-
దివ్యాంగులకు పరీక్షా కాలంలో పలికే చేయి
పరీక్షల సీజన్ వస్తే రమా పద్మనాభన్ ఇంటి వ్యవహారాలను పెద్దగా పట్టించుకోదు. పెళ్లిళ్లు, ప్రయాణాలు అసలే ఉండవు. ఆమె తనకు వచ్చే కాల్స్ను అటెండ్ చేసే పనిలో ఉంటుంది. ‘అక్కా.. ఈ ఎగ్జామ్ రాయాలి’ ‘ఆంటీ... ఈ డేట్న ఎంట్రన్స్ ఉంది’ ఇలా దివ్యాంగులు ఆమెకు కాల్స్ చేస్తుంటారు. వారి కోసం ఆమె పరీక్ష హాల్కు వెళ్లి వారి ఆన్సర్స్ను రాసి పెడుతుంటుంది. ‘ఇది గొప్ప తృప్తినిచ్చే సేవ’ అంటోందామె.చదువుకునే రోజుల్లో ఎవరైనా పరీక్షలు రాయవచ్చు. చదువు అయిపోయాక ఏవైనా కోర్సులు సరదాగా చదివితే పరీక్షలు రాయవచ్చు. కాని రమా పద్మనాభన్ అలా కాదు. ఆమె ప్రతి ఆరు నెలలకు విద్యార్థులకు సెమిస్టర్ ఎగ్జామ్స్ జరిగినప్పుడల్లా 50 పరీక్షలు రాస్తుంది. అంటే రాసి పెడుతుంది. గత పదకొండేళ్లుగా ఆమె అలా చేస్తూనే ఉంది. దివ్యాంగులకు పరీక్షలు రాసి పెట్టే స్క్రయిబ్గా ఆమెకు కోయంబత్తూరులో ఉండే పేరు అలాంటిది.గృహిణిగా ఉంటూ...కోయంబత్తూరుకు చెందిన రమా పద్మనాభన్ సైకాలజీలో డిగ్రీ చేసింది. ఆ తర్వాత ‘గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్’లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కూడా చదివింది. భర్త ఫైనాన్షియల్ సెక్టార్లో పని చేస్తాడు. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు. గృహిణిగా పిల్లలను చూసుకుంటూ కాలం గడుపుతున్న రమా పద్మనాభన్ జీవితం 2013లో మారింది. ‘ఆ రోజు నేను యోగా క్లాసుకు బయలుదేరాను. నా స్నేహితురాలి నుంచి ‘ఒక అంధ విద్యార్థికి పరీక్ష రాసి పెడతావా?’ అనే విన్నపం వచ్చింది. అలా రాయగలనా అనుకున్నాను. పరీక్ష కేంద్రం దగ్గరే కనుక ట్రై చేద్దామనిపించింది. వెళ్లి రాసి పెట్టాను.పరీక్ష ముగిశాక ఆ అంధ విద్యార్థి ముఖంలో కనిపించిన కృతజ్ఞత నాకు ఎంతో మనశ్శాంతిని ఇచ్చింది. ఆ తర్వాత నాకు కాల్స్ రావడం మొదలైంది. కోయంబత్తూరులో లూయిస్ బ్రెయిలీ అకాడెమీ ఉంది. వాళ్లు కాల్ చేస్తూనే ఉంటారు. వీరు కాకుండా దివ్యాంగులు, ఆటిజమ్ విద్యార్థులు... వీరు పెన్ పట్టి పరీక్ష రాయడం కష్టం. వారికి పరీక్షలు రాసి పెడుతుంటాను’ అని తెలిపింది రమా పద్మనాభన్.అంతా ఉచితమేదివ్యాంగులకు, అంధులకు పరీక్షలు రాసేందుకు రమ ఎటువంటి రుసుమూ తీసుకోదు. పరీక్షా కేంద్రానికి కూడా సొంత ఖర్చులతోనే వెళ్లి వస్తుంది. ‘అయితే అందుకు నా భర్తను అభినందించాలి. నీ డబ్బులు ఖర్చు పెట్టి వేరొకరి పరీక్షలు ఎందుకు రాస్తున్నావు అని ఎప్పుడూ అడగలేదు’ అంటుంది రమ. ‘అంధ విద్యార్థులు తమకు పరీక్షలు రాసి పెట్టే వారు లేరని తెలిస్తే చాలా టెన్షన్ పడతారు. ఆబ్సెంట్ అయితే పరీక్ష పోతుంది. అందుకే వారికి స్క్రయిబ్లు కావాలి. వారు చెబుతుంటే జవాబులు సరిగ్గా రాయగలగాలి. నేను ఆటిజమ్ విద్యార్థులకు రాసి పెట్టేటప్పుడు మరింత శ్రద్ధగా ఉంటాను. వారు సమాధానాలు కంటిన్యూస్గా చెప్పడంలో ఇబ్బంది పడతారు. ప్రోత్సహిస్తూ రాబట్టాలి. అదే కాదు హైస్కూల్ పాఠాల దగ్గరి నుంచి ఇంజినీరింగ్ పాఠాల వరకూ అవగాహన ఉండాలి. అందుకే ఆ పాఠాలు కూడా తెలుసుకుంటూ ఉంటాను. స్క్రయిబ్గా నేను మారేటప్పటికి నా పిల్లలు చిన్నవాళ్లు. నా చిన్నకొడుకుకైతే ఐదారేళ్లవాడు. ఇంటిదగ్గర వాణ్ణి ఒక్కణ్ణే వదిలి తాళం వేసుకుని పరీక్ష రాసి పెట్టిన సందర్భాలున్నాయి’ అని తెలిపిందామె.కొనసాగే అనుబంధం‘నేను రాసిన పరీక్షలతో కోర్సులు పాసై ఉద్యోగాలు పొందిన దివ్యాంగులు చాలా మంది ఉన్నారు. వాళ్లంతా నా కాంటాక్ట్లో ఉంటారు. తమ జీవితంలో సాధిస్తున్న ప్రగతిని తెలియజేస్తుంటారు. అదంతా వింటుంటే ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది. జీవితానికి ఒక అర్థం దొరికినట్టు ఉంటుంది. నా పెద్దకొడుకు సీనియర్ ఇంటర్కు వచ్చాడు. వాణ్ణి వీలున్నప్పుడల్లా స్క్రయిబ్గా పని చేయడానికి పంపుతున్నా. వాడు ఆ పని చేస్తున్నందుకు ఎంత సంతోష పడుతున్నాడో చెప్పలేను’ అని ముగించింది రమా పద్మనాభన్. -
విడాకుల కేసుల్లో జాప్యాన్ని నివారించేందుకు చర్యలు
సాక్షి, చైన్నె : విడాకుల కేసులకు సంబంధించి సాగుతున్న జాప్యం కట్టడికి మధురై ధర్మాసనం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కొన్ని సూచనలు చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా మంగళవారం వేసవి కాల ప్రత్యేక బెంచ్ న్యాయమూర్తులు టిక్కారాం, బాలాజీ విడాకుల కేసులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులను వాయిదాల పర్వంతో జాప్యం చేస్తున్నారని వివరించారు. ఈ దృష్ట్యా, కేసులు పెరిగి పోతున్నాయని పేర్కొన్నారు. ఈ కేసుల విచారణ జాప్యం కట్టడికి కొన్ని మార్గదర్శకాలు లేదా నిబంధనలు రూపొందించి అమలు చేయాల్సిన అవసరం తప్పనిసరిగా మారిందని అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కొన్ని అంశాలను సిఫారసు చేస్తూ విజ్ఞప్తి చేశారు. వడదెబ్బకు ముగ్గురి మృతి అన్నానగర్: రాష్ట్రంలోని వేరువేరు ప్రాంతాలలో వడదెబ్బకు ముగ్గురు మృతి చెందారు. వివరాలు.. కోయంబత్తూరులోని కౌండంపాళయం మూవర్కు చెందిన మణికంఠన్ (45) గాంధీపురం ప్రాంతంలోని జెరాక్స్ దుకాణంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కౌండంపాళయం నుంచి గాంధీపురానికి సైకిల్పై వచ్చిన ఆయన సాయిబాబా కాలనీ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా స్పృహతప్పి రోడ్డుపై పడిపోవడంతో చుట్టుపక్కల వారు ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మణికంఠన మృతి చెందినట్లు తెలిపారు. అదేవిధంగా తిరువణ్ణామలై జిల్లా వందవాసి పక్కనే ఉన్న చాలవేడు గ్రామం ముదలియార్ వీధికి చెందిన అరుముగం. ఇతని భార్య కనకవల్లి (80). వందవాసి బజార్ రోడ్డులో కూరగాయలు కొనేందుకు నడుచుకుంటూ వెళ్లింది. అప్పుడు వేడిమికి వృద్ధురాలు ఒక్కసారిగా స్ఫృహతప్పి పడిపోయింది. చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ కనకవల్లి మృతి చెందింది. విల్లుపురం జిల్లా విక్రవాండికి చెందిన వేలు (41) సోమవారం పని ముగించుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి బయలుదేరాడు. ఆ సమయంలో వేడి గాలి తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. తిరుత్తణిలో వృద్ధుడు..తిరుత్తణి: తిరుత్తణి బస్టాండులో యాచకుడిగా ఉండే ఓ వృద్ధుడు మంగళవారం వడదెబ్బతో మరణించాడు. పోలీసుల దర్యాప్తులో మృతుడు రాణిపేట జిల్లా గురువరాజుపేటకు చెందిన ఎల్లప్పన్గా తెలిసింది. స్టిక్కర్ల వేటతో రూ. 6 లక్షల జరిమానా వసూలు సాక్షి, చైన్నె: ప్రెస్, పోలీసు, లాయర్, డాక్టర్ తదితర స్టికర్లతో చక్కర్లు కొడుతున్న వాహనాలను వేటాడే పనిలో గ్రేటర్ చైన్నె ట్రాఫిక్ పోలీసులు నిమగ్నమైన విషయం తెలిసిందే. ఈనెల 2వ తేదీ నుంచి చైన్నెలో వందకు పైగా మార్గాలు, కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు తిష్ట వేశారు. ప్రధానంగా ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలలోని స్టిక్కర్లను తొలగించడమే కాకుండా, వాహన దారుల భరతం పట్టే విధంగా గ్రేటర్ చైన్నె ట్రాఫిక్ పోలీసులు జరిమానాల మోత మోగించారు. ఐదు రోజులలో 1200లకు పైగా వాహన దారుల భరతం పట్టారు. స్టిక్కర్లను తొలగించడమే కాకుండా, రూ. 6 లక్షల మేరకు జరిమానా వసూలు చేశారు. మరోసారి ఇదే వాహనదారులు స్టిక్కర్లతో పట్టుబడితే రూ. 1000 లేదా రూ. 1500 జరిమానా విధించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అదేసమయంలో పోలీసుల తనిఖీలతో బెంబెలెత్తిన నకిలీ ప్రెస్ స్టిక్కర్లు వేసుకున్న వాహనదారులు ముందు జాగ్రత్తగా వాటిని స్వచ్ఛందంగా తొలగించడం గమనార్హం. డెంగీపై అవగాహన పళ్లిపట్టు: జనావాసాల్లో టైర్లు, నిరుపయోగ మైన వస్తువులు నిల్వ చేరకుండా చూసుకోవాలని వైద్య శాఖ అధికారులు సూచించారు. తిరువళ్లూరు జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాల మేరకు ఆర్కేపేటలో మండల వైద్యధికారి తమిళసెల్వన్ ఆధ్వర్యంలో ఆరోగ్యసిబ్బంది, పంచాయతీ సిబ్బంది స్థానికులకు డెంగీ నివారణపై అవగాహన కల్పించారు. -
విక్రవాండికి ఉప ఎన్నిక ఇప్పట్లో లేనట్టేనా?
సాక్షి, చైన్నె : విక్రవాండి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఇప్పట్లో లేనట్టేనని ఈసీ వర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు.. నాంగునేరి డీఎంకే ఎమ్మెల్యే పుగలేంది గత నెల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం ఖాళీగా ఉన్నట్టు ఎన్నికల కమిషన్కు అసెంబ్లీ కార్యాలయం సమాచారం ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో చివరి విడతగా దేశంలో జరిగే లోక్సభ ఎన్నికతో పాటు విక్రవాండికి ఉప ఎన్నిక జరగవచ్చనే సమాచారం వెలువడింది. అయితే విక్రవాండికి ఉప ఎన్నిక నిర్వహణకు మరింత సమయం పట్టు వచ్చు అని ఎన్నికల వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ఫలితాల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి పెట్టిన దృష్ట్యా, ఉప ఎన్నిక నిర్వహణ సాధ్యంకాదని పేర్కొంటున్నారు. ఎన్నికల నిర్వహణకు మరో ఐదు నెలలు సమయం ఉందని, అంతలోపు ప్రక్రియను ముగించి ఉప ఎన్నికలపై దృష్టి పెడుతామని చెబుతున్నారు. -
No Headline
సాక్షి, చైన్నె : తిరునల్వేలి తూర్పు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జయకుమార్ మృతి కేసు పోలీసులకు సవాలుగా మారింది. కాగా కేసు విచారణను కాంగ్రెస్ నేతల వైపుగా పోలీసులు మరల్చారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కేవీ తంగబాలు, నాంగునేరి ఎమ్మెల్యే రూబి మనోహర్ తదితరులను విచారణ పరిధిలోకి తెచ్చారు. వివరాలు.. జయకుమార్ మృతిపై నాలుగు రోజులైనా తిరునల్వేలి పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించక లేదు. చివరకు జయకుమార్ రాసినట్టుగా పేర్కొంటున్న వాంగ్మూలం లేఖను పరిగణనలోకి తీసుకున్నారు. అందులోని పేర్ల ఆధారంగా కాంగ్రెస్ నేతలను విచారణ పరిధిలోకి తీసుకొచ్చారు. ఆ మేరకు మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కేవీ తంగబాలు, నాంగునేరి ఎమ్మెల్యే రూబీ మనోహర్తో పాటు మరికొంది వద్ద పోలీసులు తీవ్ర విచారణ చేశారు. తమ వద్ద ఉన్న సమాచారం పోలీసులకు తెలియజేశామని ఈసందర్భంగా కాంగ్రెస్ నేతలు మీడియాకు వివరించారు. తమకు ఆయనతో ఎలాంటి గొడవలు, లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. అదే సమయంలో జయకుమార్ పోస్టుమార్టంపై సైతం పోలీసులు దృష్టి పెట్టారు. ఆయన్ని హతమార్చినానంతరం తగల బెట్టారా..? అనే విషయం నిర్ధారించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన పోస్టుమార్టం నివేదికను చైన్నెలోని వైద్య నిపుణులకు పంపించారు. ఇదిలా ఉండగా, అస్సలు ఆ మృతదేహం జయకుమార్దేనా? అన్న అనుమానాలు సైతం కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తుండటం చర్చకు దారి తీసింది. విచారణకు హాజరైన కాంగ్రెస్ నేతలు, (ఇన్సెట్లో) జయకుమార్ -
ట్రాఫిక్ సిగ్నల్స్లో గ్రీన్ నెట్స్
సాక్షి, చైన్నె: ఎండ వేడి నుంచి వాహనదారులకు ఉపశమనం కలిగించే విధంగా చైన్నె నగరంలోని కొన్ని కూడళ్లల్లో గ్రీన్ నెట్స్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. తొలి విడతగా 10 సర్కిళ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వివరాలు.. రాష్ట్రంలో ఎండలు మండుతున్న విషయం తెలిసిందే. కొన్నిచోట్ల సోమవారం నుంచి అకాల వర్షం పలకరిస్తున్నా, మరికొన్ని చోట్ల భానుడు తన ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. ఇక చైన్నె వంటి నగరాలలో భానుడు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాడు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. కొన్ని కూడళ్లల్లో ట్రాఫిక్ కష్టాలు ఓ వైపు, ఎండదెబ్బ మరోవైపు వాహన దారులను పిప్పి చేస్తున్నాయి. రద్దీతో కూడిన సిగ్నల్స్లో వాహన దారులకు ఉపశమనం కలిగించే విధంగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎర్రటి ఎండలో వాహన దారులకు కాస్త చల్లదనం కలిపించే విధంగా ఆకు పచ్చ(గ్రీన్) నెట్స్ను నాలుగు వైపులా ఏర్పాటు చేశారు. ఇది వాహనదారులకు చల్లదనాన్ని నింపే విదంగా ఉండడంతో కోయంబత్తూరు, తిరుప్పూర్లలో కొన్ని చోట్ల ఈ గ్రీన్స్ ఏర్పాటు వేగవంతమైంది. అదే సమయంలో చైన్నె నగరంలో ట్రాఫిక్ అధికంగా ఉండే కూడళ్లల్లో గ్రీన్నెట్స్ ఏర్పాటుకు అధికారులు సిద్ధమయ్యారు. తొలి విడతగా కార్పొరేషన్ భనం రిప్పన్ బిల్డింగ్, రాజా ముత్తయ్య సాలై, ఈవేరా పెరియార్ కూడలి, తిరుమంగలం జంక్షన్, కీల్పాకం కూడలి, వళ్లువర్కోట్టం రహదారి, చేట్ పట్జంక్షన్, అడయార్ కూడలి, తిరువాన్మీయూరు – మహాబలిపురం కూడలి తదితర పదిచోట్ల ఈ గ్రీన్ నెట్స్ ఏర్పాటు పనులపై దృష్టి పెట్టారు. తొలిదశలో చైన్నెలో పది చోట్ల ఏర్పాటుకు చర్యలు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement