోన్పేకు తెలంగాణ ప్రజలు జై కొడుతున్నారు. ఆన్లైన్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు ఇతర యాప్ల కంటే ఫోన్పేను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫోన్పే తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశం వెలుగు చూసింది. ఆన్లైన్ ట్రాన్స్క్షన్స్కి సంబంధించి యూనైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఏ) ఆధారంగా అనేక యాప్స్ సేవలు అందిస్తున్నాయి. అయితే తెలంగాణలో జరుగుతున్న ఆన్లైన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో 42 శాతం తమ యాప్ ద్వారానే జరుగుతున్నాయని ఫోన్ పే వెల్లడించింది. తెలంగాణ తర్వాత గోవా 36 శాతం, హర్యానాలో 35 శాతం ఫోన్పే ద్వారానే ట్రన్సాక్షన్స్ జరుగుతున్నట్టు వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ వినియోగదారుల సంఖ్యకు సంబంధించి ఫోన్పేను అత్యధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో కర్నాటక ప్రథమ స్థానంలో నిలిచింది. కర్నాటక తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఫోన్పే యాప్ వినియోగం ఎక్కువగా ఉంది. కరోనా సంక్షోభం మొదలైన తర్వాత ఫోన్ పే కస్టమర్ల సంఖ్య వంద శాతం పెరగగా లావాదేవీల సంఖ్య 150 శాతం పెరిగినట్టు ఆ సంస్థ వెల్లడించింది. టైర్ టూ సిటీల్లోనే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి టైర్ 1 సిటీల్లో ఎక్కువగా వ్యాపార సంబంధమైన లావాదేలు జరుగుతున్నాయి. అదే టైర్ 3 సిటీస్కి వచ్చే సరికి వ్యాపార లావాదేవీల కంటే ఇంటి రెంటు, హోటల్ బిల్లు ఇలా వ్యక్తి నుంచి వ్యక్తికి సంబంధించి లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. టైర్ 3 సిటీస్లో వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే ఆర్థిక లావాదేవీల వాటా 49 శాతానికి చేరుకోగా వ్యాపార సంబంధమైన లావాదేవీలు 32 శాతానికి పరిమితమయ్యాయి. అదే టైర్ 1 విషయానికి వస్తే ఇక్కడ వ్యాపార లావాదేవీల వాటా 52 శాతంగా నమోదు అయ్యింది. ఇక్కడ వ్యక్తుల నుంచి వ్యక్తులకు 36 శాతం, రీఛార్జీలు, కరెంటు బిల్లులు చెల్లింపులు 11 శాతంగా నమోదు అయ్యాయి. పెరిగిన లావాదేవీలు ప్రధాని నరేంద్ర మోదీ 2016 నవంబరులో పెద్ద నోట్లు రద్దు చేసినప్పటి నుంచి ఆర్థిక లావాదేవీలు ఆన్లైన్లో చేయడం మొదలైంది. అయితే 2020 మార్చిలో కరోనా సంక్షోభం మొదలైన తర్వాత ఒక్కసారిగా ఆన్లైన్లో లావాదేవీలు నిర్వహించే వారి సంఖ్య పెరిగింది. 2020 మార్చికి ముందు దేశవ్యాప్తంగా ఆన్లైన్లో జరిగే ఆర్థిక లావాదేవీ విలువ ప్రతీరోజు సగటు 2 లక్షల కోట్లు ఉండగా ప్రస్తుతం అది 6 లక్షల కోట్లకు చేరుకుంది. నాలుగేళ్లలో రాని మార్పు కేవలం 18 నెలల్లోనే మూడింతలు అయ్యింది. చదవండి: భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే? -
యూఏఈ: భారతీయులకు గుడ్ న్యూస్
అబుదాబి: యూఏఈ వెళ్లే భారతీయులకు గుడ్న్యూస్. ఆన్లైన్ పేమెంట్ల విషయంలో భారతీయ సందర్శకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు లైన్ క్లియర్ అయ్యింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) ద్వారా చెల్లింపులు చేసేందుకు వీలు కల్పించింది యూఏఈ. తద్వారా UPI పేమెంట్లకు అనుమతి ఇచ్చిన మూడో దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిలిచింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NCPI).. మష్రెక్యూ బ్యాంక్ భాగస్వామ్యంతో యూపీఐ పేమెంట్ అవకాశం కల్పించనుంది. ఇండియాలో ఎలాగైతే యూపీఐ సిస్టమ్ను ఉపయోగించుకుంటున్నారో.. యూజర్లు ఇక అదే రీతిలో విదేశీ ట్రాన్జాక్షన్లు చేసుకోవచ్చు. తద్వారా వ్యాపార, ఇతరత్ర వ్యవహారాలపై యూఏఈని సందర్శించే 20 లక్షల మంది భారతీయులకు లబ్ది చేకూరనుందని అంచనా వేస్తున్నారు. సందర్శకులతో పాటు యూఏఈ వాసులకు సైతం క్యాష్లెష్ పేమెంట్స్కు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడనుందని ఎఐపీఎల్ సీఈవో రితేష్ శుక్లా వెల్లడించారు. ఇంతకు ముందు సింగపూర్, భూటాన్లు యూపీఐ పేమెంట్స్కు అనుమతి ఇచ్చాయి. భారత్లో మొత్తం 50 థర్డ్పార్టీ యూపీఐ యాప్స్ ఉండగా.. అందులో ఫోన్పే, గూగుల్పే, పేటీఎం, అమెజాన్ పే మార్కెట్లో పాపులర్ అయ్యాయి. చదవండి: అఫ్గన్ కార్మికుల సంగతి ఏంటి? ప్రయాణికులకు ఊరట పాస్పోర్టులు ఉన్న భారతీయ ప్రయాణికులు టూరిస్ట్ వీసాలపై తమ దేశంలోకి రావడానికి అనుమతి ఇస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్లో కాకుండా విదేశాల్లో గత 14 రోజులుగా ఉన్న భారతీయులు మాత్రమే రావచ్చని స్పష్టం చేసింది. ఇదే సౌకర్యాన్ని నేపాల్, నైజీరియా, పాకిస్థాన్, శ్రీలంక, ఉగాండా ప్రయాణికులకూ కల్పిస్తున్నట్లు యూఏఈ వివరించింది. యూఏఈ చేరుకున్న రోజుతో పాటు తొమ్మిదో రోజు కూడా ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: భార్య ఎఫైర్లన్నీ వెబ్సైట్లో.. సొంతవాళ్లపైనే భర్త అఘాయిత్యాలని ఆరోపణలు -
మీ ఫోన్ పోతే యూపీఐ యాప్స్ ను ఎలా బ్లాక్ చేయాలి?
భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యుపీఐ) టెక్నాలజీ సహాయంతో పేటిఎమ్, గూగుల్ పే, ఫోన్ పే వంటి ఇతర పేమెంట్ యాప్స్ పనిచేస్తున్నాయి. చాలా మంది వినియోగదారులు యుపీఐతో లింక్ చేయబడిన వారి ఫోన్లలో కనీసం ఈ మూడింటిలో ఒక పేమెంట్ యాప్స్ అయిన కలిగి ఉన్నారు. యుపీఐ ద్వారా ఎవరికైనా డబ్బును క్షణాలలో బదిలీ చేయవచ్చు. ఎవరైనా మీ ఫోన్ యాక్సెస్ చేస్తే వారు డబ్బును బదిలీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ పేమెంట్ యాప్స్ గల స్మార్ట్ ఫోన్ ఎవరైనా దొంగలిస్తే ఏమి జరుగుతుంది?. వారు మీ బ్యాంకులో ఉన్న మొత్తం నగదును డ్రా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫోన్ కోల్పోయినట్లయితే లేదా ఎవరైనా దొంగలిస్తే ఈ సర్వీసులు యాక్సెస్ చేసుకోకుండా మనం చేయవచ్చు. మీ ఫోన్ పోతే పేటిఎమ్, గూగుల్ పే, ఫోన్ పేని మీరు ఏ విధంగా బ్లాక్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా బ్లాక్ చేయడం వల్ల వారు మీ ఖాతాలో నుంచి డబ్బును డ్రా చేయలేరు. పేటిఎమ్ ఖాతాను తాత్కాలికంగా ఎలా బ్లాక్ చేయాలి? పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ హెల్ప్ లైన్ నెంబరు 01204456456కు కాల్ చేయండి. పోయిన ఫోన్ కొరకు ఆప్షన్ ఎంచుకోండి. వేరే నెంబరు నమోదు చేయడానికి ఆప్షన్ ఎంచుకోండి, మీ కోల్పోయిన ఫోన్ నెంబరును నమోదు చేయండి. అన్ని పరికరాల నుంచి లాగ్ అవుట్ అయ్యే ఆప్షన్ ఎంచుకోండి. తరువాత, పేటిఎమ్ వెబ్ సైట్ కు వెళ్లండి, 24ఎక్స్7 హెల్ప్ఎంచుకోవడానికి దిగువకు స్క్రోల్ చేయండి. Report a Fraud అనే దాన్ని ఎంచుకోండి, ఏదైనా కేటగిరీపై క్లిక్ చేయండి. తర్వాత, ఏదైనా సమస్యపై క్లిక్ చేయండి, ఇప్పుడు దిగువన ఉన్న Message Us బటన్ మీద క్లిక్ చేయండి. పేటిఎమ్ ఖాతా లావాదేవీలను చూపించే డెబిట్/క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పేటిఎమ్ మీ ఖాతాను ధ్రువీకరిస్తుంది, బ్లాక్ చేస్తుంది. తర్వాత మీరు ధృవీకరణ సందేశాన్ని అందుకుంటారు. గూగుల్ పే ఖాతాను ఎలా బ్లాక్ చేయాలి గూగుల్ పే వినియోగదారులు హెల్ప్ లైన్ నంబర్ 18004190157కు కాల్ చేసి మీ మాతృ భాషను ఎంచుకోండి. ఇతర సమస్యలకు సరైన ఆప్షన్ ఎంచుకోండి. మీ Google Payకు ప్రత్యామ్నాయంగా ఆండ్రాయిడ్ వినియోగదారులు తమ డేటాను రిమోట్ వైప్ చేయవచ్చు. తద్వారా ఫోన్ నుంచి మీ గూగుల్ ఖాతాను ఎవరూ యాక్సెస్ చేసుకోలేరు. ఐఓఎస్ వినియోగదారులు కూడా తమ డేటాను రిమోట్ ఆప్షన్ ద్వారా బ్లాక్ చేయవచ్చు. ఫోన్ పే ఖాతాను ఎలా బ్లాక్ చేయాలి ఫోన్ పే వినియోగదారులు 08068727374 లేదా 02268727374 కాల్ చేయాల్సి ఉంటుంది. మీ మాతృ భాషను ఎంచుకున్న తరువాత, మీ ఫోన్ పే ఖాతాతో సమస్యను నివేదించాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతారు అప్పుడు దానికి తగిన నెంబరును నొక్కండి. ఇప్పుడు రిజిస్టర్డ్ నెంబరు నమోదు చేయండి. ధృవీకరణ కొరకు మీకు ఓటీపీ పంపబడుతుంది. తర్వాత ఓటీపీ అందుకోనందుకు ఆప్షన్ ఎంచుకోండి. దీని వల్ల సీమ్ లేదా మొబైల్ నష్టం గురించి మీకు ఆప్షన్ రిపోర్ట్ ఇవ్వబడుతుంది, దానిని ఎంచుకోండి. ఫోన్ నెంబరు, ఇమెయిల్ ఐడి, చివరి పేమెంట్, చివరి లావాదేవీ విలువ మొదలైన కొన్ని వివరాలను పొందిన తరువాత మీ ఫోన్ పే అకౌంట్ ని బ్లాక్ చేయడంలో మీకు సహాయపడే ప్రతినిధితో మీరు కనెక్ట్ అవుతారు. -
ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. ఆన్ లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యుపీఐ, యోనో, యోనో లైట్ సేవలు శుక్రవారం రాత్రి 150 నిమిషాల పాటు నిలిచిపోనున్నట్లు పేర్కొంది. "మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడానికి మేము కృషి చేస్తున్నాము, గౌరవనీయ ఖాతాదారులు మాకు సహకరించగలరని అభ్యర్థిస్తున్నాము" అని ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఎస్బీఐ కస్టమర్లు జూలై 16 రాత్రి 10:45 నుంచి జూలై 17 ఉదయం 1.15 గంటల వరకు 150 నిమిషాలపాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యుపిఐ, యోనో మరియు యోనో లైట్ సర్వీసులను యాక్సెస్ చేసుకోలేరని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక "ముఖ్యమైన నోటీసు"లో తెలిపింది. ఈ సమయంలో ఎటువంటి లావాదేవీలు చేయకపోవడం మంచిది. -
ఫోన్పే కస్టమర్లకు గుడ్న్యూస్.. క్షణాల్లో డెలివరీ పేమెంట్ చెల్లింపు
డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే, ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో పే-ఆన్-డెలివరీ ఆర్డర్ల కోసం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా "క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకున్న వినియోగదారులు ప్రొడక్ట్ డెలివరీ సమయంలో ఫోన్ పే యుపీఐ ద్వారా డిజిటల్ గా చెల్లించడానికి వీలు కల్పిస్తుంది" అని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా మహమ్మారి సమయంలో యూజర్ల వ్యక్తిగత భద్రతపై దృష్టి పెట్టినట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఫోన్ పే బిజినెస్ డైరెక్టర్ అంకిత్ గౌర్ మాట్లాడుతూ.. "డిజిటల్ చెల్లింపుల కోసం గత కొన్ని సంవత్సరాలుగా యుపీఐ యాప్స్ను విస్తృతంగా వినియోగిస్తున్నందుకు ధన్యవాదాలు. డెలివరీ సమయంలో కొంతమంది కస్టమర్లు క్యాష్ ఆన్ డెలివరీ చేయడంతో వీటి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ నగదు ఆధారిత చెల్లింపులను డిజిటైజ్ చేయడం కేవలం ఈ-కామర్స్కు మాత్రమే కాకుండా డిజిటల్ ఇండియా పెద్ద లక్ష్యానికి దోహదపడుతుంది" అని అన్నారు. ఈ ఒప్పందం వల్ల ఫ్లిప్కార్ట్ క్యాష్ ఆన్ డెలివరీ సమయంలో కాంటాక్ట్ లెస్ పేమెంట్లు చేయడం కొరకు కస్టమర్లు ఫోన్ పే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చాలామంది కస్టమర్లు తమ అవసరాల కోసం ఆన్లైన్ షాపింగ్కు మారారని, పే ఆన్ డెలివరీ ఎంచుకునే కస్టమర్లకు పేమెంట్ సమయంలో మనశ్శాంతితో ఇకనుంచి పేమెంట్స్ చేయొచ్చని ఫ్లిప్కార్ట్లో ఫిన్టెక్ అండ్ గ్రూప్ హెడ్ రంజిత్ బోయనపల్లి అన్నారు. -
10 కోట్లు దాటిన భారత్పే యూపీఐ లావాదేవీలు
న్యూఢిల్లీ: ఫిన్టెక్ కంపెనీ భారత్ పే ఈ ఏడాది మార్చి నెలలో 10.6 కోట్ల యూపీఐ (830 మిలియన్ డాలర్ల విలువ) లావాదేవీలను సాధించింది. 2021-22లో యూపీఐ విభాగంలో మూడు రెట్ల వృద్ధిని లక్షించినట్లు కంపెనీ తెలిపింది. ఫిన్టెక్ పరిశ్రమలో భారత్పే 8.8 శాతం మార్కెట్ వాటాను కలిగింది. గత ఏడాది కాలంగా భారత్పే యూపీఐ పర్సన్ టు మర్చంట్ (పీ2ఎం) విభాగం శరవేగంగా అభివృద్ధి చెందింది. నగరాలలో కంటే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో పీ2ఎం లావాదేవీలు పెరిగాయని భారత్పే గ్రూప్ అధ్యక్షుడు సుహైల్ సమీర్ తెలిపారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో యూపీఐ లావాదేవీ పరిమాణం ఏడు రెట్లు వృద్ధి చెందింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య యూపీఐ చెల్లింపులు 23.7 శాతం పెరిగాయి. కరోనా నేపథ్యంలో దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగాయని.. దీంతో గత 12 నెలల్లో భారత్పే సేవలు 30 నగరాల నుంచి వంద నగరాలకు విస్తరించామని పేర్కొన్నారు. 2022 ఆర్ధిక సంవత్సరంలో మరొక వంద నగరాలకు విస్తరించాలని లక్షించినట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం 40 లక్షలుగా ఉన్న మర్చంట్ల సంఖ్యను 60 లక్షలకు చేర్చాలని టార్గెట్ పెట్టుకున్నామని చెప్పారు. 2023 మార్చి నాటికి భారత్పే చెల్లింపుల వ్యాపారం మూడు రెట్లు వృద్ధితో 30 బిలియన్ డాలర్ల టీపీవీ (టోటల్ పేమెంట్స్ వ్యాల్యూ)కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. చదవండి: బ్యాంకు ఖాతాదారులకి ఆర్బీఐ అలర్ట్! -
భీమ్ యాప్లో లోపం?
ముంబై: యూపీఐ ఆధారిత భీమ్ యాప్లో లోపాలున్నాయంటూ కొందరు ఎథికల్ హ్యాకర్లు సోమవారం ఓ వెబ్సైట్ ద్వారా హెచ్చరించారు. అయితే ఈ ఆరోపణలను యాప్ నిర్వహణ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) కొట్టేసింది. 13.6 కోట్ల డౌన్లోడ్లు ఉన్న ఈ యాప్లో ఉన్న ఓ లోపం ద్వారా కీలక సమాచారం లీకవుతోందని హ్యాకర్లు వీపీఎన్ మెంటర్ వెబ్సైట్ ద్వారా హెచ్చరించారు. కొన్ని ప్రాథమిక భద్రతా ప్రమాణాలు పాటిస్తే ఈ ముప్పు తప్పి ఉండేదన్నారు. భీమ్ మొబైల్ పేమెంట్ యాప్ ద్వారా భారీ స్థాయిలో వినియోగదారుల ఆర్థిక సమాచారం పబ్లిక్కు అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రొఫైల్స్, లావాదేవీలు, ఆధార్, పాన్, కాస్ట్ సర్టిఫికెట్, రెసిడెన్స్ ప్రూఫ్, ఇతర ప్రొఫెషనల్ సర్టిఫికెట్ల వంటి 409 జీబీల సమాచారం ప్రమాదం బారిన పడినట్లు చెప్పారు. అయితే భీమ్ యాప్ సురక్షితమేనని, ఎలాంటి సమాచారం లీక్ కాలేదని ఎన్పీసీఐ స్పష్టంచేసింది. -
సింగపూర్లోనూ భీమ్ యాప్
సింగపూర్: దేశీయంగా చెల్లింపులకు వినియోగిస్తున్న యూపీఐ ఆధారిత భీమ్ యాప్. అంతర్జాతీయంగానూ అడుగుపెడుతోంది. తాజాగా సింగపూర్ ఫిన్టెక్ ఫెస్టివల్లో దీన్ని ప్రదర్శించారు. సింగపూర్లో భారత హై కమిషనర్ జావేద్ అష్రాఫ్... భీమ్ యాప్తో క్విక్ రెస్పాన్స్ కోడ్ను (ఎస్జీక్యూఆర్) స్కాన్ చేసి, చెల్లింపులు జరిపే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూపించారు. భీమ్ యాప్ ఇతర దేశాల్లో వినియోగించడం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. 2020 ఫిబ్రవరి నాటికి సింగపూర్లో ఇది పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నెట్వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్ (సింగపూర్) సంస్థలు దీనిపై కసరత్తు చేస్తున్నాయి. అదే సమయానికి దేశీ రూపే కార్డులు కూడా సింగపూర్లో చెల్లుబాటయ్యేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అష్రాఫ్ పేర్కొన్నారు. -
ఉబెర్ చెల్లింపులకు యూపీఐ యాప్
బెంగళూరు: ఆన్లైన్ మాధ్యమంలో చెల్లింపులను సులభతరం చేసే ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ) మరింతగా ప్రాచుర్యంలోకి వస్తోంది. దీని ద్వారా నగదు బదిలీ లావాదేవీలు నిర్వహించే సంస్థల జాబితాలో తాజాగా ట్యాక్సీ సర్వీసుల కంపెనీ ఉబెర్, ఈకామర్స్ సంస్థ అమెజాన్ కూడా చేరనున్నాయి. ఇవి రెండూ కూడా తమ లావాదేవీలకు యూపీఐ ఆధారిత భీమ్ యాప్ను వినియోగించడం ఈ నెల నుంచే ప్రారంభించనున్నాయి. అటు సెర్చి దిగ్గజం గూగుల్ కూడా ఇదే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే తమ సేవలకు సంబంధించి యూపీఏ పేమెంట్ సర్వీసుల విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించడం పూర్తి చేసింది. దీన్ని అమల్లోకి తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఎండీ ఏపీ హోతా ఈ విషయాలు తెలిపారు. ‘వాట్సాప్, ఫేస్బుక్, గూగుల్ మొదలైన కంపెనీలు కూడా యూపీఐ విధానాన్ని ఉపయోగించే క్రమంలో ఉన్నాయి. చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఇవి సాకారం కాగలవు. ఇప్పటికే టెస్టింగ్ మొదలైనవి పూర్తి చేసుకున్న గూగుల్ .. మిగతా వాటన్నింటికన్నా ముందుగా దీన్ని అందుబాటులోకి తేవొచ్చు‘ అని ఆయన వివరించారు. -
ఆంధ్రా బ్యాంక్ వన్
టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోన్న యుగమిది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం స్మార్ట్ఫోన్ చుట్టే తిరుగుతోంది. అందుకు ఆర్థిక లావాదేవీలకు మీ ఫోన్నే బ్యాంకుగా మార్చేసుకోండి. సులభంగా డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది ఎలా అంటే.. కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే యూపీఐ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే పలు బ్యాంకులు వాటి యూపీఐ యాప్లను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చాయి. వాటిల్లో మనమిప్పుడు ‘ఆంధ్రా బ్యాంక్ వన్’ అనే యూపీఐ యాప్ గురించి తెలుసుకుందాం. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు ⇔ ఒకే మొబైల్ యాప్ ద్వారా పలు బ్యాంక్ ఖాతాలనుఆపరేట్ చేయవచ్చు. ⇔ వర్చ్యువల్ పేమెంట్ అడ్రస్ ద్వారా ఏ బ్యాంక్ ఖాతాకైనా సులభంగా డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్క డ ఖాతా నెంబర్, ఐఎఫ్ఎ‹స్సీ కోడ్లతో పనిలేదు. ⇔ బ్యాంక్ ఖాతా నెంబర్, ఐఎఫ్ఎ‹స్సీ కోడ్ సాయంతో కూడా డబ్బుల్ని ఇతరులకు పంపే ఆప్షన్అందుబాటులో ఉంది. ⇔ అలాగే వర్చ్యువల్ పేమెంట్ అడ్రస్ కలిగిన ఎవరి నుంచైనా డబ్బుల్ని తీసుకోవచ్చు. ⇔ లావాదేవీలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే.. వాటి గురించి యాప్ ద్వారానే ఫిర్యాదు చేయవచ్చు.