-
క్లుప్తంగా
జూన్ చివరిలో వీధి కుక్కల గణన కొరుక్కుపేట: చైన్నె కార్పొరేషన్లో 2018 సంవత్సరం తర్వాత, వచ్చే జూన్ నెలాఖరులో వీధి కుక్కల గణనను కార్పొరేషన్ ప్రారంభించనుంది. ప్రస్తుతం చైన్నెలో లక్షకు పైగా వీధికుక్కలు ఉండవచ్చని కార్పొరేషన్ అధికారులు అంచనా వేశారు. చైన్నె కార్పొరేషన్లో వీధికుక్కల సమాచారాన్ని మూడేళ్ల వ్యవధిలో సేకరించారు. ఈ సమయంలో వీధి కుక్కలను పట్టుకుని, రేబిస్ నివారణ టీకాలు వేసేలా చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా గత నవంబర్లో తండయార్ పేట్ ప్రాంతంలో రేబిస్ సోకిన 87 కుక్కలకు వ్యాక్సిన్ వేశారు. అలాగే వీధికుక్కలు కూడా వివిధ ప్రాంతాల్లో మనుషులను పెంచుకుంటున్నారని, ఈ కారణంగా చైన్నెలో రేబిస్ వ్యాధి అధికమైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. 10 మండలాల్లో వీధికుక్కల గణన చేపట్టారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలాఖరులో చైన్నె మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుక్కల గణన నిర్వహించేందుకు పశువైద్య విభాగం, మున్సిపాలిటీ సన్నాహక పనుల్లో నిమగ్నమైంది. చైన్నె మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వీధికుక్కలను పట్టుకుని, ప్రతి కుక్కకు రంగు వేసి, రేబిస్ వ్యాక్సినేషన్ మాత్రమే వేస్తారు. కరోనా మహమ్మారి తరువాత, వీధి కుక్కల పెంపకాన్ని నిరోధించే ప్రయత్నాలు అమలు కాలేదు. దీంతో వీధికుక్కల బెడద పెరిగి ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో జంతు సంతానోత్పత్తి నిషేధ కార్యక్రమాన్ని సరిగ్గా అమలు చేయడానికి రూ.20 కోట్లు కేటాయించారు. వీధికుక్కలను పట్టుకునేందుకు ప్రత్యేక వాహనంలో ఐదుగురు సిబ్బంది, ఒక డ్రైవర్ ఉంటారని అధికారులు వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా మత్తు మాత్రల విక్రయం – రౌడీ అరెస్టు తిరువొత్తియూరు: పెరంబూరు సమీపంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా మత్తు మాత్రలు విక్రయిస్తున్న రౌడీని పోలీసులు అరెస్టు చేశారు. పెరంబూరు సమీపంలోని సెంబియం ప్రాంతంలో ఉన్న బందర్ గార్డెన్ వీధిలో సందేహస్పదంగా నిలబడి ఉన్న యువకుడిని ప్రత్యేక బృందం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చే శారు. అతను మత్తుమాత్రలు విక్రయిస్తున్నట్లు తెలిసింది. విచారణలో అతను అంబత్తూరుకు చెందిన రౌడీ అజిత్ అని తెలిసింది. అతన్ని పో లీసులు అరెస్టు చేశారు. అతడి ఇంట్లో తనిఖీ చేసి దాచి ఉంచిన 3,300 మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఇతను చైన్నె, శివారు నగర ప్రాంతాల్లో ఇన్స్టాగ్రామ్ ద్వారా మత్తు మాత్రలు విక్రయిస్తున్నట్లు తెలిసింది. సెంబియం పోలీస్ ఇన్స్పెక్టర్ చిరంజీవి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ప్రధానమంత్రి గృహ నిర్మాణ ప్రాజెక్టులో భారీ స్కామ్
కొరుక్కుపేట: ప్రధానమంత్రి గృహ నిర్మాణ ప్రా జెక్టులో (మొత్తం 28 పథకాల్లో) అవకతవకలకు కారణమయ్యారంటూ తమిళనాడులోని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖకు చెందిన 50 మంది అధికారులపై డైరెక్టరేట్ ఆఫ్ కరప్షన్ ప్రివెన్షన్ అండ్ మానిటరింగ్ కేసు నమోదు చేసింది. వివరాలు.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పేదల కోసం ప్ర ధాన మంత్రి గృహనిర్మాణ పథకం, జూన్ 2013లో ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద సొంత ఇల్లు లేని వారు ఇల్లు నిర్మించుకోవడానికి, కొనుగోలు చేసేందుకు నగదు ప్రయోజనాలను పొందవచ్చు. దారిద్య్రరేఖకు దిగువన ఉండి సొంత ఇల్లు నిర్మించుకోలేని వారు ఈ పథకం ద్వారా సొంత ఇల్లు నిర్మించుకునేలా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ప్రతి లబ్ధిదారునికి రూ. 2,77,290 నగదు, నిర్మాణ సామగ్రి, నిర్మాణ పనుల కోసం కార్మికులు వంటి ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పథకానికి సంబంధించి 62 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం అందించగా, మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు రూ.కోట్ల నిధులను మోసం చేసినట్లు గుర్తించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2016–2020 మ ధ్య కాలంలో పేదలకు అందాల్సిన లబ్ధిలో అక్రమాలకు పాల్పడినందుకు గ్రామీణాభివృద్ధి అండ్ పంచాయతీ రాజ్ శాఖలోని 50 మంది అధికారులపై అవినీతి నిరోధక, విచారణ డివిజన్ (డీవీఏసీ) కేసు నమోదు చేసింది. ఈ మోసానికి సంబంధించి ఇటీవలి కాలంలోనే 7 కేసులు నమోదయ్యాయి. తిరువళ్లూరు జిల్లాకు గుమ్మిడిపూండి పంచాయతీ పరిధిలోని చానాబత్తూరు గ్రామంలో గత నెల 20వ తేదీన రూ.31.66 లక్షల ఇళ్లు నిర్మించుకున్న అంశంపై నాలుగు కేసులు నమోదయ్యాయి. అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటికే సొంత ఇళ్లు ఉన్న పలువురు లబ్ధిదారులు, ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హత లేని వా రు కూడా లక్షలాది రూపాయలను కొట్టేసినట్లు తెలిసింది. లబ్ధిదారుల్లో ఎక్కువ మంది ఇళ్లు పూర్తికాక పోయినా పూర్తయినట్లు అధికారులే నకిలీ పత్రాలు సమర్పించారని పేర్కొన్నారు. నాగపట్నంలో 146 మంది లబ్ధిదారులకు ఇవ్వాల్సిన రూ.కోటి నిధు లను స్వాహా చేసిన 10 మంది అధికారులపై కేసు నమోదైంది. ప్రధానమంత్రి గృహనిర్మాణ పథకం కింద ఇది అతిపెద్దదిగా పరిగణించబడుతుంది. తరచూ పంచాయతీ కార్యదర్శులు, నియోజకవర్గ అభివృద్ధి అధికారులు (పీడీఓలు), పంచాయతీ పెద్దలు తమ పేర్లను లబ్ధిదారులుగా రిజర్వ్ చేసి, నకిలీ పత్రాలు, ఇంటి స్థలం గురించి నకిలీ వివ రాలు సమర్పించినట్లు సమాచారం. 50 మంది తమిళనాడు అధికారులపై చర్యలు కేసు నమోదు చేసిన డీవీఏసీ -
ద్విపాత్రాభినయం కాదా?
తమిళసినిమా: నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం గోట్. వెంకట్ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సైంటిఫిక్ యాక్షన్ ఎంటర్టెయినర్ కథా చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ భారీ ఎ త్తున నిర్మిస్తోంది. నటు డు ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, వైభవ్, ప్రేమ్జీ, నటి శేషాద్రి చౌదరి, స్నేహ, లైలా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గోట్ చిత్రంలో పలు ప్రత్యేకతలు సంతరించుకున్నాయని సమాచారం. ము ఖ్యంగా ఇందులో విజయ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని, అందులో కొడుకు పాత్రలో విజయ్ను లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా చాలా యంగ్గా చూపించబోతున్నట్లు, అందుకోసం అమెరికాలో గ్రాఫి క్స్ సన్నివేశాలను రూపొందించినట్లు ప్రచారం జరిగింది. కాగా తాజాగా ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం కాదట. త్రిపాత్రాభినయం చేస్తున్నారట. ఈ విషయాన్ని తాజాగా సంగీత దర్శకుడు యువన్శంకర్రాజా తన ఎక్స్ మీడియాలో పేర్కొనడం విశేషం. దీంతో గోట్ చిత్రం ఇప్పటికే ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోవడం ఖాయం. ఇకపోతే విజయ్ ఈ చిత్రంలో రెండు పాటలను పాడడం మరో విశేషం. సాధారణంగా ఆయన తన చిత్రాల్లో ఒక్కో పాటనే పాడుతుంటారు. ఎప్పుడో ఈయన తండ్రి ఎస్ఏ.చంద్రశేఖర్, నటుడు విజయకాంత్, సూర్య కలిసి నటించిన చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రం కోసం విజయ్ మూడు పాటలను పాడారు. ఆ తరువాత రెండు పాటలు పాడటం అన్నది ఇప్పుడే జరిగింది. కాగా ఈ చిత్రంలోని విజిల్ పోడు పాటను విడుదల చేయగా విశేష ఆదరణను పొందుతోంది. తాజాగా మరో పాటను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధం అయ్యింది. ఇకపోతే గోట్ చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, చిత్రాన్ని సెప్టెంబరు 5వ తేదీన తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. -
పెళ్లెక్కడో తెలుసా?
నటి వరలక్ష్మీశరత్కుమార్తమిళసినిమా: సినీ తారలు ముఖ్యంగా కథానాయికల్లో అధిక శాతం 35, 40 ఏళ్ల వయసులోనే పెళ్లిళ్లు చేసుకుంటారు. కారణం కేరీర్ భద్రత కోసం అని చెప్పవచ్చు. 40 ఏళ్లు దాటినా పెళ్లి కాని వారూ ఉన్నారు. వారి విషయం పక్కనపెడితే 39 ఏళ్ల వరలక్ష్మీ శరత్కుమార్ ఇప్పుడు పెళ్లికి సిద్ధం అయ్యారు. 2012లో పోడా పోడీ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన నట వారసురాలు ఈమె. వరలక్ష్మీ శరత్కుమార్ నటుడు శరత్కుమార్ కూతురన్న విషయం తెలిసిందే. విదేశాల్లో చదివిన ఈమె బెల్లీ డాన్స్లోనూ శిక్షణ పొందారు. కాగా తొలి రోజుల్లో హీరోయిన్గా నటించినా, ఆ తరువాత నాయకి, ప్రతినాయకి అని చూడకుండా నటనకు అవకాశం ఉంటే వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించి నటించేస్తున్నారు. అలా విజయ్, విశాల్ వంటి స్టార్ హీరోలతోనే ఢీ కొన్నారు. అంతే కాదు తమిళం, తెలుగు తదితర భాషల్లోనూ నటిస్తూ బహుభాషానటిగా పేరు తెచ్చుకున్నారు. కాగా ఇప్పుడీ భామకు పెళ్లి కళ వచ్చేసింది. మార్చి నెలలో నికోలాయ్ సత్యదేవ్ అనే వ్యక్తితో వరలక్ష్మీ శరత్కుమార్ వివాహ నిశ్చితార్థం నిడారంబరంగా జరిగింది. అయితే పెళ్లి ఎప్పుడన్నది ప్రకటించలేదు. అలాంటిది ఈ జంట ఇప్పుడు పెళ్లికి సిద్ధం అవుతోంది. జూలై నెల 2వ తేదీన థాయ్ల్యాండ్లో వీరి వివాహానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. అయితే అంతకుముందు చైన్నెలో వరలక్ష్మీ శరత్కుమార్, నికోలాయ్ సత్యదేవ్ వివాహ రిసెప్ఫన్ ఘనంగా నిర్వహించనున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
నారాయణిలో అంతర్జాతీయ అత్యవసర వైద్య దినోత్సవం
వేలూరు: శ్రీపురంలోని బంగారుగుడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ నారాయణి ఆస్పత్రి, పరిశోధన కేంద్రంలో అంతర్జాతీయ అత్యవసర వైద్య దినోత్సవం ఆస్పత్రి డైరెక్టర్ బాలాజీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శక్తిఅమ్మ సింగపూర్ భక్తుడు డాక్టర్ హైవే చుంగ్ ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో విశిష్ట సేవలు అందజేసిన వైద్య సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణపాయ స్థితిలో ఉన్న వారికి అత్యవసర విభాగంలో వైద్య సిబ్బంది చేసే సేవ ఎనలేనిదన్నారు. ప్రాణాలకు తెగించి రోగిని కాపాడాలనే తపనతో ఎంతటి సమస్యనైనా ఎదుర్కొని ప్రాణాలను కాపాడుతున్నారన్నారు. అనంతరం అతిథిని ఆస్పత్రి నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గీతా, అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శక్తివేల్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సమయం ఉంది
అందుకు ఇంకా తమిళసినిమా: జనాల్లో హీరోయిన్ల పెళ్లిళ్ల మీద ఉన్న ఆసక్తి మరి దేనిపైనా ఉండదేమో. వారు ప్రేమలో పడితే వార్త, పెళ్లి కాకపోతే వార్త, పెళ్లి అయితేనూ వార్తే. ఇదీ హీరోయిన్ల పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఇలాంటి వార్తలు వారికి పెద్ద తలనొప్పే అని చెప్పవచ్చు. అయితే ఇలాంటి వార్తలను కొందరు చాలా ఎంజాయ్ చేస్తారు. కాగా నటి అంజలి కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. కారణం ఈమె వయసు 36 ఏళ్లు కావడమే. ఇంకా పెళ్లెప్పుడు అనే ప్రశ్నలు అంజలిని వెంటాడుతూనే ఉన్నాయి. తెలుగు, తమిళం భాషల్లో కథానయకిగా రాణించిన ఈ బ్యూటీ పదహారణాల తెలుగమ్మాయి అన్న విషయం తెలిసిందే. కట్రదు తమిళ్ చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన అంజలి తొలి చిత్రంతోనే ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక అంగాడితెరు చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్నారు. కాగా ఇప్పుడు కథానాయకి పాత్రలనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గానూ అవతారమెత్తారు. ఈమె గురించి చాలా వదంతులు ప్రచారం అయ్యాయి. ముఖ్యంగా అంజలి రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అయితే ఇలాంటి వార్తలను ఆమె ఖండించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అంజలి పేర్కొంటూ తనకు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసేశారని అన్నారు. మొదట్లో ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఇంటిలో అందరూ బాధ పడ్డారని, అయితే అలాంటి వార్తలు కొద్ది రోజులే కలకలాన్ని రేకెత్తిస్తాయని, ఆ తరువాత వాటిని ఎవరూ పట్టించుకోరన్నారు. తనపై జరుగుతున్న పెళ్లి వదంతుల కారణంగా తాను నిజంగానే ఒక వ్యక్తిని తీసుకెళ్లి ఇతన్నే తాను పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పినా ఇంట్లో ఎవరూ నమ్మరని అన్నారు. అయితే తను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని, అయితే అందుకు ఇంకా చాలా సమయం ఉందని అంజలి పే ర్కొన్నారు. నటిగా తాను ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నానని చెప్పారు. పెళ్లి చేసుకున్నా సినిమాల్లో నటిస్తానని చెప్పారు. -
థ్రోట్ క్యాన్సర్ శస్త్ర చికిత్సలో కేకేఆర్ మైలురాయి
సాక్షి, చైన్నె: సర్వైవల్ థ్రోట్ క్యాన్సర్ శస్త్ర చికిత్సలో కేకేఆర్ ఈఎన్టీ ఆస్పత్రి, పరిశోధన ఇనిస్టిట్యూట్ ఓ మైలురాయిని దాటిందని డాక్టర్లు కేకే రామలింగం, గౌరీశంకర్ బృందం ప్రకటించింది. మంగళవారం స్థానికంగా జరిగి సమావేశంలో వైద్యులు మాట్లాడుతూ మాట్లాడుతూ 22 ఏళ్ల క్రితం తాము జరిపిన శస్త్రచికిత్స గురించి గుర్తు చేస్తూ, నేటికీ ఆ రోగి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు ప్రకటించారు. ఆధునిక టెక్నాలజీ అన్నది లేని కాలంలో సర్వైవల్ థ్రోట్ క్యాన్సర్తో బాధపడుతూ వచ్చిన ఆంధ్రప్రదేశ్కు చెందిన తేజేశ్వరరావుకు 2002లో కీమో తెరఫీ, రేడియోథెరఫీ చికిత్సలు చేసినా ఫలితం లేకపోవడంతో అప్పట్లో తమ వద్ద ఉన్న కొత్త పద్ధతులను అనుసరించి, చేసిన శస్త్ర చికిత్స వివరాలను గుర్తు చేశారు. గొంతు క్యాన్సర్ శస్త్రచికిత్సకు రెండు రకాల పద్ధతులతో రెండు విభాగాల వైద్య బృందం శస్త్ర చికిత్సను అప్పట్లో విజయవంతం చేసిందన్నారు. ఈ శస్త్ర చికిత్స జరిగి 22 సంవత్సరాలు అవుతుందని, ఆ శస్త్రచికిత్స చేయించుకున్న రోగి ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా ఉన్నారని, ఆయన అందరిలానే ఛలాకీగా, ఉత్సాహంగా తన పనులు తాను 22 ఏళ్లుగా చేసుకుంటుండడం, శస్త్ర చికిత్సలో తాము సాధించిన మైలురాయిగా పేర్కొన్నారు. ఈ సమవేశంలో డాక్టర్ రాజ, రాజసుందరం, జోషఫ్ పాల్గొన్నారు. -
కౌంటింగ్కు ముమ్మర ఏర్పాట్లు
వేలూరు: పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్, వేలూరు పార్లమెంట్ ఎన్నికల అధికారి సుబ్బలక్ష్మి తెలిపారు. జూన్ 4వ తేదీన పార్లమెంట్ ఓట్లు లెక్కింపు జరుగుతుందన్నారు. వేలూరు, అరక్కోణం పార్లమెంట్ స్థానా ల ఓట్ల లెక్కింపు రాణిపేట ఇంజినీరింగ్ కళాశాల, వేలూరు పార్టమెంట్ కౌంటింగ్ తందైపెరియార్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళా శాలలో జరగనుంది. దీంతో వేలూరులోని కౌంటింగ్ సెంటర్లోని ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుబ్బలక్ష్మి, ఎస్పీ మణివన్నన్తోపాటు ఉన్నతాధికారులు మంగళవా రం ఉదయం కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారుల బృందం కౌంటింగ్ చేసే గది, కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నమోదు, ఇందుకు అసరమైన బందోబస్తు ఏర్పాట్ల ను పరిశీలించారు. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల్లో 74 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి 24 గంటల పాటు పనిచేసేలా ఈవీఎం మిషన్లు ఉన్న చోట జరిగే ప్రతి విషయాన్ని జిల్లా కేంద్రం నుంచి అధి కారులు పర్వవేక్షించనున్నారు. కౌంటింగ్ కేంద్రానికి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించ కుండా ముందుస్తు ఏర్పాట్లను సిద్ధం చేశారు. కౌంటింగ్ నిర్వహించే రోజున మీడియాకు ప్రత్యేకంగా గదిని కేటాయించి ప్రతి రౌండ్లో కౌంటింగ్ నిర్వహించిన అనంతరం మీడియాకు తెలిపేలా బో ర్డును ఏర్పాటు చేశారు. అలాగే కౌంటింగ్ కేంద్రం నుంచి తెలిపే ప్రతి విషయాన్ని విలేకరులకు తెలిసే విధంగా స్పీకర్ బాక్సులను ఏర్పాటు చేయనున్నారు. వేలూరులోని కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు గురించి పోలీసులతో సమీక్షించడం జరిగిందన్నారు. ఆమెతో పాటు సబ్ కలెక్టర్ కవిత అధికారులు పాల్గొన్నారు. -
కేరళ ప్రభుత్వానికి కేంద్రం షాక్
● కమిటీ భేటీ రద్దు ● కొనసాగుతున్న రైతుల ఆందోళనలు సాక్షి, చైన్నె: ముల్లైపెరియార్ డ్యాం కూల్చి వేసి, కొత్త డ్యాం నిర్మాణ వ్యవహారంలో కేరళ ప్రభుత్వానికి షాక్ తప్పలేదు. మంగళవారం జరగాల్సిన కమిటీ సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు రద్దు చేశారు. వివరాలు.. కేరళ రాష్ట్రం ఇడిక్కిలోని ముల్లైపెరియార్ జలాశయంపై తమిళనాడుకు ఉన్న పూర్తి హక్కులను కాలరాసే విధంగా మళ్లీ కేరళ పాలకులు చేపట్టిన చర్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ జలాశయాన్ని కూల్చి వేసి కొత్తగా డ్యాం నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన అనుమతుల కోసం కేంద్రానికి కేరళ పాలకులు నివేదిక పంపించారు. ఈ సమాచారంతో రాష్ట్రంలో నిరసనలు బయలుదేరాయి. కేరళ ప్రతిపాదనలను పక్కన పెట్టాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రికి సీఎం స్టాలిన్ లేఖ కూడా రాశారు. మంగళవారం ఢిల్లీలో అటవీ, పర్యావరణ శాఖ నేతృత్వంలోని కమిటీ సమావేశంలో ఈ నివేదిక చర్చకు రావాల్సి ఉంది. అయితే, హఠాత్తుగా ఈ కమిటీ సమావేశాన్ని కేంద్రం రద్దుచేసింది. తమిళనాడుతో చర్చించకుండా, తమిళనాడు అనుమతి లేకుండా ఈ సమావేశం నిర్వహించలేమని, తమిళనాడు అనుమతితోనే సమావేశం నిర్వహించాల్సిన అవశ్యం ఉందనిపేర్కొంటూ, రద్దు చేశారు. ఇది కాస్త కేరళ పాలకులకు షాక్ ఇచ్చినట్లయ్యిం. ఇది తాత్కాలికమే అయినా, తదుపరి ప్రయత్నాలపై కేరళ పాలకులు దృష్టి పెట్టారు. అదే సమయంలో కేరళ చర్యలను వ్యతిరేకిస్తూ మంగళవారం తేని, విరుదునగర్, మదురై, దిండుగల్, రామనాథపురం, శివగంగై జిల్లాలలోని రైతులు, ప్రజా సంఘాల నిరసనలు కొనసాగాయి. -
గుమ్మడికాయ కొట్టారు
కాదలిక్క నేరమిలైకు తమిళసినిమా: చాలా కాలం క్రితం ప్రఖ్యాత దర్శకుడు శ్రీధర్ దర్శకత్వం వహించిన సూపర్హిట్ చిత్రం కాదలిక్క నేరమిలై. కాగా అదే టైటిల్తో ఇప్పుడు జయంరవి, నటి నిత్యామీనన్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. రెడ్ జెయంట్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృతిక ఉదయనిధి దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు యోగిబాబు, లాల్, వినయ్, లక్ష్మీ రామకృష్ణన్, గాయకుడు మనో, టీజే.భాను, జాన్ కోకెన్, వినోదిని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. కేవ్మిక్ ఆరి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేయగా విశేష ఆదరణను పొందిందని చిత్ర వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం షూటింగ్ను పూర్తి చేసి, నిర్మాణాంతర కార్యక్రమాలకు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. త్వరలోనే చిత్రం టీజర్, ఆడియో, ట్రైలర్ విడుదలకు సంబంధిచిన వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. -
ఆకలి దినోత్సవం వేళ సహపంక్తి భోజనాలు
సాక్షి, చైన్నె : ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం తమిళగ వెట్రి కళగం నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా సహపంక్తి భోజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు అన్నదానాలతో విజయ్ అభిమానులు ముందుకెళ్తారు. రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్ ప్రజా సేవలో నిమగ్నమయ్యే విధంగా ప్రస్తుతం కార్యక్రమాలను విస్తృతం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగాప్రపంచ ఆకలి దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ వర్గాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సంహపంక్తి భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేయించారు. అన్నదానాలతో పేదల ఆకలి తీర్చేప్రయత్నం చేశారు. వాడవాడలా ఈ కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయి. కొన్ని చోట్ల ఆహారం మిగిలిపోగా, వాటిని అనాథ ఆశ్రమాలకు అందజేశారు. చైన్నె తిరువొత్తియూరులో సంహపంక్తి భోజన కార్యక్రమాన్ని తమిళగ వెట్రి కళగం ప్రధాన కార్యదర్శి భుషిఆనంద్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్టీ పరంగా ఏ నిర్ణయమైనాసరే విజయ్ ప్రకటిస్తారని, ఆయనే తీసుకుంటారని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆయన సూచనలు, సలహా మేరకు ప్రస్తుతం ఆకలిదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. జూన్ 22వ తేదీన విజయ్ బర్త్డే సందర్భంగా పెద్దఎత్తున కార్యక్రమాలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. తమ పార్టీ వరకు 365 రోజుల ప్రజా సేవ చేయాలన్న నిర్ణయం, ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేయాలనే తపన ఉందన్నారు. సీమాన్ నేతృత్వంలో నామ్ తమిళర్ కట్చితో కలిసి పనిచేస్తారా? అని ప్రశ్నించగా పార్టీ పరంగా ఏ నిర్ణయమైనా విజయ్ ప్రకటిస్తారని, అంత వరకు ఎదురు చూడండి అంటూ ముగించారు. -
కంపెనీలో స్పృహ తప్పి కార్మికుడి మృతి
తిరువళ్లూరు: కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న వ్యక్తి స్పృహ తప్పి కిందపడిపోయిన క్ర మంలో అతడ్ని వైద్యశాలకు తరలించగా మార్గం మధ్యలోనే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా సేతుపాక్కం ప్రాంతానికి చెందిన పుగళేంది(62) కవరపేట సమీపంలోని జేసీబీ తయారు చేసే సంస్థలో సెక్యూరిటీగా పని చేస్తున్నాడు. ఈక్రమంలో గత 26 రాత్రి యఽథావిధిగా విధులకు హాజరయ్యాడు. మరుసటి రోజు సైతం విధులు నిర్వహించగా సోమవారం రాత్రి హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే సహచరులు అతడిని పొన్నేరి వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు స్పష్టం చేశారు. మృతుడి కొడుకు నల్లతంబి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కవరపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ రౌడీ అరెస్టు అన్నానగర్: పుళల్లో వివిధ కేసులతో సంబంధం కలిగి పరారీలో ఉన్న రౌడీ మంగళవారం పట్టుబడ్డాడు. పుళల్ పక్కనే ఉన్న కావంగరై కన్నప్ప సామి పట్టణానికి చెందిన ప్రముఖ రౌడీ శరవణన్ అలియాస్ శరవణన్ (33) హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీ తదితర కేసుల్లో వాంటెడ్ క్రిమినల్. ఇతని కోసం పోలీసులు రోజుల తరబడి వెతికారు. ఈ స్థితిలో పరారీలో ఉన్న శరవణన్ పుళల్ మాథనంగుప్పం ప్రాంతంలో తలదాచుకున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ప్రత్యేక బృందం పోలీసులు మంగళవారం అతడిని అరెస్టు చేశారు. అనంతరం పుళల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజాసింగ్ అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
1న ఢిల్లీకి సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె : ఇండియా కూటమి భేటీ కోసం సీఎం స్టాలిన్ వెళ్లనున్నారు. ఇందులో ప్రస్తావించాల్సిన అంశాల గురించి మంగళవారం అన్నా అరివాలయంలో పార్టీ సీనియర్లతో ఆయన చర్చించారు. వివరాలు.. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరిన విషయం తెలిసిందే. గెలుపు ధీమాతో ఇండియా కూటమి ఉంటోంది. ఈ పరిస్థితుల్లో వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యేందుకు కూటమి నేతలు నిర్ణయించారు. జూన్ ఒకటో తేదీన ఢిల్లీలతో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం స్టాలిన్ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో డీఎంకే తరపున ప్రస్తావించాల్సిన అంశాలు, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన పక్షంలో తమ పాత్ర తదితర అంశాల గురించి పార్టీ సీనియర్లతో చైన్నెలో స్టాలిన్ చర్చించారు. పార్టీ సీనియర్లు దురై మురుగన్, టీఆర్ బాలు, నెహ్రూ తదితరులు తేనాంపేటలోని డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో చర్చించారు. అదే సమయంలో ఎన్నికల ఫలితాల లెక్కింపునకు ముందుగా పార్టీ ఏజెంట్లు, లోక్సభ అభ్యర్థులు తదితరులుతో భేటీకి నిర్ణయించారు. ఓట్ల లెక్కింపు రోజున వీరు వ్యవహరించాల్సిన అంశాలు, చట్ట పరమైన సూచనలు తదితర అంశాలను వివరించే విధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జూన్ ఒకటో తేదీ ఉదయం సమావేశం జరగనుంది. పార్టీ ఎంపీ, సీనియర్ న్యాయవాది ఎన్ఆర్ ఇళంగో అన్ని వివరాలను అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు తెలియజేయనున్నారు. పాంబన్ వంతెన మార్గంలో పడవలపై నిషేధం కొరుక్కుపేట: పాంబన్ రైల్ వంతెన మరమ్మతు పనుల కోసం ఆ మార్గంలో ఓడలు, ఫిషింగ్ బోట్ల రాకపై అధికారులు నిషేధం విధించారు. వివరాలు.. రామేశ్వరం పాంబన్ వంతెన వద్ద సుమారు 2.3 కి.మీ దూరంలో రైల్వే వంతెన ఉంది. ఇది భారతదేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన. ఇందులో ఓడలు వెళ్లేందుకు వీలుగా ఓ వంతెన కూడా ఉంది. సుమారు 110 ఏళ్లుగా వినియోగంలో ఉన్న ఈ వంతెన తుప్పు పట్టడంతోపాటు ఇనుప గర్డర్లు పాడైపోయాయి. 2022 నాటికి రూ.550 కోట్ల విలువ తో పాంబన్ కొత్త వంతెన నిర్మాణం గత ఏడాది ఆగస్టులో ప్రారంభమైంది. అలాగే ట్రాఫిక్ను నిలిపివేసి రామేశ్వరం వెళ్లే రైళ్లు ప్రస్తుతం మండబంవరం వరకు మాత్రమే నడుస్తున్నాయి. ఈ పరిస్థితిలో ప్రస్తుతం పంబన్ బ్రిడ్జి వద్ద కొత్త వేలాడే వంతెనను నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు ప్రారంభించి వంతెన మధ్యలో స్టీల్ పిల్లర్లు నిర్మిస్తున్నారు. ఈనేపథ్యంలో సస్పెన్షన్ బ్రిడ్జి గుండా ఓడలు, డీప్ సీ ఫిషింగ్ పడవలు వెళ్లకుండా నిషేధం విధించినట్లు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అధికారులు తాజాగా తెలిపారు. అగ్నికి టాటా! ● మరో నాలుగు రోజులు భానుడి సెగ ●నైరుతిపై రైతుల ఆశలు సాక్షి, చైన్నె : అగ్ని నక్షత్రం మంగళవారంతో ముగిసింది. దీంతో ఎండలు తగ్గుముఖం పట్టనున్నాయి. అయితే మరో నాలుగైదురోజులు ఉత్తర తమిళనాడులో భానుడు సెగ తీవ్రంగా ఉంటుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. తర్వాత నైరుతి రుతు పవనాల రాకతో వాతావరణం చల్లబడుతుందని పేర్కొంది. వివరాలు.. రాష్ట్రంలో ఏటా వేసవిలో ఎండలు తీవ్రంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది భానుడి ప్రతాపం మరీఎక్కువగా కనిపించింది. రెండు నెలలు జన జీవితాన్ని భానుడు పిప్పి చేశారు. మే నెల మొదటి వారంలో అగ్ని నక్షత్రం(కత్తిరి)నెల ఆరంభంతో ఎండలు మరింతగా మండుతాయని భావించారు. అయితే అకాల వర్షం రూపంలో ఈ ఏడాది అగ్నినక్షత్రం వేళ భానుడి సెగ తగ్గినట్లయ్యింది. అదే సమయంలో రెమల్ తుఫాన్ పుణ్యమా అని ప్రస్తుతం గాలితో తేమ కరువైంది. దీంతో మళ్లీ మంగళవారం నుంచి భానుడి సెగ అనేక జిల్లాల్లో మొదలైంది. ఇదే రోజు అగ్ని నక్షత్రానికి చివరి రోజుకావడం గమనార్హం. మరో నాలుగైదురోజులు ఉత్తర తమిళనాడులోని పలు జిల్లాల్లో భానుడి ప్రతాపం అఽధికంగానే ఉంటుందని, ఆ తర్వాత క్రమంగా తగ్గే అవకాశాలు ఉన్నట్టు వాతవరణ కేంద్రం ప్రకటించింది. కేరళ తీరాన్ని నైరుతి రుతు పవనాలు తాకే సమయం ఆసన్నమైందని, ఇది క్రమంగా విస్తరించి పశ్చిమ కనుమల వెంబడి ఉన్న తమిళనాడు జిల్లాలో అధిక వర్షాన్ని కురిపించే అవకాశాలు ఉన్నట్టు ప్రకటించారు. ఈ పవనాల రూపంలో డెల్టా, ఉత్తర తమిళనాడులోమోస్తారుగా వర్షాలు ఎదురు చూడవచ్చు అని పేర్కొన్నారు. మదురై, కోయంబత్తూర్కు హెలికాప్టర్ సేవలు కొరుక్కుపేట: తమిళనాడులోని చైన్నె, మదురై, కోయంబత్తూరు వంటి ప్రధాన నగరాల మధ్య త్వరలో హెలికాప్టర్ సేవలను ప్రారంభించనున్నట్లు తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ నండూరి తెలిపారు. తమిళనాడులో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ఫ్లయింగ్ ట్యాక్సీని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఈ దశలో దూరంగా ఉన్న ప్రధాన నగరాలకు హెలికాప్టర్లు నడపాల్సి ఉంది. ఈ సందర్భంగా తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ నండూరి మాట్లాడుతూ.. నేషనల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ పౌర విమానయాన విధానం హెలికాప్టర్ విధానాన్ని రద్దు చేయడం ద్వారా తమిళనాడులోని ప్రధాన నగరాల్లో హెలికాప్టర్ సేవలు పునరుద్ధరణ జరుగుతోందన్నారు. -
యోగిబాబు హీరోగా జోరా కై య తట్టుంగ
తమిళసినిమా: ప్రస్తుతం స్టార్ హీరోల కంటే బిజీగా ఉన్న నటుడు యోగిబాబు. ఇటు హీరోగానూ అటు కమిడియన్గానూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న జోరా కై య తట్టుంగ. వామా ఎంటర్టెన్మెంట్ పతాకంపై జకీర్ అలీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ శరవణా ఫిలిం ఆర్ట్స్ అధినేత జీ.సరా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తీక్కుళిక్కుమ్ పచ్చై మరం చిత్రం పేమ్ వినీష్ మిలినియం కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చితంలో యోగిబాబుతో హరీశ్ పేరడీ, విక్రమ్ చిత్రం ఫేమ్ వాసంతి, జాహీర్ అ లీ,మణిమారన్, శాంతిదేవి, మేనకా, నైనా, అరువి బా లా, మూర్, శ్రీధర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషి స్తున్నారు. దీనికి జాతీయ అవార్డు గ్రహీత మధు అంబట్ ఛాయాగ్రహణం, ఎస్ఎన్.అరుణగిరి సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను సోమవారం నటుడు విజయ్సేతుపతి ఆన్లైన్ ద్వారా విడుదల చేశారు. దీని గురించి చిత్ర వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు పేర్కొంటూ నటుడు యోగిబాబు ఇంతకు ముందెప్పుడూ నటించనటువంటి విభిన్న పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారన్నారు. చిత్రం షూటింగ్తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, త్వరలోనే జోరా కై య తట్టుంగ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. దీన్ని శక్తి ఫిలిం ఫ్యాక్టరీ శక్తివేల్ తమిళనాడు విడుదల హక్కులను పొందినట్లు చెప్పారు. -
ఆగస్టులో ముత్తమిళ్ మహానాడు
● వేదికగా పళణి ● 24, 25 తేదీలలో నిర్వహణ ● ప్రత్యేక వెబ్సైట్ ఆవిష్కరణ సాక్షి,చైన్నె: ఈ ఏడాది ఆగస్టు 24, 25 తేదీలలో అరుప్పడై వీడులలో ఒకటైన పళణి వేదికగా ముత్తమిళ్ మురుగన్ మహానాడు జరగనుంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్ను మంగళవారం ఆవిష్కరించారు. దీని ద్వారా మురుగన్ సంబంధిత రచనలు, కవితలు, పరిశోధన పత్రాలను సమర్పించే అవకాశం కల్పించామని హిందూ దేవదాయ శాఖ ప్రకటించింది. వివరాలు.. తమిళుల ఆరాధ్య దైవం మురుగన్ వైభవాన్ని చాటే విధంగా హిందూ, దేవదాయ శాఖ , సలహాకమిటీల నేతృత్వంలో సుబ్రహ్మణ్య స్వామి భక్తుల కోసం ఆరుపడై వీడులలో ఒకటిగా ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రం పళణిలో ముత్తమిళ్ మురుగన్ 2024 మహానాడు నిర్వహణకు నిర్ణయించారు. అంతర్జాతీయ స్థాయిలో జరగనున్న ఈ మహానాడుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ మత పెద్దలు , పెద్ద సంఖ్యలో ఆధ్యాత్మిక వేత్తలు, శివాచార్యులు , భక్తులు హాజరయ్యే విధంగా ఏర్పాట్ల మీద అఽధికారులు చర్యలు చేపట్టారు. ఈ రెండురోజుల వేడుకలో విదేశాల నుంచి వచ్చే అతిథులను ఆహ్వానించడమే కాకుండా పరిశోధనా పత్రాలను సమర్పించే వారి కోసం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించారు. అలాగే, మతపరమైన వ్యవహారాలు, పర్యాటక, సాంస్కృతి, హిందూ ధర్మాదయ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి, స్పెషల్ డ్యూటీ ఆఫీసర్లు, కమిషనర్, ఉన్నత అధికారులు ఆధ్యాత్మిక పెద్దలతో ఈ మహానాడు కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీల పర్యవేక్షణలో సబ్ కమిటీలు సైతం ఏర్పాటయ్యాయి. దేవాలయాల ప్రదర్శన హాలు, పరిశోధనా పత్రాల కోసం ఓ ప్రయోగశాల, పెద్దల ప్రసంగాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీతం, తదితర కార్యక్రమాలు ఈ మహానాడులో నిర్వహించనున్నారు. ఈ మహానాడు ముగింపు రోజున తమిళుల ఆరాధ్య దేవుడు మురుగన్ మహిమలు ప్రపంచానికి తెలియజేసే విధంగా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తమిళం ఆంగ్లంలో రూపొందించబడిన ఈ వెబ్సైట్ను హిందూ చారిటబుల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు తవ తిరు కౌమార మఠం సిరవై ఆధీనం కుమరగురు బర స్వామి, తవతిరు మైలం బొమ్మాపుర ఆధీనం శ్రీ శివజ్ఞాన బాలయ స్వామి, సత్యవేల్ మురుగనార్, సుకి శివం, మంగయ్య కరసి ఈ వెబ్సైట్ను ఆవిష్కరించారు. ఈ మహానాడుకు హాజరయ్యే వారు ఇందులో పేర్లను నమోదు చేసుకోవచ్చు. అలాగే మురుగన్ సంబంధిత అన్ని రకాల పత్రాలను సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఈ వెబ్సైట్లో చేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. మణివాసన్, స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ కుమారగురుపరన్, కమిషనర్ మురళీధరన్, అదనపు కమిషనర్లు శంకర్, తిరుమల్, ప్రత్యేక అధికారులు సి. హరి ప్రియ, కవిత, జానకి తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాలే అభివృద్ధికి పట్టుకొమ్మలు
సాక్షి, చైన్నె: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై సీఎం స్టాలిన్ ప్రత్యేక దృష్టి సారించినట్టు రాష్ట్ర ప్రభుత్వం ముడేళ్ల ప్రగతి నివేదికలో పేర్కొంది. డీఎంకే మూడేళ్ల పాలనలో ఎన్నో ప్రాజెక్టులు ప్రవేశపెట్టి అమలు చేస్తూ వస్తోందని వివరించారు. 12,525 గ్రామ పంచాయతీలను కంప్యూటరీకరణ చేశామని, నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆస్తి పన్ను, నీటి పన్ను, వ్యాపార పన్ను, వివిధ ప్రణాళికలకు అనుమతులు, ప్లాట్లు, పౌర సంక్షేమానికి ప్రభుత్వం అనుమతులు, భవన నిర్మాణ అనుమతులు ఇలా.. అన్నీ ఈ– గవర్నెన్స్ విధానంలో అమలు చేస్తూ వస్తున్నామని గుర్తుచేశారు. అలాగే గ్రామ పంచాయతీలకు పరిపాలన కోసం ఆర్థిక పరిమితి రూ.2 లక్షల నుంచి రూ. 10 లక్షలు, యూనియన్ పంచాయతీలకు రూ. 10 నుంచి 25 లక్షలు, జిల్లా పంచాయతీలకు రూ. 20 నుంచి రూ. 50 లక్షలకు పెంచామని వివరించారు. అలాగే రాష్ట్రంలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న గ్రామ పంచాయతీలను గుర్తించి గాంధీ అవార్డులను అందజేస్తూ వస్తున్నామన్నారు. అవార్డు అందుకున్న పంచాయతీలకు రూ. 10 లక్షలు ప్రోత్సాహక నగదును అందజేస్తున్నామన్నారు. ఉపాధి పథకంతో.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాలకు అదనపు లబ్ధి చేకూరినట్టు పేర్కొన్నారు. 2,87,461కి ఈ పథకం ద్వారా ఉపాధి కల్పించినట్టు వివరించారు. నాబార్డ్ ఆర్ఐడీఎఫ్ పథకం కింద గత మూడేళ్లలో 550 కి.మీ 287 పొడవైన రహదారి పనులు, 342 వంతెన నిర్మాణ పనులు రూ.1,221 కోట్ల నిధులు కేటాయించామన్నారు. అలాగే రూ.354 కోట్ల అంచనా వ్యయంతో రోడ్డు పనులు, 151 వంతెనలు పూర్తి చేశామన్నారు. తమిళనాడు గ్రామీణ రహదారుల అభివృద్ధి పథకం ద్వారా 6,208 కి.మీ పొడవునా 4,606 రోడ్డు పనులు రూ. 1,484 కోట్లతో పూర్తి చేశామని వివరించారు. 9 జిల్లాల్లో రూ.20 కోట్ల అంచనా వ్యయంతో పట్టణ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామీణ పంచాయతీల్లో 10 గ్యాస్ శ్మశాన వాటికల నిర్మాణానికి అనుమతి ఇచ్చామన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ గృహ నిర్మాణ పథకం అమలు, పెరియార్సమత్తువ పురంల ఏర్పాటు గురించి ఈ నివేదికలో ప్రస్తావించారు. గ్రామీణాభివృద్ధిలో భాగంగా పంచాయతీలకు 631 భవనాలు 73 బస్టాండ్లతోపాటు 5,377 పనులు పూర్తి చేశామని వివరించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఏడాదికి 3 కోట్లు కేటాయిస్తూ, మూడేళ్లలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు గ్రామీణాభివృద్ధికి ఈ పథకం కింద రూ.2,106 కోట్లు కేటాయించామన్నారు. అలాగే ఒక్కో పార్లమెంటు సభ్యునికి ఆర్థిక సంవత్సరంలో రూ. 5 కోట్లు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖ పథకాలకు అందజేశామన్నారు. తద్వారా ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. స్వచ్ఛ భారత్ ఉద్యమంలో భాగంగా ప్రతి ఇంటికి మరుగు దొడ్ల ఏర్పాటు దిశగా గ్రామాలలో 1,44,489 కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించామన్నారు. 2,940 కమ్యూనిటీ హెల్ సెంటర్ల నిర్మాణాలతో పాటు మన ఊరు పథకం ద్వారా 37 జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్లు, పాఠశాలల భవనాలు, అంగన్వాడీలు, తాగునీటి పథకాలు, కమ్యూనిటీ హెల్త్ సౌకర్యాలు, భూగర్భ డ్రైనేజీ పథకాలను పూర్తి చేశామన్నారు. అలాగే జల్ జీవన్ పథకంద్వారా 2024 చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని కుటుంబాలకు అవసరమైన స్వచ్ఛమైన తాగునీరు అందించే విధంగా పైప్లైన్ కనెక్షన్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళాస్వయం సహాయక బృందాలకు రూ. 71,960 కోట్ల రుణాలను అందజేశామని, ఇది వారి అభ్యున్నతికి ఎంతో దోహదకరంగా ప్రకటించారు. స్వయం ఉపాధి పథకం, వృత్తి నైపుణ్యాల అభివృద్ధి శిక్షణ వంటి కార్యక్రమాల ద్వారా పేద యువతకు ఉపాఽధి అవకాశాలను దరిచేర్చామని ప్రకటించారు. న్యూస్రీల్రాష్ట్ర ప్రగతికి గ్రామాలే పట్టుకొమ్మలు అని, అందుకే వాటి అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. సీఎం స్టాలిన్ నేతృత్వంలో మూడేళ్లలో గ్రామాలలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నివేదికను మంగళవారం విడుదల చేసింది. ఇందులో రూ. 1484 కోట్లతో రోడ్లు, మహిళా బృందాలకు రూ. 71,960 కోట్ల రుణాలు, రూ. 4.035 కోట్లతో గృహాల నిర్మాణాలతోపాటు యువతకు ఉపాధి అవకాశాల కల్పన గురించి వివరించారు. రూ.1,484 కోట్లతో రోడ్లు రూ.4,035 కోట్లతో 2,97,414 గృహాల నిర్మాణం మహిళా బృందాలకు రూ.71,960 కోట్లు యువతకు మెరుగ్గా ఉపాధి అవకాశాలు గ్రామీణాభివృద్ధి నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి -
సంగమ క్షేత్రంలో ‘మోదీ’ ధ్యానం
● రేపు కన్యాకుమారికి రాక ● నిఘా వలయంలో సాగర తీరం ● వివేకానంద రాక్లో 2 రోజులు ధ్యానం సాక్షి, చైన్నె: మూడు సముద్రాలు కలిసే త్రివేణి సంగమం, సూర్యోదయం.. సూర్యాస్తమయాన్ని తన్మయత్వంతో తిలకించేందుకు ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదేశంగా ఉన్న కన్యాకుమారిలో ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజులు గడపనున్నారు. సముద్రం మధ్యలో ఉన్న వివేకానంద రాక్లో ఆయన ఈ రెండు రోజులు ధ్యానంలో లీనంకానున్నారు. ఇందుకోసం గురువారం సాయంత్రం కన్యాకుమారికి ఆయన రానుండడంతో సాగర తీరాన్ని నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. వివరాలు.. కాశ్మీర్ టూ కన్యాకుమారి అంటూ భారత దేశానికే చిరునామా నిలిచిన తమిళనాడులోని సాగర తీరం ఎన్నో ప్రత్యేకతలకు నెలవు. బంగాళాఖాతం, హిందూ , అరేబియా సముద్రాల సంగమ క్షేత్రం ఇదే. ఈ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు ఇక్కడికి యాత్రికులు తరలి వస్తుంటారు. సముద్రం నుంచి సూర్యుడు ఉదయించడం.. మళ్లీ సముద్రంలోనే అస్తమించడం ఇక్కడే ప్రత్యక్షంగా చూడొచ్చు. పర్యాటక కేంద్రంగా బాసిళ్లుతున్న ఈ కన్యాకుమారి ఆధ్యాత్మితకు, చరిత్రకు, పురాణాలకు ఆలవాలంగా కూడా నిలుస్తోంది. ఇక్కడే స్వామి వివేకానంద ధ్యానం చేసిన రాక్ సముద్ర మధ్యలో ప్రత్యేక ఆకర్షణతో గంభీరంగా కనిపిస్తుంటుంది. సముద్రం మధ్యలో నల్ల చలువ రాతితో వివేకానంద రాక్ స్మారక మందిరం నిర్మించారు. ఈ రాక్కు కూత వేటు దూరంలో పరమ శివుడిని పరిణయం ఆడేందుకు పార్వతి దేవి తపస్సు చేసినట్టు గా పేర్కొన బడే శిలారూపంలోని ఆమె పాద ముద్రులను వీక్షించొచ్చు. ఇక తమిళుల మహా కవి తిరువళ్లువర్ 133 అడుగుల నిలువెత్తు విగ్రహం ఇక్కడే కొలువు దీరి ఉంది. దక్షిణాసియాలోని ఎల్తైన విగ్రహాల జాబితాలో ఇది కూడా ఒకటి. అంతే కాదు ఆథ్యాత్మితకు నెలవుగా భగవతి అమ్మవారు , పురాణాలకు ప్రతిబింబంగా మురుతువజమలై ఇక్కడే ఉంది. హనుమంతుడు లంకకు వెళ్తూ ఈ కొండను ఇక్కడ ఉంచి వెళ్లినట్టుగా పురాణాలు చెబుతాయి. అందుకే కాబోలు ఈ సారి ప్రత్యేకతలకు నెలవుగా ఉన్న కన్యాకుమారిని ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల ధ్యానం కోసం ఎంపిక చేసుకున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. రెండు రోజుల పాటు ధ్యానం 2019 లోక్ సభఎన్నికల అన ంతరం ప్రధాని నరేంద్ర మోదీ కేథార్నాథ్లోని గుహలో ధ్యానంలో లీనమయ్యారు. ప్రస్తుతం 2024 లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. చివరి విడత ఎన్నికల ప్రచారం గురువారంతో ముగియనున్నది. జూన్ ఒకటో తేదితో లోక్ సభ ఎన్నికలు సమాప్తం కానున్నాయి. జూన్ 4వతేదీ ఓట్ల లెక్కింపు జరగనున్నది. ఎన్నికల ప్రక్రియ ముగియనున్నడంతో ఈ సారి ప్రత్యేకతలకు నెలవుగా ఉన్న కన్యాకుమారిని తన ధ్యానం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎంపిక చేసుకున్నారు. సముద్ర మధ్యలో ఉన్న వివేకానంద రాక్లో రెండు రోజులు ఆయన ధ్యానం చేయబోతున్నారు. ఇందు కోసం 30వ తేదీ కేరళ రాష్ట్రం తిరువనంతపురం నుంచి కన్యాకుమారికి హెలికాఫ్టర్లో సాయంత్రం 3.55 గంటలకు ప్రధాని రానున్నారు. సముద్రం ఒడ్డు నుంచి ప్రత్యేక పడవలో వివేకానంద రాక్కు వెళ్తారు. వివేకానంద స్మారకం, రాక్ను సందర్శిస్తారు. అక్కడి శ్రీ పాద మండపంలోని పార్వతీ దేవి పాద ముద్రల వద్ద పుష్పాలతో పూజలు నిర్వహిస్తారు. ఈ రాక్లో ధాన్య మండపంలోని జూన్ ఒకటవ తేదీ మధ్యాహ్నం వరకు మోదీ ధ్యానంలో లీనమవుతారు. అదే రోజు సాయంత్రం 3.15 గంటలకు కన్యాకుమారి నుంచి తిరువనంతపురం వెళ్లి, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారు. మోదీ రాకతో కన్యాకుమారి సముద్ర తీరాన్ని నిఘా వలయంలోకి తెచ్చారు. ఆ రాక్ సందర్శనకు పర్యాటకులకు అనుమతి నిషేధించారు. రాక్ పరిసరాలను పూర్తిగా కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకోనున్నాయి. రాక్లో ధాన్య మందిరంలో ప్రధాని మాత్రమే ఉండబోతుండటంతో, చుట్టూ సముద్ర తీరాన్ని నిఘా వలయంలోకి తెచ్చే విధంగా కేంద్ర, రాష్ట్ర బలగాలు, కోస్టుగార్డు వర్గాలు భద్రతా పర్యవేక్షణకు సిద్ధమయ్యాయి. మోదీ ధ్యానం పర్యటన పుణ్యమా కన్యాకుమారి పర్యటనకు ముందుగానే ఏర్పాట్లతో సిద్ధమైన సందర్శకులకు మిగిలింది నిరాశే. అదే సమయంలో కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఈనెల 31, జూన్ ఒకటోతేదిలలో పూజలకు ఏర్పాట్లు చేసుకోవడం గమనార్హం. -
తిరువొత్తియూరులో ఇద్దరికి కత్తిపోట్లు
తిరువొత్తియూరు: చైన్నె తిరువొత్తియూరులో ముసుగు ధరించి వచ్చి ఇద్దరిపై కత్తితో దాడి చేసి పారిపోయిన ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. చైన్నె తిరువొత్తియూరు త్యాగరాయపురం ప్రాంతానికి చెందిన పార్తీబన్ (35), మోనీష్ (34) స్నేహితులు. వీరిద్దరూ సోమవారం రాత్రి అదే ప్రాంతంలో నిలబడి మాట్లాడుతుండగా.. ముసుగు ధరించి బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్ర గాయమైన వారిని స్థానికులు స్టాన్లీ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. స్థానిక పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పార్తిబన్, మోనిష్పై కత్తితో దాడి చేసిన దుండగుల కోసం గాలిస్తున్నారు. -
అవినీతి కేసులో ముగ్గురి అరెస్టు
పళ్లిపట్టు: నూతన విద్యుత్ కనెక్షన్కు రూ. ఆరు వేలు లంచం తీసుకుంటుండగా విద్యుత్శాఖ జూనియ ర్ ఇంజినీర్సహా ఇద్దరు సిబ్బందిని అవినీతి ని రోధక శాఖ అధికారులు మంగళవారం అరెస్టు చేశా రు. ఆర్కేపేట మండలంలోని వెడియంగాడు పు దూర్లోని సహాయ ఇంజినీర్ కార్యాలయంలో వెడి యంగాడుకు చెందిన బాబు అనే వ్యక్తి నూతన విద్యుత్ కనెక్షన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. కొత్త దరఖాస్తుపై విచారణ చేపట్టి, కనెక్షన్ మంజూరు కోసం విద్యుత్ శాఖ సిబ్బంది రూ.6 వేలు లంచం డిమాండ్ చేశారు. అయితే లంచం ఇచ్చేందుకు ఇష్టపడని బాబు తిరువళ్లూరులోని అవి నీతి నిరోధక శాఖ కార్యాలయంలో ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఏసీబీ డీఎస్పీ రామచంద్రమూర్తి సూచనల మేరకు మంగళవారం ఉదయం వెడియంగాడు విద్యుత్ కార్యాలయానికి వెళ్లిన బాబు అక్కడున్న వైర్మన్ నిత్యానందం, షణ్ముగం వద్ద డబ్బు లు ఇవ్వగా అక్కడే దాగిఉన్న అవినీతి నిరోధక శాఖ సీఐ తమిళ్సెల్వి తదితరులు వారిద్దరిని రెడ్ హ్యేండడ్గా పట్టుకుని విచారించగా జూనియర్ ఇంజినీర్ సూచనల మేరకు డబ్బులు తీసుకున్నట్లు నేరాన్ని అంగీకరించడంతో ముగ్గురిని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేపట్టారు. అనంతరం వారిని రిమాండ్ నిమిత్తం తిరువళ్లూరు కోర్టులో హాజరు పరిచి పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. -
ఆకాశం నుంచి పడిన వింత వస్తువు
వేలూరు: ఆకాశం నుంచి ఏదో వస్తువు పడి పేలిన పెద్ద శబ్ధం వచ్చి, ఆ ప్రాంతంలో ఐదు అడుగుల మేర గుంత ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. తిరుపత్తూరు జిల్లా జోలార్పేట సమీపంలోని అచ్చమంగలం కోట గౌండర్ ప్రాంతానికి చెందిన రైతు రవి. ఇతని వ్యవసాయ భూమిలో గత రెండు రోజుల క్రితం పెద్ద పేలుడు శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు గమనించి వ్యవసాయ భూమి వద్దకు వెల్లి పరిశీలించగా ఐదు అడుగుల లోతు, రెండు అడుగుల వెడల్పుతో కూడిన గుంత ఏర్పడి ఉండడాన్ని గమనించారు. అలాగే ఈ గుంత నుంచి అధికంగా వేడి గాలి వచ్చినట్లు స్థానికులు గుర్తించిన ఆకాశం నుంచి ఏదైనా వస్తువు పడిందా? లేక వేరే ఏమైనా పడిందా? అనే కోణంలో స్థానికులు జోలార్పేట తహసీల్దార్కు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ దర్పకరాజ్, తహసీల్దార్ ఆనంద క్రిష్ణన్, రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి, విచారణ జరిపారు. వీటిపై కలెక్టర్ దర్పకరాజ్ మాట్లాడుతూ వ్యవసాయ పొలంలో పెద్ద శబ్దంతో కూడిన వస్తువు పడినట్లు స్థానికులు తెలపడంతో వాటిని తనిఖీ చేశామని, అయితే వీటిపై పరిశోధన కేంద్రం అఽధికారులకు సమాచారం అందజేయడంతో వీటిని నిపుణులు పరిశోధన చేయనున్నారని, ఇప్పటికే గుంటలోని మట్టిని పరిశోధనకు పంపామన్నారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మంగళవారం ఉదయం వే లూరులోని పరిశోధన కేంద్రం అధికారుల బృందం నేరుగా వచ్చి తనిఖీ చేశారని పల్లంలోని మట్టితోపాటు బాగా కాలిన బూడిదను పరిశోధనకు తీసుకెళ్లినట్లు తెలిపారు. పల్లం చుట్టూ ఎవరూ దగ్గరకు వెళ్లకుండా ట్రంచ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. భూమిలో ఏర్పడిన ఐదు అడుగుల గుంత పరిశోధన కేంద్రం అధికారులు తనిఖీ -
అనారోగ్యం బాధతో ఇద్దరి ఆత్మహత్య
తిరువళ్లూరు: అనారోగ్యం కారణంగా జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగిన ఇద్దరు వ్యక్తులు చిక్సిత పొందుతూ మృతి చెందిన సంఘటనలు పెనాలూరుపేట, వెంగల్ పరిధిలో విషాదం నింపాయి. తిరువళ్లూరు జిల్లా పెనా లూరుపేట సమీపంలోని అళ్లికుళి ప్రాంతానికి చెందిన వెంకటేష్(36) కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. చిక్సిత కోసం పలు వైద్యశాలకు వెళ్లినా ఫలితం లేకపోవడంతో వెంకటేష్ గత 10వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమై న బంధువులు వెంకటేష్ను తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ మూడు రోజుల పాటు చిక్సిత పొంది డిచార్జ్ చేశారు. అయితే గత 24వ తేదీన మళ్లీ కడుపు నొప్పి రావడంతో బాధితుడ్ని శ్రీపెరంబదూరు సమీపంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా మారడంతో రాజీవ్గాంధీ వైద్యశాలకు తరలించగా అక్కడ చిక్సిత పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసుల విచారణలో వెంకటేష్ రెండో సారీ సైతం పురుగుల మందు తాగినట్టు నిర్ధారించారు. మృతుడి భార్య వడివు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెనాలూరుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అలాగే తిరువళ్లూరు జిల్లా పున్నపాక్కం గ్రామానికి చెందిన కరుణామూర్తి(38) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో గత 25న పురుగుల మందు తాగిన రామమూర్తిని స్థానికులు తిరువళ్లూరు జిల్లా వైద్యకేంద్రానికి తరలించి అక్కడ ప్రాథమిక చిక్సిత అనంతరం మెరుగైన చిక్సిత కోసం చైన్నె రాజీవ్గాంధీ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చిక్సిత పొందుతూ మంగళవారం ఉదయం కరుణా మూర్తి మృతి చెందాడు. -
20 కిలోల ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ లభ్యం
అన్నానగర్: సరస్సు పూడికతీత సమయంలో 20 కిలోల బరువు ఉన్న ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ దొరికింది. వివరాల్లోకి వెళితే.. సేలం బోడినాయకన్ పట్టి సరస్సు సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 2019లో రూ. 15 కోట్ల అంచనా వ్యయంతో చెరువు సుందరీకరణకు నిధులు కేటాయించి, పనులు ప్రారంభించారు. పను లు నెమ్మదిగా సాగుతుండగా, వచ్చే నెలలో సరస్సును ప్రారంభించేందుకు తక్షణమే పను లు చేపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ స్థితిలో సరస్సులో నిలిచిన నీటిలో నిషేధిత ఆఫ్రికన్ క్యాట్ ఫిష్లు పుష్కలంగా ఉన్నాయని ఆ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు జిల్లా యాడ్ షైర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ సరస్సును పరిశీలించాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం సరస్సును పరిశీలించిన మత్స్యశాఖ అధికారులు సరస్సులోని చేపలను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో సుమారు 20 కిలోల యాప్ బ్రికెన్ క్యాట్ ఫిష్ సరస్సులో చిక్కింది. దీంతో జనాలు షాక్కు గురయ్యారు. ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ జాతులు సరస్సులో ఉన్నందున, సరస్సులోని మొత్తం నీటిని తోడి వేసి, ఇలాంటి చేపలు ఇంకా ఏమైనా ఉన్నాయో? లేదో నిర్ధారించాలన్నారు. బాలికపై లైంగిక దాడి ●ముగ్గురి అరెస్టు తిరువొత్తియూరు: విల్లివాక్కంలో ఆరు నెలలుగా 11 ఏళ్ల బాలికను లైంగిక దాడి చేసిన వ్యవహారంలో బాలిక పెదనాన్న కుమారుడు, టైలర్, పక్కింటిలో ఉన్న బాలుడితో సహా ముగ్గురుని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. చైన్నె విల్లివాక్కం పోలీస్స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న సెల్వం కూలీగా జీవనం సాగిస్తున్నాడు. అతడితోపాటు భార్య కూడా మద్యం మత్తుకు అలవాటు పడి, పిల్లలను పట్టించుకోలేదు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఆరో తరగతి చదువుతోంది. ఈమె సోమవారం తిరువేర్కాడు ప్రాంతంలో ఉన్న తన పిన్ని ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో తీవ్ర కడుపు నొప్పిగా ఉందని, పెదనాన్న కుమారుడు తన వద్ద అసభ్యకరంగా ప్రవర్తి స్తున్నట్లు చెప్పి, ఏడ్చింది. ఇది విని దిగ్భ్రాంతి చెందిన ఆమె పిన్ని ఆ బాలికను ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ పరీక్షించిన వైద్యులు బాలికపై కొన్ని నెలలుగా లైంగిక దాడి జరుగుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై బాలికను విచారించగా బాలిక పెదనాన్న కుమారుడు, మొదట అసభ్యకరంగా ప్రవర్తించాడని, తరు వాత ఎదురింట్లో ఉన్న మరొక 16 ఏళ్ల బాలు డు, అదే ప్రాంతంలో ఉన్న టైలర్ కుమార్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. దీనిపై విల్లివాక్కం మహిళా పోలీసులకు బాలిక పిన్ని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి బాలిక పెదనాన్న కుమా రుడు, ఎదురింట్లోని బాలుడు, టైలర్ కుమార్ ముగ్గురిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. మసాజ్ కోసం వచ్చి చోరీ తిరువొత్తియూరు: మసాజ్ కోసం వచ్చి చోరీ చేసిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వేలచేరి 100 అడుగుల రోడ్డులో మసాజ్ సెంటర్ ఉంది. ఇక్కడ సోమవారం రాత్రి ఇద్దరు యువకులు మసాజ్ చేయించుకోవడానికి వచ్చారు. వారు హఠాత్తుగా అక్క డ ఉన్న ఉద్యోగులపై దాడి చేసి గల్లా పెట్టెలో ఉన్న రూ. 5 వేలు చోరీ చేసుకుని పారిపోవడానికి యత్నించారు. ఆ సమయంలో ఉద్యోగులు ఓ వ్యక్తి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో అతను తిరునల్వేలి నాంగునేరి ప్రాంతానికి చెందిన కొంబయ్య పాండియన్ అని తెలిసింది. తప్పించుకుని పారిపోయిన అతడి స్నేహితుడు సింగ్జో అని తెలిసింది. పోలీసులు దర్యాప్తు చేసి ట్రిప్లికేన్ ఉన్న లాడ్జిలో దాగివున్న సింగ్ జోను అరెస్టు చేశారు. చోలింగనల్లూర్లో స్కూల్ వ్యాన్ల తనిఖీ తిరువొత్తియూరు: చోలింగనల్లూర్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం తరపున అధికారు లు సెమ్మంచేరిలోని ప్రైవేట్ కళాశాల ఆవరణలో పాఠశాల వాహనాల ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా తహసీల్దార్ బాబు, జిల్లా రవాణా అధికారి యువరాజ్, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ అరుణాచలం, ముత్తు ట్రాన్స్పోర్ట్ సబ్ ఇన్ స్పె క్టర్ కణ్ణన్ తదితరులు 331 వాహనాలను త నిఖీ చేశారు. వీటిలో 29 పాఠశాలలకు సంబంధించిన వాహనాల్లో ఎమర్జెన్సీ తలుపు లు, నిఘా కెమెరాలు, వేగ నియంత్రణ పరికరాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. దీంతో వాటికి మరమ్మతులు చేయించాలన్నారు. -
వైభవంగా ధర్మపురం జ్ఞానపురీశ్వర్ రథోత్సవం
తిరువొత్తియూరు: మైలాడుదురై ధర్మపురం జ్ఞానపురీశ్వరస్వామి ఆలయంలో వైకాసి మాస ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు రథోత్సవంలో పాల్గొని, రథాన్ని లాగారు. 30వ తేదీ పట్టణ ప్రవేశ కార్యక్రమం జరుగుతుంది. మైలాడుదురై సమీపంలోని ధర్మపురంలో 16వ శతాబ్ధానికి చెందిన ధర్మపురం అదీన మఠం ఉంది. ఇక్కడ 1,500 సంవత్సరాలు పురాతనమైన జ్ఞానాంబిక సమేత జ్ఞానపురేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం వైకాసి మాసం సందర్భంగా బ్రహ్మోత్సవాలు కోలాహాలంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలు ఈ నెల 20వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. 26వ తేదీ తిరుకల్యాణం నిర్వహించారు. మంగళవారం రథోత్సవం నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, విశేషాలంకరణ చేశారు. ధర్మపురం ఆధీనం 27వ గురు మహా సన్నిధానం సీ్త్రల శ్రీ మాసిలామని దేశిక జ్ఞాన సంబంధ పరమాచార్య స్వామి పాల్గొని, రథాన్ని లాగి, రథోత్సవం ప్రారంభించారు. తరువాత భక్తులు శివనామ స్మరణల నడుమ పురవీధుల్లో రథోత్సవం కోలాహలంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు. కాగా 29వ తేదీ ఉదయం స్వామివారి పల్లకిసేవ నిర్వహించనున్నారు. 30వ తేదీ ప్రస్తుతం ఉన్న మఠం గురువును పల్లకిలో పట్టణ ప్రవేశం ఊరేగింపు నిర్వహించనున్నారు. -
636 ప్రైవేట్ స్కూళ్లల్లో ప్రవేశానికి విద్యార్థుల ఎంపిక
కొరుక్కుపేట: చైన్నెలోని 636 ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశానికి లాటరీ విధానంలో విద్యార్థుల ఎంపిక చేశారు. తమిళనాడులోని నాన్ మైనారిటీ ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్ పాఠశాలల్లో పేద పిల్లలకు ఉచిత విద్యనందిస్తున్నారు. ఎల్కేజీ, ఒకటో తరగతి పిల్ల లు మాత్రమే ఈ పథకంలో చేర్చారు. రైట్ టూ ఎ డ్యుకేషన్ యాక్ట్ (ఉచిత విద్యాహక్కు చట్టం) ప్ర కారం ప్రతి ప్రైవేట్ పాఠశాల 25 శాతం సీట్లను రిజర్వ్ చేసుకోవాలి. తమిళనాడులో రాబోయే వి ద్యా సంవత్సరానికి దరఖాస్తు నమోదు ఏప్రిల్లో ప్రారంభమైంది. తమిళనాడు వ్యాప్తంగా లక్ష సీట్లకు 2 లక్షల మందికి పైగా తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల సంఖ్య పాఠశాల 25 శాతం సీట్ల కోటాను మించి ఉంటే, వాటిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. దీని ప్రకారం అధికంగా దరఖాస్తులు వచ్చిన పాఠశాలల్లో మంగళవారం లాటరీ నిర్వహించారు. విద్యాశాఖాధికారులు, దే వాదాయ శాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమక్షంలో లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేసి, ప్రవేశం కల్పించారు. ఒక విద్యార్థి సమీపంలోని 4 పాఠశాలల్లో నమోదు చేసుకోవచ్చు. వీటిలో దేనికై నా పాఠశాలలో చోటు ఉంటుంది. ఈ క్రమంలో చైన్నె జిల్లాలోని 636 ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు లాటరీ విధానంలో ఎంపికయ్యారని చైన్నె జిల్లా ప్రాథమిక విద్య అధికారి మార్స్ తెలిపారు. -
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి హత్య
అన్నానగర్: వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి 3 హత్యలు జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. చైన్నెలోని క్రోమ్పేట టీఎస్ లక్ష్మణ్నగర్లో నివాసముంటున్న థామస్ (50) అనే వ్యక్తి ట్రక్కు నడుపుతూ లెదర్ వేస్ట్ ర వాణా చేసేవాడు. ఇతడు అదే ప్రాంతానికి చెందిన శబరి(31)కి రూ.30 వేలు అప్పు ఇచ్చినట్లు సమా చారం. ఈ స్థితిలో శబరిని సోమవారం రాత్రి థా మస్ సంప్రదించి డబ్బు ఇవ్వాలని కోరాడు. వెంటనే శబరి చెప్పిన ప్రదేశమైన తిరునీరుమలై రోడ్డులోని కరుమారియమ్మన్ గుడి దగ్గరకు థా మస్ వెళ్లాడు. ఆ సమయంలో శబరి, అతని సహచరులు దాచిన కత్తితో థామస్ను నరికి చంపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోమ్పేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి శబరిని అరెస్టు చేసి, విచారిస్తున్నారు. అలాగే తాంబరం పక్కనే ఉరివిలియూర్ సరస్సు ప్రాంతానికి చెందిన కార్తీక్ రాజా (35)పై హత్యాయత్నం, దాడి కేసులున్నాయి. రెండేళ్ల క్రితం మహా అనే మహిళతో వివాహమైంది. అనంతరం ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఆటో నడుపుతున్నట్లు తెలుస్తుంది. ఏ ఆటో డ్రైవింగ్ అసోసియేషన్లో చేరకుండానే అన్ని ప్రాంతాలకు వెళ్లాడు. దీంతో తాంబరం ప్రాంతంలో ఆటోడ్రైవర్స్ అసోసియేషన్ అధినేత ఆనందనన్, కార్తీక్ రాజాల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ స్థితిలో సోమవారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో బస్ స్టేషన్ వద్ద కార్తీక్ రాజా తన ఆటోలో ఉన్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఆనందన్తో సహా ఆరుగురు కార్తీక్ రాజా ను కత్తితో నరికారు. దీంతో కార్తీక్రాజా అక్కడికక్కడే మరణించాడు. తాంబరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం క్రోమ్పేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి ఆనందన్ సహా ఆరుగురి కోసం గాలిస్తున్నారు. మరో వ్యక్తి.. కుండ్రత్తూరు పక్కన మలయంబాక్కం ప్రాంతంలో రాజేష్ (30) అనే వ్యక్తి ఇటుక బట్టీలో పనిచేస్తున్నాడు. గత రాత్రి సెంబరంబాక్కం సరస్సు ఒడ్డున నడు చుకుంటూ వెళుతున్న రాజేష్ను ఆ మార్గంలో బైకుపై వచ్చిన అనుమానాస్పద వ్యక్తులు అడ్డగించి, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసి, బెదిరించారు. అతను నిరాకరించడంతో దుండగులు తాము దాచుకున్న కత్తితో రాజేష్ను నరికివేశారు. అతని వద్ద ఉన్న సెల్ఫోన్, డబ్బు లాక్కొని పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న రాజేష్ను గ్రామస్తులు రక్షించి సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున రాజేష్ మృతి చెందాడు. ఈ ఘటనపై కుండ్రత్తూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హంతకుల కోసం గాలిస్తున్నారు.
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
రిజిస్ట్రేషన్ల జోరు
ముంపు ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలి
కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
యూనిఫాం స్టిచింగ్ వేగవంతం చేయాలి
ఇరిగేషన్ ఎస్ఈ ఎవరు?
జీపీని తనిఖీ చేసిన డీపీఓ
పెట్టుబడి తగ్గి.. దిగుబడి పెరిగి
మార్పుతో మంచి ఫలితాలు..
పెదనందిపాడులో నాట్స్ మెగా కంటి ఉచిత వైద్య శిబిరం!
బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ కాన్వాయ్ బీభత్సం.. ఇద్దరు మృతి
తప్పక చదవండి
- Hardik- Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్
- గంగానది నుంచి బయటకొచ్చిన భారీ మొసలి.. తర్వాత ఏం జరిగిందంటే
- ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్.. నిందితుడు అరెస్ట్
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మళ్లీ బెదిరింపు కాల్స్
- సీఈవో మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
- T20 WC: ఓపెనర్గా రోహిత్ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!
- భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?
- నీతా అంబానీ తాగే వాటర్ అంత ఖరీదా? మరి రూ.49 లక్షల బాటిల్ సంగతేంటి?
- 1,200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ట్యాపింగ్ ఆపింది అప్పుడే!
- ఏపీ ప్రజా తీర్పు.. ఇంకో 6 రోజులే!
Advertisement