-
పదేళ్లలో మోదీ చేసింది ఏమీ లేదు
సాక్షి, మహబూబాబాద్: పది సంవత్సరాల మోదీ పాలనలో చేసింది ఏమీలేదని, ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ అన్నారు. మంగళవారం ఆమె మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లెందు, పినపాక ఎమ్మెల్యేలతో ఎన్నికల ప్రచారం, మిగిలిన నాలుగు రోజుల ప్రణాళికపై సమీక్షించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేస్తున్నామని అన్నారు. గత రెండు రోజుల నుంచి రైతులకు రైతు బంధు కూడా పడుతుందని చెప్పారు. కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైతులు ఇప్పటి వరకు ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. రైతుబంధు పడటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దేశాన్ని పరిపాలించడం పక్కన పెట్టిన ప్రధాని మోదీ.. రాహుల్ గాంధీ, గాంధీ కుటుంబాని తిట్టడం, విమర్శలు చేయడంతోనే సరిపెడుతున్నారని అన్నారు. దేశంలో వచ్చేది ఇండియా కూటమేనని ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ నుంచి బలరాంనాయక్ అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని అన్నారు. ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరీ, ఎమ్మెల్యేలు రాంచంద్రునాయక్, మురళీ నాయక్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. దీపాదాస్ మున్షీకి ఘన స్వాగతం మహబూబాబాద్ రూరల్ : మొట్టమొదటిసారిగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చిన దీపాదాస్ మున్షీకి మంగళవారం ఘనస్వాగతం పలికారు. డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్చందర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యేలు డాక్టర్ మురళీనాయక్, జాటోత్ రామచంద్రునాయక్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజయ్య స్వాగతం పలికినవారిలో ఉన్నారు. ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ -
బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయం
తొర్రూరు రూరల్: కాంగ్రెస్ గేట్లు తెరవకముందే బీఆర్ఎస్ నాయకులు వెల్లువలా పార్టీలో చేరుతున్నారని, ఇక గేట్లు తెరిస్తే ఆ పార్టీ ఖాళీ కావడం ఖాయమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి దయాకర్రావు ముఖ్య అనుచరుడు రామసహాయం కిశోర్రెడ్డి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. మండలంలోని వెలికట్ట శివారు శ్రీనివాస గార్డెన్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో కిశోర్రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని మడిపల్లి, కంఠాయపాలెం, మాటేడు, తొర్రూరు మున్సిపాలిటీకి చెందిన 2 వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు. మంచి ఉద్ధేశంతో పార్టీలో చేరుతామన్న వారికి ద్వారాలు తెరిచే ఉంటాయన్నారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో గులాబీ పార్టీకి నూకలు చెల్లాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు 50వేల మెజార్టీ తగ్గకుండా కృషి చేయాలని కోరారు. నిరంజన్రెడ్డి, హరిప్రసాద్, తిరుపతిరెడ్డి, సంతోష్, రామచంద్రయ్య, సాయిలు, ఐలయ్య, రామలింగం, అనిల్రెడ్డి, వెంకటస్వామి, రాంబ్రహ్మచారి పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
గూడూరు: వైద్యులు, సిబ్బంది ఆస్పత్రికి అందుబాటులో ఉంటూ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి అన్నారు. మండలంలోని అయోధ్యపురం పీహెచ్సీని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో జరిగిన ప్రసవాల గూర్చి డాక్టర్ యమునను అడిగి తెలుసుకున్నారు. ఆశలు, ఏఎన్ఎంలు సూపర్వైజర్లు సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రా మ్ ఆఫీసర్ బిందుశ్రీ, డీపీహెచ్ఎన్ మంగమ్మ, సిబ్బంది కోమల, లోక్యానాయక్ పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు గార్ల: వైద్యులు, వైద్యసిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్ఓ అంబరీషా అన్నారు. మంగళవారం మండలంలోని ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసిన అనంతరం వైద్యులు, వైద్యసిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు సబ్సెంటర్ల పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. గర్భిణును గుర్తించి నార్మల్ డెలివరీల వలన కలిగే ఉపయోగాల గురించి వివరించాలని పేర్కొన్నారు. ఆయన వెంట డాక్టర్ పృథ్వీ, సీహెచ్ఓ కృష్ణార్జున్రావు, ఎస్యూఓ శ్రీనివాస్, సీహెచ్ఓ సక్కుబాయి, హెచ్ఈఓ శ్రీహరి, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ కళావతిబాయి -
ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించాలి
మహబూబాబాద్ : ఎన్నికల కమిషన్ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు డేవిడ్, లెనిన్ వత్సల్ టోప్పో వివిధ శాఖల నోడ్ అధికారులతో కలసి ఈనెల 13న నిర్వహించే పోలింగ్ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన కొత్తగూడ: మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి ఎన్నికల పరిశీలకుడు రితిక్రాజ్ ఆధ్వర్యంలో అధికారుల బృందం మంగళవారం పరిశీలించింది. ఎన్నికల సమయంలో సిబ్బందికి కావాల్సిన వసతులు, భద్రత, ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు. తీసుకోవాల్సిన చర్యలను తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఎన్నికల అధికారులకు, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని రితిక్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఐటీడీఏ పీఓ చిత్రామిశ్ర, ములుగు అదనపు కలెక్టర్ శ్రీజ, ములుగు ఎస్డీపీఓ రవీందర్, సీఐ బాబూరావు, తహసీల్దార్ రమాదేవి, కొత్తగూడ, గంగారం ఎస్సైలు దిలిప్, రవీందర్ పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలి డోర్నకల్: ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని మహబూబా బాద్ డీఎస్పీ తిరుపతిరావు కోరారు. డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ, సీరోలు మండలం అందనాలపాడు గ్రామాల్లో డోర్నకల్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. గ్రామాల్లోని ప్రజలంతా తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. మూఢనమ్మకాలు, అక్ర మ వ్యాపారాలతో ఇబ్బందులపాలవుతారని తెలిపారు. కార్యక్రమంలో డోర్నకల్ సీఐ ఉపేందర్రావు, ఎస్సై తిరుపతి పాల్గొన్నారు. కేయూ బీటెక్ సెమిస్టర్ పరీక్షలు షురూ కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో పరిధిలో ఇంజనీరింగ్ బీటెక్ నాల్గోవ సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు మంగళశారం ప్రారంభమయ్యాయి. కేయూలోని ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఆచార్య నర్సింహాచారి , అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాధిక పరిశీలించారు. కాళేశ్వరంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పూజలు కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, కాళేశ్వరం జ్యూడీషియల్ కమిషన్ చైర్మన్ పినాకి చంద్రఘోష్–డెబ్జాని దంపతులు దర్శించుకున్నారు. మంగళవారం ఆయన ఆలయ రాజగోపురం వద్దకు రాగా ఆలయ అధికారులు, అర్చకులు మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్చరణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి గర్భగుడిలో విశేష పూజలు చేశారు. వారికి అర్చకులు స్వామివారి ప్రాశస్త్యాన్ని వివరించారు. అనంతరం శ్రీశుభానందదేవి(పార్వతీ) అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడ పీసీ ఘోష్ దంపతులను ఆలయ ప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణౖమూర్తిశర్మ స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. స్వామివారి చిత్రపటాన్ని దంపతులకు బహూకరించారు. ఆయనతో పాటు నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ప్రశాంత్జీవన్ పాటిల్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనను ఆలయ అర్చకులు వేర్వేరుగా సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. -
అకాల వర్షం
బుధవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2024– IIలోuమండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు జిల్లావ్యాప్తంగా మంగళవారం కురిసిన అకాల వర్షం ఊరటనిచ్చిందనాలో.. లేక ఈదురుగాలి.. వర్షంతో ధాన్యం తడిసిపోయి, మామిడికాయలు రాలడంతో ఆవేదన చెందాలో అర్ధంకాని పరిస్థితి. పంట లు చేతికొచ్చే సమయంలో కురిసిన వానతో జిల్లావ్యాప్తంగా వందలాది ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లు, విద్యుత్ తీగలపై పడడంతో ప్రయాణికుల రాకపోకలతోపాటు, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అయితే సంబంధిత అధికారుల సర్వే అనంతరం ఎంతమేర నష్టం జరిగిందో తేలనుంది. రైతన్న ఆగమాగంగూడూరు: మంగళవారం సాయంత్రం 6గంటల నుంచి ఈదురు గాలులు ప్రారంభం కాగా, ఒక్కసారిగా రాత్రి 7గంటల నుంచి 8.30 గంటల వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురుగాలులతో పెంకుటిళ్లు, గడ్డివాములు, ఎండిన చెట్లు నేలకూలాయి. గూడూరు నుంచి నెక్కొండ, కేసముద్రం ప్రధాన రహదారి పక్కన గల ఎండిన పెద్ద చెట్టు నేల కూలింది. అదేసమయంలో అటువైపు ద్విచక్రవాహనంపై వస్తున్న బండారి సిద్ధు తలకు తీవ్రగాయం కాగా, చెవి నుంచి రక్తస్రావమైంది. సీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వరంగల్లోని ఆస్పత్రికి తరలించారు. మహబూబాబాద్ రూరల్: రోడ్డుపై పడిన చెట్టును తొలగిస్తున్న ఎస్సై, తదితరులు న్యూస్రీల్ఎగిరిపోయిన ఇంటి పైకప్పుగార్ల: మండలంలోని చిన్నకిష్టాపురం పంచాయతీ మంగలితండాకు చెందిన నూనావత్ లాలుకు చెందిన రేకుల ఇల్లు పైకప్పు రేకులు మంగళవారం వీచిన ఈదురుగాలికి ఎగిరిపోయాయి. దీంతో కుటుంబానికి నిలువ నీడలేకుండా అయిపోయింది. కుటుంబాన్ని ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. తడిసిన మక్కలు, ధాన్యం కేసముద్రం : కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లో మంగళవారం వర్షం కురిసింది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఓపెన్ యార్డులో రాశులుగా పోసుకున్న ధాన్యం, మక్కలు తడిశాయి. టార్పాలిన్లు, పరదాలు కప్పుకున్నన్పటికీ రాశుల అడుగున తడిసిపోయింది. ఇనుగుర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాశుల పరిస్థితి మారింది. తడిసిన ధాన్యం.. విరిగిన చెట్లు నేలరాలిన మామిడికాయలు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా -
No Headline
మహబూబాబాద్ రూరల్: జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మామిడికాయలు నేలరాలాయి. వ్యవసాయ మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడువగా పలు ప్రాంతాల్లో వర్షం ప్రారంభం కాగానే ధాన్యం రాశులపై రైతులు టార్పాలిన్లు కప్పుకునే ప్రయత్నం చేయగా అవి గాలికి ఎగిరిపోయి మరింత అవస్ధలు పడ్డారు. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు జేసీబీల సాయంతో తొలగించి సమస్యను పరిష్కరించారు. విద్యుత్శాఖ అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్దరించారు. -
1950 నుంచి సార్వత్రిక ఓటు హక్కు..
కాజీపేట: భారతదేశంలో 1950 నుంచి సార్వత్రిక ఓటు హక్కు అమల్లోకి వచ్చింది. రాజ్యాంగంలోని 326 అధికరణం ద్వారా సార్వత్రిక ఓటు హక్కు కల్పించారు. ఇది ప్రపంచ రాజకీయ చరిత్రలో ఒక విప్లవాత్మక చర్య. ఎందుకంటే సార్వత్రిక ఓటుహక్కు అమలుకావడానికి చాలా దేశాల్లో వందల సంవత్సరాలు పట్టింది. భారతదేశంలో సార్వత్రిక ఓటుహక్కు వచ్చేనాటికి గ్రీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్ తదితర దేశాల్లో కొన్ని వర్గాలకు ఇంకా ఓటుహక్కు అందలేదు. ఇదీ భావితరాలకు భారత రాజ్యాంగం చూపిన రాజకీయ పరిణతి. ప్రచారంలో అక్రమాలకు పాల్పడితే.. ఎన్నిక వాయిదా కాజీపేట: ఎన్నికల ప్రచారంలో అక్రమాలు నెలకొన్నాయని ఎన్నికల సంఘం భావిస్తే ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణను వాయిదా వేయొచ్చు. దేశంలో మొదటిసారి తమిళనాడులోని రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలు వాయిదా వేసింది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిబంధనలు ఉల్లంఘించి ఓట్ల కోసం డబ్బులు పంపిణీ చేశారని భావించిన ఎన్నికల సంఘం.. ఆయా ఎన్నికలను రద్దుచేసింది. మరో తేదీలో ఎన్నికలు నిర్వహించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల సంఘం పాత్ర ఎంత శక్తివంతమైందో ఈ నిర్ణయాల ద్వారా తెలుసుకోవచ్చు. -
రాజయ్యకు ‘దళిత బంధు’ సెగ
చిల్పూరు: జనగామ జిల్లా చిల్పూరు మండలం వెంకటాద్రిపేటలో మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు ‘దళిత బంధు’ సెగ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్ను గెలిపించాలంటూ మంగళవారం మధ్యాహ్నం వెంకటాద్రిపేటలో ప్రచా రంలో రాజయ్య మాట్లాడుతుండగా.. ‘దళిత బంధు’ స్కీం కోసం డబ్బులు ఇచ్చాం.. ఇప్పటి వరకు మంజూరు కాలేదు.. ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాలి’ అంటూ గొడవకు దిగారు. దీంతో రాజయ్య ప్రచారం ముగించి వేరే గ్రామానికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు, దళిత బంధు బాధితుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా బాధితులు కనకం కిరణ్కుమార్, కనకం సుధాకర్, కందుకూరి రత్నాకర్ మాట్లాడుతూ ‘దళిత బంధు’ కింద రూ.10 లక్షలు రావాలంటే అప్పటి ఎమ్మెల్యే రాజయ్యకు డబ్బులు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు చెప్పగా ఆశతో అందిన కాడ అప్పులు తెచ్చి రూ.2.50 లక్షలు ఇచ్చామని చెప్పారు. స్కీం మంజూరు కాలేదు.. అప్పు తెచ్చినకాడ వడ్డీలు పెరుగుతున్నాయని, ఎన్ని సార్లు అడిగినా పట్టించుకోవడం లేదని వాపోయారు. కనీసం ప్రచారానికి వచ్చిన రాజయ్య కూడా ఎలాంటి సమాధానం చెప్పకుండా వెనుదిరిగాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని కోరారు. -
బీఆర్ఎస్ టీషర్టు విప్పించిన కాంగ్రెస్ నాయకులు
● సోషల్ మీడియాలో వైరల్ కాటారం: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధి పనుల వద్దకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులు అక్కడ ఓ కూలీ ధరించిన బీఆర్ఎస్ గుర్తు, కేసీ ఆర్ ఫొటోతో కూడిన టీషర్టును విప్పించిన సంఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. కాంగ్రెస్కు చెందిన పలువురు నాయకులు ఒడిపిలవంచ సమీపంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లారు. ఓటు అభ్యర్థిస్తున్న సమయంలో ఓ కూలీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన టీషర్టు ధరించడం గమనించిన నాయకులు దానిని విప్పేస్తే మరో టీషర్టు ఇస్తామని సదరు కూలీకి చెప్పారు. దీంతో ఆయన టీషర్టు విప్పేయగా కాంగ్రెస్ నాయకులు దూరంగా విసిరారు. కాగా, కాంగ్రెస్ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోగానే ఆ కూలీ తిరిగి అదే టీషర్టు ధరించి పనుల్లో నిమగ్నమయ్యాడు. ఇదంతా అక్కడే ఉన్న ఒక్కరు ఇద్దరు కూలీలు తమ సెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో వేశారు. ఈ విషయమై కాంగ్రెస్ మండల నాయకులను వివరణ కోరగా సదరు కూలీ తన ఇష్టం మేరకే టీషర్టు విప్పారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. -
పాట.. ప్రచారం
● ప్రత్యేక గీతాలతో హోరెత్తుతున్న క్యాంపెయిన్ ● పాటల రూపంలో ప్రజల్లోకి వస్తున్న అభ్యర్థులు కాజీపేట : లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడుతుండడంతో ప్రచారానికి అభ్యర్థులు అందుబాటులో ఉన్న అన్నీ అవకాశాలను వినియోగించుకుంటున్నారు. పార్టీ మేనిఫెస్టో, చేసిన అభివృద్ధిని పాటల రూపంలో వివరిస్తూ ప్రత్యేక వాహనాల ద్వారా వీధుల్లో తిరుగుతూ వివరిస్తున్నారు. పెరిగిన సాంకేతికతకు అనుగుణంగా ఎల్ఈడీ తెరలు, డీజేలతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రచారంలో జోష్ పెంచుతున్నారు. వరంగల్ లోక్సభ పరిధిలోని మండలాలు, పట్టణాల్లో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు.. తమ పేరిట ప్రత్యేక గీతాలు సిద్ధం చేసుకున్నారు. నడువు నడువవే రామక్క.. కలిసి నడుం కట్టవే రామక్క అంటూ బీఆర్ఎస్, వందేళ్ల చరిత్రగలదమ్మో మన కాంగ్రెస్..త్యాగాల ఘనత గలదమ్మో మన కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్, ‘కదలిరండి బీజేపీ కార్యకర్తలరా..కదం తొక్కి నడవండి.. వీరయోధులారా.. అంటూ బీజేపీ పాటలు నియోజకవర్గంలో మార్మోగుతున్నాయి. ఈ పాటలతో ప్రచారం రెండు విధానాల్లో సాగుతోంది. ఒకటి కళాజాత బృందాలు అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ పాటలు పడుతున్నారు. మరో విధానంలో పాటలతో పాటు ఆయా అభ్యర్థులు, పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాన్ని చూపే వీడియోలకు జోడించి కూడళ్లలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ప్రదర్శిస్తున్నారు. స్థానికంగా ఒక్కో ప్రధాన అభ్యర్థుల పేరిట ఐదు, ఆరు పాటలు వినిపిస్తున్నాయి. పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన పాటలు వీటికి అదనం. పాటలతో నిర్వహిస్తున్న ప్రచారంపై స్థానికులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. -
అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా
నయీంనగర్: దేశం మోదీ చేతిలో ఉంటేనే భద్రంగా ఉంటుందని బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్ అన్నారు. మంగళవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో అ ధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అరూరి రమేష్ మాట్లాడారు. తనను ఆశీర్వదిస్తే మోదీ సహకారంతో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య భర్తది గుంటూరు అని, బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్ది కరీంనగర్ అన్నారు. కడియం శ్రీహరిది నీచ చరి త్ర అన్నారు. ఒకప్పుడు ఆయన ఆస్తులు ఎంత.. ఇప్పుడు ఎంత అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ లో ఉన్నప్పుడు కొండా సురేఖకు టికెట్ రాకుండా చేశారన్నారు. తాను మూడో సారి గెలిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిని అవుతానని, అందుకే తనను ఓడించడం కోసం కడియం శ్రీహరి కుట్రలు చేశాడన్నారు. దళిత దొర హయాంలో పేద బిడ్డల ఎన్కౌంటర్ జరిగిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఓటమి భయంతోనే సీఎం రేవంత్రె డ్డి వరంగల్లో మూడుసార్లు ప్రచారానికి వచ్చారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు నాన్ లోకల్ అని, తాను ఒక్కడినే లోకల్ దళిత బిడ్డనని, వరంగల్ ప్రజలు తనకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. తాను గెలవగానే వరంగల్ను అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చేస్తానన్నా రు. వరంగల్ నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, మామునూరు ఎయిర్పోర్టు, వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్, పాలకుర్తి–కొడకండ్లలో టెక్స్టైల్ పార్క్, మడికొండలో ఐటీ హబ్ ఎక్స్పాన్షన్, భూపాలపల్లి–పరకాల రైలు మా ర్గం, ఏనుమాముల మార్కెట్ ఆధునీకరణ, అనేక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. తనకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. ప్రజలు బీజేపీని ఆదరించి మోదీని గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. నేడు జరిగే ప్రధాని మో దీ జనసభలో ప్రజలు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పా ల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రెస్క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య, కోశాధికారి అమర్, జర్నలిస్టు సంఘాల నేతలు గడ్డం రాజిరెడ్డి, గాడిపల్లి మధు, బీఆర్ లెనిన్, దయాసాగర్, ఎం. రవీందర్, తదితరులు పాల్గొన్నారు. నాన్ లోకల్ అభ్యర్థులకు ఓటువేయకండి కడియం శ్రీహరిది నీచ చరిత్ర బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్ -
అర్హత ఉన్న ప్రతీ రైతుకు రైతుభరోసా
● వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగపేట: అర్హత ఉన్న ప్రతీ రై తుకు రైతుభరోసా పథకం వర్తి స్తుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగి సీజన్కు సంబంధించిన రైతుభరోసా పథకం నగదును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిందన్నారు. ఐదెకరాలకు పైగా భూమి ఉన్న అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ. 5వేల చొప్పున జమచేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదన్నారు. మంత్రి వెంట భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఉన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజాసేవకులు.. వాజేడు: ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఎల్లప్పుడు సేవకులేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం వాజేడులో ని ర్వహించిన వెంకటాపురం(కె), వాజేడు మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బలరాం నాయక్ను అ త్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశ భవిష్యత్తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు సంతోషంగా ఉంటారన్నారు. తమకు వాజేడు, వెంకటాపురం(కె) మండలాలపై ప్రత్యేక అభిమానం ఉందన్నారు. ఈ ప్రాంత అ భివృద్ధికి నిత్యం కృషి చేస్తామన్నారు. కాగా, వాజేడు మండలానికి బస్సులు రావడం లేదని నాయకుడు బోదెబో యిన కృష్ణ చెప్పడంతో స్పందించిన తుమ్మల.. వెంటనే ఆర్టీసీ ఎండీకి ఫోన్ చేసి బస్సు వాజేడు కేంద్రానికి వచ్చే లా చూడాలన్నారు. ఎమ్మెల్యే వెంకట్రావు, మాజీ ఎమ్మె ల్యే పొదెం వీరయ్య, డెనార్జున్ రావు, రవికుమార్, దుర్గా ప్రసాద్, కె. వెంకటస్వామి, రవిశంకర్, అంజయ్య, మోహన్రావు, వాసు, ప్రసాద రాజు,తదితరులున్నారు. -
పట్టభద్రుల స్థానానికి 14 మంది నామినేషన్
నల్లగొండ : వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లలో భాగంగా మంగళవారం 14 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్రెడ్డి, తెలంగాణ సకల జనుల పార్టీ నుంచి నందిపాటి జానయ్య, అలియన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ పార్టీ నుంచి ఈడ శేషగిరిరావు, శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్, యువతరం పార్టీ నుంచి బండారు నాగరాజు నామినేషన్లు వేశారు. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులుగా ఐతగోని రాఘవేంద్ర, పిడిశెట్టి రాజు, పూజారి సత్యనారాయణ, మారం వెంకట్ రెడ్డి, గుగులోత్ భీమా, డాక్టర్ పెంచాల శ్రీనివాస్, కంటే సాయన్న, దైదా సోమసుందరం, అల్వాల కనకరాజు నామినేషన్ దాఖలు చేశారు. ములుగు జిల్లా అదనపు కలెక్టర్, వరంగల్–ఖమ్మం–నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సీహెచ్.మహేందర్జీ నామినేషన్లు స్వీకరించారు. నాలుగు నెలల్లో.. నలభై ఏళ్ల నరకం నాలుగు నెలల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నలభై ఏళ్ల నరకం చూపెడుతోందని, బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించాలని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా మంగళవారం నల్లగొండలోని ఓ గార్డెన్లో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసం చేశారని, పార్లమెంట్ ఎన్నికలతోపాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే నిరుద్యోగుల హక్కులపై పోరాడుతానని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తీసుకువస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి సత్యవతి రాథోడ్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోదీ, కేసీఆర్ బీసీలను మోసం చేశారు
