-
అకాల వర్షానికి కూలిన ఇల్లు
వాంకిడి: మంగళవారం ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి మండలంలోని ఖిరిడి గ్రామంలో సురేష్కు చెందిన పెంకుటిల్లు కుప్పకూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సురేష్కు చెందిన ద్విచక్రవాహనం ధ్వంసమైంది. అకాల వర్షంతో తనకు సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఆస్తినష్టం జరిగిందని వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. భూమిలో కలిసిన ఇంకుడు గుంతలు భీమారం: గతంలో భీమారం అడవుల్లో అటవీశాఖ నిర్మించిన ఇంకుడుగుంతలు ప్రస్తుతం భూమిలో కలిసి పోయాయి. దీంతో వర్షాకాలంలో వరద నీరు వాగుల్లోకి వృథాగా పోతోంది. పదిహేనేళ్ల క్రితం అటవీశాఖ వర్షం నీటిని వృథాగా పోనీయకుండా అక్కడక్కడా ఇంకుడు గుంతలు నిర్మించింది. దీంతో వర్షపునీరు అందులోనే నిల్వ ఉండి భూమిలోనే ఇంకిపోయేలా చర్యలు చేపట్టారు. కానీ వాటిలో ఉన్న మట్టిని ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో నేడు అవి మట్టితో నిండి పోయాయి. తిరిగి నిర్మించాల్సి ఉండగా వాటిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపడంలేదు. మరో నెలరోజుల్లో వర్షాలు కురియనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఈజీఎస్ ద్వారా చేపడుతున్న ఉపాధి పనుల్లో భాగంగా అడవుల్లో ఇంకుడు గుంతలు నిర్మిస్తే బాగుంటుందని ప్రజలు సూచిస్తున్నారు. -
పాకురు నీళ్లలో ఈదేదెలా?
● పంపింగ్ మోటార్లు పనిచేయక రీసైక్లింగ్ కాని వాటర్ ● నెలరోజులుగా అస్తవ్యస్తంగా స్విమ్మింగ్ పూల్ ● నిర్వహణ లోపమే ప్రధాన కారణమని అభిప్రాయాలు రామకృష్ణాపూర్: పట్టణంలోని సింగరేణి ఆఫీసర్స్ క్లబ్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ అస్తవ్యస్తంగా మారింది. నీరు ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ కాకపోవడంతో నీలిరంగు టైల్స్కు నిలువుటద్దం పట్టే నీళ్లు ముదురు ఆకుపచ్చ రంగులో దర్శనమిస్తున్నాయి. పంపింగ్ మోటర్లు పనిచేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మోటార్ల మరమ్మతులకు రూ.2 లక్షల వ్యయం అవుతుందని తెలిసి చేతులెత్తేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. పర్యావసానంగా సమ్మర్ కాలాన్ని సరదాగా ఈతకొలనులో సాగిద్దామని భావించిన విద్యార్థులు, యువత నిరాశ, నిస్పృహకు గురవుతోంది. ఇలాంటి నీటిలో ఈది అంటువ్యాధులు కొనితెచ్చుకోవడం దేనికని సంశయానికి గురవుతోంది. సింగరేణి కార్మికులు, ఉద్యోగులు వారి పిల్లలతో పాటు బయటవారి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ నేడు ఇలా మారటం గమనార్హం. మరమ్మతులకు రూ.2 లక్షలు .. ప్రస్తుతం స్విమ్మింగ్ పూల్లో ఉన్న పంపింగ్ మోటర్ల మరమ్మతులకు రూ.2 లక్షల వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీంతో పనులకు బ్రేక్ పడింది. దాదాపు 150 మంది విద్యార్థులు, యువకులు రోజువారీ స్విమ్మింగ్ చేసేందుకు వస్తుంటారు. ఉద్యోగుల పిల్లలకై తే రూ.100, కార్మికేతరులకు రూ.500, వారి పిల్లలకు రూ.400 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దీనికి తోడు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఇన్ని చేసి నేడు ఈతకు వెళ్తామంటే భయమేస్తోందని విద్యార్థులు, యువత వాపోతున్నారు. ఆకుపచ్చ రంగులో ఉన్న నీటిలో ఈది లేనిపోని వ్యాధులు కొనితెచ్చుకోవడం దేనికని అంటున్నారు. లక్షల వ్యయంతో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ఇలా సేవలకు దూరంగా ఉంటే ఎలాగని మదనపడుతున్నారు. మరమ్మతులు చేపట్టండి సారూ.. ఇప్పటికే రామకృష్ణాపూర్లో అన్నింటినీ మూసివేస్తూ వస్తున్న సింగరేణి ఉన్నతాధికారులు స్విమ్మింగ్ పూల్ను సైతం ఎత్తివేసే యోచనలో ఉన్నారా? అనే సందేహాలు లేకపోలేదు. కొద్దిరోజులుగా ఇలాంటి పరిస్థితే ఉండటంతో సహజంగానే ఈ అనుమానం కలుగుతోంది. కార్మికులు వారి పిల్లల సందేహం దూరం కావాలంటే ఇప్పటికై నా అధికారులు స్పందించి స్విమ్మింగ్ పూల్ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన మోటార్లకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
దాడికి పాల్పడిన కేసులో ఒకరికి జైలు
మంచిర్యాలక్రైం: ముగ్గురిపై దాడి చేసి గాయపర్చిన వ్యక్తికి స్థానిక న్యాయమూర్తి అర్పిత మారంరెడ్డి ఐదేళ్ల జైలుశిక్ష రూ.వెయ్యి జరిమానా విధించినట్లు స్థానిక సీఐ బన్సీలాల్ తెలిపారు. 2016 సెప్టెంబర్ 17న మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘడ్పూర్ గ్రామ పంచాయతీలోని బాబానగర్కు చెందిన సండ్ర లక్ష్మణ్, అనిల్, అశోక్పై అదే గ్రామానికి చెందిన మనుబోతుల శ్రీనివాస్ గొడ్డలి, కత్తితో దాడిచేసి గాయపరిచాడు. లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై వేణుగోపాల్రావ్ శ్రీనివాస్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పీపీ మదన్మోహన్రావ్ సాక్షులను కోర్టులో ప్రవేశ పెట్టగా నేరం రుజువు కావడంతో జడ్జి జైలుశిక్ష ఖరారు చేశారు. -
‘పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం’
భీమిని: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని ఆపార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం భీమిని, కన్నెపెల్లి మండలాల్లో బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పదేళ్లలో దేశాన్ని భ్రష్టుపట్టించిందన్నారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ పేద ప్రజలకు అన్యాయం చేసిందన్నారు. అనంతరం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ ఎన్నికల్లో వంశీని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాదరవరపు నర్సింగరావు, భీమిని, కన్నెపెల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, రామాంజనేయులు, నాయకులు శ్రీహరిరావు, రాకేష్ శర్మ, సంతోష్కుమార్, నవీందర్ రావు, బట్టు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
‘వంశీకృష్ణను రెండు లక్షల మెజార్టీతో గెలిపిస్తాం’
చెన్నూర్: ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను రెండు లక్షల ఓట్ల మె జా ర్టీతో గెలిపిస్తామని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి అన్నారు. బుధవారం జలాల్ పెట్రోల్ బంక్ నుంచి పట్టణ ప్రధాన వీధుల్లో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలపై ప్ర జలకు నమ్మకం కలిగిందన్నారు. పార్లమెంట్ ఎ న్నికల్లో ప్రజలు కాంగ్రెస్ను గెలిపిస్తారని ఆశాభా వం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజారంలో ఎమ్మెల్యే వివేక్ పర్యటన కోటపల్లి: మండలంలోని కొత్తపల్లి రాజారం గ్రామ పంచాయతీలో బుధవారం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో అభివృద్ధి జరగడంలేదని, పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు తీర్మానం చేశారు. దీంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించగా గ్రామస్తులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎన్నికల బహిష్కరణ సమస్యకు పరిష్కారం కాదని, ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గ్రామస్తులకు సూచించారు. ఎన్నికల కోడ్ ముగియగానే గ్రామంలో పర్యటించి సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
ధాన్యం కమీషన్ పెండింగ్
● ఇబ్బందులు పడుతున్న మహిళా సంఘాల సభ్యులుపాతమంచిర్యాల: ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న మహిళా సంఘాల సభ్యులకు కమీషన్ డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 135 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా 100 కేంద్రాలను మహిళా సంఘాల సభ్యులు నిర్వహిస్తున్నారు. ఇందుకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం క్వింటాకు రూ.32 కమీషన్ ఇస్తుంది. ఇందులోనే నిర్వాహకులు టెంట్, ఫ్లెక్సీలు, నీటి వసతి, ట్యాబ్ల కొనుగోలు, తేమ కొలిచే సాధనాలు సమకూర్చు కోవాల్సి ఉంటుంది. సెంటర్లో పని చేసినందుకు కూలీ కూడ కమీషన్ నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. సెంటర్ల నిర్వహణ ద్వారా వచ్చిన కమీషన్ నిర్వాహకులు కూలీ డబ్బులు, ఇతర ఖర్చులు పోనూ మిగిలిన మొత్తాన్ని మహిళా సంఘాల సభ్యులు రుణంగా తీసుకుని వడ్డీతో సహా మహిళా సంఘం ఖాతాలో జమ చేస్తారు. మహిళా సంఘాల ద్వారా 2022–24 ఖరీఫ్ సీజన్ వరకు 3,97,298 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు. కానీ 2022–23 ఖరీఫ్, యాసంగి, 2023–24 ఖరీఫ్కు సంబంధించిన కమీషన్ రూ.2,38,57,694 ప్రభుత్వం విడుదల చేయలేదు. కొనుగోళ్ల సీజన్ ముగిసిన తర్వాత కమీషన్ డబ్బులు విడుదలవుతాయని నిర్వాహకులు ఆశపడినా కమీషన్ రాకపోవడంతో నిరాశే ఎదురౌతుందని మహిళా సంఘాల సభ్యులు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోళ్లకు సంబందించిన కమీషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
విడుదల చేయాలి
2020లో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కమీషన్ రూ.2 లక్షల వరకు రావాల్సి ఉంది. సొంత ఖర్చులతో సెంటర్ నిర్వహించాం, అప్పులు చేసి సామాగ్రి కొనుగోలు చేసుకున్నాం. నాలుగేళ్లు సెంటర్ నిర్వహణ తీసుకోలేదు. 2024 యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. పెండింగ్ కమీషన్ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – గుర్రాల కళావతి, ప్యాడి సెంటర్ నిర్వాహకురాలు, దొనబండ రూ.2 లక్షలు రావాలి వరిధాన్యం కొనుగోలు కమీషన్ రూ.2 లక్షలు రావాల్సి ఉంది. కమీషన్ గురించి అధికారులను అడుగుతుంటే సమాధానం ఇవ్వడం లేదు. కష్టపడి సెంటర్ నడిపించాం. మా కష్టానికి ఫలితం దక్కడంలేదు. కమీషన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాం.– ఆత్రం యశోద, సెంటర్ నిర్వాహకురాలు -
వీహెచ్పీ, బజరంగ్ దళ్ నిరసన
శ్రీరాంపూర్: అయోధ్య రామమందిరం నిర్మాణంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ వ్యాఖ్యలకు నిరసనగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. బుధవారం శ్రీరాంపూర్ బస్టాండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందువుల మనోభావాలు దెబ్బతిసేలా మాట్లాడారని అన్నారు. వారు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ జిల్లా ఉపాధ్యక్షురాలు కనకతార, జిల్లా కార్యదర్శి వేముల రమేశ్, బజరంగ్దళ్ పట్టణ నాయకులు కొర్ర నాగార్జున, నాయకులు పెర దివ్య, రాకేశ్, విద్యాసాగర్ పాల్గొన్నారు. -
మత్తులో పల్లెలు
● గ్రామాల్లో నాటుసారా తయారీ, అమ్మకాల జోరు ● కానరాని కట్టడి చర్యలు ● అంతంతమాత్రంగా దాడులుదాడులు నిర్వహిస్తున్నాం నాటుసారా తయారీ, అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించాం. రోజువారీగా నిర్ధేశించిన గ్రామాల్లో ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నాం. నాటుసారా బట్టీలను ధ్వంసం చేస్తున్నాం. కాచిన సారాను స్వాధీనం చేసుకుని తయారీదారులపై కేసులు నమోదు చేస్తున్నాం. కౌన్సిలింగ్ నిర్వహించి తప్పుడు పద్ధతులు మానాలని సూచిస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా నాటుసారా తయారుచేసినా విక్రయించినా ఎవరినీ ఉపేక్షించేది లేదు. – జె.ఇంద్రప్రసాద్, ఎకై ్సజ్ సీఐ, బెల్లంపల్లి బెల్లంపల్లి/చెన్నూర్: గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారా తయారీ, అమ్మకాలు అడ్డగోలుగా సాగుతున్నాయి. పల్లె ప్రాంతాలను ఆనుకుని ఉన్న అటవీ శివారు ప్రాంతాలను ఎంచుకుని నాటుసారా తయారు చేస్తున్నారు. కొందరు రహస్య ప్రాంతాల్లో గుడుంబా తయారు చేసి ఫాల్తీన్ కవర్లలో నింపి ఇతర గ్రామాలకు తరలించి అమ్మకాలు చేస్తున్నారు. ఎకై ్సజ్, పోలీసుల నియంత్రణ చర్యలు అంతంతమాత్రం కావడంతో ‘మూడు బట్టీలు.. ముప్పై సీసాలు’గా గుడుంబా ఉత్పత్తి చేసి క్రయ విక్రయాలు చేస్తున్నారు. అటవీ శివారు ప్రాంతాలే అడ్డా.. అసెంబ్లీ నియోజకవర్గంలో బెల్లంపల్లి, తాండూర్, నెన్నెల, కన్నెపల్లి, భీమిని, వేమనపల్లి, కాసిపేట మండలాల్లోని వివిధ గ్రామాల అటవీ శివారు ప్రాంతాలు, వాగులు, చెట్ల పొదలమాటున బట్టీలు ఏర్పాటు చేసి డ్రమ్ముల కొద్దీ నాటుసారా తయారుచేస్తున్నారు. ఇటీవల బెల్లంపల్లి మండలం పెద్దదుబ్బ గ్రామ అటవీ శివారు ప్రాంతంలో రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి గుడుంబా బట్టీలను ధ్వంసం చేయడం అందుకు ని దర్శనంగా నిలుస్తోంది. వాగులను ఆనుకుని డ్ర మ్ముల్లో రోజువారీగా వేల లీటర్ల గుడుంబా ఉత్పత్తి చేస్తున్నారంటే నమ్మశక్యం కాకున్నా నమ్మితీరాల్సిన వాస్తవమని గ్రామీణులు పేర్కొంటున్నారు. ప్రమాదకరమైన పదార్థాలతో తయారీ.. అత్యంత హానికరమైన పదార్థాలతో నాటుసారా తయారుచేస్తున్నారు. ఇప్పపూల వాసన లేకపోగా బెల్లం, పటిక, యూరియా, కుళ్లిపోయిన పండ్లు, అరటి తొక్కలు, చివరికి తోలుచెప్పులను ఆయా పదార్థాలతో పులియబెట్టి గుడుంబా కాస్తున్నారు. నిషా రావడానికి కొందరు ఎండ్రీన్ సీసాలో చీపురు పుల్లను ముంచి ఆ పుల్లకు అంటిన ఎండ్రీన్ను తయారైన గుడుంబాలో కలిపేస్తున్నారు. ఆ నాటుసారాను తాగిన మద్యం ప్రియులు మత్తులో తేలియాడుతున్నారు. అందుకే బ్రాంది జోలికి వెళ్లకుండా అత్యధిక మంది గుడుంబాకు ఆకర్శితులవుతున్నారు. ఇంత జరుగుతున్నా గ్రామాలల్లో ఎకై ్సజ్, పోలీసుల దాడులు కానరావడం లేదు. అడపా దడపా మొక్కుబడిగా దాడులు చేసి నట్లు చేసి మమ అనిపిస్తున్నారు. వాహనాల తనిఖీల్లో పట్టుబడుతున్న గుడుంబాను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారే తప్పా చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బెల్ట్షాపుల బంద్తో.. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సుమారు నాలుగు నెలలు, ప్రస్తుత ఎంపీ ఎన్నికల సందర్భంగా రెండు నెలలుగా గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు బంద్ అయ్యాయి. దీంతో మ ద్యం ప్రియులు గుడుంబాను ఆశ్రయించాల్సి న దుస్థితి నెలకొంది. మద్యం ప్రియుల అలవాట్లను ఆసరా చేసుకొని గుడుంబా తయారీ కేంద్రాలు వెలిసినట్లు ప్రచారం జరుగుతోంది.బెల్లంపల్లి నియోజకవర్గంలో.... బెల్లంపల్లి మండలంలోని మాలగురిజాల, లంబా డి తండా, పెర్కపల్లి, రంగపేట, బట్వాన్పల్లి, పె ద్దదుబ్బ, ఆకెనపల్లి, చంద్రవెల్లి, చాకేపల్లి తది తర గ్రామాల్లో, కన్నెపల్లి మండలంలోని కన్నెపల్లి, జన్కాపూర్, దాంపూర్, నాయకునిపేట, ఎల్లారం, తదితర పల్లెల్లో, వేమనపల్లి మండలంలోని బు య్యారం, నాగారం, జాబులపేట, వేమనపల్లి, సుంపుటం గ్రామాల్లో, నెన్నెల మండలంలోని లంబాడితండా, చిత్తాపూర్, ఆవుడం, శ్రావణ్పల్లి, జె ండా వెంకటాపూర్, ఖర్జీ, దమ్మిరెడ్డిపేట, కొ త ్తూరు, మైలారం, తాండూర్ మండలంలోని తంగళ్లపల్లి, నీలయ్యపల్లె, మాదారం త్రీ, మాదారం 5 ఇంక్లైన్, అచ్చులాపూర్, భీమిని మండలంలోని చిన్నగుడిపేట, భీమిని, కేస్లాపూర్, కాసిపేట మండలంలోని కర్షలఘటం, వరిపేట, కోమటిచేన్ గిరిజన గ్రామాలు గుడుంబా తయారీకి కేంద్రాలుగా ఉన్నాయి. పలు గ్రామాల్లో నాటుసారాా తయారీ అవుతుండగా ఇతర గ్రామాలకు ప్యాకెట్ల రూపంలో రవాణా చేసి విక్రయాలు చేస్తున్నారు. -
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కొత్త గనులు
శ్రీరాంపూర్: కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కొత్త గనులు త్వరగా వస్తాయని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు అన్నారు. బుధవారం ఎస్సార్పీ 3, 3ఏ, ఎస్సార్పీ 1 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కొత్త గనుల ఏర్పాటు కొరకు అవసరమైన చర్యలు చేపడుతుందని, ఇదే సమయంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సింగరేణికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం గద్దె దిగితేనే బొగ్గు గనుల ప్రైవేటీకరణ ఆగుతుందన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించామని, వాటి పరిష్కారానికి వారు సానుకూలంగా ఉన్నారన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే సింగరేణి కార్మికులకు కొత్త హక్కులు, సదుపాయాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బీ.జనక్ ప్రసాద్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు కావాలంటే కాంగ్రెస్ను ఆదరించాలన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు జట్టి శంకర్రావు, జాతీయ సమితి సభ్యులు సీహెచ్ భీంరావు, కేంద్ర నాయకులు గరిగే స్వామి, కలవేన శ్యామ్, తదితరులు పాల్గొన్నారు. -
‘బీజేపీని గద్దె దించాలి’
శ్రీరాంపూర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుతాన్ని గద్దె దించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. బుధవారం ఆర్కే 6 గనిలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేయడం, బొగ్గు గనులను ప్రైవేటు పరం చేయడం, కార్మిక చట్టాలను సవరించి వ్యతిరేక చట్టాలను చేసి కార్మికవర్గానికి నష్టం కలిగించారన్నారు. ఇలాంటి సర్కార్కు ఈ ఎన్నికల్లో ఓటర్లు బుద్ధి చెప్పి పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ గెలిస్తే సింగరేణిలో సొంతింటి పథకం, పెర్క్స్పై ఆదాయ పన్ను మాఫీ చేస్తామని హామి ఇచ్చారన్నారు. యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు వీరభద్రయ్య, ముస్కె సమయ్య, బ్రాంచి సెక్రెటరీ బాజీసైదా, నాయకులు చంద్రమోహన్ పాల్గొన్నారు. ‘శబరిమలలో టీటీడీ మాదిరిగా సౌకర్యాలు కల్పించాలి’మంచిర్యాలఅర్బన్: తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా కేరళ ప్రభుత్వం శబరిమలలో భక్తులకు సౌకర్యాలు కల్పించాలని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ (ఏబీఏపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తిరుమల్రావు అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ కేరళా ట్రావెన్ కోర్ దేవస్థానం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోరాదన్నారు. రోజుకు 80 వేల మంది భక్తులకు మాత్రమే అయ్యప్ప దర్శనం చేసుకునేలా వర్చువల్ (ఆన్లైన్) బుకి ంగ్పై పరిమితి విధించడాన్ని తీవ్రంగా ఖండిచారు. శబరిమలకు రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతున్నందువల్ల కేరళ ప్రభుత్వం ట్రావెన్కోర్ దేవస్థానం వసతులు పెంచి అధిక సంఖ్యలో దర్శనం చేసుకునేలా చూడాలన్నారు. -
2,308 ఎకరాల్లో పంట నష్టం
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి దిగుబడి దశలో ఉన్న పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు బుధవారం ప్రాథమిక సర్వేలో గుర్తించారు. 10 మండలాల్లోని 70 గ్రామాల్లో 1,563 మంది రైతులకు చెందిన 2,308 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు తేల్చారు. పంట నష్టాన్ని అంచనా వేసి వ్యవసాయ కమిషనరేట్కు నివేదిక పంపిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ తెలిపారు. మండలం గ్రామాలు ఎకరాలు రైతులుదండేపల్లి 2 17 9 చెన్నూర్ 19 1060 729 జైపూర్ 7 537 366 భీమారం 7 90 50 కోటపల్లి 2 32 25 బెల్లంపల్లి 2 38 38 తాండూర్ 8 139 88 భీమిని 6 120 38 కన్నెపల్లి 10 95 90 వేమనపల్లి 7 180 130 -
రిజర్వేషన్లు తీసివేతకు బీజేపీ కుట్ర
● రాహుల్ను ప్రధానిని చేస్తేనే మేలు ● ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ● నిర్మల్లో పార్టీ నేతలతో సమావేశంనిర్మల్చైన్గేట్: దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు తీసివేయడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశానికి పార్టీ తెలంగాణ ఇన్చార్జి దీపాదాస్ మున్షీతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటమి భయంతో ప్రధాని మోదీ దేశంలో మత వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడి దేశంలో లౌకికవాదాన్ని నిలబెట్టాలని ప్రజల కోసం పోరాడుతున్న రాహుల్గాంధీని ప్రధానిని చేయాలంటే ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు తొలగించాలని కుట్ర చేస్తున్న మోదీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని, బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని తెలిపారు. రైతు భరోసా విషయంలో రైతులను తప్పుదోవ పట్టించేలా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. ఓబీసీ కులగణన ద్వారా దేశ సంపద, రాజ్యాధికారంలో జనాభా దామాషా ప్రకారం వాటా లభిస్తుందని రాహుల్గాంధీ బీజేపీ పాలకులకు పలుసార్లు విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు. రాహుల్గాంధీ ఆలోచన మేరకు రాష్ట్రంలో కులగణన ప్రారంభించామని, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలోనూ చేపడతామని పేర్కొన్నారు. జనాభా దామాషా ప్రకారం హక్కులు, సంపద కల్పిస్తామని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం సాగు నీరు ఇవ్వకుండా ఆదిలాబాద్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల తర్వాత ప్రాణహితను నిర్మించి ఉమ్మడి జిల్లాలోని లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. జిల్లాలో భూములపై ఆదివాసీ గిరిజనులకు ఉన్న హక్కులను ధరణి ద్వారా గత పాలకులు ఛిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. ట్రైబల్, నాన్ ట్రైబల్ ప్రజల భూసమస్యలు పరిగణనలోకి తీసుకుని వారికి త్వరలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఐటీడీఏలకు పూర్వవైభవం తీసుకువస్తామని తెలిపారు. అకాల వర్షం, గాలి దుమారానికి పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, నష్టం అంచనాకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ప్రశ్నించే గొంతుక ఆత్రం సుగుణను ఎంపీగా గెలిపించుకుంటే అమాయక గిరిజన, ఆదివాసీ ప్రజల గళాన్ని పార్లమెంట్లో వినిపించి వారి హక్కుల సాధనకు పోరాటం చేస్తారని తెలిపారు. మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ను గెలిపించాలి
● బీజేపీ పాలనలో పెరిగిన అసమానతలు ● టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంబెల్లంపల్లి: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీని పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం కోరారు. బుధవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రడగంబాల బస్తీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పదేళ్ల పాలనలో దేశంలో అసమానతలు పెరిగాయని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాకముందు దేశంలో 50 మంది బిలియనీర్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 162 మందికి చేరిందని ఆరోపించారు. బిలినీయర్ల ఆస్తులు గణనీయంగా పెరగగా ప్రజల జీవన ప్రమాణాలు తగ్గాయని పేర్కొన్నారు. 25 వేల కోట్లు ఉన్న ఆదానీ ఆస్తులు బీజేపీ అధికారంలో ఉన్న కాలంలో ఏడున్నర లక్షల కోట్లకు చేరుకున్నాయని వివరించారు. పెట్రోలియం ఉత్పత్తులు, జీఎస్టీ పేరుతో దేశ ప్రజలపై రూ.58 వేల కోట్ల పన్నుల భారాన్ని మోపిందని విమర్శించారు. రైతుల పంట రుణాలు మాఫీ చేయలేదని, నిరుద్యోగం 2శాతం నుంచి 8శాతానికి ఎగబాకగా ప్రతీ ముగ్గురిలో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేస్తోందని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మునిమంద రమేష్, దావ రమేష్, ఎం.మల్లయ్య, ప్రభాకర్, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు బాబన్న తదితరులు పాల్గొన్నారు. -
● సెగ్మెంట్లలో ఓట్లు తగ్గితే ఇబ్బందులే.. ● కొత్త, పాత నాయకుల్లో కుదరని సఖ్యత ● కేడర్లో వర్గపోరు, అంతర్గత కుమ్ములాట ● ప్రతిష్టాత్మకంగా మారిన ఎంపీ ఎన్నికలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: లోక్సభ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బలానికి పరీక్షగా మారాయి. పార్టీలో ప్రాధాన్యత, భవిష్యత్లో గుర్తింపు దక్కాలన్నా ఈ ఎన్నికల్లో సాధించే ఓట్లే కీలకంగా మారనున్నాయి. ఈ క్రమంలో తమ ఓటు బ్యాంకును పెద్దపల్లి లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించేలా కష్టపడుతున్నారు. మొదట తమ అనుకూల వారికే ఎంపీ టికెట్ రావాలని ఆశించినా తప్పనిసరి పరిస్థితుల్లో అధిష్టానం ఎంపిక చేసిన వారికి మద్దతుగా నిలబడ్డారు. జిల్లాలో మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, ఖానాపూర్(జన్నారం) నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ పార్టీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులను గెలిపించాలంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తమ అనుచర, కేడర్తో నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే అధికంగా మెజార్టీ తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాలు గడ్డం సోదరులు వినోద్, వివేక్ పరిధిలో ఉండగా, మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, ఖానాపూర్ పరిధిలో ఎమ్మెల్యే బెడ్మ బొజ్జు చెమటోడుస్తున్నారు. వర్గపోరు, అంతర్గత కుమ్ములాట అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను దెబ్బతీసి ఎదిగిన కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నాయకుల మధ్య వర్గపోరు, అంతర్గత కుమ్ములాట ప్రారంభం కావడంతో అయోమయం నెలకొంది. అసెంబ్లీ ఫలితాలు వెల్లడైన నాలుగు నెలలకే రెండో ఎన్నికను ఎదుర్కొంటున్న కేడర్కు గతంలో కంటే ప్రస్తుతం భిన్న పరిస్థితి ఎదురవుతోంది. పార్టీలో ఉన్న పాత నాయకులు, కొత్తగా చేరుతున్న వలస నాయకుల మధ్య సఖ్యత కొరవడింది. మున్సిపాల్టీల్లో మెజార్టీ నాయకులు, కౌన్సిలర్లు ‘హస్తం’ పార్టీలో చేరారు. అయితే పాత, కొత్త కలయికతో ఇబ్బందులు వస్తున్నాయి. కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని పాత వారంటే.. పాత రాకతో తమకు తగిన గుర్తింపు ఎక్కడుందని మరికొందరు అంటున్నారు. మంచిర్యాల, నస్పూర్, లక్సెట్టిపేట, చెన్నూర్, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి పట్టణాల్లో వర్గాలుగా ఉన్నారు. సింగరేణి కార్మిక అనుబంధ సంఘాల్లోనూ కొత్తవారి రాకను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల తాండూర్లో బహిరంగంగానే నాయకులు దూషించుకున్నారు. మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో కొత్తగా పార్టీలోకి వెళ్తున్న వారికి తగిన ప్రాధాన్యత లేదనే భేదాభిప్రాయాలు వస్తున్నాయి.ఎన్నికల గండం గట్టెక్కితేనే..పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇన్నాళ్లు ప్రతిపక్ష పాత్ర పోషించిన నాయకులు పదవులు దక్కించుకోవాలనే ఆరాటంలో ఉన్నారు. ఏళ్లుగా జెండా మోసిన కార్యకర్తలు, నాయకులు పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్త వారి రాకను తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పదవులను ఆశించి చేరుతున్న వారితో తమకు ముప్పు ఉందని భావిస్తున్నారు. పార్టీ పదవులు, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికార పదవుల్లో తమ అవకాశాలను వలస నాయకుల రాకతో దెబ్బతీస్తారనే ఆందోళన నెలకొంది. దీంతో ఇతర పార్టీల నుంచి కొత్త వారు పార్టీలో చేరుతున్న క్రమంలో వారి చేరికకు అడ్డుగా ఉంటున్నారు. చాలా చోట్ల నాయకుల పార్టీలో చేరికలు ఆగిపోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లుగా పోటీ చేసే అవకాశాలు ఎక్కడ కోల్పోతామోననే టెన్షన్ నెలకొంది. పార్టీలో క్రమంగా ఆశావహుల సంఖ్య పెరగడం, ఎమ్మెల్యేలు సైతం కొత్తవారిని ప్రోత్సహించడంతో పాత కేడర్ నారాజ్లో ఉంది. గతంలో కొత్త వారిని చేర్చుకునే అవకాశం లేదని చెప్పిన ప్రజాప్రతినిధులే మళ్లీ ఎంపీ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు కోసం అందరినీ పార్టీలో చేర్చుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. దీంతో నాయకుల్లో అంతర్గత అసంతృప్తి గూడుకట్టుకుంటోంది. లోక్సభ ఎన్నికల గండం గట్టెక్కే వరకు వర్గపోరు, అంతర్గత కుమ్ములాటలు బయటకు రాకుండా చూడాలి చెబుతున్నా, అక్కడక్కడ బయటపడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎంపీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయోనని కేడర్ చర్చించుకుంటున్నారు. -
శాస్త్రవేత్తలుగా ఎదగడానికి సైన్స్ క్యాంపు దోహదం
మంచిర్యాలఅర్బన్: విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి సమ్మర్ సైన్స్క్యాంపు ఎంతో దోహదం చేస్తుందని ఆర్డీవో రాములు అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా సైన్స్ కేంద్రంలో వేసవి సైన్స్ శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 12రోజులుగా విద్యార్థులకు విజ్ఞానం, ప్రయోగత్మక నైపుణ్యాలు పెంపొందిస్తూ అనేక అంశాలు నేర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించి వాటి పనితీరు తెలుసుకున్నారు. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్వో మధుబాబు, సెక్టోరల్ అధికారి చౌదరి, డీటీ గడియారం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
యువత చేతుల్లోనే దేశ పాలన
● ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావుమంచిర్యాలటౌన్: దేశంలో ఏ పార్టీ పాలన చేపట్టాలన్నా యువత చేతుల్లోనే ఉందని, దేశ భవిష్యత్ దృష్ట్యా యువత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాలులో బుధవారం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ యువ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు, మహిళల మద్దతు లేకుంటే ఏ పార్టీ మనుగడలోకి రాదని, కులం, మతం పేరుతో విద్వేషాలు రగిలించాలని యత్నించే పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి మార్గాలు కల్పిస్తానని, సామాన్యులకు మెరుగైన వైద్యం అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తానని పునరుద్ఘాటించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం తథ్యమని అన్నారు. నరేంద్ర మోదీ ప్రతియేటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి పదేళ్లు అధికారంలో ఉన్నా ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రేమ్సాగర్రావు, వివేక్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మరో రెండ్రోజులు వర్ష సూచన
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో కొద్ది రోజులుగా 46డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా మంగళవారం నుంచి బుధవారం వరకు 15.5మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఎండ, వడగాలులతో ఉక్కిరిబి క్కిరి అయిన జనాలకు వర్షంతో కాస్త ఉపశమనం లభించింది. జిల్లాలో మరో రెండ్రోజులూ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చేస్తోంది. దీంతో సాధారణ జనానికి ఊరట లభిస్తుండగా.. రైతులకు ఆందోళన కలిగిస్తోంది. కోతకు వచ్చిన వరి, మామిడి పంట ఎక్కడ నేలరాలుతుందోనని, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం ఎక్కడ తడిసిపోతుందోనని గుబులు చెందుతున్నారు. ఇప్పటికే నష్టపోగా మరోమారు ఈదురుగాలుల వర్షం వస్తే మరింత నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో నమోదైన వర్షపాతం వేమనపల్లి మండలంలో 43.1మిల్లీమీటర్లు, తాండూర్లో 23.4, మందమర్రిలో 23, కన్నెపల్లిలో 20.4, చెన్నూర్లో 20.5, కోటపల్లిలో 15.4, మంచిర్యాలలో 15, భీమారంలో 14.5, జైపూర్లో 13.1, జన్నారంలో 13.5, కాసిపేటలో 13.2, బెల్లంపల్లిలో 13.8, నస్పూర్లో 10.4, హాజీపూర్లో 7.2, దండేపల్లిలో 6.2, నెన్నెలలో 7.2, లక్సెట్టిపేటలో 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఓటేసిన అదనపు కలెక్టర్ రాహుల్బెల్లంపల్లి: పార్లమెంటు ఎన్నికల్లో బెల్లంపల్లి అ సెంబ్లీ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధి కారి, జిల్లా అదనపు కలెక్టర్ బి.రాహుల్ బుధవా రం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బె ల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలోని ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు ప్రాధాన్యతను ప్రజలకు వివరించి చైతన్యం తీసుకు రావడానికి ప్రచార కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. -
పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలి
కాసిపేట: ఈ నెలాఖరులోగా అమ్మ ఆదర్శ పా ఠశాలల్లో పనులు పూర్తి చేయాలని జిల్లా విద్యాధికారి యాదయ్య సూచించారు. బుధవారం మండలంలోని గొండుగూడ, మహేంద్రబస్తీ, చింతగూడ, గుర్వాపూర్, కస్తూరిబా గాంధీ వి ద్యాలయం, తెలంగాణ మోడల్స్కూల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా జరుగుతున్న పనులు తనిఖీ చేశారు. నాణ్యతతో పనులు పూర్తి చే యాలని ఆదేశించారు. జిల్లా సెక్టోరల్ అధికారి చౌదరి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగమల్లయ్య, కేజీబీవీ ప్రత్యేక అధికారి సరిత, ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీ రమేష్ పాల్గొన్నారు. పనుల పరిశీలన చెన్నూర్: చెన్నూర్లోని బేతాళవాడ, ఎన్పీవాడ, జేబీఎస్ ప్రాథమిక పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలల పనులను జిల్లా సెక్టోరల్ అధికారి సత్యనారాయణమూర్తి బుధవారం ప రిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రా రంభానికి ముందుగానే అభివృద్ధి పనులు పూ ర్తి చేయాలని తెలిపారు. ఎంఈవో రాధాకృష్ణమూర్తి, పాఠశాల హెచ్ఎం పాల్గొన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ గడువు పొడగింపు
మంచిర్యాలఅగ్రికల్చర్: లోక్సభ ఎన్నికల పో స్టల్ బ్యాలెట్ గడువు ఈ నెల 10 వరకు పొడగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.సంతోష్ తెలిపారు. చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగానికి అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మూడు ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కాగా, జిల్లాలో 6,932 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు ఉండగా ఇప్పటివరకు 5,881మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
కొను‘గోల్’.. జాప్యం
పట్టించుకునే వారెవరు..?రెండున్నర ఎకరాల్లో వరి కోసి పదిహేను రోజులు అవుతోంది. మొన్నటి వరకు వడ్లు గల గల ఎండినయి. నిన్న కురిసిన వర్షంతో వడ్లను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. రోజు ఎండకు ఆరబెడుతూ కుప్పజేసుకుంటున్నాం. మాయిశ్చర్ తక్కువగానే ఉండే. వానకు తడిసినయి. మా గోడు పట్టించుకునే వారు లేరు. – సిపెల్లి రామయ్య, గ్రామం: లింగాల, మం: కన్నెపల్లి కవర్లు అద్దెకు తెచ్చి..కవర్లు అద్దెకు తీసుకొచ్చి ధాన్యం కుప్పల మీద కప్పుకోవాల్సి వచ్చింది. కవర్లు అన్ని జమ చేసి వర్షంలో వడ్లు తడవకుండ కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుడు అయ్యింది. 15 రోజుల సంది వడ్ల కుప్పల కాడనే ఉండుడు అయితంది. వెంటనే కొనుగోలు చేయాలి. – కడ మల్లేష్, గ్రామం: పెద్దంపేట్, మం: హాజీపూర్ మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అకాల వర్షంతో వేల క్వింటాళ్ల ధాన్యం తడిసి, వరద నీటిలో కొట్టుకుపోయి నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో రెండ్రోజులూ జిల్లాకు వర్ష సూచన ఉండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో నిర్వాహకులు, అధికారులు, మిల్లర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎమ్మెస్, మెప్మా ఏజెన్సీల ఆధ్వర్యంలో 288 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 40రోజులు గడుస్తోంది. 171 కేంద్రాల్లో ధాన్యం సేకరిస్తుండగా ఒకటి మూత పడింది. 1.76లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 7,448 మంది రైతుల నుంచి 53,166.880 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. లక్ష్యంలో 50శాతం కూడా పూర్తి కాలేదు. కేంద్రాల్లో నిల్వలు పేరుకుపోగా, 20వేల నుంచి 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తూకం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మరికొందరు వరికోతలకు చూస్తున్నారు. ధాన్యం సేకరణకు అనుగుణంగా మిల్లులకు రవాణాకు లారీలు సమకూర్చడం, హమాలీలను అందుబాటులో ఉంచకపోవడంతో నిల్వలు పేరుకుపోతున్నాయి. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందజేయకపోవడంతో అద్దెకు తీసుకొచ్చి కప్పుతున్నామని రైతులు వాపోయారు. ప్లాస్టిక్ కవర్లు, ఫ్లెక్సీలతో కాపాడుకోవాల్సి వస్తుందని అంటున్నారు. లారీ వచ్చేది కష్టం.. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్మిల్లులకు వెళ్లిన లారీ తిరిగి రావడం కష్టంగా మారింది. బాయిలర్ రైస్మిల్లులు జిల్లాలో 19 ఉండగా పక్క జిల్లా పెద్దపల్లిలోని మిల్లులకు తరలిస్తున్నారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలను రెండు సెక్టార్లుగా ఏర్పాటు చేసి రవాణాను కాంట్రాక్టర్కు అప్పగించారు. రోజుకు వంద లారీలకుపైగా ధాన్యం తరలించాల్సి ఉంది. రైస్మిల్లుల వద్ద లారీలు బారులు తీరుతున్నాయి. ఇప్పటికీ జిల్లాలోని కొందరు మిల్లర్లు ధాన్యం దించుకోవడానికి నిరాకరిస్తున్నారు. దీంతో పెద్దపల్లి జిల్లాకు తరలిస్తున్నారు. వెళ్లిన లారీలను అన్లోడింగ్ చేయడానికి సరిపడా హమాలీలు మిల్లుల్లో లేకపోవడం, తరుగు పేరిట ధాన్యం కోతకు ఒప్పుకుంటేనే అన్లోడ్ చేసుకుంటామని తేగేసి చెబుతున్నారు. దీంతో రోజుల తరబడి మిల్లుల వద్ద లారీలు నిలిచిపోయి తిరిగి రావడానికి నాలుగైదు రోజులు పడుతోంది. మరోవైపు అధికారులు ఎన్నికల విధుల్లో, ప్రజాప్రతినిధులు ప్రచారంలో తీరిక లేకుండా ఉండడంతో రైతుల గోడు పట్టించుకునే వారు కరువయ్యారు. నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు అకాల వర్షంతో రైతులకు నష్టం 40 రోజులు గడిచినా సేకరణ స్వల్పమే.. ఎన్నికల బిజీలో అధికారులు, ప్రజాప్రతినిధులు -
ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి
● జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ ● రాజారం గ్రామస్తులకు ఓటు విలువపై అవగాహనకోటపల్లి: ప్రజాస్వామ్యం పరిరక్షణలో ఓటు అత్యంత కీలకమని, పాలన సాకారం కావాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. సమస్యలు పరిష్కరించాలని మండలంలోని కొత్తపల్లి రాజారం గ్రామస్తులు పార్లమెంటు ఎన్నికల బహిష్కరణకు తీర్మానించిన విషయం తెలిసిందే. బుధవారం అదనపు కలెక్టర్ మోతీలాల్, ఏసీపీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మహేంద్రనాథ్, ఎంపీడీవో భూమన్న, సీఐ సుధాకర్ గ్రామస్తులతో సమావేశం అయ్యారు. ఓటు విలువపై గ్రామస్తులకు వివరించారు. గ్రామాభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేయగా.. గ్రామానికి ఇప్పటికే రోడ్లు మంజూరు అయ్యాయని, అటవీ అనుమతులు లేక నిలిచిపోయాయని తెలిపారు. త్వరలోనే అనుమతులు వచ్చేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. గ్రామస్తులు అంతా ఒక నిర్ణయం తీసుకుని పోల్ చిట్టీలు తీసుకుంటామని, అంతవరకు ఓటుకు దూరంగానే ఉంటామని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ మండలంలోని పార్పల్లిలో కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ బుధవారం తనిఖీ చేశారు. తూకం వేసిన ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన హక్కు శ్రీరాంపూర్: దేశపౌరులకు భారత రాజ్యాంగం క ల్పించిన ఓటు హక్కు వజ్రాయుధమని జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.మోతీలాల్ అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీరాంపూర్లోని ఆ ర్కే 5గనిలో కార్మికులతో మాట్లాడారు. ఈనెల 13న జరిగే పోలింగ్లో అందరూ పాల్గొనాలని అ న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎస్.కిషన్, గని మేనేజర్ అబ్ధుల్ఖాధీర్, సేఫ్టీ అధికారి శివయ్య, సంక్షేమ అధికారి రణదీప్, ఫిట్ సెక్రెటరీ నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ మంగళం
● పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్మందమర్రిరూరల్: కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిందని, కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలకు మంగళం పాడిందని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. బుధవారం మందమర్రి మార్కెట్ సెంటర్లో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. రైతుల పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి తడిసిపోతోందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సింగరేణిని అదానీ చేతికి అప్పగించడం ఖాయమని ఆరోపించారు. ఈ నెల 13న జరిగే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేసి గెలిపిస్తే ప్రజల పక్షాన పార్లమెంట్లో గొంతు వినిపిస్తామని అన్నారు. అంతకుముందు సింగరేణి హైస్కూల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలి రామకృష్ణాపూర్: మోసపూరిత మాటలతో ముందుకు వస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు పార్లమెంటు ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి స్థానిక సూపర్బబజార్లో నిర్వహించిన సభలో ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్తో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తాగునీటి, కరెంటు కష్టాలు మొదలయ్యాయని అన్నారు. ఈ ప్రాంత బిడ్డగా సింగరేణి కార్మికుల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న కొప్పుల ఈశ్వర్ను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. -
పరిహారం ఇప్పించాలని రైతుల ధర్నా
వేమనపల్లి: వడగళ్ల వానకు పంట నష్టపోయామని, పరిహారం ఇచ్చి ఆదుకోవాలని మండలంలోని రైతులు బుధవారం స్థానిక తహసీల్దా ర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వేమనపల్లి, రాజారాం, మంగెనపల్లి, జాజులపేట, సుంపుటం గ్రామాల రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి పైరు నేలకొరిగిందని, వడగళ్ల తాకిడికి గింజ లేకుండా రాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల వరకు పొలాలు ఆరే పరిస్థితి లేదని, గ్రామాల వారీగా పంట నష్టం అంచనా వేయాలని అన్నారు. అ నంతరం తహసీల్దార్ కార్యాలయ రికార్డు అసిస్టెంట్ హుస్సేన్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కుర్రు వెంకటేశం, రైతులు గొండె రవి, అశోక్, శ్రీనివాస్ రెడ్డి, శేఖర్రెడ్డి, కొండ బాపు, తలండి సురేష్, భీరయ్య, విలాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
● ఈసీ ఆధ్వర్యంలో వ్యయ పరిశీలకుల పర్యవేక్షణ ● ఎప్పటికప్పుడు అభ్యర్థుల ఖర్చులపై ఆరా మంచిర్యాలరూరల్(హాజీపూర్): లోక్సభ ఎన్నికల్లో ధనబాలానికి తావు లేకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన వెంటనే జిల్లా సరిహద్దులతోపాటు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి వెంట తీసుకెళ్తున్న నగదు సహా బంగారం, వెండి ఆభరణాలు, మద్యం, చీరలు, ఇతర కానుకలు, వస్తువులు ఏవైనా గుర్తించి సీజ్ చేస్తోంది. మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు 749 తనిఖీల్లో రూ.3,71,36,272 పైగా విలువైన 89,508 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. 328 మందిని అరెస్ట్ చేసి 25 బెల్ట్ దుకాణాలు మూసి వేయించారు. ఇక వాహన తనిఖీల్లో భాగంగా 80 వాహనాల్లో రూ.97,72,502 నగదు, రూ.36,808 విలువైన ఇతర వస్తువులు సీజ్ చేశారు. వ్యయ పరిశీలకులు.. ఎన్నికల్లో ధనప్రవాహాన్ని కట్టడి చేసేందుకు ఐఏ ఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐడీఏఎస్ స్థాయి అధి కారులను ఈసీ వ్యయ పరిశీలకులుగా నియమించింది. లోక్సభ పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అభ్యర్థుల ప్రచార వ్యయాలను పరిశీలిస్తున్నారు. పెద్దపల్లి లోకసభ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీసెస్ అధికారి(ఐడీఏఎస్) సమీర్ నైరన్తర్య జిల్లా రిటర్నింగ్, ఎన్నికల అధికారులతో సమావేశమై అభ్యర్థుల ఖర్చులపై ఆరా తీశారు. సీ–విజిల్కు ఫిర్యాదులు.. సీ–విజిల్ యాప్ ద్వారా ఈ నెల 5వరకు 78 ఫిర్యాదులు అందాయి. మెజారిటీ ఫిర్యాదులు ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు, ఫ్లెక్సీలు, పార్టీ జెండాలకు సంబంధించినవే ఉన్నాయి. ఫిర్యాదు అందిన గంటన్నరలోగా సంబంధిత బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకుంటున్నారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బుల్లితెర నటి పర్సనల్ వీడియో లీక్
బేర్ పంజా..భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం
సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం
గుండెపోటుతో కన్నుమూసిన బీజేపీ కీలక నేత
జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్
తప్పక చదవండి
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement