-
అక్రమ రవాణాను అరికట్టండి
● నగదు, మద్యం తరలించకుండా నిఘా పెంచాలి ● ఎస్పీ రోహిత్రాజ్ ఇల్లెందు : ఎన్నికల వేళ మద్యం, నగదు అక్రమ రవాణాను అరికట్టాలని ఎస్పీ రోహిత్రాజ్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఇల్లెందు సబ్ డివిజన్ పరిధిలోని అంతర్ జిల్లా చెక్పోస్టులను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికలు పూర్తయ్యే వరకు చెక్ పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, చెక్ పోస్టుల వద్ద నిఘా కఠినంగా అమలు చేయాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని, ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం ఇల్లెందు పోలింగ్ స్టేషన్లో రూట్ మ్యాప్, స్టేషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలంతా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఎన్. చంద్రభాను, సీఐలు కరుణాకర్, సురేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్ఐ సందీప్ తదితరులు ఉన్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలిటేకులపల్లి: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం అక్రమ రవాణా అరికట్టేందుకు చెక్పోస్టుల వద్ద సిబ్బంది, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రోహిత్రాజ్ అన్నారు. టేకులపల్లి మండలం బొమ్మనపల్లి (కారుకొండ క్రాస్రోడ్) వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును బుధవారం ఆయన తనిఖీ చేశారు. అనుమానం ఉన్న ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీ వివరాలపై సీఐ తాటిపాముల సురేష్తో చర్చించారు. -
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
● కాంగ్రెస్ చేతిలో మరోసారి మోసపోవద్దు ● బస్తర్ మహరాజ్ కమల్చంద్ర భంజ్దేవ్ చుంచుపల్లి: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అందులో ఉమ్మడి జిల్లా కూడా ఉండాలంటే ఖమ్మం ఎంపీగా తాండ్ర వినోద్రావును గెలిపించాలని బస్తర్ మహారాజు, కాకతీయ వంశ వారసుడు కమల్చంద్ర భంజ్ దేవ్ ఓటర్లను కోరారు. కొత్తగూడెంలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఈసారి బీజేపీకి ఇవ్వాలని అన్నారు. వినోద్రావును గెలిపిస్తే రెండేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు మీ ఇంటికే అందజేస్తారని భరోసా ఇచ్చారు. కట్టెల పొయ్యితో బాధపడుతున్న మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా రాయితీపై గ్యాస్ అందించిందని చెప్పారు. ఎన్నికల సమయంలో అబద్ధపు వాగ్దానాలతో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులను నమ్మొద్దని సూచించారు. ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు మాట్లాడుతూ.. కొత్తగూడెం ప్రజలను చూస్తుంటే వెయ్యి ఏనుగుల బలం వస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే కొత్తగూడేనికి మంచి ఆస్పత్రి, ఐటీ హబ్ తెస్తానని, మూతపడే దశలో ఉన్న కేటీపీఎస్ పునర్ వైభవానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎయిర్ పోర్ట్ తీసుకొచ్చి రవాణా సౌకర్యం మరింత మెరుగుపరుస్తానని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కే.వీ. రంగాకిరణ్, సీనియర్ నాయకులు జీవీకే.మనోహర్, చుంచుపల్లి మండల అధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
‘బీజేపీతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం’
కరకగూడెం: ప్రజా స్వామ్యానికి బీజేపీతో పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, గిరిజన మేధావుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ జి.వీరన్ననాయక్ విమర్శించారు. ఆయన బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ‘బీజేపీనీ ఓడిద్దాం.. కాంగ్రెస్ను గెలిపించుకుందాం’నినాదంతో ప్రచారం నిర్వహించారు. మానుకోట కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ గెలిపించాలని కోరారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దుచేయాలని యోచిస్తోందని, బీజేపీ తీరు దేశానికి ఎంతో ప్రమాదకరమని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతుందనని జోస్యం చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించి, హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కార్యక్రమంలో సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, ఎర్ర సురేశ్, కొమరం కాంతారావు, శివరాత్రి సతీశ్, భూక్య అర్జున్, రాందాస్ తదితరులు పాల్గొన్నారు. -
పాల్వంచలో పోలీసుల ఫ్లాగ్మార్చ్
పాల్వంచ: ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పాల్వంచ, కొత్తగూడెం డీఎస్పీలు సతీశ్కుమార్, రెహమాన్ ప్రజలకు సూచించారు. బుధవారం సాయంత్రం పట్టణంలో పోలీసులు ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. పోలీస్ స్టేసన్ నుంచి ప్రారంభమై మార్కెట్ రోడ్, నటరాజ్ సెంటర్, బీసీఎం రోడ్ మీదుగా సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు పౌరుడి ప్రాథమిక హక్కు అని, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వేయాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల భద్రత ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సీఐలు వినయ్కుమార్, ఆర్.వెంకటేశ్వర్లు, శివప్రసాద్, పాల్వంచ, బూర్గంపాడు, ములకలపల్లి ఎస్ఐలు బి.రాము, రాఘవయ్య, స్వప్న, సుమన్, శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అక్షరాస్యత పెంపే లక్ష్యంగా..
● బడిబయట ఉన్న చిన్నారుల కోసం సర్వే ● ప్రతీ జనవరి, మే నెలల్లో నిర్వహణ ● ఈ ఏడాది ఇప్పటివరకు 572 మంది గుర్తింపు ● వచ్చే నెల పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు జనవరిలో సర్వే వివరాలు ఇలా.. వయసు బాలురు బాలికలు మొత్తం 6 – 14 267 162 429 15 – 19 101 42 143కొత్తగూడెంఅర్బన్: మధ్యలో చదువు మానేసి పనులకు వెళ్తున్న బడి ఈడు బాలబాలికలను గుర్తించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇలాంటి వారి కోసం విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జనవరి, మే నెలల్లో సర్వే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జిల్లాలోని 23 మండలాల్లో 90 మంది సీఆర్పీలు బడి మానేసిన పిల్లల గుర్తింపు కోసం గ్రామాల బాట పట్టారు. ఆరు సంవత్సరాలు, ఆపైబడిన వారిని గుర్తించి వివరాలు నమోదు చేస్తున్నారు. జనవరి, మే నెలల్లో చేసిన సర్వే వివరాల ప్రకారం ఒక ప్రణాళిక తయారు చేసి జూన్ నాటికి ఎంఈఓలకు నివేదిక అందిస్తారు. దాని ఆధారంగా ఉపాధ్యాయులు పాఠశాలలు తెరవగానే వారిని రీ అడ్మిషన్లు చేయిస్తున్నారు. అయితే ఈ తంతు ప్రతీ ఏడాది జరుగుతున్నా.. ఈ సంవత్సరం బడి బయట ఉన్న పిల్లల సంఖ్య ఒక జనవరి నెల సర్వేలోనే 572 మంది ఉన్నట్లు తేలడం గమనార్హం. బాలబాలికల కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, కుటుంబ పెద్దలు అనారోగ్యానికి గురి కావడం, చిన్నారులు పనికి వెళ్లకుంటే ఇల్లు గడిచే పరిస్థితి లేకపోవడం వంటి కారణాలతో చదువుకోవాల్సిన వయసులో పనిబాట పడుతున్నారు. దీంతో జిల్లాలో అక్షరాస్యత శాతం తగ్గిపోయే ప్రమాదం ఉండడంతో దాని నివారణకు సీఆర్పీలు చర్యలు చేపడుతున్నారు. ఈ పనుల్లోనే ఎక్కువగా.. జిల్లాలో చదువు మానేసి పనిలోకి వెళ్లే బాలబాలికలు ఎక్కువగా ఇటుక బట్టీలు, సిమెంటు బ్రిక్స్ తయారీ, కిరాణాషాపులు, షాపింగ్ మాళ్లు, హోటళ్లలో కూలీలుగా మారుతున్నారు. ఆయా ప్రాంతాల్లో బాల కార్మికులు పని చేస్తున్నారని తరుచుగా కార్మిక శాఖ కార్యాలయానికి ఫిర్యాదులు అందుతుంటాయి. ఆ సమయంలో మాత్రమే సంబంధిత అధికారులు అక్కడికి వెళ్లి షాపు యజమానులకు జరిమానాలు విధించి, ఆ తర్వాత పట్టించుకోరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత మళ్లీ చిన్నారులు పనులకు వెళుతూనే ఉన్నారు. దీంతో ఇటీవల చేపట్టిన సర్వేలో 572 మంది బాలబాలికలు బడిబయట ఉన్న విషయం వెలుగుచూసింది. ఇక ఈ నెల సర్వే పూర్తయితే ఇంకెంత మంది బయటపడుతారో వేచి చూడాల్సిందే. ఇలా గుర్తించిన వారంతా తిరిగి పాఠశాలలకు వెళితేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది. బడి బయట పిల్లలను చేర్పించడమే లక్ష్యం బడి బయట ఉన్న బాలబాలికలను బడిలో చేర్పించడమే లక్ష్యంగా సర్వే అనంతరం అడ్మిషన్లు చేయిస్తున్నాం. సర్వేలో మొదట బాలబాలికల గుర్తింపు, బడి మానేయడానికి గల కారణాలు తెలుసుకుంటున్నాం. వారిని తిరిగి బడికి వెళ్లేలా ప్రోత్సహిస్తున్నాం. దగ్గరలో ఉన్న స్కూల్, హాస్టల్కు పంపించే ప్రయత్నాలు చేస్తున్నాం. దీంతో పాటు జిల్లాలో 15 సంవత్సరాలు పైబడిన వారిని ఓపెన్ స్కూల్లో అడ్మిషన్లు ఇప్పించి, సమగ్ర శిక్ష అభియాన్ నుంచి కొంత స్కాలర్షిప్ వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నాం. – నాగరాజశేఖర్, ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కో– ఆర్డినేటర్ -
ఓటు హక్కు వినియోగించుకోండి
జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక ఆలసూపర్బజార్(కొత్తగూడెం): ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక ఆల అన్నారు. కలెక్టరేట్లో బుధవారం డీఆర్డీఓ, డీడబ్ల్యూఓ, మెప్మా ఆధ్వర్యంలో ఓటర్ అవేర్నెస్ స్వీప్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రియాంక ఆల ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతీ ఓటు ఎంతో విలువైనదని అర్హులంతా తప్పకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. డబ్బు, ఇతర ప్రలోభాలకు లొంగకుండా మెరుగైన భవిష్యత్ కోసం సమర్థవంతమైన నాయకులకు ఓటు వేయాలని సూచించారు. పోలింగ్ నిర్వహించే మే 13న సెలవు రోజుగా ప్రకటించినట్లు చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడలో మహిళలు మూలస్తంభాలని అన్నారు. ఈ సందర్భంగా 100 మంది మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. డీఐఈఓ సులోచనారాణి, బీసీ సంక్షేమాధికారి ఇందిర, ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూయ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, డీడబ్ల్యూఓ విజేత, కలెక్టరేట్ ఏఓ గన్యా, మెప్మా పీడీ రాజేష్ పాల్గొన్నారు. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి.. వచ్చే వానాకాలం సీజన్లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ప్రియాంక ఆల అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో సాగు విస్తీర్ణం ఆధారంగా అవసరమైన పత్తి, మొక్కజొన్న, మిరప విత్తనాలను సిద్ధం చేయాలని, ఎక్కడా కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. పత్తి విత్తన ప్యాకెట్లు గరిష్టంగా రూ.864 చొప్పున మాత్రమే అమ్మాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే సంబంధిత డీలర్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు నాణ్యమైన విత్తనాలనే సాగు చేసేలా రైతువేదికల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ఈ వానాకాలంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, జిల్లాలో పత్తి 2,16,625 ఎకరాలు, మొక్కజొన్న 60,200, మిరప 32,168 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశామని, అందుకు అనుగుణంగా విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. డీలర్లు విత్తనాలు విక్రయించేప్పుడు తప్పకుండా బిల్లు ఇవ్వాలన్నారు. రైతులు విడిగా ఉండే విత్తనాలు కోనుగోలు చేయొద్దని సూచించారు. సమావేశంలో డీఏఓ బాబూరావు, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారి సూర్యనారాయణ, జిల్లా సహకార శాఖాధికారి ఖుర్షీద్ తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి.. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని ప్రియాంక ఆల అన్నారు. ఎన్నికల విధుల్లో భాగస్వాములైన అధికారులతో బుధవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొన్ని గ్రామాల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు ఇంకా కొనసాగుతున్నాయని, వెంటనే పూర్తిచేసి ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని అన్నారు. పనులు రెండు రోజుల్లో పూర్తి చేసి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. చెరువుల వద్ద ఉపాధి పనులను పరిశీలించాలని, సారవంతమైన మట్టిని రైతుల పొలాలకు ఉపయోగించుకోవడానికి మాత్రమే సొంత ఖర్చులతో తీసుకువెళ్లాలని అన్నారు. జూన్ 5 వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో డీపీఓ చంద్రమౌళి, డీఈఓ వెంకటేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు. -
ఓటు వేసిన డీఎస్పీ
ఇల్లెందు: ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను ఖమ్మంలో తన ఓటును వినియోగించుకున్నారు. ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకున్నారు. రూ.లక్ష నగదు సీజ్.. మణుగూరురూరల్: సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.లక్ష నగదును మణుగూరు ఎస్ఐ రాజేశ్కుమార్ బుధవారం సీజ్ చేశారు. మండలంలోని అశోక్నగర్ ప్రాంతంలో ఎస్ఐ రాజేశ్కుమార్ సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో రూ.లక్ష తీసుకెళ్తున్న వై.డానియేల్ను పోలీసులు సోదా చేసి, నగదును స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు. వడదెబ్బతో నాగారం హెచ్ఎం మృతి పాల్వంచరూరల్: వడదెబ్బతో అస్వస్థతకు గురై ఓ హెడ్ మాస్టర్ మృతిచెందిన ఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని నాగారం హైస్కూల్లో 2015 జూలై నుంచి హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న, ఏపీ రాష్ట్రంలోని చింతూరు మండలం చట్టీ గ్రామానికి చెందిన బొడ్డు శ్రీరాములు(60) మంగళవారం ఎండలో తిరిగి వచ్చాడు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన స్థానిక వైద్యులను సంప్రదించాడు. కానీ, పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందాడు. శ్రీరాములు మృతదేహాన్ని స్వస్థలమైన చట్టీకి తరలించారు. మృతునికి భార్య భవాని, కుమారుడు సిద్ధు, కుమార్తె సింధు ఉన్నారు. పాల్వంచలో ఒకరు..పాల్వంచ: వడదెబ్బతో అస్వస్థతకు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని సీతారాంపట్నానికి చెందిన బోళ్ల శ్రీనివాసరావు కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎండ వల్ల వడదెబ్బకు గురయ్యాడు. బుధవారం ఒక్కసారిగా కళ్లు తిరి గి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. కేటీపీఎస్ ఉద్యోగి ఆత్మహత్య పాల్వంచ : ఆర్థిక ఇబ్బందులు తాళలేక కేటీపీఎస్ ఉద్యోగి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఇందిరా కాలనీకి చెందిన గార్లపాటి ప్రసాద్(42) కేటీపీఎస్ ఏడో దశ సీహెచ్పీలో పీఏగా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి నలుగురు కూతుర్లు కాగా, అందరి పెళ్లిళ్లు జరిపించాడు. ఈ క్రమంలో అప్పులు కావడంతో ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఇంటిముందు వరండాలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు ప్రసాద్ భార్య వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.రాము తెలిపారు. హత్యాయత్నం కేసులో వ్యక్తి అరెస్ట్ మణుగూరురూరల్: మున్సిపాలిటీ పరిధిలోని పీకే–1 సెంటర్లో గుగులోత్ మురళీకృష్ణపై హత్యాయత్నానికి పాల్పడిన కుర్రం నాగేశ్వరరావును అరెస్ట్ చేసినట్లు మణుగూరు డీఎస్పీ రవీందర్రెడ్డి బుధవారం తెలిపారు. ఈ నెల 5వ తేదీన గుగులోత్ మురళీకృష్ణపై కుర్రం నాగేశ్వరరావు కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కుర్రం నాగేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారించడంతో పాటు హత్యాయత్నానికి వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. బెల్టు దుకాణంపై దాడి అశ్వాపురం: మండల కేంద్రంలో మార్కెట్ వద్ద ఓ బెల్ట్దుకాణంపై దాడి చేసిన పోలీసులు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న ఎస్ఐ తిరుపతిరావు సిబ్బందితో దాడి చేసి సుమారు రూ.10 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
విజ్ఞానం ఉద్యోగం కోసమే కాదు..
అశ్వారావుపేటరూరల్: కళాశాలలో నాలుగేళ్ల పాటు శ్రమించి, ఎంతో కష్టపడి నేర్చుకున్న వ్యవసాయ విద్య, విజ్ఞానాన్ని ఉద్యోగాలతో సరిపెట్టుకోవద్దని డీన్ ఆఫ్ అగ్రికల్చర్ యూనివర్సటి డాక్టర్ సీమ, రవి హైబ్రిడ్స్ కంపెనీ ఎండీ మన్నేపల్లి రవి అన్నారు. బుధవారం రాత్రి జరిగిన అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల వార్షికోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ విద్య ఎంతో కష్టంగా ఉంటుందని, విద్యార్థులు ఉద్యోగాల కోసమే ఈ విద్యను అభ్యసించకుండా తాము ఉపాధి పొందుతూనే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రతి విద్యార్థి కొత్త తరహాలో ఆలోచించాలని, వ్యవసాయ విద్య పూర్తి చేసిన వారికి అనేక రంగాల్లో అవకాశాలు వస్తాయని అన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు విద్యార్థులకు ప్రథమ బహమతిగా రూ.15 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.10 వేలు, తృతీయ బహుమతిగా రూ.5 వేలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఎస్ఏ డాక్టర్ జెల్లా సత్యనారాయణ, కళాశాల డీన్ డాక్టర్ హేమంత్ కుమార్, సీఐ జితేందర్రెడ్డి, కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్ గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ కె.శిరీష తదితరులు పాల్గొన్నారు. ప్రతీ విద్యార్థి ఇంకొకరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్ డాక్టర్ సీమ -
ఖాళీ బిందెలతో నిరసన
జూలూరుపాడు: మండలంలోని చింతలతండా గ్రామ పంచాయతీ లయన్తండాలో కొద్దిరోజులుగా తాగునీటి సరఫరా లేకపోవడంతో గిరిజనులు ఖాళీ బిందెలతో బుధవారం నిరసన తెలిపారు. ఎండను సైతం లెక్క చేయకుడా మహిళలు, పెద్దలు, యువతీ, యువకులు, చిన్నారులు రోడ్డుపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీటి సమస్య పరిష్కరించాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని, నెలరోజులుగా తాగునీటి కోసం అవస్థలు పడుతున్నామన్నారు. మిషన్ భగీరథ ట్యాంకు నిర్మించినా నీళ్లు ఎక్కకపోవడంతో నిరుపయోగంగా ఉందని, అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. బంగారు ఆభరణాలు చోరీ పాల్వంచ: ఇంట్లోని వ్యక్తులు ఊరెళ్లడంతో దుండగులు లోపలికి ప్రవేశించి బంగారు ఆభరణాలు అపహరించారు. బాధితుల కథనం మేరకు.. పట్టణంలోని కాంట్రాక్టర్కాలనీకి చెందిన ఉదయ్కుమార్ తన కుటుంబంతో కలిసి మూడు రోజుల కిందట ఉరెళ్లారు. బుధవారం ఉదయం ఇంట్లో పనిచేసే మహిళ వచ్చి చూడగా ఇంటి తాళాలు, బీరువా తాళాలు పగులగొట్టినట్లు గుర్తించి ఉదయ్కుమార్కు సమాచారం అందించింది. అతను తన తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో వారు వచ్చి పరిశీలించగా రూ.5 లక్షల విలువ చేసే 140 గ్రాముల బంగారు వస్తువులను చోరీకి గురైనట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని సందర్శించారు. -
ఇక పల్లెబాట..
ముగిసిన ‘స్టార్ల’ ప్రచారం.. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రులుగా ఉన్నారు. వీరంతా గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలారాంనాయక్ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో మూడు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ కూటమిలో భాగస్వాములుగా ఉన్న కమ్యూనిస్టు నేతలు కూనంనేని సాంబశివరావు, పోతినేని సుదర్శన్తో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చారు. తాజాగా సినీనటుడు దగ్గుబాటి వెంకటేష్ జిల్లా యాత్రతో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సినీ గ్లామర్ సైతం తోడైంది. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున జాతీయస్థాయి నేతలు పెద్దగా ప్రచారంలో పాల్గొనలేదు. బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ ఖమ్మం, కొత్తగూడెంలో రోడ్షోలు నిర్వహించి పార్టీలో జోష్ నింపారు. బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు తరఫున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోవైపు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుసాయ్, బస్తర్కు చెందిన కాకతీయ వంశ వారసుడు కమల్ చంద్ర భంజ్దేవ్ ప్రచారం నిర్వహించారు. దీంతో దాదాపుగా అన్ని పార్టీల తరఫున జిల్లాలో స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం ముగిసినట్టే అనే పరిస్థితి నెలకొంది. పోలింగ్ పనుల్లో నాయకత్వం.. పోలింగ్ తేదీ సమీపించడంతో రాజకీయ పార్టీలు పేపర్ పనుల్లో ముగినిపోయాయి. ఆయా బూత్ల వారీగా పోలింగ్ ఏజెంట్ల నియామకాలకు సంబంధించిన పనుల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం తలమునకలైంది. పోలింగ్ ఏజెంట్ల గుర్తింపు, పాస్ల జారీకి సంబంధించిన జాగ్రత్తలు తదితర వ్యవహారాలతో ఆయా పార్టీల ఎన్నికల కార్యాలయాలు బిజీగా మారాయి. వీటికి తోడు కుల సంఘాలు, వివిధ కార్మిక సంఘాలు, యూనియన్లతో సమావేశాలు సైతం తెరపైకి వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో తమకు మద్దతు ప్రకటించాలంటూ సంఘ నాయకులకు పార్టీల నేతలు విన్నపాలు చేస్తున్నారు. ముగిసిన స్టార్ క్యాంపెయినర్ల సందడి బూత్ల వారీగా ఇంటింటి ప్రచారం బ్యాలెట్ పేపర్లు, పార్టీ కండువాలతో కదిలిన కేడర్ ‘పోలింగ్’ పేపర్ వర్క్లో బిజీగా నేతలుపార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపించింది. స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం దాదాపు ముగిసినట్టే. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు, కేడర్ పల్లెబాట పట్టాయి. ప్రతీ ఇంటికి తిరుగుతూ తమ పార్టీ గుర్తుపైనే ఓటెయ్యాలని కోరుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంబూత్ల వారీగా ప్రచారం.. స్టార్ క్యాంపెయినర్ల ప్రచారాలు, భారీ బహిరంగ సభలు దాదాపుగా పూర్తి కావడంతో పార్టీ యంత్రాంగం ఇంటింటి ప్రచారంపై దృష్టి సారించింది. ఇప్పటికే బూత్ల వారీగా నియమించిన కమిటీలను అప్రమత్తం చేస్తూ ఆయా నేతలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్లు, పార్టీ అభ్యర్థులతో సంబంధం లేకుండా ప్రతీ రోజు బూత్ల వారీగా ఎన్నికల ప్రచారం నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. పట్టణాల్లో అయితే వార్డుల వారీగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీ జెండాలు ధరించిన కేడర్ ప్రతీ ఇంటికి వెళ్లి ఓటర్లను పలకరించి అభ్యర్థి పేరు, గుర్తు, బ్యాలెట్ నమూనాలు చూపిస్తున్నారు. దీంతో నిన్నామొన్నటి వరకు బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లకు వెళ్లిన ఓటర్లకు.. ఇప్పుడు వారింటి దగ్గరికే రాజకీయ నాయకుల ఉపన్యాసాలు చేరాయి. మరోవైపు ప్రచార రథాలు క్షణం తీరిక లేకుండా గల్లీల్లో రయ్రయ్మంటున్నాయి. ఆయా పార్టీలు రూపొందించిన పాటలు, వీడియోలతో పాటు కళాజాతాల ద్వారా ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నాయి. -
ఫొటో మార్ఫింగ్.. సంతకం ఫోర్జరీ
● రుణం కోసం పొదుపు సంఘం ఎత్తుగడ ● పంపకంలో తేడా రావడంతో వెలుగులోకి ఉదంతం ఇల్లెందురూరల్: రుణం చేతికందుతుందన్న తొందరలో ఓ సభ్యురాలి ఫొటో మార్ఫింగ్ చేయడంతోపాటు సంతకం కూడా ఫోర్జరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఇందిరానగర్ గ్రామపంచాయతీ పరిధిలోని పది మంది సభ్యులున్న శ్రీఆంజనేయం పొదుపు సంఘానికి సుదిమళ్ల ఎస్బీఐ నుంచి ఏడాది కిందట రూ.10 లక్షలు బ్యాంకు లింకేజీ పేరుతో రుణం మంజూరైంది. ఈ సొమ్మును గ్రూపులోని కొందరు సభ్యులు పంచుకుని, క్రమం తప్పకుండా ఏడాదిపాటు అసలుతోపాటు వడ్డీ కలిపి మొత్తం రూ.2.50 లక్షలు చెల్లించారు. ఇంకా రూ.7.50 లక్షలు చెల్లించాల్సి ఉంది. కొద్ది రోజుల కిందట సుదిమళ్ల బ్యాంకు అధికారులు అదే గ్రూపునకు రూ.15 లక్షలు బ్యాంకు లింకేజీ రుణం మంజూరు చేశారు. దీనికోసం డాక్యుమెంటేషన్ సిద్ధం చేయాలని సెర్ప్ అధికారులకు, గ్రూపు సభ్యులకు సూచించారు. ఇదిలా ఉండగా గ్రూపులోని పది మంది సభ్యుల్లో ఒకరు స్థానికంగా ఉండటం లేదు. దీంతో డాక్యుమెంటేషన్ పూర్తి చేయడం గ్రూపు సభ్యులకు ఇబ్బందిగా మారింది. అయితే, స్థానికంగా లేని సభ్యురాలి సోదరి ఉండటం, ఆమె వద్ద తన సోదరి ఫొటో ఉండటంతో తొమ్మిది మంది సభ్యులు దిగిన ఫొటోలో స్థానికంగా లేని సభ్యురాలి ఫొటోను మార్ఫింగ్ చేయించారు. డాక్యుమెంటేషన్లో ఆమె సంతకాన్ని గ్రూపు సభ్యులే ఫోర్జరీ చేసి రుణం మంజూరు కోసం బ్యాంకులో అందజేశారు. డాక్యుమెంటేషన్ పరిశీలించిన బ్యాంకు అధికారులు గతంలో తీసుకున్న రుణంలో మిగిలిపోయిన రూ.7.50 లక్షలను మినహాయించుకొని మిగతా రూ.7.50 లక్షలను పొదుపు సంఘం సభ్యులకు మంజూరు చేశారు. సంబంధిత సొమ్మును సభ్యుల అకౌంట్లలో జమ చేశారు. ఇదిలా ఉండగా అకౌంట్లలో జమ అయిన సొమ్మును పంచుకోవడంలో సభ్యుల మధ్య వివాదం తలెత్తింది. గతంలో మంజూరైన రుణంలో రూ.లక్ష తీసుకొని పూర్తిస్థాయిలో చెల్లించకుండానే ఓ సభ్యురాలు ఊరు విడిచి వెళ్లిపోవడంతో రికవరీ ఇబ్బందిగా మారుతుందన్న ఆందోళనతో ఆమెకు తిరిగి రుణం ఇచ్చేందుకు మిగతా సభ్యులు నిరాకరించారు. దీంతో సదరు సభ్యురాలు రుణం మంజూరు కోసం సభ్యులందరూ కలిసి చేసిన ఫొటో మార్ఫింగ్, సంతకం ఫోర్జరీ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆనోట.. ఈనోట విషయం తెలుసుకున్న సుదిమళ్ల ఎస్బీఐ, సెర్ప్ అధికారులు జరిగిన తప్పిదాన్ని సరిచేసే ప్రయత్నాలు ప్రారంభించారు. సభ్యులందరినీ సమావేశపర్చి చర్చించారు. మంజూరైన నిధులు డ్రా చేయకుండా వారి అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. తీసుకున్న రుణం మొత్తం రూ.15 లక్షలు తిరిగి చెల్లించాలని బ్యాంకు అధికారులు షరతు పెడుతుండగా ఒకే సారి చెల్లించలేమని, తాజాగా మంజూరైన రూ.7.50 లక్షలు మాత్రమే వెంటనే చెల్లిస్తామని పొదుపు సంఘం సభ్యులు బదులిస్తున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం పొదుపు సంఘాల్లో చర్చనీయాంశంగా మారింది. మార్ఫింగ్ చేసినట్లు గుర్తించాం.. బ్యాంకు లింకేజీ రుణం మంజూరు కోసం పొదుపు సంఘం సభ్యులు ఓ సభ్యురాలి ఫొటోను మార్ఫింగ్ చేసినట్లు గుర్తించాం. బ్యాంకు అధికారులతో సభ్యుల అకౌంట్లను ఫ్రీజ్ చేయించాం. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి తదుపరి చర్యలు తీసుకుంటాం. – దుర్గారావు, ఏపీఎం, ఇల్లెందు -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
దమ్మపేట: బైక్ పైనుంచి కిందపడి ఓ మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని పట్వారిగూడెం గ్రామ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని గండుగులపల్లి గ్రామానికి చెందిన ఇంటిక సుధాకర్ (34), సునీత (32) దంపతులు, వారి సంతానం ప్రయన్ (7), నీరంత్ (5)తో కలసి బైక్పై బుధవారం ములకలపల్లి మండలంలోని నర్సాపురం గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్తున్నారు. వారు పట్వారిగూడెం గ్రామ సమీపంలోకి రాగానే ఎదురుగా కోతుల గుంపు వచ్చింది. సుధాకర్ కంగారుపడి అకస్మాత్తుగా బ్రేక్ వేయగా వెనుక కూర్చున్న సునీత రోడ్డుపై పడింది. గమనించిన స్థానికులు, భర్త సుధాకర్, క్షతగాత్రురాలిని వెంటనే అంబులెన్స్లో చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి కొర్సా భద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. సునీత మృతితో గండుగులపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
అక్రమ మద్యం పట్టివేత
భద్రాచలంటౌన్: పట్టణంలోని రామాలయ ప్రాంతంలో గల ఓ దుకాణంలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని భద్రాచలం టౌన్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మద్యాన్ని ఇంట్లో నిల్వ చేసి విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేయగా సుమారు రూ.25 వేల విలు వైన మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలి పారు. ఈ తనిఖీలలో పట్టణ ఎస్ఐలు పీవీఎన్ రావు, విజయలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు. -
పట్టభద్రుల స్థానానికి 19మంది నామినేషన్
● నేటితో ముగియనున్న గడువు నల్లగొండ: ఖమ్మం–వరంగల్–నల్లగొండ పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం 19మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వివిధ పార్టీల నుంచే కాక స్వతంత్రులు తమ నామినేషన్లను నల్లగొండ కలెక్టరేట్లో రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ దాసరి హరిచందనకు అందజేశారు. కాగా, గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియనుండగా, ఇప్పటి వరకు 67మంది నామినేషన్లు దాఖలు చేశారని అధికారులు వెల్లడించారు. పేకాట స్థావరంపై దాడి దమ్మపేట: మండలంలోని చిన్నగొల్లగూడెం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. చిన్నగొల్లగూడెం శివారులో బుధవారం పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.2,650 నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. వేర్వేరు కారణాలతో ఇద్దరు మృతి రఘునాథపాలెం: మండలంలోని రేగులచలకకు చెందిన ఇద్దరు వృద్ధులు బుధవారం వేర్వేరు కారణాలతో మృతి చెందారు. గ్రామానికి చెందిన కొలగాని నాగయ్య(80) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో పాటు ఎండలకు ఆరోగ్యం మరింత క్షీణించి మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన వంకాయల పాటి అచ్చమ్మ(85) సైతం అనారోగ్యంతో బాధపడుతూ వడదెబ్బ బారిన మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. -
విద్యుత్ తీగలను తాకిన ఆవు మృతి
రఘునాథపాలెం: మండలంలోని చింతగుర్తిలో గాలిదుమారానికి తెగిపడిన విద్యుత్ తీగలను తాకిన ఓ ఆవు విద్యుదాఘాతంతో మృతి చెందింది. బుధవారం నాటి గాలివానకు గ్రామంలో గొడ్ల వెంకటేశ్వర్లు పొలంలో చెట్టు కూలి విద్యుత్ తీగలపై పడడంతో అవి తెగిపోయాయి. అయితే, గురువారం మేతకు వెళ్లిన లింగన్నబోయిన రామయ్యకు చెందిన ఆవు తీగలను తాకగా విద్యుత్ సరపరా అవుతుండడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న విద్యుత్శాఖ ఉద్యోగులు పరిశీలించి వివరాలు సేకరించారు. కలకోటలో పాడి గేదె... బోనకల్: మండలంలోని కలకోటలో విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి చెందింది. గ్రామంలోని పెరుమాళ్లపల్లి బాబుకు చెందిన పాడి గేదె పొలంలో మేత మేస్తుండగా గాలి దుమారానికి తెగిపడిన 11కేవీ విద్యుత్ వైరు తాకడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. సుమారు రూ.70వేల విలువైన గేదె మృతి చెందినందున తనకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని బాబు కోరాడు. -
రామాయణ కారిడార్ అనుసంధానం చేయాలి
భద్రాచలం ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి అయ్యేలా రామాయణ కారిడార్తో ఈ పుణ్యక్షేత్రాన్ని అనుసంధానం చేయాలి. దేశంలోని పలు దివ్యక్షేత్రాలతో దీన్ని కలపడం వల్ల దక్షిణ అయోధ్యకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. భద్రాచలం, పరిసర ప్రాంతాల్లోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను, అటవీ అందాలను వీక్షించేలా భద్రాచలం కేంద్రంగా టూరిజం హబ్ ఏర్పాటు చేయాలి. – బూసిరెడ్డి శంకర్రెడ్డి, భద్రాచలం పరిరక్షక వ్యవస్థాపక నాయకుడురైల్వేలైన్ అందుబాటులోకి తేవాలి భద్రాచలం పరిసర ప్రాంత ప్రజలకు, భక్తులకు తీరని కలగా ఉన్న రైల్వే సౌకర్యం కల్పించేలా కొత్తగా కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. పాండురంగాపురం నుంచి సారపాక వరకు, ఇంకా సాధ్యమైతే భద్రాచలం వరకు పొడిగించాలనే ప్రజల డిమాండ్ను తక్షణమే తీర్చాలి. ప్రతిపాదన దశలో ఉన్న మల్కనగిరి – భద్రాచలం రైల్వే లైన్ ఏర్పాటుకు చొరవ చూపాలి. – పొదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్యే -
కాంగ్రెస్ గూటికి మున్సిపల్ వైస్ చైర్మన్
ఇల్లెందు : ఇల్లెందు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్డీ జానీపాషా, వార్డు కౌన్సిలర్లు గిన్నారపు రజిత, సయ్యద్ ఆజం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, డీసీసీబీ డైరెక్టర్ జనగాం కోటేశ్వరరావు, బీఆర్ఎస్ ఇల్లెందు పట్టణ ఉపాధ్యక్షుడు పెండెల హరికృష్ణ, ఎస్సీ సెల్ ఇన్చార్జ్ మేకల శ్యామ్, మాజీ కౌన్సిలర్ పర్రె స్వర్ణలత శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు నూకల మురళీకృష్ణ యాదవ్, పాలెపు ఆనంద్, ఆదూరి రవి, బుర్ర రమేష్, బుల్లి ఐలయ్య, బోశాల దుర్గారావు, బొల్లం సతీష్, సామంతుల అశోక్ తదితరులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పార్టీని వీడడం గులాబీ నేతలకు పెద్ద షాక్గా చెప్పొచ్చు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, నాయకులు మువ్వా విజయ్బాబు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేకల మల్లిబాబుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. వారికి ఉన్నత విద్య అందేలా భద్రాచలంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. గతంలో హామీ ఇచ్చి మాట తప్పి ఇతర జిల్లాకు కేటాయించి అన్యాయం చేశారు. అలాగే సెంట్రల్ సిలబస్ ఆధారిత నవోదయ, ఇతర టెక్నికల్ పాఠశాలలను, కళాశాలలను భద్రాచలంలో ఏర్పాటు చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. – మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఎం నాయకుడువిలీన గ్రామాలను కలపాల్సిందే.. రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్న పిచులకపాడు, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం, యటపాక గ్రామాలను ఏపీలో కలిపి భద్రాచలానికి తీరని అన్యాయం చేశారు. దీంతో పట్టణ అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. ఈ గ్రామాలను తిరిగి భద్రాచలంలో కలిపేలా కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయాలి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరించాలి. – రావులపల్లి రవికుమార్, సీపీఐ నేత ● -
రఘురాముడు గెలిస్తే అభివృద్ధి: హీరో వెంకటేష్
కొత్తగూడెంరూరల్ : ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ అన్నారు. కొత్తగూడెం క్లబ్లో మంగళవారం రాత్రి నిర్వహించిన ఆత్మీయ సమ్మెళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తన కూతురును రఘురాంరెడ్డి ఇంటికే కోడలిగా పంపించానని, వారిది ప్రేమానురాగాలు గల కుటుంబమని చెప్పారు. ఆయన గెలిస్తే ఉమ్మడి జిల్లా ప్రజలను కూడా ప్రేమగా చూసుకుంటారని అన్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటేసి రఘురాంరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని అవుతారని, రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అభ్యర్థి రఘురాంరెడ్డి, ఎంపీ రేణుకాచౌదరి, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా, కాంగ్రెస్ నాయకులు కోనేరు సత్యనారాయణ, ఆళ్ల మురళి, తూము చౌదరి, నాగేంద్రత్రివేది, నాగా సీతారాములు, బోయిన సురేష్, శంకర్ నాయక్, ఎండీ రజాక్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలలు తెరిచే నాటికి పనుల పూర్తి
భద్రాచలంటౌన్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ పరిధి ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు పునఃప్రారంభమయ్యే నాటికి మరమ్మతులు పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్ సూచించారు. ఈ విషయంలో స్పెషల్ ఆఫీసర్లు చొరవ తీసుకోవాలని తెలిపారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం అధికారులతో సమావేశమైన ఆయన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, పనుల పురోగతిపై సమీక్షించారు. ఆశ్రమ పాఠశాల, వసతి గృహాల్లో ప్రతీ విద్యార్థికి మంచం ఏర్పాటు చేయాలని, నాలుగు బెడ్లకు కలిపి ఒక ఫ్యాన్, లైట్ అమర్చాలని తెలిపారు. వేసవి సెలవుల్లోనే టాయిలెట్లు, బాత్రూంలు, బోర్ల మరమ్మతు చేయించాలని, పగిలిపోయిన స్విచ్ బోర్డులు, లైట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయించాలని చెప్పారు. అలాగే ఆశ్రమ పాఠశాలల్లో ఎస్సెస్సీ విద్యార్థులకు ఇంగ్లిష్ బోధించే ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇవ్వనున్నట్లు పీఓ తెలిపారు. సమావేశంలో ఏపీఓ డేవిడ్రాజ్, డీడీ మణెమ్మ, అధికారులు రమణయ్య, నర్సింహారావు, అశోక్కుమార్, మునీర్పాషా, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ -
అక్రమ రవాణా అడ్డుకట్టకు చర్యలు
అశ్వారావుపేట/దమ్మపేట: మద్యం, నగదు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. మంగళవారం అశ్వారావుపేట అంతర్రాష్ట్ర చెక్పోస్టును ఆయన తనిఖీ చేసి, మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో ఉందని.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 12 అంతర్రాష్ట్ర చెక్పోస్టులు, 4 అంతర్ జిల్లా చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, వీటి ద్వారా ఇప్పటివరకు రూ.1,19,50,531 నగదు, రూ.16,37,324 విలువైన 2,502 లీటర్ల మద్యం, రూ.2,06,85,300 విలువ గల 828 కిలోల గంజాయి, రూ.11,22,000 విలువ గల బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రూ.3,53,95,155 విలువైన అనధికార ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అనంతరం పెనగడప, దమ్మపేట మండలం మందలపల్లి, అల్లిపల్లి, అశ్వారావుపేట అంతర్రాష్ట్ర చెక్పోస్టులను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలిచ్చారు. వ్యవసాయ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలను, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్, అశ్వారావుపేట సీఐ జితేందర్రెడ్డి, ఎస్ఐలు శ్రీనివాస్, శివరామకృష్ణ, సాయికిశోర్రెడ్డి ఉన్నారు. చెక్పోస్టుల తనిఖీలో ఎస్పీ రోహిత్రాజు -
కృషి విజ్ఞాన కేంద్రంలో స్వర్ణోత్సవం
సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రంలో స్వర్ణోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేర్ డాక్టర్ వి.లక్ష్మీనారాయణమ్మ అధ్యక్షతన రైతుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారి సూర్యనారాయణ మాట్లాడారు. 1974లో డాక్టర్ మోహన్సింగ్ మెహల్ కమిటీ సిఫారసు మేరకు దేశంలో మొదటగా పాండిచ్చేరిలో మొదటి కేవీకేను ఏర్పాటు చేశారని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 731 కేవీకేలు ఏర్పాటయ్యాయని వివరించారు. కేవీకే ఏర్పాటు ప్రధాన ఉద్దేశం నాణ్యమైన విత్తనాలు వినియోగించి రైతులు అధిక దిగుబడులు సాధించడమని తెలిపారు. రైతులు లాభసాటి వ్యవసాయం చేయడానికి కేవీకే శాస్త్రవేత్తలు కృషి చేస్తారని చెప్పారు. ప్రోగ్రామ్ కోఆర్డినేట్ర్ లక్ష్మీనారాయణమ్మ మాట్లాడుతూ.. నాణ్యమైన విత్తనాలు వేసే విధంగా రైతులను చైతన్యం చేయడంతో పాటు విత్తనాల సరఫరాను కూడా చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యసాయాధికారి బాబూరావు, శాస్త్రవేత్త శివ, యశ్వంత్, రైతులు పాల్గొన్నారు. -
పారిశ్రామిక కారిడార్ నెలకొల్పాలి
భద్రాచలంతో పాటు ఏజెన్సీలోని ఇతర ప్రాంతాల్లో గిరిజనులకు స్వయం ఉపాధి ఆధారిత పరిశ్రమలను నెలకొల్పి వారికి చేయూత అందించాలి. ప్రధానంగా తునికాకు సేకరణ జరిగే ఈ ప్రాంతంలో బీడీ పరిశ్రమ ఏర్పాటుచేయాలి. స్వయం ఉపాఽధి పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించేలా గిరిజన పారిశ్రామిక కారిడార్ను భద్రాచలంలో ఏర్పాటు చేయాలి. – రావులపల్లి రాంప్రసాద్, బీఆర్ఎస్ నేత పెసా చట్టాన్ని కఠినంగా అమలుపర్చాలి ఏజెన్సీ ప్రాంతంలో పెసా చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేలా కేంద్రం కృషి చేయాలి. ఆదివాసీ ప్రాంతాల వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలయ్యేలా ప్రత్యేక కార్యచరణ అమలు చేయాలి. మైనింగ్ దోపిడీని అరికట్టేలా ప్రత్యేక చట్టాలు రూపొందించాలి. గిరిజనులకు సంక్షేమ రాజ్యం అమలుపై కేంద్రం దృష్టి పెట్టాలి. – కోటా దేవాదానం, న్యాయవాది, ఆదివాసీ హక్కుల పోరాట నాయకుడు -
భద్రగిరికి న్యాయం చేయాలి
ఏజెన్సీని పట్టించుకోవడం లేదనే విమర్శలు.. ● భద్రాచలంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు డిమాండ్ ● రామాయణ కారిడార్, టూరిజం హబ్ ఏర్పాటుచేయాలి ● భద్రాచలం వరకు రైల్వే లైన్ పొడిగించాలి ● ఎన్నికల వేళ పలు పార్టీలు, సంఘాల నేతల విన్నపం భద్రాచలం పట్టణ వ్యూభద్రాచలం: తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గిరిజనులకు భద్రాచలం కేంద్రంగా ఉంది. రాష్ట్రంలోనే అతి పెద్ద ఏజెన్సీ ప్రాంతంగా గుర్తింపు పొందిన ప్రాంతమిది. వివిధ జాతుల ఆదివాసీలు, గిరిజనులు వారి సంస్కృతి, సంప్రదాయాలకు నెలవై ఉన్న కేంద్రంగా విరాజిల్లుతోంది. అయితే అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది. ప్రభుత్వాలు అందిస్తున్న స్వయం ఉపాధి, ఇతర పథకాలు కొంతమేర మాత్రమే సత్పలిస్తున్నాయనే అపవాదు ఉంది. ఏజెన్సీలో ఇప్పటికీ విద్య, వైద్యం, తాగునీరు అందని గ్రామాలెన్నో ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలానికి కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని పలు పార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు అంటున్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ‘గిరిజనులకు కేంద్రం అందించాల్సిన అభివృద్ధి’ అనే అంశంపై సాక్షి అన్ని వర్గాల వారి అభిప్రాయాలను సేకరించింది. గిరిజనులకు అనాదిగా అన్యాయం.. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజనులకు కేంద్ర ప్రభుత్వాలు అనాదిగా అన్యాయం చేస్తూనే ఉన్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. పలు గ్రామాలను ఏపీలో విలీనం చేయడం, భద్రాచలం కేంద్రంగా ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీని తరలించడం వంటివి తీరని వ్యథగానే మిగిలాయని అంటున్నారు. కేంద్రంలో త్వరలో కొలువుదీరనున్న ప్రభుత్వం అయినా భద్రాచలంలో విద్య, వైద్యం, రవాణా, స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. నాలుగు రాష్ట్రాలకు కూడలిగా ఉన్న భద్రాచలం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలి నాలుగు రాష్ట్రాల గిరిజనుల వైద్య సేవలకు ఇప్పటికీ భద్రాచలమే దిక్కు. అరకొర వైద్యులు, సిబ్బంది, వసతులతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన ప్రభుత్వ వైద్యం అందక ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. భద్రాచలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలి. ప్రతీ ఆదివాసీ గిరిజనుడికి ఉచిత వైద్యం పటిష్టంగా అందేలా చర్యలు తీసుకోవాలి. – ముర్ల రమేష్, ఆదివాసీ కొండరెడ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు -
సమయం లేదు మిత్రమా...
● ముగింపు దశకు లోక్సభ ఎన్నికల ప్రచారం ● పట్టణాలు, మండల కేంద్రాల్లో విస్తృతంగా రోడ్డు షోలు ● ఓటర్లను ఆకర్షించే పనిలో రాజకీయ పార్టీలు ● ఆఖరి ప్రచారం, పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సాక్షిప్రతినిధి, ఖమ్మం: లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం ముగింపు దశకు చేరుతోంది. ఈనెల 11న సాయంత్రం 6 గంటల వరకు ప్రచారానికి అవకాశముండగా.. మిగిలిన తక్కువ సమయంలో ముఖ్య నేతలను రప్పించి పట్టణాలు, మండల కేంద్రాల్లో రోడ్డు షోలు నిర్వహించేలా పార్టీలు ప్రణాళిక రూపొందించాయి. ఆఖరు ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేలా సుడిగాలి పర్యటనలకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతల పర్యటనలు ఇప్పటికే ముగిశాయి. ఇక ఈ నాలుగు రోజుల్లో కొందరు నేతలను రప్పించి ప్రచారం హోరెత్తించడంపై దృష్టి సారించారు. హోరాహోరీగా.. ఖమ్మం లోక్సభ బరిలో 35 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గతనెల 18 నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగగా.. ఈనెల 13న పోలింగ్ జరగనుంది. అయితే, నామినేషన్లకు ముందే బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులుగా నామా నాగేశ్వరరావు, తాండ్ర వినోద్రావును ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని బరిలోకి దింపింది. ఆర్భాటం లేకుండా నామినేషన్లు వేసిన అభ్యర్థులు ప్రచారం మాత్రం హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన ఆలస్యం కావడంతో తొలుత ఎన్నికల జోష్ రాలేదు. రఘురాంరెడ్డిని ప్రకటించాక కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ ప్రచారాన్ని కదం తొక్కించాయి. పోటాపోటీగా నియోజకవర్గ, పార్లమెంట్ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించడమే కాక అభ్యర్థులు, నేతలు పల్లెలు, పట్టణాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇకపై ఇంటింటికీ.. ఓటర్లను ఆకర్షించే పనిలో రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. ఇన్నాళ్లు రోడ్డు షోలు, సభలకే పరిమితం కాగా ప్రస్తుతం ఇంటింటి ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఖమ్మం కార్పొరేషన్, మధిర, సత్తుపల్లి, వైరా, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీల తరఫున నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు, పోస్టర్లు ఇస్తూ తమ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. బూత్ కమిటీలు ఈ ప్రచారాన్ని కీలకంగా తీసుకున్నాయి. ప్రచార గడువు ముగిసే వరకు ఈ ప్రక్రియ కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు. పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి.. హుంగూ ఆర్భాటాలతో ప్రచారం చేసినా చివరకు పోల్ మేనేజ్మెంట్ చేయకపోతే విజయావకాశాలు సన్నగిల్లుతాయని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. దీంతో కోలాహలంగా ప్రచారం చేయిస్తున్న అభ్యర్థులు మరోవైపు పోల్ మేనేజ్మెంట్పైనా దృష్టి సారించారు. గత రెండు, మూడు ఎన్నికల్లో తమ పార్టీకి పోల్ అయిన ఓట్లు ఎన్ని, అప్పుడు ఏ ప్రాంతాల్లో తగ్గాయో బేరీజు వేసుకుంటూ ఆయా ప్రాంతాల్లో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. పార్టీల వారీ ఓట్లతో పాటు కులాల వారీగా ప్రతీ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో లెక్కలు తీశారు. వీటి ఆధారంగా పోల్ మేనేజ్మెంట్ ఎక్కడ ఎలా చేస్తే గెలుస్తామనే అంశంపై కసరత్తు చేపట్టి.. చివరి అంశం విజయవంతంగా పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అతిరథులతో ప్రచా‘రణం’ బీజేపీ అభ్యర్థి వినోద్రావు తరఫున కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రచారానికి వచ్చారు. అలాగే, బస్తర్ రాజు కమల్చంద్ర భంజ్దేవ్ సైతం ఖమ్మంలో ప్రచారానికి హాజరయ్యారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోసం మాజీ సీఎం కేసీఆర్ ఖమ్మం, కొత్తగూడెంలో రోడ్డు షో చేశారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పార్లమెంట్ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో ప్రచారానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సైతం హాజరవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. మరోపక్క కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డికి మద్దతుగా సినీ హీరో వెంకటేశ్ మంగళవారం ఖమ్మం, కొత్తగూడెంలో ప్రచారం నిర్వహించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముఖ్య నేతలను రప్పించి పోటాపోటీగా ప్రచారం చేస్తుండడంతో ప్రసంగాల మోత మోగుతోంది.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్హాసన్ 'థగ్ లైఫ్'.. ఆ హీరోను రిప్లేస్ చేశారు!
RCB vs PBKS: ధర్మశాలలో గర్జించేదెవరు?
హర్యానాలో మరో ట్విస్ట్.. గవర్నర్కు లేఖ రాసిన జేజేపీ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
SRH vs LSG: ఏమా పరుగుల విధ్వంసం.. లక్నో చిత్తు
తొలిసారి ఆ జానర్ టచ్ చేయనున్న విజయ్!
Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
రేపే పసిడి కొనుగోలు జాతర.. దిగొచ్చిన బంగారం!
ఆ ప్రేమ జంట టీ దుకాణానికి వినియోగదారుల క్యూ!
Watch Live: కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ప్రచార సభ
తప్పక చదవండి
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
- Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement