పేదల జీవితాలకు భరోసా | Sakshi
Sakshi News home page

పేదల జీవితాలకు భరోసా

Published Mon, May 6 2024 9:00 AM

పేదల

ఎటపాక: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీతోనే పేదలకు భరోసా సాధ్యమని.. మానవత్వంలేని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలను ఓటుతోనే తరిమికొట్టాలని ఎమ్మెల్సీ అనంత బాబు పిలుపునిచ్చారు.ఆదివారం మండలంలోని గోళ్లగట్ట, మంగువాయి, వెంకటరెడ్డిపేట, చోడవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాలు అందించిన జగనన్న ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేదల సంక్షేమానికి ప్రకటించిన ప్రతీ హామీ అమలు చేస్తారని అన్నారు. అమలు సాధ్యం కాని హామీలతో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని వారికి ఓటుతోనే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి అసెంబ్లీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి, అరకు ఎంపీ అభ్యర్థి తనూజారాణిని గెలిపించాలని కోరారు. విస్సాపురం, గుండాల ,పురుషోత్తపట్నం, గోళ్లగట్ట తదితర గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన వంద కుటుంబాలకు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. జెడ్పీటీసీ ఉబ్బా సుస్మిత,ఎంపీపీ కాక కామేశ్వరి, ఎంపీటీసీలు వెంకటరామిరెడ్డి, వెంకటరమణ, సర్పంచ్‌లు ఆదినారాయణ, గుండి సీతాలక్ష్మి, అలివేలు,మణి, ఉపసర్పంచ్‌ శశికుమార్‌, సచివాలయాల మండల కన్వీనర్‌ గోసు ప్రశాంత్‌, పార్టీ మండల కన్వీనర్‌ తానికొండ వాసు,ఉపాధ్యక్షుడు ఆకుల వెంకటరామారావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మంత్రిప్రగడ నర్శింహరావు,జిల్లా కార్యదర్శి దామెర్ల రేవతి, కొవ్వూరి రాంబాబు,రంబాల నాగేశ్వరరావు,కృష్ణబాబు,శంకర్‌,సత్యనారాయణ,ఎలమోలు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ అనంతబాబు

పేదల జీవితాలకు భరోసా
1/1

పేదల జీవితాలకు భరోసా

Advertisement
 
Advertisement