కాజీపేట రూరల్ : ప్రధాని నరేంద్రమోదీ, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు బీసీలను మోసం చేశారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణగౌడ్ అ న్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట ఫాతి మానగర్ వైష్ణవిగ్రాండ్ హోటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ పదేళ్ల పాలనలో ప్రధాని మోదీ బీసీ అయి ఉండి కూడా బీసీలకు ఏమీ చేయలేదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఏకపక్ష నిర్ణయంతో బీసీలపై వివక్ష చూపిందన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జో డో యాత్రలో బీసీ సంఘం ముఖ్య నాయకులతో కలిసి వినతి పత్రం అందజేయగా.. కాంగ్రెస్ గెలిస్తే మొదటి సంతకం చేస్తామని చెప్పినట్లు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్తో కలిసి సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీసీలందరూ ఏకమై కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బచ్చు ఆనందం, తమ్మల శోభారాణి, రాష్ట్ర కార్యదర్శి పెండ్యాల హరిప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల సంపత్కుమార్, పద్మశాలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజగోపాల్, అముదాల మల్లేషంగౌడ్, దేవేందర్, జ్ఞానేశ్వర్, రమేష్, కాసగాని అశోక్, పంజాల మధు, గూడూరు బా లాజీ, రాము, శ్రీనివాస్, రవి పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ -
భరత్ను ఎందుకు దూరం పెడుతున్నారు?
● పరకాల ఎమ్మెల్యే రేవూరికి మంత్రి కొండా సురేఖ ప్రశ్న ● సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో గీసుకొండ: మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మధ్య సంభాషణకు సంబంధించించిన ఓ వీడియో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. గీసుకొండ మండలం రాంపురానికి చెందిన కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు రడం భరత్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్లో చేరారు. ఆయన కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్లో చేరారు. అతడిని పార్టీలో ఎందుకు దూరం పెడుతున్నారని మంత్రి సురేఖ.. ఎమ్మెల్యేను ఆ వీడియోలో ప్రశ్నించారు. కాంగ్రెస్ మండల నాయకులు, ఎంపీపీ.. భరత్ను తీసుకోవద్దని చెప్పారని ఎమ్మెల్యే బదులిచ్చారు. పర్సనల్గా మీతో మాట్లాడుతా అని ఎమ్మెల్యే అంటున్నా మంత్రి తన వాదన వినిపించారు. తనకు తెలియకుండా వరంగల్ మేయర్ కాంగ్రెస్లో చేరినా ఆమెను తనతో తిప్పుకుంటున్నానని తెలిపారు. మా ఆధ్వర్యంలో చేరిన భరత్ను మీరెందుకు కలుపుకొనిపోవడం లేదన్నారు. ఈ విషయం ముందుగా తనకు చెబితే బాగుండేదని ఎమ్మెల్యే బదులిచ్చారు. ప్రస్తుత బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్ను కాంగ్రెస్లోకి ఎలా తీసుకుంటున్నారని మంత్రి ప్రశ్నించారు. కొండా మురళి సహకారంతో సౌజన్య ఎంపీపీ అయ్యిందని, ఆమెను త్వరలో గద్దె దింపుతామని చెప్పారు. భరత్ కాంగ్రెస్ సమావేశం కోసం అనుమతి అడిగితే అతడిపై కేసు పెట్టడం ఏంటని అడిగారు. దయాకర్రావు లాంటి వారికే భయపడలేదని మంత్రి అంటే.. తనకు ఆ మీటింగ్ విషయం అసలు తెలియదని ఆయన సున్నితంగా సమాధానం చెబుతూ ఫోన్ కట్ చేశారు. ఈ వీడియో పలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతుండడం చర్చనీయాంశమైంది. బీజేపీ ప్రచార రథంపై దాడి.. ● కాంగ్రెస్ కార్యకర్తపై కేసు నమోదు పరకాల: నడికూడ మండలం వరికోల్ గ్రామంలో వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్ ప్రచార రథంపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్త కణాల మధుకర్పై పరకాల పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం వరికోల్ గ్రామ కూడలిలో ప్రచారం నిర్వహిస్తుండగా.. మధుకర్ రథం వద్దకు ఆగ్రహంగా దూసుకొచ్చాడు. మోదీ చిత్రం ఉన్న ఫ్లెక్సీని తొలగించాడు. అనంతరం రథానికి ఉన్న మిగతా ఫ్లెక్సీలను తొలగిస్తున్న క్రమంలో కొందరు గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై బీజేపీ మండల అధ్యక్షుడు గోగుల రాజిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రచార రథం ఫ్లెక్సీని తొలగించిన నేపథ్యంలో మధుకర్పై కేసు నమోదు చేసినట్లు సీఐ డి.రవిరాజ్ తెలిపారు. రూ.3 లక్షల నగదు పట్టివేత డోర్నకల్ : డోర్నకల్ శివారు అమ్మపాలెం క్రాస్ చెక్పోస్టు వద్ద మంగళవారం ఓ వ్యక్తి వద్ద రూ.3 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గార్లకు చెందిన ఆశిష్ ద్విచక్రవాహనంపై డోర్నకల్ మీదుగా గార్ల వెళ్తుండగా సిబ్బంది తనిఖీ చేశారు. ఇందులో ఎలాంటి ఆధారాలు లేని రూ.3 లక్షలు లభ్యం కావడంతో సీజ్ చేసినట్లు డోర్నకల్ సీఐ బి.ఉపేందర్రావు తెలిపారు. -
మతతత్వ పార్టీతో జాగ్రత్తగా ఉండాలి
● ప్రొఫెసర్ కోదండరాంజనగామ రూరల్: తెలంగాణ ప్రజలు చైతన్యవంతం అయినప్పటికీ మతతత్వ పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో భారత్ బచావో సాధిక్ ఫౌండేషన్ ఆధ్వర్యాన ‘ప్రమాదంలో భారత రిపబ్లిక్–పౌరుల పాత్ర’ అనే అంశంపై మంగళవారం నిర్వహించిన సదస్సుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్తో కలిసి హాజరయ్యారు. కోదండరాం మాట్లాడుతూ.. మతం దేశంలో ఒక రాజకీయ అంశంగా మారిందని, విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా అధికారంలోకి రావడం ప్రమాదకరమన్నారు. పదేళ్లుగా భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను బీజేపీ అపహాస్యం చేసిందని విమర్శించారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ఇవ్వమంటే రైతులను జైలుకు పంపుతున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తూ దేశ సంపదను దోచిపెడుతున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రజాస్వామ్య బద్ధంగా పాలించే వారిని చట్ట సభలకు పంపాలని కోరారు. కార్యక్రమంలో సాధిక్ అలీ, విద్యావేత్త రియాజ్, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి, డాక్టర్ రాజమౌళి, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
No Headline
పెద్దవంగర: ప్రజలకు సేవ చేసేందుకే వరంగల్ పార్లమెంట్ నుంచి కడియం కావ్య పోటీ చేస్తున్నారని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని అన్నారు. సోమవారం మండల కేంద్రంతో పాటు చిన్నవంగర, చిట్యాల, బొమ్మకల్లు గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఇంటింటి వెళ్లి కడియం కావ్వ గెలుపు కోరుతూ ప్రచారం చేశారు. ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని కూలీలను కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో చెయ్యి గుర్తుకు ఓటు వేసి ప్రతిపక్షాలను తరిమికొట్టాలని కోరారు. బీఆర్ఎస్ పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుందని, ఆ పార్టీ నాయకుల మాయమాటలు విని ఓటు వేస్తే కష్టాలు కొనితెచ్చుకున్నట్లే అని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్కు అండగా ఉంటే రాహుల్గాంధీ ప్రధాని అవుతారని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ తోడుదొంగ పార్టీలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఆదరించినట్లుగానే పార్లమెంట్ ఎన్నికల్లో కడియం కావ్యను ఆదరించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడుసురేష్, తొర్రూరు పీఏసీఎస్ చైర్మన్ హరిప్రసాద్, సీనియర్ నాయకులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీపీ కల్పన, ఎంపీటీసీలు సౌజన్య, బానోతు రవీందర్, నాయకులు రవీందర్ రెడ్డి, రామకృష్ణరెడ్డి, హరికృష్ణ, కృష్ణ, శ్రీనివాస్, యాకయ్య, సైదులు, మహేష్, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
గంగారం: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. సోమవారం మండలంలోని పెద్ద ఎల్లాపురంతోపాటు పలు గ్రామాల్లో కాంగ్రెస్ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేసిన బలరాంనాయక్.. ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. అనంతరం గంగారంలో యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు అశోక్, ఏఐసీసీ ఆర్గనైజింగ్ సెట్రకరీ చల్లా నారాయణరెడ్డి, కాంగ్రెస్ కొత్తగూడ, గంగారం మండలాల అధ్యక్షులు వజ్జ సారయ్య, వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరబోయిన మొగిళి, జెడ్పీటీసీలు ఈసం రమ, విజయ రూప్సింగ్, ఎంపీపీలు సువర్ణపాక సరోజన జగ్గారావు, పుష్పలత, మాజీ సర్పంచ్లు చుంచ వెంకటలక్ష్మి, మద్దెల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
కేసముద్రం మార్కెట్లో రైతుల ఆందోళన
కేసముద్రం: ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను మార్కెట్కు తీసుకురాగా.. వ్యాపారులు టెండర్లు వేయకపోవడం, తక్కువ ధర పెట్టడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగిన ఘటన కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. చుట్టు పక్కల గ్రామాల నుంచి రైతులు ధాన్యాన్ని, మక్కలను అమ్మేందుకు మార్కెట్కు తీసుకొచ్చారు. ఈ మేరకు కొన్ని కూట్లకు టెండర్లు వేసి, మరికొన్ని కూట్లకు టెండర్ల వేయకుండా వదిలేశారు. అదేవిధంగా మరికొన్ని ధాన్యం కూట్లకు ఒకే వ్యాపారి తక్కువ ధర (రూ.1,901) పెట్టడంతో రైతులు ఆగ్రహించారు. తమ రాశులకు టెండర్లు ఎందుకు వేయలేదని, పైగా ఒకే వ్యాపారి తక్కువ ధరకు టెండర్ ఎలా వేస్తాడంటూ మార్కెట్ కార్యాలయానికి చేరుకుని, అధికారులను ప్రశ్నించారు. దీంతో మార్కెట్ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ అమరలింగేశ్వర్రావు, వ్యాపారులను, రైతు సంఘం నాయకుల పిలిపించి రైతుల సమక్షంలో మాట్లాడారు. ఈ మేరకు మంగళవారం తక్కువ ధర పెట్టిన కూట్లకు, టెండర్లు వేయని రాశులకు రీటెండర్ వేయిస్తామని రైతులకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, రైతుసంఘం నాయకులు సంకెపల్లి శ్రీనివాస్ రెడ్డి, వ్యాపారులు, అధికారులు పాల్గొన్నారు. తక్కువ ధర పెట్టారంటూ ఆగ్రహం -
ఫార్మసిస్ట్లకు త్వరలోనే మంచి వేతనాలు
ఎంజీఎం: ఫార్మసిస్టులకు త్వరలోనే మంచి వేతనాలు అందుతాయని తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్గౌడ్ అన్నారు. సోమవారం సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కందకట్ల శరత్బాబు అధ్యక్షతన డీఎంహెచ్ఓ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో జరిగిన హనుమకొండ, వరంగల్ జిల్లా కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 35 ఏళ్లుగా పీఆర్సీలలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్లకు అన్యాయం జరుగుతుందన్నారు. విద్యార్హతలు, విధులను పరిగణనలోకి తీసుకొని న్యాయం చేయాలని పీఆర్సీ కమిటీ విన్నవించామని, దీనిపై వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. అనంతరం సుదర్శన్గౌడ్ను సన్మానించారు. సమావేశంలో సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు దేవంభట్ల ప్రకాశ్రావు, హనుమకొండ జిల్లా కార్యదర్శి సుధాకర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అవినాష్, నాయకులు నార్ల వేణు, సూరయ్య, విజయలక్ష్మి, ఝాన్సీలక్ష్మి, శ్రీదేవి, సునీత పాల్గొన్నారు. -
ఓటు హక్కును వినియోగించుకోవాలి
మహబూబాబాద్: ఓటర్లు బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీపీఆర్వో ప్రేమలత అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మన్నకాలనీలో సోమవారం స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా డీపీఆర్వో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు బ్రహ్మాస్త్రం లాంటిందన్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకే పలు స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సాంస్కృతిక సారథి బృందం సభ్యులు మెరుగు రవీందర్, బండ వెంకన్న, ఆశకార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. -
పీఎం సెక్యూరిటీ ట్రయల్రన్
ఖిలా వరంగల్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు(బుధవారం) లక్ష్మీపురం మైదానంలో నిర్వహించే సభకు ప్రధాని మోదీ రానున్నా రు. దీంతోప్రధానమంత్రి భద్రతాధికారులు(సెక్యూరిటీ) సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి మామునూరు విమానాశ్రయానికి వచ్చారు. హెలిపాడ్ నుంచే అధికారులు విమానాశ్రయం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. హెలికాప్టర్ ద్వారా ట్రయల్ రన్ నిర్వహించారు. ఎస్పీజీ అధికారులు,ఈస్ట్జోన్ డీసీపీ రవీందర్, ఏసీపీ తిరుపతి పాల్గొన్నారు. నేడు వరంగల్ నగరంలో సీఎం రోడ్షో హన్మకొండ చౌరస్తా: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మంగళవారం వరంగల్ నగరంలో రోడ్షో, కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటలకు వరంగల్ తూర్పులోని పోచమ్మమైదాన్ జంక్షన్లో కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. 6గంటలకు వేయిస్తంభాల గుడి నుంచి హనుమకొండ చౌరస్తా వరకు రోడ్షో నిర్వహిస్తారని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. అనంతరం హనుమకొండ చౌరస్తాలో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తారని తెలిపారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
‘ఆరు గ్యారంటీ’లు అమలు చేస్తాం
డోర్నకల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీపథకాలను పక్కాగా అమలు చేస్తుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ తెలిపారు. మండలంలోని పెరుమాళ్ల సంకీస, చిలుకోడు, గొల్లచర్ల, చాప్లాతండా, అమ్మపాలెంతో పాటు డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సోమవారం ఆయన కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి బలరాంనాయక్ను గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ముగియగానే గ్యారంటీ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు గ్రామాల్లో ఓట్లడిగే పరిస్థితి లేదన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులంతా ఐకమత్యంతో ఇంటింటికీ తిరిగి ప్రజలను కలిసి కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్కు ఓటేయమని అభ్యర్థించాలని కోరారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాసం శేఖర్, పట్టణ అధ్యక్షుడు కాలా సుమేర్చంద్జైన్, నాయకులు బత్తుల శ్రీనివాస్యాదవ్, రాయల వెంకట్బాబు, ఆంగోత్ వెంకన్న, తారాచంద్, తాళ్లూరి హనుమంతరావు, లాలూనాయక్, పగడాల వెంకటేశ్వర్లు, మాదా శ్రీనివాస్, శీలం శ్రీనివాస్, నలబోలు శ్రీనివాస్, నానియాదవ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలినెహ్రూసెంటర్: ఆర్టీసీ ఉద్యోగులందరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మానుకోట డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్, డాక్టర్ రమ్యలత సూచించారు. ఆర్టీసీ గ్రాండ్ హెల్త్ చాలెంజ్ 2.0 కార్యక్రమం సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యులు రక్తపరీక్షలు నిర్వహించి ఉద్యోగులకు ఆరోగ్యంపై పలు సూచనలు, సలహాలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్ష నిమిత్తం పలువురినిఇ పెద్ద ఆస్పత్రులకు పంపించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి రామకృష్ణ, సిస్టర్ అరుణ, బి.కృష్ణంరాజు, బి.నిర్మల, ఆశ కార్యకర్త పద్మ, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. మార్కెట్కు వరుస సెలవులుకేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు ఈనెల 8నుంచి 14వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ అమరలింగేశ్వర్రావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యాపారుల కోరికతో పాటు, అమావాస్య, వారాంతరాలు, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వరుస సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. తిరిగి ఈనెల 15వ తేదీ నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు. హోం ఓటింగ్ పూర్తిమహబూబాబాద్: మానుకోట పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా దివ్యాంగులు, వయో వృద్ధుల హోం ఓటింగ్ ప్రక్రియ పూర్తయిందని డీడబ్ల్యూఓ వరలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మానుకోట, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 85 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులు 374 మంది, దివ్యాంగులు 383మంది దరఖాస్తు చేసుకోగా 713 మంది హోం ఓటింగ్ను సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు. ఈమేరకు 94 శాతం హోం ఓటింగ్ నమోదు అయినట్లు పేర్కొన్నారు. జెడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదామహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో జెడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా పడినట్లు ఇన్చార్జ్ జెడ్పీ సీఈఓ నర్మద సోమవారం తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేసినట్లు, జెడ్పీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు గమనించాలని ఆమె కోరారు. అర్చకుల సమావేశం వెంకటాపురం(ఎం): దేవాదాయశాఖ సహాయ కమిషనర్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని రామప్ప దేవాలయంలో సోమవారం ములుగు జిల్లాకు చెందిన ధూపదీప ఆలయాల అర్చకులు సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఆలయాలను రిజిస్ట్రేషన్ చేపించాలని, దేవాలయాల పేరిట భూములు ఉంటే వాటి వివరాలను ఎండోమెంట్ శాఖలో నమోదు చేయించాలని డివిజనల్ ఇన్స్పెక్టర్ అనిల్కుమార్, రామప్ప ఈఓ బిల్లా శ్రీనివాస్ అర్చకులకు సూచించారు. దేవాలయాల పేరు మీద బ్యాంకు ఖాతాలు తెరవాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు ముడుంబా రఘునాథచార్యులు, హరీశ్శర్మ, ఉమాశంకర్, ఆలయ సిబ్బంది మార్క సంతోష్, అవినాష్రెడ్డి, దామోదర్ పాల్గొన్నారు. -
వైద్యుల కొరత!
పెరుగుతున్న ఓపీ.. పీహెచ్సీలో ఓపీ కోసం రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ప్రతిరోజు 80 నుంచి 100 మంది వరకు పలు రకాల అరోగ్య సమస్యలతో ఆస్పత్రికి వస్తున్నారు. వైద్యురాలితో పాటు మరో పల్లెదవాఖాన వైద్యుడు, ఆర్బీఎస్కే వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా మండలంలో 13 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు(పల్లె దవాఖానలు) ఉండగా ము ల్కలపల్లి, వెన్నారంలో ఎంబీబీఎస్ వైద్యులు, డోర్నకల్–2, గొల్లచర్లలో బీఏఎంఎస్ వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన గ్రామాల్లో స్టాఫ్ నర్సులు(బీఎస్సీ నర్సింగ్) వైద్య సేవలు అందిస్తున్నారు. డోర్నకల్: డోర్నకల్ పీహెచ్సీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. వైద్యుల కొరతతో పాటు వసతులు, సిబ్బంది కేటాయింపులో ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా నలుగురు వైద్యులను కేటాయించగా రెండేళ్ల నుంచి ఒకే వైద్యురాలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె అందుబాటులో లేని సమయంలో పల్లెదవాఖాన వైద్యులు ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ విధులు నిర్వహించాల్సిన వైద్యురాలు ఉన్నత వైద్య విద్య కోసం సెలవుపై వెళ్లగా పోస్టు ఖాళీగా ఉంది. అలాగే రెండేళ్ల క్రితం దంత వైద్యుడు బదిలీ కాగా ఇప్పటి వరకు మరో వైద్యుడిని కేటాయించకపోవడంతో డెంటల్ లాబ్ నిరుపయోగంగా మారింది. ఆస్పత్రి బయట కార్యక్రమాలే ఎక్కువ.. గ్రామాల్లో వైద్య శిబిరాలు, పల్స్ పోలియో, ఎన్సీడీ శిబిరాలు, డెంగీ, మలేరియా, విషజ్వరాల శిబిరాలు నిర్వహిస్తుండటంతో వైద్యురాలు తరుచూ అందుబాటులో ఉండటం లేదు. వీటితో పాటు జిల్లా కేంద్రాల్లో సమావేశాలు, శిక్షణ శిబిరాలు, రివ్యూ మీటింగులకు వైద్యురాలు హాజరవుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే పీహెచ్సీ పరిస్థితిని సమీక్షించి వైద్య పోస్టులను భర్తీ చేయిస్తానని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదు. అధికారులు స్పందించి పీహెచ్సీలో వైద్యుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుని రోగులకు నిత్యం మెరుగైన సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు.డోర్నకల్ పీహెచ్సీలో సరిపడాలేని డాక్టర్లు వసతుల కల్పనలో నిర్లక్ష్యం రోగులకు అందని మెరుగైన వైద్యం పట్టించుకోని ఉన్నతాధికారులు -
వైద్యులు అందుబాటులో ఉండాలి
కేసముద్రం: ప్రతిరోజు పీహెచ్సీలో వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. వేసవికాలంలో కావాల్సిన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే వారికి వైద్యంతోపాటు తగు సలహాలు ఇవ్వాలన్నారు. అనంతరం ఆస్పత్రిలోని పలు రికార్డులను, రిపోర్టులను పరిశీలించారు. 108ని తనిఖీ చేసి, రికార్డులను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ నంబీకిషోర్, ఇన్చార్జ్ డీపీహెచ్ఎన్ఓ మంగమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలి.. గూడూరు: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని డీఎంహెచ్ఓ కళావతి అన్నారు. మండలంలోని తీగలవేణి పీహెచ్సీని సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది విధులకు హాజరవుతున్న రిజిస్టర్లు, మందుల నిల్వ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి పరిసర ప్రాంతాలను పరిశీలించి వైద్య సిబ్బందిని అభినందించారు. అనంతరం డాక్టర్ రాంబాబు, స్టాఫ్ నర్సు ఉదయశ్రీతో ఆస్పత్రిలో ప్రసవాల గురించి అడిగారు. ఎక్కువగా సాధారణ ప్రసవాలు జరిగేలా పని చేస్తున్నామని చెప్పడంతో డీఎంహెచ్ఓ సంతోషించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్య సిబ్బంది పీహెచ్సీలో సాధారణ ప్రసవాలు చేస్తారనే అవగాహన కల్పించాలని కోరారు. ఉత్తమంగా విధులు నిర్వహించే సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో యునాని డాక్టర్ కిరణ్కుమార్, స్టాఫ్ నర్స్ ఉదయశ్రీ, సూపర్వైజర్ షానుబేగం, సిబ్బంది పాల్గొన్నారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement