YSR Housing Scheme
-
ఇళ్లు కాదు.. ఊళ్లు: అవధులు లేని సంతోషం.. సీఎం జగన్ మేలు మరిచిపోలేం..
ఒకప్పుడు పేదల కోసం ఇళ్లు నిర్మిస్తున్నారని అనేవారు.. ఇప్పుడు ఆ వాక్యం మారిపోయింది. వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తర్వాత పేదల కోసం ఇళ్లు కాదు.. ఏకంగా ఊళ్లు నిర్మిస్తున్నారు.. ఆ ఊళ్లు కూడా వేయి కాదు రెండు వేలు కాదు.. ఏకంగా 17 వేల దాకా రాబోతున్నాయి. దీన్నే పేదలందరికీ ఇళ్ల పథకం అంటారు.. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా వాటిలో ఉచితంగా ఇళ్లు కట్టిస్తున్నారు. దాంతో ఈ పథకం రెండు దశలు పూర్తయ్యేలోగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 31 లక్షల కుటుంబాల సొంత ఇంటి కల నెరవేరబోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రతి విషయంలోనూ నాణ్యత వుండేలా చూస్తున్నారు. ఎక్కడికక్కడ చకచకా పనులు జరిగిపోతున్నాయి. చదవండి: ఏపీ ప్రభుత్వ సంకల్పం.. పింఛను నుంచి ఇంటి పట్టాల దాకా ప్రజా సంకల్ప యాత్రలో ఇల్లులేని నిరు పేదల కష్టాలు చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ.. అధికారంలోకి రాగానే పేదలందరికీ ఇళ్ల పథకం మొదలుపెట్టారు. ఇప్పటికే ప్రభుత్వం లక్షలాది మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చింది. కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం పనులు జరిగిపోతున్నాయి. అద్దె ఇళ్లలో వుంటూ నెల నెలా అద్దెలు కట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నవారు, గుడిసెల్లో నివసిస్తూ పక్కా ఇంటి కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నవారు ఇప్పుడు తమ తమ ఇంటి నిర్మాణాల్లో బిజీ అయిపోయారు. నిర్మాణం పూర్తి కాగానే శుభ ఘడియలు చూసుకొని గృహ ప్రవేశం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పల్లపు ఆనందపురంలో ఇంతకాల అద్దె ఇంట్లో నివసిస్తున్న ప్రసాద్ దంపతులు ఈ మధ్యనే ఈ ఇంట్లోకి వచ్చారు. మేస్త్రీ పని చేసే ప్రసాద్ ఆ పని ద్వారా పది మందికి ఇళ్లు కట్టిస్తున్నారు తప్ప ఇంతకాలం ఈయనకంటూ సొంత ఇళ్లు వుండేది కాదు. ఇదే గ్రామంలో వేయి రూపాయలు అద్దె చెల్లిస్తూ అద్దె ఇంట్లో నివసిస్తూ వుండేవాడు. ఒక వైపు అద్దె బాధలు, మరో వైపు అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఇక సొంతంగా ఇళ్లు కట్టుకోవడం కష్టమనుకుంటున్న దశలో వీరికి శుభవార్త అందింది. చదవండి: విప్లవాత్మక నిర్ణయం.. వారి కళ్లలో ఆనందం వివాహమైన తర్వాత ఎనిమిదేళ్లుగా నానా ఇబ్బందులు పడ్డ ఈ జంట ఇప్పుడు కాస్త ధైర్యంగా సంతోషంగా వుంది. పేదలు అందరికీ ఇళ్ల పథకం కింద గ్రామంలో ప్రధాన రహదారికి ఆనుకొని విలువైన స్థలం కేటాయించారని ...అందులో ఇళ్లు కట్టుకోవడానికి సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు అందరూ కలిసి చక్కగా సహకరించారని నాగిని చెబుతున్నారు. ప్రసాద్ స్వయంగా మేస్త్రీ కావడంతో నిర్మాణ పని కూడా చాలా సులువుగా, అందంగా జరిగిపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలు సమాజంలోని పేదలకు చక్కగా ఉపయోపడుతున్నాయని మహిళలు మరింత బాగా లబ్ధి పొందుతున్నారని నాగిని చెబుతోంది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మంచాల గ్రామంలో వీర్ల వెంకయ్య, సామ్రాజ్యం దంపతులు జీవిస్తున్నారు. వీరిని చూస్తే తెలుస్తుంది. వీరు ఎంత పేదవారో.. ఈ పేద దంపతులు ప్రస్తుతం నివసిస్తున్న ఈ గుడిసె శిథిలావస్థకు చేరుకుంది. కూలీ పనులు చేసుకునే వీరయ్య దంపతులు చెరువుకట్ట పక్కనే గుడిసె వేసుకొని దశాబ్దాలుగా ఇక్కడే జీవిస్తున్నారు. ఇదే గుడిసెలోనే కొడుకు కోడలు మనుమడు మనుమరాలు కూడా వీరితోనే వుంటున్నారు. వర్షం వస్తే గడిసెలోకి నీరు వస్తుంది. గట్టిగా గాలి వస్తే పై కప్పు ఎగిరిపోతుంది..అయినా సరే గత్యంతరం లేని పరిస్థితుల్లో నలభైసంవత్సరాలుగా ఇలాగే కాలం గడిపిన వీరయ్య దంపతులకు వైఎస్ జగన్ పాలనలో మంచిరోజులు వచ్చాయి. ఎందుకంటే వీరికోసం ఇదిగో మనం చూస్తున్న ఈ నాణ్యమైన విలువైన పక్కా గృహం సిద్దమవుతోంది. గ్రామవార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ఇలాంటి పేదల జీవితాలు మారిపోతున్నాయనడానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాలంటీర్లు స్వయంగా వీరి దగ్గరకు వచ్చి వీరికొచ్చే పథకాలను వివరించి వీరికి మార్గదర్శనం చేస్తున్నారు. వీర్ల వెంకయ్య విషయంలో కూడా ఇదే జరిగింది.. మీకు స్థలమొస్తోంది. అందులో ఇళ్లు కడతారు అని గతంలో చెప్పినప్పుడు ఈ పేద దంపతులు నమ్మలేదు. కానీ చేతికి పట్టా రావడం, ఆ పట్టా తాలూకా స్థలంలో ఇళ్లు కడుతుండడం చూసేసరికి వీరికి ఇది కలా నిజామా అనిపిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఎంతో ఉన్నతమైన పథకం పేదలందరికీ ఇళ్ల పథకం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నరదశాబ్దాలు అవుతున్న ఈ తరుణంలో ఇంకా గుడిసెల్లోనే నివసించే పేదలు కనిపించడం దురదృష్టకరం. వీరి జీవితాల్లో మార్పులు తేవాలని వీరు నాణ్యమైన జీవితాలు గడపాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహా సంకల్పం. ఈ మంచాల గ్రామాన్నే తీసుకుంటే ఈ గ్రామంలో ఇళ్లు లేని పేద కుటుంబాలు 76 వున్నాయి. వీరికోసం కోటి రూపాయలు ఖర్చు చేసి ఎకరం 86 సెంట్ల భూమిని కొనుగోలు చేసి ఆ తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ఇళ్లు నిర్మించారు. ప్రస్తుతం మౌలిక సదుపాయాలను కల్పించే పనిని చేస్తున్నారు. త్వరలో వీర్ల వెంకయ్య కుటుంబంతోపాటు ఇతర లబ్ధిదారులు ఈ ఇళ్లలో గృహ ప్రవేశం చేయనున్నారు. కూలీ పనులు చేసుకునేవారు సంపాదించే కూలీడబ్బులు ఏ రోజుకు ఆ రోజు పొట్టపోసుకోవడానికే సరిపోతోంది.. ఎంతో కొంత మిగిలితే ఆ మిగిలిన డబ్బు అత్యవసర సమయాల్లో ఖర్చయిపోతుంటుంది. దాంతో ఇలాంటి వేలాది కుటుంబాలు సొంతంగా ఇళ్లు కట్టుకోవడమనేది కలలో జరిగే విషయమే. ఇలాంటప్పుడే ప్రభుత్వం అండదండలందించి పథకాలందించి వీరిని అన్ని విధాలా బలోపేతం చేయాలి. వీరి తలరాతలు మార్చాల్సి వుంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అదే పని జరుగుతోంది. లక్షలాది కుటుంబాలు అభివృద్ధి బాటలో పడ్డాయి. అటు పథకాల ద్వారా ఇటు సొంతిళ్ల ద్వారా వేలాది కుటుంబాలు దారిద్య్ర రేఖను దాటబోతున్నాయి. ఇంతకాలం పడ్డ కష్టాలు ఒక్కటొక్కటిగా తొలగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్షలాది రూపాయల విలువైన ఆస్తికి మహిళలు యజమానులవుతున్నారు. మహిళా సాధికారతకు సరికొత్త నిర్వచనం ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ సర్కార్ వేస్తున్న అడుగులు లక్షలాది కుటుంబాల్లో వెలుగు దీపాలవుతున్నాయి. ఇది పైలా అప్పారావు, భవాని దంపతుల ఇల్లు. పేదలందరికీ ఇళ్ల పథకం కింద వీరు నిర్మించుకున్న గృహమిది. విశాఖనగరం శ్రీనివాసనగర్లో రోడ్డు పక్కనే ఈ ఇల్లు వుంది. ఇంతకాలం అద్దె ఇంట్లో వున్న అప్పారావు దంపతులు ఇప్పుడు తమకంటూ సొంత ఇల్లు సంపాదించుకున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఇల్లు కట్టుకోలేమో అనే బెంగతో చాలా కాలంపాటు తీవ్ర మానసిక వేదన అనుభవించిన వీరు ఇప్పుడు సంతోషంగా వున్నారు. విశాఖలాంటి మహానగరంలో ఒక చిన్న గూడు లభించదనే ఆనందం ఈ చిన్న కుటుంబంలో స్పష్టంగా కనిపిస్తోంది. అప్పారావు భవానీలది కులాంతర వివాహం. దాంతో వీరు కొంతకాలంపాటు తమ పెద్దవాళ్ల కోపానికి గురయి ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఇరు వైపు కుటుంబాలనుంచి సమస్యలు లేవు. అదే సమయంలో ఈ జంటకు సొంత ఇల్లు సమకూరింది. పిల్లలకు అమ్మ ఒడి పథకం కూడా అందుతోంది. ఇంటినిర్మాణ సమయంలో వచ్చిన సమస్యల్ని వైఎస్సార్ సీపీ నేతలు, గ్రామవార్డు సచివాలయాల సిబ్బంది అందరూ కలిసి పరిష్కరించారని భవానీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. విశాఖ జిల్లా నుంచి చిత్తూరు జిల్లాకు వద్దాం..మనం చూస్తున్న ఈ జగనన్న ఇళ్ల కాలనీ తవణంపల్లి మండలం అరగొండలో వుంది. ఎటు చూసినా చకచకాఇళ్ల నిర్మాణం జరిగిపోతోంది. స్థానికంగా ఆటో డ్రైవర్గా పని చేస్తున్న నూరుల్లా చాలా కాలంగా అద్దె ఇంట్లోనే వుండేవాడు. ఆటో మీద వచ్చే ఆదాయంనుంచే అద్దె కట్టుకుంటూ మిగిలిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. ఈ పేద కుటుంబం బతకడమే కష్టంగా వున్న తరుణంలో పేదలందరికీ ఇళ్ల పథకం అందుబాటులోకి వచ్చింది. నూరుల్లా భార్య హసీనా పేరు మీద స్థలం, ఇళ్లు వచ్చాయి. అరగొండలోనే జయరాజ్, వనిత దంపతులు తమ ఇంటిని నిర్మించుకుంటూ కనిపించారు. వీరిది కూడా పేద కుటుంబమే ..జయరాజ్ పెయింటర్గా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్లు రావడంతో ఈ దంపతులిద్దరూ కలిసి తామే దగ్గరుండి కట్టుకుంటున్నారు. కుదిరిన మేరకు పనులన్నీ చకచకా చేసుకుంటున్నారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణం పండగలాగా కొనసాగుతోంది. ప్రభుత్వం అన్నీ సమకూరుస్తుండడంతో, నిర్మాణానికి కావాల్సిన నీటి సౌకర్యం కూడా కల్పించడంతో ఎక్కడికక్కడ పనులు సులువుగానే జరిగిపోతున్నాయి. ఇక్కడ ఇళ్లు కట్టుకుంటున్న వారిలో కవిత కుటుంబం కూడా వుంది. కవిత భర్త సతీష్ తోపుడు బండి పెట్టుకొని ఉపాధిపొందుతున్నారు. ఇలాంటి ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలదాకా నిర్మాణమవుతున్నాయి. వీటిని కట్టడంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర ముఖ్య అధికారులు సమన్వయంతో పని చేస్తూ ఈ పనులు నాణ్యంగా కొనసాగేలా చూస్తున్నారు. వేలాది జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పన కూడా చకచకా సాగిపోతోంది. ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞం కారణంగా వేలాది కుటుంబాలకు సొంత ఇళ్లు రావడమే కాకుండా లక్షలాదిమందికి ఉపాధి పనులు కూడా లభిస్తున్నాయి. -
6 వేలకు పైగా ఎకరాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు: మంత్రి అవంతి శ్రీనివాస్
-
జగనన్న కాలనీలను పరిశీలించిన మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు
-
కళ్ల నిండా ఆనందం.. సందడిగా ఇళ్ల పట్టాల పంపిణీ
-
నిరుపేదల గృహాల కోసం 5 శాతం భూమి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేట్ లేఅవుట్లలో 5 శాతం భూమిని నిరుపేదల గృహాల కోసం వైఎస్సార్, జగనన్న హౌసింగ్ ప్రాజెక్ట్కు కేటాయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి సోమవారం గెజిట్ విడుదల చేశారు. ప్రైవేట్ లేఅవుట్ యజమానులు, అభివృద్ధిదారులు 5 శాతం భూమిని సంబంధిత జిల్లా కలెక్టర్కు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: ఇరిగేషన్ పనులకు మాత్రమే.. ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసే లేఅవుట్లో 5 శాతం స్థలం కేటాయించడానికి ఇష్టం లేకపోతే.. అదే లేఅవుట్కు 3 కి.మీ పరిధిలో మరో చోట ఆ మేరకు భూమిని కేటాయించవచ్చు. లేని పక్షంలో 5 శాతం భూమి ధరను సంబంధిత మున్సిపాలిటీకి/పట్టణ అభివృద్ధి సంస్థకు చెల్లించవచ్చు. -
ఏపీలో పేదల ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పేదలందరికీ ఇళ్లు’ నిర్మాణ పథకానికి మార్గం సుగమమైంది. రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు పథకంపై హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ మంగళవారం రద్దు చేసింది. దీంతో ఇళ్ల స్థలాలపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను పిటిషనర్లు వెనక్కి తీసుకున్నారు. కాగా, గత నెల 8వ తేదీన పేదలందరికీ స్థలాలు పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పిచ్చిన విషయం తెలిసిందే. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. ఈ మేరకు హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. -
మహిళలకేనా ఇళ్ల పట్టాలు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ సొంత గూడు కల్పించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘పేదలందరికీ ఇళ్లు’ పథకానికి హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ పథకం కింద లబ్దిదారులకు ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని స్పష్టంచేసింది. 25 లక్షల ఇళ్ల పట్టాల మంజూరు నిమిత్తం పలు మార్గదర్శకాలతో 2019 ఆగస్టు 19న ప్రభుత్వం జారీ చేసిన జీవో 367లో... ఇళ్ల పట్టాల కేటాయింపు బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ (బీఎస్వో)–21లోని నిబంధనలు, అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్ట నిబంధనల ప్రకారం జరగాలని చెబుతున్న 3వ మార్గదర్శకాన్ని హైకోర్టు చట్ట విరుద్ధంగా ప్రకటించింది. దాన్ని కొట్టేసింది. అలాగే ఇళ్ల పట్టాల మంజూరు విషయంలో అదనపు మార్గదర్శకాలతో 2019 డిసెంబర్ 2న జారీ చేసిన జీవో 488లోని 10,11,12వ క్లాజులను సైతం కొట్టేసింది. మార్గదర్శకాలను సవరిస్తూ 2020 మార్చి 31న జారీ చేసిన జీవో 99లోని క్లాజ్ బీ (కేటాయింపు ధర), క్లాజ్ సీ (ఇంటి నిర్మాణం)లను కూడా చట్ట విరుద్దమంటూ కొట్టేసింది. ఈ చట్టాలు ఒక దానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయంది. లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను కన్వేయన్స్ డీడ్ రూపంలో ఇచ్చిన నేపథ్యంలో ఆ డీడ్లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీఎస్వో–21, అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్ట నిబంధనలను అనుసరించి చట్ట ప్రకారం లబ్దిదారులకు డీ–ఫాం పట్టా ఇవ్వాలని ఆదేశించింది. అలాగే పట్టాలు మహిళలకే ఇవ్వాలన్న జీవో 367లోని 2వ మార్గదర్శకాన్ని చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తూ దానిని కొట్టేసింది.పట్టాలను అర్హతల ఆధారంగా పురుషులకు, ట్రాన్స్జెండర్లకు సైతం ఇవ్వాలంది. చదవండి: (CM YS Jagan: రైతులకు మంచి ధర రావాలి) సెంటున్నర స్థలంతో చాలా ఇబ్బందులు... సకల సదుపాయాలూ ఉన్న కాలనీలను ఏర్పాటు చేస్తూ... ఆ కాలనీల్లో లబ్దిదారులకు మునిసిపల్ ప్రాంతాలైతే ఒక సెంటు, గ్రామ పంచాయతీల పరిధిలోనైతే ఒకటిన్నర సెంటు స్థలాన్ని ఇంటి నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం కేటాయించింది. అయితే ఇది ఎంత మాత్రం సరిపోదని హైకోర్టు పేర్కొంది. ‘‘దీనివల్ల ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు. అగ్నిప్రమాదాల నుంచి రక్షణ ఉండదు. తాగునీటి సమస్యలుంటాయి. మౌలిక సదుపాయాలు ఉండవు. మురుగు నీరు కూడా బయటకు వెళ్లదు. ఇళ్ల స్థలాలు కేటాయించే ముందు ప్రభుత్వం ఈ ఇబ్బందుల గురించి అధ్యయనం చేసి ఉండాలి. కానీ ప్రభుత్వం ఈ రోజు వరకు అలాంటి అధ్యయనమేదీ చేయలేదు. ఈ అధ్యయనం కోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖలకు చెందిన నిపుణులతో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ తీర్పు కాపీ అందుకున్న నెల రోజుల్లో ఈ కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ తరువాత నెల రోజుల్లో కమిటీ నివేదిక సమర్పించాలి. దాన్ని రెండు స్థానిక పత్రికల్లో ప్రచురించి, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, ఆ తరువాతనే ‘పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ఖరారు చేయాలి’’ అని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఖరారుకు ముందు పర్యావరణ ప్రభావం, ఆరోగ్య సమస్యలు, స్థల విస్తీర్ణం పెంపుదల, తగ్గింపు, అవసరమైతే మరింత భూమిని సేకరించడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలంది. అప్పటి వరకు లబ్దిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది. మహిళలకు ఇళ్ల స్థలాలు కేటాయించడానికి కోర్టు వ్యతిరేకమేమీ కాదని, కానీ కేవలం మహిళలకే కేటాయించడం వివక్ష చూపడమే అవుతుందని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి శుక్రవారం 108 పేజీల తీర్పునిచ్చారు. జీవో 367, జీవో 488, జీవో 99లను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా, తెనాలికి చెందిన పొదిలి శివ మురళి మరో 128 మంది 2020 డిసెంబర్లో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సత్యనారాయణమూర్తి శుక్రవారం తన తీర్పు వెలువరించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల వల్ల రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఆ విధాన నిర్ణయాల విషయంలో న్యాయస్థానాలు తప్పనిసరిగా జోక్యం చేసుకోవాలని తీర్పులో పేర్కొన్నారు. చదవండి: (విద్యుత్ సంక్షోభంపై తక్షణం స్పందించండి) ఐదేళ్ల తరువాత ఇంటిని అమ్ముకోవచ్చుననడం సరికాదు... ఐదేళ్ల తరువాత ఇంటిని అమ్ముకునేందుకు అనుమతినివ్వటాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. ఐదేళ్ల తరువాత ఇంటిని అమ్ముకునేందుకు అనుమతినివ్వడం పేదలందరికీ ఇళ్లు పథకం ఉద్దేశానికి వ్యతిరేకమన్నారు. ఇంటిని అమ్ముకునేందుకు అనుమతినివ్వడం వల్ల ఐదేళ్ల తరువాత ఆ ఇంటి యజమాని తిరిగి ఇల్లు లేని వ్యక్తి అవుతారన్నారు. ఇది పేదలందరికీ ఇళ్ల పథకం ఉద్దేశం ఎంత మాత్రం కాదన్నారు. ఇళ్లు లేని వ్యక్తుల ప్రయోజనాన్ని ఆశించి తీసుకొచ్చిన నిబంధన ఎంత మాత్రం కాదన్నారు. అందువల్ల జీవో 488లోని 10,11,12 మార్గదర్శకాలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి కొట్టేస్తున్నట్లు తన తీర్పులో తెలిపారు. ఇరుకైన ఇళ్లు ఇస్తూ పేదల భవిష్యత్తును సమాధి చేస్తోంది... ఇళ్ల స్థలాలు కేటాయించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలన్నారు. ‘‘అత్యధికులు సరైన వాతావరణం ఉన్న ఇళ్లలో ఉండటం లేదు. ఇలాంటి వారంతా కూడా ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు పలు రిస్క్లు ఎదుర్కొంటున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే ముందు ప్రభుత్వం ఈ రిస్క్లను పరిగణనలోకి తీసుకోలేదు. అంతేకాక ప్రభుత్వం కేటాయించిన ఈ ఒక సెంటు భూమి లబ్దిదారుల పిల్లల ఉద్దరణకు ఎంత మాత్రం సరిపోదు. పిల్లలు సరైన ఇంటిలో పెరగకపోవటం మానవ హక్కుల ఉల్లంఘనే. లబ్దిదారుల భవిష్యత్తును, మానసిక, ఆధ్యాత్మిక, ఆర్థిక, విద్యా, భావోద్వేగ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తగిన వసతిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం అలాంటి వాతావరణం లేని ఇళ్లను ఇస్తూ పేదల భవిష్యత్తును సమాధి చేస్తోంది. ఇరుకైన ఇళ్లలో నివాసం ఉండటంతో పలు అంశాల్లో వారి అభివృద్ధి, పురోగతి మృగ్యమైపోతుంది. చిన్న ఇంటిలో పిల్లలు, వృద్ధులు స్వేచ్ఛగా తిరిగేందుకు ఆస్కారం ఉండదు.’ అని జస్టిస్ సత్యనారాయణ అన్నారు. అప్పీల్కు నిర్ణయం... ఈ తీర్పుపై ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. పేదలందరికీ ఇళ్ల పథకంలోని సదుద్దేశాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో ఈ తీర్పు విఫలమైందని ధర్మాసనానికి నివేదించనుంది. ఈ తీర్పు వల్ల లక్షల మంది లబ్దిదారులు ఇబ్బంది పడతారని, అందువల్ల దీనిపై స్టే ఇవ్వాలని కోరనుంది. విడాకులు తీసుకుంటే భర్త సంగతేంటి? పెళ్లి కాని పురుషులు, భార్య చనిపోయిన వారు, పిల్లలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇళ్ల స్థలాలు పొందేందుకు అనర్హులవుతారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘‘ఇల్లు కేటాయించిన మహిళ భర్త నుంచి విడాకులు తీసుకున్నప్పుడు ఆ భర్త ఇల్లు లేని వ్యక్తి అవుతాడు. ఇలాంటి పరిస్థితిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది. మహిళలకు మాత్రమే ఇంటి స్థలం మంజూరు చేయడం వివక్ష చూçపడమే. ట్రాన్స్జెండర్లు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. యాచన చేస్తూ, ఎలాంటి వసతి లేకుండా బతుకుతున్నారు. సమాజం నుంచి వారు చాలా అవమానాలను ఎదుర్కొంటుంటారు. స్త్రీ, పురుషులతో సమానంగా వీరికీ హక్కులున్నాయి. ట్రాన్స్జెండర్లకు ఇళ్ల స్థలాన్ని తిరస్కరించడం రాజ్యాంగ ఉల్లంఘనే. అందువల్ల మహిళలతో పాటు పురుషులు, ట్రాన్స్జెండర్లకు సైతం స్థలాలు ఇవ్వాలి. పేదలందరికీ ఇళ్ల పథకం ఉద్దేశం ఇళ్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వడమే తప్ప, మహిళలకు ఇవ్వడమన్నది కాదు. ఇళ్ల స్థలాలను కేవలం మహిళలకే ఇవ్వడంలో ఎంత మాత్రం హేతుబద్ధత లేదు. 100 శాతం మహిళలకే కేటాయించడం సమానత్వపు హక్కును హరించడమే’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
జగనన్న కాలనీల్లో వేగంగా కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణాలు
-
పేదలందరికీ ఇల్లు, ఇంటి స్థలాల పంపిణీపై సీఎం జగన్ సమీక్ష
-
పేదల ఇళ్లపై పచ్చ పార్టీ నేతల కుట్ర
-
రాష్ట్రంలో 33 లక్షల ఇళ్ల నిర్మాణం : మంత్రి చెరుకువాడ
-
జగనన్న కాలనిల్లో ముమ్మరంగా ఇళ్ల శంకుస్థాపనలు
-
ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్
-
పేదల ఇళ్లపై చంద్రబాబు నీచ రాజకీయాలు: వెల్లంపల్లి
-
అన్ని జిల్లాలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణ శంకుస్థాపనలు
-
పేదలందరికీ సొంతిళ్లు
-
పేదలందరికీ సొంతిళ్లు.. ఇదీ నా కల: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది నా కల. దీన్ని విజయవంతం చేయాలని నేను తపన పడుతున్నాను. నా కల నిజం కావాలంటే మీ అందరి సహకారం కావాలి. నా కల మీ అందరి కల కావాలి. మనందరి కలతో పేదవాడి కల సాకారం కావాలి. అప్పుడే పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం దిగ్విజయమవుతుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పేదలకు అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందించాలన్నదే మన లక్ష్యం కావాలని పేర్కొన్నారు. రూరల్, అర్బన్ కలిపి 9,024 లే అవుట్లలోని జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా అన్ని లే అవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణ పనుల ప్రారంభానికి అవసరమైన మౌలిక సదుపాయాలను వారం రోజుల్లో కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. నీళ్లు, కరెంటు సౌకర్యాల ఏర్పాటులో ఏమైనా సమస్యలు ఉంటే శరవేగంగా పరిష్కరించాలని చెప్పారు. వీటిపై మరింత ధ్యాస పెట్టలన్నారు. ఇళ్ల నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని రవాణా చార్జీలు సహా ఇతరత్రా రేట్లు అమాంతం పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశం మొత్తం మన వైపు చూస్తోంది రూ.34 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం అన్నది ఒక కల అని, గతంలో రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ మౌలిక సదుపాయాల కల్పనకు ఈ స్థాయిలో ఖర్చు చేసిన దాఖలాలు లేవని సీఎం జగన్ చెప్పారు. ఇంత పెద్ద లక్ష్యం గురించి గతంలో ఎవరూ ఆలోచించలేదని, దేవుడి దయ వల్ల ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. దేశం మొత్తం మనవైపు చూస్తోందన్నారు. అవినీతికి తావు లేకుండా నాణ్యతకు పెద్ద పీట వేయాలని ఆదేశించారు. మనసా, వాచా, కర్మణా.. ఈ పనుల పట్ల అధికారులు అంకిత భావాన్ని ప్రదర్శించాలని, అప్పుడే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతామని చెప్పారు. పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీలను మురికివాడలుగా కాకుండా, మంచి ప్రమాణాలున్న ఆవాసాలుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఇందుకు పై స్థాయి నుంచి కింది స్థాయి అధికారి వరకూ సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. నాణ్యతపై ఫిర్యాదులు, సలహాలకు ప్రత్యేక నంబరు కేటాయించాలని ఆదేశించారు. అవినీతికి తావులేని, నాణ్యతతో కూడిన పనులు చేయాలని, ఇందులో భాగంగా ప్రతి లేఅవుట్లో ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. దీని ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్పై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి.. ► జగనన్న కాలనీల్లో మ్యాపింగ్, జియో ట్యాగింగ్, జాబ్కార్డుల జారీ, రిజిస్ట్రేషన్ పనులు అన్ని చోట్ల దాదాపుగా పూర్తి కావొచ్చాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 3.03 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. జూలై 10 నాటికి 7 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అవుతాయన్నారు. ► ఆప్షన్లో భాగంగా ప్రభుత్వం కట్టే ఇళ్లు శ్రావణ మాసం ప్రారంభం కాగానే మొ దలు పెట్టి.. 2022 జూన్ నాటికి మొదటి విడత నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ► నాణ్యత నిర్ధారణ కోసం ఇంజనీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఐఐటీలు, ఇతర సంస్థల సహకారంతో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ► టిడ్కో ఇళ్లకు సంబంధించి దాదాపు రూ.10 వేల కోట్లతో 18 నెలల్లో 2,08,160 యూనిట్లు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ -
జగనన్న కాలనీలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా జోరుగా ఇళ్ల నిర్మాణాలు
-
ఏపీ వ్యాప్తంగా జోరుగా ఇళ్ల నిర్మాణాలు
-
పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తున్న ఏపీ ప్రభుత్వం
-
గృహయజ్ఞం
-
రేపటి నుంచి వారం రోజుల పాటు ఇళ్ల నిర్మాణ మహోత్సవాలు
-
వైఎస్సార్, జగనన్న స్మార్ట్ టౌన్ పథకం కింద ఇళ్ల స్థలాలు
-
90 రోజుల్లో పట్టా అందించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి అర్హుడని తేలితే 90 రోజుల్లోగా ఇంటి స్థలం పట్టా అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇంటి పట్టా కోసం దరఖాస్తు అందుకున్న తొలి 12 రోజుల్లో వలంటీర్, గ్రామ సచివాలయ సిబ్బంది భౌతికంగా వెరిఫికేషన్ పూర్తి చేయాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 30,06,673 ఇళ్లపట్టాలకు గానూ 26,21,049 పట్టల పంపిణీ జరిగిందని, మిగిలిన వాటిని కూడా రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తంగా 87.17 శాతం పట్టాల పంపిణీ జరగ్గా, కాలనీల్లో 90.28 శాతం పంపిణీ పూర్తైందన్నారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు, పంపిణీ అన్నది నిరంతర కార్యక్రమమని, దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి: సీఎం జగన్) ఈ సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ► సోషల్ ఆడిట్ ద్వారా లబ్దిదారులను గుర్తించాలి. ► నిర్మాణాల్లో ఏక రూపత, నాణ్యత కోసం చర్యలు తీసుకోవాలి. ► ఒక కాలనీలో కల్పిస్తున్న సదుపాయాలు, వాటి నిర్మాణ రీతులు తదితర అంశాలపై పూర్తి వివరాలు నివేదించాలి. ► వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించాలి. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయండి. ► డంపింగ్ యార్డుల్లో బయో మైనింగ్ చేయాలి. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ మొదలుపెట్టాలి. పనుల పురోగతి: వైయస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్కు అధికారులు వివరించారు. మార్చి 31 నాటికి వాటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వివిధ ప్రభుత్వ శాఖలు అందులో భాగస్వాములవుతాయని అధికారులు తెలిపారు. ఇక సీఎం ఆదేశాల ప్రకారం వైఎస్సార్ జగనన్న కాలనీల్లో జనాభాను అనుసరించి అంగన్వాడీ కేంద్రాలు, వైఎస్సార్ క్లినిక్కులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, బస్టాపులు తదితర నిర్మాణాలపై అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (చదవండి: ఇళ్ల పట్టాల పంపీణీలో మనమే నంబర్1) -
ఇళ్ల పట్టాలకు రాక్షసుల్లా అడ్డుతగులుతున్నారు..
తాడేపల్లి: రాష్ట్రంలోని దుష్ట శక్తులన్ని ఏకమై ప్రజా సంక్షేమానికి అడ్డు తగులుతున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. సంక్షేమ పథకాలు ప్రారంభించే సమయంలో దేవాలయాలపై జరుగుతున్నదాడుల వెనుక భారీ కుట్ర కోణం దాగివుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. సున్నితమైన అంశాలను రెచ్చగొట్టడం ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్మోహన్రెడ్డిపై బురద చల్లే ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబే ఈ కుట్రలకు నాయకత్వం వహిస్తున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుంటే కొందరు రాక్షసుల్లా అడ్డుతగులుతున్నారని సజ్జల దుయ్యబట్టారు. ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా 31 లక్షల అడపడుచుల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం జరుగుతంటే, వాటిని చీకటితో చెరిపేసే ఉద్దేశంలో చంద్రబాబు అండ్ కో కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో భక్తిని, మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకవేళ వినకుండా దేవుళ్ళతో ఆటలాడుకోవాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. విగ్రహాలు ధ్వంసం వెనుక దాగివున్న కుట్రను త్వరలో ఛేదిస్తామని, ప్రభుత్వం దానిపై సిట్ వేసిందని సజ్జల పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత అమ్మఒడి పథకానికి అడ్డు తగిలేందుకు చంద్రబాబు తన అనుంగ అనుచరుడైన నిమ్మగడ్డ రమేష్ ను మరోమారు తెరమీదకు తెచ్చారని, కానీ వారి పాచికలు పారలేదని సజ్జల పేర్కొన్నారు. ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావించిన నిమ్మగడ్డకు కోర్టు అక్షింతలు వేసిందని అన్నారు. ఈ వరుస పరిణామాలన్ని గమనిస్తే ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబే కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారన్న విషయం స్పష్టమవుతోందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంటే చంద్రబాబు నాయకత్వంలోని దుష్టశక్తులు కుట్రలకు పాల్పడుతూ ప్రజాసంక్షేమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. -
'టీడీపీ త్వరలో కనుమరుగవుతుంది'
సాక్షి, విశాఖపట్నం: ప్రతి పేదవాడికి ఇళ్లు ఉండాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. భీమిలి నియోజవర్గం తగరపువలసలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, సరగడం చినఅప్పలనాయుడు, చింతకాయల సన్యాసిపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా జరుగుతుంది. ఒక పైసా అవినీతి లేకుండా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు. చంద్రబాబు మంచి కార్యక్రమాలు చేయడు, చేసే వారికి అడ్డుపడతారు. పార్టీలకు అతీతంగా ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగుతంది. ప్రతిపేదవాడికి ఇళ్లు ఉండాలనేది సీఎం జగన్ లక్ష్యం. చదవండి: ('టీడీపీ నేతలు పడగొట్టి బీజేపీపై నెడుతున్నారు') ఇళ్ల పట్టాల పంపిణీ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారు. మతానికి రాజకీయ రంగు పులుముతున్న వ్యక్తి చంద్రబాబు. 40 దేవాలయాలను పడగొట్టిన వ్యక్తి చంద్రబాబు. దేవుళ్ల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. టీడీపీ త్వరలో కనుమరుగవుతుంది. రాబోయే రోజుల్లో టీడీపీ డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు' అని మంత్రి అవంతి పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు ఇళ్ల స్థలమే కాదు ఇళ్లు కూడా కట్టించి ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. అవినీతికి తావులేకుండా ఇళ్లపట్టాల పంపిణీ జరుగుతుంది. టీడీపీ నేతలు పూర్తిగా అవినీతిలో కురుకుపోయారు. పేదవాడి సొంతింటి కలను సీఎం నెరవేరుస్తున్నారు. మహిళా పక్షపాతి సీఎం జగన్' అని విజయసాయిరెడ్డి అన్నారు. -
ఇళ్ల పట్టాల పంపీణీలో మనమే నంబర్1
సంక్షేమం అర్హులందరి పరమవుతోంది. పైరవీలకు చోటులేకుండానే లబ్ధి కలుగుతోంది. సర్కారు ఆదేశిస్తోంది... అధికార యంత్రాంగం పరుగులు తీస్తోంది. లబ్ధిదారుల మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. జిల్లాలో పట్టాల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. కలలో కూడా ఊహించని విధంగా నిలువనీడ కల్పిస్తున్న ప్రభుత్వానికి ప్రతి కుటుంబం మోకరిల్లుతోంది. పథకాల పంపిణీలో ఎప్పుడూ ముందుండే జిల్లా ఈ కార్యక్రమంలోనూ తన స్థానాన్ని పదిల పర్చుకుంది. ప్రస్తుతానికి ఇళ్ల పట్టాల పంపిణీలో మొదటిస్థానంలో నిలిచింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచింది. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా పేదలకు శాశ్వతంగా ఆవాసాలను కల్పించే పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. జిల్లాలో గత నెల 25న ప్రారంభమైన పట్టాల పంపిణీ కార్యక్రమం, 30న ముఖ్యమంత్రి రాకతో మరింత ఊపందుకొని, ప్రస్తుతం జోరుగా కొనసాగుతోంది. కొన్ని పెద్ద కాలనీలు మినహా, సుమారు 78శాతం జగనన్న కాలనీల్లో పట్టాల పంపిణీ ఇప్పటికే పూర్తయ్యింది. ఎన్నో ఏళ్లుగా నిరుపేదలు కంటున్న కలలను నిజం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఉత్తుర్వుల మేరకు, మంత్రుల సూచనలకు అనుగుణంగా పట్టాల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యేలు, మంత్రుల చేత పట్టాల పంపి ణీ ఉత్సాహంగా సాగుతోంది. విజయనగరం నియోజకవర్గంలో డిసెంబర్ 30న జరిగిన కార్యక్రమంలో, ముఖ్యమంత్రి వై,ఎస్.జగన్మోహనరెడ్డి పాల్గొని స్వయంగా పట్టాలను పంపిణీ చేయడం ద్వారా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్లలో ఒకటైన గుంకలాం లేఅవుట్లో 12,301 ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలోని ఇతర ప్రజాప్రతినిధులంతా రోజూ ఉత్సాహంగా పట్టాలను పంపిణీ చేస్తూ, పేదల ఆశలను నిజం చేస్తున్నారు. చాలాచోట్ల పట్టాలతోపాటు ఇళ్లను కూడా ప్రభుత్వం మంజూరు చేయడంతో, మరోవైపు లబ్ధిదారులు పునాదులు తవ్వేందుకు కూడా సన్నద్ధమ వుతున్నారు. 40వేల మందికి పంపిణీ పూర్తి పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద జిల్లాలో 72,625 మంది ఇళ్ల పట్టాలు పొందేందుకు అర్హులుగా గుర్తించారు. వీరిలో 4వ తేదీ నాటికి 39,772 మందికి పట్టాలు పంపిణీ చేశారు. కొన్నిచోట్ల జగనన్న కాలనీల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మల్యేలు పట్టాలు పంపిణీ చేస్తుండగా, మరికొన్ని చోట్ల వలంటీర్లే ఇంటింటికీ వెళ్లి మరీ, లబ్ధిదారులకు భద్రంగా పట్టాలు అందజేస్తున్నారు. టిడ్కో ఇళ్లకు సంబంధించి జిల్లాలో 8,048 మందిని అర్హులుగా గుర్తించగా, వీరిలో 5,207 మందికి ఇప్పటికే వాటికి సంబంధించిన పత్రాలను అందజేశారు. 911 కాలనీల్లో పట్టాల పంపిణీ పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద పట్టాల పంపిణీకోసం జిల్లాలో 1164 లేఅవుట్లను రూపొందించి, జగనన్న కాలనీలను అన్ని హంగులతో ఏర్పాటుకు సిద్దం చేయగా, వీటిలో 911 కాలనీల్లో ఇప్పటికే పట్టాల పంపిణీ పూర్తయింది. ఆక్ర మిత స్థలాల రెగ్యులైజషన్, పొజిషన్ పట్టాలకు 25,274 మందిని అర్హులుగా గుర్తించగా, 19,572 మందికి అందజేశారు. కోర్టు కేసుల కారణంగా పెండింగ్లో ఉన్న పట్టాల పంపిణీకి సంబంధించి, 47శాతం మందికి ఇప్పటికే లేఖలను అందజేశారు. సుదీర్ఘ నిరీక్షణ తరువాత తమ సొంతింటి కల సాకారం అవుతుండటంతో, లబ్ధిదారుల ఇళ్లలో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టయ్యింది. 20 వరకూ పట్టాల పంపిణీ పట్టాల పంపిణీ కార్యక్రమానికి తొలుత జనవరి 7ను గడువు తేదీగా నిర్ధారించగా తాజాగా 20వ తేదీ వరకు పొడిగిస్తున్న ట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ లోగా శత శాతం ఇళ్ళ పట్టాలు, గృహాల పంపిణీ పూర్తి చేస్తాం. జగనన్న కాలనీల్లో సామాజిక వసతులు కల్పించి, మురికి వాడలు లేని కాలనీలుగా తీర్చి దిద్దుతాం. ముఖ్యమంత్రి ఆశయం మేరకు అన్ని రకాల వసతులను కల్పించి, మోడల్ హౌసింగ్ను నిర్మిస్తాం. – డాక్టర్ ఎం.హరిజవహర్ లాల్, జిల్లా కలెక్టర్ రాష్ట్రంలో అతి పెద్దవాటిలో ఒకటైన గుంకలాం లే అవుట్ -
టీడీపీ దుర్మార్గంగా మాట్లాడుతోంది: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: పేదలకు ఉచితంగా ఇళ్లు అందిస్తుంటే టీడీపీ దుర్మార్గంగా మాట్లాడుతోందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వాంబే కాలనీలోని 60వ డివిజన్లో అర్హులైన 2,533 మందికి ఇళ్ల పట్ఠాల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం జోనల్ కమిషనర్ సమైలా, ఎమ్మార్వో దుర్గా ప్రసాద్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 'అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. సీఎం జగన్ రాష్ట్రంలో పేద ప్రజలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. 386 మందికి టిడ్కో ఇల్లు ఇస్తున్నాం. టీడీపీ ఇళ్ల విషయంలో దుర్మార్గంగా మాట్లాడుతోంది. వాంబే కాలనీలో మినీ బస్టాండ్ వస్తుంది. లే అవుట్లు నగరంలో విలీనం చేస్తాం. చదవండి: (‘మేనిఫెస్టో గొప్పతనం సీఎం జగన్ పాలనలోనే అర్థమైంది’) గతంలో 28 వేల ఇళ్లు ఇచ్చిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కింది. టీడీపీ ప్రజాప్రతినిధులు టిడ్కో విషయంలో ప్రజలను మోసం చేశారు. టీడీపీ నేతలు 12,000 మంది దగ్గర డబ్బులు వసూలు చేశారు. పేదలకు సెంట్ స్థలం ఇస్తున్నాం. నగరంలో 1,600 మందికి ఇళ్ల పట్టాలు రెగ్యులరైజ్ చేస్తున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో కొత్తగా 525 పెన్షన్లు ఇచ్చాము. 45 నుంచి 65 ఏళ్ల లోపు ఉన్న వారికి సీఎం జగన్ చేయూతను ఇచ్చారు. రాష్ట్రంలో సీఎం విద్యకు పెద్దపీట వేస్తున్నారు. వాంబే కాలనీలో రూ. 4 కోట్ల పనులు జరుగుతున్నాయి. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారు. టీడీపీ నేతలు మత రాజకీయాలు చేస్తున్నారు, అది సరికాదు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. చదవండి: (త్వరలోనే అసలు రంగు బయటపడుతుంది’) -
టీడీపీ నేతల విమర్శలు పట్టించుకోం: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ : దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని తెలిపారు. భారీ ఎత్తున ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ 384 చదరపు స్థలం ఇస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 23,24,25 డివిజన్కు సంబంధించిన 1024 మందికి ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జోనల్ కమిషనర్ సుమైలా, ఎమ్మార్వో జయశ్రీ గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ సుమైలా మాట్లాడుతూ.. 18,19,20 డివిజన్లోని 3280 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. అర్హులైన వారందరికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సీఎం జగన్ అధికారంలోకి రాగానే ఇళ్ల పట్టాలు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు. మహిళలు పేరు మీద ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో 27 వేల జేఎన్ఆర్యూఎం ఇల్లులు ఇచ్చారని తెలిపారు. గత పాలనలో టీడీపీ నేతలు ఇళ్ల స్థలాల విషయంలో ప్రజలను మోసం చేశారని మల్లాది విష్ణు విమర్శించారు. లక్షా 80 వేలు ఇళ్ల కట్టడానికి మంజూరు చేశామని, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు తాము పట్టించుకోమన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలోని పేదవాడి పక్షాన ఉన్నారని, 30 వేల మందికి ఇళ్ల ఇస్తున్నామని తెలిపారు. ‘సీఎం జగన్ ఊళ్లు నిర్మిస్తున్నారు. నగరాన్ని విస్తరిస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గలో 30 వేల ఇల్లు ఇస్తున్నాం. టీడీపీ నేతలు ప్రజలను మోసం చేశారు. జన్మ భూమి కమిటీలు పెట్టి ప్రజలను తప్పుదోవలో నడిపించారు. సెంట్రల్ నియోజకవర్గలో 24.602 పెన్షన్లు ఇస్తున్నాం. 525 మందికి రేపు ఉదయం నుం,ఇ కొత్త పెన్షన్లను ఇస్తున్నాం. రాష్ట్రంలో టీడీపీని ప్రజలు తిరస్కరించిన బుద్ధి రాలేదు. టీడీపీ నేతలు జూమ్ మీటింగ్స్కే పరిమితం. సీఎం జగన్ రాష్ట్రంలోని విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ రాజకీయాల ప్రజలు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజల వద్దకు వచ్చింది. అంబేడ్కర్ కాలనీలోని 177 ఇళ్ల పట్టాలు రెగ్యులర్ చేస్తున్నాం. టీడీపీ నేతలు టిడ్కో ఇళ్ల విషయంలో12.000 వేల మంది దగ్గర నుండి 25.000 50.000 వేలు వసూలు చేశారు. టీడీపీ నేతలు టిడ్కో ఇళ్ల విషయంలో ప్రజలను మోసం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో సీఎం జగన్ ముందు అడుగులో ఉన్నారు’. అని తెలిపారు -
‘ఒకేసారి 16 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ’
సాక్షి, విశాఖపట్నం: ఒకేసారి 16 వేల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. భీమిలీ నియోజకవర్గంలో మధురవాడలో నవరత్నాలు పేదలందరికి ఇళ్లు కార్యక్రమాన్ని మంత్రి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ సాయిరెడ్డి, మంత్రి శ్రీరంగనాథ్ రాజు, ఎంపీ ఎంవీవీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణలు పాల్గొని పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 31 లక్షల ఇళ్లు ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్లను కాకుండా ఊళ్లను ఏర్పాటు చేస్తున్నారన్నారు. అర్హతే ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని, పార్టీలకు అతీతంగా ఇళ్లు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కళ్లున్న కబోదని, సీఎం వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందని ఇళ్ల పట్టాల్లో అవినీతి జరిగిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఇళ్ల పట్టాల విషయంలో జిల్లాలో ఎక్కడైన అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్దమని, చంద్రబాబు కోర్టులకు వెళ్లి పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిన ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామని అవంతి పేర్కొన్నారు. -
ఇక్కడే సంక్రాంతి... ఇప్పుడే సంతోషం
ముగ్గులేస్తాం..గొబ్బెమ్మలు పెడతాం..ఇక్కడే సంక్రాంతి చేసుకుంటాం రోజంతా ఇక్కడే గడుపుతాం..ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో అవధుల్లేని ఆనందం తమ బతుకు చిత్రం మారిపోతుందనే విశ్వాసం జగనన్నను తమ గుండెల్లో పెట్టుకుంటామంటూ ఉద్వేగం – ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన ‘మేం ఈసారి సంక్రాంతి పండుగ ఇక్కడే చేసుకుంటాం. ముగ్గులేసి, గొబ్బెమ్మలు పెడతాం. రోజంతా ఇక్కడే గడుపుతాం. ఇంత ఆనందాన్ని జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు..’ ఉప్పొంగుతున్న సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ వణుకూరు దళితవాడ మహిళలు చేసిన వ్యాఖ్యలివి. ‘ఇన్నాల్టికి నిజమైన సంక్రాంతి చూస్తున్నాం బాబూ...’ అని వనిత అంటుండగానే, ‘మేం ఇక లక్షాధికారులం..’ అంది మరియమ్మ. ‘ఇన్నాళ్టికి బతుకు మీదే నమ్మకం వచ్చింది సార్...’ అంటూ తన కూతుర్ని హత్తుకుంది లలిత. సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్ళు’ పథకం వారిలో కోటి ఆశలు రేకెత్తిస్తోంది. జీవితంపై నమ్మకం పెంచుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే వారి బతుకు చిత్రాన్నే మార్చేస్తోంది. పనికెళ్ళకపోతే పస్తులుండే పేదల ఊరు వణుకూరు. విజయవాడకు కూతవేటు దూరంలో ఉండే ఈ గ్రామం ఇప్పుడు సంబరాల్లో మునిగితేలుతోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా ఈ గ్రామంలో దాదాపు 18 వేల పైచిలుకు ఇళ్ళ స్థలాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వణుకూరుతో పాటు విజయవాడలోని పలు ప్రాంతాల లబ్ధిదారుల కోసం ఇక్కడ దాదాపు 400 ఎకరాల్లో స్థలాలు ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ బృందం అక్కడ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళింది. ఇళ్ల స్థలాల్లో ఉన్నవారితో పాటు వణుకూరు గ్రామస్తులు కొందర్ని పలుకరించింది. మా పేదరికం పోయింది.. వణుకూరుకు సరిగ్గా అర కిలోమీటర్ దూరంలోనే ఉన్న ఆ ప్రాంతానికి పొద్దున్నుంచీ సూర్యాస్తమయం వరకు ఇళ్ల స్థలాల లబ్ధిదారులు వచ్చి పోతూనే ఉన్నారు. ‘మీరు ఎక్కడ్నుంచి? ఏం చేస్తారు? మీ ఫోన్ నంబర్ ఇవ్వండి?’ అంటూ ఒకర్నొకరు పరిచయం చేసుకుంటున్నారు. ప్లాట్ల దగ్గర నిలబడి సెల్ఫీలు దిగుతున్నారు. ఎవరికి ఏ ప్లాట్ ఇస్తారో తెలియదుగానీ లబ్ధిదారులు మాత్రం అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి అది తమ ఊరని మురిసిపోతున్నారు. విజయవాడలో టైలర్ పనిచేసే బొడుగు దీప్తి కుటుంబ సమేతంగా అక్కడి వచ్చింది. ‘ఈ సంక్రాంతితో మా పేదరికం పోయింది. ఇంతమందితో కలసి ఇక్కడ గొప్పగా బతుకుతాననే నమ్మకం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది..’ అని ఆనందంతో చెప్పింది. 12 ఏళ్ళ చిన్నారి నిహారిక తన తండ్రితో సెల్ఫీ దిగుతూ .. ‘పూరిగుడిసెలో నా పుస్తకాలు తడిచిపోయేవి. సొంత ఇల్లు వచ్చాక నా బుక్స్ అన్నీ ఓ షెల్ఫ్లో పెట్టుకుంటా. రోజూ దాబా మీదకెక్కి చదువుకుంటా..’ అంటూ ముసిముసి నవ్వులు నవ్వింది. జగనన్నే మాకు దేవుడు ‘మనకి ప్లాటొచ్చిందమ్మా... పండక్కి రండి’ అంటూ ఆటోనగర్లో ఉంటున్న వీరన్న తన అల్లుడికి ఫోన్ చేసి ఆనందం పంచుకున్నాడు. కొత్త ప్లాట్ల దగ్గర వాట్సాప్ వీడియో కాల్లో ఆ ప్రాంతాన్ని చూపించాడు. ‘మాకు జగనన్నే దేవుడు... అందుకే వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాం’ అని టెన్త్ చదువుతున్న సంకల్ప తన వద్ద ఉన్న ఫోన్ చూపిస్తూ చెప్పింది. ‘ఇంతకాలం మురికివాడలో బతుకు .. ఇప్పుడిక కొత్త వెలుగు’ అంటూ సంజయ్ అక్కడి పరిసరాలను ఫోన్లో చిత్రీకరించాడు. ఇన్నాళ్లకు ఇల్లొచ్చింది.. ‘ఇదయ్యా ఇప్పటిదాకా మా బతుకు’ .. వణుకూరు ఎస్సీ కాలనీలో తన గుడిసె చూపిస్తూ చెప్పింది బుర్రె ప్రసన్న. గడ్డితో కప్పుకోవడమే కష్టంగా ఉన్న ఆ గుడిసెలోనే ఆ కుటుంబం ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటోంది. ఇల్లివ్వమని కొన్నేళ్ళుగా నేతల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని చెప్పిందామె. తన అత్త బతికుండగా సొంతింటి కోసమే తపించిందని, ‘ఈ ప్రభుత్వం వచ్చాక ఇల్లొచ్చింది. ఆమె బతికుంటే మురిసిపోయేది’ అని కన్నీళ్ళు దిగమింగుకుంటూ చెప్పింది. మరో రెండు అడుగులు వేస్తే కృపారావు ఇల్లు కన్పించింది. చుట్టూ పిచ్చి మొక్కలు. అటు వెళ్తుంటే పందులెదురొచ్చాయి. ఇంట్లోకి పాములు రావడం సర్వసాధారణమంట. ఇదే విషయమై కృపారావును కదిలిస్తే.. ’మాకేంటి సార్... ఇప్పుడు మాకు ప్లాట్ వచ్చింది. మా బాధలన్నీ తీరిపోయాయి’ అంటూ తన భార్య వనిత పడుతున్న ఆనందాన్ని పదేపదే చెప్పారు. ప్రభుత్వం భరోసా ఇచ్చింది ఆటో నడిపే నేను ఇంటి అద్దె కట్టడానికే కష్టపడుతున్నా. ఇక ఎదిగే పిల్లలకు ఏమిస్తాననే మనాది ఇప్పటిదాకా ఉండేది. ఇప్పుడు నామీద నాకే నమ్మకం వచ్చింది. కాదు ప్రభుత్వం ఆ నమ్మకం కల్పించింది. ఇలాంటి వాతావరణంలో ఇల్లు వస్తుందని ఊహించుకుంటేనే చెప్పలేని ఆనందం కలుగుతోంది. ఇక్కడ నుంచి పోరంకికి ఆటో నడుపుకుంటా. – కామినేని సాంబయ్య, ఆటో డ్రైవర్ నమ్మకాన్ని జగనన్న నిజం చేశాడు పొద్దస్తమానం టైలరింగ్తో కష్టపడే నా భార్య, నేను ఎప్పటికైనా సొంతింట్లో ఉంటామా? అన్పించేది. కానీ జగనన్న ఎన్నికల్లో చెప్పినప్పుడే నమ్మకం కలిగింది. ఇప్పుడు అది నిజమైంది. – బొడుగు లోకేష్, ఆర్టీసీ కాలనీ పేరు రాసుకెళ్లారు.. ఇల్లొచ్చిందని చెప్పారు ఎన్నో ఏళ్లుగా కన్పించిన ప్రతి నాయకుడినీ ఇంటి కోసం వేడుకున్నాం. ఎవరూ కనికరించలేదు. ఇటీవల గ్రామ వాలంటీర్ ఇంటికొచ్చి పేరు రాసుకెళ్ళారు. తర్వాత నీకు ఇల్లొచ్చిందని చెప్పారు. ప్రజల కోసం పనిచేసే జగనన్నను మా గుండెల్లో పెట్టుకుని పూజిస్తాం. –బుర్రె ప్రసన్న, వణుకూరు ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది ఎలాంటి రాజకీయ ఒత్తిడీ లేకుండా మా చేతుల మీదుగా పేదవాళ్ళను లబ్ధిదారులుగా ఎంపిక చేయడం చాలా సంతృప్తిగా ఉంది. ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. – సాయి దీప్తి, వలంటీర్ పట్టాల పండుగ.. ఆనందం నిండగ.. రాష్ట్రవ్యాప్తంగా ఆరో రోజూ ఇళ్ల పట్టాల పంపిణీ ‘అందరికీ చోటు ఇస్తేనే అది సమాజం అనిపించుకుంటుంది. అందరికీ మంచి చేస్తేనే అది ప్రభుత్వం అనిపించుకుంటుంది. అన్ని కులాలు, మతాలు ఉంటేనే రాజధాని అవుతుంది. అటువంటి సమాజాన్ని, ప్రభుత్వాన్ని, రాజధానిని మీ అందరి చల్లని దీవెనలతో నిరి్మంచుకుందాం’ అంటూ సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ ఆరో రోజైన బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగింది. పట్టాలు అందుకున్న అక్కచెల్లెమ్మలు.. ఎన్నో ఏళ్లుగా కలగానే మిగిలిన సొంతిల్లు ఇన్నాళ్లకు దక్కిందంటూ భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్ జిల్లాలో బుధవారం 6,223 మందికి ఇళ్ల పట్టాలివ్వగా..ఇప్పటివరకు పట్టాలు అందుకున్న వారి సంఖ్య 50,809కి చేరింది. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజద్బాషా పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో బుధవారం 4,598 మందికి పట్టాలను అందజేశారు. కర్నూలు జిల్లాలో బుధవారం 8,023 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో బుధవారం 3,451 ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం 5,331 మందికి ఇళ్ల పట్టాలు, 309 మందికి టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. మంత్రి గౌతంరెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో బుధవారం 3,727 మందికి పట్టాలు అందజేయగా.. ఇప్పటివరకు 23,695 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారు. కొత్తపట్నం మండలం అల్లూరులో హౌసింగ్ కాలనీ నిర్మాణానికి మంత్రి బాలినేని భూమి పూజ చేశారు. గుంటూరు జిల్లాలో బుధవారం 13,909 మందికి ఇళ్ల పట్టాలు, 262 మందికి టిడ్కో ఇళ్లకు పత్రాలు అందజేశారు. జిల్లాలో ఇప్పటివరకు 57,325 ఇంటి పట్టాలు, 287 టిడ్కో ఇళ్లు పంపిణీ చేశారు. హోం మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో బుధవారం 8,642 మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వగా.. ఇప్పటివరకు పట్టాలు పొందిన వారి సంఖ్య 55,428కు చేరింది. మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం జరిగిన కార్యక్రమంలో 7,637 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. ఇప్పటి వరకు 56,372 మంది లబ్ధి పొందారు. కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బుధవారం 5,704 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా.. ఇప్పటివరకు లబ్ధి పొందిన వారి సంఖ్య 54,542కు చేరింది. మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో బుధవారం 3,764 మందికి పట్టాల్ని పంపిణీ చేయగా..ఇప్పటివరకు లబి్ధదారుల సంఖ్య 29,764కు చేరింది. విశాఖ జిల్లాలో బుధవారం 30,444 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి పట్టాలు అందజేశారు. టీడీపీకి ఓటేసినా..జగనన్న పట్టా ఇచ్చారు నేను వైఎస్సార్సీపీకి ఓటేయలేదు. ఎప్పుడూ టీడీపీకే ఓటేశా. మా నాన్న, భర్త తెలుగుదేశం పార్టీయే. అయినా మాకు ఇల్లు రాలేదు. జగనన్న మాకు ఇంటి పట్టా ఇచ్చి.. ఇల్లు కూడా కట్టిస్తున్నారు. వైఎస్సార్ చేయూత పథకం కింద ఇప్పటికే రూ.18,750 వచ్చాయి. నూతిలో కప్పలా మనం ఉన్నదే ప్రపంచం కాదని నా భర్తకు చెబుతా. గొప్ప నాయకుడిని దేవుడిచ్చాడని చెబుతా. – షేక్ సరోజిని, 23వ వార్డు, తెనాలి -
న్యాయమే నెగ్గుతుంది: సీఎం జగన్
ప్రతి కుటుంబం ఆలోచన చేయాలి... ఏడాది గడిచిపోయింది. క్యాలెండర్ మారుతోంది. 2020 తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకునే సమయం వచ్చింది. ఈ ప్రభుత్వం మాకేమిచ్చింది? గత సర్కారుతో పోలిస్తే ఎంత మంచి జరిగిందని ప్రతి కుటుంబం ఆలోచన చేయాలి. మీ బిడ్డ మీకు మంచి చేశాడు. రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలో కూడా లేని విధంగా ఎన్నో చేశాడు. పేదలకు, రైతులకు, అక్క చెల్లెమ్మలకు, విద్యార్థులకు, అవ్వా తాతలకు, వందల సామాజిక వర్గాలకు కనీవిని ఎరగని విధంగా ఉపయోగపడ్డా. మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఈ మాటలు గర్వంగా చెబుతున్నా. వీళ్లసలు మనుషులేనా..? చంద్రబాబు, ఆయన సహచరులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ కోర్టుల్లో కేసులు వేయడం, స్టేలు తేవడంతో 30.75 లక్షల మందిలో 10% అంటే 3.74 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతున్నాం. పట్టాల పంపిణీకి ముందురోజైన 24న కూడా కోర్టులో పిల్ వేశారంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో చూడండి. నా సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా స్టే తెచ్చారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అడ్డుకుంటున్న వీరసలు మనుషులేనా? అనిపిస్తుంది. జాప్యం వల్ల ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఇప్పుడు డి–పట్టాలతో ఇస్తున్నాం. న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే సర్వహక్కులతో అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తాం. అక్కచెల్లెమ్మలకు విలువైన ఆస్తి... ఇదే లేఅవుట్లో మనం ఇస్తున్న భూమి విలువ రూ.3 లక్షలు ఉంటుందని కలెక్టర్ చెప్పారు. రేపు ఇక్కడ ఇల్లు కట్టి అభివృద్ధి చేస్తే కనీసం ఏడెనిమిది లక్షల రూపాయల ఆస్తి అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టినట్లు అవుతుంది. ఇంటికి నలుగురు చొప్పున లెక్కేసుకున్నా ఇక్కడ దాదాపు 45 వేల మంది ఉండబోతున్నారు. అంటే ఒక నగర పంచాయతీ ఏర్పడబోతోంది. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, విజయనగరం: సంక్రాంతి ముందే వచ్చిందన్నట్లుగా పేదలకు విలువైన స్థిరాస్తిని అందించే ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా విజయనగరం జిల్లా గుంకలాంలో 397.36 ఎకరాల విస్తీర్ణంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన సువిశాల లేఅవుట్ను బుధవారం ఆయన విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. విశాఖ నుంచి హెలికాఫ్టర్లో వచ్చిన ముఖ్యమంత్రి జగన్ లే అవుట్ అంతా చక్కర్లు కొట్టి తిలకించారు. అనంతరం వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్లో ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరించారు. 12,301 మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో పాటు తొలిదశలో నిర్మించనున్న గృహ నిర్మాణ పనులను ప్రారంభించి బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. భారీ ఎత్తున హాజరైన లబ్ధిదారులు అడుగడుగునా అడ్డంకులు ‘‘అమరావతిలో 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే డెమొగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందంటూ చంద్రబాబు నాయుడు, ఆయన మనుషులు కోర్టుల్లో కేసులు వేస్తే స్టే ఇచ్చాయి. నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తోంది. కులాల మధ్య విభేదాలు ఏమిటి? వారు దాన్ని చూపిస్తూ కేసులు వేయడం ఏమిటి? కోర్టులు స్టే ఇవ్వడం ఏమిటి? అని. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత దారుణమైన పరిస్థితులున్నాయో. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన విశాఖలో 1.80 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ల్యాండ్ పూలింగ్లో భూములు సేకరించాం. ఆ భూములు ఇచ్చిన వారు ఏ అభ్యంతరం లేకుండా భూములు ఇచ్చారు. కానీ ఆ భూములతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి కోర్టులో కేసులు వేయడం, వాటిపై స్టే రావడం చాలా బాధనిపిస్తోంది. రాజమండ్రిలో భూములను ప్రభుత్వమే ప్రజల నుంచి కొనుగోలు చేసింది. అవి ఆవ భూములు కాకపోయినా ఎవరో కేసు వేయడం, స్టే రావడంతో 27 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు అవరోధం ఏర్పడింది. 1978లో 44వ సవరణ ద్వారా ఆస్తిహక్కును చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. అంటే ఇల్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. అది చట్టబద్దమైన హక్కు. అయినా కోర్టులకు వెళ్లడం, స్టేలు ఇవ్వడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. బాధ కూడా అనిపిస్తోంది. ఇంత భారీగా ఇళ్ల నిర్మాణంతో ఎంతోమందికి పని దొరుకుతుంది. కనీసం 30 రకాల వృత్తుల వారికి ఉపాధి లభిస్తుంది. ముడి పదార్థాల వినియోగంతో ఆర్థికంగా కూడా బూస్ట్ వస్తుంది. త్వరలోనే మిగిలిపోయిన 3.74 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందిస్తాం. దేవుడి ఆశీర్వాదం, మీ చల్లని దీవెనలు నాకు తోడుగా ఉన్నాయి. మహిళకు ఇంటి స్థలం పట్టా అందజేస్తున్న సీఎం జగన్ చెప్పిన దానికంటే మిన్నగా.. అక్క చెల్లెమ్మలకు 25 లక్షల ఇళ్లు కట్టించి వారి పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. అంతకంటే ఎక్కువగా 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలిస్తున్నాం. తొలివిడత 15.60 లక్షల ఇళ్లు మొదలు పెడుతున్నాం. రూ.7 వేల కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మిగిలిన 12.70 లక్షల ఇళ్లు వచ్చే ఏడాది ప్రారంభిస్తాం. . రాష్ట్రవ్యాప్తంగా 68,361 ఎకరాలలో చేసిన లేఅవుట్లు, ప్లాట్ల మార్కెట్ విలువ దాదాపు రూ.25,530 కోట్లు ఉంటుంది. నవరత్నాల సిరి ధాన్యం బస్తాలపై నవరత్నాలను పేర్కొంటూ రూపొందించిన ఎడ్లబండి సభలో విశేషంగా ఆకట్టుకుంది. నాలుగు జిల్లాల జనాభా.. గత ప్రభుత్వం చివరి రెండేళ్లలో అక్కడో ఇక్కడో మొక్కుబడిగా ఇళ్లు కడితే మనం ఇవాళ ఏకంగా ఊళ్లు కడుతున్నాం. కొన్ని చోట్ల అవి పట్టణాలు కూడా. మన ప్రభుత్వం దాదాపు 31 లక్షల కుటుంబాలకు ఇళ్లు కట్టిస్తోంది. అంటే ఒక కుటుంబంలో సగటున నలుగురు ఉంటారనుకుంటే దాదాపు 1.24 కోట్ల మందికి ఇంటి సదుపాయం కలుగుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతోపాటు కడపను కూడా కలిపితేనేగానీ అంత మంది ఉండరు. ఏ రకంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారనేది మీదే నిర్ణయం. మూడు రకాల ఆప్షన్లలో మీకు నచ్చింది వలంటీర్కు చెప్పండి. బాబు స్కీమ్ కావాలన్నది ఒకే ఒక్కడు దాదాపు 2.62 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తాం. 300 చదరపు అడుగుల ఫ్లాట్ ఖర్చును ప్రభుత్వమే పూర్తిగా భరించి కేవలం ఒక్క రూపాయికే పేదలకు ఇస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.43 లక్షల టిడ్కో ఇళ్లకు సంబంధించి ఏ స్కీమ్ కావాలని ఆప్షన్లు కోరితే కేవలం ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీమ్ కావాలన్నారు. అది కూడా ఏదో పొరపాటున అయి ఉంటుంది. ఆయన కోరిక ప్రకారమే ఆయనకు ఆ స్కీమ్, మిగిలిన వారికి జగనన్న స్కీమ్ వర్తింపచేస్తాం. 365, 430 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులకు కూడా రాయితీ ఇస్తున్నాం. వారు కట్టాల్సిన ముందస్తు వాటాలో 50 శాతం ప్రభుత్వం భరిస్తోంది. ఇలా అదనంగా రూ.4,287 కోట్ల భారం పడినా మీ బిడ్డగా చిరునవ్వుతో భరిస్తున్నాం’’ భారీగా హాజరైన లబ్ధిదారులు.. డిప్యూటీ సీఎంలు పుష్పశ్రీవాణి, ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స, చెరుకువాడ, ముత్తంశెట్టి, వెలంపల్లి, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీలు బెల్లాన, మాధవి, సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు భారీగా లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయనగరానికి వరాలు ► రూ.180 కోట్లతో కురుపాం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ పనులు త్వరలో ప్రారంభం. ► సాలూరులో ట్రైబల్ వర్సిటీ పనులు త్వరలోనే మొదలు. ► విజయనగరంలో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణానికి జనవరిలో టెండర్లు. మార్చిలో పనులు. ► ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రెండో దశకు రూ.4,134 కోట్లకు టెండర్లు. పనులు పూర్తి చేసి కచ్చితంగా 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు. ► గజపతినగరం బ్రాంచి కాలువతో సహా తోటపల్లిలో అన్ని పనులను రూ.471 కోట్లతో ప్రాధాన్యతగా చేపట్టి రెండేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం. ► తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టుకు మరో రూ.620 కోట్లు. రెండేళ్లలో పనులు పూర్తి. ► వెంగళరాయ ప్రాజెక్టు కింద 5 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీళ్లు. ఏడాది లోపే పనులు పూర్తి. ► రాముడి వలస, లోచర్ల ఎత్తిపోతల పథకాల పనులు ఏడాదిలోగా పూర్తి. ► గుంకలాంలో అన్ని మౌలిక వసతులతో 18 నెలల్లోనే గృహ నిర్మాణాలు పూర్తి. ఎవరిస్తారన్నా ఇలా..? ‘‘కూలి పనిచేసే నా భర్త చనిపోవడంతో టైలరింగ్ చేసుకుంటూ బతుకుతున్నా. నాకొక పాప ఉంది. సొంతిల్లు లేకపోవటంతో 20 ఏళ్లలో 12 సార్లు అద్దె ఇళ్లు మారాల్సి వచ్చింది. జగనన్న నా ఇంటి కలను నేరవేర్చటమే కాకుండా చేదోడు పథకం కింద రూ.18,750, వైఎస్సార్ ఆసరా రూ.4 వేలు, పింఛన్ రూ.2,250 చొప్పున నాకు సంవత్సరం మొత్తంలో రూ.60 వేలు పైన ఇచ్చారు. ఎవరిస్తారన్నా ఇలా? నాకు, నా కుమార్తెకు మీరున్నారన్న ధైర్యంతో బతుకుతాం’’ –కొమరగిరి రత్నకుమారి, పద్మావతినగర్, విజయనగరం -
ప్రభుత్వం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు: సీఎం జగన్
సాక్షి, విజయనగరం : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఆస్తి, స్థిరాస్తి అందించే మహాయజ్ఞాన్ని ప్రారంభించామని, 18 నెలల్లో 95 శాతం హామీలు నెరవేర్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ పేదలకు ఇళ్ల పట్టాలు.. రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షలకు పైగా ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టామని తెలిపారు. పేదలకు 2.20 లక్షల టిడ్కో ఇళ్లను కట్టిస్తున్నామని వెల్లడించారు. 35.70లక్షల ఇళ్లను రెండు దశల్లో పూర్తి చేస్తామన్నారు. బుధవారం విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా 'నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంకలాంలోని ‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ పైలాన్ను ఆవిష్కరించారు. ( చదవండి : వైఎస్సార్ జగనన్న కాలనీ పైలాన్ ఆవిష్కరించిన సీఎం జగన్ ) ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘అక్కచెల్లెమ్మలకు మంచి చేసే అవకాశం దక్కింది. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మహిళలకు, రైతులకు, విద్యార్ధులకు.. అక్కచెల్లెమ్మలకు, వందల సామాజిక వర్గాలకు అండగా నిలిచా. 50 లక్షలకు పైగా రైతులకు రైతు భరోసా సాయం అందించాం. 62 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్.. వారి ఇంటి వద్దకే అందించేలా గొప్ప కార్యక్రమం చేపట్టాం. 15 లక్షలకు పైగా విద్యార్ధుల చదువులకు తోడుగా నిలబడ్డా. రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ అందించి అండగా నిలబడ్డా. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా 1.30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం’’ అని అన్నారు. ప్రభుత్వం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు ప్రభుత్వం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు. కొత్తగా 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలు నిర్మించబోతున్నాం. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. గుంకలాం లేఅవుట్లో 12,301 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇస్తాం. గుంకలాంలో చిన్న నగర పంచాయతీ ఏర్పడబోతుంది. కుల, మత, పార్టీలకతీతంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టాం. గ్రామ/వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా డిస్ప్లే చేస్తున్నాం. ఇళ్ల పట్టాలను నిరంతర ప్రక్రియగా మార్చాం. అర్హులైనవారు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో.. ఇంటి స్థలం కేటాయించేలా ఆదేశాలు ఇచ్చాం. తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సహా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. లే అవుట్ విస్తీర్ణం బట్టి పార్క్లు, అంగన్వాడీలు, విలేజ్ క్లీనిక్లు, ఆర్బీకేలు ఏర్పాటు.. 224 చదరపు అడుగుల నుంచి 340 చదరపు అడుగులకు విస్తీర్ణం పెంచాం. ఒక రూపాయికే టిడ్కో ఇళ్లు 300 చదరపు అడుగులు ఉన్న టిడ్కో ఇళ్లను ఒక రూపాయికే అందిస్తున్నాం. టిడ్కో ఇళ్లను పూర్తిచేసేందుకు రూ.9వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. లక్షా 43వేల మంది టిడ్కో లబ్ధిదారుల్లో ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీం కావాలన్నారు. 365, 430 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లల్లో.. 50శాతం లబ్ధిదారుల వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనివల్ల రూ.4,250 కోట్లు ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చాం. మొదటి ఆప్షన్లో నిర్మాణ సామాగ్రి, లేబర్ ఛార్జీలను లబ్ధిదారులకు ఇస్తాం. రెండో ఆప్షన్లో నిర్మాణ ఖర్చులను పురోగతి వారీగా డబ్బులు చెల్లిస్తాం. మూడో ఆప్షన్లో పూర్తిగా ఇంటి నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందిస్తాం. చంద్రబాబు అండ్ కో కుట్రలతో రిజిస్ట్రేషన్లు జరగలేదు లబ్ధిదారుల పేరుతోనే ఇంటి రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం. చంద్రబాబు అండ్ కో కుట్రలతో రిజిస్ట్రేషన్లు జరగలేదు. లబ్ధిదారులకు కేవలం 'డి' పట్టాలు మాత్రమే ఇస్తున్నాం. న్యాయపరమైన చిక్కులు తొలిగిపోగానే లబ్ధిదారులకు అన్ని హక్కులు కల్పిస్తాం. డిసెంబర్ 25న ఇళ్ల పట్టాలు పంచుతామని తెలిసి 24న కోర్టుకు వెళ్లారు. చంద్రబాబు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో దీన్ని బట్టే తెలుస్తుంది. పులివెందులలో ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టు ద్వారా స్టే తెచ్చారు. అమరావతిలో 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. విశాఖలో 1.84 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పించాం..ల్యాండ్ పూలింగ్కు సంబంధంలేనివారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. రాజమండ్రిలో ఆవా భూముల పేరుతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. ప్రభుత్వ భూములను కూడా పేదలకు కేటాయించకుండా అడ్డుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణం ద్వారా 30 రకాల వృత్తిదారులకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. చంద్రబాబు, అనుచరుల పిటిషన్ల వల్ల 10% ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం కాగానే మిగిలిన వారందరికీ ఇళ్ల స్థలాలు.. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును చట్టబద్ధ హక్కుగా మార్చారు. పేదలకు ఆస్తి హక్కు కల్పించే ప్రయత్నం చేస్తుంటే కోర్టుకెళ్లి అడ్డుకుంటున్నారు. విజయనగరంలో మెడికల్ కాలేజీకి జనవరిలో టెండర్లు.. మార్చి నాటికి మెడికల్ కాలేజీ నిర్మాణం చేపడతాం. రెండేళ్లలో తోటపల్లి, తారకరామ తీర్ధసాగరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. ఏడాదిలోగా రాముడువలస లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేస్తాం.\ -
వైఎస్సార్ జగనన్న కాలనీ పైలాన్ ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం 'నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంకలాంలోని ‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ పైలాన్ను సీఎం జగన్ ఆవిష్కరించారు. మరికొద్దిసేపట్లో గుంకలాంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. అదే విధంగా అక్కడ నిర్మించిన నమూనా ఇంటిని పరిశీలిస్తారు. సభావేదిక వద్ద ఇళ్ల లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారని తెలిపారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇల్లు కూడా కట్టిస్తామని అన్నారు. ప్రజల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా సీఎం ముందుకెళ్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. మంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత దేశ చరిత్రలోనే లేదని.. ఆ ఘనత కేవలం సీఎం జగన్కు మాత్రమే దక్కుతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం జగన్ అండగా నిలిచారని సీఎం వైఎస్ జగన్.. మహిళా సాధికారత ఛాంపియన్ అని పేర్కొన్నారు. మహిళా సాధికారతపై సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. అంతకు ముందు విజయనగరం బయలుదేరిన సీఎం జగన్కు విశాఖ ఎయిర్ పోర్టులో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా స్వాగతం పలికారు. గుంకలాంలో 397.36 ఎకరాల్లో అతిపెద్ద లేఅవుట్ను అధికారులు సిద్ధం చేశారు. 12,301 మంది లబ్ధిదారుల కోసం ఈ అతిపెద్ద లేఅవుట్ను 6 బ్లాకులుగా రూ.4.37 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. జిల్లాలో మొత్తం 1,164 లేఅవుట్లను అధికారులు సిద్ధం చేశారు. -
దళితుల్లో చిచ్చుకు టీడీపీ కుట్ర
సాక్షి, అమరావతి: ‘విభజించు.. పాలించు’ విధానంతో దుష్ట రాజకీయాలు చేయడంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు బ్రిటీష్ పాలకులను మించిపోతున్నారు. ఇప్పటికే అధికారం కోల్పోయి నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్న ఆయన రాజకీయ పబ్బం గడుపుకునేందుకు దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారు. రాజధానిలో దళితులు, బీసీలు ఉండటానికి వీల్లేదని, అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకుంటున్న టీడీపీనే.. ప్రస్తుతం అమరావతిలో దళితుల మధ్య విభేదాలను రాజేస్తూ మరో కుట్రకు తెరతీసింది. వెలగపూడిలో టీడీపీ కుట్రతో జరిగిన ఘర్షణలో ఓ దళిత మహిళ చనిపోయిన ఉదంతాన్ని అడ్డం పెట్టుకుని దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబు పన్నాగం పన్నుతున్నారు. దళితులు ఐక్యంగా ఉంటే టీడీపీకి నష్టమని.. ► దళితులు ఐక్యంగా ఉంటూ రాష్ట్రంలో రాజకీయంగా బలీయ శక్తిగా ఉండటాన్ని ప్రతిపక్షత నేత చంద్రబాబు సహించలేకపోతున్నారు. రాష్ట్రంలో దళితులు సమష్టిగా దాదాపు 18 శాతం ఓట్లు కలిగి ఉన్నారు. ఇంత పెద్ద ఓటు బ్యాంకు వైఎస్సార్సీపీకి సంప్రదాయంగా బలమైన మద్దతుదారుగా ఉంది. ► 2019లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అఖండ విజయానికి వెన్నుదన్నుగా నిలిచింది. దళితులు ఐక్యంగా ఉంటే మునుముందు తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని చంద్రబాబుకు బోధపడింది. అందుకే దళితులను విభజించేందుకు చంద్రబాబు కుట్రకు తెర తీశారు. వెలగపూడిలో టీడీపీ దిగజారుడు రాజకీయం ► గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో దళితుల మధ్య తలెత్తిన చిన్న వివాదాన్ని టీడీపీ కుట్రపూరితంగా రెచ్చగొట్టింది. చంద్రబాబు కనుసన్నల్లో టీడీపీ నేతలు ఆ గ్రామంలో ఇరువర్గాల మధ్య వివాదానికి ఆజ్యం పోశారు. ► ఆ గ్రామంలోని దళితవాడలో సిమెంట్ రోడ్డు.. ఆర్చ్ నిర్మాణం విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన అభిప్రాయ బేధాలను క్రిస్మస్ తర్వాత సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఏకాభిప్రాయానికి వచ్చాయి. దీన్ని టీడీపీ సహించలేకపోయింది. ► ఈ అంశాన్ని ఘర్షణలకు దారితీసేంత తీవ్ర వివాదంగా మలచాలని టీడీపీ అధినాయకత్వం తమ పార్టీ నేతలకు స్పష్టం చేసింది. దాంతో టీడీపీకి చెందిన న్యాయవాది జడారి శ్రావణ్ కుమార్, మరికొందరు పార్టీ నేతలు, కార్యకర్తలు రంగంలోకి దిగి, ఆజ్యం పోసి రెచ్చగొట్టారు. దీంతో ఆదివారం రాత్రి ఇరువర్గాలు పరస్పరం కర్రలతో దాడులకు పాల్పడ్డాయి. ఎనిమిది మంది గాయపడగా, వారిలో మరియమ్మ అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. శవ రాజకీయాలు చేస్తున్న టీడీపీ ► తాము రాజేసిన చిచ్చుతో ఓ అమాయక దళిత మహిళ ప్రాణాలు కోల్పోయినప్పటికీ చంద్రబాబు శాంతించలేదు. మరియమ్మ మృతదేహాంతో వెలగపూడిలో టీడీపీ నేతలు ధర్నా చేశారు. హోంమంత్రి సుచరిత, తదితరులు గ్రామంలో పర్యటించి సర్ది చెప్పడంతో పోస్టుమార్టంకు మరియమ్మ కుటుంబ సభ్యులు సమ్మతించారు. ► అనంతరం అంత్యక్రియలు చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు సిద్ధపడుతుండగా టీడీపీ నేతలు వారిని ప్రభావితం చేసి ఆమె మృతదేహంతో సోమవారం తుళ్లూరు–వెలగపూడి రోడ్డుపై ధర్నాకు దిగారు. ఇది టీడీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ► ఈ కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ నందిగాం సురేశ్ను ఏ–1గా చేర్చాలని, ఎఫ్ఐఆర్ కాపీ తమకు చూపించాలని అసంబద్ధ డిమాండ్తో టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారుడుతనం ప్రదర్శిస్తోంది. ఈ కేసును విచారించి ఎంపీ నందిగాం సురేశ్ పాత్ర ఉన్నట్టు తేలితే ఆయన పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తామని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ప్రకటించారు. ► కానీ టీడీపీ నేత జడారి శ్రవణ్ కుమార్, ఆయన అనుచరులు మాత్రం అందుకు సమ్మతించకుండా ధర్నా కొనసాగిస్తుండటం టీడీపీ ఉద్దేశాన్ని తేటతెల్లం చేస్తోంది. ► శవపేటికలో పెట్టిన మరియమ్మ మృతదేహాన్ని వెలగపూడి–తుళ్లూరు రోడ్డులో దించి మరీ టీడీపీ ధర్నా కొనసాగిస్తుండటం బాధాకరమని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం మధ్యలో మృతదేహాన్ని దించరాదని చెబుతున్నారు. తొలి నుంచీ బాబు దళిత వ్యతిరేకి ► చంద్రబాబు ఆది నుంచి దళితుల పట్ల వ్యతిరేకంగానే ఉన్నారు. 1995–2004లో, 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చాక కూడా తీరు మారలేదు. ‘ఎవరైనా దళితులుగా పుట్టాలనుకుంటారా?’ అని వ్యాఖ్యానించడం తెలిసిందే. ► అమరావతిలో దళితుల ఎసైన్ట్ భూములను తన బినామీల పేరిట తక్కువ ధరకు కొల్లగొట్టారు. అక్కడ దళితులను లేకుండా చేయాలని కుట్ర పన్నారు. ఇది గ్రహించే దళితులతో సహా అన్ని వర్గాల వారు అమరావతి పరిధిలోని మంగళగిరి (లోకేశ్ ఓడిపోయారు), తాడికొండ నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించినా బాబు మారలేదు. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమరావతిలో 54 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయిస్తే.. వీరిలో ఎక్కువ మంది దళితులు ఉండటంతో టీడీపీ కోర్టును ఆశ్రయించి అడ్డుకుంది. ‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే అమరావతిలో ‘సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది’ అని నిస్సిగ్గుగా వాదించింది. తక్షణం స్పందించిన ప్రభుత్వం ► వెలగపూడిలో ఘర్షణలపై ప్రభుత్వం తక్షణం స్పందించింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఘర్షణలను నివారించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగాం సురేశ్, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, రాష్ట్ర రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్రావు తదితరులు వెలగపూడిలో పర్యటించారు. ► మరియమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. దళితులు అంతా ఒకటే కుటుంబమని చెప్పి అందరం ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మరియమ్మ కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ.10 లక్షలు ఇచ్చారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ► గాయపడిన వారికి పూర్తి చికిత్స అందిస్తామని, అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. దాడులను నివారించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తుళ్లూరు సీఐ ధర్మేంద్ర బాబును వీఆర్కు పంపుతూ గుంటూరు రేంజ్ డీఐజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెలగపూడిలో రాళ్లు, కర్రలతో పరస్పర దాడులు సాక్షి, గుంటూరు/తాడికొండ: వెలగపూడి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామంలో ఇటీవల సిమెంట్ రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డుకు ప్రారంభంలో ఆర్చ్ ఏర్పాటు చేసి, బాబూ జగ్జీవన్రామ్ కాలనీగా నామకరణం చేయాలని ఓ వర్గం ప్రయత్నిస్తోంది. అయితే రోడ్డుకు ప్రారంభంలో ఉన్న గృహాల వారు (మరో వర్గం) దీన్ని వ్యతిరేకించడంతో నాలుగు రోజులుగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి రెండు వర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది గాయపడ్డారు. ఐదుగురిని తాడేపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి, ఇద్దరిని అమరావతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరియమ్మను తొలుత గుంటూరు జీజీహెచ్కు తరలించి, మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించింది. మరియమ్మ మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆమె కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు సోమవారం తుళ్లూరు – వెలగపూడి ప్రధాన రహదారిపై మృతదేహంతో నిరసన చేపట్టారు. వివాదం ముదరడానికి ఓ కారకుడైన తుళ్లూరు సీఐ ధర్మేంద్రబాబును సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం : హోం మంత్రి సుచరిత గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో అలజడులకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. మరియమ్మ మృతి విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించారని, బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తక్షణ సాయం కింద రూ.10 లక్షలు అందించాల్సిందిగా ఆదేశించారని తెలిపారు. ఎస్సీలను విడగొట్టాలని చూస్తున్న చంద్రబాబు మాయలో పడొద్దని కోరారు. మహానేతలైన అంబేడ్కర్, జగ్జీవన్రామ్లను ఆదర్శంగా తీసుకుందామని చెప్పారు. గ్రామంలో శాంతి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుందని తెలిపారు. తుళ్లూరు ప్రాంతంలో పోలీస్ అధికారులపై వస్తున్న ఫిర్యాదులపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. అర్ధరాత్రి వెలగపూడి బయల్దేరిన హోం మంత్రి తాము పేర్కొన్న వారి పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేసి ప్రతిని అందించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన పోలీస్ అధికారులు ప్రాథమిక సమాచారం మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, నిష్పక్షపాతంగా విచారణ చేసి సాంకేతిక ఆధారాలు సేకరించి బాధ్యులైన ప్రతి ఒక్కరిని కేసులో చేర్చుతామని ఎస్పీ విశాల్ గున్నీ చెప్పారు. అయినప్పటికీ రాత్రి 11 గంటలైనా ఆందోళన విరమించలేదు. దీంతో హోం మంత్రి 11.30 గంటల ప్రాంతంలో వెలగపూడికి వెళ్లారు. -
రాష్ట్రంలో గృహశోభ
సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రమంతటా ఇళ్ల పట్టాలు, నిర్మాణాల పండుగ జరుగుతోందని.. వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ మొదలు కొత్త సంవత్సరం, సంక్రాంతి వరకు ఇది కొనసాగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 30.75 లక్షల ఇళ్ల స్థల పట్టాల పంపిణీతో పాటు, రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణం, మరో 2.62 లక్షల టిడ్కో ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా సోమవారం ఆయన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరులో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో పాటు తొలి దశలో నిర్మించనున్న ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్లో ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ‘తొలి దశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్లలో చిత్తూరు జిల్లాలో 1,78,840 ఇళ్లు ఉన్నాయి. ఈ జిల్లాలో 2.50 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. ఊరందూరు లేఅవుట్లో ఏకంగా 6,232 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నాం. ఇక్కడ ప్లాన్ చాలా చక్కగా ఉంది. ఇక్కడే ఆర్బీకే కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, ఆటో స్టాండ్, వైఎస్సార్ జనతా బజార్, కల్యాణ మండపాలు, వార్డు సచివాలయం, పార్కులు, ప్రభుత్వ పాఠశాలలు రానున్నాయి’ అని చెప్పారు. ఇక్కడ మార్కెట్ రేటు ప్రకారం ఒక్కో ప్లాటు విలువ రూ.7 లక్షలు ఉంటుందన్నారు. ఒక అన్నగా, తమ్ముడిగా అక్కచెల్లెమ్మలకు ఈ ఆస్తిని ఇస్తున్నానని, ఇందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాను ► ‘‘అక్క చెల్లెమ్మలకు అన్ని విధాలా అండగా ఉంటానని మాట ఇచ్చాను. 18 నెలలుగా ఆ దిశగా అడుగులు వేస్తున్నాను. అమ్మ ఒడి పథకం ద్వారా దాదాపు 43 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.6,352 కోట్లు వారి చేతిలో పెట్టాం. విద్యా దీవెన పథకం ద్వారా 18.52 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.4 వేల కోట్లు ఇచ్చాం. వసతి దీవెన కింద 15.56 లక్షల తల్లులకు రూ.1,221 కోట్లు ఇచ్చాం. ► ఆసరా కింద పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు తొలి ఏడాదిలో 87.74 లక్షల మందికి రూ.6,792 కోట్లు ఇచ్చాం. చేయూతలో వారి చేయి పట్టుకుని నడిపిస్తూ 24.55 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,604 కోట్లు చేతికి అందించాం. పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకంలో 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.1,400 కోట్లు ఇచ్చాం. కాపు నేస్తం పథకంలో 3.28 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.492 కోట్లు ఇచ్చాం. ఆ కష్టాలు స్వయంగా చూశాను ► నా సుదీర్ఘ 3,648 కి.మీ పాదయాత్రలో సొంతిల్లు లేని వారి కష్టాలు స్వయంగా చూశాను. 25 లక్షల ఇళ్లు కట్టి ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పాం. కానీ ఇవాళ దాదాపు 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు, ఇల్లు కూడా కట్టించి ఇస్తున్నాం. మొత్తంగా 1.24 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది. ► ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇంటి స్థలం ఇస్తాం. తర్వాత ఇల్లు కట్టిస్తాం. ఊళ్లు రాబోతున్నాయి ► 17 వేల రెవెన్యూ గ్రామాల్లో 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల లేఅవుట్లు వేసి, గతంలోలా 224 చదరపు అడుగుల్లో కాకుండా, 340 చదరపు అడుగుల్లో ఇళ్లు కట్టిస్తున్నామంటే అవి కాలనీలు కావు.. ఊళ్లు రాబోతున్నాయి. ఈ ఇళ్లలో మౌలిక సదుపాయాల కోసం రూ.7 వేల కోట్లకు పైగా వ్యయం చేస్తున్నాం. ► రాష్ట్ర వ్యాప్తంగా 68,361 ఎకరాల్లో వేసిన లేఅవుట్లు, ప్లాట్ల మార్కెట్ విలువ దాదాపు రూ.25,530 కోట్లు. అంత ఆస్తిని 30.75 లక్షల మంది అక్క చెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం. ప్రతి ఇంట్లో ఒక బెడ్రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, వరండా, టాయిలెట్, పైన సింటెక్స్ ట్యాంక్ ఉంటాయి. రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, మరో రెండు ఎల్ఈడీ లైట్లు కూడా ఉంటాయి. కాలనీల్లో 13 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టాం. ఇళ్ల నిర్మాణం.. టిడ్కో ఇళ్లు ► తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం పనులు కూడా మొదలయ్యాయి. మిగిలిన 12.70 లక్షల ఇళ్లు వచ్చే ఏడాది మొదలు పెడతాం. ఇవి కాక 2.62 లక్షల టిడ్కో ఇళ్లు అక్క చెల్లెమ్మలకు ఇవ్వబోతున్నాం. ఇందుకు దాదాపు రూ.9,500 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ► టిడ్కో ఇళ్లలో 300 చదరపు అడుగుల ఇంటిని కేవలం ఒక్క రూపాయికే సేల్ అగ్రిమెంట్ ఇస్తున్నాం. ఒక్క రూపాయికే ఇల్లు ఇచ్చే జగనన్న స్కీమ్ కావాలా? లేక రూ.7.20 లక్షలు చెల్లించే చంద్రబాబు స్కీమ్ కావాలా? అని రాష్ట్ర వ్యాప్తంగా ఆప్షన్ కోరితే ఒకే ఒక్కరు చంద్రబాబు స్కీమ్ కోరారు. ► 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులకు కూడా వారు కట్టాల్సిన ముందస్తు వాటాలో 50 శాతం ప్రభుత్వం భరిస్తోంది. మొత్తంగా టిడ్కో ఇళ్లకు ప్రభుత్వంపై అదనంగా దాదాపు రూ.4,287 కోట్ల భారం పడుతున్నా చిరునవ్వుతో భరిస్తున్నాం. ఎందరికో ఉపాధి.. ఆర్థిక పురోగతి ► ఇల్లు నిర్మాణం అంటే, ముగ్గు పోసి పునాదులు తవ్వడంతో అయిపోదు. తాపీ మేస్త్రీలు, కూలీలు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్లు, వెల్డర్లు, ఆటో వాళ్లు.. ఇలా 30 రకాల వృత్తుల వారు లక్షలాది మందికి లబ్ధి కలుగుతుంది. ► తొలి దశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్లకు 69.70 లక్షల టన్నుల సిమెంట్, 7.4 లక్షల టన్నుల స్టీల్, 310 లక్షల టన్నుల ఇసుక, 235 కోట్ల ఇటుకలు, 223 కోట్ల మెట్రిక్ టన్నుల మెటల్ వాడుతున్నారు. వ్యవస్థలో ఆర్థికంగా బూస్ట్ వస్తుంది’’ సీఎం జగన్ అన్నారు. ► అనంతరం లబ్ధిదారులు పుష్ప, జ్యోతి, ధనలక్ష్మి, సృజనీ, రజియాలకు సీఎం ఇంటి పట్టాలు అందజేశారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు, ఊరందూరు లేఅవుట్లోని మోడల్ హౌస్ను సంబంధిత లబ్ధిదారురాలికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు ధర్మాన కృష్ణదాస్, నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీరంగనాథరాజు, మేకపాటి గౌతమ్రెడ్డి, ఎమ్మెల్యేలు బియ్యపు మదుసూధనరెడ్డి, భూమన, రోజా, చెవిరెడ్డి, పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అక్కడ పేదలకు స్థలాలు ఇవ్వకూడదా? ► అమరావతిలో 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధమైతే, డెమొగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ (కులపరమైన అసమతుల్యం) వస్తుందని చంద్రబాబు మనుషులు కొందరు కొన్ని చోట్ల కోర్టుకు వెళితే, కోర్టు స్టే ఇచ్చింది. దీంతో 3.74 లక్షల పట్టాలు ఇవ్వలేకపోతున్నాం. ► విశాఖపట్నంలో 1.80 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన వారు ఏ అభ్యంతరం తెలుపలేదు. వాటితో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి వాటిపై స్టే తీసుకొచ్చారు. రాజమండ్రిలో ఆవ భూములు అని చెప్పి స్టే తెచ్చారు. దాని వల్ల 27 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలంటే అవరోధం ఏర్పడింది. ► నా సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా స్టే తెచ్చారు దుర్మార్గులు, రాక్షసులు. అవి ఏపీఐఐసీ భూములని, మైనింగ్ భూములంటూ కోర్టుకు పోయారు. 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ మేరకు ఇల్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. అయినా కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారు. వీళ్లందరికీ దేవుడు మొట్టికాయలు వేస్తాడు. న్యాయం జరుగుతుంది. త్వరలో మిగిలిపోయిన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం. అన్నా మీరు విన్నారు.. ఆదుకున్నారు అన్నా.. నా పేరు పుష్ప. మా ఆయన తిరుమల్రావు కూలీ పని చేస్తాడు. మాకిద్దరు చిన్న పిల్లలు. మాకు సొంతిల్లు లేదు. దీంతో నా బిడ్డ పురిటి సమయంలో ఎన్నో కష్టాలు పడ్డాము. నాకు అన్నదమ్ములు లేరు. ఈ పరిస్థితిలో సొంత అన్నలా ఆదుకుంటూ మీరు నాకు ఇంటి పట్టా ఇస్తున్నారు. మీ వల్ల నాలాగే రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరూ సంతోషంగా ఉన్నారు. మీ పాదయాత్రలో ‘నేను విన్నాను.. నేను ఉన్నాను..’ అని చెప్పారు. ఇప్పుడు ఆ మాట నిలుపుకుంటూ నవరత్నాలతో మమ్మల్ని ఆదుకుంటున్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక, వైఎస్సార్ ఆసరా, చేయూత ఇలా ఒక్కటేమిటి.. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఇళ్ల పట్టా ఇవ్వడం గొప్ప కార్యక్రమం. ఏ ప్రభుత్వం ఇలా 30 లక్షల మందికి పైగా స్థలాలిచ్చి, ఇళ్లు కట్టించడం లేదు. పైగా మా (మహిళలు) పేరుతోనే ఇస్తున్నారు. – పుష్ప, ఏర్పేడు, చిత్తూరు మాకు అడ్రస్ ఇచ్చారన్నా.. నా పేరు జ్యోతి. మాకు ఇద్దరు పిల్లలు. నాకు ఆరేళ్లప్పుడే మా అమ్మ చనిపోయింది. పదేళ్లప్పుడు నాన్న చనిపోయాడు. అలాంటి నాకు ‘నేను ఉన్నాను చెల్లెమ్మా’ అంటూ అమ్మ ప్రేమను, నాన్న అనురాగాన్ని పంచుతూ ఇంటికి యజమానిని చేస్తున్నారు. అన్నా.. మేము చెరువు కట్టపై ఉంటున్నాం. వానకు, ఎండకు ఇబ్బందులు పడుతున్నాం. ఇన్నాళ్లూ ఎవరూ ఏమీ చేయలేదు. నా ఊరు ఇది అని చెప్పుకునేందుకు అడ్రస్ లేని వాళ్లం. అటువంటి సమయంలో మీరు మాకు అడ్రస్ ఇచ్చారు. ఇప్పుడు నా ఊరుపేరు ‘జే సిటీ’. నా ఇంటి నంబర్ 305. (భావోద్వేగానికి లోనవుతూ) నాలాగే ఆ కట్టపై ఉన్న మరో 25 మందికి ఇంటి స్థలాలు ఇచ్చారు. ఇళ్లు కట్టిస్తున్నారు. ‘నీకేమి మీ అన్న ఉన్నాడు. ఇంటికి మహరాణిని చేశాడు. మీ అమ్మను ఏమైనా అంటే వాళ్ల అన్నకు చెబుతుంది’ అని మా ఆయన మా బిడ్డతో అంటున్నాడు. మీ వల్లే నాకు ఈ గౌరవం. పండుగ అంటే ఇదే అన్నా. – జ్యోతి, అమ్మపాలెం చెరువు కట్ట అన్ని పథకాల్లో అక్కచెల్లెమ్మలకే ప్రాధాన్యత ఇస్తూ ఎక్కడా అవినీతి, వివక్షకు తావు లేకుండా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్చు జమ చేశాం. ఇళ్ల స్థలాలు, ఇళ్లు కూడా అక్కచెల్లెమ్మల పేరుతోనే ఇస్తున్నాం. ఆలయ ట్రస్టు బోర్డు పదవులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ పోస్టులు, బీసీ కార్పొరేషన్లలో, రాజకీయ నియామకాల్లో 50 శాతం వారికే చెందాలని చట్టాలు చేశాం. ఇది మీ అందరి ప్రభుత్వం.. మీ అన్న ప్రభుత్వం.. మీ తమ్ముడి ప్రభుత్వం.. అని గర్వంగా చెబుతున్నాను. సీఎం వైఎస్ జగన్ -
రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పండుగ: సీఎం జగన్
-
నా ఇంటి నెంబరు 305..
సాక్షి, చిత్తూరు: ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలు, పేదల పక్షపాతి అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అక్కాచెల్లెమ్మలు ధన్యవాదాలు చెబుతున్నారు. ఒక అన్నలా తమకు అండగా ఉంటున్నందుకు రుణపడి ఉంటామంటూ అభిమానం చాటుకుంటున్నారు. కాగా చిత్తూరు జిల్లాలోని ఊరందూరులో వైఎస్సార్ జగనన్న కాలనీలో 167 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో కూడి 6,232 ప్లాట్లు వేశారు. వీటిలో 4,299 ప్లాట్లను పట్టణ పేదలకు, 465 శ్రీకాళహస్తి రూరల్, 1,468 ప్లాట్లు ఏర్పేడు రూరల్ ప్రాంతాలకు చెందిన పేదలకు కేటాయించారు. తొలివిడతలో భాగంగా 5,548 ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ సోమవారం శ్రీకారం చుట్టారు. ఇళ్ల స్థలాల పంపిణీ, వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్దిదారులు సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. ఏర్పేడు మండలానికి చెందిన పుష్ప మాట్లాడుతూ.. ప్రభుత్వం పథకాల ద్వారా తమ కుటుంబమంతా లబ్ది పొందినట్లు పేర్కొన్నారు. ‘‘ అన్నా నా పేరు పుష్ప.. మా ఆయన తిరుమల్రావు.. కూలీపని చేస్తాడు.. మాకిద్దరు చిన్న పిల్లలు వాళ్లను చూసుకుంటూ నేను ఇంట్లోనే ఉంటా. మాకు సొంతిళ్లు లేదు. ఈ కారణంగా నా పురిటి సమయంలో ఎన్నో కష్టాలు పడ్డాము. బిడ్డను ఎత్తుకుని అద్దెంటికి వెళ్తే వెళ్లగొట్టారు. నాకు అన్నాదమ్ముళ్లు లేరు. అమ్మకు అక్కా, నేనే. ఆనాడు ఎంత బాధ పడ్డానో నేడు అంతకంటే ఎక్కువ సంతోపడుతున్నాను. మా అన్న నాకు ఇంటి పట్టా ఇస్తున్నాడు. నాలాగే రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలందరూ సంతోషంగా ఉన్నారు. పాదయాత్రలో భాగంగా నేను విన్నాను ఉన్నాను చేస్తాను అని చెప్పారు. నవరత్నాలు ఒక్కొక్కటిటా నెరవేరుస్తున్నారు. అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, చేయూత, జగనన్న విద్యాకానుక ఇలా ఒక్కటేమిటి పేదలకు లబ్ది చేకూరేలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అన్నింటిలో పేదలకు ఇళ్ల పట్టా ఇవ్వడం అత్యంత గొప్పది. ఏ ప్రభుత్వం ఇలా 30 లక్షలకు పైగా ఇళ్లు కట్టివ్వడం లేదు. మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తున్న మీకు రుణపడి ఉంటాం’’ అని ఉద్వేగానికి గురయ్యారు.(చదవండి: ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు: సీఎం జగన్) వేదిక మీద మాట్లాడుతున్న పుష్ప నా ఇంటి నెంబరు 305.. జ్యోతి కన్నీటిపర్యంతం ‘‘అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి మాకు ఇద్దరు పిల్లలు. అన్నా.. పండుగ అంటే ఇదేనన్నా. మాకోసం ముందుగానే సంక్రాంతి పండుగ తీసుకువచ్చారు. ఉగాదికే పట్టాలు రావాల్సింది. మాకోసం ఎన్నో అవాంతరాలు దాటి నేడు కలను సాకారం చేశారు. ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. నాకు ఆరేళ్లప్పుడే మా అమ్మ చనిపోయంది. పదేళ్లప్పుడు నాన్న చనిపోయాడు. అలాంటి నాకు నేను ఉన్నాను చెల్లెమ్మా అంటూ అమ్మ ప్రేమను, నాన్న అనురాగాన్ని పంచుతూ ఇంటికి యజమానిని చేస్తున్నారు. ఎల్లప్పుడూ నీకు రుణపడి ఉంటా. మేం చెరువు కట్టమీద ఉంటాం. సొంతస్థలం లేదు. అడ్రస్ లేని నాకు అడ్రస్ ఇచ్చారు. ఇక్కడ.. 305 నా ఇంటి నెంబరు. ఇన్నాళ్లు వానకు తడిసేవాళ్లం. ఎండకు ఎండేవాళ్లం. ఏ నాయకుడు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కానీ నువ్వు కరోనా సమయంలో కూడా మమ్మల్ని ఎంతగానో ఆదుకున్నావు. మా ఇంట్లో వాళ్లందరం ప్రభుత్వ పథకాలు పొందుతున్నాం. నాకు తల్లీదండ్రీ నువ్వే అన్నా. ఒక విషయం చెప్పనా అన్నా.. నన్ను సరదాకైనా మా ఆయన ఒక్క మాట అనడం లేదు. ‘‘మీకేమమ్మా మీ అన్న ఉన్నాడు. ఇంటికి మహరాణిని చేశాడు’’అంటాడు. అమ్మను ఏమైనా అంటే వాళ్ల అన్నకు చెబుతుంది అని నా బిడ్డకు చెప్తాడు. నాకు ఇంతటి గౌరవం కల్పించినందుకు పాదాభివందనాలు చేస్తున్నా. కట్టమీద ఉన్న అందరికీ ఇళ్లు వచ్చాయి. అందరి తరఫున కృతజ్ఞతలు. మా అన్నే అధికారంలో ఉండాలి. మన బిడ్డల తరంలో కూడా అన్నే ఉండాలా. కష్టం మన ఇంటి గడప కూడా దాటనివ్వకుండా చూస్తాడు’’ అంటూ కన్నీటి పర్యమంతమయ్యారు. -
ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు: సీఎం జగన్
సాక్షి, చిత్తూరు: శ్రీకాళహస్తి(మం) ఊరందూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 'నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు' పథకం ప్రారంభించారు. ఊరందూరులో 'నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు' పైలాన్ని ఆవిష్కరించారు. తొలి విడతలో నిర్మించనున్న ఇళ్ల పనులను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర వ్యాప్తంగా నేడు పండుగ జరుగుతోంది. సొంతిళ్లు లేని నిరుపేదల్లో చిరునవ్వు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 30.75లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నాం. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నాం. శ్రీకాళహస్తిలో 7 లక్షల రూపాయల విలువైన ప్లాట్ను అక్కాచెల్లెమ్మలకు ఇస్తున్నాం’ అన్నారు. అమ్మ ఒడి, చేయూత, వసతి దీవెన వంటి పథకాల ద్వారా నేరుగా మహిళలకే నగదు అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. అవినీతికి తావు లేకుండా నేరుగా అక్కాచెల్లెమ్మల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం అన్నారు సీఎం జగన్. అలానే ఇళ్ల పట్టాలను నిరంతర ప్రక్రియగా మార్చామని.. అర్హులైనవారు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో.. ఇంటి స్థలం కేటాయించేలా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సహా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. లే అవుట్ విస్తీర్ణం బట్టి పార్క్లు, అంగన్వాడీలు, విలేజ్ క్లీనిక్లు, ఆర్బీకేలు ఏర్పాటు చేస్తాం. 224 చదరపు అడుగుల నుంచి 340 చదరపు అడుగులకు విస్తీర్ణం పెంచాం. 300 చదరపు అడుగులు ఉన్న టిడ్కో ఇళ్లను ఒక రూపాయికే అందిస్తున్నాం. టిడ్కో ఇళ్లను పూర్తి చేసేందుకు 9వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నాం’ అన్నారు. (చదవండి: ఇళ్లు.. పుష్కలంగా నీళ్లు) ‘లక్షా 43వేల మంది టిడ్కో లబ్ధిదారుల్లో ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీం కావాలన్నారు. 365, 430 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లల్లో.. 50శాతం లబ్ధిదారుల వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనివల్ల ప్రభుత్వంపై 4,250 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది’ అన్నారు సీఎం జగన్. ఇక ‘ఇళ్ల స్థలాల పంపిణీలో కులం, మతం, పార్టీ వంటి బేధాలు చూడలేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటిని అందిస్తున్నాం. పారదర్శకతలో భాగంగా లబ్దిదారుల జాబితాను గ్రామ సచివాలయంలో పెడుతున్నాం’ అని తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చాం ఇక ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చామన్నారు సీఎం జగన్. మొదటి ఆప్షన్లో నిర్మాణ సామాగ్రి, లేబర్ ఛార్జీలను లబ్ధిదారులకు ఇస్తాం. రెండో ఆప్షన్లో నిర్మాణ ఖర్చులను పురోగతి వారీగా డబ్బులు చెల్లిస్తాం. మూడో ఆప్షన్లో పూర్తిగా ప్రభుత్వమే ఇంటి నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందిస్తాం అని తెలిపారు. లబ్ధిదారుల పేరుతోనే ఇంటి రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం అన్నారు. చంద్రబాబు అండ్ కో కుట్రలతో రిజిస్ట్రేషన్లు జరగలేదని తెలిపారు. ప్రస్తుతం లబ్ధిదారులకు కేవలం 'డి' పట్టాలు మాత్రమే ఇస్తున్నామని.. న్యాయపరమైన చిక్కులు తొలగిపోగానే లబ్ధిదారులకు అన్ని హక్కులు కల్పిస్తామన్నారు. డిసెంబర్ 25న ఇళ్ల పట్టాలు పంచుతామని తెలిసి 24న కోర్టుకు వెళ్లారు.. చంద్రబాబు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో దీన్ని బట్టే తెలుస్తుందని జగన్ మండి పడ్డారు. (చదవండి: ఒక అద్భుతం... ఓ ఆశ్చర్యం!) పులివెందులలో ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టు ద్వారా స్టే తెచ్చారు. అమరావతిలో 54వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. విశాఖలో 1.84లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇద్దామనుకుంటే.. ఇళ్ల పట్టాల కోసం ల్యాండ్ పూలింగ్ చేస్తే భూమి ఇచ్చినవారికి.. లబ్ధిదారులకి సంబంధం లేని వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. రాజమండ్రిలో ఆవా భూముల పేరుతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. ప్రభుత్వ భూములను కూడా పేదలకు కేటాయించకుండా అడ్డుకుంటున్నారు. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం కాగానే మిగిలిన వారందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. -
చిత్తూరు: సీఎం జగన్ ఇళ్ల పట్టాల పైలాన్ ఆవిష్కరణ
సాక్షి, చిత్తూరు: శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకాన్ని సోమవారం ప్రారంభించారు. పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసి.. వైఎస్సార్ జగనన్న కాలనీలో తొలి విడతలో నిర్మించనున్న ఇళ్ల నిర్మాణ పనులను పనులను సీఎం ప్రారంభించారు. అంతకుముందు 'నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు' పైలాన్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ జరుగుతోందని అన్నారు. సొంతిళ్లు లేని నిరుపేదల్లో చిరునవ్వు కనిపిస్తోందని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 30.75లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నామని అన్నారు. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నామని తెలిపారు. కాగా, ఊరందూరులో వైఎస్సార్ జగనన్న కాలనీలో 167 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో కూడి 6,232 ప్లాట్లు వేశారు. వీటిలో 4,299 ప్లాట్లను పట్టణ పేదలకు, 465 శ్రీకాళహస్తి రూరల్, 1,468 ప్లాట్లు ఏర్పేడు రూరల్ ప్రాంతాలకు చెందిన పేదలకు కేటాయించారు. తొలివిడతలో భాగంగా 5,548 ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి సోమవారం శ్రీకారం చుట్టారు. కాలనీని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు 8,600 మొక్కలు నాటారు. -
నేడు చిత్తూరు జిల్లాకు సీఎం జగన్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ సోమవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 9.30కు తాడేపల్లి నుంచి చిత్తూరు జిల్లాకు బయలుదేరతారు. 11.20కి ఊరందూరు చేరుకొని పైలాన్ ఆవిష్కరించి, పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తారు. అనంతరం వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తారు. అనంతరం అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు. తిరిగి మధ్యాహ్నం 2.50 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. కాగా, ఊరందూరులో వైఎస్సార్ జగనన్న కాలనీలో 167 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో 6,232 ప్లాట్లు వేశారు. వీటిలో 4,299 ప్లాట్లను పట్టణ పేదలకు, 465 శ్రీకాళహస్తి రూరల్, 1,468 ప్లాట్లు ఏర్పేడు రూరల్ ప్రాంతాలకు చెందిన పేదలకు కేటాయించారు. తొలివిడతలో భాగంగా 5,548 ఇళ్ల నిర్మాణానికి సోమవారమే శ్రీకారం చుట్టనున్నారు. కాలనీని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు 8,600 మొక్కలు నాటారు. -
కళ్ల నిండా ఆనందం
ఊరూ వాడా ఒకటే చర్చ.. ఎక్కడ నలుగురు గుమిగూడి ఉన్నా అదే మాటలు.. ‘సుబ్బమ్మత్తా.. నీ స్థలం ఎక్కడ? రాములమ్మా నీ ప్లాటెక్కడే? శ్రీదేవొదినా నీక్కూడా స్థలం వచ్చిందా?’ అంటూ చర్చోపచర్చలు. పేర్లు మారినా మూడు రోజులుగా ఊరూరా ఇవే సంభాషణలు. దేశంలోనే ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల క్రితం ఏకంగా 30.70 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టడం చర్చనీయాంశమైంది. ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కూడా ఉచితంగా కట్టించి ఇస్తామని ప్రకటించడం పట్ల లబ్ధిదారులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. సొంతింటి కల ఇంత త్వరగా సాకారం అవుతుందని అనుకోలేదని చెబుతున్నారు. అద్దె కోసం ఇతర ఖర్చులు తగ్గించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నామని, ఇకపై ఈ కష్టం ఉండదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జీవితంలో సొంతింట్లో ఉండగలమా.. అనే ప్రశ్న వేధించేదని, జగన్ పుణ్యమా అని ఇక ఆ ప్రశ్నకు తావేలేదని ఆనందం నిండిన కళ్లతో చెబుతున్నారు. పేదల సంక్షేమం కోసం పరితపిస్తున్న జననేతకు వారి గుండెల్లో గూడు కట్టుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి పట్టా అందుకుని సొంతింటి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన లబ్ధిదారుల మనోగతాలు ఇలా ఉన్నాయి. – సాక్షి నెట్వర్క్ నా మనవడు జగన్ వల్లే సొంతిల్లు మాది కాకినాడ. నా భర్త సత్యనారాయణ కాలం చేశారు. మాకు ముగ్గురు పిల్లలు. సొంతంగా ఇల్లు లేదు. అవసాన దశకు చేరుకున్న నేను జీవితంలో సొంతిల్లు చూస్తాననుకోలేదు. ఎన్నికల్లో అవ్వాతాతలను ఆదుకుంటానని నా మనవడు జగన్ చెప్పిన మాటలు ఇవాళ అక్షరాలా నిజం చేశాడు. అధికారంలోకి రాగానే పింఛన్ ఇచ్చాడు. ఇప్పుడు స్థలం ఇచ్చి, ఇల్లు కట్టిస్తున్నాడు. వలంటీర్ వచ్చి.. అవ్వా నీకు ఇల్లు మంజూరైందని చెప్పగానే నా జీవితకాల కల నెరవేరినట్లైంది. – అడపా నాగసుగుణ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా 12 సార్లు అర్జీ పెట్టినా రానిది.. 14 ఏళ్ల కిందట పొట్ట చేత పట్టుకుని ఈ గ్రామానికి వచ్చాం. అప్పట్నుంచి ఇంటి స్థలం కోసం 12 సార్లు అర్జీ పెట్టాను. అయినా ప్రయోజనం లేకపోయింది. సీఎం జగన్ చలువతో ఒక్క దరఖాస్తుతో ప్లాటు మంజూరైంది. అంతా కలగా ఉంది. స్థలం ఇవ్వటంతో పాటు ఇల్లు కట్టి ఇస్తున్న సీఎం వైఎస్ జగన్ మేలును ఎప్పటికీ మరువలేము. – తన్నీరు రమాదేవి, వీరపనేనిగూడెం, కృష్ణా జిల్లా ఇన్నాళ్లూ తిరిగి తిరిగి అలసిపోయాం సొంతింట్లో ఉండాలనేది మా కల. దాని కోసం చేయని ప్రయత్నం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు దరఖాస్తు ఇచ్చామో లెక్కలేదు. జన్మభూమి కమిటీలు, నాయకుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాం. కానీ ఫలితం లేదు. ఇంటి స్థలం మాకు లేదని వలంటీర్కు చెప్పాను. ఇంటి స్థలం మంజూరయ్యేలా చేశారు. ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తుందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. – దోనిపర్తి శ్రీదేవి, మైపాడు, ఇందుకూరుపేట మండలం, నెల్లూరు జిల్లా ఇప్పుడు ఆ భయం లేదు పదేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఎవరూ చేయని మేలును సీఎం జగన్ చేశారు. ఇంటి అద్దెలు చెల్లించలేక, పిల్లలను చదివించుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ ఆలోచన మళ్లీ రాలేదు. ఆ భయం లేదు. మా పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్నాం. ఇప్పుడు ఇంటి స్థలం ఒక్కసారి దరఖాస్తు చేయగానే వచ్చింది. – విజయలక్ష్మి, దండోరా కాలనీ, కడప చెప్పలేనంత ఆనందంగా ఉంది బతుకుదెరువు కోసం పదేళ్ల కిందట ఎస్.కోట వచ్చాం. అద్దెలు కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఎప్పటికైనా సొంత ఇల్లు ఒకటి ఉంటే బావుంటుందని కలలు కనేవారం. ఇప్పుడు నాకు ఇంటి స్థలం ఇచ్చారు. కట్టుకోలేమన్న వారికి ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుందని జగన్ అన్న చెబుతున్నారు. ఆయన మాట చెప్పారంటే అది శాసనం. మాకు సొంత ఇల్లు వస్తుందన్న ఊహే చెప్పలేనంత ఆనందంగా ఉంది. మా కల నిజం చేసిన జగనన్నను ఎప్పటికీ మరచిపోం. – సింహాద్రి సంతోషి, ఎస్.కోట, విజయనగరం జిల్లా టీడీపీ వాళ్లమైనప్పటికీ ఇల్లు మంజూరు నా భర్త ఓ ప్రైవేట్ స్కూల్లో వాచ్మెన్. తిరుపతి శివజ్యోతి నగర్లో 40 ఏళ్లుగా కాపురం ఉంటున్నాం. అనేకసార్లు ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఫలితం లేదు. ఇప్పుడు వార్డు వలంటీర్ మా ఇంటికి వచ్చి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలివ్వాలని అడిగారు. ఇన్నేళ్లు రాని ఇంటి పట్టా ఇప్పుడు వస్తుందా..? అనుకున్నాను. వలంటీర్ బలవంతంగా దరఖాస్తు చేయించింది. ఎవరి సిఫార్సు లేకుండానే ఇల్లు కూడా మంజూరవడంతో ఆశ్చర్యపోయాం. కొన్నేళ్లుగా టీడీపీ సానుభూతిపరురాలుగా ఉన్న నాకు సీఎం జగన్ వల్లే స్థలం వచ్చింది. ఇల్లు కూడా కట్టిస్తున్నారంటే ఆనందంగా ఉంది. చిరకాల స్వప్నం నెరవేర్చారు. – ఎన్.వనజాక్షి, శివజ్యోతినగర్, తిరుపతి నిజంగా ఇది పేదల ప్రభుత్వం రోడ్డు పక్కనున్న ప్రభుత్వ స్థలంలో తాటాకు పాక వేసుకుని జీవిస్తున్నాం. భర్త చనిపోయి పదేళ్లవుతుంది. కూతురుతో కలసి పాకలోనే ఉంటున్నాం. టిడ్కో ఇంటికి దరఖాస్తు చేసుకున్నాను. ప్రభుత్వం రూపాయికే ఇల్లు మంజూరు చేసింది. టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇంటికి 20 ఏళ్లు పాటు బ్యాంకు రుణం చెల్లించాలని చెప్పితే జగన్ ఒక్క రూపాయి కడితే చాలని చెప్పారు. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడంతో ఆనందంగా ఉంది. నిజంగా ఇది పేదల ప్రభుత్వం. – మాకిరెడ్డి రమణమ్మ, నర్సీపట్నం మున్సిపాలిటీ, విశాఖ జిల్లా అన్నలా ఆదుకుంటున్నాడు పేదరికంతో కన్న తల్లిదండ్రులు కూడా ఇవ్వలేని ఇంటి స్థలం జగనన్న ఇచ్చారు. సొంత అన్నలా ఆడపడుచులను ఆదుకుంటున్నారు. 30 ఏళ్లుగా ఇంటి స్థలం కోసం ఎన్నో అర్జీలు పెట్టినా పట్టించుకోలేదు. జగనన్న ప్రభుత్వంలో దరఖాస్తు పెట్టిన వెంటనే ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేశారు. పేదల గుండెల్లో సీఎం జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారు. – చందన భాస్కరలక్ష్మి, దేవరపల్లి, పశ్చిమగోదావరి జిల్లా ఇన్నాళ్లూ ఒకే ఇంట్లో మూడు కుటుంబాలు ఇప్పట్లో సొంత ఇల్లు వచ్చే అవకాశం లభిస్తుందని అనుకోలేదు. మూడు కుటుంబాల వాళ్లం ఒకే ఇంటిలో నివాసముంటున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. విడిగా అద్దె ఇంట్లో ఉండాలంటే మా ఆదాయం సరిపోవటం లేదు. ఈ కష్టాల నుంచి గట్టెక్కే మార్గం లేదా అని అనుకుంటున్న సమయంలో సీఎం జగన్ చెప్పడంతో ఇంటి స్థలానికి దరఖాస్తు పెట్టుకున్నా. నాకు ఇంటి స్థలం పట్టా మంజూరైంది. ఇల్లు కూడా కట్టించి ఇస్తామన్నారు. మా ఊహలను నిజం చేసిన జగనన్నకు రుణపడి ఉంటాం. – కె.శారద, చినగంజాం, ప్రకాశం జిల్లా దేవుడే జగనన్న రూపంలో వచ్చాడు మాది చాలా పేదరికం. 20 ఏళ్ల క్రితం నా భర్తను కిడ్నీ వ్యాధి మహమ్మారి కబళించింది. పిల్లలతో అద్దె ఇంటిలో ఉంటూ కూలి పనులు చేసుకుని బతుకు సాగిస్తున్నా. గత ప్రభుత్వంలో ఇంటి స్థలం కోసం కాళ్లరిగేలా తిరిగినా రాలేదు. కూలి డబ్బులు అద్దెలకు పోస్తే నా పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనని మదన పడేదాన్ని. జగనన్న ప్రభుత్వం వచ్చింది. వలంటీర్ వచ్చి ఇంటి స్థలం మంజూరవుతుందని వివరాలు తీసుకుని వెళ్లారు. తర్వాత నాకు ఇల్లు మంజూరైందని చెప్పగానే ఆనందం వేసింది. ఆ దేవుడే జగనన్న రూపంలో వచ్చాడు. ఆయనకు ఎల్లవేళలా రుణపడి ఉంటాం. – జోగి మోహిని, గుణుపల్లి, వజ్రపుకొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా ఇది మా కుటుంబానికి తొలి ఆస్తి నా పేరు షేక్ నసీమా. 25 ఏళ్లుగా కుటుంబం మొత్తం అద్దె ఇంట్లోనే సర్దుకుపోతున్నాం. గతంలో ఎన్నోసార్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దరఖాస్తు చేసిన వెంటనే ఇంటి పట్టా మంజూరు చేశారు. ఇది మా కుటుంబానికి చేకూరిన తొలి ఆస్తి. ఇల్లు కూడా ప్రభుత్వమే కట్టించి ఇస్తుండటం పట్ల ఆనందంగా ఉంది. సీఎం జగన్ చెప్పినవన్నీ చేసుకుపోతున్నాడు. – షేక్ çనసీమా, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా జీవితాంతం గుడిసె తప్పదనుకున్నాం కూలికి పోతే తప్ప పూట గడవని పరిస్థితి. గ్రామంలో వేరేవారి స్థలంలో గుడిసె వేసుకొని జీవనం సాగిస్తున్నాం. జీవితాంతం ఇదే గుడిసెలో కాలం ఈడ్చాలని అనుకునే వాళ్లం. నా భర్త హనుమంతప్ప, నలుగురు పిల్లలు ప్రతి రోజూ కూలికి పోయి జీవనం గడుపుతున్నాం. జీవితంలో సొంతిల్లు కట్టుకోలేమనే భావనతో ఉన్న మాకు సీఎం జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారు. ఇంటి పట్టా అందుకున్న వేళ మా ఆనందం చెప్పలేం. ఇప్పుడు ఇల్లు కూడా కట్టిస్తామని చెబుతుంటే సంతోషంతో మాటలు రావడం లేదు. – అయ్యమ్మ, పెద్ద తుంబళం గ్రామం, కర్నూలు జిల్లా చిత్తూరు జిల్లా ఊరందూరులో ప్రజలకు ఇచ్చేందుకు సిద్ధం చేసిన లేఅవుట్ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం తాళ్లకోడు వద్ద వేసిన లే అవుట్ విజయనగరం జిల్లా గుంకలాం వద్ద పేదల కోసం ఏర్పాటు చేసిన ఇళ్ల స్థలాలు -
ఇళ్లు.. పుష్కలంగా నీళ్లు
సాక్షి, అమరావతి: ప్రస్తుతం పట్టాలు పంపిణీ జరుగుతున్న వైఎస్సార్ జగనన్న కాలనీలన్నింటిలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందే నీటి వసతి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలి ఇల్లు నిర్మాణ పనులు మొదలు పెట్టే సమయానికి.. అక్కడ ఇళ్ల సంఖ్య ఆధారంగా అవసరమైన మేరకు బోర్ల తవ్వకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బోరు తవ్విన చోట నీటిని నిల్వ ఉంచడానికి వీలుగా పెద్ద పెద్ద నీటి తొట్టెలు లేదా ప్లాస్టిక్ ట్యాంక్లను ఏర్పాటు చేయబోతోంది. ఇతరత్రా అవసరమైన మౌలిక వసతులు కల్పించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలలో లే అవుట్లు వేసి, 30.76 లక్షల కుటుంబాలకు మహిళల పేరిట ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దశలో 15.60 లక్షల ఇళ్లను నిర్మించే ప్రక్రియను కూడా శుక్రవారం సీఎం జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మార్చి 15 నాటికి పూర్తి ► లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ప్రతి కాలనీలో నీటి వసతిని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ► గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొదటి దశలో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఎంపిక చేసిన దాదాపు 8,000 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నీటి వసతి కల్పనకు గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్యూఎస్) శాఖ రూ.641 కోట్లు, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ రూ.279 కోట్లు కేటాయించింది. మొత్తంగా రూ.920 కోట్లు నీటి వసతి కోసం ప్రభుత్వం వెచ్చించనుంది. ► గృహ నిర్మాణ శాఖ నుంచి ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు ఇళ్ల స్థలాల వివరాలను సేకరించి.. ఎన్ని బోర్లు ఏర్పాటు చేయాలన్న దానిపై అంచనాలు తయారు చేసే పనులు ఇప్పటికే ప్రారంభించినట్టు ఆర్డబ్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ► మొదటి దశకు ఎంపిక చేసిన వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మార్చి 15 నాటికి నీటి వసతి కల్పించాలని ఆర్డబ్ల్యూఎస్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జనవరి మొదటి వారం కల్లా జిల్లాల వారీగా ఏయే కాలనీలలో ఎన్ని బోర్లు అవసరం అన్న దానిపై అంచనాలు సిద్ధం అవుతాయని ఆర్డబ్ల్యూఎస్ సీఈ సంజీవరెడ్డి చెప్పారు. పట్టణ కాలనీల్లో పబ్లిక్ హెల్త్.. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డబ్ల్యూఎస్ వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నీటి వసతి కల్పించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డబ్ల్యూఎస్ ద్వారా, పట్టణ ప్రాంతాల్లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా పనులు చేపడుతున్నాం. సీఎం ఆదేశాల మేరకు మార్చి 15 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో నిర్ధేశించుకున్న కాలనీలన్నింటికి నీటి వసతి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. – ఆర్.వి.కృష్ణారెడ్డి, ఈఎన్సీ, ఆర్డబ్ల్యూఎస్ పట్టణాల్లోని కాలనీల్లో నీటి వసతికి రూ.279 కోట్లు వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నీటి సరఫరా కోసం తొలిదశలో పట్టణ ప్రాంతాల్లోని ఎంపిక చేసిన కాలనీల్లో ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నాం. బోర్లు వేయడంతో పాటు నీటి సరఫరాకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు రూ.279 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఈమేరకు టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం చేసింది. – చంద్రయ్య, ఈఎన్సీ, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం -
రెండో రోజునా.. ‘పట్టా’భిషేకం
సాక్షి నెట్వర్క్: ‘అందరికీ చోటు ఇస్తేనే అది సమాజం అనిపించుకుంటుంది. అందరికీ మంచి చేస్తేనే అది ప్రభుత్వం అనిపించుకుంటుంది. అన్ని కులాలు, మతాలు ఉంటేనే రాజధాని అవుతుంది. అటువంటి సమాజాన్ని, ప్రభుత్వాన్ని, రాజధానిని మీ అందరి చల్లని దీవెనలతో నిర్మించుకుందాం’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రెండో రోజైన శనివారం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగింది. పట్టాలు అందుకున్న అక్కచెల్లెమ్మలు ఎన్నో ఏళ్లుగా కలగానే మిగిలిన సొంతిల్లు ఇన్నాళ్లకు దక్కటంతో ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. జానెడు జాగా కోసం ఎన్నో ఏళ్లుగా పడిగాపులు పడుతున్న తమకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలు అందించి తమ కన్నీళ్లు తుడిచారంటూ కృతజ్ఞతలు తెలిపారు. పలుచోట్ల జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రెండో రోజూ అదే ఉత్సాహం శ్రీకాకుళం జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో శనివారం 5,095 మంది మహిళలకు పట్టాలు అందజేశారు. ఆమదాలవలస నియోజకవర్గం పురుషోత్తంపురంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మందస మండలంలో మంత్రి సీదిరి అప్పలరాజు చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను పంపిణీ జరిగింది. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి విజయనగరం జిల్లా జియ్యమ్మవలస, కొమరాడలో పట్టాలను పంపిణీ చేశారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గరివిడిలో, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి బలిజిపేటలో పట్టాలు అందజేశారు. విశాఖ జిల్లాలో 4,274 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు, 133 మందికి టిడ్కో ఇళ్లు అందజేశారు. తూర్పు గోదావరి జిల్లాలో 22 మండలాల పరిధిలోని 90 గ్రామాల్లో 13,522 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీలు వంగా గీత, మార్గాని భరత్రామ్, చింతా అనురాధ, పార్టీ విప్ దాడిశెట్టి రాజా, ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, ఏపీ పీయూసీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 10,874 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. మంత్రులు ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో 9,503 మందికి పట్టాలు అందజేశారు. మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, కొడాలి నాని, ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో 10,300 మందికి ఎమ్మెల్యేలు, అధికారులు పట్టాలు పంపిణీ చేశారు. ప్రత్తిపాడులో పట్టాలు పంపిణీ చేసేందుకు వెళ్లిన హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితను లబ్ధిదారులు గుర్రపు బగ్గీపై ఎక్కించి భారీ ఊరేగింపుగా ప్లాట్లు పంపిణీ చేసే స్థలం వరకు తీసుకువెళ్లారు. కర్నూలు జిల్లాలో 7,298 మంది మహిళలకు పట్టాలను అందజేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, శాసన మండలి విప్ గంగుల ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో 7,471 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లాలో 5,727 పట్టాలను పంపిణీ చేసినట్టు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు రెడ్డెప్ప, మిధున్రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఆరణి శ్రీనివాసులు, ఆదిమూలం, వెంకటేగౌడ, ఎంఎస్ బాబు, నవాజ్ బాషా పాల్గొన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 6,646 మందికి పట్టాలు పంపిణీ చేశారు. వైఎస్సార్ జిల్లాలో శనివారం 18,380 మందికి పట్టాలు అందజేశారు. డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్బాషా. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్సీ జకియాఖానమ్, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, కలెక్టర్ హరికిరణ్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో రెండో రోజైన శనివారం 990 మందికి పట్టాలు పంపిణీ చేశారు. పదేళ్ల సర్వీసులో ఇలాంటి అభివృద్ధి చూడలేదు నేను సర్వీసులో చేరి పది సంవత్సరాలు కావస్తోంది. ఇలాంటి అభివృద్ధిని చూడలేదు. సీఎం వైఎస్ జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ విధంగా పేదలకు సేవ చేయడంలో ఎంతో సంతృప్తి లభిస్తోంది. నారాయణ భరత్గుప్త, కలెక్టర్, చిత్తూరు తూ.గోదావరి జిల్లా కొమరగిరిలో ఇళ్ల పట్టాలు అందుకునేందుకు భారీ సంఖ్యలో వచ్చిన మహిళలు చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాంపల్లెలో ఇళ్ల పట్టాల పంపిణీ సభకు హాజరైన లబ్ధిదారులు -
సెంటు స్థలం ఇవ్వని వారికి విమర్శించే హక్కుందా?
సాక్షి, తాడేపల్లి : విప్లవాత్మక ఆలోచన చేసి పేదలందరికీ ఇల్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే చెందుతుందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన శనివారం మాట్లాడుతూ.. ఇళ్ల పట్టాల పంపిణీ కేవలం సంక్షేమ కార్యక్రమం కాదని, ఒక ఆర్థిక కార్యక్రమం కూడా అని పేర్కొన్నారు. దీని ద్వారా ఎంతో మందికి ఉపాధి కలగనుందని తెలిపారు. కరోనా పరిస్థితుల్లో సంక్షేమం అందిస్తూ ఆర్థిక పరిపుష్టికి కృషి చేస్తున్నారు. దీని ద్వారా 20 కోట్ల మందికి పనిదినాలు దొరుకుతాయన్నారు. దీనిని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. వారు జీవితంలో ఇలాంటి విప్లవాత్మక కార్యక్రమం చేపట్టారా.. అని ప్రశ్నించారు. అసలు ఒక సెంటు స్థలం అయినా ఇవ్వని వారికి ఈ రోజు విమర్శించే హక్కు ఉందా అని మండిపడ్డారు. చదవండి: ‘పేదలకు ఇళ్లు.. ఆయనకొచ్చిన నష్టమేమిటి?’ అమరావతిలో పేద వారికి ఇల్లు ఇస్తామంటే సామాజిక అసమతుల్యత అన్నది మీరు కాదా. మీకు చిత్త శుద్ధి ఉంటే.. ఎలాంటి దురుద్దేశం లేకపోతే ఆ కేసును ఉపసంహరించుకోండి. పేదలకు ఇళ్ళు ఇద్దాం.ఇల్లు అనేది ఒక ఆత్మగౌరవం...సామాజిక స్థితి పెరుగుతుంది...అది మీకు ఇష్టం లేదా...? ఈ ఇళ్ల కోసమే కదా ఆందోళనలు చేసింది. ఒక ముఖ్యమంత్రి నేను ఇస్తాను అంటే వ్యతిరేకిస్తారా. కనీసం ఇలాంటి పోరాటాలు చేసిన కమ్యూనిస్టులు అయినా అభినందలు తెలపండి. ఇళ్ల పట్టాలపై స్టే తెచ్చిన వారంతా ఉపసంహరించుకోండి. లేదంటే మీరు చరిత్ర హీనులుగా మిగులుతారు. మీరు రైతులను బెదిరించి భూములు తీసుకున్నారు...మా జగన్ గారు చట్టప్రకారం 2013 యాక్ట్ ప్రకారం సేకరించారు. చదవండి: సొంతింటి కల సాకారం -
సొంతింటి కల సాకారం
కొమరగిరి నుంచి సాక్షి ప్రతినిధి : క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఏకంగా 30.75 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కోటి 24 లక్షల మందికి మేలు చేకూరే ఈ కార్యక్రమం వల్ల లక్షలాది మంది అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు చూడగలుగుతున్నానని చెప్పారు. శుక్రవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్లో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పైలాన్ ఆవిష్కరించి, పేదలకు నిర్మించి ఇచ్చే ఇంటి మోడల్ను సందర్శించారు. అనంతరం లబ్ధిదారులనుఉద్దేశించి మాట్లాడారు. రూ.50,940 కోట్లతో రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్లు నిర్మిస్తామని, తొలి దశ కింద 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇవాళే శ్రీకారం చుడుతున్నామన్నారు. వీటి విలువ అక్షరాలా రూ.28 వేల కోట్లు అని, వీటితో పాటు 2.62 లక్షల టిడ్కో ఇళ్లకు కూడా సేల్ అగ్రిమెంట్ ఇవ్వబోతున్నామని చెప్పారు. రెండో విడతలో మిగిలిన 12.70 లక్షల ఇళ్ల నిర్మాణం వచ్చే ఏడాది మొదలవుతుందన్నారు. ‘ఒక్కసారి ఈ లేఅవుట్లు చూస్తుంటే, ఇక్కడ వైఎస్సార్ జగనన్న కాలనీలు కాదు.. ఏకంగా ఊళ్లు రాబోతున్నాయి. అక్షరాలా 16,681 ఇళ్ల స్థలాల పట్టాలు. వాటిలో వైఎస్సార్ జనతా బజార్, వైఎస్సార్ క్లినిక్, బస్టాప్, అంగన్వాడీ కేంద్రం, ఫంక్షన్ హాలు, ప్రైమరీ స్కూల్, హైస్కూల్, కమ్యూనిటీ హాలు, పార్కుల వంటివి కాలనీ సైజును బట్టి ఏర్పాటవుతాయి’ అని వివరించారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఒక్కో ప్లాటు విలువ రూ.4 లక్షలు ► ఇప్పుడు ఈ లేఅవుట్లోని ఒక్కో ప్లాటు మార్కెట్ విలువ రూ.4 లక్షలు. అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా నాతో దేవుడు ఇంత మంచి కార్యక్రమం చేయిçస్తున్నాడు. ఇంతకన్నా భాగ్యం ఏముంటుంది?. ► సొంత ఇల్లు లేని వారి బాధ నాకు తెలుసు. నా సుదీర్ఘ 3,648 కి.మీ. పాదయాత్రలో ప్రతి అడుగులోనూ చూశాను. ఆ పరిస్థితి మార్చాలని గట్టిగా సంకల్పం చేసుకున్నాను. పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో చెప్పాను. ► మనకు ఓటు వేయకపోయినా సరే అర్హత ఉంటే ఇవ్వాలని దిశా నిర్దేశం చేశాం. చెప్పిన దానికి మించి 30.75 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు, ఇళ్లు కూడా కట్టించి ఇవ్వబోతున్నామని మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నా. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు ► రాష్ట్రంలో 13 వేల గ్రామ పంచాయతీలు ఉంటే, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలు వస్తున్నాయి. ఈ కాలనీల్లో లేఅవుట్లు వేసి ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా, తాగు నీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి అన్ని సదుపాయాలు కల్పించబోతున్నాం. వాటికి మరో రూ.7 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా. ► గతంలో 224 చదరపు అడుగుల ఇల్లు మాత్రమే కడితే, ఇవాళ 340 అడుగుల్లో లబ్ధిదారులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు కట్టించి ఇస్తున్నాం. మొత్తం 68,361 ఎకరాల్లో లేఅవుట్లు వేసి, ప్లాట్లు చేసి అక్క చెల్లెమ్మలకు ఇవ్వబోతున్నాం. వాటి మార్కెట్ విలువ అక్షరాలా రూ.25,530 కోట్లు. పట్టణ ప్రాంతాల్లో సెంటు నుంచి సెంటున్నర వరకు, గ్రామీణ ప్రాంతాల్లో కచ్చితంగా 1.5 సెంట్ల భూమి ఇస్తున్నాం. ► ఇంట్లో ఒక బెడ్రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, వరండా, టాయిలెట్, పైన సింటెక్స్ ట్యాంక్, ఇంట్లో రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, మరో రెండు ఎల్ఈడీ లైట్లు కూడా ఉంటాయి. కాలనీల్లో 13 లక్షల మొక్కలు నాటిస్తాం. రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనుకున్నా.. ► ఇల్లు కట్టించి ఇచ్చాక 5 ఏళ్లకు ఆ అక్క చెల్లెమ్మలకు అవసరమై ఆ ఇల్లు అమ్ముకోవాలన్నా లేదా ఇంటిపై రుణం పొందాలన్నా అన్ని హక్కులు ఉండేలా పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలనుకున్నాను. అయితే కొందరి కుట్రలు, కుతంత్రాల వల్ల జాప్యం జరుగుతోంది. ► న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే, డి–ఫామ్ పట్టాల స్థానంలో సర్వ హక్కులతో అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయించి ఇస్తాం. ఇందు కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా పోరాడుతుంది. కొందరి దుర్బుద్ధి వల్ల ఈ పట్టాల పంపిణీ ఇప్పటికే పలు మార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ► మన 18 నెలల పాలన కాలంలో ఏకంగా రూ.77 వేల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇలా మేలు జరుగుతోంటే పసుపు పార్టీల ముఖాలు ఎరుపు రంగుకు ఎలా మారుతున్నాయో మీరంతా చూస్తున్నారు. టిడ్కో ఇళ్లు (ఫ్లాట్లు) ► టిడ్కో ఇళ్లకు (ఫ్లాట్లు) గత ప్రభుత్వం రూ.3 వేల కోట్లు బకాయి పెట్టి, సగంలో వదిలేసి పోయింది. 2.62 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేసి అందిస్తాము. వాటిని పూర్తి చేయడానికి మరో రూ.9,500 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ► ఈ టిడ్కో ఇళ్లలో 300 చదరపు అడుగుల ఇంటిని కేవలం ఒక్క రూపాయికి ఇచ్చే జగనన్న స్కీమ్ కావాలా? లేక మొత్తం రూ.7.20 లక్షలు చెల్లించే చంద్రబాబు స్కీమ్ కావాలా? అని రాష్ట్ర వ్యాప్తంగా ఆప్షన్ కోరితే ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీమ్ కావాలన్నాడు. ఆయన కోరిక ప్రకారం ఆయనకు ఆ స్కీమ్. మిగిలిన వారికి జగనన్న స్కీమ్ ఇస్తాం. ► 300 చదరపు అడుగుల ఇంటిని కేవలం ఒక్క రూపాయికే ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.3,805 కోట్ల భారం పడుతోంది. 365, 430 అడుగుల ఇళ్ల లబ్ధిదారులు వారు కట్టాల్సిన ముందస్తు వాటాలో 50 శాతం ప్రభుత్వం భరిస్తుండటం వల్ల ప్రభుత్వంపై రూ.485 కోట్లు భారం పడుతోంది. అయినా చిరునవ్వుతో భరిస్తున్నాం. చట్టబద్ధమైన హక్కు ► 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. అంటే ఇల్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. అయినా కోర్టులకు వెళ్లడం, అవి స్టేలు ఇవ్వడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ► ఇల్లు ఇవ్వడం ద్వారా తరతరాలుగా అణచివేతకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలే కాకుండా, పేదరికంలో మరిగిపోయిన అగ్రకులాలకు చెందిన వారికి సామాజిక గౌరవాన్ని, హోదాను, ఆర్థిక, ఆరోగ్య, భద్రత, మొత్తంగా మా ఇల్లు అనే భావాన్ని కలగజేస్తున్నాం. ► అనంతరం ఇంటి స్థలం పట్టా (డి–ఫామ్ పట్టా), ఇంటికి సంబంధించిన నిర్మాణం మంజూరు పేపరు, టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు సీఎం అందజేశారు. కొమరగిరి లేఅవుట్లోని మోడల్ హౌస్ను సంబంధిత లబ్ధిదారురాలికి అందజేశారు. ► పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభలో డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, పి.విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. 30 రకాల వృత్తుల వారికి ఉపాధి 8 ఇల్లు నిర్మాణం అంటే, ముగ్గు పోసి పునాదులు తవ్వడంతో అయిపోదు. ఇన్ని ఇళ్లు కట్టడం అంటే రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందన్నది చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. తాపీ మేస్త్రి మొదలు.. కూలీలు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్లు, వెల్డర్లు.. ఇలా కనీసం 30 రకాల వృత్తుల వారికి ఉపాధి దొరుకుతుంది. 8 తొలి దశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్లకు 69.70 లక్షల టన్నుల సిమెంట్, 7.4 లక్షల టన్నుల స్టీల్, 310 లక్షల టన్నుల ఇసుక, 235 కోట్ల ఇటుకలు, 223 కోట్ల మెట్రిక్ టన్నుల మెటల్ వాడుతున్నారు. వ్యవస్థలో ఆర్థికంగా బూస్ట్ వస్తుంది. లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. ఇంటి నిర్మాణానికి అక్కచెల్లెమ్మలకు మూడు ఆప్షన్లు ఆప్షన్ 1 : ప్రభుత్వం చూపిన నమూనా మేరకు అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామగ్రి ప్రభుత్వం సరఫరా చేస్తుంది. లేబర్ చార్జీలు మీ చేతికి ఇస్తాం. మీరే దగ్గరుండి ఇల్లు కట్టించుకోవచ్చు. ఆప్షన్ 2 : లబ్ధిదారులే ఇంటి సామగ్రి తెచ్చుకుని ఇల్లు కట్టుకోవచ్చు. పనుల పురోగతిని బట్టి దశల వారీగా డబ్బులు మీ చేతికి ఇస్తాం. ఆప్షన్ 3 : ప్రభుత్వమే స్వయంగా మంచి మెటీరియల్తో ఇల్లు కట్టించి ఇస్తుంది. ఇందులో ఏ ఆప్షన్ తీసుకున్నా ఫరవాలేదు. వలంటీర్ల సహాయంతో మీకు కేటాయించిన స్థలం వద్ద ఉండండి. అధికారులు మీ దగ్గరకు వచ్చి మీకు డి–ఫామ్ పట్టాలు ఇస్తారు. మీ ఫొటోలు తీస్తారు. మీరు ఏ విధానంలో ఇల్లు కావాలో ఆ ఆప్షన్కు టిక్ చేసి ఇవ్వండి. ఇంకా అర్హులెవరైనా మిగిలిపోయి ఉంటే దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో కేటాయిస్తాం. ఇది నాకు దేవుడిచ్చిన వరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ‘పాదయాత్ర సమయంలో సొంతిల్లు లేని నిరుపేదల కష్టాన్ని కళ్లారా చూశాను. వారి సొంతింటి కలను నెరవేరుస్తానని నాడు మాట ఇచ్చా’నని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈరోజు అక్షరాలా 30.75 లక్షల ఇంటి స్థల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం, అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు చూడడం దేవుడిచ్చిన అదృష్టంగా, వరంగా భావిస్తున్నట్లు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. అలాగే, రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ జగన్ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం రోజున ముక్కోటి దేవతల ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆనందం, ఆరోగ్యాలతో విలసిల్లాలని ప్రార్థిస్తున్నానన్నారు. అంతేకాక.. సాటి మనుషులపట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువులపట్ల క్షమ వంటి క్రీస్తు సందేశాలు మనల్ని సన్మార్గంలో నడిపించాలని, రాష్ట్ర ప్రజలపై క్రీస్తు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. మా జీవితంలో నిజమైన పండుగ అద్దె ఇంట్లో 16 ఏళ్లుగా ఉంటూ ఎన్నో కష్టాలు పడుతున్న మా కుటుంబానికి నేడు నిజమైన పండుగ వచ్చింది. సంక్రాంతి, దసరా వంటి పండుగలు ఏటా వస్తాయి. కానీ ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటున్న ఇంటి స్థలం, సొంత ఇల్లు నేడు సీఎం జగన్ అన్న ఇస్తుంటే మా జీవితంలో ఇదే నిజమైన పండుగ. నా భర్తకు రూ.6 వేల జీతం. ఇద్దరు పిల్లలతో సంసారాన్ని నెట్టుకొస్తున్నాం. ఇంటికి అమ్మా నాన్నలను కూడా పిలవలేని పరిస్థితి. గత ప్రభుత్వంలో ఇంటి స్థలం కోసం కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదు. ఇప్పుడు దరఖాస్తు చేయగానే ఇంటి స్థలం వచ్చింది. మా సొంత అన్నే వచ్చి ఈ స్థలం ఇచ్చినట్లుంది. సీఎం జగనన్న రుణం తీర్చుకోలేనిది. – రామశెట్టి నాగమల్లేశ్వరి, 3వ వార్డు, కాకినాడ మీరే మా దేవుడు సీఎం జగనన్నా.. మీరు మా కుటుంబానికి దేవుడు. మా కలను నిజం చేస్తూ ఇంటి స్థలాన్ని అందించారు. మేము చాలా పేదోళ్లం. ఏటా ఇంటి అద్దె రూ.500 పెంచుతుంటే, ఆ డబ్బులతో మమ్మల్ని చదివించాలని తక్కువ అద్దెకు దొరికే ఇళ్ల కోసం మా అమ్మ ఎన్నో వీధులు తిరిగిన రోజులు కళ్లెదుట మెదలుతున్నాయి. పెళ్లయ్యాక ఓ రోజు ఇంటి యజమాని మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమన్నాడు. చిన్న బాబును ఎత్తుకుని అద్దె ఇంటి కోసం వీధి వీధి తిరిగాం. ఇకపై ఆ కష్టాలు ఉండవన్నా. పిలిచి ఇంటి స్థలం మహిళల పేరుతోనే ఇస్తున్నారు. మీకు కోటి వందనాలన్నా. – పెంకే నాగ భవాని, బర్మా కాలనీ, 7వ వార్డు, కాకినాడ అందరికి చోటు ఇస్తేనే అది సమాజం అనిపించుకుంటుంది. అందరికి మంచి చేస్తేనే అది ప్రభుత్వం అని అనిపించుకుంటుంది. అన్ని కులాలు, మతాలు ఉంటేనే రాజధాని అవుతుంది. అటువంటి సమాజాన్ని, ప్రభుత్వాన్ని, రాజధానిని మీ అందరి చల్లని దీవెనలతో నిర్మించుకుందాం. 2011 లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4.95 కోట్లు. ఇప్పుడు దాదాపు 31 లక్షల ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మల చేతిలో పెడుతున్నామంటే, ఒక్కో ఇంట్లో సగటున నలుగురిని లెక్కేసుకున్నా దాదాపు 1.24 కోట్ల మందికి మేలు చేస్తున్నాం. ఇదే తూర్పు గోదావరి జనాభా 51.54 లక్షలు. గుంటూరు జిల్లా జనాభా 48.88 లక్షలు. కడప, శ్రీకాకుళం జిల్లాలు కూడా కలిపితే 1.24 కోట్ల మంది. అంటే ఏ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతోందో ఆలోచించండి. 175 నియోజక వర్గాల్లో నేటి నుంచి 15 రోజులు పాటు ఇళ్ల పండుగ జరగబోతోందని సగర్వంగా చెబుతున్నా. – సీఎం వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లా కొమరగిరిలో పట్టాల ప్రారంభ కార్యక్రమం సభకు భారీగా హాజరైన మహిళలు తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో జరిగిన బహిరంగ సభలో ఇళ్ల స్థలాల లేఔట్ను చూపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఇళ్ల పట్టాల లేఔట్లో లబ్ధిదారులు సభ ప్రాంగణం సమీపంలో నమూనా ఇంటిని పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్; తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో జరిగిన బహిరంగ సభ ప్రాంగణం సమీపంలో ఇళ్ల స్థలాల పైలాన్ను ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్ -
ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
-
పేద మహిళలను లక్షాధికారులను చేశారు
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో పేదవాడి సొంతింటి కల నెరవేరిందని, లబ్ధిదారులు ఇళ్ల స్థలాలు చూసి ఆనందంతో మురిసిపోతున్నారని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేదవాడు ఎక్కడా ఒక సెంటు భూమి కూడా కొనలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి సమయంలో సీఎం వైఎస్ జగన్ పేదలందరికీ గొప్ప అవకాశం ఇచ్చారని ప్రశంసించారు. తూర్పు గోదావరిలోని కొమరగిరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. (చదవండి: 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాల పంపిణీ) ఈ సందర్భంగా హోం మంత్రి సుచరిత శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహిళలను లక్షాధికారులను చేయాలని ఎప్పుడూ అంటూ ఉండేవారని గుర్తు చేశారు. సీఎం జగన్ దాదాపు ముప్పై ఒక్క లక్షల మంది పేద మహిళలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి వారిని ఒకేసారి లక్షాధికారులను చేశారని ప్రశంసించారు. గత ప్రభుత్వం మాత్రం సెంటు భూమి కూడా ఎవరికీ ఇవ్వలేదని మండిపడ్డారు. (చదవండి: ఏమిటీ చిల్లర ఆరోపణలు?) -
పేదవాడికి ఇళ్లు ఇవ్వడం తప్పా?: బొత్స
సాక్షి, విజయనగరం: గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకున్నవారికి అర్హత ఉంటే తొంభై రోజుల్లో ఇంటి స్థలం వస్తుందని మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పేదలకు పట్టాలివ్వడమే కాక, ఇళ్లు కట్టేందుకు లక్షా ఎనభై వేల రూపాయలు ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. చీపురుపల్లిలో 475 మందికి పట్టాలు వచ్చాయని పేర్కొన్నారు. ఎండకు ఎండి, వర్షానికి తడిచి అద్దె ఇంట్లో ఉంటూ కష్టపడే వారి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలాకాలంగా తపనపడుతున్నారని చెప్పారు. పేద వాడికి ఇళ్లు ఇస్తామంటే కోర్టుకెళ్తున్నారు.. పేదవాడికి ఇళ్లు ఇవ్వడం తప్పా? అని ప్రశ్నించారు. పేదవాడి జీవన విధానంలో మార్పు తీసుకురావడం కోసం వైఎస్ జగన్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. (చదవండి: ఇళ్ల నిర్మాణం ద్వారా కోటి మందికి మేలు) మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. "కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఇళ్లే తప్ప తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఇళ్ల ఊసే ఎత్తలేదు. దోపిడి, అవినీతి చేయకుండా ఉంటే తిరిగి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది. కానీ మాకు అధికారం ఇచ్చారంటే ఆ పార్టీ ఎంత అవినీతినికి పాల్పడిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ప్రభుత్వం భూసర్వే చేస్తే చంద్రబాబు నానా మాటలు అంటున్నారు. ఎక్కడ నుంచో ఎవరో వచ్చి మీ భూమి పట్టుకు పోతారని చెబుతున్నారు. ఇది సిగ్గు చేటు. మీ భూమికి ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది. ఎక్కడా లేని విధంగా సర్వే చేయించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. ఎవరి ప్రమేయం లేకుండా ఇప్పుడు అన్ని పథకాలు అందరికి అందుతుంటే చంద్రబాబు కనీసం మర్యాద కేకుండా మాట్లాడుతున్నారు" (చదవండి: పీలా చెరలో రూ. 300 కోట్లు ప్రభుత్వ భూమి) "బాబు అయిదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఎవరికీ ఎలాంటి లబ్ధి చేకూరకుండా కేవలం వాళ్ల తాబేదారులకు మాత్రమే అన్ని పథకాలు ఇచ్చేవారు. వైఎస్ఆర్.. ఆరోగ్య శ్రీ పథకం పెట్టి ఎవ్వరూ ఇబ్బంది పడకుండా వైద్యం చేయింకునే విధంగా రూపకల్పన చేశారు. దీనిని మరింత సులభతరం చేసి మరిన్ని వ్యాధులకు వైద్యం చేయించునే అవకాశాన్ని సీఎం జగన్ కల్పించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఓట్లడిగిన చంద్రబాబు చివరికి ఇవ్వకుండా మోసం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత విడతల వారిగా ఇస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడత రావల్సిన డబ్బును ఇచ్చారు. పెన్షన్ ఇప్పుడు ఇంటికొచ్చి ఇస్తున్నారు. గ్రామ సచివాలయంలలో లక్షా యాభై వేల ఉద్యోగాలు వచ్చాయి. వీరంతా పరీక్షలు రాసి పారదర్శకంగా ఎంపికయ్యారు" అని బొత్స పేర్కొన్నారు. -
నాడు టీడీపీ నేతలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు..
సాక్షి, కృష్ణా జిల్లా: పేదవాడి కల నేడు సాకామైందని, తమకూ ఇల్లు ఉంది అన్న భరోసాతో తలెత్తుకొని తిరిగే పరిస్థితిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించారని మంత్రి పేర్ని నాని అన్నారు. ఒక్క పైసా ఖర్చు, అప్పు లేకుండా ఇల్లు కట్టిస్తున్న ఏకైక వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. ప్రజారంజక పాలన అందించటంలో ఆయన తన తండ్రిని మించి పోయారని, రాష్ట్రంలో పదిహేడు వేల కొత్త ఊళ్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం గాజులపేటలో పేదల ఇంటి స్థలాల లే అవుట్ వద్ద జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ‘‘6800 కోట్లు విద్యుత్, నీటి సరఫరాకే కేటాయించారు. శత్రువైనా పేదవాడైతే లబ్ది చేకూర్చాలని చెప్పిన గొప్ప వ్యక్తిత్వం ఆయనది. అటువంటి వ్యక్తి కొలువులో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నా. పేదలు వస్తే తమ కుల ప్రాబల్యం తగ్గుతుందనే అమరావతిలో ఇంటి పట్టాలను కోర్టుకెళ్ళి టీడీపీ అడ్డుకుంది. మైలవరంలోని పాత్రికేయులందరికీ కూడా సొంతింటి కల సాకారం చేస్తాం’’ అని తెలిపారు.(చదవండి: నేటి నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పండగ: సీఎం జగన్) నాడు టీడీపీ నేతలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు: ఎమ్మెల్యే గత ప్రభుత్వం నివాసయోగ్యం కాని చోట పట్టాలు ఇచ్చి జనాన్ని మభ్యపెట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమానికి బాటలు పడ్డాయని, నేడు అవినీతి, రెకమండేషన్, పార్టీలతో పని లేకుండా అర్హులందరికీ ఇంటి స్థలాల పట్టాల పంపిణీ జరుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. అయితే టీడీపీ నేతలకు ఇవేమీ కనిపించడం లేదని, కుల పత్రికను అడ్డుపెట్టుకుని ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఎన్నికల్లో ఓటు కోసం మైలవరం ప్రజలను మాజీ మంత్రి దేవినేని ఉమా మోసం చేశాడు. ఇంటి స్థలాలకోసం వెళ్లిన మహిళలపై టీడీపీ నేతలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు . ఇప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంటే ఓర్చుకోలేక రాష్ట్ర అభివృద్ధికి ,సంక్షేమానికి అడుగడుగునా అడ్డు తగులుతున్నారు’’ అని టీడీపీ నాయకుల తీరును ఎండగట్టారు. ఇక కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలో 3,02,420 మందికి ఇంటిపట్టాలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ‘‘ఇంతమందికి ఒకేసారి పట్టాలు ఇవ్వటం చారిత్రక ఘట్టం. 29696 మందికి టిడ్కో ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. తొలి విడతలో 1 .67 లక్షల ఇళ్లనిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టాం’’ అని పేర్కొన్నారు. -
‘సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు’
సాక్షి, నెల్లూరు : ఈ రోజు(శుక్రవారం) ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగ్గ రోజని, ఒకే రోజు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొనియాడారు. శుక్రవారం నెల్లూరు నగర జాతీయ రహదారి వద్ద ఉన్న లేఅవుట్లో పేద మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గత ప్రభుత్వం ఐదేళ్లలో 2 లక్షల ఇళ్లు ప్రారంభించింది.. వాటిని పూర్తి చేయలేదు. ఇంటి స్థలాల కేటాయింపులో కులం, మతం చూడలేదు. సిపార్సులు అసలు లేవు, అర్హులైన అందరికి ఇళ్లు ఇస్తున్నాము. టీడీపీ కుట్ర రాజకీయాల వల్లే ఇంటి పట్టాల పంపిణీ జాప్యం అయింది. ( నేటి నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పండగ: సీఎం జగన్) మాట ఇస్తే తప్పని గొప్ప నేత.. మహిళలకు ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు మహిళలు నీరాజనం పలుకుతున్నారు. గతంలో టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ పేదలను దోచుకోవాలని చూసింది. కానీ, ముఖ్యమంత్రి ఉచితంగా అదే టిడ్కో ఇళ్లు ఇస్తున్నారు. ప్రభుత్వం 14 వేల ఇళ్లు ఇవాళ ఒక రూపాయకే ఇస్తోంది. ఇంటి స్థలాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదు. నగర పరిధిలో 14 వేల ఇంటి పట్టాలు ఇస్తున్నాం. 8 వేల ఇళ్ల నిర్మాణం కూడా చేపడతాం. 70 కోట్లతో పెన్నా బ్యారేజీకి అటు ఇటుగా బండ్ కడతాం.. వరద వచ్చినా కాలనీలకు ప్రమాదం లేకుండా చేస్తా’’మని అన్నారు. -
నేటి నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పండగ: సీఎం జగన్
సాక్షి, తూర్పు గోదావరి: సొంతిల్లు లేని పేదల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని, ఆ కారణం చేతనే ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పేదల సొంతింటి కల నెరవేరుస్తానని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలోనే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం జగన్ తెలిపారు. దీనిలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కొమరగిరిలో ఇళ్లు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. ఈ పథకం కింద మొదటి దశలో 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టనుండగా రెండు దశల్లో 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ఉచితంగా పూర్తి చేసిస్తామని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో నేటి నుంచి 15 రోజుల పాటు పండగలా పట్టాల పంపిణీ చేపడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికిపైగా అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ పర్వదినాన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. (చదవండి: పేదలకు పట్టాభిషేకం) పేదల కష్టాలను కళ్లారా చూశాను. పాదయాత్రలో పేదల కష్టాలు దగ్గరుండి చూశానని, సొంతిల్లు లేని వారి కష్టాలను కళ్లారా చూశానని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఐదేళ్లలో 30.75 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామన్నారు. దీనివల్ల దాదాపు కోటి 24 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుందని వ్యాఖ్యానించారు. కుల, మత, రాజకీయాలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు మొక్కుబడిగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించిందని, మన ప్రభుత్వం కొత్త గ్రామాలను నిర్మించబోతుందన్నారు. ఇవాళ ఇళ్లు మాత్రమే కాకుండా ఊర్లు కడుతున్నామని చెప్పారు. పేదల కోసం సుప్రీం కోర్టులో పోరాడుతాం "అమరావతిలో 54వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామంటే సామాజిక అసమతుల్యం వస్తుందంటూ టీడీపీ కోర్టుకెళ్లింది. చంద్రబాబు, అనుచరుల పిటిషన్ల వల్ల 10% ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. నిన్న కూడా హైకోర్టులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై పిల్ దాఖలు చేశారు. పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం సుప్రీం కోర్టులో పోరాడుతుంది. త్వరలోనే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఒక కులం ఉండకూడదని ఎవరైనా అంటారా? అందరూ కలిసి ఉండలేనప్పుడు అది రాజధాని ఎలా అవుతుంది? అందరికీ చోటు ఉంటేనే అది సమాజం అవుతుంది. అందరికీ మంచి చేస్తేనే అది ప్రభుత్వం అవుతుంది. 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లలో జగనన్న స్కీమ్ కావాలా? చంద్రబాబు స్కీమ్ కావాలా? అని సర్వే చేశాం. 1.43 లక్షల మందిలో కేవలం ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీమ్ అడిగారు. ఆ ఒక్కరికి చంద్రబాబు స్కీమ్లోనే ఇల్లు ఇస్తాం. మిగిలిన వారందరికీ జగనన్న స్కీమ్లో ఒక్క రూపాయికే ఇల్లు అందిస్తాం" అని సీఎం జగన్ అన్నారు. (చదవండి: ముందు లిమిటెడ్.. తరువాత రెగ్యులర్ డీఎస్సీ) సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ► రాష్ట్ర వ్యాప్తంగా 2.62 లక్షల టిడ్కో ఇళ్లకు సేల్ అగ్రిమెంట్లు. ► ఈరోజు 30లక్షల మందికి పైగా పేదలకు సొంతింటి కల నిజం చేశాం. ► ఇళ్ల నిర్మాణం ద్వారా కోటి మందికిపైగా మేలు జరుగుతుంది. ► కొత్తగా 17వేల వైఎస్ఆర్ జగనన్న కాలనీలు రాబోతున్నాయి. ► కొత్త కాలనీల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం. ► కాలనీల్లో పార్క్లు, కమ్యూనిటీహాల్స్, విలేజ్ క్లీనిక్లు, అంగన్వాడీలు ఏర్పాటు చేస్తాం. ► 224 చదరపు అడుగుల నుంచి 340 చదరపు అడుగులకు విస్తీర్ణం పెంచాం. ► ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు కూడా కట్టించి ఇస్తాం. ► లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాలని ఆశ పడ్డా కొంత మంది కోర్టుకెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అడ్డుకున్నారు ► కోర్టు అడ్డంకులు తొలగగానే లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాం. ► గత ప్రభుత్వంలో పెద్దలు ఏ రకంగా రాజకీయాలు చేశారో చూశాం. ► ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదాలు పడటానికి రాజకీయ దురుద్దేశాలే కారణం. ► పేదలకు మేలు జరుగుతుంటే పసుపు పార్టీల మొహాలు ఎరుపు రంగుకు మారుతున్నాయి. ► 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును చట్టబద్ధ హక్కుగా మార్చారు. ► పేదలకు ఆస్తి హక్కు కల్పించే ప్రయత్నం చేస్తుంటే కోర్టుకెళ్లి అడ్డుకుంటున్నారు. -
పైలాన్ ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలోని వైఎస్సార్ జగనన్న కాలనీలో మోడల్ హౌస్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా "నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు" పైలాన్ను ఆవిష్కరించారు. మరికాసేపట్లో లక్షలాది మంది ఎదురు చూస్తున్న ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో 30 లక్షల మందికి పైగా నివాస స్థల పట్టాలను అందజేయనున్నారు. ఈ ఇళ్ల నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేయాలని సంకల్పించిన ప్రభుత్వ లక్ష్యంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా మన ప్రభుత్వం వస్తే 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్ ప్రకటించారు. సీఎం అయ్యాక ఏకంగా 30.75 లక్షల మందికి పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయడం విశేషం. (చదవండి: పేదలకు పట్టాభిషేకం) చదవండి: ఆ కంపెనీతో 2 వేల మందికి ఉపాధి: సీఎం జగన్