● తరచూ ట్రాఫిక్ అంతరాయం
బుచ్చెయ్యపేట: మండలంలో బుదిరెడ్లపాలెం వద్ద ఆర్అండ్బీ రోడ్డుపై బురదలో లారీలు, ట్రాలీలు కూరుకుపోతున్నాయి. ట్రాఫిక్ జామ్లో ఇతర వాహనాలు చిక్కుకుంటున్నాయి. భీమునిపట్నం, నర్సీపట్నం రహదారిలో శుక్రవారం లారీలు, వ్యాన్లు, ట్రాలీలు బురదలో కూరుకుపోయాయి. ఇక్కడ ఆర్అండ్బీ రోడ్డు పొలాల్లో మట్టిరోడ్డు కంటే దారుణంగా తయారైంది. దాంతో బురదలో కూరుకుపోయిన వాహనాలను జేసీబీలతో బయటకు లాగుతున్నారు. రోజూ ఈ పరిస్థితి నెలకొందని, పాలకులు పట్టించుకోకపోవడంపై వాహనచోదకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment