నేడు గుంటూరుకు వైఎస్‌ జగన్‌ | YS Jagan to Guntur today | Sakshi
Sakshi News home page

నేడు గుంటూరుకు వైఎస్‌ జగన్‌

Published Wed, Sep 11 2024 3:52 AM | Last Updated on Wed, Sep 11 2024 8:03 AM

YS Jagan to Guntur today

సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు గుంటూరులో పర్యటించనున్నారు. బుధ­వారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు సబ్‌­జైలుకు వైఎస్‌ జగన్‌ చేరుకుంటారు. అక్కడ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను  పరామర్శిస్తారు. 

అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఎస్‌వీఎన్‌ కాలనీలోని క్రోసూరు మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ ఈద సాంబిరెడ్డి నివాసానికి వెళ్తారు. ఇటీవల టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన సాంబిరెడ్డిని వైఎస్‌ జగన్‌ పరామర్శిస్తారు. మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి నేరుగా తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement