పిడుగుపడి పాడి రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

పిడుగుపడి పాడి రైతు మృతి

Published Sat, Sep 7 2024 3:12 AM | Last Updated on Sat, Sep 7 2024 3:12 AM

పిడుగుపడి పాడి రైతు మృతి

అనకాపల్లి: తుఫాన్‌ కారణంగా పిడుగుపడి పాడి రైతు రాకోటి అర్జున (64) అక్కడికక్కడే మృతి చెందాడు. రెవెన్యూ, రూరల్‌ పోలీసుల కథనం మేరకు.. మండలంలో కోడూరు రెవెన్యూ పరిధి భూపతిపాలేనికి చెందిన పాడి రైతు అర్జున శుక్రవారం మధ్యాహ్నం గ్రామంలోని నల్లమారమ్మగుడి సమీపంలో పశువులు కాస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులు వచ్చి పిడుగు పడి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్‌ఐ తేజేశ్వరరావు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు తహసీల్దార్‌ వై.శ్రీరామ్మూర్తి చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement